srikanth reddy
-
YSRCP కార్యకర్త శ్రీకాంత్ రెడ్డిపై రాళ్లు, రాడ్లతో దాడి
-
ఇంద్రుడు, చంద్రుడు అంటూ కట్టుకథలు
-
చంద్రబాబు శ్వేత పత్రాలపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
తిరుపతి ఎస్వీయూలో టీడీపీ నేతల వీరంగం
-
నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకు లేదు
-
ఏపీ ప్రభుత్వ విద్యార్థులు అమెరికా వెళ్లడం గొప్ప విషయం..!
-
చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్
-
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు. టీడీపీ యాప్లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్రెడ్డి వివరించారు. కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్ను శ్రీకాంత్ రెడ్డి కోరారు. 2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని 2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్ను కోరారు. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా?
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. -
శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి..
కామారెడ్డి: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై రాజారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన అల్లి శ్రీకాంత్రెడ్డి(35) కొన్నేళ్లుగా కామారెడ్డిలో కార్ డెకార్స్ నడుపుతూ హౌజింగ్ బోర్డు కాలనీలో భార్య, పిల్లలతో నివాసముంటున్నాడు. ఆయన ఇద్దరు మిత్రులతో కలిసి తన కారులో ఫరీదుపేటలో జరిగిన ఓ శుభ కార్యానికి హాజరై కామారెడ్డి వెళ్తున్నాడు. ఆరేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే టాటా మ్యాజిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్య రేఖ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
Maa Awara Zindagi Movie: ‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ
టైటిల్: మా ఆవారా జిందగీ నటీనటులు: బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు నిర్మాణసంస్థ: విభా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి దర్శకుడు:దేపా శ్రీకాంత్ రెడ్డి సంగీతం-ప్రతీక్ నాగ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి ఎడిటర్: సాయిబాబు తలారి విడుదల తేది: జూన్ 23, 2023 ప్రస్తుతం యూత్ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే? భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ (ఎల్బీ), జస్వంత్ (లంబు) నలుగురు కుర్రాళ్లు పనీపాట లేకుండా ఖాళీగా, అవారాగా తిరుగుతుంటారు. ఎప్పుడూ తాగడం, జల్సాలు చేయడమే వీరి పని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షియాజీ షిండే) ప్రతీ సారి వీరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. ఎస్సై కూతురు కిడ్నాప్కు గురవుతుంది. కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్లో ఆ నలుగురి ప్రమేయం ఉందా? చివరకు ఆ నలుగురు చేసిన పనులేంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే?.. శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్లు అల్లరి చిల్లరగా కనిపించే యువకుల పాత్రలో చక్కగా నటించారు. వీరు నలుగురు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హీరోయిజాలు చూపిస్తూ తెగ యాక్షన్ సీక్వెన్సులు చూపించే కారెక్టర్లు కాకపోవడంతో మరింత ఈజీగా నటించేశారు. ఆ నలుగురి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగానే ఉంది. అయితే ఆ పాత్రకు డబ్బింగ్ మాత్రం అంతగా సూట్ అయినట్టు కనిపించదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఎలా ఉందంటే? ఈ మధ్య కామెడీ అడల్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్ను టార్గెట్ చేస్తూ తీస్తోన్న ఈ సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలకు కొదవే లేకుండాపోతోంది. ఓటీటీలో అడల్ట్ జానర్లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆవారా జిందగీ అటువంటి జానర్లోకే వస్తుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది. తినడం,తిరగడం, తాగడం అనే సీన్లతోనే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి కాస్త కథనం మారుతుంది. చేజింగ్ సీన్లు, అడల్ట్ సీన్లు ఎక్కువగా వస్తుంటాయి. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగా కాకుండా రియాల్టీకి దగ్గరగా ఉండేలా చేశాడు. అక్కడే దర్శకుడి టేస్ట్ కనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ నాచురల్గా అనిపిస్తుంది. డైలాగ్స్ సహజంగానే వచ్చినట్టుగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బూతు డైలాగ్లకు బీప్ సౌండ్లు పడ్డాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం నిర్వీర్యం అయిపోయింది : శ్రీకాంత్ రెడ్డి
-
ఓటీటీలో ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..?
'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. శ్రీకాంత్ రెడ్డి ,సంచిత బాషు జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. (చదవండి: First Day First Show Trailer: ఫస్ట్ డే ఫస్ట్ షో ట్రైలర్ చూశారా?) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా'లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో ప్రధానంగా పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకు టికెట్స్ హీరో ఎలా సంపాదించాడనే అంశంపైనే కథను రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అంచనాలు పెంచినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. Relive the nostalgia of cinema and celebration 🎥 #FirstDayFirstShow will be streaming on @ahavideoIN from Sept 23rd.#FirstDayFirstShowOnAHA #FDFS @Im_Srikanth_R @SanchitaBashu24 @Wamceee @lnputtamchetty @anudeepfilm @radhanmusic @PoornodayaFilms @SrijaEnt @MitravindaFilms pic.twitter.com/dtbNM2A6FO — Srija Entertainments (@SrijaEnt) September 14, 2022 -
అలా సినిమా చాన్స్ వచ్చింది.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా
‘‘ముందు టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యాను. నా వీడియోలు చూసిన దర్శకుడు అనుదీప్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారు’’ అన్నారు సంచిత బషు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. దర్శకుడు అనుదీప్ కథతో ఏడిద శ్రీజ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. సంచిత మాట్లాడుతూ – ‘‘చిన్నతనం నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన లయ పాత్రలో నటించాను. దర్శకులు వంశీ, లక్ష్మి నన్ను బాగా ప్రోత్సహించారు. నిర్మాత శ్రీజగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు’’ అన్నారు. -
ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డా: అనుదీప్
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అనుదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు ఉంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపథ్యాన్ని తీసుకుని ‘ఫస్ట్డే ఫస్ట్ షో’ కథని చెబుతున్నాం. ► నా జీవితానికి ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే.`ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే ఉండదు. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. మహేశ్బాబు నటించిన 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. ► లెక్కలు వేసుకొని నేను సినిమాలు తీయను. సినిమా చేసినప్పుడు మాజా రావాలి.అంతే. `ఫస్ట్ డే ఫస్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది. ► ఈ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ ఉంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ ఉంటుంది. ► ‘జాతిరత్నాలు’లాగే `ఫస్ట్ డే ఫస్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ ఉంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ► ఈ చిత్రానికి మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. అయితే నాకు కొంత లైనప్ ఉంది. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది. వంశీ మరో దర్శకుడు ఉంటే బాగుండని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్ లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం ఇలా చాలా అంశాలలో నా ఇన్వాల్మెంట్ ఉంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా బాధ్యత ఉంటుంది. ► రెండు రోజుల్లో జరిగిపోయే కథ ఇది. చిన్న పాయింట్. దాన్ని రెండు గంటల కథ చేయడం సవాల్ తో కూడుకున్నదే. ఈ ఆలోచన ఎప్పటి నుండో ఉంది. చాలా కాలం పాటు చర్చలు జరిగి ఒక సంపూర్ణమైన సినిమా కథగా మలిచాం. కథ ఎప్పటినుండో ఉన్నా .. డైలాగ్స్ మాత్రం జాతిరత్నాలు తర్వాత రాశాను. ► కామెడీ విషయంలో ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుంచి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వైలెన్స్ తప్పా .. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా ఉన్న కథలు కూడా రాయాలని ఉంది. ► హ్యుమర్ విషయంలో వంశీ, నాకు సిమిలర్ ఆలోచనలు ఉంటాయి. సినిమా అంటే క్రేజీ ఉండాలని ఆలోచిస్తుంటాడు. లక్ష్మీ నారాయణ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు. మంచి రీడర్. చాలా పుస్తకాలు చదువుతాడు. కొన్ని సీరియస్ కథలు రాసుకున్నాడు. ఈ కథ విని నచ్చితే చేయమని అడిగాను. అతనికి నచ్చి చేయడం జరిగింది. ఇద్దరిలోనూ మంచి హ్యుమర్ ఉంది. ► నాగ్ అశ్విన్ `ఫస్ట్ డే ఫస్ట్ షో` చూశారు. ఆయనకి చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమా చూపించాలని భావిస్తున్నాం. ► శివకార్తికేయన్ తో చేస్తున్న ప్రిన్స్ సినిమా పాండిచ్చేరి నేపధ్యంలో సాగుతుంది. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళిలో రిలీజ్ ఉంటుంది. అది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా ఉంటుంది. ► జాతిరత్నాలు 2 తీసే ఆలోచన ఉంది. అయితే దానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం వెంకటేశ్ కోసం ఓ కథను రాశా. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా. ఆయన ఒప్పుకుంటే నా తర్వాతి చిత్రం వెంకటేశ్ గారితోనే ఉంటుంది. -
కరాటే కల్యాణితో పెట్టుకున్నాడు, బిగ్బాస్ ఛాన్స్ పట్టేశాడు!
