breaking news
Teja Sajja
-
మిరాయ్ టీమ్పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
మూడు పాన్ ఇండియా సినిమాలను ప్రకటించిన 'తేజా సజ్జా'
మిరాయ్ సినిమాతో తేజ సజ్జా మరో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ. 112 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మిరాయ్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న తేజ సజ్జా తన తర్వాతి సినిమాలను ప్రకటించాడు. అయితే, అవన్నీ కూడా సీక్వెల్స్ కావడం విశేషం. మిరాయ్ సినిమా తర్వాత తేజ సజ్జా నుంచి రానున్న చిత్రాల గురించి రివీల్ చేశాడు. మూడు సినిమాల సీక్వెల్స్ ను ఆయన ప్రకటించాడు. మిరాయ్, జై హనుమాన్, జాంబీరెడ్డి 2 సీక్వెల్స్ చిత్రాలు ఉంటాయని తేజ సజ్జా పంచుకున్నాడు. మిరాయ్ సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఇప్పటికే చెప్పారు. 'హను-మాన్' సీక్వెల్ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే, పార్ట్-1కు మించి వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్’ ఉంటుందని ఆయన అన్నారు. కానీ, సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్లో అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని చెప్పారు. అయితే, ఆ సినిమా హీరో ఆంజనేయ స్వామి అని ట్విస్ట్ ఇచ్చారు. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పటికే ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది.జైహనుమాన్ తర్వాతే మిరాయ్2 తేజ సజ్జా , దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన తొలి హిట్ మూవీ 'జాంబిరెడ్డి'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, సుమారు నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా 'జాంబిరెడ్డి 2'ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయినట్లు సమాచారం. అయితే, ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథను మాత్రమే అందిస్తారని దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదని చర్చ జరుగుతుంది. తేజ సజ్జా నుంచి తర్వాతి సినిమా జైహనుమాన్ (2026) విడుదల కానుంది. అదే ఏడాది చివరిలో మిరాయ్2 ఉండోచ్చని టాక్.. 'జాంబిరెడ్డి 2' కోసం మాత్రం మరో రెండేళ్లు ఆగాల్సిందే.#TejaSajja Emerging as the most prominent star of Tollywood. What a lineups👌📈#JaiHanuman - Alongside RishabhShetty playing LordHanuman✡️#Mirai2 - Alongside RanaDaggubati playing prominent role⚔️#ZombieRedd2 - Comedy entertainer With Alien Vs Zombie🧟♂️ pic.twitter.com/9kep3K4cQY— AmuthaBharathi (@CinemaWithAB) September 18, 2025 -
'మిరాయ్' హిట్.. తేజ సజ్జాకి లగ్జరీ కారు గిఫ్ట్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్ కూడా సాధించింది. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి 'మిరాయ్' టీమ్తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన నిర్మాత.. హీరో, దర్శకుడికి కార్లు గిఫ్ట్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)సాధారణంగా సినిమాలు హిట్ అయి, మంచి కలెక్షన్స్ సాధిస్తే నిర్మాతలు.. దర్శకుడికో హీరోలకో ఖరీదైన లగ్జరీ కార్లని బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు కూడా 'మిరాయ్' హిట్ కావడంతో నిర్మాత విశ్వప్రసాద్ ఆనందపడుతున్నారు. ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి.. వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్గా ఇస్తానని స్టేజీపైనే ప్రకటించారు.'మిరాయ్' విషయానికొస్తే.. 'హనుమాన్' తర్వాత తేజ చేసిన మరో సూపర్ హీరో సినిమా ఇది. తేజ హీరో కాగా మంచు మనోజ్ విలన్గా ఆకట్టుకున్నాడు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని.. ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు సాధించారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో గౌర హరి ఆకట్టుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా) -
ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్'
హను-మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. టికెట్ రేట్లు పెంచకుండానే మిరాయ్ ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు. 100 Crores⚔️🔥Big love and gratitude to Audience especially families for celebrating #Mirai with all your heart🙏🏼❤️🤗This is the Victory of Good Cinema🔥#BlackSword 🚀 pic.twitter.com/hKClY8PcrN— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 17, 2025 చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్బాబు రిక్వెస్ట్ -
విజయవాడలో ‘మిరాయ్’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)
-
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్ని మరిపిస్తాడా?
ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్(Mirai Movie) కూడా జేరింది. విడుదలైన రోజు నుంచి మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్లోని అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలతో సమానమైన అవుట్పుట్ను మిరాయ్ బృందం అందించగలిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్లోనే స్థానికంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.ట్రైలర్ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్పుట్కి ఆశ్చర్యపోయారు నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే.. ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పరిశ్రమలలోని టాప్ కంపెనీల నుంచి కూడా నమ్మదగిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్ మిరాయ్ ఈ అద్భుతమైన అవుట్పుట్ను సాధించడం గమనార్హం.ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్ భారీ చిత్రం రాజా సాబ్(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా మిరాయ్ ను అందించిన అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్పుట్ ను ఊహిస్తున్నారు. దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజా సాబ్ ఒక హర్రర్ డ్రామా, దీనిని చాలా వరకూ సెట్లోనే చిత్రీకరించారు దాంతో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది మిరాయ్ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ జతగూడితే...ప్రభాస్ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు. -
తేజ సజ్జ దెబ్బకు ఇండస్ట్రీ షేక్
-
'మిరాయ్' కలెక్షన్.. రూ.100 కోట్లకు చేరువలో
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్ కూడా వస్తోంది. తొలిరోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం కాస్త ఎక్కువగానే వసూలు చేసింది. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసింది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన 'మిరాయ్'కి తొలి నుంచి కాస్త హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్గా విజువల్స్ పరంగా ఆకట్టుకోవడంతో పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. అలా తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు వచ్చేసరికి రూ.55.60 కోట్లకు చేరింది. ఆదివారం మంచి ఆక్యుపెన్సీలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులకు కలిపి రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరువలో వసూళ్లు ఉన్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ విషయంలో కాస్త డ్రాప్ ఉంటుంది. ప్రేక్షకులు కాస్త తక్కువగానే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. మరి 'ఓజీ' రావడానికి ఇంకా 10 రోజులకు పైనే టైమ్ ఉంది. మరి అంతలోపు 'మిరాయ్' ఎన్ని కోట్లు అందుకుంటుందో చూడాలి? ఈ వారం థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఇది కూడా 'మిరాయ్'కి ప్లస్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: ఇడ్లీ తినాలని కోరిక.. డబ్బులుండేవి కావు: ధనుష్ ఎమోషనల్)From South to North, from India to Overseas, #MIRAI is rewriting history everywhere ❤️🔥Record Breaking ₹81.2 Cr Gross Worldwide in just 3 DAYS for #BrahmandBlockbusterMirai 💥💥💥India’s most ambitious action adventure is now the most celebrated film across the globe🔥—… pic.twitter.com/7MqeKGvWwV— People Media Factory (@peoplemediafcy) September 15, 2025 -
'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్
బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలు, టైర్ 2 హీరోల విషయంలో రెండో రోజు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ని మిరాయ్ బద్దలు కొట్టింది. తెలుగు రాష్ట్రాల వసూళ్లలో రూ.8.20 కోట్ల షేర్తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించాడు. టైర్ 2 హీరోలుగా ఉన్న నాని హిట్ 3, శ్యామ్ సింగరాయ్, దసరా.. విజయ్ దేవరకొండ ఖుషి, కింగ్డమ్, గీత గోవిందం.. నాగ చైతన్య తండేల్, లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాల రికార్డులని ఈ చిత్రం దాటేసింది.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ సినిమాలలో హయెస్ట్ షేర్ వచ్చిన సినిమాగానూ టాలీవుడ్ చరిత్రలోనే మిరాయ్ ఘనత సాధించింది. ఈ సినిమాలో తేజ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో తేజ డూప్ లేకుండా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయిందని ప్రశంసిస్తున్నారు. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్కు యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి.ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజ సజ్జా.. పైపైకి వచ్చినట్లుగానే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రితికా నాయక్ హీరోయిన్ కాగా మంచు మనోజ్ విలన్. శ్రియ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు రోజుల్లో ఓవరాల్గా రూ.55 కోట్ల మేర గ్రాస వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?
థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్'.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే సూపర్ హీరో తరహా జానర్లో మూవీ తీసినప్పటికీ.. క్లైమాక్స్లో శ్రీ రాముడి రిఫరెన్స్ చూపించడం ప్రేక్షకులకు నచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ పాత్రలో ప్రభాస్ నటించాడని.. మూవీ రిలీజ్కి ముందు రూమర్స్ వచ్చాయి. కానీ ఆ పాత్రని ఓ యువ నటుడితో చేయించారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? అతడి డీటైల్స్ ఏంటి?ఈ సినిమా చివరలో వచ్చే శ్రీ రాముడి పాత్ర.. కథని టర్న్ అయ్యేలా చేస్తుంది. పట్టుమని ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆ పాత్రని చూపించారు. అది కూడా ముఖం కనిపించీ కనిపించకుండా చూపించారు. దీంతో ఆ పాత్రని ఎవరు చేశారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ రోల్లో హిందీ నటుడు గౌరవ్ బోరా కనిపించాడు. ఇతడిది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్. మాస్ కమ్యూనికేషన్ చదివిన గౌరవ్.. నటనపై ఇష్టంతో ఢిల్లీ వచ్చేసి థియేటర్ గ్రూప్లో చేరాడు. ఐదేళ్ల పాటు పలు నాటకాలు చేశాడు.(ఇదీ చదవండి: ‘మిరాయ్’ మూవీ రివ్యూ)పలు షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్ కూడా చేసిన గౌరవ్.. కొన్ని కమర్షియల్ యాడ్స్లోనూ నటించాడు. మరి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఎక్కడ చూశాడో ఏమో గానీ గౌరవ్ని శ్రీరాముడి పాత్ర కోసం ఎంపిక చేశాడు. రెండు రోజుల పాటు ఇతడికి సంబంధించిన షూటింగ్ అంతా జరిగింది. శ్రీ రాముడి సీన్స్కి వీఎఫ్ఎక్స్ కూడా జోడించేసరికి ఆ సన్నివేశాలు ఎలివేట్ అవుతున్నాయి.అయితే తెలుగులో శ్రీరాముడు అంటే చాలామంది సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. తర్వాత కాలంలో పలువురు నటులు.. ఈ పాత్రలో కనిపించినప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఒకవేళ 'మిరాయ్' టీమ్ ఎవరైనా తెలుగు నటుడిని ఈ పాత్రలో పెట్టుంటే కచ్చితంగా పోలిక వచ్చి ఉండేది. అందుకేనేమో ఉత్తరాది నటుడిని పెట్టి మేనేజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఏదైనా ఈ పాత్రకు కూడా రెస్పాన్స్ బాగానే వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!) -
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ సునామీ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?
మిరాయ్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. తక్కువ బడ్జెట్లో గొప్ప సినిమా తీశారంటూ విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తొలి రోజు(సెప్టెంబర్ 12) 27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను సాధించింది. మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.60 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.(చదవండి: మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!)ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దూసుకెళ్తుంది. నార్త్ అమెరికాలో రెండు రోజుల్లోనే 1 మిలియన్ల డాలర్లను రాబట్టింది. యూఎస్, కెనడాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్ని బట్టి చూస్తే..వీకెండ్లోగా ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.(చదవండి: రెండోసారి ప్రసవం.. మానసికంగా దెబ్బతిన్నా: ఇలియానా)మిరాయ్ విషయానికొస్తే.. హనుమాన్ తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రమిది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషించాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించారు. -
మిరాయ్ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదే!
మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో మంచు మనోజ్ విలన్గా నటించగా, రితికా నాయక్ హీరోయిన్గా చేసింది. శ్రియ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు.రికార్డులు తిరగరాయడం ఖాయంమిరాయ్కు తొలి రోజే రూ.27 కోట్లు రావడంతో చిత్రయూనిట్ 'బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ సక్సెస్' పేరిట విజయోత్సవాలు జరుపుకుంది. సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే మిరాయ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన గొంతు అరువిచ్చాడు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ గొంతు వినిపించగానే ప్రేక్షకులు ఎగిరిగంతేస్తున్నారు. మిరాయ్ మూవీకి అంత బూస్ట్ ఇచ్చిన ప్రభాస్ దీనికోసం ఎంత డబ్బు తీసుకున్నాడని కొందరు చర్చలు మొదలుపెట్టారు. ఓటీటీ పార్ట్నర్అసలే ప్రభాస్ది వెన్నలాంటి మనసు. తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే సరేనని గొంతు అరువిచ్చి సాయం చేశాడే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోలేదట! దీంతో రెబల్ స్టార్ను అభిమానులు మరోసారి ఆకాశానికెత్తేస్తున్నారు. ఇకపోతే మిరాయ్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. నెల రోజుల తర్వాతే మిరాయ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ నెలలో మిరాయ్ ఓటీటీలో ప్రత్యక్షం కానుందని తెలుస్తోంది.చదవండి: ప్యారడైజ్లో విలన్గా మోహన్బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి -
ప్రభాస్గారి వాయిస్ మిరాయ్కి మంచి వెయిట్ : తేజ సజ్జా
‘‘మిరాయ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్ళ ఆదరణ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్’ పేరిట శనివారం చిత్రయూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో తేజ సజ్జా మాట్లాడుతూ–‘‘దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్గార్లు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మా మీద విశ్వప్రసాద్గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మంచు మనోజ్గారి రాకతో మా సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ‘మిరాయ్’ కథ ప్రభాస్గారి వాయిస్ ఓవర్తో ప్రారంభమవ్వడం వల్లే మా సినిమాకు వెయిట్ వచ్చింది. మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రభాస్, రానాగార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సక్సెస్తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసిన కార్తీక్కు రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తమ్ముడు తేజ మంచి స్థాయికి వెళ్తాడు. మా అన్నతమ్ముళ్లు ఇద్దరి కోసం ప్రభాస్గారు నిలబడ్డారు (మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు). ఆయనకు థ్యాంక్స్’’ అని తెలిపారు మనోజ్ మంచు. ‘‘మిరాయ్’ నాలుగేళ్ల జర్నీ. తేజ అప్పట్నుంచి ట్రావెల్ అవుతున్నాడు. నన్ను నమ్మిన విశ్వప్రసాద్ గారికి, ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు దర్శకుడు కార్తీక్. ‘‘2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ సక్సెస్ మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తర్వాతి నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. మా అమ్మాయి కృతి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తన జర్నీ మొదలుపెట్టి, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం’’ అని తెలిపారు. -
‘మిరాయ్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?
ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. హీరోయిన్గా రితికా నాయక్, విలన్గా మంచు మనోజ్, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.ఫస్ట్డే కలెక్షన్స్సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది హనుమాన్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్ బద్ధలు కొట్టింది. మిరాయ్ మూవీ నార్త్ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్ నిలిచింది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. BRAHMAND DAY 1 💥💥💥27.20 Crores WORLDWIDE GROSS for #MIRAI ᴡɪᴛʜ ɴᴏʀᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 🔥🔥🔥Keep showering your love on #BrahmandBlockbusterMIRAI and experience it ONLY on the Big Screens ❤️🔥❤️🔥❤️🔥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star… pic.twitter.com/lvYrluMkZS— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 #SuperYodha is setting the box office on fire 🔥🔥🔥#Mirai North America Gross $700K+ & counting 🇺🇸❤️🔥❤️🔥❤️🔥Experience '𝗕𝗥𝗔𝗛𝗠𝗔𝗡𝗗 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥' in cinemas now 💥North America by @ShlokaEnts @peoplecinemas Superhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/zDHsgJiJjQ— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 Blockbuster Vibes & Grateful Smiles 🤩🤩🤩Team #MIRAI shares overwhelming joy for the BRAHMAND BLOCKBUSTER ❤️🔥❤️🔥❤️🔥Experience India's Most Ambitious Action Adventure Only On the Big Screens 💥💥💥— https://t.co/BveSLQhrSISuperhero @tejasajja123Rocking Star @HeroManoj1… pic.twitter.com/OxOzGeWKbr— People Media Factory (@peoplemediafcy) September 13, 2025 చదవండి: ఇమ్మాన్యుయేల్పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ -
'మిరాయ్' స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్.. చాలా తక్కువే
తేజ సజ్జా (Teja Sajja), మంచు మనోజ్ (Manchu Manoj) కాంబినేషన్లో తాజాగా విడుదలైన చిత్రం మిరాయ్... కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మిరాయ్లో ఈ మూడు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ రితికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. సినిమా బాగుందని ఇప్పటికే సోషల్మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇందులోని విజువల్స్ ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయి. అయితే, మిరాయ్ కోసం తేజ సజ్జా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది..? అనే చర్చ జరుగుతుంది.సినిమా హిట్ అయితే.. రెమ్యునరేషన్పై తేజమిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కోసం రూ. 60 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ ఔట్ పుట్ చూస్తే మాత్రం సుమారు. 200 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారనిపించేలా ఉంటుంది. అందరూ మిరాయ్ కోసం తేజ సజ్జా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని భావించినా, వాస్తవం కొంచెం భిన్నంగా ఉన్నట్లు సమాచారం. తేజా స్వయంగా చెప్పిన ప్రకారం, హనుమాన్ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే మిరాయ్కు కూడా తీసుకున్నానని ఒక వేదికపై చెప్పారు. అయితే, ప్రొడ్యూసర్ మీద తనకున్న నమ్మకం వల్ల, సినిమా హిట్ అయితే మంచి అమౌంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అది కేవలం నిర్మాత ఇష్ట ప్రకారంగా తీసుకునే నిర్ణయం మాత్రమేనని అన్నారు. హనుమాన్ హిట్ అయిన తర్వాత కూడా తాను ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడగలేదన్నారు. ఆ సినిమా నిర్మాతల నుంచి కూడా తనకు రెమ్యునరేషన్ మించి ఒక్క రూపాయి కూడా అదనంగా అందలేదని సమాచారం. మనోజ్కే ఎక్కువ రెమ్యునరేషన్హనుమాన్ కోసం తేజ సజ్జా రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. గతంలో తేజ చెప్పిన ప్రకారం మిరాయ్ సినిమాకు కూడా రూ. 2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఇకనుంచి ఆయన నటించనున్న కొత్త సినిమాలకు సుమారు రూ. 15 కోట్ల మేరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు టాక్.. హనుమాన్ సినిమా కంటే ముందే మిరాయ్తో తేజ సజ్జా ఒప్పందం చేసుకున్నారు. కానీ, తనకు కథ నచ్చితే రెమ్యునరేషన్ పెంచబోనని కూడా తేజ చెప్పడం విశేషం. మంచు మనోజ్ కూడా మిరాయ్ సినిమా కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రియ మాత్రం రూ. 2 కోట్ల వరకు అందుకున్నారని టాక్.. అయితే, ఇందులో హీరోయిన్గా అద్భుతంగా మెప్పించిన రితిక నాయక్ మాత్రం రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం ఉంది. -
మిరాయ్ సినిమా.. ప్రేక్షకుల రియాక్షన్స్ ఇదే!
