Suma Kanakala
-
కష్టాన్నే నమ్ముకోవాలి
హాస్యచతురత.. సమయస్ఫూర్తి అని గూగుల్ చేస్తే సుమ కనకాల అని వస్తుందేమో! అందుకే ఇన్నేళ్లయినా ఆమె యాంకరింగ్కి ఆదరణ తగ్గలేదు.. తన పేరుతోనే షోలకు ఫాలోయింగ్ని పెంచే స్థాయికి చేరుకుంది.. ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరికీ అభిమాన హోస్ట్గా మారిపోయింది..ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఉత్సవాన ఆమె గురించి ఆమె మాటల్లోనే..‘నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్లో. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. అందుకే చిన్నప్పటి నుంచీ తెలుగు తెలుసు. మెట్టుగూడ రైల్వేక్వార్టర్స్లో ఉండేవాళ్ళం. తార్నాకలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదివాను. రైల్వే డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. తెలుగులో ఫ్లుయెన్సీ ఉండాలని మా అమ్మగారు పట్టుబట్టడం వల్ల స్కూల్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్స్, డైరెక్టర్స్ ద్వారా కొంత తెలుగు నేర్చుకున్నాను. తెలుగుమీద నాకు పూర్తి పట్టు రావడంలో నా భర్త రాజీవ్ హెల్ప్ కూడా ఉంది. పుట్టింట్లో ఉన్నప్పుడు మాత్రమే మలయాళం .. మిగతా అంతా తెలుగే!దూరదర్శన్ మాత్రమే.. ఈ ఫీల్డ్లోకి చిత్రంగా వచ్చాను. నేను చేసిన ఓ డాన్స్ప్రోగ్రామ్ నచ్చి, దూరదర్శన్ సీరియల్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఫోన్ చేశారు.. ‘ప్రదీప్ గారి డైరెక్షన్లోని ఓ సీరియల్లో మమ్మల్ని కాస్ట్ చేయాలనుకుంటున్నాం.. మీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అంటూ! నాకు లేదు కానీ మా పేరెంట్స్ సరదాపడ్డారు. దాంతో ఓకే అన్నాను. అలా తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాను. అప్పుడు దూరదర్శన్ చానల్ మాత్రమే ఉండేది. అందులో ఎక్కువగా సింగిల్ ఎపిసోడ్సే ఉండేవి. అందుకనే నేను సింగిల్ ఎపిసోడ్స్లోనే ఎక్కువగా చేశాను. కొన్ని సినిమా బేస్డ్ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేశాను. శాటిలైట్ చానల్స్ స్టార్ట్ అవగానే పూర్తిగా యాంకరింగ్కి షిఫ్ట్ అయిపోయాను. ‘అంత్యాక్షరి’, ‘వన్స్ మోర్’ నుంచి ‘అవాక్కయ్యారా’,‘స్టార్ మహిళ’ లాంటి ఎన్నో షోస్ని హోస్ట్ చేశాను. ‘స్టార్ మహిళ’ నేను మరచిపోలేని షో. దాదాపు 12 సంవత్సరాలపాటు అయిదు వేల షోస్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాను. ఆ షోతో ఎంతో మంది మహిళలు తమ వ్యక్తిత్వాలతో నన్ను ఇన్స్పైర్ చేశారు. సొంత మనిషిలా ఆదరించారు. అవకాశముంటే మళ్లీ ఆ షో చేయాలనుకుంటున్నాను. తెలుగువారితో ఆ అనుబంధం రోజురోజుకీ బలపడుతోంది. జీన్స్, క్యాష్.. ఇప్పుడు ‘సుమ అడ్డా’ప్రోగ్రామ్స్కి దొరుకుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఇప్పుడు.. నా యూట్యూబ్ చానల్లో ‘చాట్ షో’ని స్టార్ట్ చేశాను. అలాగే ‘షెఫ్ మంత్ర’ అనే కొత్త షో కూడా మొదలైంది. ‘ప్రేమంటే’ అనే ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్నాను. దేవాలయాల మీద ‘అవర్ టెంపుల్స్’ అనే సిరీస్ చేయాలి అనుకుంటున్నాను. టాలెంట్కి ఆకాశమే హద్దు. ఒక రీల్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. వైరల్ అయిపోవచ్చు. ఫోన్లలో రీల్స్తో ఎంటర్టైన్ అవుతున్న కాలం ఇది. కాబట్టి అందులో కూడా నా ఎంటర్టైన్మెంట్ పోర్షన్ను అందిస్తున్నాను. లీజర్టైమ్ దొరికితే.. వెబ్ సిరీస్, మూవీస్ చూస్తాను.నాకు అత్యంత మెమరబుల్ మూమెంట్ నా పిల్లలే! ప్రొఫెషన్కి సంబంధించి అయితే .. నంది అవార్డ్ తీసుకోవడం! సామాజిక బాధ్యతనూ పంచుకునేందుకు మహిళల ఆరోగ్యం, సాధికారత, అలాగే ట్రాఫికింగ్ నుంచి బయటపడ్డ అమ్మాయిల స్వావలంబన, పిల్లల ఆరోగ్యం గురించి పనిచేసే ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే ఎన్జీవోను మూడేళ్ల కిందట స్టార్ట్ చేశాను. భవిష్యత్లో మరికొన్నిప్రాజెక్ట్స్ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాం. నేను నమ్మేదొక్కటే.. కష్టాన్ని నమ్ముకుంటే అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు అందరూ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తారు’ అంటూ ముగించారు సుమ కనకాల. బహుభాషలతో ప్రయోజనంయాంకరింగ్ పర్సనల్ క్యారెక్టర్కి ప్రతిబింబం లాంటిది. ఈ విషయంలో నాకున్న జోవియల్ నేచర్, సమయస్ఫూర్తి చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటు నాకు బహుభాషలు తెలిసుండటమూ ప్లస్ పాయింట్ అయింది. మాతృభాష మలయాళం అవడం, తమిళ్, హిందీ కూడా వచ్చి ఉండటం, ఇంగ్లిష్ లో ఫ్లుయెన్సీ వల్ల.. ఏవైనా అవార్డ్ ఫంక్షన్స్కి రెండు, మూడు భాషల వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయడం, వాళ్ల సినిమాల గురించి మాట్లాడటం చాలా ఈజీ అయిపోతోంది.ప్రొఫెషన్లో ఎదురయ్యే సవాళ్ళను సమయస్ఫూర్తితోనే నెగ్గుకొస్తాను. నావి ఎక్కువగా లైవ్ షోసే కాబట్టి ఎడిటింగ్కి స్కోప్ ఉండదు. నాకు నేనే ఎడిటర్గా వ్యవహరించుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. నేను నటించిన సీరియల్స్, సినిమాలు నాకు చాలా నేర్పించాయి. ఈప్రొఫెషన్కు చక్కటి బాట వేశాయి. మా అత్తగారివైపు అందరూ ఇదే ఫీల్డ్కు చెందిన వాళ్లవడం నాకు కలిసొచ్చింది. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ సాధ్యమైంది. మా ఇంట్లో నా షోస్కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్.. మా అత్తగారు, మా అమ్మగారు. – శిరీష చల్లపల్లి -
నాగచైతన్య తండేల్ ఈవెంట్.. డ్యాన్స్తో అదరగొట్టిన అల్లు అరవింద్
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్'(Thandel Movie). కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. తండేల్ జాతర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇది చదవండి: బన్నీ ఫ్యాన్స్కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!)డ్యాన్స్తో ఆకట్టుకున్న అల్లు అరవింద్..అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తన డ్యాన్స్తో అలరించారు. యాంకర్ సుమ కనకాలతో కలిసి స్టెప్పులు వేశారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాగే పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాస్ నిర్మించారు. The legendary producer does it again 💥💥💥The super energetic #AlluAravind Garu shakes his leg for #HailessoHailessa at the #ThandelJaathara ❤️🔥Watch the #ThandelJaathara live now 💥💥▶️ https://t.co/DPO8zzLUOv#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th.… pic.twitter.com/qo8OvOwNeB— Geetha Arts (@GeethaArts) February 2, 2025 -
‘ప్రేమంటే?’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
వయసు తగ్గుతోందా? యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి వేడుకలు.. సందడి చేసిన యాంకర్ సుమ కనకాల!
-
చీర.. చుడీదార్.. ఏదైనా సరే సుమ గ్రేస్ తగ్గేదే లే (ఫొటోలు)
-
కొండా సురేఖ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మహేశ్ బాబు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది. సినీనటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్తో కొండా సురేఖపై నటీనటులు భారీగానే విరుచుకుపడుతున్నారు.మహేశ్ బాబు'మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా మీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఒక మహిళా మంత్రిగా మీరు మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, మీ భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్లో ఉన్న అందరినీ అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి.' అని మహేశ్ కోరారు.రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం నన్ను భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సమాజానికి ఉదాహరణగా నిలువాలి. అందరిలోనూ సామాజిక విలువలను పెంచాలి. వాటిని తగ్గించకూడదు.- రవితేజమంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా, మహిళలు విజయం సాధించడం ఎంత సవాలుతో కూడుకున్నదో మీకు తెలిసే ఉంటుంది. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషంతో తప్పుడు ఆరోపణలు చేయడం ఆమోదయోగ్యం కాదు. మీ మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రాహుల్ గాంధీని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మీ పార్టీలోని నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలి. భవిష్యత్ తరాలకు మనం సరైన ఉదాహరణగా ఉండాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈ వ్యక్తిగత దూషణలు చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి తెస్తోంది. అని భావిస్తున్నాను. - మంచు మనోజ్రాజకీయాల కోసం సినీ, టీవీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయడం సరికాదు. చిత్ర పరిశ్రమలోని మేమందరమూ కూడా కుటుంబ సమేతంగా కలిసి నిరసన తెలియజేస్తున్నాం. వ్యూస్ కోసం తప్పుడు థంబ్నెయిల్లతో అవే వీడియోలను పోస్ట్ చేయవద్దని యూట్యూబర్స్ణు అభ్యర్థిస్తున్నాను. ఇతర వృత్తిలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. - సుమ కనకాలసినీ ప్రముఖులపై రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది వ్యక్తిగత జీవితాలను దోపిడీ చేయడం .దయచేసి మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ రకమైన నీచమైన వ్యాఖ్యలు, మాటల దూషణలకు వ్యతిరేకంగా మేము ఐక్యంగా ఉన్నాము. - కిరణ్ అబ్బవరంశ్రీమతి కొండా సురేఖ.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా అసహ్యంగా మాట్లాడటం మమ్మల్ని చాలా బాధపెట్టింది.ఇలాంటి నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం అంత మంచి నిర్ణయం కాదు. మీ రాజకీయం కోసం సినీ పరిశ్రమ సభ్యుల వ్యక్తిగత జీవితాలను లాగితేప సహించం. - రాజశేఖర్మీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కానివి. చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా ఇంత నీచంగా దిగజారి, మీడియా ముందు అవమానకరమైన వ్యాఖ్యలను ఎలా చేయగలరు..? సెలబ్రిటీల పేర్లను, వారి వ్యక్తిగత జీవితాన్ని లాగడం, వారిపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు. హద్దులు దాటి ఒక వ్యక్తి గుర్తింపును అగౌరవపరచడం సహించలేని చర్య. ఇలాంటి వాటిని సమాజం తిరస్కరిస్తుంది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ.. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని భావిస్తున్నాం. మహిళా మంత్రినే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం.' అని చెప్పుకొచ్చింది. - సంయుక్త మేనన్నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నా. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము, అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. మీరుండేది ప్రజల బాగోగులూ చూసుకునేందకని గుర్తుపెట్టుకోండి. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల, విద్య గురించి మాట్లాడండి. ఉద్యోగాలు కల్పించి వారి శ్రేయస్సు కోసం కష్టపడండి. ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయాలను దిగజార్చకండి.' అంటూ కొండా సురేఖపై కామెంట్ చేశారు. - విజయ్ దేవరకొండ సమంత గారిపై, అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్క చేసిన వ్యాఖ్యలు బాధాకరం. గతంలో చైల్డ్ అబ్యూస్ కేసులో ముందుగా స్పందించిన మీరే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధనిపిస్తుంది. మీ రాజకీయ విమర్శల కోసం ఏ మాత్రం సంబంధం లేని నటీనటుల పేర్లు తీసుకురావడం.. ఆపై వాళ్ల వ్యక్తిగత జీవితంపై దిగజారుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడడం సమాజానికి శ్రేయస్కరం కాదు. మావి చాలా సున్నితమైన మనసులు. వాటిని గాయం చేసి మీ రాజకీయం కోసం వాడుకోవడం తగదు. గతంలో మా కుటుంబాన్ని కూడా ఎన్నిసార్లు లక్ష్యంగా చేసుకుని దారుణమైన వ్యాఖ్యలు చేసినా మేము స్పందించలేదు. మేమెప్పుడూ ఏమీ అనమని సాఫ్ట్ టార్గెట్ చేయవద్దు. దయచేసి ఇకపై నటులను మాత్రమే కాదు.. ఎవరి వ్యక్తిగత విషయాలపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను. - సాయి ధరమ్తేజ్ -
యాంకర్ సుమ గ్లామర్ సీక్రెట్ ఏంటో? రోజురోజుకీ మరింత అందంగా! (ఫొటోలు)
-
నా కూతురు ఫంక్షన్కి వెళ్తే.. బాధపెట్టారు: ట్రోలర్స్పై రాజీవ్ కనకాల ఫైర్
సోషల్ మీడియాలో సినీ ప్రముఖులపై ట్రోలింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ విషయాలపై కూడా అసత్యాలను ప్రచారం చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అలా ట్రోల్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. సినీ సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న చానాళ్లపై స్ట్రైక్స్ వేసి, వాటిని తొలగిస్తున్నారు. అయితే ఇది బెదిరింపు కాదని.. రెక్వెస్ట్ అని అంటున్నాడు నటుడు రాజీవ్ కనకాల. ట్రోల్ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని..అది దాటి ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ య్యూటూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి, వాటి వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. (చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్లా.. యాంకర్పై చిన్మయి ఫైర్!)‘ఓసారి నేను ఓ యూట్యూబ్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మా నాన్న గురించి మాట్లాడుతూ..ఒకానొక దశలో ఆయన సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు అని చెప్పాను. వాళ్లు ఆ ఇంటర్వ్యూని చక్కగా ఎడిట్ చేసి పబ్లీష్ చేశారు. కానీ దాని అనుబంధ చానల్ మాత్రం..నా ఇంటర్వ్యూలు ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేసింది. ఆ ముక్కల్లో ఓవీడియోకి ‘సూసైడ్ చేసుకొని చనిపోయిన దేవదాస్ కనకాల’అని థంబ్ పెట్టారు. ఆ థంబ్ చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ రిపోర్టర్కి ఫోన్ చేస్తే.. అతను సారీ చెప్పి ఆ థంబ్ని మార్చేశారు. అంతేకాకుండా నా భార్య సమతో నేను విడాకులు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేశారు. యూట్యూబ్లో వచ్చిన థంబ్ నేయిల్స్ చూసి..నిజంగానే మేము విడాకులు తీసుకున్నామని అందరూ భావించారు. ఓ షోకి మళ్లీ సుమతో కలిసి వెళ్తే.. ‘వీరు విడాకులు తీసుకున్నారు కదా..మళ్లీ కలిసిపోయారా?’ అని కామెంట్స్ వచ్చాయి. అంతలా నమ్మేశారు జనాలు. ఒకనొక సమయంలో నా కూతురుని కూడా ట్రోల్ చేశారు. తను ఓ ఫంక్షన్కి వెళ్తే..లేనిపోని వార్తలు రాసి బాధపడేలా చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయకండి’అని రాజీవ్ విజ్ఞప్తి చేశాడు. -
అద్భుతం.. ఫ్లో స్టైల్తత్వ..