బిగ్బాస్ నాన్స్టాప్ ముగింపుకు వచ్చేసింది. అఖిల్ సార్థక్, బిందు మాధవిలలో ఎవరు ఒకరు టైటిల్ ఎగరేసుకుపోనున్నారు. టాప్ 5కి చేరుకునేవారిలో నుంచి కొందరిని బిగ్బాస్ ఆరో సీజన్కు సైతం తీసుకోనున్నారు. ఆ జాబితాలో జనాలను ఎంటర్టైన్ చేసే యాంకర్ శివ తప్పకుండా ఉండే అవకాశముంది. అలాగే ఆరో సీజన్ కోసం ఇప్పటినుంచే కంటెస్టెంట్ల ఎంపిక మొదలైంది. బిగ్బాస్ టీమ్ రోషన్, మంజూష అనే మరో ఇద్దరు యాంకర్లను సైతం సంప్రదించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొనే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరి ఇదెంతవరకు నిజం? ఒకవేళ పిలుపు వస్తే నిజంగానే బిగ్బాస్ హౌస్కి వెళ్తాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కాగా బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో గొడవతో కొద్దిరోజులుగా అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లి అతడిని చితకబాదింది. దీంతో అతడు కూడా కల్యాణిపై చేయిచేసుకున్నాడు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువురిపై కేసులు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కరాటే కల్యాణి ఎక్కడికి వెళ్లింది..? ఎప్పుడు వస్తుంది..? హీరోయిన్ సీమంతం ఫంక్షన్, ఫొటోలు వైరల్ -
కరాటే కల్యాణి మిస్సింగ్.. ఏమైపోయింది? ఎక్కడుంది?
కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. ఆమె ఫోన్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. దీంతో తన కూతురు ఏమైపోయిందో అని కరాటే కల్యాణి తల్లి విజయలక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన కూతుర్ని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాక్షి మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'కరాటే కల్యాణి ఫేమ్ చూసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెపై చేస్తున్న ఆరోపణలన్ని అవాస్తవం. పాప విషయం గురించి నాకేమీ తెలియదు. దత్తత తెచ్చుకుందని తెలుసు. కళ్యాణి మిస్సింగ్పై పోలీసులకు పిర్యాదు చేస్తాను తను ఎక్కడున్నా బయటికి రావాలని టీవీ ఛానెల్స్ ద్వారా కోరుతున్నాను' అని పేర్కొంది. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్నారులను విక్రయిస్తుందని ఫిర్యాదులు రావడంతో ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పాపతో కలెక్టరేట్కి రమ్మని చెప్పారు. అయితే సోదాల సమయంలో కరాటే కల్యాణి ఇంట్లో లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయింది. దీంతో ఆమె ఎక్కడ ఉందన్నదానిపై అధికారులు విచారిస్తున్నారు. -
అజ్ఞాతంలో కరాటే కల్యాణి
-
నటి కరాటే కల్యాణి ఇంట్లో సోదాలు..
Child Welfare Officials Raid In Actress Karate Kalyani Home: నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి శ్రీకాంత్రెడ్డి పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరి ఇరువురిపై కేసులు నమోదు అయ్యాయి. తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేస్తే ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని ఎస్ఆర్ నగర్ సీఐ సైదులుపై కల్యాణి ఫైర్ అయింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కల్యాణి సీఐపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కరాటే కల్యాణి ఇంట్లో ఒక చిన్నారిని గుర్తించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతోనే అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీకాంత్ రెడ్డితో గొడవ జరిగినప్పుడు ఆమెతోపాటు ఆ చిన్నారి ఉన్న విషయం తెలిసిందే. చదవండి: కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వీడియోలు చేయి డబ్బులిస్తా అన్నాడు, చెంప పగలకొట్టాను : కరాటే కల్యాణి
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు నెట్టింట హాట్టాపిక్గా మారింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేయిస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరువురు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించింది. వీడియోల పేరుతో శ్రీకాంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించింది. 'బిగ్బాస్లో ఛాన్స్ ఇప్పిస్తా, యూట్యూబ్ స్టార్స్ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్ కంటెంట్ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను. మహిళలతో ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఛానెల్ను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి' అని కరాటే కల్యాణి డిమాండ్ చేసింది. -
కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డి, నటి కరాటే కల్యాణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ కరాటే కల్యాణి అతడిపై దాడి చేశారు. యూసుఫ్గూడలోని ఓ బస్తీ జరిగిన గొడవల ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదరింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ శ్రీకాంత్ ఫేస్బుక్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా అతడు కరాటే కల్యాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా పేరు శ్రీకాంత్రెడ్డి. మీకు తెలుసు కదా నేను వీడియోలు చేస్తుంటాను. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల మధ్య కరాటే కల్యాణి గారు మా ఇంటికి వచ్చారు. ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వచ్చి రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావు అన్నారు. దీనికి నేను నువ్వు బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను’ అని అన్నాడు. చదవండి: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ తర్వాత ‘నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా తాను ఏ తప్పు చేయలేదని, కేవలం వినోదం కోసమే వీడియోలు చేస్తుంటున్నానని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అలాగే కరాటే కల్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. -
యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
సాక్షి, అమీర్పేట: యూ ట్యూబర్ శ్రీకాంత్రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడింది. యూసుఫ్గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. యూ ట్యూబర్ శ్రీకాంత్రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి కరాటే కల్యాణి మరో నలుగురితో కలిసి వచ్చింది. ఇంట్లో భోజనం చేస్తుండగా గట్టిగా అరుస్తూ కిందకు రావాలని గొడవ చేయడంతో శ్రీకాంత్రెడ్డి కిందకు వచ్చాడు. ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని బెదిరించింది. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామంది. ఆమె వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఫ్రాంక్ పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు మహిళలు చెప్పడంతో శ్రీకాంత్రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్తే శ్రీకాంత్రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నాలుగు నెలల చిన్నారితో పాటు తనపై దాడి చేశాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: (చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్టైం రికార్డు) -