-
‘మిరాయ్’ మూవీ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డమ్ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్ లామా(మంచు మనోజ్) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్) రక్షణలో ఉంటుంది. మహావీర్ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్ చేతికి వెళ్లిందా లేదా? మహావీర్ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్లోనూ ట్రెండింగ్గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్’. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే.. ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్, కార్తీకేయ 2 తో పాటు హాలీవుడ్లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి. కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్బంప్స్ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్. అలాగే సెకండాఫ్లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే... సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా.. వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా ‘మిరాయ్’ మాత్రం థియేటర్స్లో చూడాల్సిన విజువల్ వండర్. ఎవరెలా చేశారంటే.. వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్ విలనిజం అద్భుతంగా పండించాడు. తేజ సజ్జ కంటే మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ ఉన్నాయి. మహావీర్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది. ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్, జగపతి బాబు, వెంకటేశ్ మహా, తిరుమల కిశోర్, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్, రాముడి ఎపిసోడ్కి ఇచ్చిన బీజీఎం గూస్బంప్స్ తెప్పిస్తాయి. దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్గాను కార్తీక్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. ఇక వీఎఫెక్స్ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్ పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్లో ఈ స్థాయి ఔట్ పుల్ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం
రీసెంట్ టైంలో పాన్ ఇండియా సినిమాల్లో కచ్చితంగా డివోషనల్ ఎలిమెంట్స్ లేదా క్లైమాక్స్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రిలీజ్ వరకు కొన్నింటిని దాస్తుంటే మరికొన్నింటిని మాత్రం ముందే రివీల్ చేస్తున్నారు. కానీ తాజాగా థియేటర్లలో రిలీజైన 'మిరాయ్'లో మాత్రం ప్రభాస్ నటించాడనే రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా ఓ ఫొటో కూడా సర్కూలేట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?'హనుమాన్' తర్వాత తేజ సజ్జా చేసిన సినిమా 'మిరాయ్'. ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే తీశారు. మంచు మనోజ్ విలన్ కాగా.. ఇందులో రాముడి రిఫరెన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేసుంటారా అని అందరూ మాట్లాడుకున్నారు. అలానే నిన్న రాత్రి తేజ్ సజ్జా.. సినిమాలో ప్రభాస్ సర్ప్రైజ్ కూడా ఉందని ట్వీట్ చేశాడు. దీంతో ఏంటా సంగతి అనుకున్నారు.(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ)అయితే సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్.. ప్రభాస్తో చెప్పించారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ప్రభాస్ని రాముడిగా ఎడిట్ చేసి థియేటర్ స్క్రీన్పై ఆ బొమ్మని పెట్టేశారు. దీంతో చాలామంది ఇది నిజమని అనుకుంటున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇదో ఎడిటెడ్ ఫొటో. 'మిరాయ్' చిత్రం కోసం ప్రభాస్.. తన గొంతు మాత్రమే ఇచ్చాడు. ఇదే నిర్మాణ సంస్థ 'రాజాసాబ్' తీస్తుంది.ప్రస్తుతం 'మిరాయ్'కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. కానీ తొలిరోజు వచ్చే టాక్ కాదు, ఒకటి రెండు రోజుల తర్వాత అసలు టాక్ వస్తుంది. అప్పుడు సినిమా రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.(ఇదీ చదవండి: మిరాయ్ ట్విటర్ రివ్యూ) -
మిరాయ్ ట్విటర్ రివ్యూ
హను-మాన్ తర్వాత తేజ సజ్జ నటించిన మరో పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సిసిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిరాయ్’ ఎలా ఉంది? తేజ సజ్జ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదతర అంశాలను ఎక్స్లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్లో మిరాయ్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉందంటూ చాలా మంది ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ కనిపించడం పెద్ద సర్ప్రైజింగ్ అంశం. ఎక్స్లో ప్రభాస్ పాత్రలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభాస్ గెస్ట్ రోల్ సినిమాకు ప్లస్ అయిందని చెబుతున్నారు.#Mirai A Worthy Action Adventure Infused with Devotional Elements! Mirai delivers an engaging first half, with a few dips in the middle, but a good pre-interval to interval block. The second half slows down in places, but a few strong sequences and a superb climax hold it…— Venky Reviews (@venkyreviews) September 11, 2025‘చిన్న చిన్న మలుపులతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. సెకండాఫ్ కొన్ని చోట్ల కథ సాగదీసినట్లుగా అనిపించినా..కొన్ని బలమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అద్భుతంగా ఉండడంతో ఎక్కడా బోర్ కొట్టినట్లు అనిపించదు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. #MiraiReview Positives@shriya1109#Jayaram@tejasajja123@HeroManoj1 (Mohan babu)#RitikaAnd everyone gave their best -VFX 👌👏-Second half BGM-Mirai daggariki vellaka vache sequence -Second half till climaxNegatives:Time ayipothundhani fast fast ga end chesinattundhi— ZoomOnZindagi (@ZoomOnZindagi) September 12, 2025 ‘తేజ సజ్జ, శ్రియ, మనోజ్, జయరామ్, రితికా..ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వీఎఫెక్స్ అదిరిపోయింది. సెకండాఫ్ బీజీఎం బాగుంది. మిరాయ్ దగ్గరకు వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్. క్లైమాక్స్ బాగుంది. సినిమాలో నెగెటివ్ పాయింట్ ఏంటంటే.. టైమ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఎండ్ చేసినట్లు ఉంటుంది’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai pic.twitter.com/rhvvntcNGO— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai – A Divine Action Adventure! 🔥✨High moments, solid interval, superb climax.Tech brilliance + Gowra Hari BGM elevate big time.@tejasajja123 shines bright.@HeroManoj1 👌💥Unique, engaging & worth a big-screen watch!Rating: ⭐⭐⭐⭐/5— 𝐕𝐢𝐡𝐚𝐚𝐧 (@TheRealPKFan) September 12, 2025#Mirai 1st half is a banger 💥💥 with usual teja and Srinu comedy , interval is very good .. 2nd is bit lengthy with same template as #HanuMan Overall it's a good movie 🎉🎉 Congrats team 3.5/5— N@|○ N£nu (@Karthik_nyl) September 12, 2025#Mirai 12 सितम्बर को रिलीज़ हो रही है ये फ़िल्म सनातन धर्म के आदर्श और राम जी की ताक़त से प्रेरित है 🚩दक्षिण भारत हमें सुपरहीरो देता है, बॉलीवुड बस स्टारकिड्स 😏आधुनिक युग में एक बेहतरीन फिल्मइस बार सिनेमा हॉल भरकर दिखाओ कि असली कंटेंट ही जीतेगा 💪#Mirai— ठाकुर राजन तोमर (@rajanbhajpa) September 12, 2025#Mirai - 🆗Teja Sajja delivers a gud Perf. Graceful Shreya. Superb Visuals & BGM. Promising start, middle portions r draggy. Post Interval Transformation fight gud. Lord Rama saved d climax. Though not extra ordinary, it Deserves a One Time Watch for its Cinematic Experience!— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2025#Mirai Baane undi, Parledu!A decent fantasy action adventure film which has similar tones of #Karthikeya2 & #HanumanFew sequences are fantastic but few are subpar.Loved #ShriyaSaran role👍🏻#TejaSajja is brilliant and he killed it👌#ManchuManoj role is underwhelming🥲 pic.twitter.com/r7gHrlhsph— Sanjeev (@edokatile) September 12, 2025 -
నా చిన్నప్పుడే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు: హీరో తేజ సజ్జా