మాదాపూర్: స్థానిక హైటెక్స్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లో స్టైల్తత్వ ఎక్స్పోను బుల్లితెర నటి సుమ కనకాల, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్రా, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ ప్రియగజదార్లతో కలసి శనివారం ప్రారంభించారు. ప్రదర్శనలోని ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని, దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంతభాగం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 100 మంది మహిళా రైతులకు కూరగాయల సాగులో ఆధునిక శిక్షణ ఇవ్వడం, సిద్దిపేట క్లస్టర్లో నైపుణ్యం పెంచే మహిళా నేత కారి్మకులకు శిక్షణ వంటి సామాజిక ప్రాజెక్టులకు కేటాయించడంతో సుమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 15 రాష్ట్రాల నుంచి 200లకు పైగా ఎంఎస్ఎంఈలను ఒకే వేదికపైకి తీసుకురావడం సులభం కాదని తెలిపారు. మహిళల సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చేందుకు ఫిక్కీ ఎంతోకృషి చేస్తుందని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్ర అన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని, దీనిపై విధానాన్ని రాష్ట్రప్రభుత్వం నెలరోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు. రెండు రోజుల్లో 8వేల నుంచి 10వేల మంది సందర్శకులు సందర్శించనున్నట్టు ఫిక్కీ చైర్పర్సన్ ప్రియగజదార్ తెలిపారు. ఫ్లో సహాయక పారిశ్రామికవేత్తల పెవిలియన్, ఉద్యమం రిజి్రస్టేషన్ డెస్క్, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, సకల ది హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఇనిíÙయేటివ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. -
సుమ యోగా డే వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా మన దేశంలో జమ్ము కశ్మీర్లో 50 వేల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాగే దేశ వ్యాప్తంగా నిర్వహించిన యోగా డే వేడుకల్లో పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు యోగాసనాలతో సందడి చేశారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ప్రముఖ యాంకర్ సుమ కనకాల అందరికీ అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా మహిళలు ఎలాంటి ఆసనాలు వేయాలి? వాటి లాభాలను వివరిస్తూ ఇన్స్టాలో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రతీ పండుగకు ఏదో ఒక విశేషమైన వీడియోను పంచుకునే సుమ యోగా డేనుకూడా అలా వినియోగించుకుందన్న మాట. యోగాసనాలతో విన్యాసాలు చేస్తూ హిల్లేరియస్ రీల్పై నెటిజన్లు కూడా ఫన్నీగా కమెంట్స్ చేశారు. అయితే ‘‘ఎందుకొచ్చిన తిప్పలు అక్కా..హాయిగా మూడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, 6 ఇంటర్వ్యూలు చేసుకోక’’ అని ఒకరు, ‘ఈ వయసులో ఈ ప్రయోగాలు అవసరమా, లైక్స్ కోసం కాకపోతే’ అని మరొకరు, ‘‘ఇంత టైం ఎక్కడ దొరకుతుందక్కా నీకు’’ అంటూ మరొక అభిమాని వ్యాఖానించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ వయసులో ఉన్నవారైనా యోగాను సాధన చేయవచ్చు. కాకపోతే నిపుణుడైన గురు సమక్షంలో చేయడం ఉత్తమం. -
ఔట్ ఆఫ్ ది బాక్స్ సుమ అదరగొట్టేసింది (ఫొటోలు)
-
Suma Kanakala: అనార్కలీ డ్రెస్లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్న సుమ (ఫోటోలు)
-
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
-
Suma Kanakala: జీవితమే ఒక సుదీర్ఘ పాఠం అంటున్న సుమ... (ఫొటోలు)
-
ఎవర్ గ్రీన్ సుమ.. లంగా ఓణీలో మరింత క్యూట్ (ఫొటోలు)
-
Anchor Suma-Lavanya Tripathi: అందమైన చీరలో ‘సుమ’ నోహర, ‘లావణ్యా’లు (ఫోటోలు)
-
ఏ క్వశ్చన్ మిమల్ని అడిగితే మీకు చీరెత్తుకొస్తుంది
-
న్యూ ఇయర్ వేడుకల్లో యాంకర్ సుమ ఫ్యామిలీ!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ 25వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. తాజాగా ఈ జంట కేరళలో సందడి చేసింది. మలయాళ నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. మలయాళ, తమిళ న్యూ ఇయర్గా భావించే విషును కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. యాంకర్ సుమ కేరళలోని పాలక్కాడ్లో జన్మించారు. View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) View this post on Instagram A post shared by suma kanakala (@suma_kanakala_f) -
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
మాటల మూట, 'హాఫ్ సెంచరీ' కొట్టేసింది (ఫొటోలు)
-
అలాంటి లుక్లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
‘మాట’తో చేస్తున్న సేవకు ఆనందంగా ఉంది: శ్రీనివాస్ గనగోని
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ప్రారంభించిన పదినెలల్లోనే 22 బ్రాంచిలు ఏర్పాటు చేసి దాదాపు 5000 మందితో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అసోసియేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని. మాట అధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుంచి వివిధ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చి 10 వరకు ఈ సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న కంటి కాటరాక్ట్ ఆపరేషన్ల క్యాంప్ నేటితో(ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని మాట్లాడుతూ.. ఇండియాలో ఈ నెల 17న వరంగల్లో 500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు మరియు జనరల్ మెడిసిన్ ట్రీట్మెంట్లు చేశాము. 18న ఆశలపల్లిలో మరో 300 మందికి క్యాన్సర్ టెస్ట్లతో పాటు జనరల్ టెస్ట్లు కూడా చేసి మందులను ఉచితంగా పంచిము. అలాగే 19న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారితో కలిసి కంటి ఆపరేషన్లకు సంబంధించి 2300మంది వరకు టెస్ట్లు చేశాము. దాదాపు 200 మందికి ఆపరేషన్లు నిర్వహించి 100 మందికి ఉచిత కళ్లజోళ్లను పంపిణి చేశాము. మరో 250 మందిని చెన్నైకి పంపించి వైద్యం చేయిస్తున్నాం. ఇదంతా చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని మాట అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని అన్నారు. ఫెస్టివల్స్ ఫర్ జోయ్ అధ్యక్షురాలు, ప్రముఖ యాంకర్ సుమ కనకాల మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎంతో మానవత్వం ఉండాలి. అలాంటి మానవత్వం ఉన్న ఎంతో మంది కలిసి చేయబట్టే దాదాపు 2000మందికి పైగా ఈ రోజు ఐ స్క్రీనింగ్ టెస్ట్లు చేయగలిగారని, దాదాపు 195 ఆపరేషన్లు జరిగినందుకు శంకర్ నేత్రాలయ టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ–‘‘ గతంలో నన్ను అందరూ సుమ భర్త అని ఎవరన్నా అంటుంటే చిరగ్గా ఉండేదని ఇప్పుడు సుమ ఇలాంటి మంచిపనులు చేస్తున్నందుకు సుమ భర్త అంటుంటే ఎంతో గర్వంగా ఉందని కాలర్ ఎగరేసుకుని మరి సుమ భర్తనే అని చెప్పుకోవాలి అనిపిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ ప్రతినిధి అరుల్, డాక్టర్ విజయ్ భాస్కర్ బొలగం, ప్రవాసాంధ్రుడు ప్రదీప్ సామల టివి ఫెడరేషన్ సభ్యులు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ, కొడుకు రోషన్
-
సుమ వింత ఫోటో షూట్.. భయపడిపోయిన రాజీవ్, ఫన్నీ వీడియో వైరల్
ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు సినిమా ఈవెంట్స్తో దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా కొనసాగుతున్నారు యాంకర్ సుమ. ఎలాంటి షో అయినా.. ప్రొగ్రామ్ అయినా యాంకర్గా సుమ ఉండాల్సిందే. కొంతమందికి అయితే ఆమె యాంకరింగ్ సెంటిమెంట్గాను మారింది. (చదవండి: సూపర్ విమెన్ను పెళ్లి చేసుకున్నా..భర్తగా గర్వంగా ఉంది: అక్షయ్ కుమార్) ఆమె కోసం కొన్ని సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తనదైన యాంకరింగ్తో అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకుంది సుమ. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. (చదవండి: అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి) ఇక ఇటీవల వింత ఫోటో షూట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది సుమ. తన కొడుకు రోషన్ హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రిలీజ్ టైమ్లో హీరోయిన్ డ్రెస్తో సుమ ఓ ఫోటో షూట్ చేసింది. అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఆ ఫోటో షూట్ సమయంలో రాజీవ్ రియాక్షన్ ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో సుమ ఫోటో కోసం రకరకాల పోజులు ఇస్తుంటే.. రాజీవ్ ‘వామ్మో.. వాయమ్మో’అంటూ దండం పెట్టేశాడు. ‘నా ఫోటో షూట్ సమయంలో భర్త రియాక్షన్ ఇది’ అంటూ ఆ వీడియోని షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘రాజీవ్ గారు మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్’, ‘సుమ అక్క రోజు రోజుకి మీ వయసు తగ్గిపోతుంది’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బబుల్గమ్ చిత్ర యూనిట్ సందడి
-
నాన్న ఏడ్చారు.. నాకు ఆనందంగా అనిపించింది: రోషన్ కనకాల
నా బాల్యం అంతా తాతగారి(దేవదాస్ కనకాల) యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లోనే గడిచింది. ఆ ప్రభావం నాపై పడింది. చిన్నప్పటి నుంచే యాక్టింగ్పై ఇష్టం పెరిగింది. సినిమాని ముందుకు తీసుకెళ్ళే కథానాయకుడిగా చేయలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. బబుల్గమ్ చిత్రంతో ఆ కోరిక నెరవేరింది. ఇకపై నటుడిగానే నా జీవితాన్ని కొనసాగిస్తాను’అని యంగ్ హీరో రోషన్ కనకాల అన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రోషన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కోరిక. హీరోగా సినిమా చేయాలని చాలా రోజుల ఎదురుచూశాను. అలా దర్శకుడు రవికాంత్ ని కలవడం, ఆయనకి నాతో సినిమా చేయాలని అనిపించడంతో ఈ ప్రయాణం మొదలైయింది. ►నటన పరంగా తాతగారి(దేవదాస్ కనకాల)దగ్గర రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత లాస్ ఏంజలెస్లో ఒక కోర్సు చేశాను. పాండిచ్చేరి లో ఒక కోర్స్ చేశాను. అలాగే నాన్నతో చర్చించి కొన్ని ప్రాక్టీస్ చేస్తుంటాను. ►బబుల్గమ్ సెట్పైకి వచ్చినప్పుడు నాకు న్యూ కమ్మర్ లా అనిపించలేదు. ఎందుకంటే షూటింగ్కి నెల ముందే మేము వర్క్ షాప్ చేసుకున్నాం. స్క్రిప్ట్ ని రిహార్సల్ చేసుకున్నాం. ఒక సీన్ లో ఎలా చేయాలి, ఎలాంటి ఎమోషన్ కన్వే అవ్వాలి, ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి.. ఇవన్నీ ముందు అనుకున్నాం. ఆ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయ్యింది. ► అమ్మానాన్నలకు(యాంకర్ సుమ, రాజీవ్ కనకాల)పరిశ్రమలో మంచి పేరుంది.ఆ ప్లెజర్ నాపై ఉంది.నటన పరంగా వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటాను. ఏవైనా సందేహాలు వున్నా అడుగుతుంటాను. అమ్మా నాన్న సినిమా చూశారు. అయితే అప్పుడు అక్కడ నేను లేను. నాన్న కొన్ని సీన్స్ లో ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. నాన్న సహజంగా ఒప్పుకోరు. ఆయన నుంచి అలాంటి కాంప్లిమెంట్ రావడం ఆనందంగా అనిపించింది. అమ్మకు కూడా చాలా నచ్చింది. ► ఈ సినిమాలోని ఇజ్జత్ పాట లాంచ్ చేయడానికి చిరంజీవి గారిని కలిశాం. ఆ సమయంలో వారి జీవితంలో ఎదురైన అనుభవాలు గురించి చెప్పారు. అలాగే బిగ్ బాస్ కి వెళ్ళినపుడు నాగార్జున గారితో వీడియో చేశాం. మొదట ఆడియో రికార్డ్ కాలేదు. ఆయన్ని అడిగితే .. మరోసారి చేశారు. అది చాలా గొప్పగా అనిపించింది. ► ఈ సినిమాలో షర్ట్లెస్ సీన్ ఉంటుంది. దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా సిటీ అంతా తిరిగాను. ఒక పాయింట్ లో నా సిగ్గు అంతా పోయింది( నవ్వుతూ). నా దృష్టి అంతా ఆ సీన్, అందులోని ఎమోషన్ పైనే పెట్టాను. ఆ సీన్ షూటింగ్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభువం. చాలా విషయాలు నేర్చుకున్నాను. ► ఈ సినిమా కోసం శ్రీచరణ్ చాలా కొత్త సౌండ్ ని క్రియేట్ చేశాడు, పాటలన్నీ ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఇందులో ఒక పాట పాడాను. అయితే దీనికి కోసం ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు. దర్శకుడు, సంగీత దర్శకుడు కోరడంతో అది అలా జరిగిపోయింది. ► నాకు ప్రత్యేకమైన జోనర్ అంటూ ఏమీ లేదు. మంచి సినిమా ఏదైనా ఇష్టం. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ప్రతి సినిమా ఇష్టం.కథలు వింటున్నాను. ప్రస్తుతం నా దృష్టి 'బబుల్గమ్’ విడుదలపైనే ఉంది. -
Bubblegum Movie: యాంకర్ సుమ కుమారుడు 'బబుల్గమ్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
రాజీవ్ కనకాల- జూనియర్కు మధ్య దూరం నిజమేనా?.. అసలు నిజం చెప్పిన రోషన్!
టాలీవుడ్ యాంకర్ అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సుమ. ఆమె తర్వాతే ఎవరైనా అన్నవిధంగా సుమ తెలుగు ఇండస్ట్రీలో అంతలా పేరు తెచ్చుకుంది. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజీవ్ -యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోషన్.. రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోషన్ మాట్లాడుతూ.. 'ఫ్రెండ్షిప్ అనేది ఒక బంధం. వీరిద్దరి రిలేషన్ స్టూడెంట్ నెం-1 మూవీ నుంచి ఉంది. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి స్నేహితున్ని వదులుకోకూడదు. తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఆయన స్థాయికి చేరుకోవాలనేది నా కోరిక. రాజీవ్, జూనియర్కు మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై రోషన్ స్పందించారు. అలాంటిదేం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు వాళ్లు ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఎప్పుడు ఎవరు అలా ఫీలవ్వలేదు. అసలు జరిగితేనే కదా ఫీలయ్యేది.' అని అన్నారు. సుమ కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్ట్ చేశారనేది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడలా సపోర్ట్ చేయరు. ఆయనకు టీజర్ నచ్చింది. సాంగ్ కూడా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా పాట పాడావా?అని అడిగారు. నా వాయిస్ చాలా బాగుందన్నారు. దీంతో చిరంజీవి మాటలకు నాకే ఆశ్చర్యమేసింది' అని రోషన్ అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడం కోసం దాదాపు 150 టేక్స్ తీసుకున్నారా? అంటూ రోషన్ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి కాస్తా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రోషన్.. హీరోయిన్ మానస చౌదరిని తీసుకొచ్చాడు. ఎన్ని టేకులు తీసుకున్నానో చెప్పు అంటూ ఆమెను అడిగారు. అయితే ఇదంతా ఫన్నీ కోసమే చేసినా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు రోషన్. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
Anchor Suma Diwali Celebrations: యాంకర్ సుమ ఇంట్లో దీపావళి వేడుక (ఫొటోలు)
-
గిన్నిస్ రికార్డు.. సంతోషంలో మునిగి తేలుతోన్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల సంతోషంలో మునిగితేలుతోంది. ఇంతకీ ఆమె సంతోషానికి కారణం ఎవరనుకుంటున్నారా? ఆమె తాతయ్య పి.బి. మీనన్. ఈయన 98 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని సుమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించింది. 'మా తాతయ్య(అమ్మమ్మ తమ్ముడు) మీనన్ 73 ఏళ్లుగా న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఎక్కువకాలం న్యాయవాది వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నందుకుగానూ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన నాతో పాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మా తాతయ్యే నా సూపర్ హీరో' అని రాసుకొచ్చింది. ఆయన చాలా గ్రేట్.. ఇందుకు తన తాత గిన్నిస్ రికార్డు అందుకున్న ఫోటోను జత చేసింది. అలాగే గిన్నిస్ బుక్ వారు అందించిన సర్టిఫికెట్ను సైతం జోడించింది. దీనిప్రకారం సుమ తాతయ్య 73 ఏళ్ల 60 రోజులగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అన్నేళ్ల పాటు వృత్తిలో కొనసాగడం మామూలు విషయం కాదు, నిజంగా ఆయన చాలా గ్రేట్ అని పొగుడుతున్నారు. సుమ కూడా తన యాంకరింగ్ను అలాగే కొనసాగించాలని.. భవిష్యత్తులో ఎక్కువకాలం యాంకరింగ్ చేసిన హోస్ట్గా గిన్నిస్ రికార్డు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుగులేని యాంకర్ ఇకపోతే మలయాళీ కుటుంబానికి చెందిన సుమ అచ్చ తెలుగమ్మాయిలా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. తన నోటి నుంచి వచ్చే పంచ్లకైతే లెక్కే లేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమ టాలీవుడ్లో యాంకర్గా బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది. పెద్ద సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలకు అయితే సుమ కచ్చితంగా ఉండి తీరాల్సిందే! చాలామటుకు విమర్శలు, వివాదాల జోలికి పోని సుమ ఈ మధ్య ఆదికేశవ పాట లాంచ్ ఈవెంట్లో మాత్రం నోరు జారింది. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు' అంటూ మీడియా వాళ్లపై సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అందరికీ సారీ చెప్పి ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: బాలకృష్ణ VS తారక్.. పోటీగా దిగుతున్న బాలయ్య.. అప్పటి రిజల్ట్ రిపీట్ కానుందా? -
హఠాత్తుగా నేను చనిపోతే.. పిల్లల గురించి 'సుమ' ఎమోషనల్ వర్డ్స్
టాలీవుడ్ స్టార్స్ సినిమాల వేడుకల్లో తన మాటలతోనే అందరినీ కట్టిపేడుస్తుంది సుమ కనకాల. కేరళలోని పాలక్కాడ్లో జన్మించిన ఆమె రాజీవ్ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. 48 ఏళ్ల వయసులో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వ్యాఖ్యాతగా తనదైన టాలెంట్తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామే.. అలా ట్రెండ్లో ఉన్నప్పుడే తన కుమారుడిని సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రోషన్ కనకాల 'బబుల్గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్నాడు. ఈ క్రమంలో సుమ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సమాజంలో చాలామంది మహిళలు తన భర్త చనిపోయాక ఎలాగైనా పిల్లలను పోషించుకోవాలని పని కోసం అనేకపాట్లు పడుతుంటారు. కొందరైతే ఇళ్లల్లో పనులు అయినా చేసేందుకు వెనుకాడరు. వారికి కనీసం బ్యాంక్, డబ్బులు దాచుకోవాలి, ఇన్సూరెన్స్లు.. ఇలాంటివి ఏమి తెలియవు. వారి భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకు ఇవి తెలీదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు చుట్టూ ఉన్నవారిలో కొందరికైనా వీటి గురించి చెప్పాలని సుమ తెలిపింది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ' నాకు సంబంధించిన ఇన్సూరెన్స్ల విషయాల గురించి పిల్లలకు అంతా చెప్పాను. ఏదైనా కారణాలచేత హాఠాత్తుగా నేను చనిపోతే ఇన్యూరున్స్ ద్వారా ఎవరకి ఎంత వస్తుంది..? ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు అందుతుంది..? అనే విషయాలన్నీ నా పిల్లలను ఒకరోజు కూర్చోబెట్టి చెప్పాను. కానీ ఆ సమయంలో ఎందుకు మమ్మీ ఇలాంటి మాటలు మాట్లాడుతావు..? అని పిల్లలు తిరిగి ప్రశ్నించారు. ఏదేమైనా మనం పిల్లలకు రియాల్టీ చెప్పాలి. ఈ క్షణం అనేది పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలు పిల్లలు ధైర్యంగా షేర్ చేయాల్సిన బాధ్యత మనమీదే ఉంది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ చెప్పింది నిజమే కదా అంటూ కొందరు వాటిని షేర్ కూడా చేస్తున్నారు. -
Bubblegum Teaser Launch Event Pics: యాంకర్ సుమ తనయుడు రోషన్ ‘బబుల్గమ్’చిత్రం టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
యాంకర్ సుమ కొడుకు మూవీ టీజర్ చూశారా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తయనయుడు రోషన్ హీరోగా మారాడు. ఆయన నటించిన తొలి చిత్రం ‘బబుల్గమ్’. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హేశ్వరీ మూవీస్ - పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘ప్రేమ అనేది బబుల్గమ్ లాంటిదని, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటుందంటూ’ వాయిస్ ఓవర్తో టీజర్ ప్రారంభమతుంది. ఆ తర్వాత హీరోయిన్ను పబ్లో చూసి ప్రేమలో పడడం.. ఆ తర్వాత హీరో గురించి హీరోయిన్కి నిజం తెలిసి గొడవ పడడం ఇందులో చూపించారు. సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్లాక్తో బబుల్గమ్ సినిమా టీజర్ ముగిసింది. లవ్,రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో యూత్ఫల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. -
లావణ్యకు కాల్ చేయను.. ఎందుకంటే.. వరుణ్ తేజ్ క్రేజీ ఆన్సర్!
మెగా హీరో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో పాల్గొన్న యాంకర్గా వ్యవహరించిన సుమ కనకాల.. వరుణ్ తేజ్ను పలు ఆసక్తికర ప్రశ్నలు వేసింది. వాటికి వరుణ్ తేజ్ సైతం క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. అవేంటో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మెగా ఇంట్లో పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్!) సుమ: చిరంజీవి, పవన్ కల్యాణ్లలో ఎవరీ మేనరిజం ఇమిటేట్ చేయడమంటే ఇష్టం? వరుణ్ తేజ్: ఆ రెండు చూడటం చాలా ఇష్టం చేయడం కన్నా సుమ: సాక్షివైద్య, ప్రవీణ్ సత్తారుతో పనిచేయడంలో ఎవరితో కంఫర్ట్ అనిపించింది? వరుణ్ తేజ్: సాక్షివైద్య.. ప్రవీణ్ సత్తారు బాగా ఇబ్బంది పెట్టాడు. సుమ: రామ్ చరణ్, అల్లు అర్జున్లో పెళ్లయిన తర్వాత ఎవరిలో మార్పు వచ్చింది? వరుణ్ తేజ్: పెళ్లయిన తర్వాత ఎవరిలోనైనా మార్పు రావాలి. సుమ: నిహారిక, లావణ్య నుంచి కాల్ మీ అర్జెంట్ అని ఓకేసారి మేసేజ్ వస్తే ఎవరికీ ఫస్ట్ కాల్ చేస్తారు? వరుణ్ తేజ్: ముందుగా నిహారికకే కాల్ చేస్తా.. ఎందుకంటే తను చిన్నపిల్ల కదా! సుమ ప్రశ్నలకు వరుణ్ తేజ్ ఇచ్చిన సమాధానాలు విని ఫ్యాన్స్ సందడి చేశారు. కాగా.. ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో వరుణ్-లావణ్యల పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పెళ్లి తేదీలను వెల్లడించకపోయినప్పటికీ.. ఈ ఏడాదిలోనే ఉంటుందని ఇటీవల వరుణ్ తేజ్ చెప్పారు. ప్రస్తుతం గాండీవధారి అర్జున చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్!) -
బెడ్పై కదల్లేని స్థితిలో శ్రీలక్ష్మి, మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్
కొద్ది నిమిషాల నిడివి ఉన్నా, సినిమా ఆసాంతం ఉన్నా తను పోషించే పాత్రలు ఎంతో పవర్ఫుల్గా ఉంటాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎమోషన్స్ చూపించడం, సీన్ను రక్తికట్టించడంలో రాజీవ్ కనకాల దిట్ట. జీవితంలో కష్టనష్టాలు ఎన్నో చూసిన ఆయన సినీ కెరీర్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'అమ్మ, నాన్న, చెల్లి.. అందరినీ కోల్పోయాను. ఆ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. రెండు,మూడు నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా చెల్లి పేరు శ్రీలక్ష్మి. తను సీరియల్స్ కూడా చేసింది. తనకు క్యాన్సర్ వచ్చింది, దాన్నుంచి దాదాపు బయటపడింది. పూజలు, హోమాలు చేయించమంటే అవి కూడా చేయించాం. 85 శాతం రికవరీ అయింది. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదనుకున్నాం. రెండు రోజుల్లో లాక్డౌన్ అనగా మా బావ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. వెళ్లి చూశాక తన పరిస్థితి దిగజారుతోందని అర్థమైంది. కీమోథెరపీ చేయిద్దామంటే అప్పుడే పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అది తగ్గితేకానీ ఏ చికిత్స చేయరు. రోజురోజుకీ తన పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. అది కరోనా సమయం కావడంతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ అడ్మిట్ చేసుకున్నా తన ప్రాణ్యాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అందుకే ఉన్నంత వరకు కుటుంబమంతా ఒకే దగ్గర ఉన్నాం. బెడ్పై కదల్లేని స్థితిలో ఉన్న తను ఎప్పుడో ఒకసారి స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచి చూసేది. మాట్లాడటానికి కూడా రాకపోయేది. తన కంట నుంచి కన్నీళ్లు కారేవి. రాత్రిపూట తన మూలుగు విని ఇంకా బతికుందని అనుకునేవాడిని. ఎక్కువరోజులు తను బతకదని తెలుసు, అదే జరిగింది. నా మేనకోడళ్లు (చెల్లి పిల్లలు) ఇద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. తల్లి చనిపోయాక తనకోసం లేఖ రాశారు. ఆ మధ్య అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో సుమ వచ్చి ఇప్పటి నుంచి మనకు నలుగురు పిల్లలు అంది. ఇప్పటికీ వాళ్లకు ఏం కావాలన్నా సుమ దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ ఎమోషనలయ్యాడు రాజీవ్ కనకాల. చదవండి: అనాథలా చనిపోయిన తెలుగింటి హీరోయిన్.. -
సింగర్ సునీత.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా!