సోము వీరా.. అది నోరా?: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు): కడప ప్రజల మనోభావాలను గాయపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు దారుణమని, ఇది ఆయన పార్టీ అజెండానా? లేక సొంత అజెండానా? అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయ ప్రాంగణంలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గడికోట మీడియాతో మాట్లాడుతూ.. ఆంగ్లేయుల హయాంలోనే కడపలో ఎయిర్పోర్టు ఉందనే విషయాన్ని ఇలాంటి కుహనా నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. మానవత్వం కడప సొంతం.. ఒక మనిషి ఆకలితో ఉంటే తట్టుకోలేని సంప్రదాయం.. తమ కడుపు మాడ్చుకొని ఇతరులకు అన్నం పట్టే సహృదయం కడప ప్రజల సొంతమని గడికోట పేర్కొన్నారు. సోము వీర్రాజు పద్ధతి మార్చుకోకుంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టే హక్కును సైతం కోల్పోతారని హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కడప గూండాలు, రౌడీలు, పులివెందుల పంచాయతీ అంటూ చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. సీమలో ఆయా పార్టీల జెండాలు మోసే వ్యక్తులు ఇలాంటి కుహనా వ్యాఖ్యల పట్ల సిగ్గు పడాలన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ చిచ్చు రగిల్చారని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు నినాదాన్ని తీసుకొచ్చారని వివరించారు. దిక్కుతోచకే బాబు విమర్శలు.. దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని తరచూ చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతున్నట్లుగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్థీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో దిక్కుతోచని చంద్రబాబు ఈర‡్ష్యతోనే విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. బీజేపీ క్షమాపణ చెప్పాలి: వామపక్షాలు రాయలసీమకు విమానాశ్రయాలు ఎందుకంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వాఖ్యలను వామపక్ష రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీర్రాజు చేసిన అవమానకర వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాష్ట్రంలో బీజేపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మత విద్వేషాలు, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ విమర్శించారు. విజయవాడ లబ్బీపేటలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని, విషప్రచారాల్లో నిమగ్నమై వికృత క్రీడ ఆడుతుందన్నారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
సీఎంను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి
తిరుపతి క్రైం: ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మానవ బాంబై చంపేస్తానని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైలం శ్రీకాంత్రెడ్డి, టౌన్ ఇన్చార్జి వళిగల మోహన్ ఈస్టు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో బిజినెస్మ్యాన్ అనే అకౌంట్లో కన్నాబాయి యూజర్ ఐడీ ఫేక్ అకౌంట్ నుంచి ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎంపీ గురుమూర్తి ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్టు వారు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివేకా హత్యకేసుపై ఎల్లో మీడియా అబద్దాలు ప్రచారం చేస్తోంది
-
అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరం
-
ఏ పీ కి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోంది
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
సాక్షి, వైఎస్ఆర్ కడప: ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే టీడీపీ నేతలు విమర్శించడం దారుణమని వాపోయారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే బాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని, తన అనుకూల మీడియాతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 3 బ్యారేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బ్యారేజీల ఏర్పాటుతో సముద్రంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, రాయలసీమ లిఫ్ట్ ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
తిరుపతిలో హత్యకు గురైన భువనేశ్వరి దీనగాథ
తిరుపతి క్రైం: ఆమె జీవితమంతా కష్టాలూ.. కన్నీళ్లే అలముకున్నాయి. అందరూ ఉన్నా కొన్నాళ్లు అనాథగా మారింది. సరైనా ఆలనా, పాలనా లేకపోయినా కష్టపడి చదువుకుంది. చిన్నతనంలోనే లైంగిక వేధింపులు ఎదురైనా తట్టుకుని నిలబడింది. ఉద్యోగమొచ్చాక ప్రేమ పేరుతో మోసపోయింది. ఇలా ఎన్ని కష్టాలు ఎదురైనా మునిపంటి కింద అదిమిపెట్టి జీవితాన్ని సాగిస్తుంటే.. చివరకు కట్టుకున్నవాడే కాలయముడై ఆమె జీవితాన్ని అంతమొందించాడు. తిరుపతిలో హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి దీనగాథ ఇది. భువనేశ్వరిని ఆమె భర్త మారంరెడ్డి శ్రీకాంత్రెడ్డి హత్యచేసి.. మృతదేహాన్ని సూట్కేస్లో ప్యాక్ చేసి తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఉదంతం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అడుగడుగునా ఆమె ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. భువనేశ్వరి నేపథ్యమిదీ.. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సరోజమ్మ, మునివెంకటప్ప దంపతుల ఐదో కుమార్తె భువనేశ్వరి. ఆ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా.. వారిలో ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలే. కూలి పనులు చేసే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. భువనేశ్వరి చిన్నప్పటి నుంచీ చురుగ్గా ఉంటూ చదువులో బాగా రాణించింది. ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే భువనేశ్వరి జీవితానికి సరిపడా సమస్య ఎదుర్కొంది. అప్పట్లో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. ఎక్కడకు తీసుకెళ్లాడో తెలియదు. దాదాపు రెండేళ్లపాటు ఆమెను లైంగికంగా వేధించి.. చివరకు గ్రామానికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆ దుర్మార్గాన్ని తల్లిదండ్రులు గానీ, గ్రామస్తులు గానీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మౌనంగానే భరించిన భువనేశ్వరి చదువుపైనే దృష్టిపెట్టి మంచి మార్కులతో టెన్త్ పాసైంది. ఆ తరువాత పై చదువులు కూడా చదివింది. ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భువనేశ్వరి జీవితంలో మరో సమస్య మొదలైంది. ఈ సారి ప్రేమ పేరుతో ఆమె జీవితంలో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన క్రూరత్వాన్ని బయటపెట్టి ఆమె నుంచి డబ్బు గుంజుకునే పని మొదలు పెట్టాడు. దీంతో భువనేశ్వరి అతన్ని దూరం పెట్టింది. ఉద్యమం ముసుగులోనూ వంచనే ప్రేమ పేరిట మోసపోయిన భువనేశ్వరి మగవాళ్లంతా ఇంతేనా? అని తనను తాను ప్రశ్నించుకుంది. తనను మోసం చేసిన వ్యక్తి గురించి లోకానికి చాటుతూ.. తనలాంటి వారికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని నడిపింది. ఆ సమయంలో ఎంతోమంది భువనేశ్వరికి అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. ఏ ఇబ్బంది ఉన్నా తాము సహకరిస్తామన్నారు. అదిగో.. అదే సమయంలో ఎంటరయ్యాడు మారంరెడ్డి శ్రీకాంత్రెడ్డి. ఆమె చేపట్టిన ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటూ భువనేశ్వరికి సన్నిహితుడిగా మారాడు. మోటివేషన్ క్లాసులు చెబుతూ ఐఏఎస్, ఐపీఎస్ల దగ్గరకు సూటు, బూటు వేసుకుని తిరుగుతూ కన్పించే శ్రీకాంత్రెడ్డి విసిరిన వలలో పడింది భువనేశ్వరి. అలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్రెడ్డి నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికాడు. శ్రీకాంత్లోని మరో క్రూరుడిని ఆమె గుర్తించలేకపోయింది. డబ్బు కోసమే.. నిజానికి శ్రీకాంత్రెడ్డికి కావాల్సింది తన విలాసాలకు అవసరమైన డబ్బు మాత్రమేనని భువనేశ్వరి గ్రహించలేకపోయింది. టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న భువనేశ్వరికి నెలకు రూ.90 వేల జీతం వస్తుండటంతో ఆమెను చేసుకుంటే తన జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చన్నది శ్రీకాంత్రెడ్డి ప్లాన్. మూడేళ్ల క్రితం అతడిని వివాహం చేసుకున్న భువనేశ్వరి హైదరాబాద్లోని మియాపూర్లో సొంత ఇల్లు కూడా కొనుగోలు చేసింది. ఆ తరువాత శ్రీకాంత్రెడ్డిలోని మోసగాడు బయటకొచ్చాడు. ఆమెకొచ్చే జీతాన్ని మింగేస్తూ.. ఎక్కడికక్కడ భారీగా అప్పులు చేయిస్తూ వచ్చాడు. భర్త బలవంతం చేయడంతో ఇటీవల తన బంధువుల వద్ద రూ.10 లక్షలు అప్పుతెచ్చి ఇచ్చింది. ఆమె పీఎఫ్ సొమ్ము, బంగారం సహా అన్నీ కాజేశాడు. చివరకు పద్ధతి మార్చుకోవాలని భువనేశ్వరి గట్టిగా చెప్పడంతో శ్రీకాంత్రెడ్డి ఆమెను గొంతు నులిమి చంపేసి.. ఆమె కరోనాతో మరణించిందనే నాటకమాడాడు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య.. నిందితుడి అరెస్ట్