‘‘మనం ఎంత ఖర్చుపెట్టినా ప్రేక్షకుల నమ్మకాన్ని కొనలేం. సినిమాలు స్పీడ్గా చేయాలని, రెండు మూడు సినిమాలు వరుసగా చేసేసి, ప్రేక్షకులను ఒక్కసారి నిరుత్సాహపరిచినా నాకు బాధగా ఉంటుంది. నేను దక్కించుకున్న క్రెడిబిలిటీ, నా కష్టం తాలూకు విలువ పోతుంది. నా సినిమా వస్తోంది... థియేటర్స్కు రండి అని ఆడియన్స్ని నేను కాన్ఫిడెంట్గా, ధైర్యంగా పిలిచేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. ‘మిరాయ్’ ఇలాంటి చిత్రమే’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం తేజ సజ్జా చెప్పిన సంగతులు. ⇒ ఫుల్ ఫ్యామిలీ అండ్ క్లీన్ ఫిల్మ్ ‘మిరాయ్’. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, డివోషన్, ఎలివేషన్... ఇలా అన్ని అంశాలు ఉన్న చిత్రం ఇది. చార్మినార్లోని కుర్రాడు వాడి ధర్మం ఏంటో వాడు గ్రహించి, తనకి, యోధ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుని, ఓ పెద్ద ఆపదను ఆపడానికి ఎంత దూరం వెళ్లాడు? తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ప్రపంచం అంతరించబోతున్నటువంటి ఓ పెద్ద ఆపద రాబోతున్నప్పుడు మన ఇతిహాసాల్లో వేల సంవత్సరాల క్రితం పెట్టి ఉంచిన సమాధానాన్ని ఈ కుర్రాడు ఎలా కనుక్కుంటాడు? అన్నది ఈ సినిమా కథాంశం. ⇒ ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ సీక్వెన్స్లు వరకు ఉన్నాయి. వయసులో ఉన్నాను కాబట్టి ఫిజికల్ చాలెంజ్లు ఏం అనిపించలేదు. ఈ సీక్వెన్స్లు చూసి, ఆడియన్స్ ఎంత థ్రిల్ అవుతారో చూడాలనుకుంటున్నాను. టీజీ విశ్వప్రసాద్గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆడియన్స్కు నచ్చే మంచి సినిమా తీద్దామనుకునే నిర్మాత. ఆయనలాంటి నిర్మాతలు అరుదు. అందుకే ఆయనతో మరో సినిమా చేస్తున్నాను. ⇒ నా చిత్రాలతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేయాలని తపన పడుతుంటాను. కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలనుకుంటాను. ఆ ప్రెజర్ ఉంది. కానీ ‘హను–మాన్’ సినిమా సక్సెస్తో నాపై కొత్తగా పెరిగిన ఒత్తిడి ఏం లేదు. చె΄్పాలంటే ఒక రకంగా ‘హను–మాన్’ సినిమా విషయంలోనే ఒత్తిడి ఫీలయ్యాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా విజయం సాధించింది కదా అని ‘మిరాయ్’ సినిమాలో మార్పులు చేర్పులు చేయలేదు. ⇒ మా నాన్నగారు హార్డ్వర్కింగ్ పర్సన్. ఆయన వయసు 65. ఈ రోజుకీ ఆయన ఉదయం 6.30కి ఉద్యోగానికి వెళ్తారు. సాయంత్రం 8 గంటలకు వస్తారు. పనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టేవారిలో మా ఫాదర్ ఒకరు. అలాంటి ఇంటి నుంచి వస్తున్నాను కాబట్టే పనికి నేను ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానేమో అనిపిస్తోంది. పనే దైవం అని భావిస్తాను. ⇒ కథ కుదరితే పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా రిలీజ్ చేస్తాం. నిజానికి పాన్ ఇండియా సూపర్ స్టార్లు నా చిన్నప్పట్నుంచి ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావుగార్ల సినిమాలు చెన్నైలో చూసేశారు. చిరంజీవిగారు స్ట్రయిట్గా హిందీలో సినిమాలు చేశారు. రజనీకాంత్, కమల్హాసన్గార్ల సినిమాలు నేను నా చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. అలాంటి వారికి జోడించాల్సిన పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ని నాలాంటి యంగ్ హీరోస్కి పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని నమ్మేవారిలో నేనొకడిని. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మేం సినిమాలు చేస్తున్నాం. ఒకవేళ మేం చేసే చిత్రం ఇతర భాషల ఆడియన్స్కు కూడా నచ్చితే, అది మాకు బోనస్. దీని కోసం రిలీజ్ చేయడమే. అంతేకానీ... అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ప్రయత్నం ఏమీ లేదు. ⇒ ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నానా? లేదా అనేది ప్రశాంత్ వర్మగారు చెబుతారు. ‘జాంబిరెడ్డి 2’ సినిమాకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. ప్రశాంత్గారు కథ అందిస్తున్నారు. విశ్వప్రసాద్గారు నిర్మిస్తారు. ‘మిరాయ్’ సినిమా విజయం సాధిస్తే, రెండో భాగం కూడా ఉంటుంది. -
‘మిరాయ్’ షూటింగ్లో తేజకు గాయాలు, అనారోగ్యం.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా తొలి చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ కోసం చూస్తున్నప్పుడు ‘మిరాయ్’ అవకాశం వచ్చింది. అద్భుతంమైన కథ. నా క్యారెక్టర్ చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రంలోని యాక్షన్ అడ్వంచర్ ఆడియన్స్ గొప్ప అనుభూతిని ఇస్తుంది’ అని అన్నారు హీరోయిన్ రితీకా నాయక్. హనుమాన్ తర్వాత తేజ సజ్జ నటించిన తాజా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్గా రితీకా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా చేశాం. ముఖ్యంగా తేజ చాలా కష్టపడ్డాడు. షూటింగ్ సమయంలో ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కొన్నిసార్లు అనారోగ్యం కూడా చేసింది. అయినప్పటికీ ఆయన కరెక్ట్ టైం కి సెట్ లో ఉండేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.మనోజ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా ఫన్ ఫుల్ గా ఉంటారు. చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాలో దాదాపు 80% లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి రియల్ టైమ్ లొకేషన్స్ లోకి వెళ్లడం వెరీ చాలెంజింగ్. అయితే మా టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో జర్నీ చాలా అద్భుతంగా జరిగింది.కార్తీక్ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ట్రైలర్ రిలీజ్పై బిగ్ అప్డేట్!
తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం మిరాయ్. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మిరాయ్ గురించి మాట్లాడారు. టికెట్ ధరలు పెంచబోమని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ మంది సినిమా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ది రాజాసాబ్ అప్డేట్ ఇదే..మిరాయ్ ప్రెస్మీట్లో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా విడుదల కానుందని తెలిపారు. రిషబ్ శెట్టి కాంతార-2 ప్రదర్శించే థియేటర్లలో ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే ఈ లెక్కన అక్టోబర్ 2న ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజున తొలి పాటను విడుదల చేసే ఆలోచన ఉందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ది రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ విడుదల చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.#TheRajaSaab trailer1 will be attached with #KantaraChapter1 🔥 - #TGVishwaPrasad, Producer. Be ready for mass trailer in just one month. #KantaraChapter1onOct2 #TheRajaSaabTeaser #Prabhas #RishabhShetty #Bijuria pic.twitter.com/pmV250U6Q6— Subha The Luck (@Subha_The_Luck) September 3, 2025 -
ఎనిమిది భాషల్లో మిరాయ్ రిలీజ్.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న హీరో తేజ సజ్జా. ప్రస్తుతం యాక్షన్-ఫాంటసీ చిత్రం 'మిరాయ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్లో కనిపించనున్నారు.తాజాగా మిరాయ్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు హీరో తేజ సజ్జా ట్వీట్ చేశారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఈ మూవీని ఎంజాయ్ చేయండని పోస్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా యాక్షన్, ఎమోషన్, భక్తి ఉండే చిత్రమని రాసుకొచ్చారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా మెప్పించనుంది. అంతేకాకుండా శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. 2డీతో పాటు 3డీ ఫార్మాట్లో రిలీజవుతోంది.#MIRAI Censored with 𝐔/𝐀 ❤️🔥A CLEAN FILM for KIDS, FAMILIES and ALL SECTIONS OF AUDIENCE to experience Action, Emotion & Devotion on the big screens💥💥💥GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER 🥷Rocking Star @HeroManoj1@Karthik_gatta @RitikaNayak_ @vishwaprasadtg… pic.twitter.com/p3zCOrTWK9— Teja Sajja (@tejasajja123) September 8, 2025 -
మిరాయ్.. టికెట్ రేట్లు పెంచడం లేదు: తేజ సజ్జా
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. వారికోసమే ఈ నిర్ణయంతెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.టికెట్ రేట్లు యథాతథంఅయితే ఓ రెండు సర్ప్రైజ్లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్ను అభినందిస్తున్నారు.కథేంటంటే?మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
విశాఖలో 'మిరాయ్' ప్రీరిలీజ్ వేడుక.. సందడిగా స్టార్స్ (ఫోటోలు)
-
'మిరాయ్' కోసం శంకర్ మహదేవన్.. పవర్ ప్యాక్డ్ సాంగ్ వచ్చేసింది
మిరాయ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. తేజ సజ్జా ప్రధాన కథానాయుకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్లోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో రితికానాయక్ హీరోయిన్గా నటించగా.. మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి 'జైత్రయా' సాంగ్ను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ ఆలపించారు. -
Mirai: విడుదలకు ముందే రూ.20 కోట్ల లాభం!