సింగర్ సునీత టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మధురమైన స్వరంతో సినీ ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్లో స్టార్ సింగర్గా పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు పాటలు పాడిన సునీత తెలుగు వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. సునీత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: హీరోగా సింగర్ సునీత కొడుకు.. ఫస్ట్ లుక్ రిలీజ్) ఆమె ఇన్స్టా స్టోరీస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. స్టార్ యాంకర్ సుమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ సుమ అంటూ ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. సింగర్ సునీత కూమారుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. 'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. (ఇది చదవండి: లైవ్లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) -
బ్లూ శారీలో ఐశ్వర్య రాజేశ్.. మరింత బోల్ట్గా సీతారామం బ్యూటీ పోజులు!
►బ్లాక్ డ్రెస్లో టాక్సీవాలా భామ ప్రియాంక జువాల్కర్ పోజులు! ►బ్లూ శారీలో కవ్విస్తోన్న ఐశ్వర్య రాజేశ్! ►మరింత బోల్డ్ లుక్లో ది నైట్ మేనేజర్ నటి శోభిత ధూలిపాల! ►షూట్ ధరించిన యాంకర్ సుమ కనకాల! ► బ్లాక్ డ్రెస్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) -
సుమకి బాలయ్య మాస్ ర్యాగింగ్
-
బాలయ్య మాస్ ర్యాగింగ్.. ఏయ్ ఆపు, ఊరికే లొడలొడా వాగుతున్నావ్..
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్దాస్, గానవి లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం (జూన్ 29న) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై ఉన్న యాంకర్ సుమపై ఆయన సెటైర్లు వేశారు. ముందుగా రుద్రంగి సినిమాను తన భుజాలపై వేసుకుని ప్రమోష్స్ చేస్తున్న జగపతిబాబుపై ప్రశంసలు కురిపించింది సుమ. అతడిని మాట్లాడాల్సిందిగా కోరుతూ మైక్ జగపతిబాబు చేతికి అందించింది. జగపతిబాబు స్పీచ్ మొదలుపెట్టేలోపు పక్కనే ఉన్న బాలయ్య ఏయ్, ఆపు.. ముందు మాట్లాడనివ్వు.. ఓ లొడలొడా వాగేస్తున్నావ్.. అన్నాడు. దీంతో సుమ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్టేజీ పై నుంచి వెళ్లిపోయింది. తర్వాత కాసేపటికే స్టేజీపైకి వచ్చిన ఆమె.. బాలకృష్ణను మాట్లాడాల్సిందిగా కోరుతూ అతడి చేతికి మైక్ ఇచ్చింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 'బాలయ్యబాబు సెక్సీ అంటే విమలా రామన్, మమతా మోహన్దాస్.. వాళ్లంతా ఎంత జెలసీగా ఫీలవుతారు? కదా! అయినా ఇంతకుముందు సుమ ఒక మాట అంది. నేను ఏమీ మాట్లాడకముందే అభిమానులు చప్పట్లు కొడతారంది. ఈవిడకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఈమె తిరిగి చెప్పు తీసుకుని కొడుతుంది.. అదొక బాధ మళ్లీ! పాపం రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో..' అంటూ సుమను టీజ్ చేశాడు. చదవండి: చనిపోయే కొద్ది గంటలముందు అవి కావాలన్న సౌందర్య -
స్పై మూవీ టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ
-
వెకేషన్లో శ్రద్ధా దాస్ హోయలు.. జిమ్లో యాంకర్ సుమ కసరత్తులు
వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధాదాస్ జిమ్లో కసరత్తులు చేస్తోన్న యాంకర్ సుమ ముంబయి షెడ్యూల్లో బిజీగా సీతారామ బ్యూటీ View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
అమ్మకు బంగారు బహుమతిచ్చిన యాంకర్ సుమ
యాంకరింగ్లో సుమను ఢీ కొట్టేవారే లేరు. ప్రస్తుతం టాప్ యాంకర్లుగా రాణిస్తున్నవారు కూడా సుమ యాంకరింగ్కు ఫ్యాన్సే! పంచులు, కౌంటర్లు, జోక్స్లతో ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ఎంతటివారైనా ఆమె మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే! అంతటి ధీశాలి సుమ అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా సుమ మదర్స్డే(మే 14)ను పురస్కరించుకుని తన తల్లి విమల కోసం ఏదైనా గిఫ్ట్ కొనేందుకు షాపింగ్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా తన చలాకీ మాటలతో అభిమానులను ఎంటర్టైన్ చేసింది చివరగా తన తల్లి కోసం ఒక సింపుల్ ఐటం సెలక్ట్ చేసుకున్నట్లు చెప్పింది. చివరగా.. అమ్మకు ఏమిచ్చినా సరిపోదు కాబట్టి వీటన్నిటితోపాటు బోలెడంత ప్రేమను కూడా ఇచ్చేయండి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే టాలీవుడ్లో జరిగే చిన్నాపెద్ద ఈవెంట్లకు సుమ ఉండాల్సిందే! ఏ కార్యక్రమాన్ని అయినా సక్సెస్ఫుల్ చేయడంలో సుమ దిట్ట. తను టీవీ షోలు, ఇంటర్వ్యూలే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లు కూడా చేస్తుందన్న విషయం తెలిసిందే! కెరీర్ తొలినాళ్లలో నటిగా కొన్ని సినిమాలు చేసిన సుమ ఇటీవల జయమ్మ పంచాయితీ సినిమాతో మెప్పించింది కూడా! చదవండి: రూ.132 కోట్ల నష్టం.. భర్త కోమాలోకి.. మూడుసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా -
సుమక్కతో అట్లుంటది సీరియస్ గా ఉంటె గోపీచంద్ కూడా పడీ పడీ నవ్వుకున్నాడు
-
ఉగ్రం మూవీ టీమ్ తో యాంకర్ సుమ చిట్ చాట్...
-
యాంకర్ సుమ అరెస్ట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటల ప్రవాహంతో 15ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో గలగల మాట్లాడుతూ తన కామెడీ, పంచ్ టైమింగ్లతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఆమె లేకుండా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపు ఉండవని చెప్పాలి. అంతటి సామర్థ్యం ఉన్న సుమను తాజాగా అరెస్ట్ చేశారన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె చేతికి బేడీలు వేసి వ్యాన్లో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సుమకి ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సుమను నిజంగా అరెస్ట్ చేయలేదట. ఓ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇలా అరెస్ట్ చేశారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అల్లరి నరేస్ నటిస్తున్న సినిమా ఉగ్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సుమతో ఇలా స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసారన్నమాట. CI Shiva Kumar on duty! Your favourite anchor is in my control. The #Ugram begins. Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN — Allari Naresh (@allarinaresh) April 12, 2023 -
పైకి అలా కనిపిస్తాడు కానీ.. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ : అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వార్కి రెడీ అవుతోంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడు పెంచారు మేకర్స్. తాజాగా యాంకర్ సుమతో ముచ్చటించిన అఖిల్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్న షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాక మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తారు. సినిమాల గురించి డిస్కషన్స్ చేయరు. మా అన్న నాగచైతన్య కూడా అంతే. సేమ్ నాన్న లాగే. పైకి నేను నాటీ(చిలిపి)గా కనిపిస్తా కానీ నాకంటే ఎక్కువ నాటీ చై. సైలెంట్ కిల్లర్. అన్నీ సైలెంట్గా చేసేస్తాడు అంటూ నాగచైతన్య సీక్రెట్ను రివీల్ చేసేశాడు. ప్రస్తుతం చైపై అఖిల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
కొమురక్క ని కుమ్మేసిన సుమక్క
-
స్టేజి మీద రచ్చ రచ్చ చేసిన నాని,సుమ
-
సుమ స్పాంటేనిటీ పీక్స్.. సమంత నవ్వలేక ఏడ్చేసింది
-
హీరోయిన్ సమంత ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
నగల దుకాణంలో సందడి చేసిన యాంకర్ సుమ (ఫొటోలు)
-
24 ఏళ్ల బంధం.. ఆన్లైన్లో ఇలా: సుమ కనకాల
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరంటే మొదట వినిపించే పేరు సుమ. అంతలా ఫేమ్ సంపాదించుకుంది కేరళ అమ్మాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సుమ మాత్రం లోకల్ అన్న విధంగా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా సరే సుమ ఉందంటే ఆ రేంజే వేరు. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడడం, సమాయానుకూలంగా పంచ్లు వేయడంలో ఆమెకు ఆమె సాటి. నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని హైదరాబాద్లోనే స్థిరపడిపోయింది. ఇక టాలీవుడ్లో రాజీవ్ కనకాల గురించి పరిచయం అక్కర్లేదు. ఏ పాత్రలోనైనా మెప్పించడం ఆయనతే సొంతం. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లి సంగతులు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లయి వీరికి 24 ఏళ్లు పూర్తయింది. వివాహా వార్షికోత్సావాన్ని కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుమ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెడుతున్నారు. సుమ షేర్ చేసిన ఆ వీడియో కాల్లో ఇద్దరు పాట పాడుతూ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నువ్వక్కడ.. నేనిక్కడ.. పాటక్కడ.. పలుకిక్కడ అంటూ సుమ పాట పాడగా.. మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా' అంటూ రాజీవ్ కనకాల పాడుతూ వీడియో కాల్లో కనిపించారు. ఏదేమైనా సుమక్క యాంకరింగే కాదు.. ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!... నెట్టింట వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరాటాల శివ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టలేదు. ఎన్టీఆర్30 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్కు ఫ్యాన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో వేదికపైనే ఎన్టీఆర్ 30 అప్డేట్స్ ఇవ్వాలంటూ యాంకర్ సుమ ఎన్టీఆర్ను డైరెక్టుగా అడిగేయడంతో ఎన్టీఆర్ ఎందుకో గానీ కాస్త సీరియస్ అయినట్లు కనిపించారు. 'అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారే'.. అంటూ సుమకు కౌంటర్ వేశాడు. అనంతరం ఫ్యాన్స్కి కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. "నాకు ఒంట్లో బాగోలేకపోయినా .. మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. బాడీ పెయిన్స్ వలన ఎక్కువ సేపు నిలబడలేను కూడా .. ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్డేట్, అప్డేట్ అని ఇబ్బంది పెట్టకండి. ప్రతి రోజూ, ప్రతి గంటా అప్డేట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్ పెరిగిపోతోంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఒకవేళ అప్డేట్ ఉంటే ఇంట్లో మా భార్య కంటే ముందే మీకు విషయం చెబుతాం'' అంటూ తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
Anchor Suma: గొప్ప మనసు చాటుకున్న యాంకర్ సుమ
తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, యాంకర్ సుమ మాత్రం పర్మినెంట్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టాక్ షోలైనా, గేమ్ షోలైనా సుమ ఉండాల్సిందే. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడుతూ.. సమాయానుకూలంగా పంచ్లు వేస్తూ ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ బిగినింగ్లో పలు సీరియల్స్లో నటించిన సుమ.. ఆ తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చి యాంకర్గా మారింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్గా రాణిస్తున్న సుమ.. అప్పుడప్పుడు తనలో ఉన్న నటిని కూడా పరిచయం చేస్తుంది. ఆ మధ్య ఆమె లీడ్ రోల్లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేసింది. అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, నటన పరంగా సుమకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఒకవైపు యాంకరింగ్ మరోవైపు యాక్టింగ్తో ఇప్పటికీ ఫుల్ బిజీగా ఉంది సుమ. ఇదిలా ఉంటే తాజాగా సుమ చేసిన ఓ మంచి పనికి నెటిజన్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీమ్. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను’అని సుమ చెప్పుకొచ్చింది. సుమ చేస్తున్న మంచి పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చిరంజీవి మెసేజ్లను అవాయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే..
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. సామాన్య ప్రజలే కాదు సినీ సెలబ్రెటీల్లో సైతం ఆయనను అభిమానించే వారు ఎందరో ఉన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండ ఇండస్ట్రీ స్వయంగా కృషితో ఎదిగి ఆశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన పలకరిస్తే చాలు, ఆయనతో ఒక్క మాట మాట్లాడితే చాలు అని అభిమానుల ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. ఇక చిరంజీవితో సినిమా చేయడమంటే దర్శక-నిర్మాతలు, నటీనటులు అదృష్టంగా భావిస్తారు. అలాంటి మెగాస్టారే స్వయంగా మెసేజ్ చేస్తే ఓ స్టార్ యాంకర్ అవాయిడ్ చేసిందట. ఆమె మరెవరో కాదు యాంకర్ సుమ కనకాల. చదవండి: చిరంజీవి మెసేజ్లను అవైయిడ్ చేసిన సుమ! అసలేం జరిగిందంటే.. మూడు, నాలుగేళ్లు వరుసగా సుమకు మెసేజ్ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేదని చిరు తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్లో ఉన్న చిరంజీవి సుమ హోస్ట్ చేస్తున్న ఓ ఎంటర్టైన్మెంట్ షోలో పాల్గొన్నారు. చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, నటుడు వెన్నెల కిషోర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమ చిరు లీక్స్లో ఏమైనా లీక్స్ ఉన్నాయా! అని అడగ్గా.. ఏకంగా సుమకే ఎసరు పెట్టారు చిరంజీవి. సుమ గురించి ఓ విషయం లీక్ చేస్తున్నానంటూ అసలు విషయం చెప్పారు. చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా! ‘‘మూడు, నాలుగేళ్లుగా సుమకు హ్యాపీ బర్త్డే, గార్డ్ బ్లెస్ యూ, స్టే బ్లెస్డ్’ అంటూ సుమకు మెసేజ్లు పెడుతూనే ఉన్నాను. కానీ కనీసం ఆమె రిప్లై కూడా ఇవ్వలేదు. చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఎకైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది సుమనే’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సుమ స్పందిస్తూ.. ఏకంగా చిరంజీవి గారు మెసేజ్ చేస్తారని తాను అసలు ఊహించలేదని, కనీసం నెంబర్ కూడా క్రాస్ చెక్ చేసుకోలేదని వివరణ ఇచ్చింది. అనంతరం చిరు మాట్లాడుతూ.. 2022లో ఓ ఈవెంట్లో సుమ కలిసినప్పుడు ఇలా మెసేజ్ చేశానని చెప్పగానే తాను చాలా సంతోషించిందన్నారు. అంతేకాదు సారీ కూడా చెప్పి నెంబర్ తీసుకుందని ఆయన చెప్పారు. -
రూటు మార్చిన మెగాస్టార్ చిరంజీవి
-
యాంకరింగ్కు బ్రేక్? టీవీ కోసమే పుట్టానన్న సుమ
తెలుగు బుల్లితెర టాప్ యాంకర్ ఎవరని అడిగితే సుమ కనకాల అని టపీమని చెప్తారు. 15 ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతుందామె. టీవీ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వచ్చినా ఎవ్వరూ ఆమె స్థానాన్ని పొందడం కాదు కదా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంది సుమ. టీవీ షోలే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు.. ఏదైనా సరే సుమ ఉండాల్సిందే.. ఆమె మలయాళీ అయినా పదహారణాల తెలుగమ్మాయిగా రెడీ అయి అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఆమెది. తన కామెడీ, పంచ్ టైమింగ్లకు కొదవే లేదు. తాజాగా ఆమె యాంకరింగ్కు బ్రేక్ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై సుమ స్పందించింది. 'ఇటీవల న్యూఇయర్ ఈవెంట్ చేశాం. ఆ ప్రోమో రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. అందులో నేను కొంత ఎమోషనలైన మాట వాస్తవమే. కానీ ఈవెంట్ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు.. ఏం కంగారుపడకండి. నేను టీవీ కోసమే పుట్టాను, ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి' అని ఓ వీడియో రిలీజ్ చేసింది సుమ. చదవండి: తొలి సంపాదన రూ.350: భరత్ ధమాకా.. కలెక్షన్స్ ఎంతంటే -
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. 15ఏళ్లుగా స్టార్ యాంకర్గా కొనసాగుతున్న సుమకు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, టాక్ షో అయినా సుమ ఉండాల్సిందే అనేంతగా క్రేజ్ దక్కించుకుంది. ఆమె పంచులు కామెడీ టైమింగ్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సుమ తాజాగా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుమ తాను యాంకరింగ్కు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పి ఎమోషనల్ అయ్యింది. "నేను మలయాళీ అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమించారు" అంటూ సుమ కన్నీటి పర్యంతం అయ్యింది. యాంకరింగ్ నుంచి విరామం తీసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో మిగతా ఆర్టిస్టులు అందరూ ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా సుమ లేని టెలివిజన్ అంటే కాస్త కష్టమేనంటున్నారు ఆమె ఫ్యాన్స్. -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్కు సుమ యాంకర్గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
సుమ ఫెంటాస్టిక్ వీక్, పూజ రాక్ అండ్ రోల్, అనసూయ హుయలు
► ప్రేమలో పడ్డానంటున్న మేజర్ మూవీ బ్యూటీ ► ఫ్యాన్స్లో కోసం చీరలో దర్శనమిచ్చిన కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ► బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఫరియా హాట్ లుక్ ► పొట్టి డ్రెస్లో కవ్విస్తున్న ఇషా ► పూజా హెగ్డే రాక్ అండ్ రోల్ లుక్ ► పట్టు చీరలో ఆకట్టుకుంటున్న అను ఇమ్మాన్యూయేల్ ► హల్దీ వేడుకల ఫొటోలు షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Nikki Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్
సినిమాలో గ్లామర్ కావాలి.. అందుకేగా హీరోయిన్... స్పెషల్ సాంగ్ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్ చేసే తారలు.. ‘ఫీమేల్ స్టార్స్’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్ క్యారెక్టర్స్కి సై అంటారు. అయితే గ్లామర్కి అతీతంగా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురిం తెలుసుకుందాం. ‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్కి ఓ మంచి చాయిస్ అయ్యారు కీర్తీ సురేశ్. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్ మిస్ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్లక్ సఖి’, ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్లక్ సఖి’ జనవరి 28న థియేటర్స్లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కింన ‘సాని కాయిదమ్’ మే 6 నుంచి డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్లక్ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్ యూట్యూబ్ చానెల్ను రన్ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు. మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్ ఓవర్’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్ ఇంపాజిబుల్’లో నటించారు. చైల్డ్ ట్రాఫికింగ్ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ స్వరప్ దర్శకుడు. చిన్నారులను చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యమన్ ట్రాఫికింగ్ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్ అంశాల టచ్ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఓ లీడ్ రోల్ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్కుమార్ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్ రోల్ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది. ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్గా ‘హ్యాపీ బర్త్డే’అని చెప్పుకోవచ్చు. రితేష్ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్ కల్చర్ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్లో సాగే ఈ చిత్రంలో గన్ కల్చర్కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా రీమేక్ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్ టైటిల్ రోల్స్లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్ వర్మ తెరకెక్కించారు. అమ్మాయిలను కిడ్నాప్ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్ రోల్లో హరి–హరీష్ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్ ఆఫీసర్ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్ రోల్ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్ ఫిల్మ్కు గుణశేఖర్ దర్శకుడు. ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్లో జూన్ 17 నుం స్ట్రీమింగ్ అవుతోంది. జీఎస్ విఘ్నేష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్ చేస్తారు. సడన్గా అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కనెక్ట్’ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటింన తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. గంటా సతీష్ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్ సిరీస్లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్లో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే. -
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: రాజీవ్ కనకాల ఏమన్నాడంటే?