సాక్షి, తిరుపతి: ఏడడుగులు.. మూడు ముళ్ల బంధం.. అగ్నిసాక్షిగా మనువాడి కడదాకా తోడుంటానన్న భర్తే.. ఆమె పాలిట కాల యముడవుతాడని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. మరోవైపు ఏ పాపం తెలియని ఆ చిన్నారి ఇకముందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగలింది. ఉద్యోగం లేకపోయిన భర్త అడగగానే డబ్బు ఇవ్వడమే ఆమెకు శాపమై తన ప్రాణం తీసింది. కట్టుకున్న వాడే కిరాతకంగా కడతేర్చాడు తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసులోని మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో ఆమె భర్త శ్రీకాంత్రెడ్డి నిందితుడిగా నిర్థారణ కావడంతో పోలీసులు ఆ కిరాతకుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వరి ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుండగా, శ్రీకాంత్రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి భర్తకు ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత నెల 22న భువనేశ్వరిని ఆమె భర్త శ్రీకాంత్ కిరాతకంగా చంపి సాక్ష్యాలను తారుమారు చేసే క్రమంలో సూట్కేసులో భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి రుయా ఆస్పత్రి వెనుక తగలబెట్టాడు. అలానే వారి బంధువులకు అనుమానం రాకుండా కరోనాతో భార్య చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు
తిరుపతి క్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక దహనం చేసిన ఓ భర్త దుర్మార్గమిది. బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తన భార్యకు కరోనా వచ్చిందని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. ఆ తర్వాత డెల్టా వేరియంట్తో మృతి చెందిందంటూ కట్టుకథలు చెప్పాడు. కరోనాతో మరణించడం వల్ల మృతదేహం కూడా ఇవ్వలేదని వాపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కూడా నిజమని నమ్మారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్కు చెందిన శ్రీకాంత్రెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి (27)ని రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వర్క్ఫ్రమ్ హోం చేస్తూ తిరుపతిలోని ఓ అపార్టుమెంట్లో భర్తతో కలిసి నివసిస్తోంది. శ్రీకాంత్రెడ్డి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటూ నిత్యం భార్యతో గొడవపడేవాడు. దీంతో ఆమె తెలిసినవారి దగ్గర రూ.10 లక్షలు తెచ్చి అతడికి ఇచ్చింది. ఈ అప్పు తీర్చాలని ఇటీవల అడుగుతుండటంతో ఆమెను హత్య చేశాడని తెలుస్తోంది. పక్కా ప్రణాళికతో.. ఈ నెల 23న తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక పోలీసులకు కాలిన మృతదేహం లభించింది. దీంతో సెల్ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలిని భువనేశ్వరిగా గుర్తించారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా రుయా ఆస్పత్రికి వచ్చిన ఓ డ్రైవర్ను అలిపిరి పోలీసులు గుర్తించి విచారించారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు శ్రీకాంత్రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. వెబ్సైట్లో శ్రీకాంత్రెడ్డి కారును బుక్ చేసుకున్నాడని డ్రైవర్ తెలిపాడు. ఓ పెద్ద సూట్కేసును తెచ్చి తన భార్య రుయా ఆస్పత్రిలో పెద్ద డాక్టర్ అని, ప్రస్తుతం తనకు కరోనా సోకిందని తెలిపాడు. సూట్కేసులో వెంటిలేటర్ ఉందని డ్రైవర్ను నమ్మించాడు. అనంతరం ఆస్పత్రి వెనుక ముళ్ల పొదల వద్ద డ్రైవర్కు అనుమానం రాకుండా కారును ఆపమని చెప్పి సూట్ కేసును అక్కడ దించాడు. డ్రైవర్ ప్రశ్నించడంతో మేడమ్కు కరోనా వచ్చిందని.. ఇక్కడ పెట్టి వెళ్తే ఈ వెంటిలేటర్ను ఆమె తీసుకుంటుందని చెప్పాడు. దీంతో శ్రీకాంత్రెడ్డి ఇంట్లో భార్యని హత్య చేసి.. సూట్ కేసులో ప్యాక్ చేసి.. కారులో మృతదేహాన్ని తెచ్చి రుయా ఆస్పత్రి వెనుక తగులబెట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సూట్ కేసుని కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. డెల్టా వేరియంట్తో మరణించిందని.. బంధువుల వద్ద శ్రీకాంత్రెడ్డి ఆడిన డ్రామా కూడా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని.. రుయా ఆస్పత్రిలో చేర్చానని కుటుంబ సభ్యులను, బంధువులను శ్రీకాంత్ నమ్మించాడు. అనంతరం భువనేశ్వరి మరణించిందని.. కరోనాతో మృతి చెందడం వల్ల మృతదేహాన్ని ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు. అంతేకాకుండా బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు నటించాడు. కాగా, నిందితుడు శ్రీకాంత్రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు బృందాలు తెలంగాణలోని హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఆరా తీస్తున్నాయి. -
‘మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యం’
లక్కిరెడ్డిపల్లె : మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లె మండలంలో రెండవ విడత వై ఎస్ ఆర్ చేయూత ప్రారంభ కార్య క్రమాన్ని ఎం.ఎల్.సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి రెడ్డేయ్య ,తదితరులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలోనే ఏ రాష్ట్రము లోను కూడా అమలు చేయలేని విధంగా మన రాష్ట్రములో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ, సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి , ఏ పథకాన్నైనా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. మహిళలకు మహిళా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు,దిశ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందుతూ పైకి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లును కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాల పై బడిన వారికి ఇస్తానన్న పెంచన్ బదులు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18 వేల 5 వందలు నేరుగా మహిళల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. జగనన్నకు జేజేలు... ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ జీవితాలలో సీఎం జగనన్న వెలుగులు నింపుతున్నారని మండలంలోని పలు గ్రామాల అక్క చెల్లెమ్మలు తెలిపారు. మీ మేలు మరువలేము జగనన్న అంటూ జై జగన్, జై శ్రీకాంతన్న అంటూ పెద్ద ఎత్తున జేజేలు పలికారు. మెగా చెక్కు అందచేత... లక్కిరెడ్డిపల్లె మండలంలోని 1497 మంది లబ్ధిదారులకు రూ.265.875 లక్షల మెగా చెక్కును లబ్దిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపిపి రెడ్డెయ్య లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ్ రాఘవ రెడ్డి, ఏ.పి.ఎం శ్రీనివాసులు రెడ్డి, సింగిల్ విండో మాజి ప్రెసిడెంట్ యర్రంరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, మహిళలు,వెలుగు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్రెడ్డి -
కోవిడ్ పేషెంట్స్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
-
మాక్ అసెంబ్లీ అంటూ బాబు నీచరాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీకి రాకుండా పక్కరాష్ట్రంలో ఉండి.. మాక్ అసెంబ్లీ అంటూ నీచరాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, లోకేష్ నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి. అర్హులైన ప్రతి రైతుకూ వేరుశనగ విత్తనాలు అందాలి. పంటల బీమాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. నాడు-నేడు కింద రూ.వందల కోట్లతో ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నాం. ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఏమైనా చేశారా?. ఆయన నిర్లక్ష్యానికి నేడు ప్రాణాలు పోతున్నాయి. ఏపీ ప్రజలకు టీకాలు అవసరమని గ్లోబల్ టెండర్లు పిలవడం తప్పా?. వందల కోట్ల హెరిటేజ్ సంస్థ నుంచి ఒక్కరికైనా ఆక్సిజన్ దానం చేశారా?. పక్కరాష్ట్రాల్లో అన్ని పార్టీలు సమన్వయంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్లు వారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి’’ అని అన్నారు. చదవండి : కోవిడ్ కట్టడికి ప్రభుత్వం రాజీలేని పోరాటం: శ్రీకాంత్రెడ్డి -
కోవిడ్ కట్టడికి ప్రభుత్వం రాజీలేని పోరాటం: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కోవిడ్ కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. శనివారం శ్రీకాంత్రెడ్డి చేతులమీదుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఆక్సీ ఫ్లో మీటర్ వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎంపీ మిథున్రెడ్డి సహకారంతో రాయచోటి ఏరియా ఆస్పత్రికి మరో 10 ఆక్సిజనేటర్లు అందాయని అన్నారు. కోవిడ్ బాధితులకు సహాయం చేయడంలో మిథున్రెడ్డి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తోందని, అలాగే 100 పడకల ఆస్పత్రి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. చదవండి: కరోనా చికిత్సలో వాడే మందులు ఫ్రీగా ఇస్తాం: నాట్కో ఫార్మా -
బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం - శ్రీకాంత్ రెడ్డి
-
పక్క రాష్ట్రానికి పారిపోయింది బాబు, లోకేష్ కాదా ?