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు.అందుకే థియేటర్స్లో ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగిన లాభాలు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా రిలీజ్కి ముందే రూ. 20 కోట్ల లాభాలను సంపాదించింది. అదే ‘మిరాయ్’.ట్రైలర్తోనే...హనుమాన్తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన తేజ సజ్జా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. విలన్గా మంచు విష్ణు, హీరో తల్లిగా శ్రియ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు భారీ స్పందన లభించింది. మూవీ విజువల్ వండర్లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వీఎఫెక్స్ అదిరిపోయింది. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలే వీఎఫెక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కేవలం రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు ట్రైలర్తోనే తెలిసిపోతుంది. ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే..?సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రిలీజ్కు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం లేదు. పెట్టిన ఖర్చును కూడా వెనక్కి తెచ్చుకోలేపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తేజ సజ్జా లాంటి కుర్ర హీరో సినిమా రిలీజ్కు ముందే లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. -
మిరాయ్ కథకు ఆ స్కోప్ ఉంది: దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ– ‘‘ఏడేళ్ల క్రితమే ‘మిరాయ్’ ఐడియా పుట్టింది. ఈ సినిమా పూర్తిగా కల్పితం. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ ఉంది.ఈ తొమ్మిది గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నించగా, వీటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథ. ఈ చిత్రంలో తల్లి–కొడుకుల బలమైన ఎమోషన్ కూడా ఉంది. తల్లి–కొడుకులుగా శ్రియ– తేజ నటించారు. ఆధ్యాత్మిక భావనలు గల అంబిక (శ్రియ పాత్ర పేరు) తన ఆశయం నెరవేరడానికి తన కొడుకుకి ఎలా మార్గనిర్దేశకత్వం చేసింది? అన్నది సినిమాలో చూడాలి. తేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు.మనోజ్ రోల్ కథలో చాలా బలంగా ఉంటుంది. హీరోని గైడ్ చేసే అగస్త్య మునిగా జయరామ్, తాంత్రిక గురువుగా జగపతిబాబు నటించారు. జటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. ట్రైలర్లో కనిపించే పక్షి సీక్వెన్స్ ఇది. ఈ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. రియల్ లొకేషన్స్లో ఈ సినిమాను చిత్రీకరించాం. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయ్ల్యాండ్... మొత్తం ఆసియా అంతా తిరిగేశాం. ఈ చిత్రంలో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. శ్రీలంకలో తేజపై ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మన ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో ఉందనే నమ్మకంతో ఈ సినిమా కథ చేశాను.చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇతిహాస కథలు, పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అంశాలన్నింటినీ కథలో ఆసక్తికరంగా బ్లెండ్ చేయడం అనేది నాకు సవాల్గా అనిపించింది. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. అయినా విశ్వ ప్రసాద్గారు చాలా స పోర్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే లోకల్గా చేస్తున్నారు.సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగుండాలంటే ఒకటి మన దగ్గర డబ్బులు ఉండాలి లేదా మన దగ్గర టైమ్ ఉండాలి. మాకు టైమ్ ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. హరి గౌర సినిమాను ఎలివేట్ చేసే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ఫ్రాంచైజీ బిల్డ్ చేసే స్కోప్ ఉన్న కథ ‘మిరాయ్’. ఈ సినిమా విజయంపై అది ఆధారపడి ఉంటుంది. ఇక దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, ఎడిటర్గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఏదన్నా ఐడియా ఉన్నప్పుడు వేరేవాళ్లకు కథలు కూడా ఇస్తున్నాను’’ అని అన్నారు. -
రజనీకాంత్గారు క్లాస్ తీసుకున్నారు: మంచు మనోజ్
తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా, మంచు మనోజ్ మరో ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్ చెప్పిన విశేషాలు. ⇒ తేజ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. క్యూట్గా ఉండేవాడు... బుగ్గలు గిల్లేసేవాడిని. ఓ సందర్భంలో మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు తమ్ముడూ సినిమా చేద్దామని అన్నాను. ‘నిజమా? అన్నా’ అని ‘మిరాయ్’ గురించి చెప్పాడు. దర్శకుడు కార్తీక్గారు కథ చెప్పారు. నచ్చి, ఈ సినిమా చేశాను. ⇒ ‘మిరాయ్’లో పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాను. వారసత్వం, లేజీనెస్ని ఏ మాత్రం సహించని క్యారెక్టర్ నాది. కథ రీత్యా తొమ్మిది గ్రంథాలు నా దగ్గరకు వస్తే, నా తలతో కలిసి పది తలల రావణుడిని అవుతాను. వాటి కోసం ఏం చేశాను? అన్నదే కథ. ఒక రకంగా మోడ్రన్ రావణాసురుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లడు. దర్శకుడు నా క్యారెక్టర్ను స్పెషల్గా డిజైన్ చేశారు. ‘మిరాయ్’ నాకు మంచి కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ⇒ ‘మిరాయ్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. శ్రీరాములవారి ప్రస్తావన, 9 పుస్తకాల బ్యాక్డ్రాప్, ఇతిహాస కోణాలు... ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమా కోసం తేజ చేసిన హార్డ్వర్క్ మీకు స్క్రీన్పై కనిపిస్తుంది. మేమిద్దరం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాం. హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఉన్న బడ్జెట్లోనే కార్తీక్గారు హాలీవుడ్ స్థాయి సినిమా తీశారు.విశ్వప్రసాద్ రాజీ పడకుండా నిర్మించారు. ఇక ‘కూలీ’ సినిమాకు ముందు మా ఇంట్లో రజనీకాంత్గారిని కలిశాను. ‘మిరాయ్’ ట్రైలర్ చూశారు. ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఎనర్జీనిచ్చాయి. ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని రజనీకాంత్ గారు క్లాస్ తీసుకున్నారు. ⇒ ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ సినిమాలు చేస్తున్నాను. ఇంటెన్స్ యాక్షన్ చిత్రాలు ఇవి. ఇక ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం రావాల్సినప్పుడు వస్తుంది. అలాగే డార్క్ కామెడీ ఫిల్మ్ ‘వాట్ ద ఫిష్’ ఎప్పుడొచ్చినా చాలా బాగుంటుంది. కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కథల కోసం చూస్తున్నాను. ‘నేను మీకు తెలుసా’ టీమ్తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను... కథలు వింటున్నాను. -
మిరాయ్ స్టోరీ ఇదే.. ఆసక్తిగా 'తేజా సజ్జా' వ్యాఖ్యలు
హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మిరాయి. మంచు మనోజ్, జగపతిబాబు, శ్రియ, రితికనాయక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీపుల్మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కించారు. ఈ నెల 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చైన్నెకి వెళ్లిన నటుడు తేజా సజ్జా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని చిత్రాలను మాత్రమే థియేటర్లో చూడాలనిపిస్తుందని, అలాంటి వాటిలో మిరాయి చేరుతుందని అన్నారు.యాక్షన్ ఎడ్వేంచర్ ఫాంటసీ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని 3ఏళ్ల బాలల నుంచి 80 ఏళ్ల పెద్దలు వరకూ చూసి ఆనందించే విధంగా ఉంటుందన్నారు. మిరాయి అంటే భవిష్యత్, నమ్మకం అని చెప్పారు. అయితే, మరో అర్థం కూడా ఉందని అది చిత్రంలో ట్విస్ట్తో తెలుస్తుందని చెప్పారు. మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని ఒక గ్రంధంగా రచించారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందనే భావనతో దాన్ని 9 గ్రంధాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. వారికి ఆ గ్రంధాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ ఒక్కొటిగా తస్కరిస్తుంది. వాటిని హీరో ఎలా కాపాడే ప్రయత్నం చేశాడు..? అన్నదే చిత్ర కథ అంటూ చెప్పారు.ఏదైనా విపత్తు వప్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాల్లో ఒక సమాదానం ఉంటుందన్నారు. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన మిరాయి చిత్రాన్ని చైనా, జపాన్ దేశాల్లోనూ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఆ దేశాల్లో భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్ ఉందన్నారు. ఇంతకు ముందు తాను నటించిన హనుమాన్ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో విడుదలయ్యిందని గుర్తుచేశారు. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేయడం చాలా సవాల్గా మారిందన్నారు. చిత్రం అంతర్జాతీయ స్థాయి విలువలతో ఉండాలని వీఎఫ్ఎక్స్లో ప్రతిభావంతులైన ప్రసాద్, కార్తీక్ పని చేశారని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకురాలు అర్చనకు తేజా సజ్జా ధన్యవాదాలు తెలిపారు. -
అంబిక... చాలా పవర్ఫుల్
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.ఈ సినిమాలో శ్రియ శరణ్ పోషించిన అంబిక పాత్రని పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్ను మంగళవారం విడుదల చేసింది యూనిట్. ‘‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు తేజ సజ్జా. ఈ సినిమాలో తేజ తల్లి పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు శ్రియ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్తో ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.మిరాయ్ ట్రైలర్ బాగుంది – రజనీకాంత్ ‘‘మిరాయ్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అని హీరో రజనీకాంత్ పేర్కొన్నారు. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. సోమవారం ఈ సినిమా ప్రెస్మీట్ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ని కలిసి, ‘మిరాయ్’ ట్రైలర్ చూపించారు మనోజ్. ‘‘మిరాయ్’ ట్రైలర్ చూస్తుంటే సినిమాని గ్రాండ్ స్కేల్లో నిర్మించారని తెలుస్తోంది. మనోజ్ పాత్ర పవర్ఫుల్గా ఉందని అర్థం అవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి... యూనిట్కి అభినందనలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘మిరాయ్’ మూవీతో రజనీకాంత్గారి ఆశీర్వాదాలు నాకు దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మంచు మనోజ్. -
మిరాయ్ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు. -
మిరాయ్.. ఓ అద్భుతం!
ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక విజువల్ వండర్ అని.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్తో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతీ ఫ్రేమ్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) ప్రామిసింగ్గా సాగిన ఈ ట్రైలర్.. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్.. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్గా ట్రైలర్ సాగింది. హీరో చేసిన యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్తో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా.. ట్రైలర్ చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన ట్రైలర్ ఇచ్చి, విజువల్ వండర్ సినిమా ఇవ్వబోతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మీడియా ఫ్యాక్టరీ పై విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా.. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ పై పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో పాటు.. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో బడా బడా బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో.. సెప్టెంబర్ 12న మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
అది బోనస్: తేజ సజ్జా
‘‘మన తెలుగు ప్రేక్షకుల స పోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్’’ అని తేజ సజ్జా చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘మిరాయ్’ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. చాలా క్లీన్ ఫిలిం. పిల్లలు, కుటుంబమంతా కలిసి చూడొచ్చు’’ అని తెలి పారు. మనోజ్ మంచు మాట్లాడుతూ– ‘‘మిరాయ్’లో నాది బలమైనపాత్ర.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి’’ అని చె ప్పారు. ‘‘మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కృతీ ప్రసాద్. ‘‘చాలా సిన్సియర్గా తీసిన సినిమా ఇది’’ అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది ‘మిరాయ్’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. -
తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'మిరాయ్' మూవీ ట్రైలర్ విడుదల
-
అంచనాలు పెంచేసిన 'మిరాయ్' ట్రైలర్..
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్' ట్రైలర్ వచ్చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
'మిరాయ్' విడుదలకు చేతులు కలిపిన టాప్ బ్యానర్స్
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తేజ సజ్జా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సూపర్ యోధాగా ఆయన నటించిన చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థలు మిరాయ్ డిస్ట్రిబ్యూట్ హక్కులను పొందాయి.మిరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ బ్యానర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో హోంబాలే ఫిల్మ్స్, తమిళనాడులో AGS ఎంటర్టైన్మెంట్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వారు మిరాయ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలోనే టాప్లో ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు కావడం విశేషం. తెలుగులో మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేస్తున్నారు.టాప్ బ్యానర్స్ నుంచి మిరాయ్ సినిమా విడుదల కావడం అనేది ఖచ్చితంగా ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది. దీంతో మిరాయ్ జాతీయ స్థాయిలో తప్పకుండా అద్భుతాలను సృష్టించగలదను అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే రూ. 300 కోట్లకు పైగా మార్క్ను సులువుగా అందుకోవచ్చిన అంచనాలు ఉన్నాయి. -
తేజా సజ్జా 'మిరాయ్'.. వారం లేటుగా థియేటర్లలోకి
బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా 'హనుమాన్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా.. ఇప్పుడు 'మిరాయ్'తో రాబోతున్నాడు. ఇది సూపర్ హీరో తరహా సినిమానే. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్గా సెప్టెంబరు తొలివారం రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందని చెబుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్తో గుర్తింపు)తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్గా చేస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ వారం ఆలస్యంగా అంటే సెప్టెంబరు 12న థియేటర్లలో తీసుకురానున్నట్లు ఇప్పుడు కొత్త పోస్టర్ వదిలారు.అలానే ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు ముందే పీపుల్స్ మీడియా సంస్థలో తేజా సజ్జా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రీసెంట్గానే ఆ ప్రకటన కూడా వచ్చింది. అయితే అది 'జాంబీరెడ్డి' సీక్వెల్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు)From the ethos of Itihasas, born a battle for the future ⚔️#MiraiTrailer drops on 28th August 🔥Get ready to witness India’s most ambitious Action-Adventure Saga 🥷❤️🔥#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER💥Rocking Star @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/8orFDK7EkN— Teja Sajja (@tejasajja123) August 26, 2025 -
సూపర్ యోధ పోరాటం
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 23) తేజ సజ్జా బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిరాయ్’ సినిమా నుంచి తేజ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. కూలిపోతున్న వంతెనపై కేవలం ఒక స్టిక్తో నిలబడి ఓ సూపర్ యోధాలా హీరో పోరాటం చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.‘‘ఈ చిత్రంలో ఓ సూపర్ యోధ అవతార్లో తేజ కనిపిస్తారు. అతనిపాత్రలో పట్టుదల, ధైర్యం కనిపిస్తాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, ఫస్ట్ వైబ్ సాంగ్లకు మంచి స్పందన వచ్చింది. అలాగే నార్త్లో ‘మిరాయ్’ సినిమా హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో సెప్టెంబరు 5న విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి. ఫ్రమ్ రాయలసీమ: ‘మిరాయ్’ సినిమా తర్వాత తేజ సజ్జా హీరోగా టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ మరో సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్నిపాన్–ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘ఫ్రమ్ రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే ట్యాగ్లైన్ ఈ కాన్సెప్ట్ పోస్టర్పై ఉంది. -
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్గా, ఆ తర్వాత లెజెండ్గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘వైబ్’ అదిరింది
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు మేకర్స్. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. -
భాగ్యనగరంలో యోగా డే సంబరాలు : సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత
యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్ను నిరూపించుకున్నారు.ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఫ్రీడమ్: హీరో తేజ సజ్జా
‘చూడాలని ఉంది, కలిసుందాం రా, గంగోత్రి, ఛత్రపతి’ తదితర చిత్రాలతో బాల నటుడిగా ప్రేక్షకులకు దగ్గరై, ‘ఓ బేబీ’తో లీడ్ యాక్టర్గా మారి, ఆ తర్వాత చేసిన ‘జాంబిరెడ్డి’తో ఆకట్టుకున్నారు తేజ సజ్జా. ‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ ‘ఫాదర్స్ డే’ గురించి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...⇒ నాకు ఊహ తెలిసినప్పట్నుంచి మా నాన్నగారు వృత్తి రీత్యా బిజీగా ఉండేవారు. కానీ ఆదివారం మాత్రం నన్ను కూడా తనతో పాటు ఆఫీస్కు తీసుకుని వెళ్లేవారు. అక్కడ అందరూ పని చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని. అలా వెళ్లడం వల్లనో ఏమో నా ఆరేళ్ల్ల వయసుకే స్కూలు, సినిమా షూటింగ్లు వంటి పరిసరాల్లో నేను చాలా మామూలుగా ఉండగలిగాను. ఎలాంటి బెదురు లేకుండా షూటింగ్ చేసేవాణ్ణి. ⇒ నా అల్లరి విషయానికొస్తే... ఒకసారి స్కూల్ నుంచి మా నాన్నగారికి ఫోన్ చేసి, ‘మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు’ అని కంప్లైంట్ చేశారు. నాన్న చాలా కూల్గా... ‘వాడిని పెంచింది నేను. ఏం చేస్తాడో, ఏం చెయ్యడో నాకు బాగా తెలుసు. మీరేం చెప్పినా నమ్మను. వాడిని అడగను కూడా’ అని ఫోన్ కట్ చేశారు. నాన్న అంత నమ్మారు కాబట్టి అప్పట్నుంచి ఈరోజు వరకూ నా వల్ల ఆయనకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా జాగ్రత్తగా, క్రమశిక్షణతో ఉంటున్నాను. ⇒ నాన్నకి నేనంటే చాలా నమ్మకం. నా ఇష్టాయిష్టాలకు, నా నిర్ణయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. చదువు, సినిమాలు... ఇలా నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. యాక్చువల్లీ నాన్నకు మొదట్లో సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. ఒకటి, రెండు సినిమాలు అయ్యాక నేను షూటింగ్స్ను పిక్నిక్లా ఎంజాయ్ చేస్తున్నానని నన్ను వెళ్లనిచ్చారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యాక ధైర్యం చేసి, నాన్న దగ్గరికి వెళ్లి, ‘ఈ చదువు నా వల్ల కావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి వెళ్తాను’ అనగానే టీవీ చూస్తున్న నాన్న కనీసం తల కూడా తిప్పకుండా ‘సరే నీ ఇష్టం’ అన్నారు. అలా ఒక్క మాట కూడా అడగకుండా నాకు ఇష్టమైన కెరీర్ని ఎంచుకునేలా ప్రోత్సహించేసరికి, ఒక బాధ్యతలా భావించి, పట్టుదలతో పని చేస్తున్నాను. ⇒ నా లైఫ్లో మా నాన్నే నా హీరో. ఒక మామూలు వ్యక్తిగా లైఫ్ స్టార్ట్ చేసి, తన వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబంలో ఉన్న అందరి బాధ్యతలతో పాటు... బంధువుల్లో ఎంతో మందికి చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికి హెల్ప్ చేశారు. ⇒ మా నాన్నకు కుటుంబం తప్ప వేరే వ్యాపకం లేదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబం... ఇదే ఆయన లోకం. చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, అంకితభావం ఎలా ఉండాలో నాన్నగారి నుండి నేర్చుకున్నాను. మనం చేసే పనికి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యాలని నేర్చుకున్నాను. అలాగే లైఫ్లో జరిగే ప్రతీ విషయం గురించి అదే పనిగా ఆలోచించకుండా ‘ప్రశాంతంగా ఉండటం’ అనేది మా నాన్న నుంచి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ⇒ మా నాన్నగారికి ఇప్పుడు 64 ఏళ్లు. ఆయన ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంట వాకింగ్ చేస్తారు. తర్వాత ఆఫీసుకు వెళ్లడం. గత 30 ఏళ్లుగా ఇదే దినచర్య. నాకు క్రమశిక్షణ ఉంది కానీ... ఇలాంటి క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ⇒ మా నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా నా సం΄ాదనతో ఆయనకి ఒక మంచి కారు కొని, గిఫ్ట్గా ఇచ్చాను. అప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఈ ‘ఫాదర్స్ డే’కి మా నాన్నగారికి నేను ఇచ్చే గిఫ్ట్ అంటే ‘సాక్షి’కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూనే. మా నాన్నగారు ఈ ఇంటర్వ్యూ చదివి, ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. ⇒ నాకు పదేళ్లు వచ్చేసరికి మా నాన్న నాతో ఒక ఫ్రెండ్లా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులు, విషయాల్లో నా ఒపీనియన్ అడిగి తెలుసుకునే వారు. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో నా అబీప్రాయానికి కూడా విలువ ఇచ్చేవారు. నేను చాలా బాధ్యతగా ఉండటానికి అది చాలా ఇన్స్పైర్ చేసింది.⇒ నాన్న నాతో చెప్పే చిన్న చిన్న మాటలే నాకు లోతైన అవగాహన కలిగిస్తాయి. నా కెరీర్ పరమైన, రోజువారీ విషయాల్లో ఆయన కలుగజేసుకోరు. కానీ ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఎలా సాఫ్ట్గా మాట్లాడాలో, మనం చెప్పే మాట ఎదుట వ్యక్తికి సులువుగా అర్థమయ్యేలా ఎలా మాట్లాడాలో అప్పుడప్పుడు చెబుతుంటారు.⇒ నా లైఫ్లో మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అంటే... చాలా చిన్న వయసులోనే నాకు సంబంధించినవి నేనే ఎంచుకునే ఫ్రీడమ్. వీటివల్లే నేను సొసైటీలో తిరిగి, చాలామంది వ్యక్తులను కలిసి, అన్ని రకాల పరిస్థితులను దగ్గరగా చూసి, ఆలోచించి, అందుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకున్నాను. సినిమా షూటింగ్, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా నాన్నతో కూర్చుని మాట్లాడతాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వరుస సినిమాల వల్ల నిజంగానే నాన్నగారితో ఎక్కువ టైమ్ గడపడానికి కుదరడం లేదు. అదో చిన్న లోటులా అనిపిస్తుంటుంది. -
తేజ సజ్జా మిరాయ్ మూవీ టీజర్ రిలీజ్
-
ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. 'మిరాయ్' మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'లో పవర్ఫుల్ విలన్గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ 'కల్కి' తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ) -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
జోరుగా హుషారుగా...
సమ్మర్ హాలిడేస్ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్ కూల్గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్లో షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.జన్వాడలో ఆటా పాటా హీరో మహేశ్బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ ఆయ్యారు. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్ని హైదరాబాద్ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్ని ఒడిశాలోని కోరాపుట్లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడవ షెడ్యూల్లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ పాట షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ముచ్చింతల్లో జాతర హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగనుందని టాక్.ఇటీవల అరకులో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్ పెయిర్గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘మాస్ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి. గుహల్లో పరిశోధన హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్’ మూవీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్ వేశారని టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సెట్లో స్పెషల్ సాంగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్ తేజ్. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ‘వీటీ 15’ రూపొందుతోంది.ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ పాటలో వరుణ్ తేజ్తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్చరణ్ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.ముచ్చింతల్లో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.తుక్కుగూడలో సంబరాలుహీరో సాయిదుర్గా తేజ్ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండి యన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాచుపల్లిలో తెలుసు కదా!‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్లో సూపర్ యోధబాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ‘హను–మాన్’ వంటి హిట్ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్లో జరిగిన ఓ షెడ్యూల్లో తేజపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్ ఘట్టమనేని.పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
మరో ప్రపంచం పిలుస్తోంది... రండి!
వెండితెరపై ఆడియన్స్కు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ టెక్నాలజీని చూపించేందుకు మన తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందుకోసం కథల్లో సరికొత్త ప్రపంచాలను, ప్రాంతాలను క్రియేట్ చేసి, ఆడియన్స్ను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ‘మరో ప్రపంచం పిలుస్తోంది... రండి’ అంటూ ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న కొన్ని చిత్రాలపై కథనం.విశ్వంభర వరల్డ్ఫాంటసీ జానర్లో చిరంజీవి హీరోగా ‘అంజి, జగదేకవీరుడు అతిలోక సుందరి’ వంటి సినిమాలొచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ ఈ జానర్లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాలో కొంత భాగం కథ 500బీసీ టైమ్లో సాగుతుంది. ఈ సీక్వెన్స్లో వచ్చే సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్పై ఆడియన్స్కు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. కాగా మరోసారి తన విజువల్ విజన్ను ‘విశ్వంభర’ సినిమాలోనూ చూపించనున్నారు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లో సరికొత్త విజువల్స్ కనిపిస్తున్నాయి.పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి ఈ సినిమా కథలో కీలకంగా ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇలా ‘విశ్వంభర’ సినిమాలోని కొంత భాగం ఆడియన్స్ను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ మూవీలో ఆంజనేయ స్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని తెలిసింది. త్రిషా, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటించగా, చిరంజీవి చెల్లెలి పాత్రల్లో ఇషా చావ్లా, పసుపులేటి రమ్య కనిపిస్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.నాలుగో ప్రపంచం కూడా ఉందా? కురుక్షేత్ర యుద్ధానికి ఆరువేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి, దర్శకుడు నాగ్ అశ్విన్ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఈ మూవీలో 2898 ఏడీ సమయంలో కాశీ నగరం ఎలా ఉంటుందో ఊహాత్మకంగా, కల్పితంగా స్క్రీన్పై ఆడియన్స్కు చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే ఇదే చిత్రంలో కాంప్లెక్స్, శంభాల అనే మరో రెండు కొత్త ప్రపంచాలను కూడా చూపించారు.అయితే నాలుగో ప్రపంచం కూడా ఉందని, ఇది ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’లో కనిపిస్తుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ప్రీప్రోడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. తొలి భాగం చిత్రీకరణ సమయంలోనే సీక్వెల్ని కూడా కొంత భాగం చిత్రీకరించారట. అయితే సీక్వెల్ చిత్రీకరణ 2026లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావొచ్చని, 2028ప్రారంభంలో ఈ మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ ప్రచారంలో ఉంది. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు.అలాగే ప్రభాస్ హీరోగా ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘బ్రహ్మరాక్షస’ అనే మూవీ రానుందని, ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ ఓ అద్భుతమైన ప్రపంచాన్ని రెడీ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇంకా ప్రభాస్ మరో మూవీ ‘సలార్’ కోసం ఖాన్సార్ అనే ఓ కొత్తప్రాంతాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ ఖాన్సార్ గురించి మరింతగా ‘సలార్’ రెండో భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో ఉండనున్నట్లుగా తెలిసింది.సైన్స్ లోకం ఆడియన్స్ను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ రానుంది. ఈ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారట అట్లీ. ఇందుకోసమే ప్రస్తుతం అట్లీ విదేశీ వీఎఫ్ఎక్స్ నిపుణులతో కలిసి ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఈ ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వెండితెరపై అట్లీ చూపించనున్న ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ మూవీలో కొన్ని కొత్త రకాల జంతువులు కూడా కనిపిస్తాయనే ప్రచారం సాగుతోంది.అంతేకాదు... ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని, హీరోయిన్స్గా జాన్వీ కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించనున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్పిక్చర్స్ సంస్థ ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించనుంది. 2027లో ఈ మూవీ రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ను ప్లాన్ చేస్తున్నారట.మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ ఓ మూవీ అంగీకరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫిల్మ్ ఇది. భారతీయ ఇతిహాసాల నుంచి ఇప్పటివరకు రాని ఓ సరికొత్త పాయింట్తో త్రివిక్రమ్ ఈ మూవీ చేయనున్నారని, ఇందుకోసం స్క్రీన్పై కొత్త ప్రపంచాన్ని టీమ్ రూపొందించనుందని సమాచారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సూర్యదేవర రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించనున్నారు.