సుమ- రాజీవ్ కనకాల.. ఒకరు బుల్లితెర స్టార్, మరొకరు వెండితెర ప్రముఖ నటుడు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న వీరిద్దరూ ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే సంపాదన విషయంలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వస్తుంటాయని తరచూ కొన్ని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ రూమర్పై స్పందిస్తూ రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. 'మా మధ్య ఎప్పుడూ అభిప్రాయబేధాలు రాలేవు. సుమ వర్కింగ్ ఉమెన్, సంపాదిస్తుంది. టీవీలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కువ ఆదాయం వస్తుందని జనాలు అనుకుంటారు. నేను సంపాదించేది నేను సంపాదిస్తాను. సవాలక్ష మంది సవాలక్ష రకాలుగా అనుకుంటారు.. నేను అదేం పట్టించుకోను. ఆమె టీవీలో బిజీ అవకముందు నేను బోలెడన్ని సినిమాలు చేసి సంపాదించిన ప్రాపర్టీలు ఉన్నాయి. అయినా మా మధ్య అలాంటి ప్రస్తావనే రాదు. మీ దృష్టిలో.. నా కంటే సుమ సంపాదన ఎక్కువే' అని చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల. చదవండి: దమ్ముంటే అడ్డుకో.. తొడకొట్టి సవాల్ విసిరిన శ్రీహాన్ ఓరి దేవుడా దివాలి దావత్ -
యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలు మాత్రమే స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ సుమ లేకుండ ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ షోలోనే కాదు సోషల్ మీడియా వేదికగానూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ను అలరిస్తోంది. ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఈ చానల్ ద్వారా తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె షేర్ చేసుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియోలో తన పెళ్లి రోజులను గుర్తు చేసుకుంది ఆమె. వాళ్ల అమ్మ 80వ పుట్టిన రోజు సందర్భంగా సుమ తల్లికి ఖరీదైన చీర కొనిపెట్టింది. ఈ సందర్భంగా షాపింగ్కు వెళ్లిన సుమ అక్కడ షాపింగ్ మాల్లో తన పెళ్లి చీర ఖరీదు ఎంతో చెప్పింది. అక్కడ తల్లితో కలిసి ఆమె చీరలు చూస్తుండగా.. ఇవన్ని రూ. 15 వేల లోపు చీరలని, మీరేంజ్ సారీస్ పై ఫ్లోర్లో ఉంటాయని సేల్స్మాన్ చెప్పాడు. అతడి మాటలకు సుమ మేం ఈ రేంజ్లోనే తీసుకుంటామంటూ తనదైన స్టైల్లో పంచులు వేసింది. అక్కడ చీరలు, వాటి ప్రత్యేకత, డిజైన్స్ గురించి ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తనకు ఓ చీర నచ్చగా దాని ధరెంత అని అడిందామె. చదవండి: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్ బాబు రూ. 2 లక్షలు అని చెప్పడంతో షాకైన సుమ.. తాను ఇప్పటివరకు ఇంత కాస్ట్లీ చీర కట్టలేదని, పెళ్లికే రూ. 11 వేల చీర కట్టానంటూ అసలు విషయం చెప్పేసింది. ఇక స్టార్ యాంకర్ అయిన సుమ తన పెళ్లి చీర ఖరీదు చెప్పడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన సుమ పెళ్లి చీర ధర చర్చనీయాంశమైంది. ‘అప్పట్లో రూ. 11 వేలు అంటే కాస్ట్లీ యే కదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మీ రెంజ్కి ఇది తక్కువే’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. కాగా రాజీవ్తో పెళ్లి సమయానికి సుమ అప్పడప్పుడే యాంకర్గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాంకర్ కంటే ముందు ఆమె పలు టీవీ పలు సీరియల్స్లో నటించింది. కాగా రాజీవ్ కనకాల-సుమల పెళ్లి 1999 ఫిబ్రవరి 10న జరిగింది. -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
అత్యద్భుతమైన డిజైన్లతో ఆభరణాల ప్రదర్శన (ఫోటోలు)
-
యాంకర్ సుమ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నటి
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలే కాదు స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ అంటే సుమ లేకుండ అవి ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటోంది. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ ఇందుకు తాజా సంఘటనే ఉదాహరణ. ఆమె హోస్ట్ చేస్తున్న ఓ షోలో సీనియర్ నటి సుభాషిని అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే తాను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదానిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం. ఎంతో కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న. వైద్యంగా కోసం సుమ ఆర్థికంగా సహాయం చేస్తుంది. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అని అనడంతో సుమ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే నటి సుభాషిని దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇలా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం స్టేజ్పై ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సుమ తన మాటలతో అందరిని మన్ననలు పొందడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నారు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓటీటీలో జయమ్మ పంచాయితీ, ఎప్పటినుంచంటే?
యాంకర్ సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన మూవీ జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మించారు. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అదించారు. మే6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ సహజ నటనతో అదరగొట్టేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. జూన్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే జయమ్మ పంచాయితీ ఏంటో ఓ లుక్కేయండి. చదవండి: భర్తకు నయన్ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్, మరి విఘ్నేశ్ ఏమిచ్చాడో తెలుసా? సుకృతి ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ -
యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్
యాంకర్ సుమకు తృటితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పుడు కాదు.. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. షూటింగ్ నిమిత్తం ఆమె ఓ అడవిలో ఉన్న చిన్న నీటి ప్రవాహం వద్ద నిలబడింది. అక్కడ ఉన్న రాళ్లు పీచు పట్టి ఉండడంతో కాలు జారి కిందపడింది. తనను తాను కంట్రోల్ చేసుకొని వెంటనే లేచి బయటకు వచ్చేసింది. (చదవండి: సరికొత్త కాన్సెఫ్ట్తో నయనతార కొత్త చిత్రం?) దీనికి సంబంధించిన వీడియోని తాజాగా సుమ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రొడక్షన్స్ టీమ్స్కి.. టోటల్గా ఎంటర్టైన్మెంట్కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమా విషయాకొస్తే.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మే 6న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
సుమ యాంకరింగ్కు ఫుల్స్టాప్ పెట్టనుందా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో యాంకరింగ్కు ఫుల్స్టాప్ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది. -
నాకు నేను కనిపించలేదు!
‘‘జయమ్మ పంచాయితీ’కు కేటాయించిన సమయాన్ని టీవీ షోలు, ప్రీ రిలీజ్లకు హోస్ట్గా చేయడం వంటి వాటికి వినియోగించినట్లయితే మరిన్ని డబ్బులు వచ్చి ఉండేవేమో. కానీ నన్ను నేను ప్రపంచానికి ఎక్స్ప్లోర్ చేసుకోవాలను కున్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేసినందుకు నాకు నేను శెభాష్ చెప్పుకుంటున్నా’’ అని ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల అన్నారు. విజయ్ కుమార్ దర్శకుడిగా సుమ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సుమ చెప్పిన విశేషాలు.... ‘జయమ్మ పంచాయితీ’ బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ నిడికి తక్కువ ఉంటుందేమోనని ఊహించి, చదవడం మొదలుపెట్టాను. కానీ కథ మొత్తం ఆ పాత్రతోనే నడుస్తోందని స్క్రిప్ట్ చదువుతున్న కొద్దీ అర్థం అయ్యింది. అయితే టెలివిజన్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ఫ్యామిలీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా చేయాలా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ చాలెంజ్గా తీసుకుని చేశాను. అవి నచ్చి ఈ సినిమా చేశా! కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజయ్గారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. మన ఊర్లో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం ఈడ్లు (చదివింపులు) వేస్తాం. జయమ్మకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే జయమ్మ ఎవరికైతే ఈడ్లు వేసిందో వారందరూ తిరిగి వేయాలి. కానీ జయమ్మ ఈడ్లు తీసుకున్నవారికీ కొన్ని సమస్యలు ఉంటాయి. మరి.. జయమ్మ సమస్య ఎలా తీరింది? అన్నదే ఈ చిత్రకథ. ఎవరూ నిరుత్సాహపడరు సుమ బాగా యాక్ట్ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యాక అందరూ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజయ్ రాసిన స్టోరీ ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేçస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ కోసం చాలా ప్రాక్టీస్ చేశాను. ఈ జయమ్మ పంచాయితీ హిట్ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం రెండు కథలు ఉన్నాయి. రోషన్ లాంచ్ ఈ ఏడాదే.. నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్న సమయంలో చాలా బిజీగా ఉండి వరుసగా మూడు రోజులు నేను తనకు కనిపించలేదు. ఆ సమయంలో ‘నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..’ అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. నా కొడుకు రోషన్కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్ చేస్తాం. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో శ్రీకాకుళంలోని పాలకొండ, చెన్నైపేట, అక్కడి అటవీ ప్రాంతం.. ఈ లొకేషన్స్ను ఎవరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా.. ఈ లొకేషన్స్లోకి యూనిట్ వెళ్లడం, సామాగ్రిని తీసుకుని వెళ్లడం కష్టమని భావించి ఎవరూ ప్రయత్నించలేదేమో కానీ ఈ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. మా ‘జయమ్మ పంచాయితీ’ సినిమా సెకండాఫ్లోని కొన్ని సీన్ల కోసం ట్రెక్కింగ్ చేసి మరీ ఆ లొకేషన్స్కు వెళ్లాం. అక్కడ కొన్ని జలపాతాలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎంత అందం ఉందో! -
‘జయమ్మ పంచాయితీ’ట్రైలర్ రివ్యూ
‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ అంటుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్బాబు సోషల్ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్ని కట్ చేశారు మేకర్స్. ట్రైలర్లో ఏముందంటే.. పిల్ల ఫంక్షన్ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. (చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ) కామెడీ డ్రామాతో పాటు ఎమోషనల్గా ‘జయమ్మ పంచాయితీ’ మూవీ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ తన సహజ నటనతో ఆదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘గుండాలు తొక్కిన గండం గట్టేకినట్టే ఉంది’.‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదించారు. -
సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ
బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో బిజీ అయిపోయింది సుమ. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (చదవండి: హాలీడే మూడ్లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్) తన చేతిపై ఉన్న పంచబొట్టు సీక్రెట్ని కూడా రిలీల్ చేశారు. చేతిపై ‘వెంకన్న’అని పచ్చబొట్టు వేయించుకున్నారు సుమ. ఆ పేరు వెనక ఉన్న సీక్రెట్ ఏంటని అడిగితే.. సినిమా చూస్తే తెలుస్తుందని చెప్పారు. సెకండాఫ్లో ఆ పేరు ఎందుకు వేయించుకున్నానో అందరికి తెలుస్తుందని సుమ చెప్పుకొచ్చారు. ఇక రాజీవ్ కనకాలతో సినిమా చేసే అవకాశం ఉందా అని అడగ్గా.. మంచి కథలు దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. -
యాంకర్ సుమ కనకాల బ్యూటీఫుల్ ఫోటోలు
-
విడాకులపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందించారు. మే19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది సుమ. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్పై స్పందించింది. 'మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్లారు అన్న వార్తలు నిజమేనా అని యాంకర్ అని ప్రశ్నించగా.. రాజీవ్తో నాకు పెళ్లయి 23ఏళ్లు అవుతుంది. ఈ 23ఏళ్లలో మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇలా రూమర్స్ వచ్చినప్పుడుల్లా మా పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా పుకార్లకు కొంతవరకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమే. సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. వీటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చింది. -
‘జయమ్మ పంచాయతీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్గా ఈ స్టార్ హీరోలు
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్ర బృందం. రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో గ్రాండ్గా నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలైన నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని వస్తున్నారు. జయమ్మ పంచాయి ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు మేకర్స్. Get ready for the Grand Pre release event of #JayammaPanchayathi. Chief guests King @iamnagarjuna & Natural 🌟 @NameisNani 📍Daspalla convention ⏰Tomorrow 6PM onwards#JayammaPanchayathiOnMay6th@ItsSumaKanakala @VijayKalivarapu @vennelacreation @adityamusic @shreyasgroup pic.twitter.com/iTBPj5aYsk — Vennela Creations (@vennelacreation) April 29, 2022 -
యాంకర్ సుమపై ఆ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Vijay Kumar Kalivarapu Comments On Suma Kanakala: ‘‘జయమ్మ పంచాయితీ’లో జయమ్మ పాత్రలో రమ్యకృష్ణగారి లాంటి నటి అయితే బాగుంటుందనుకున్నాను. అయితే నాకు తెలిసినవారు సుమగారి పేరును సజెస్ట్ చేయడంతో ఆమెకి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పారు. కానీ ఆమె నటనపై సందేహం కలిగింది. టెస్ట్ షూట్ చేశాక నమ్మకం వచ్చింది’’ అన్నారు విజయ్ కుమార్ కలివరపు. యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పని చేయాలనుకున్నాను. అయితే అది అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి చాలా సమయం పట్టింది. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది రాసుకున్న కథే ‘జయమ్మ పంచాయితీ’. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటి? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించలేదు. లొకేషన్లలో సింక్ సౌండ్ వాడాం. కీరవాణిగారు మా చిత్రానికి సంగీతం అందించడం సినిమా విజయంపై నాకు మరింత నమ్మకాన్నిచ్చింది’’ అన్నారు. చదవండి: రాజీవ్తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ లీడ్లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం మంగళవారం హనుమకొండలో పర్యటించింది. ముందుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో జయమ్మ పంచాయితీ విజయం ఖాయమైందన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యోంలో ఈ మూవీని రూపొందించామని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మా సినిమా బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషించానని, చదివింపుల చుట్టూ ఈ కథ ఉంటుందని చెప్పారు. మనిషికి మనిషి ఎలా సహాయంగా నిలబడాలో ఈ చిత్రం తెలుపుతుందన్నారు. కాగా ఈ సమావేశంలో సుమతో పాటు మిగతా నటీనటులు శాలిని, భవన్, దినేశ్ కుమార్, త్రినాథ్లు పాల్గొన్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. -
రాజీవ్తో విబేధాలపై స్పందించిన యాంకర్ సుమ
నవ్వుల రాణి, మాటల మహారాణి సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్గా, నటిగా, సింగర్గా ఇలా తనలోని ఎన్నో టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి, అలరిస్తూనే ఉందావిడ. హీరోహీరోయిన్లకన్నా ఎక్కువ బిజీగా ఉండే ఈ స్టార్ మహిళ తాజాగా ఓ షోకి హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తనకు చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఓ మంచి సినిమా చేద్దామని ఇంతకాలం ఆగినట్లు తెలిపింది. అలా చివరకు జయమ్మ పంచాయితీ చేస్తున్నట్లు తెలిపింది. తన పూర్తిపేరు పల్లెశెన పాచిమిట్టిన సుమ అని పేర్కొంది. తెలుగు సినిమాల్లో పంచాయితీ పెద్దగా నటించిన ఐదుగురు హీరోల పేర్లు చెప్పమనగానే సుమ తడుముకోకుండా రజనీకాంత్, మోహన్బాబు, చిరంజీవి, బాలకృష్ణ, సంపూర్ణేశ్బాబు అని టపీమని చెప్పింది. తన కొడుకు గురించి మాట్లాడుతూ.. వాడు చిన్నప్పటి నుంచే హీరోలా మాట్లాడేవాడని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక రాజీవ్, సుమ విడిపోయారంటూ గతంలో వచ్చిన వార్తలపై స్పందించింది. రాజీవ్కు, తనకు ఇద్దరి మధ్యలో గొడవలు జరిగిన విషయం నిజమేనని, ఈ 23 ఏళ్ల కాలంలో ఎన్నోసార్లు గొడపడ్డామని తెలిపింది. కానీ భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం సులువే కానీ తల్లిదండ్రులుగా డివోర్స్ తీసుకోవడం మాత్రం చాలా కష్టం అని భావోద్వేగానికి లోనైంది సుమ. కాగా సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయితీ మే 6న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్ బద్రి భామపై చీటింగ్ కేసు, బికినీ ఫొటోలు వైరల్ -
హృదయాలను హత్తుకునేలా సుమ ‘గొలుసు కట్టు గోసలు’ పాట
ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. (చదవండి: సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్బాస్ గంగవ్వ..) ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గొలుసు కట్టు గోసలు’ లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ‘కలిసి బతికే కాలమేమాయే నేడే..పగటి వేళ పీడ కలలాయే, అలసి పోని ఆశలేమాయే అయ్యో... గొలుసు కట్టు గోసలైపోయే’ అంటూ చాలా ఎమోషనల్గా సాగే పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సినిమాలో సుమ దయనీయ పరిస్థితిని ఈ పాట వివరిస్తుంది. ఈ పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించమే కాకుండా.. హరిహరన్తో కలిసి ఆలపించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Jayamma Panchayathi : బూతులు తిట్టిన యాంకర్ సుమ!
బుల్లితెర యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరక్కెకిన ఈసినిమాలో సుమ జయమ్మ పాత్రలో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె డైలాగ్ డెలీవరీ ఆకట్టుకుంటుంది. అయితే తొలినుంచి ఫ్యామిలీ ఆడియెన్స్కు దగ్గరైన సుమ ట్రైలర్ చివర్లో మాత్రం బూతు డైలాగ్ చెప్పడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కావడంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మించారు. మే6న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్పైకి రాకముందే రోషన్ తన రెండో సినిమాను లైన్లో పెట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్లో పెట్టాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
యాంకర్ సుమ కొడుకు ఇలా మారిపోయాడేంటి?
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తమ తనయుడి కెరీర్ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రోషన్ ఫోటోలు నెట్టింట్ వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉండే సుమ.. రోషన్ బర్త్డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తమ కుమారుడికి బర్త్డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
జయమ్మ పంచాయితీ: ఓ రేంజ్లో పారితోషికం తీసుకుంటున్న సుమ!