-
ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రతిపక్షం ఇష్టానుసారంగా ఏదిపడితే అది మాట్లాడుతోందని, సేవ చేసే చిత్తశుద్ధి ఉంటే బాధ్యతగా ముందుకు రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్ను ఆయన పరిశీలించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి మనోధైర్యం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా.. ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తోందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. -
ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు అద్భుతమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన ప్రతిమాటను సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు గ్రాఫిక్స్తోనే అంతా అయిపోయినట్లుగా చూపించారని విమర్శించారు. ఆయన హయంలో 108 వాహనాలు మూలన పడ్డాయని దుయ్యబట్టారు. (సీఎం జగన్ కృషి.. సుదీర్ఘ స్వప్నం సాకారం) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108, 104 వాహనాలను తీసుకురావాలనే గొప్ప ఆలోచన సీఎం జగన్దేనని చెప్పారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ‘ఏపీ చరిత్రలో నేడు కొత్త శకానికి నాంది పలికిన రోజు. ఏపీ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మా లక్ష్యం. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మాది చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నాం’ అని ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రశంసించారు. (1.15 లక్షల మందికి కొత్తగా పెన్షన్) ‘పేద ప్రాణాలను కాపాడేందుకు దివంగతనేత వైఎస్సార్ నాడు 108 అంబులెన్స్లను ప్రారంభించారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ నేడు వాటిని అపర సంజీవినిలుగా రూపుదిద్దారు. పేదల ప్రాణాలకు భరోసా కల్పించేలా ఆరోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని ఎమ్మెల్యే జోగిరమేష్ కొనియాడారు. -
రోజంతా అందుబాటులో వైద్యులు
-
చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలి?
సాక్షి, తాడేపల్లి: కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న ఇంద్రభవన్లో విశ్రాంతి తీసుకొని 65 రోజుల తరువాత రాష్ట్రంలో అడుగు పెట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని విమర్శించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ‘రెండు నెలలు హైదరాబాద్లో ఉండి జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లాడు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలను దేశం మొత్తం ప్రశంసించింది. రెండు నెలల తరువాత ఇప్పుడు చంద్రబాబు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. కుల, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు? మహానాడు పెద్దడ్రామా, ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తోంది. విజయవాడలోని కరకట్టకు రోడ్ మార్గాన వచ్చిన చంద్రబాబు వైజాగ్ ఎందుకు రాలేదు. కళా వెంకట్రావు లేఖలు రాయడం కాదు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదు. చంద్రబాబు మొదట పెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇవ్వాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు రద్దు చేశారు. ఇంటికి వెళ్లక ముందే జగన్మోహన్ మొదటి సంతకాన్ని అమలు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు’ అని అన్నారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) ఇంకా ఆయన మాట్లాడుతూ....‘పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు భౌతిక దూరం పాటించలేదు. టీడీపీ నేతలు మాస్క్లు కూడా ధరించలేదు. చంద్రబాబు ఏపీకి రాగానే పూలు జల్లించుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు మీద ఎన్నికేసులు పెట్టాలి. తాగి తిడితే ఎల్లో మీడియా డిబెట్లు పెడుతుంది. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ పాలనపైనా, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్దం’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. (‘సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు’) -
‘భౌతిక దూరం అంటే బాబు 600 కి.మీ. వెళ్లారు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలన్నదే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి ఆలోచన అని ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనాపై చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నారని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరనా కట్టడికి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని కరోనా పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ పనితీరును ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తోంటే చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఇంట్లో టైంపాస్ కాక లేఖలు రాస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరిస్తోంటే చంద్రబాబు బాధపడుతున్నారని, పచ్చమీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోన్నారని ఆరోపించారు. (ఈ మూడు ప్రతి నగరవాసికి ఓ అలవాటుగా) ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారన్నారు. భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిని తీసుకువచ్చిందని ప్రశంసించారు. సొంత బంధువులా సీఎం జగన్ బాధిత కుటుంబాలను ఓదార్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే వందకోట్లు పబ్లిసిటి కోసమే ఖర్చు చేసేవారని శ్రీనివాస్ విమర్శించారు. (ఆన్లైన్లో బుకింగ్కు సిద్ధం) -
‘ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది’
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ‘‘మనబడి నాడు - నేడు’’ కార్యక్రమం ద్వారా మూడు విడతల్లో.. ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతగా 126 పాఠశాలలకు 30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల మరమ్మతులకోసం ఒక్కోక్క జిల్లాకు 60 కోట్లు, ‘‘మనబడి నాడు-నేడు’’ కింద 2 నుంచి 3 వందల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కో జిల్లాకు సంవత్సరానికి 6 నుంచి 7వందల కోట్లను ప్రభుత్వ పాఠశాలల ఆభివృద్దికి ఉపయోగించనున్నామని తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక్కోక్క నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల మంది తల్లుల ఖాతాలోకి రూ.15,000 చొప్పున నగదు జమ చేశామని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ. 2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని తెలిపారు. నాణ్యత కలిగిన భోజనం అందించేందుకు సీఎం జగన్ గోరుముద్దను ఆవిష్కరించారన్నారు. లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ మనబడి నాడు-నేడు కార్యక్రమం పూర్తి చేయాలని, లేకుంటే నాబార్డు నిధులు వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నారు. జగనన్న కానుక పేరుతో విద్యార్థులకు స్కూల్ డ్రస్, బ్యాగులు అందజేయనున్నామని తెలిపారు. -
లోకేష్ హడావుడిగా ఆస్తులెందుకు ప్రకటించారు?
-
‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’
తాడేపల్లి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆందోళనలు ప్రజలు గురించి కాదనీ, తన బినామీల కోసమేనని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న హడావుడి అంతా అవినీతి ఆస్తులను కాపాడుకోవడం కోసమేనని ఆరోపించారు. గత ఐదేళ్లలో రైతులకు ఎటువంటి మేలు చేయని చంద్రబాబు.. ముందు రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలే గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి చెందారని, భ్రమరావతి ముసుగులో రైతులతో కృత్రిమ ఉద్యమం సృష్టించారన్నారు. బినామీల కోసం ఆరాట పడుతున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరహాలోనే చంద్రబాబు వ్యవహరించడమే ఆయన మోసాలకు నిదర్శనమన్నారు. గతంలో ఈ-ఇటుక పేరుతో చంద్రబాబు చేసిన వసూళ్లకు లెక్కలు లేవని, ఇప్పుడ మరో జోలె పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు నివాసము ఉన్న కరకట్ట వద్దకు వెళ్లి రైతులు నిలదీయాలి. గత ఐదేళ్లలో చంద్రబాబు రైతుల్ని మోసం చేశారు. 4వేల 70 ఎకరాలు ఇన్ సైడర్ కు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది.ఇన్ సైడర్ అక్రమాలు వెలుగుచూశాయి కాబట్టే చంద్రబాబు ఆందోళన చేపట్టారు. ప్రాంతాలు వారీగా వివాదాలు సృష్టించి అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చేత రాజీనామా చేయించి ముందుకు రావాలి. పక్క రాష్ట్రాలు మధ్య సత్సంబంధాలు ఉండాలని చూస్తుంటే మీరు వక్ర భాష్యం చేస్తున్నారు.తెలంగాణా రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అభివృద్ధి పథంలో కనిపిస్తుంటే.. గత ఐదేళ్లలో ఏపీ లో ఏమి చేశారు. రాయలసీమ వాసులు చేసిన త్యాగాలు మీకు గుర్తుకు రావడం లేదు. శ్రీశైలం 82 వేల ఎకరాలు రైతులు ఆనాడు త్యాగం చేశారు. ఈ ప్రాంతం సస్య శ్యామలం చేసిన ఘనత సీమ వాసులది. ప్రాంతాలు మధ్య విభేదాలు సృష్టించడం చంద్రబాబు నైజం. ఒక్కో ప్రాంతంలో ఒకోతరహలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. సమగ్రమైన అభివృద్ధి జరగాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు.. ఏడు నెలలు పాలనలో ఏ ఒక్క అవినీతి జరగలేదు.పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా పాలనలో పూర్తి చేస్తాం. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
అడగకముందే ఇస్తున్నందుకు గర్వపడుతున్నాం
సాక్షి, వైఎస్సార్ కడప: అమరావతిలో భూములు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్రెడ్డి హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్లో కేవలం అమరావతికే లక్ష కోట్లకు పైగా కేటాయించడమంటే మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినవారమవుతామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్లు జిల్లాలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్ రావు కమిటీల నివేదికలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించారని విమర్శించారు. కనపడని రాజధాని కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ స్వార్థపరుడైతే కడపను రాజధానిగా చేసేవారని చెప్పుకొచ్చారు. కానీ 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సినిమా యాక్టర్లతో జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. మేము అడగకముందే మాకు హైకోర్టు ఇస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధి పట్ల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి కొనుగోలు చేసిన భూముల విలువలు కాపాడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడింది లేదని విమర్శించారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ నాయకులకు బయట తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, లోకేష్కు టైం అయిపోయింది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మార్షల్ అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూజ్లెస్ ఫెలోస్ అని దూషించడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయనతో పాటు విప్ కొరముట్ల శ్రీనివాసులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా చీఫ్ వీప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు, లోకేష్కు టైమ్ అయిపోయిందని, ప్రజలు తమను గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే టీడీపీ వాళ్లు వాకౌట్ చేయడం దారుణమన్నారు. అలాగే కొరముట్లు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు. -
‘అందుకే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చిన్న మెదడు చితికిపోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు, పవన్ నానా రచ్చ చేస్తున్నారు. మరి ఏన్టీఆర్ భవన్ స్కూళ్లలో, వెంకయ్య నాయుడు స్వర్ణభారతిలో, రామోజీరావు స్కూళ్లలో, చంద్రబాబు బినామీ నారాయణ పాఠశాలలో ఉన్నది ఇంగ్లీష్ మీడియం కాదా’ అని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలకు నష్టం వస్తుందన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని వద్దు అంటున్నారే తప్ప భాష మీద ఉన్న ప్రేమతో కాదని విమర్శించారు. అదే విధంగా మహిళలకు అండగా ఉండాలని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలనే ఆలోచనతోనే సీఎం జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేపట్టినట్లు తెలిపారు. నాలుగు దశల్లో రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్ధేశంతోనే సెక్రటరీ, వాలంటరీ ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనదని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రాష్ట్రం ఎలా ఉందో ప్రస్తుతం వైఎస్ జగన్ హయాంలో కూడా అలాగే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రైతులకు ఆర్థిక సహాయం అందించి వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేలా చేస్తూ సీఎం జగన్ రైతు బాంధవుడయ్యాడని కొనియాడారు. -
త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. జిల్లాల పర్యటనల్లో ఆయన తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అయిదేళ్లు మోసం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు రౌడీ షీటర్లను, మాఫియాను వెనకేసుకు వస్తున్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తప్పులు చేశారు కనుకే కేసులు పెడుతున్నారు. అయిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తనకు తాను కరకట్ట బాబా అనుకుంటున్నారేమో...?. ఇక చింతమనేని ప్రభాకర్పై 18 కేసులు ఉన్నాయి. ఆయనేమైనా దెందులూరు బాబానా?. చట్టం ముందు అందరూ సమానమే. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకు కనిపించడం లేదా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మతానికి ముడిపెట్టడం సరైనదా?. కేసులకు భయపడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజకీయ అవసరాల కోసం గతంలో సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది. త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు అవుతుంది. చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్, ఇక నారా లోకేష్ అప్డేట్ కాని లీడర్. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నిప్పు అయితే ఆయన తనపై ఉన్న స్టేలను వెనక్కి తీసుకోవాలి. స్టేలను వెనక్కి తీసుకుంటే చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు ఉండరు’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు రాజకీయ దళారి...