యాంకర్ సుమ. ఈమె హోస్టింగ్కు సాధారణ జనాలే కాదు సెలబ్రిటీలు సైతం జై కొడుతుంటారు. వరుస షోలు చేస్తూ బుల్లితెర మహారాణిగా పేరు తెచ్చుకున్న సుమ వీలు చిక్కినప్పుడల్లా కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఈసారి సహాయక పాత్రల్లో కాకుండా ఏకంగా లీడ్ రోల్లో నటించింది సుమ. దీనికి 'జయమ్మ పంచాయితీ' అని టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్ నిర్మించారు. ఈ సినిమాకుగానూ సుమ ఓ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుందట! ఒకరోజు హోస్టింగ్కు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా తీసుకునే సుమ ఇప్పుడీ సినిమా కోసం ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందని టాక్. తనకున్న క్రేజ్ను బట్టి అంత మొత్తం ఇవ్వడానికి కూడా వెనుకాడట్లేదట నిర్మాతలు. ఇప్పటికే సుమకున్న పాపులారిటీతో సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడింది. గతంలో రిలీజైన టీజర్ కూడా వినోదాత్మకంగా ఉండటంతో మూవీ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి చాలాకాలానికి వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న సుమ 'జయమ్మ పంచాయితీ'తో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి! -
సుమ 'జయమ్మ' లిరికల్ వీడియో సాంగ్.. వచ్చేసిందిగా
Suma Kanakala Jayamma Song Lyrical Video Released By SS Rajamouli: బుల్లితెర యాంకర్గా ఎనలేని పేరు ప్రఖ్యాతి గడించింది సుమ కనకాల. స్మాల్ స్క్రీన్పై వ్యాఖ్యతగా రాణిస్తూనే తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాకు విజయ్ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి సాంగ్ అయిన తిప్పగలనా.. చూపులు నీ నుంచే పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. రామాంజనేయులు రాసిన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ను విడుదల చేశారు. 'జయమ్మ పంచాయితీ' చిత్రంలోని జయమ్మ లిరికల్ సాంగ్ వీడియోను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' అంటూ సాగే ఈ సాంగ్లో జయమ్మ పాత్ర జీవనశైలి, స్వభావం ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ ఆలపించారు. అక్కడక్కడా పాట మధ్యలో సుమ కనకాల కూడా తన గాత్రం అందించింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలాగ్ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులముందుకు వచ్చి సందడి చేయనుంది 'జయమ్మ పంచాయితీ'. జయమ్మ, చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ! Happy to Launch #JayammaJayamma song from #JayammaPanchayathi ▶️https://t.co/esGUewjy0R Best wishes to @ItsSumaKanakala & Team @mmkeeravaani @srikrisin @ramjowrites @VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic — rajamouli ss (@ssrajamouli) January 16, 2022 ఇదీ చదవండి: సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ -
ఆ సీన్లో సాయి పల్లవిని చూసి నటించడం మర్చిపోయా: నాని
నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ రాయల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వేదికగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వేడుకు హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి, కృతిశెట్టిలతో ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించిన సుమపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టేజ్పై నాని మాట్లాడుతూ.. ‘డైరెక్టర్లు, నిర్మాతలు హీరోల కాల్షిట్ కోసం ఎదురు చూస్తారు. కానీ హీరోలు మాత్రం ఒకరి డేట్స్ కోసం చూస్తారు. ఆవిడే సుమగారు. ప్రీరిలీజ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు ఏ మూవీ ఈవెంట్ అయిన సుమ డేట్స్ చూసుకుని ప్లాన్ చేస్తాం’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు నాని. దీంతో సుమ నవ్వుతూ నానికి దండం పెడుతూ థ్యాంక్స్ చేప్పింది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి గురించి చెబుతూ.. ‘ఈ సినిమాలోని ఓ సీన్లో పల్లవి డాన్స్ చేస్తుంటే.. నేను జనంలో నుంచి ఆశ్చర్యంగా చూస్తుండాలి. ఆమె డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను.. నటించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నిజంగానే తన డ్యాన్స్ చూసి అంతగా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయాను’ అంఊట చెప్పుకొచ్చాడు. -
యాంకర్ సుమ జయమ్మ పంచాయితి టీజర్ లాంచ్ ఫోటోలు
-
సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ: రానా దగ్గుబాటి
‘‘సుమగారు ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం పెద్ద హిట్ కావాలి. ఇలానే సుమగారు సినిమాలు, షోలు చేస్తూ ఇతర భాషల్లో కూడా రాణించాలి’’ అన్నారు రానా. ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్ను ఆదివారం రానా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్న కథా చిత్రం. ఇందులో జయమ్మ కథతో పాటు మరికొన్ని కథలూ ఉన్నాయి. వ్యక్తిత్వం పరంగా నేను వేరు.. జయమ్మ వేరు. అయితే ఇక నేను కూడా జయమ్మలానే ఉండాలనుకుంటున్నాను. ఈ సినిమాకు 18 రోజులు పని చేయాలనుకున్నాను.. 40 రోజులు పట్టింది. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నాను. ఈ సినిమాతో నన్ను యాంకర్గా ప్రేక్షకులు మర్చిపోతారేమోనని రానా అంటున్నారు. కానీ అది (యాంకరింగ్) అదే.. ఇది (సినిమా) ఇదే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కీరవాణిగారు ఒక్క ఫోన్ కాల్తో ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఆయనకు థ్యాంక్స్. ఒక ‘బాహుబలి’... ఒక ‘ఆర్ఆర్ఆర్’.. ఒక ‘జయమ్మ పంచాయితీ’ (సరదాగా)’’ అని సుమ పేర్కొంది. ఇక డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘సంకల్పం ధృడంగా ఉంటే కాలమే ముందుకు నడిపిస్తుందంటారు. సుమగారిని నాకు ఆ విధే పరిచయం చేసింది. ఈ సినిమా ఆమె వల్లే జరుగుతోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తర్వాత సుమగారిని జయమ్మ అనే పిలుస్తారు’’ అన్నారు. -
యాంకర్ సుమకు హీరో నాని సాయం.. సాంగ్ అదిరిందిగా!
బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మూవీలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ అంటూ సాగే ఈ పాటకు రామాంజనేయులు లిరిక్స్ అందించగా, . పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించాడు. -
అయ్యో సుమ కష్టాలు చూశారా! నా వల్ల కాదంటున్న యాంకర్
Anchor Suma Kanakala Shares Her GYM Video: చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. విజయ్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ మళ్లీ వెండితెర రీఎంట్రీ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. చదవండి: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సుమ ఫటినెస్పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా జిమ్లో వర్కౌట్స్ చేస్తోంది. అంతేగాక ఇందుకోసం తను స్పెషల్ ట్రైనర్ని కూడా నియమించుకుంది. తాజాగా జిమ్లో చెమటలు చిందిస్తోన్న తన ఓ వీడియోను సుమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత నొప్పిగా ఉన్నాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అంటూ సుమ రాసుకొచ్చింది. చదవండి: ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన బామ్మ, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా ఎప్పుడు లేనిది సుమ ఇలా జిమ్లో కష్టపడటం చూస్తుంటే అందరికి కాస్తా కొత్తగా ఉంది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక సుమను ఇలా చూసి నెటిజన్లు, అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఓ వైపు టెలివిజన్ షోలు, మరోవైపు సినిమా ఆడియో పంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో క్షణం తీరిగా లేకుండా ఉన్న సుమ ఇలా జిమ్లో కూడా కష్టపడుతుంది’ అంటూ పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
యాంకర్ సుమ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ఫస్ట్లుక్ అదిరిందిగా!
Suma Kanakala: చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ని మెగా పవర్స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘జయమ్మ పంచాయితీ’(Jayamma Panchayathi)అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్లుక్ కూడా చాలా వెరైటీగా ఉంది. విభిన్న అంశాలతో కూడిన పోస్టర్లో గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించారు. పోస్టర్ని బట్టి చూస్తే, సినిమాలో సుమ ఓ పల్లెటూరిపెద్ద పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి ఇంప్రెషన్ తెచ్చింది.. 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది సుమ. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ గా సుమ సినిమా రాబోతుంది. -
యాంకర్ సుమ చేతిపై పచ్చబొట్టు!
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వాక్చాతుర్యంతో, కామెడీ పంచులతో ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలదీ లేడీ యాంకర్. ఆమె యాంకర్గా కెరీర్ ఆరంభించడాని కంటే ముందు నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీరియళ్లు, సినిమాల్లో నటించింది. తర్వాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని యాంకర్గా సెటిలైంది. అయితే రెండు, మూడు రోజులుగా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై సుమ కూడా ఇంతమంది అడుగుతున్నారంటే చేస్తే పోలే.. అని క్లూ వదిలింది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సుమ. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టర్ వదిలింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ ఆరున రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ పోస్టర్లో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం మాత్రం చూపించలేదు. ఆమె చేతిపై వెంకన్న అనే పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లుగా చూపించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియలాంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే! View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
సినిమాల్లోకి సుమ రీఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన యాంకర్
Anchor Suma Re-Entry To Movie Soon She Gave Clarity: యాంకర్ సుమ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు కూడా ఆమె బాగా సుపరిచితురాలు. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్లో తనకు సాటి లేరు ఎవరూ అనే విధంగా ముందుకు సాగుతున్నారు. తన మాటలు, పంచ్లు, కామెడీ టచ్తో యాంకర్గా టాలీవుడ్లో ఆమె చక్రం తిప్పుతున్నారు. యాంకర్లు ఎంతమంది ఉన్నా సినిమా కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్స్ అంటే యాంకర్గా సుమ ఉండాల్సిందే అనేలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె. చదవండి: ఎవడు బ్రో నీకు చెప్పింది.. ఓ వెబ్సైట్పై రానా అసహనం ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్స్గా రాణిస్తున్న మేల్, ఫీమేల్ యాంకర్స్ అంతా వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. శ్రీముఖి, అనసూయ, ప్రదీప్, రవి, రష్మీ, సుధీర్, వర్షిణీతో పాటు తదితరులు సినిమాల్లో సహా నటీనటులుగా కనిపిస్తున్నారు. కానీ సుమ మాత్రం యాంకరింగ్తోనే ఫుల్ బిజీగా ఉంటున్నారు. తను లీడ్రోల్లో ‘కల్యాణ ప్రాప్తిరస్తూ’ అనే మూవీలో నటించిన సుమ ఆ తర్వాత మలయాళం సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్ పాత్ర పోషించిన సుమ సహా నటిగా అప్పడప్పుడు మెరిసారు. ఇక చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్గా కనిపించారు. చదవండి: హీరో బాలకృష్ణకు సర్జరీ అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు. ఈ క్రమంలో సుమ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వెండితెర రీఎంట్రీపై క్లారిటీ వచ్చింది. దీనిపై సుమ ఓ వీడియో ద్వారా తనదైన శైలిలో స్పష్టత ఇచ్చారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ‘ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే’ అంటూ సుమ చెప్పుకొచ్చారు. ఈ వీడియో పీఆర్ఓ దుద్ది శ్రీను తన ట్విటర్లో పంచుకున్నాడు. మరి సుమ ఎలాంటి పాత్రతో రీఎంట్రీ ఇవ్వనుందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎప్పుడూ తన యాంకరింగ్ సరికొత్త ఉండాలనుకునే సుమ సినిమా విషయంలో ఏమాత్రం తగ్గదని, తను ఓ మంచి పాత్రతోనే ఫ్యాన్స్ అలరిస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. Anchor @ItsSumaKanakala into Cinemas 🤔🎬 Idhi Nijame Antara ? 🤷♂️ More Details Loading S👀N! #SUMAinCINEMA pic.twitter.com/LY6kcNClJr — Duddi Sreenu (@PRDuddiSreenu) November 2, 2021 -
జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ
Anchor Suma Reveals About The Secrets She Hide From Long Time: యాంకర్ సుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సుమ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలాకాలంగా దాచిపెట్టిన ఒక విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. చదవండి: 'గుండె తరుక్కుపోతుంది..సమంత ఎలా భరిస్తుందో' 'చాలా ఏళ్ల నుంచి ఒక విషయం దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఇకపై దాన్ని దాచాలనుకోవడం లేదు. నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ప్రాబ్లమ్తో బాధపడుతున్నా. అంటే ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా చుట్టుపక్కల వ్యాపిస్తుంది. అంటే చిన్న గాయం కూడా పెద్దదిగా చూపిస్తుందనమాట. దీన్ని పోగొట్టుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేసి చూశాను. కానీ ఫలితం లేదు. ఇది నా శరీరంలో భాగమైపోయిందని అర్థమైంది.చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ గతంలో ఈ ప్రొఫెషనలిజంలోకి వచ్చినప్పడు మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటివి తెలియక జరగాల్సిన డ్యామెజ్ జరిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. సాదారణంగా మన బాడీలో ఏదైనా మనకు నచ్చకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని దాచిపెడుతూ వస్తాం. కానీ అది మన శరీరంలోనే ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని అంగీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలం' అంటూ వీడియోను షేర్ చేసింది. చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ -
‘లవ్స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
సుమతో విడిగా ఉన్న మాట నిజమే : రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Clashes with Suma: టాలీవుడ్ బెస్ట్ కపుల్స్లో సుమ-రాజీవ్ కనకాల కూడా ఒకరు. ఓవైపు యాంకరింగ్లో మకుటం లేని మహారాణిలా సుమ చెలామణి అవుతుంటే, నటుడిగా రాజీవ్ కనకాల తమ కెరియర్లో దూసుకుపోతున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోనే ఉంటూ ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉండటం ఈ రూమర్స్కు మరింత బలం చేకూర్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజీవ్ కనకాల.. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. 'నిజంగానే కొన్నిరోజులు సుమతో విడిగా ఉండాల్సి వచ్చింది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న దేవదాస్ కనకాల ఒక్కరే మణికొండలోని సొంతింట్లో ఉండేవారు. నాన్నను మా ఫ్లాట్కు తీసుకువద్దాం అనుకుంటే ఆయన బుక్ లైబ్రరీ చాలా పెద్దగా ఉండేది. దీంతో అది మా ఫ్లాట్లోకి షిఫ్ట్ చేయడం కష్టమయ్యింది. దీంతో నాన్నతో పాటు నేను మణికొండలో ఉండిపోయాను. అంతే తప్పా సుమతో విడిపోయి కాదు. మేమిద్దరం వేరేవేరు ఇళ్లలో ఉండటంతో సుమ-రాజీవ్ కనకాల విడిపోయారు. త్వరలోనే విడాకులు తీసుకుంటారు అంటూ ఏవేవో వార్తలు రాశారు. అందులో ఏమాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు' అంటూ రాజీవ్ పేర్కొన్నాడు. ఇటీవలె నారప్ప సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. -
లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే..
యాంకర్ సుమ..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతుంది. ఆడియో ఫంక్షన్, ఈవెంట్ సహా పలు టీవీ షోలలో యాంకర్గా రెండు చేతులా సంపాదిస్తుంది సుమ. అయితే కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా పడింది. దీంతో షూటింగులు నిలిచిపోయి, పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే సుమ మాత్రం లాక్డౌన్ సమయంలోనూ బాగానే సంపాదిస్తుంది. ఈ మధ్య కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవమరిస్తున్న సుమ..వాటిని బాగానే ప్రమోట్ చేస్తుంది. రీసెంట్గా ఇడ్లీ డే అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే లాగానే ఇడ్లీ డే కూడా ఉందంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది. ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచివంటూనే ఓ బ్రాండ్ను ప్రమోట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా సుమ ప్రమోట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కొందరు సెటైర్లు వేస్తున్నారు. డైరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ వీడియో అని చెప్పకుండా, ఇలా ఇడ్లీ డే అంటూ ఎందుకు చెప్పడం అంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తుంది నువ్వే సుమక్కా అని పేర్కొంటున్నారు. చదవండి : ఆ నటి పరువు తీసేసిన యాంకర్ సుమ.. షోలో ఏం చేసిందంటే! బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
ఆ నటి పరువు తీసేసిన యాంకర్ సుమ.. షోలో ఏం చేసిందంటే!
సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్గా సుమ ఉండాల్సిందే. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా ఓ సీరియల్ నటి చేసిన పనిని షేర్ చేస్తూ..ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇటీవలె సీరియల్ ఆర్టిస్టులు సుహాసిని, వైష్ణవి, తేజస్విని, మోనిష్ తాను హోస్ట్ చేసిన షోకు వచ్చారని, ఈ సందర్భంగా మెహిందీ టాస్క్ ఇచ్చినట్లు సుమ తెలిపింది. అయితే టాస్క్లో భాగంగా నటి తేజస్విని తన చేతిపై గడ్డి తింటున్న ఆవు అంటూ ఓ డిజైన్ వేసిందని, ఇది ఏ కోశాన కూడా అలా కనిపించడం లేదంటూ నటి పరువు తీసేసింది. రియల్ మెహిందీ కావడంతో ఇంకా పోవడం లేదని, ఇది ఎప్పుడు పోతుంది తేజూ అంటూ సుమ ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక నటి తేజూ కూడా అక్కా.. అంటూ ఫన్నీ ఎమోజీని కామెంట్ రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా అది ఆవులా అస్సలు లేదని ఫన్నీగా బదులిస్తున్నారు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) చదవండి : ఒక్క వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్ -
భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. టీవీ ఉన్న ప్రతి ఇంటివారికి ఆమె చుట్టమే. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెరపై మకుటం లేని మహారాణిలా ఏలుతోంది. ఎలాంటి షో అయినా, ప్రోగ్రామ్ అయినా సుమ ఉండే చాలు హిట్టయినట్లే. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకుంది సుమ. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ యాంకరమ్మ. ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటుంది. ఇక కరోనా లాక్డౌన్ వల్ల మరింత ఫ్రీ దొరకడంతో సోషల్ మీడియాలో దూకుడు పెంచేసింది. కరోనా భయంలో అల్లాడుతున్న ప్రజలకు తన వీడియోల ద్వారా ధైర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే పలు వీడియో ద్వారా కరోనా జాగ్రత్తలు చెప్పిన సుమ.. తాజాగా తన భర్త రాజీవ్ కనకాల డైలాగ్ చెప్పి ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసింది. నితిన్ హీరోగా నటించిన ‘సై’సినిమాలో కోచ్గా రగ్బీ కోచ్గా రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్లో నితిన్ టీమ్ ఓడిపోతుంటే.. రాజీవ్ ఓ భారీ డైలాగ్ చెప్పి వారికి ధైర్యాన్ని అందిస్తాడు. తాజాగా ఆ డైలాగ్ని సుమ అచ్చు గుద్దినట్లు చెప్పింది. అందరు ధైర్యంగా ఉండాలి.. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే.. మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని’ అంటూ ఫ్యాన్స్కి సలహా ఇచ్చింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
యాంకర్ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో ఇలా..
-
యాంకర్ సుమ తల్లి వీడియో.. 70 ఏళ్ల వయసులో కూడా..
తెలుగు టెలివిజన్ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్ సుమ. బుల్లితెరపై తనదైన యాంకరింగ్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సటైరికల్ పంచ్లతో దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుండే సుమ సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటారు. కాగా తాజాగా సుమ ఫేస్బుక్లో తన తల్లికి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. 70 ఏళ్ల వయసులో కూడా ఆమె తల్లి వ్యాయామం, కసరత్తులు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఏ వయసులో అయినా మనస్సు ఎల్లప్పుడూ శక్తివంతంగా, ఉత్సతాహం ఉంచుకొవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. దీనికి మా అమ్మ గొప్ప ఉదహరణ. 79 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎనర్జీటిక్ ఉంటారు. దీనికి కారణం ఆమె ప్రతి రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్ను తీసుకుంటుంది. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఆమె అమ్మ ముద్దు పేరు బేబీ. ఈ వీడియో ప్రతి కుటుంబానికి, తమని తాము ఆరోగ్యంగా చూసుకునే ప్రతి గొప్ప తల్లులకు అంకితం’ అంటూ వీడియో షేర్ చేసింది. కాగా సుమ ఇటీవల లేగ దూడ మూతికి వెదురు బుట్టి కట్టిన వీడియో షేర్ చేసి నెటిజన్ల అగ్రహహానికి గురైన సంగతి తెలిసిందే. ఇందులో మీకు క్రూరత్వం కనిపించడం లేదా అంటూ తనపై చేసిన ట్రోల్స్పై సుమ స్పందించి ట్రోలర్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని అది తెలియదా అంటూ ట్రోలర్స్కు ఘూటుగా సమాధానం ఇచ్చారు. చదవండి: లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల మొదటిసారి సుమపై నెటిజన్ల ఫైర్.. కారణం ఏంటంటే! -
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
-
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
యాంకర్ సుమ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కెరీర్పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్కు గురయిన సంగతి తెలిసిందే. లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని ట్రోలర్స్కు బుదులిచ్చారు. అయినప్పటికీ కొందరు సుమపై నెగిటివి మాత్రం ఆగలేదు. తాజాగా తనపై వస్తోన్న ట్రోల్స్పై సుమ స్పందించింది. అక్కడి పాలేరు వద్దకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు. అలాగే ఆవును పెంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్ పెట్టారు. 'లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికొందని ఆశిస్తున్నాను.. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..' అంటూ ట్రోలర్స్కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. చదవండి : మొదటిసారి సుమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే! HBD Ajith : బైక్ మెకానిక్ నుంచి సూపర్ స్టార్గా.. -
యాంకర్ సుమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
మొదటిసారి సుమపై నెటిజన్ల ఫైర్.. కారణం ఏంటంటే!