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఒక రాజకీయ దళారి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుంటే మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు. ఆయన తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బాబు హయాంలో టీడీపీ నేతలు ఇసుకను వేలకోట్లలో దోచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దివాళా తీయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వనరులు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి అంశంలో ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళుతున్నారు. 5 నెలల సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక కొరతను శాశ్వతంగా లేకుండా చేస్తాం. డైటింగ్ కార్యక్రమంలా లోకేష్ దీక్ష చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇస్తున్నాం. తప్పుడు మాటల వినొద్దు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ కుటుంబాల శ్రేయస్సు మా బాధ్యత.’ అని హామీ ఇచ్చారు. -
ఒకసారి భార్యా బిడ్డల గురించి ఆలోచించండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రభుత్వ చీఫ్ విస్ శ్రీకాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బుధవారం శంకర్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు మేలు కోరి అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, రైతులెవరూ నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒకసారి కుంటుంబం, భార్యాబిడ్డల గురించి ఆలోచించాలని సూచించారు. -
ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
-
టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు
-
అనైతిక సంబంధం, విస్తుగొలిపే విషయాలు
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు యువకుల అనైతిక బంధంతో ...ఓ నిండు జీవితం అర్థాంతరంగా ముగిసింది. మూడు రోజుల క్రితం ఎస్ఆర్ నగర్లోని ఓ హోటల్లో యువకుడి అనుమానస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే... ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ సమీపంలోని క్రిష్ ఇన్ హోటల్ లాడ్జీలో 4వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్రెడ్డి (29) హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయ్లో పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల తన స్వగ్రామానికి వచ్చాడు. గత నెలలో అతడికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని తన స్నేహితుడైన మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం, మూసల్పూర్ గ్రామానికి చెందిన డబ్బి నరేశ్కు తెలిపాడు. అయితే ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన శ్రీకాంత్రెడ్డి, నరేష్ మధ్య అనైతిక సంబంధానికి దారి తీసింది. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య స్వలింగ సంపర్కం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్రెడ్డికి పెళ్లి కుదరటాన్ని నరేశ్ జీర్ణించుకోలేక పోయాడు. నిశ్చితార్థం అనంతరం తిరిగి దుబయ్కి బయలుదేరిన శ్రీకాంత్రెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరులోని స్వగ్రామం నుంచి నగరానికి వచ్చి నరేశ్ను కలుసుకున్నాడు. ఇద్దరు లాడ్జి తీసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ఎందుకు అంగీకరించావని, తనను విడిచి వెళ్లి పోతావా అంటూ నరేశ్ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో నరేష్ ఆగ్రహంతో గురువారం మధ్యాహ్న సమయంలో కత్తిలో శ్రీకాంత్రెడ్డి గొంతు కోశాడు. అయితే శ్రీకాంత్ మృతి చెందటంతో భయంతో సాయంత్రం నరేశ్ కూడా గొంతు కోసుకోవడంతో రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్రెడ్డి మృతి చెందడం, నరేష్ అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరడం, ఇద్దరి గొంతులపై కత్తిపోట్లు ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన నరేశ్ శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన విషయమై పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారుల అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
చంద్రబాబు వ్యవస్థలను సర్వనాశనం చేశారు
-
అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించినా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో గత ఐదేళ్లు టీడీపీ పాలన దుర్మార్గంగా సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేసిందనీ, ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయకపోగా, వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీనే అధికారంలో ఉన్నట్లు వైసీపీ సభ్యులు భ్రమ పడుతున్నారనీ, దాని నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై శ్రీకాంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. -
ఆర్టీసీకి బిల్లులు చెల్లించకుండా నష్టపరిచారు
-
‘చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ఓటేశారు’
సాక్షి, కడప: ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో దుర్మంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని అభిప్రాయపడ్డారు. రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇటువంటి సమస్య రావడానికి టీడీపీయే కారణం. ప్రభుత్వ నిధులను టీడీపీ సొంత ప్రచారానికి ఉపయోగించుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అధికారంలో లేకపోయిన, ఆర్థిక సమస్యలున్నా.. వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, వారందరి ఋణం తీర్చుకుంటాం’’ అని అన్నారు. -
చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
-
‘ఓట్ల కోసం బీజేపీ మత చిచ్చు పెడుతోంది’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లౌకిక దేశంలో ఓట్ల కోసం బీజేపీ మత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ ఆర్డినెన్స్పై పార్లమెంట్, సుప్రీం కోర్టులు వ్యతిరేకించినా..బీజేపీ మొండిగా వెళ్తుందని విమర్శించారు. అభివృద్ధితో ఎన్నికలకు వెళ్లాలి కానీ.. మతాల మధ్య చిచ్చు పెట్టి కాదని హితవు పలికారు. లౌకిక ఆశయాలు కలిగిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. దేశ సమగ్రత విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్నారు. బీజేపీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోకుంటే నిలదీస్తామని హెచ్చరించారు. విభజన సమయంలో ఏపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
అధర్మానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
-
కుమార్తెను హతమార్చిన తండ్రి అరెస్టు
చిత్తూరు, ములకలచెరువు: కన్నకూతురుని హతమార్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. ములకలచెరువు మండలం బోరెడ్డిగారిపల్లెలో చెందిన శ్రీకాంత్రెడ్డి(44), పుణ్యవతి దంపతులకు లక్ష్మీప్రసన్న (14) ఒక్కగానొక్క కుమార్తె. బాలిక ములకలచెరువులోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శ్రీకాంత్రెడ్డి బోర్వెల్లో పనిచేస్తున్నాడు. భర్త తరచూ గొడవ పడుతుండడంతో పుణ్యవతి ఎనిమిదేళ్లుగా భర్తకు దూరంగా బెంగళూరులో ఉంటోంది. పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ప్రయోజనం లేదు. శ్రీకాంత్రెడ్డి గత ఏడాది బోర్వెల్లో పనిచేస్తూ నాలుగు నెలలు మెదక్ జిల్లా తుఫ్రాన్లో ఉన్నాడు. ఈ క్రమంలో కుమార్తెను కూడా అక్కడికే తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించాలని భావించాడు. ఈ నెల 2వ తేదీన కుమార్తెను తీసుకుని స్వగ్రామం నుంచి మెదక్ బయలుదేరాడు. 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తుఫ్రాన్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సు దిగేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళదామని కుమార్తెతో చెప్పాడు. చీకటిలో ఎలా వెళ్లేదని కుమార్తె నిలదీయడం, ఇంటికి వెళ్లిపోదామని గట్టిగా కోరడంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన తండ్రి గతంలో భార్య దూరమైందని, ఇప్పుడు కుమార్తె కూడా దూరమవుతుందేమోనని భావించాడు. దారి పక్కనే ఉన్న క్వారీలో బండరాయితో బాలిక తలమీద బాది చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 5వ తేదీ ఉదయం క్వారీలోకి రాళ్లు కొట్టడానికి వెళ్లిన కూలీలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను గమనించి తుఫ్రాన్ పోలీసులకు సమాచారం అందించారు. తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు అక్కడికి చేరుకుని బాలికను 108 ద్వారా సికింద్రాబాదు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. అరెస్టు చూపించిన తుఫ్రాన్ పోలీసులు కుమార్తె హత్యకు కారణమైన శ్రీకాంత్రెడ్డిని తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు సోమవారం అరెస్టు చూపించారు. పలు సెక్షన్లు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేసు ఛేదించిన ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది వెంకటేష్, కుమార్ను అక్కడి ఉన్నతాధికారులు అభినందించారు. హత్య బయటపడతాదనిపారిపోయిన నిందితుడు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 7వ తేదీన బోరెడ్డివారిపల్లెకు వచ్చాడు. కుటుంబ సభ్యులు కుమార్తె గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. అతను కుమార్తె హత్య విషయం బయటపడతుందని గ్రహించి పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీకాంత్రెడ్డి భార్య పుణ్యవతిని బెంగళూరు నుంచి పిలిపించి ములకలచెరువు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఈశ్వరయ్య బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ లొకేషన్ ద్వారా శ్రీకాంత్రెడ్డిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుమార్తెను తానే హత్య చేసినట్లు శ్రీకాంత్రెడ్డి అంగీకరించాడు. -
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు బాగోలేదు
-
యూటర్న్ తీసుకోవడం ఆయన అలవాటు
-
‘టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బంద్కు సహకరించాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరిట ప్రజల సోమ్ము వృథా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధర్మపోరాట దీక్షల కోసం దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తమ పార్టీ సమావేశాలకు వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ ఎప్పటికి మిత్రులేనన్న విషయం పార్లమెంట్ సాక్షిగా స్పష్టమయిందన్నారు. ఉపాధి, డ్వాక్రా, అంగన్వాడీ మహిళలను మభ్యపెట్టి దీక్షలకు తరలించి చంద్రబాబు డ్రామాలు ఆడుతారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీడీపీ విఫలమైనందుకు నిరసనగా రేపటి(మంగళవారం) బంద్ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్కు సహకరించాలన్నారు. టీడీపీ ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్నాథ్లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
ముఖ్యమంత్రులకు భజన చేయడం జేసీకి అలవాటే
-
‘జేసీవి భజన రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివి భజన రాజకీయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులకు భజన చేయడం జేసీకి అలవాటేనంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచేందుకే జేసీ మాట్లాడతారని చెప్పారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో వైఎస్సార్ దయ వల్లే జేసీ మంత్రి అయ్యాడని, ఆయన నియోజకవర్గం తాడిపత్రిలో అరాచకాలకు అంతేలేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పోటీ చేయలేని పరిస్థితిలో జేసీ ఉన్నారని అన్నారు. అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని చెప్పారు. పరిశ్రమల పేరుతో వేల ఎకరాలు లాక్కుంటున్నారని, సభల కోసం ప్రభుత్వ సొమ్మును కోట్ల కొద్దీ ఖర్చు చేస్తున్నారని అన్నారు. మహానాడులో టీడీపీ మ్యానిఫెస్టో గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. నాయకులను చంద్రబాబు ఏవిధంగా వాడుకుని వదిలేస్తారో.. నాగం జనార్ధన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహుల ఉదంతాలే ఉదాహరణలని చెప్పారు. ఇవన్నీ తెలియని టీడీపీ నాయకులు చంద్రబాబు ట్రాప్లో పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల మనసును గెల్చుకున్న వైఎస్ జగన్పై ఎన్ని కుట్రలు పన్నినా అవి పటాపంచలు అవుతాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. కాపులు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే దాడులకు దిగడం దారుణమని అన్నారు. -
‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం.. డైనమిక్ లీడర్ కావాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉందని, ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వం అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామం హోటల్లో కార్యకర్తలతో కలసి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, టిక్కెట్ల కోసం వైఎస్సార్ సీపీలోకి రాలేదని అన్నారు. పార్టీ ఆదేశాలు, అవసరాల మేరకు తన అనుభవంతో సేవ చేస్తానని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన జనరంజక పథకాలు రూపు మాపి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యం మితిమీరాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు చివరకు దేవాలయాలను కూడా వదలడం లేదని విమర్శించారు. టీటీడీలో స్వామి వారి నగలు, వజ్రాలు మాయమైన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కర్నూల్ జిల్లా డోన్లో దారుణం
-
వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శిగా కడపల
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి కడపల శ్రీకాంత్రెడ్డిని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కడపల శ్రీకాంత్రెడ్డి ఈ నెల 4న వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం, పెద్దకడపవాండ్లపల్లికి చెందిన శ్రీకాంత్రెడ్డి దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మేనల్లుడు. -
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..
సాక్షి, కడప : రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థపై టీడీపీ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ కంటే ముందు టీడీపీ వ్యవస్థ మార్చుకో అని హితవు పలికారు. అసెంబ్లీ స్పీకర్ పచ్చ కండువాలు కప్పుకొని సైకిల్ యాత్రలు చేస్తే తప్పు కాదా అని ప్రశ్నించారు. ఒక్క రోజు దీక్ష చేసి 30 కోట్లరూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. దీక్షలో డేరా బాబా స్థాయిలో ప్రతి ఒక్కరితో కాళ్లు మొక్కించుకొని చంద్రబాబు.. బాబాగా వెలిశాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ చెప్పిన మాటాలు ఏ రోజు అయిన విన్నావా అని ప్రశ్నించారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని ఆ పార్టీ మంత్రి భార్యకు టీటీడీ పదవి ఇచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ లేకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేసే వాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం బస్సులో పడుకున్నానని చెబుతున్న చంద్రబాబు ఆ బస్సు ఖరీదు 10 కోట్లు అని మాత్రం చెప్పడం లేదన్నారు. నిత్యం బీసీల జపం చేసే చంద్రబాబు స్వయంగా బీసీలను అవమానించేలా లేఖ రాయడం దౌర్భాగ్యకరమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
‘మెంటల్ ఎక్కిస్తున్న చంద్రం’
సాక్షి, అమరావతి : శాసనసభలో మెటల్ లేని అంశాలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెంటల్ ఎక్కిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటివరకూ ప్రజా సమస్యలు, రైతుల సమస్యలపై చర్చ జరగలేదని అన్నారు. మీడియా చంద్రబాబు ప్రసంగాలను ఎక్కువగా ప్రసారం చేయకపోవడం వల్ల ఆయన శాసనసభలో డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాలకు అసెంబ్లీని వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలను పొడిగించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీల తాలూకూ ఏ అంశం కూడా దొరక్కుండా చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఆఖరి బడ్జెట్లోనైనా అందరికీ న్యాయం జరగుతుందని భావిస్తే.. దాన్ని నీరుగార్చరన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మీహయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి
లక్కిరెడ్డిపల్లె: మీ తండ్రి హయాం నుంచి లక్కిరెడ్డిపల్లెకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డిపై వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు.గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అభివృద్ధి పేరుతో బురదజల్లే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయంలో లక్కిరెడ్డిపల్లె మండలానికి వేల పక్కాగృహాలు మంజూరు చేసిన విషయం మీరు మరిచారా అని ప్రశ్నించారు.నాలుగేళ్లలో మీరెన్ని పక్కాగృహాలు మంజూరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మండలంలో కస్తూర్బా,వెలుగు,ఆదర్శ పాఠశాలలు ఎవరి హయాంలో వచ్చాయో మీకు తెలియదా అన్నారు. ఎంపీ మిథున్రెడ్డి నిధులతో రూ.40 లక్షల మేర బోర్లు వేసి ప్రజలకు దాహార్తి తీర్చిన విషయాన్ని మీరు గర్తుంచుకోవాలన్నారు. తాను ఎనిమిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఆరు నెలలు మాత్రమే ఉన్నామన్నారు.ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు రావాల్సిన ఏసీడీపీ నిధులను కూడా ఇవ్వలేదని, అవి తీసుకునే అర్హతలు ముఖ్యమంత్రి మీకు కల్పించినా ఎంత వరకు అభివృద్ధి చేశారో తెలుపాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.ఏనాడైనా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చాడా అన్ని అడిగారు. పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా చూస్తోంది మీరు కాదా అని అన్నారు.అంతేకాక తమ ఎంపీ నిధుల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల పనులకు పంచాయితీ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకుంటోంది మీరు కాదా అని అన్నారు. అభివృద్ధి విషయంలో సీఎంతోనైనా పోరాడేండుకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే తేదీని ఖరారు చేయండంటూ సభ సాక్షిగా సవాల్ విసిరారు. సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన ఆర్ఆర్ జన్మభూమి గ్రామసభల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదంటూ సాక్షి మీడియా ఎత్తి చూపించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్రెడ్డి(ఆర్ఆర్) అక్కసు వెళ్లగక్కారు. జన్మభూమి గ్రామ సభల పేరుతో అధికారులు ప్రభుత్వ పథకాలు వివరించి చేతులు దులుపుకొని పోతున్న విషయం పాలకులకు తెలిసినా ఒక్క సాక్షి మాత్రం ప్రజల దృష్టికి తీసుకొస్తోందని, అలాంటి సాక్షిపై టీడీపీ నాయకుడు అక్కసు వెళ్లగక్కడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,ఎంపీపీ రెడ్డెయ్య,ఎంపీటీసి సభ్యులు సైయ్యద్ అమీర్, రాజేంద్రారెడ్డి, సర్పంచ్ రవి రాజు,తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్పెక్టర్ స్వాతి గౌడ్పై రహస్య విచారణ!
-
రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా?
-
టీడీపీ నేతలకు ఉలుకెందుకు
-
‘బాబు కమీషన్లు దక్కితే చాలనుకుంటున్నారు’