సుమ కనకాల.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్గా సుమ ఉండాల్సిందే. తన మాటలతో చిన్న నుంచి పెద్దల వరకు అందరిని ఆకట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాటలతో షో ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరి అభిప్రాయం. ఇప్పటి వరకు తన కెరీర్పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్కు గురయ్యారు. సుమపై కొందరు ఫైర్ అవుతూ.. క్రూరత్వం కనిపించలేదా అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను సుమ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఆమెకు మూగజీవులు అంటే ఇంకా ఇష్టం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆవు, దూడతో సరదాగా గడిపిన వీడియోను పోస్టు చేసింది. ఇందులో రాముడు అంటూ ఆవు దూడను ప్రేమగా దగ్గరకు పిలుచుకుంటోంది. వీడియోలో దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి లాంటిది పెట్టారు. అయితే ఇది కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి క్రూరత్వం మీకు కనిపించడం లేదా అని సుమపై ఫైర్ అవుతున్నారు. కానీ మరో వర్గం వారు.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని సుమకు అండగా నిలుస్తున్నారు. సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? -
ఏ మూడ్ కావాలని అడుగుతున్న రష్మిక.. వదిలేయొద్దన్న లావణ్య
లక్ష్మీ మంచు చిన్నపిల్లల మారిపోయింది. మినీ మంచుస్ అంటూ మంచు ఫ్యామిలీలోని చిన్న పిల్లలతో కలిసి చిందులేసింది. హ్యాపీ బర్త్డే జెర్రీ అంటూ సోహైల్కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బిగ్బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ సండే వైబ్స్ అంటూ గ్రీన్ టీ తాగుతున్న ఫోటోని షేర్ చేసుకుంది హీరోయిన్ ఈషారెబ్బా హ్యాపీ సండే అంటూ బ్యూటిపుల్ ఫోటోలను షేర్ చేసుకుంది అనన్య నాగళ్ల బీచ్లో కారు తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ యాంకర్ సుమ కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. నెగెటివ్ వచ్చిందని అభిమానులతో పంచుకుంది. ఏ మూడ్ కావాలో చెప్పడంటున్న రష్మిక వీకెండ్ అని నన్ను వదిలేయకండంటూ ఓ బ్యూటిఫుల్కి షేర్ చేసుకుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by rahul_sipligunj_fan (@rahul_sipligunj_fan) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా?
సాక్షి, అరసవల్లి: టీవీ ఉన్న ప్రతి ఇంటి వారూ ఆమెకు చుట్టాలే. బుల్లితెర వీక్షకులంతా బంధువులే. ఆమె తెలీని తెలుగిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరను రెండు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణిలా ఏలుతున్న సుమ ఇటీవల అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తెలుగు మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇదంతా ఎప్పుడు మొదలైంది? 1991లో దూరదర్శన్ సీరియల్స్లో పలు పాత్రల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. 1995 తర్వాత జెమిని వంటి ప్రైవేటు చానల్స్లో అవకాశాలు పెరగడంతో బిజీ అయ్యాను. తెలుగు సీరియల్స్కు అప్పుడే క్రేజ్ పెరిగింది. మీరు మలయాళీ కదా. ఇంత అచ్చమైన తెలుగు ఎలా? నిజమే కానీ.. పట్టుదలతోనే తెలుగులో పట్టు సాధించాను. పుట్టింది పెరిగింది కేరళలో అయినప్పటికీ తెలుగు అనర్గళంగా వచ్చేసింది. అప్పట్లో డబ్బింగ్కు ఇబ్బంది పడిన నేను ఇప్పుడు వందలాది సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తున్నాను. రాజీవ్ కనకాలతో పరిచయం ఎలా? 1994లో ఓ సీరియల్ షూటింగ్లో నన్ను తొలిసారి రాజీవ్ చూశారు. ప్రపోజ్ కూడా చేసేశారు. అప్పటికే రాజీవ్ వాళ్ల నాన్నగారు దేవదాస్ కనకాలకు ఇండస్ట్రీలో పెద్ద పేరుంది. సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే 1995 తర్వాత సీరియల్స్ పెరిగాయి. వాళ్ల సొంత ప్రొడక్షన్లో మేఘమాల అనే సీరియల్లో నటించాను. అప్పుడే రాజీవ్ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. 1999లో అందరి ఆమోదంతో పెళ్లి జరిగింది. సినిమాలో హీరోయిన్గా రాణించలేకపోవడానికి కారణం? రాణించడం అని కాదు ఎందుకో కంఫర్ట్గా లేను. ఫ్రీడం కోల్పోయినట్లైంది. దాసరి నారా యణరావు గారి కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటించాను. అలాగే రెండు మలయాళ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించాను. కానీ ఎందుకో ఇష్టం లేక వదిలేశాను. తర్వాత సీరి యల్స్, సినిమాలో చిన్న పాత్రలు ఇప్పుడు అవి కూడా దాదాపుగా వదిలేశాను. పూర్తిగా యాంకరింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాను. 2006లో ‘అవాక్కయ్యారా...’అనే ప్రోగ్రాంతో యాంకరింగ్ ప్రారంభించాను. పిల్లలను కూడా మీ ప్రపంచంలోకి దించేస్తున్నారా? నేనేం దింపనక్కర్లేదు. వాళ్లే దిగిపోతున్నారు. మనం ప్రోత్సహించడం వరకే(నవ్వుతూ..). పాప మనస్విని పేరుతో ప్రొడక్షన్ హౌస్, అలాగే జుజిబి టీవీ షోల నిర్వహణ, అలాగే బాబు రోషన్ కార్తీక్ హీరోగా డెబ్యూ అవుతున్నాడు. దీంతో మా ఫ్యామిలీ అంతా సినీ కళామతల్లికి సేవలోనే తరిస్తున్నామన్నమాట. అసలు ఇంత అద్భుతంగా యాంకరింగ్ చేయడం మీకెలా సాధ్యమవుతోంది? యాంకరింగ్కు ముందు సినిమాల్లో, సీరియల్స్లో నటించాను. కానీ పెద్దగా కంఫర్ట్గా అనిపించలేదు. పైగా మా ఆయన రాజీవ్కు కూడా నేను సినిమాలు చేయడం పెద్దగా ఇష్టం లేదు (నవ్వుతూ).. అందుకే యాంకరింగ్ను నమ్ముకున్నాను. అయితే ఇంట్లో మా అమ్మకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. అదే ఇప్పుడు నాకు యాంకరింగ్ ప్రొఫెషన్కు ఉప యోగపడిందని భావిస్తాను. అందుకే నాకు మా అమ్మే గురువు. ఆదిత్యుని దర్శనంపై..? నిజంగా అదృష్టం. ఎప్పటి నుంచో అ నుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ ఆరోగ్యానికి సూర్యనమస్కారాలు చేయడంపై ప్రధాన అర్చకులు శంకరశర్మ వివరించారు. అలాగే శ్రీకూ ర్మం కూడా దర్శించుకున్నాను. జిల్లాలో పురాతన ఆలయాలపై సహాయ కమిషనర్ సూ ర్యప్రకాష్ గారు వివరాలిచ్చారు. నిజంగా శ్రీకాకుళం సుందరమైన ప్రాంతం. చదవండి: యాంకర్ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం -
యాంకర్ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం
చికాగో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేస్తూ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దాదాపు రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు కూడా తమ మాటల్లో, పాటల్లో, చేతల్లో ఎంతో సృజనాత్మకతను చూపారు. మూడు గంటల పాటు జరిగిన ‘సుమతో సందడి’ లో ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని యాంకర్ సుమ తనదైన శైలి, సమయస్ఫూర్తితో ఆద్యంతం రక్తికట్టించారు. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని సంస్థ సమన్వయకర్త ప్రణతి కలిగోట్ల అన్నారు. చివరలో సంస్థ తరపున, ప్రణతి కలిగోట్ల వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవి వేమూరి, రాధిక గరిమెళ్ళ, రాజేంద్ర రెడ్డి, దిలీప్ రాయలపూడి, రామకృష్ణ కొర్రపోలు, 13 ఏళ్ల వేమూరి రిషి కార్తీక్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్! జో బైడెన్కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్ -
నాట్యం చేస్తున్న ఈ యాంకర్ ఎవరో తెలుసా?
గలగలపారే సెలయేరు, కనకాల సుమ నోటి నుంచి వచ్చే మాటల ప్రవాహం రెండూ సేమ్ టు సేమ్. అలుపెరగకుండా ముందుకు సాగే ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. స్వస్థలం కేరళ అయినా ఇక్కడి అబ్బాయిని పెళ్లాడి తెలుగింటి అమ్మాయిగా మారిపోయిందావిడ. కేవలం యాంకరింగే కాకుండా నటన, నాట్యం, సంగీతంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. మొదట్లో అడపాదడపా సినిమాల్లో నటనతో ఆకట్టుకున్న సుమ తర్వాత యాంకరింగ్కే పెద్ద పీట వేస్తూ తెలుగునాట నెంబర్ 1 వ్యాఖ్యాతగా నిలిచింది. ఏళ్లు గడుస్తున్నా బుల్లితెర మీద సుమ స్థానం చెక్కు చెదరలేదు. పలు టీవీ షోలతో బిజీబిజీగా ఉన్న సుమ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) "అమ్మకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను నాట్యం చేస్తుంటే చూడాలని ఎంతో ఇష్టపడేది. నేను కూడా డ్యాన్స్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బద్ర అని నాకో డ్యాన్స్ టీచర్ ఉండేది. ఆమె నేతృత్వంలో స్కూల్ డేస్లో పర్ఫామ్ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది" అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు 'నువ్వు సూపర్ టాలెంటెడ్ అక్కా..' అని పొగుడుతున్నారు. మరికొందరేమో 'ఈ ఫొటోలో సుమను గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్? విజయ్తో సారా అలీఖాన్ సెల్ఫీ.. ఫొటో వైరల్ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు -
సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 9న హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత సింగర్ సునీత మరింత బిజీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఎక్కువ సమయాన్ని భర్త రామ్ వీరపనేని, కుటుంబ సభ్యులతో గడపడానికే కేటాయించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సునీత.. తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే ప్రీ వెడ్డింగ్, మెహందీ ఫంక్షన్కు సంబంధించిన వీడియోలను షేర్ చేసి తన ఆనందాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది. ఆ సమయంలో ఈ వీడియోలో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా సునీత మరో వీడియోను రిలీజ్ చేశారు. సునీత రామ్ వీరపనేని వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్ పేరుతో వచ్చిన ఈ వీడియోలో పెళ్లి రోజు ఆమె ఇంట్లో జరిగిన హడావిడి ఉంది. తన ఇద్దరి పిల్లలతో సునీత ఆడుకోవడం, రింగులు మార్చుకోవడం, మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్లో జరిగిన సందడిని చూపించారు. రేణు దేశాయ్తో పాటు ఆమె కుమార్తె ఆధ్య కూడా ఈ వీడియోలో కనిపించారు. ప్రముఖ యాంకర్ సుమ అయితే మెహందీ పెట్టుకొని మరీ డాన్స్ చేసింది. ఇక సునీత నవ్వులు ఈ వీడియోకి హైలెట్గా నిలిచిందని చెప్పొచ్చు. సునీత తన అఫీషియల్ యూ ట్యూబ్ ఛానెల్లోనే ఈ వీడియోను విడుదల చేసింది. -
సింగర్ సునీతకు సుమ కాస్ట్లీ గిఫ్ట్?
సాక్షి, హైదరాబాద్: తనకు సంప్రదాయాలు ఇష్టం, పెద్దలంటే గౌరవం అంటూ తరచు చెప్పుకునే ప్రముఖ గాయని సునీత తన పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వేళలో నీవు అంటూ తెలుగు సినీ నేపథ్య గాయనిగా అడుగుపెట్టిన ఆమె తన మృదు మధురమైన గానంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ ఎందరో నటీమణులకు గాత్ర దానం చేసిన మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నేను నేటి మహళను అని చాటి చెప్పారు. (ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్ ) వ్యాపార వేత్త రామ్ వీరపనేనితో తనకెంతో ఇష్ట దైవం శ్రీరాముని సన్నిధిలో(శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో) జనవరి 9న సరికొత్త జీవితానికి ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా సునీత, రామ్దంపతులకు అనేక ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్బంగా సునీతకు అత్యంత ఆత్మీయులైన ప్రముఖ యాంకర్లు ఝాన్సీ, సుమ సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ సుమ సునీతకు సుమ ఓ సర్ఫ్రైజ్ గిప్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఖరీదైన వజ్రాల నెక్లెస్ను తన ప్రియమైన ప్రాణ స్నేహితురాలికి సుమ కానుకగా ఇచ్చినట్లు సోషల్మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. (ఘనంగా ప్రముఖ సింగర్ సునీత వివాహ వేడుక ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సునీత ప్రీ వెడ్డింగ్.. హాజరైన రేణు దేశాయ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల సింగర్ సునీత కు వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అంతేగాక జనవరిలో రామ్ను వివాహం చేసుకుంటున్నట్లు సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో వీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటీనటులతో పాటు టాప్ సింగర్స్ హజరయ్యారు. (చదవండి: అతికొద్ది మంది సమక్షంలో సునీత పెళ్లి) కేవలం కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, యాంకర్ సుమ కనకాలలు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సునీత-రామ్ల ప్రీ వెడ్డింగ్కు హీరో నితిన్ హోస్ట్గా వ్వవహరించి.. కార్యక్రమానికి సంబంధించి అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నాడట. మరో విషయం ఏంటంటే సునీతకు కాబోయే భర్త రామ్కు నితిన్ కూడా అత్యంత సన్నిహితుడు కావడంలో దగ్గరుండి ఈ వేడుకను జరిపించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) -
కేటీఆర్పై సుమ ప్రశంసలు..
కొన్ని దశాబ్దాలుగా తన మాటలతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతూ అలరిస్తున్నారు సుమ కనకాల. యాంకరింగ్లో కొత్తదనాన్ని తీసుకొచ్చి నేడు స్టార్ యాంకర్గా నిలదొక్కుకున్నారు. సినిమాలు, షోలు, ఆడియో రిలీజ్లు ఇలా ఒక్కటేంటి అన్నిరంగాల్లోనూ తనదైన ముద్రను వేసిన సుమ ఇటీవల సుమక్క పేరుతో యూట్యూబ్ ఛానెల్ను కూడా ప్రారంభించారు. ఇక్కడ కూడా తన వాక్చాతుర్యంతో కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు. ఎప్పుడూ తన షోకు అతిథిగా వచ్చిన వారితో ఎంటర్టైన్ చేసే సుమ తాజాగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. చదవండి: నువ్వే నా బలం.. నా హ్యపీనెస్: సుమ ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్తో సంభాషిస్తున్న ఫోటోను షేర్చేశారు. ‘మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా నా షోలలో నాన్స్టాప్గా ఎదో ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను. కానీ నాయకత్వ హోదాలో మీరు మాట్లాడే విధానం వినడానికి ఎంతో విలువైనదిగా ఉంటుంది. నిబద్దత, మాట్లాడే విధానం అద్భుతం’ అంటూ కేటీఆర్ను పొగడ్తాలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా నెటిజన్లు మాత్రం సుమ ట్వీట్పై భిన్నంగా స్పందిస్తున్నారు. సుమను కలవడం కేటీఆర్ లక్కీ అని కొంత మంది అభిప్రాయపడుతుంటే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ తరపున క్యాంపెయినింగ్ చేయనున్నారా అని అడుగుతున్నారు. మరికొంత మంది ఎన్నికల ప్రచారం కోసం కలిశారా అని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. చదవండి: కేటీఆర్ మనసు దోచుకున్న బుడ్డోడు.. It was such a pleasure talking to you @KTRTRS , I am the one talking blah blah generally in my shows,but your leadership makes it worth listening . Declaring,commitment and delivering is your way of being. Superb pic.twitter.com/qf5XCpSfaY — Suma Kanakala (@ItsSumaKanakala) November 21, 2020 -
నువ్వే నా బలం.. నా హ్యపీనెస్: సుమ
సుమ కనకాల... ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు.. బుల్లితెరపై తన వాక్చాతుర్యంతో కొన్ని లక్షల మంది హృదయాలను దోచుకున్నారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ, ఎదుటి వారిపై పంచ్లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కేరాఫ్ అడ్రస్ సుమ.. సీరియల్స్, యాంకరింగ్, ఆడియో ఫంక్షన్స్, సినిమాలు.. ఇలా అన్నింటిలోనూ అందె వేసిన చేయి ఆమెది. యాంకరింగ్లో కొత్తదనాన్ని తీసుకొచ్చి నేడు స్టార్ యాంకర్గా నిలదొక్కుకున్నారు. నేటి తరం యాంకర్లకు ఆదర్శంగా నిలిస్తూ, బుల్లితెరపై రారాణిగా నిలిచారు. సుమ వచ్చిన ఏ షో అయినా సందడిగా మారాల్సిందే.. దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు అయిన రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేడు(శుక్రవారం) రాజీవ్ కనకాల పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానుల నుంచి రాజీవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన భర్త రాజీవ్కు సుమ ప్రత్యేక బర్త్డే విషెస్ తెలిపారు. సుమ తన భర్తను ప్రేమగా రాజా అని పిలుచుకుంటారు. ఈ క్రమంలో ‘నా ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం.. నా హ్యపీనెస్. నీతో జీవితాన్ని పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. నీతో ఉండే ప్రతి రోజు కొత్తగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. లవ్ యూ.’ అంటూ ట్వీట్ చేశారు. ఇక కేరళ కుట్టి అయిన సుమ రాజీవ్ కనకాలను 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు రోషన్, కుతూరు మనస్వీని ఉన్నారు. My dearest raja a very very very happy birthday to you . You are my strength and happiness, I am blessed to be with you , I look forward to everyday as a new day to be with you . Love uuuuuu , I am in oneness with you my dear #Rajeevkanakala pic.twitter.com/hqoWYfVjBq — Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2020 -
బిగ్బాస్: వైల్డ్కార్డు ఎంట్రీగా సుమ.. పంచులే పంచ్లు
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజస్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బిగ్ రియాల్టీ షోకి ఆదరణ తగ్గినప్పుడల్లా వైల్డ్కార్డు ఎంట్రీలను పంపి టీఆర్పీ రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బిగ్బాస్ నిర్వాహకులు. ఇలా ఇప్పటికే ముగ్గురు వైల్డ్కార్డు ఎంట్రీ ఇవ్వగా.. వారిలో కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ తక్కువ రోజులకే బయటకు వచ్చారు. మరో వైల్డ్కార్డు ఎంట్రీ అవినాష్ మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా హౌస్లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే షోని మరింత రసవత్తరంగా మార్చే పనిలో పడ్డారు బిగ్బాస్ నిర్వాహకులు. ఈ సారి ప్రముఖ యాంకర్ సుమ కనకాలను బిగ్బాస్లోకి వైల్డ్కార్డు ఎంట్రీ ద్వారా పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది స్టార్మా. ప్రోమోలో సుమ తన సూట్ కేసుతో ప్రత్యేక్షం అయ్యింది. (చదవండి : బిగ్బాస్: క్లాసిక్ లుక్ వెనుక బాస్ బ్యూటీ!) వైల్డ్కార్డ్ ఎంట్రీకి ఎలా ఒప్పుకున్నావ్ సుమా అని నాగార్జున అడగ్గా.. ‘ఏం చెయ్యాలి సర్.. పాండమిక్ చాలా మార్పులు తీసుకొచ్చింది.. అందుకే ఇంట్లోకి వచ్చాను’ సుమ చెప్పుకొచ్చారు. ఇక హౌస్మేట్స్ పాలిట నేను వైల్డ్కార్డు అవ్వబోతున్నానను అంటూ తనదైన శైలీలో చెప్పి గంతులేశారు. అలాగే తనదైన పంచులతో హౌస్మేట్స్తో పాటు నాగార్జునను ఓ ఆట ఆడుకుంది. ఇక సుమ వైల్డ్ కార్డు ఎంట్రీతో తనకు రానున్న ఐదు వారాలు ఫుల్ ఫన్ ఉంటుందని నాగ్ తెలిపారు. అంతేకాదు సుమను లోపలికి పంపిస్తున్నట్లు కూడా ప్రోమోలో చూపించారు. (చదవండి : సమంత శారీ, జ్యువెలరీ ఖరీదు ఎంతో తెలుసా) అయితే ఇదంతా నిజమా లేదా ఏమైనా ట్విస్ట్ ఉండనుందా అనేది తెలియరాలేదు. ప్రస్తుతం బిగ్బాస్ నాల్గో సీజన్లో తొమ్మిదవ వారం నడుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సగం రోజుల్నీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్ లోకి సుమ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే హౌస్లోకి మరో వైల్డ్కార్డు ఎంట్రీ ఉంటుందని కొద్దిరోజులుగా ఊహాగానాలు వచ్చినప్పటికీ.. యాంకర్ సుమ వస్తారని ఎవరూ ఊహించలేదు. నాల్గో వైల్డ్కార్డు ఎంట్రీగా సింగర్ మంగ్లీ వస్తుందని పుకార్లు వచ్చాయి కానీ.. సుమ ఎంట్రీతో అది ఒట్టి పుకారే అని తేలిపోయింది. అయితే సుమ ఎంట్రీని కూడా నమశక్యంగా లేదు. ఏదో బిగ్ట్విస్ట్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఒకవేళా కనుక సుమ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్’లోక ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్లో ఉంటుంది షో.. అని చెప్పవచ్చు. సుమ ఎంట్రీతో ప్రేక్షకులకు మరింత కిక్ అందనుంది. -
పండగవేళ సుమదీపం
-
రాజీవ్పై సుమ ఎమోషనల్ ట్వీట్.. వైరల్
తెలుగు టెలివిజన్ రంగంలో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు యాంకర్ సుమ. తన యాంకరింగ్ టాలెంట్తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దశాబ్ద కాలంగా తెరపై ఎన్నో సినీ కార్యక్రమాలను, ఈవెంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన భర్త రాజీవ్ కనకాల టాలీవుడ్లో పెద్ద నటుడే అయినప్పటికీ తన కంటే ఎక్కువ క్రేజ్ సుమ సొంతం చేసుకుందని చెప్పక తప్పదు. అంతేకాదు ఇండస్ట్రీలో మంచి జోడీగా కూడా వీరిద్దరికి గుర్తింపుఉంది. (షూటింగ్లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) అయితే ఈ మధ్య కాలంలో సుమ-రాజీవ్ వైవాహిక జీవింత గురించి పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. వారి వివాహ బంధంలో విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారని పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు రాజీవ్ నుంచి సుమ విడాకులు కూడా కోరిందని సోషల్ మీడియా కోడైకూసింది. ఈ వార్తలు టీ టౌన్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. అయినా కూడా ఈ జోడీ కనీసం స్పందించకపోవడంతో అంతా నిజమేఅని అనుకున్నారు. ఈ క్రమంలోనే సుమ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియా రాయుళ్ల ఊహాగానాలను పటాపంచల్ చేసింది. తమపై వస్తున్న వార్తలకు చెక్పెడుతూ.. సుమ తన ట్విటర్ ఖాతా ద్వారా రాజీవ్పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ సందేశం ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. రాజీవ్ కనకాలను ఆప్యాయంగా హత్తుకుని ఎమోషనల్గా భావాన్ని చూపించింది. ’నా ప్రియమైన రాజా.. మై లవ్.. ఎప్పటికైనా నువ్వే నా జీవితం, నువ్వే నా ఆనందం’ అంటూ తమ వైవాహిక జీవితం ఎంత బలంగా ఉందో చాటిచెప్పింది. అందమైన జంట అని కొందరు కామెంట్ పెడుతుండగా.. ఇంత అన్యోన్యమైన కపుల్ మధ్య అనవసరమైన రూపర్స్ ఆపండి అంటూ మరికొంతమంది రిప్లే ఇస్తున్నారు. భార్యాభర్తలు అన్నాక వారి మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ సోషల్ మీడియాలో పెద్దవి చేసి చూపించడం సరైనది కాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. My dearest raja , my ❤️ , oneness and happiness forever #Rajeevkanakala pic.twitter.com/rxSqffqulm — Suma Kanakala (@ItsSumaKanakala) September 14, 2020 -
షూటింగ్లు స్టార్ట్.. యాంకర్స్ సందడి
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల తర్వాత టీవీ షూటింగ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం.. సెట్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్లు జరుపుకోవాలని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. షూటింగ్లు ప్రారంభం కావడంతో యాంకర్లు తమ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో చాలా రోజుల తర్వాత సెట్లలో సందడి వాతావరణం నెలకొంది. తమ షూటింగ్కు సంబంధించిన అప్డేట్స్ను పలువురు యాంకర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రముఖ యాంకర్ సుమ.. ‘చాల రోజుల తర్వాత సెట్లోకి వచ్చాను. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. బాధ్యతగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అలాగే తను మేకప్ వేసుకుంటున్న ఓ చిన్నపాటి వీడియోను కూడా సుమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మరోవైపు నటి, యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ సెట్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. వీ ఆర్ బ్యాక్ అని తెలిపారు. అలాగే యాంకర్లు రవి, భానుశ్రీలు కూడా షూటింగ్ సెట్లో చేసిన సందడిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram Never thought that satti and ramesh will have to dress up like this . A post shared by Suma Kanakala (@kanakalasuma) on Jun 18, 2020 at 6:44am PDT -
బన్నీ సినిమాలో యాంకర్ సుమ!
బుల్లితెరపై యాంకర్గా దూసుకెళుతోన్న సుమ తొలిసారి పెద్దతెరపై కనిపించిన చిత్రం ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ (1996). దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా బుల్లితెర బిజీలో పెద్దతెరను పట్టించుకునే తీరిక సుమకు పెద్దగా దొరకడంలేదు. తాజాగా ‘పుష్ప’ సినిమాకి దర్శకుడు సుకుమార్ అడిగితే ‘యస్’ చెప్పేశారు. అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో బన్నీకి అక్కగా కనిపించనున్నారట సుమ. సుకుమార్ తన గత చిత్రం ‘రంగస్థలం’లో యాంకర్ అనసూయతో రంగమ్మత్త పాత్ర చేయించారు. ఆ పాత్ర ఓ హైలైట్గా నిలిచింది. మరి.. సుమ పాత్రను ఎలా డిజైన్ చేశారో తెరపై చూడాలి. -
యాంకర్ సుమ ఆడపడుచు మృతి
సాక్షి,హైదరాబాద్ : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మీ కనకాల మృతి చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో రాజీవ్ కనకాల, సుమ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె భర్త రచయిత పెద్ది రామారావు కాగా ఆమె తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాలకు శ్రీలక్ష్మీ ఏకైక కుమార్తె. ఆమె ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్లో నటింటి మంచి నటిగా గుర్తింపుపొందారు. కాగా రాజీవ్ కనకాల తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. (కనకాల.. చెరగని జ్ఞాపకంలా..) -
ఎంత శుభ్రంగా ఉంటే అంత ధీటుగా..
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరు 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని, ఎంత శుభ్రంగా ఉంటే కరోనాను అంత ధీటుగా ఎదుర్కోవచ్చునని ప్రముఖ యాంకర్ సుమ స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలపై తన వంతు బాధ్యతగా ఓ సందేశాన్ని పంపించారు. కరోనా వైరస్ గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదని, మనం చేయాల్సిందల్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడమేనన్నారు. వీలైనంత వరకు మాస్క్లు ధరించాలని, వేళ్లను ఎక్కువగా ముఖం మీద టచ్ చేయకుండా చూసుకోవాలన్నారు. ఒకవేళ దగ్గు, జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మన చుట్టు పక్కల వారు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా సలహా ఇవ్వాలన్నారు. ఎవరైనా కలిసినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలన్నారు. ఆలింగనాలు, షేక్ హ్యాండ్లకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా వైరస్ వ్యాప్తి చెందాలంటే మన చేతుల నుంచి మాత్రమే పాకుతుందని సాధ్యమైనంత వరకు చేతులను ముఖంమీద పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే కరోనా వైరస్ తరిమికొట్టవచ్చన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాను కూడా తీసుకుంటున్నట్లు శానిటైజర్లను చేతులకు రాసుకుంటున్న దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Hi guys, in alert of the recent pandemic #COVID19, I request you all to be precautious and responsible in being safe. Just a few cautionary steps can stand a long way in our safety and help breaking the chain.#StaySafe #BreakTheChain #coronavirus #CoronavirusOutbreak pic.twitter.com/6J7LCnRNXq — Suma Kanakala (@ItsSumaKanakala) March 16, 2020 -
జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ
-
ఎన్టీఆర్కు సుమ గ్రీన్ చాలెంజ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో ఎన్టీఆర్కు యాంకర్ సుమ కనకాల గ్రీన్ చాలెంజ్ విసిరారు. హరిత ఉద్యమంలో భాగంగా సినీనటి జయసుధ చేసిన సవాల్ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక, వేప, కదంబం మొక్కలు నాటిన ఆమె ఎన్టీఆర్తో పాటు నటి మంచులక్ష్మీ, బిగ్బాస్ సీజన్ 3 విజేత రాహుల్, బుల్లితెర వ్యాఖ్యాత ఓంకార్లకు గ్రీన్ చాలెంజ్ విసిరారు. కాగా, హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. అంతేకాకుండా వారు మరికొంత మందికి గ్రీన్ చాలెంజ్కు నామినేట్ చేశారు. (చదవండి: విజయ్ దేవరకొండకు గ్రీన్ చాలెంజ్) -
బిగ్బాస్: శ్రీముఖి కల నెరవేరబోతుంది
బిగ్బాస్ తెలుగు 3 సీజన్ వంద రోజులు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో అడుగుపెట్టిన సుమ పంచ్లు పేల్చుతూ నానా హడావుడి చేసింది. బిగ్బాస్.. గత ఎపిసోడ్లో మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచిన వరుణ్కు ఒక అభిమానితో కాల్ మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజామబాద్ నుంచి ఫోన్ చేసిన రవి.. ‘వితిక వెళ్లిన తర్వాత డల్ అయినట్టు అనిపిస్తుంది’ వరుణ్తో పేర్కొన్నాడు. దీనికి వరుణ్ సమాధానమిస్తూ ‘పెళ్లైన అయిదేళ్లలో ఇంత దగ్గరగా ఉన్నది లేదు. అందుకే కాస్త డల్ అయినా కావచ్చు’ అని తెలిపాడు. అనంతరం మిగతా ఇంటి సభ్యులకు కూడా వాళ్ల ఫ్యాన్స్ పంపిన మెసేజెస్ చదివి వినిపించారు. వీటిలో ముఖ్యంగా ఒకవైపు కంటెస్టెంట్లను పొగుడుతూనే మరోవైపు వారు చేసిన తప్పిదాలను వేలెత్తి చూపించారు. ‘టాస్క్ల్లో అలీ బెస్ట్ కంటెస్టెంట్, వెల్కమ్ టు ద ఫ్రూట్ క్లబ్’ అంటూ వచ్చిన మెసేజ్లను అలీ చదివి వినిపించాడు. శ్రీముఖికి వచ్చిన ట్వీట్స్లో ఆమె ‘కన్నింగ్ అని, టాస్క్ల్లో జెండర్ కార్డు వాడుతుంద’ని విమర్శించారు. మరొక నెటిజన్ మాత్రం ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని రాసి పంపించడంతో శ్రీముఖి సంతోషంగా ఫీల్ అయింది. తిట్టినా థ్యాంక్స్ చెప్పిన వరుణ్... బాబాకు రెండు రకాల ట్వీట్లు వచ్చి పడ్డాయి. ‘బిగ్బాస్ షోలో బాబా.. బెస్ట్ కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ కా బాప్’ అంటూ పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. అదేవిధంగా ‘ఊసరవెల్లి, బాబా మాస్కర్’ అంటూ వచ్చిన నెగెటివ్ ట్వీట్లను బాబా చదివి వినిపించాడు. ఇక ‘ఈ సీజన్లోనే వరస్ట్ కంటెస్టెంట్.. హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’ అని వచ్చిన మెసేజ్ చదివిన వరుణ్ ఆ ట్వీట్ చేసినవారికి చిరునవ్వుతోనే కృతజ్ఞతలు తెలిపాడు. ‘రాహుల్ చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడని, వరుణ్తో టాస్క్ ఆడిన విధానం బాగుంది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను రాహుల్ చదివి వినిపించాడు. రాహుల్ను నక్కతో పోల్చుతూ అగ్రెసివ్ అని తిట్టిపోసిన కామెంట్ను కూడా చదివాడు. అయితే ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకుంటానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు ప్రేక్షకుల ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చిన సుమతో కలిసి దీపావళి పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇంటి సభ్యులందరూ స్టెప్పులేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాహుల్, శ్రీముఖి కలిసి డాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. అనంతరం సుమ బిగ్బాస్ హౌస్ నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇంటి సభ్యుల జాతకాలు... ఇంటి సభ్యుల సందేహాలు తీర్చడానికి బిగ్బాస్ ఇంట్లోకి ఓ జ్యోతిష్యురాలిని పంపించారు. ఆమె హౌస్మేట్స్కు సందేహాల నివృత్తితోపాటు పలు సూచనలు చేసింది. ‘ఏదైనా మన మంచికే అనుకుంటూ చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి’ అని బాబా భాస్కర్కు సూచించింది. ‘మీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. త్వరలో మీ కల నెరవోరుబోతుంది’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అంటే, అది బిగ్బాస్ టైటిల్ అయుండొచ్చు అని రాములమ్మ అభిమానులు గంతులేస్తున్నారు. ఇక ‘మీకు ఉన్న సమస్య ముగియబోతుంది’ అని రాహుల్కు తెలిపింది. ‘ఆలోచనా పరిధి మార్చుకో’మని అలీ రెజాకు సలహా ఇచ్చింది. వరుణ్ను ‘ఇగోకు వెళ్లొద్దు’ అని సూచించింది. కాగా టాబ్లెట్ ఇవ్వమని రాహుల్ బిగ్బాస్ను అడిగాడు. అయితే వెరైటీగా ఫన్నీ లిరిక్స్తో పాట రూపంలో కోరడంతో అందరి మొహంలో నవ్వులు విరిశాయి. -
అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్బాస్.. రచ్చ రచ్చ!
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ 3 తెలుగు సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. 100 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్బాస్ షో సెంచరీ కొట్టింది. బిగ్బాస్ ఇంట్లోకి ఒక ప్రేక్షకురాలిగా వస్తున్నానంటూ అడుగుపెట్టిన సుమ ఇంటి విషయాలను రాబట్టడానికి ప్రయత్నించింది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి రాగానే ఇంటి సభ్యులతో బోలెడు కబుర్లను పంచుకుంది. బిగ్బాస్కే పంచ్లు విసురుతూ నానా హంగామా చేసింది. పనిలోపనిగా ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్ ఆడించింది. ఆ గేమ్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన వరుణ్ను విజేతగా ప్రకటించింది. అయితే.. సుమ ఇంట్లోకి రాగానే మొదటగా.. టపాకాయలు తెచ్చావా అని హౌస్మేట్స్ ప్రశ్నించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ తనవెంట ఏమీ తీసుకురాలేదని సుమ చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న బిగ్బాస్ దీపావళి పండగను జరుపుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకోసం వారికి టపాకాయలు అందించినట్టు కనిపిస్తోంది. దీంతో దొరికిందే చాన్స్ అన్నట్టుగా ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. వీరి అల్లరికి సుమ తోడవగా.. దీపావళి వేడుకలతో హౌస్ వెలుగులీనేలా ఉంది. ఇంటి సభ్యులు కాకర పువ్వొత్తులను చేతపట్టుకుని ఆనందంతో డాన్స్లు చేస్తున్నారు. ఇక ఈ సంబరాలను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే! . #Diwali celebration continues with @ItsSumaKanakala #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/0MuAV2HQ7D — STAR MAA (@StarMaa) October 29, 2019 -
బిగ్బాస్: వరుణ్ను విజేతగా ప్రకటించిన సుమ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్ సుమ అనుకున్నంత సందడీ చేశారు. బాగ్బాస్-3 లో గెస్ట్( ఆడియన్)గా ఎంటరైన సుమ నవ్వుల పువ్వుల దీపావళి తీసుకొచ్చారు. అందరూ ఊహించినట్టుగానే బిగ్బాస్-3లోని కంటెస్టెంట్లనే కాదు ప్రేక్షకులనూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించారు. బిగ్బాస్ సీజన్లోనే ఇంత బాగా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ మరొకటి లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బిగ్బాస్-3 సీజన్ను క్లుప్తంగా రివ్యూ చేసిన బిగ్బాస్ ఆ తరువాత హౌస్లోకి సుమను ప్రవేశపెట్టాడు. ఇహ అక్కడినుంచి మొదలైంది రచ్చ..రచ్చ రంబోలా.. రంగ్దే.. రంగ్దే...పాటతో ముసుగు వేసుకుని డాన్స్తో సుమ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే..కంటెస్టెంట్స్ అందరూ తమన్నా..తమన్నా అంటూ హల్ చల్ చేశారు. చివరికి ముసుగుతీసి తనెవరో రివీల్ చేశారు. ఆరంభం నుంచే సుమ తనదైన పవర్ పంచ్లతో మొదలెట్టేశారు. రాగానే మంచి నీళ్లు తాగుతారా అని అడిగిన శ్రీముఖితో.. వచ్చినవాళ్లందరి చేత నీళ్లు తాగించేస్తున్నావుగా అంటూ పంచ్ వేశారు. ఆ తరువాత ఇల్లంతా కలియతిరిగి... ఒక్కొక్కరి బెడ్ను, మేకప్ సామాన్లు పరిశీలించారు. ముఖ్యంగా రాహుల్ బెడ్ పక్కన ఏముందంటూ అల్లరి చేశారు. ఆ తరువాత లివింగ్ రూం, వంటగది, వాష్రూంలను పరిశీలించారు. బిగ్బాస్ -3 హౌస్లో ఏమేమి మిస్ అవుతున్నదీ అందరూ షేర్ చేసుకున్నారు. తరువాత హౌజ్లోకి వచ్చిన సుమ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసిపెట్టి, ఈ దీపావళిని మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరిన బిగ్బాస్.. దానికి సంబంధించిన సరుకు సరంజామా పంపించారు. మధ్నాహ్నం 2 గంటలకు శ్రీముఖి, బాబా భాస్కర్ కుకింగ్ పనిలో వుండగా.. రాహుల్తో సరదాగా పాట పాడించారు సుమ. ‘అదరా...నా గుండెలదరా..బొమ్మోలె ఉందిరా పోరీ..పాట పాడారు. అలాగే ‘ఏమైనదీ..ఏమో నాలో..కొత్తగా ఉంది నాలో’ అంటూ వరుణ్ కూడా చాలా హృద్యంగా.. ఫీల్తో ఆలపించాడు. తర్వాత సుమ తన సహజమైన గేమింగ్ షోను స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ప్రకారం పార్టిసిపెంట్స్ అందరూ హెడ్ఫోన్స్ పెట్టుకొంటారు. వాళ్ల చెవిలో.. బిగ్బాస్ మ్యూజిక్ ప్లే చేస్తుండగానే.. సుమ చెప్పే వాక్యాన్ని, సామెతను.. డైలాగ్ను లిప్ మూమెంట్ ద్వారా గుర్తించి.. ఆమె చెప్పిందో ఏంటో చెప్పాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనే అవకాశం శ్రీముఖికే దక్కింది. మొత్తం మూడు ప్రశ్నల్ని శ్రీముఖి అలవోకగా సమాధానం చెప్పేసింది. తనదైన శైలిలో గట్టిగట్టిగా అరుస్తూ చెప్పడంతో.. చెవుల్లోం,చి రక్తాలు కారుతున్నాయంటూ సుమ జోక్ చేశారు. 1. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి.. సింహాల మీద కాదు.. 2 చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు 3. బిగ్ బాస్గారూ మీ ఒకసారి మా యింటికి రావాలి.. ఈ డైలాగులను శ్రీముఖి అలవోకగా చెప్పి ఆకట్టుకున్నారు. ఇక, మీ ఆవిడంటే మీకు చాలా భయమా. ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడో తెలుసా.. ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోసేస్తా..డైలాగులు సుమ చెప్పగా.. వీటిని చెప్పడానికి బాబా పడినపాట్లు మామూలువి కావు. తరువాత వంతు వరుణ్ది. బుజ్జిగాడు.. బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు.. అన్న డైలాగుకు.. పుచ్చకాయ..పచ్చగా అంటూ వరుణ్ నానా తిప్పలు పడి..ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. రెండుసార్లు ఇదే డైలాగును చెప్పగా.. చచ్చీ చెడి సాధించాడు. చివరికి జీవితంమంటే పోరాటం.. పోరాటంలోనే ఉంది జయం... డైలాగును కరెక్ట్గా చెప్పి సక్సెస్ అయ్యాడు. లక్ష భక్ష్యములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా.. గుర్తు పెట్టుకో..నీకంటే తోపు ఎవ్వడు లేడిక్కడ..నీకు బీపీ వస్తే..నీ పీఏ వణుకుతాడు..వంటి డైలాగులు అలీ రెజాకు ఇవ్వగా.. వాటిని చెప్పడం అలా కి సాధ్యంకాలేదు. ఈ సందర్భంగా కూడా నవ్వుల మతాబులు విరజిమ్మాయి. ‘పునర్నవి వెళ్లిపోయిన తరవాత బాధగా వుందా’ ఈ డైలాగును రాహుల్ అలవోకగానే చెప్పాడు. విష్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కంబొట్లు చెప్పడానికి మాత్రం కష్టపడ్డాడు. నా చావు నే చస్తా.. నీకెందుకు అన్న డైలాగును చెప్పలేక తికమక పడ్డాడు. అయితే నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా డైలాగును సరిగ్గా చెప్పి ఆకట్టుకున్నాడు. అయితే విచిత్రం ఏమంటే.. ఈ గేమ్లో బాగా, తొందరగా ఆన్సర్ చేసిన వారికి కాకుండా.. ప్రేక్షకులను ఎక్కువ ఎంటర్టైన్ చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం విశేషం. మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచింది వరుణ్. ఈ గేమ్షోలో సుమ హావభావాలు, పంచ్లతో బాగా ఆకట్టుకున్నారు. భోజనాలయ్యాక.. కాసేపు కునుకు తీయాలంటూ సుమ ప్రయత్నించారు. కానీ అంతలోనే బిగ్బాస్ కుక్కలు మొరిగిన వార్నింగ్ రావడంతో అది కుదరలేదు. మొత్తంమీద అందరూ ఊహించినట్టుగానే...ఎదురు చూసినట్టుగానే.. సుమ తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నారు. -
బిగ్బాస్ ఇంట్లో సుమ రచ్చ రంబోలా..
తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. పిల్లోడి నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి సినీ పరిశ్రమ దాకా అందరికీ ఆమె సుపరిచితురాలే. క్యాలెండర్లు మారుతున్నా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగా కొనసాగుతోంది. బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆమెదే పైచేయి. తను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తిరుగే ఉండదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. ఆవిడే ప్రముఖ యాంకర్.. సుమ కనకాల. వారం రోజుల్లో బిగ్బాస్ షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్బాస్ హౌస్లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్ప్రైజ్ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్లు చేయిస్తోంది. తన పంచ్లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్బాస్ హౌస్లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! Special guest #Suma in the house#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/O84sZSmf04 — STAR MAA (@StarMaa) October 28, 2019 -
ఆ రోజున ఆలస్యంగా షూటింగ్కు వెళ్తాం
సాక్షి, బంజారాహిల్స్: ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయడం అవసరమా అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఆ భావనను విడనాడాలి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం. ఓటు అనేది హక్కు, ఆ హక్కును సరైన దారిలో వినియోగించుకోవాలి. గాలి, తిండి ఎలాగో మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు కూడా అలాంటిదేనని అనుకోవాలి. నేను, నా భర్త రాజీవ్ తప్పనిసరిగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఆ రోజు షూటింగ్లు ఉన్నా రెండు గంటలు ఆలస్యంగా వెళతాం. ఎన్ని పనులున్నా ఓటు వేయనిదే షూటింగ్లకు హాజరయ్యే ప్రసక్తే లేదు. 20 ఏళ్ళ క్రితం రాజీవ్ కనకాల ఓటు వేయలేకపోయారు. ఓటు విలువ అప్పుడు అంతగా తెలియకపోవడంతో ఓటు వేయలేకపోయానని ఆ విలువ తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నానని వెల్లడించారు. మేము జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో రాజీవ్నగర్లో ఉంటున్నాం. – సుమ, రాజీవ్ కనకాల జస్ట్ ఫర్ యు ♦ పోలింగ్కు 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్లలోపు ప్రచారం నిషేధం. ♦ ప్రజల ఇళ్లముందు పికెటింగ్లు, ప్రదర్శనల వంటి వాటితో వారి ప్రశాంతతకు భంగం కలిగించరాదు. ♦ భవన యజమానుల అనుమతి లేనిదే పార్టీ జెండాలు, బ్యానర్లు గోడలపై రాతలు వంటివి చేయరాదు. ♦ పార్టీ సమావేశాలకు సంబంధించి సమయం, వేదిక తదితర వివరాలను తగినంత ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తదితర చర్యలు తీసుకుంటారు. ర్యాలీలు నిర్వహించేప్పుడు బయలు దేరే స్థలం.. ముగిసే స్థలం.. సమయం తెలియజేయాలి. ♦ సభలకు లౌడ్స్పీకర్లు, ఇతరత్రా సదుపాయాలు వినియోగించుకునేందుకు ముందస్తు అనుమతి పొందాలి. -
యాంకర్ సుమకు ‘రైతు బంధు’ చెక్కు
బాలానగర్ (జడ్చర్ల): మండలంలోని హేమాజీపూర్ గ్రామ పాఠశాలను సినీ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు బుధవారం సందర్శించారు. హేమాజీపూర్ శివార్లలో వారికి వ్యవసాయం పొలం ఉండగా వచ్చారు. ఈ సందర్భంగా వారు గతంలో పాఠశాలలకు ప్రొజెక్టర్, లాప్ట్యాప్లు బహూకరించగా వాటిని వారు పరిశీలించారు. అనంతరం రాజీవ్–సుమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందాలనే భావనతో రూ.లక్ష వ్యయంతో వీటిని అందజేశామన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నందున ప్రైవేటు పాఠశాలల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ మేరకు సుమ, రాజీవ్తో పలువురు గ్రామస్తులు ఫొటోలు దిగారు. ‘రైతు బంధు’ చెక్కు వెనక్కి.. హేమాజీపూర్ గ్రామ శివారులో తమకు ఉన్న భూమికి సంబంధించి సినీ నటుడు రాజీవ్కు ప్రభుత్వం నుంచి తాజాగా రూ.29 వేల విలువైన పెట్టుబడి సాయం చెక్కు అందింది. అయితే, తాను ఆర్థికంగా కొంత మేర స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించేలా చూడాలని కోరుతూ ఆ చెక్కును రాజీవ్ బుధవారం తహసీల్దార్ రాంబాయికి అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మురళీదర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, కరుణాకర్తో పాటుబాలానగర్ రైతు సమన్వయ కన్వీనర్ గోపాల్రెడ్డి పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో... జడ్చర్ల టౌన్: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం రాజీవ్ కనకాల, సుమ దంపతులు వచ్చారు. భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో వారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. -
హైదరాబాద్లో బీఆర్పీ పైప్స్ మరో యూనిట్
⇒ ఏడాదిలో కొత్తగా 20 ఎక్స్క్లూజివ్ స్టోర్లు ⇒ బ్రాండ్ అంబాసిడర్గా సుమ కనకాల ßæదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పైప్స్, ఫిట్టింగ్స్ తయారీలో ఉన్న బీఆర్పీ పైప్స్ హైదరాబాద్లో మరో యూనిట్ను ఏర్పాటు చేసింది. దీంతో ప్లాంటు వార్షిక సామర్థ్యం 12,000 టన్నులకు చేరుకుంది. ఈ ప్లాంటు కోసం కంపెనీ ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించింది. 18,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల అహ్మదాబాద్ ఫ్యాక్టరీకి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ యూనిట్ రాకతో కొత్తగా 100 మందికి ఉపాధి లభించిందని బీఆర్పీ పైప్స్ ఎండీ ప్రకాశ్ పటావరి తెలిపారు. కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్గా టీవీ యాంకర్ సుమ కనకాలను ప్రకటించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో బీఆర్పీ నెలకొల్పిన సీపీవీసీ యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో రెండవదన్నారు. అన్ని ఉత్పత్తులకు లైఫ్టైమ్ వారంటీ ఉందన్నారు. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్, గువహటి, వైజాగ్లో ఎక్స్క్లూజివ్ స్టోర్లున్నాయి. పైపులు, ట్యాప్స్, బాల్ వాల్వŠస్, ఇతర ఫిట్టింగ్స్ను కంపెనీ తయారు చేస్తోంది. బాల్ వాల్వస్ అమ్మకాల్లో దేశంలో టాప్–1లో నిలిచామని కంపెనీ డైరెక్టర్ వికాస్ పటావరి తెలిపారు. ఏటా 10 లక్షలకుపైగా బాల్ వాల్వ్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు. బీఆర్పీషాపే.కామ్ పేరుతో దేశంలో ఆన్లైన్లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కంపెనీ టర్నోవరు 2016–17లో రూ.75 కోట్లు. -
'దర్శక బాహుబలికి సెల్యూట్'
హైదరాబాద్: నెక్ట్స్ సెన్సేషన్ కోసం 2016 వరకు ఆగక తప్పదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల వ్యాఖ్యనించింది. 'బాహుబలి' సినిమా రెండో భాగం కోసం ఆమె ఈ కామెంట్ చేసింది. తాజాగా విడుదలైన 'బాహుబలి' సినిమా శనివారం చూశానని, సూపర్బ్ గా ఉందని తన ఫేస్ బుక్ పేజీలో సుమ పోస్ట్ చేసింది. ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన 'దర్శక బాహుబలి'కి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొంది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడులైన 'బాహుబలి' రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన ప్రముఖులందరూ రాజమౌళి గొప్పగా తీశాడని సోషల్ మీడియాలో ప్రశంసించారు. -
గెలిచి చూపించా..
మీ.. సుమ... మహానగరంలో మలయాళీ అమ్మాయి తెలుగు మాట్లాడితే నవ్వొస్తుంది కదా... పదాల ఉచ్ఛారణ వింటే ఈ భాషేంటిరా బాబూ! అని అనుకుంటాం కదా.. బుల్లితెరపై యాంకర్గా పేరుతెచ్చుకున్న సుమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. కాకపోతే తెలుగుపై ఉన్న మమకారంతో ఆమె వాటిని లెక్కజేయలేదు. ఆ వెక్కిరింతల మధ్యే పట్టుదల పెంచుకుని పదసంపదను పెంచుకుంది. ‘పలుకు’బడినీ మెరుగుపరచుకుంది. తడబడ్డ భాషలోనే మాటకారిగా గుర్తింపు తెచ్చుకున్న సుమ అనుభవాలు ఆమె మాటల్లోనే... సిటీ నాకు భాష నేర్పింది ‘తెలుగులో మాట్లాడటానికి పదాల కోసం తడబడే నువ్వు... ఇప్పుడు ఎడాపెడా యాంకరింగ్ చేస్తున్నావేంటి?’ అని నా చిన్ననాటి ఫ్రెండ్స్ అంటుంటారు. వాటికి నాలో నేనే అనుకుంటుంటాను.. ‘అప్పుడు వెక్కిరించారు... ఇప్పుడు కుళ్లుకుంటున్నారు కదా’ అని! ఈ సిటీ నాకు భాష నేర్పింది. సొసైటీలో ఒక హోదాలో నిలబడేందుకు దారి చూపింది. ట్యాంక్బండ్కు అవతల... ఇవతల ట్యాంక్బండ్ సెంటర్ పాయింట్ అనుకుంటే... బాల్యమంతా మెట్టుగూడలో గడిచింది. వివాహం తర్వాత ట్యాంక్బండ్కు ఈ పక్క ఉంటున్నాం. మాది కేరళ. నాన్న రైల్వే ఉద్యోగి. సికింద్రాబాద్లోని రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్లం. తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నా. రైల్వే డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, ఓయూలో పీజీ పూర్తి చేశా. తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నా... మాట్లాడటం ఇబ్బందిగా ఉండేది. నా ఉచ్చారణకు అందరికీ నవ్వొచ్చేది. కొందరు గేలి చేసేవాళ్లు. అప్పుడే నాలో పట్టుదల పెరిగింది. ఓనం ఆటతో మైమరపు ఓనం పండగంటే భలే సరదాగా ఉండేది. రైల్వే క్వార్టర్స్లో తమిళులు, మళయాళీలు, కన్నడిగులు, మార్వాడీలు... ఇలా అందరూ ఉండేవాళ్లు. ఓనం మా ఫేవరెట్. దాన్ని మేమే స్టార్ట్ చేసేవాళ్లం. మిగతావారిని ఇన్వాల్వ్ చేసేవాళ్లం. కాలనీ మొత్తం తిరగడం, పూలు ఏరుకొచ్చి రాశులు పోయడం... దీంతో వాళ్లతోనూ మంచి అనుబంధం పెరిగేది. అనేక భాషలు నేర్చుకోవడానికి ఇది కూడా తోడ్పడింది. ఏడు రాళ్లాట భలే.. రైల్వే క్వార్టర్స్కు వెళ్లినప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చే ఆటలు కొన్ని ఉన్నాయి. మారం పీటీ, ఖోఖో, పరుగు పందాలు... ఇలా ఎన్నో. కాకపోతే నాకు బాగా నచ్చిన ఆట ఏడు రాళ్లాట. రాళ్లను గిరిలో పోసి, సూటిగా రాయితో కొడితే... వావ్... కేరింతలు కొట్టేదాన్ని. గెలిచినంత ఫీలింగ్ వచ్చేది. అయ్యప్ప టెంపుల్ మరిచిపోలేని జ్ఞాపకం... మెట్టుగూడా అయ్యప్ప టెంపుల్కు రోజూ వెళ్లేదాన్ని. ఇక్కడే డాన్స్ క్లాస్ కూడా నేర్చుకున్నాను. కూచిపూడి డాన్స్ చేస్తుంటే మా చుట్టుపక్కల వాళ్లంతా కన్నార్పకుండా చూసేవాళ్లు. ఇప్పటికీ ఎప్పుడైనా ఒకసారి అటు వెళ్లాలన్పిస్తుంది. దీపావళి అంటే భయం దీపావళి వస్తే చాలు నాకు చచ్చేంత భయమేసేది. పెద్ద పెద్ద బాంబులు.. సౌండ్లు.. అమ్మో! చెవులకు దూదులు పెట్టుకుని ఇంట్లో దాక్కునేదాన్ని. సీమ టపాకాయ కాల్చాలన్నా భయమేసేది... రన్నింగ్ రేస్కు సై.. ఆగస్టు 15, నవంబర్ 14... జాతీయ పండుగలంటే నాకు భలే ఇష్టం. అప్పుడు పరేడ్ గ్రౌండ్ను ముస్తాబు చేస్తారే... అదింకా ఇష్టం. ఇక స్కూల్లో అయితే రన్నింగ్ రేస్లో మొదటి పేరు నాదే. ఎందుకంటే కప్ నాకు గ్యారెంటీ అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. ఓయ్.. ఎక్కడా.. గోల్కొండ కెళ్లడం... అక్కడ చప్పట్లు కొట్టి అరవడం భలే సరదాగా ఉండేది. మొన్నటి దాకా అక్కడికెళ్లి ఓయ్... ఎక్కడా అని అరుస్తుంటే.. ప్రతిధ్వని వస్తుంటే థ్రిల్గా ఫీలయ్యేదాన్ని. ట్యాంక్బండ్, ఇందిరాపార్క్.. సిటీలో ఉన్న ప్రతీదీ గొప్పగానే అనిపిస్తుంది. ఏడాదికోసారి నాంపల్లిలో పెట్టే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కు వెళ్లకుండా ఉండలేను. పానీపూరీ స్పెషల్ సిటీలో దొరికే పానీపూరీ భలే ఇష్టం. చిన్నప్పటి నుంచీ అంతే. ఇంకా మిర్చిబజ్జీ అన్నా అంతే ప్రాణం. సిటీలో ఎక్కడైనా ఈ రెండు ఐటమ్స్ బాగా నచ్చుతాయి. మళ్లీ వేరే సిటీలకు వెళ్తే ఇంత టేస్ట్ రాదు. ఇంకా హైదరాబాదీ బిర్యానీ అన్నా చాలా చాలా ఇష్టం. నగరం చుట్టేస్తే.. ఓల్డ్ సిటీలో బ్యాంగిల్స్ కొనడం సరదా. అప్పుడప్పుడు బిర్లామందిర్ను అలా చూస్తూ మెట్లెక్కడం ఇష్టం. హుస్సేన్సాగర్లో భగీరథి ఎక్కడం మరో థ్రిల్. బతుకమ్మ పండుగ ఆడుతుంటే పూల సజ్జాలు చూడటం మరీమరీ ఇష్టం. ట్రాఫిక్ జామ్ ఒక్కటే నచ్చని పాయింట్... భిన్న రాష్ట్రాల వాళ్లున్న సిటీ ఇది. విభిన్న సంస్కృతుల మేళవింపు ఉన్న నగరం మనది. ఈ సిటీ ఇమేజ్ ఇంకా పెరగాలనేది నా కోరిక. అయితే ఇక్కడ ట్రాఫిక్ కొంత నచ్చని విషయమే. దానికి కారణం మనమేనని, ఏమీ చేయలేమని కూడా తెలుసు. అయినా ఎందుకో అదొక్కటే నాకు నచ్చని పాయింట్. ఈ అందమైన నగరంలో ఇంకెన్నో అనుభూతులున్నాయి. ఏదేమైనా తెలుగు రాదని గేలిచేసిన చోటే గెలిచి చూపించా! ఇదే నాకు జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం. కాలేజీ నుంచే కేరీర్ స్టార్ట్ కూచిపూడి నేర్చుకున్నాను కదా. సరదాగా ప్రదర్శనలిచ్చా. అలా దూరదర్శన్లో నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటికే తెలుగు బాగా నేర్చేసుకున్నాను. ఏ పదం మాట్లాడితే వెక్కిరించే వాళ్లో, దాన్ని ఎలా పలకాలో తెలుసుకునేదాన్ని. కాలేజీకి వచ్చే సరికే పర్ఫెక్ట్ అయ్యాననుకోండి. సిటీ గురించి, ఇక్కడి కల్చర్ గురించి పుస్తకాలు కొని చదివాను. మొత్తం మీద అలా... అలా... యాంకర్ అయ్యాను. - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్