అంజనాద్రిలో జై హనుమాన్బ్లాక్బస్టర్ మూవీ ‘హను–మాన్’లో దర్శకుడు ప్రశాంత్ వర్మ అంజనాద్రి అనే ఊరుని చూపించారు. తేజా సజ్జా హీరోగా నటించిన చిత్రం ఇది. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ‘హను–మాన్’ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రానుంది. ప్రశాంత్ వర్మయే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘జై హను మాన్’ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది చివర్లో ‘జై హనుమాన్’ చిత్రీకరణలో పాల్గొంటారట రిషబ్ శెట్టి. కాగా... ‘జై హనుమాన్’ మూవీలో రాముడు, లక్ష్మణుడి పాత్రల ప్రస్తావన కూడా ఉంటుందని, ‘హను–మాన్’ సినిమా క్లిప్ హ్యాంగర్ వీడియోను చూసినవారికి అర్థమయ్యే ఉంటుంది. సో... ‘జై హనుమాన్’ సినిమా మరింత పెద్ద స్పాన్తో రూపొందనుందని తెలుస్తోంది. సో... ఆటోమేటిక్గా ‘అంజనాద్రి’ స్పాన్స్ కూడా పెరుగుతుందని ఊహించవచ్చు. ఇలా... అంజనాద్రిలో ‘జై హనుమాన్’ సాహసాలు, విన్యాసాలు చూసేందుకు మాత్రం చాలా సమయం ఉంది.2027లో మూవీ రిలీజ్ కావొచ్చు. ఇంకా హను–మాన్లో నటించిన తేజా సజ్జా ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’లోనూ ఉంటారని తెలిసింది. అలాగే తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ రానుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్గా కనిపిస్తారు. ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాలో రుద్రవనం అనే కల్పిత విలేజ్లో జరిగే సంఘటనలు ఆడియన్స్ను అలరించాయి. సాయిదుర్గా తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత హీరో నాగచైతన్యతో దర్శకుడు కార్తీక్ దండు మరో మిస్టిక్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ ఆల్రెడీప్రారంభమైంది. కాగా ఈ చిత్రం కోసం ‘రుద్రవనం’ మాదిరి మరోప్రాంతాన్ని సృష్టిస్తున్నారట కార్తీక్ దండు.ఆల్రెడీ రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఓ పక్షి కన్నులో ఓ పెద్ద పర్వతంపై నాగచైతన్య ఉన్నట్లుగా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో నాగచైతన్య ఓ స్టైలిష్ లుక్లో కనిపిస్తారని తెలిసింది. ఇక ఈ మూవీలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.వెయ్యేళ్ల క్రితంఆధ్యాత్మిక ప్రపంచం ‘శంబాల’కు ఆడియన్స్ను తీసుకువెళ్లనున్నారు హీరో ఆది సాయికుమార్. జియో సైంటిస్ట్గా ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. కాల్పనిక ప్రపంచం శంబాల నేపథ్యంలో యుగంధర్ ముని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పదివేల సంవత్సరాల క్రితం, వెయ్యి సంత్సరాల క్రితం, 1980... ఇలా మూడు కాలమానాల్లో ఈ సినిమా కథనం సాగుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో శ్వాసిక మరో లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తీశారు మేకర్స్. త్వరలోనే టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్లపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా మేకర్స్ ఇటీవల తెలిపారు.ప్యారడైజ్‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో నాని సరికొత్తగా కనిపిస్తున్నారు. 1980 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో సికింద్రాబాద్ కుర్రాడిలా నాని నటిస్తారని తెలిసింది. ఈ మూవీ ఆడియన్స్కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వనుంది. అప్పటి కాలాన్ని రీ–క్రియేట్ చేసే పనిలో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.ఓ తెగ నాయకుడిగా నాని కనిపిస్తారని, గుర్తింపుకోసం పోరాడే ఓ తెగ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్నగర్ సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరికూరియే ఈ సినిమానూ నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘హిట్ 3’ సినిమా ప్రమోషన్స్తో నాని బిజీగా ఉన్నారు. మే 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక మే రెండో వారం నుంచి ‘ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారని తెలిసింది. ‘ప్యారడైజ్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.కిష్కింధపురి!ఆడియన్స్ కోసం ‘కిష్కింధపురి’ అనే హారర్ అండ్ మిస్టీరియస్ వరల్డ్ను క్రియేట్ చేస్తున్నారట బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాడి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీ చేస్తున్నారు. ఈ హారర్ అండ్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీకి ‘కిష్కింధపురి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట మేకర్స్. హారర్ ఎలిమెంట్స్, ప్రేతాత్మల ప్రస్తావన, ఆధ్యాత్మిక అంశాలతో ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీకి చెందిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.ఇలా ఈ తరహాలో ఆడియన్స్ను మరో కొత్త ప్రపంచానికి లేదా కొత్తప్రాంతానికి తీసుకుని వెళ్లే హీరోలు, దర్శక–నిర్మాతలు మరి కొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తేజసజ్జాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. అంతా 'హనుమాన్' వల్లే!
-
Sakshi Excellence Awards 2025: మిరాయ్ సినిమా పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ
-
పాన్ ఇండియా మూవీస్ పైనే హనుమాన్ హీరో గురి..!
-
'మిరాయ్' ది సూపర్ యోధ విడుదలపై ప్రకటన
గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు.'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్లైన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా ఉండనుంది. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
ఇఫీలో హను–మాన్ భాగం కావడం ఆనందం: తేజ సజ్జా
‘‘కథా కథనాల పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిరుచి మన సినిమా అభివృద్ధికి దోహదపడుతుంది’’ అన్నారు హీరో తేజ సజ్జా. ‘‘హను–మాన్’ కేవలం సినిమా కాదు.. మన సాంస్కృతిక మూలాలు, సంప్రదాయాలకు కట్టిన పట్టం’’ అని కూడా అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘హను–మాన్’ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ... ‘‘కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో దైవిక శక్తులను పొందిన ఓ చిన్న దొంగ... మహా శక్తిమంతుడైన హనుమంతుని దాకా సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రం చూపించిందని, భారతీయ పురాణాల విశిష్టతను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ చిత్రం ద్వారా నిర్వర్తించామనీ అన్నారు. ఈ చిత్రం మన పౌరాణిక మూలాలను చాటి చెబుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిందన్నారు.‘హను–మాన్ ’ సీక్వెల్ రూపకల్పన కోసం పని చేస్తున్నట్టు ధృవీకరించారు. తెలుగు పరిశ్రమ వినూత్న కథనాలతో అంతర్జాతీయంగా గొప్ప గుర్తింపు సాధిస్తోందన్నారు. ‘హను–మాన్’ సాంస్కృతిక వారసత్వం, ఆధునిక కథల శక్తిమంతమైన సమ్మేళనమని, భారతీయ పనోరమాలో భాగం కావడం ఈ చిత్ర కళాత్మక సాంస్కృతిక విశిష్టతకు నిదర్శనం’’ అంటూ తన ఆనంద వ్యక్తం చేశారు తేజ సజ్జా. – గోవా నుంచి సాక్షి ప్రతినిధి -
టాలీవుడ్ యంగ్ హీరో కాళ్లు మొక్కిన సీనియర్ సిటిజెన్.. వీడియో వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా పొంగల్ పోటీలో సూపర్ హిట్గా నిలిచింది. గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ చిత్రాలతో పోటీపడి రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. అయితే ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో తేజ సజ్జా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హనుమాన్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తేజ సజ్జా వేదికపై సందడి చేశారు. ఆ సమయంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ సిటిజెన్ తేజ సజ్జా కాళ్లకు నమస్కరించాడు. అయితే వెంటనే తేజ ఆయనను అలా చేయవద్దని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కాగా.. తేజ ప్రస్తుతం మరో మూవీలో హీరోగా నటిస్తున్నారు. Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024 -
ప్రేమలో భిన్న కోణం
‘‘నిర్మాత బెక్కం వేణుగోపాల్గారు ఇప్పటివరకు తీసిన 14 సినిమాల ద్వారా ఎందరో దర్శకులను, రచయితలను, నటీనటులను పరిచయం చేశారు. ‘రోటి కపడా రొమాన్స్’’ చిత్రంతోనూ చాలా మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నారు. ఆయన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది. ఈ చిత్రం యూనిట్కి బ్రేక్ ఇవ్వాలి’’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’.బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కినుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా తేజ సజ్జా, అతిథులుగా దర్శకులు యదు వంశీ, పవన్ సాధినేని, హర్ష, రచయిత కోన వెంకట్, నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ‘‘నేటి తరం యువతకి, ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు విక్రమ్ రెడ్డి. ‘‘ప్రేమకథలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు’’ అన్నారు బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్. -
ఐఫా కాంట్రవర్సీ.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: తేజ సజ్జా
‘ఐఫా’ అవార్డుల వేడుకలో రానా-తేజ సజ్జ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు వ్యాఖ్యాతలుగా చేసిన రానా-తేజ స్టార్ హీరోల సినిమాలపై జోకులు వేశారు. అయితే ఫ్యాన్స్ దానికి సంబంధించిన క్లిప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..రానా-తేజలను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై తేజ సజ్జ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేడుకలో తాము సరదా కోసమే అలా మాట్లాడామని, ఫుల్ వీడియో చూస్తే ఆ విషయం అందరికి అర్థమవుతుందని చెప్పారు. ‘ఐఫా అవార్డులు అనేది ఒక జాతీయ స్థాయి వేడుకు. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తుంటారు. అన్ని విధాల చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్టులు అందిస్తారు. మేము అదే ఫాలో అవుతాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్పులన్నీ కట్ చేసినవి మాత్రమే. ఫుల్ వీడియో చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. రానా నాపై జోకులు వేశాడు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. అందరి హీరోలతో కలిసి పని చేశాను. స్టార్ హీరోలందరితోనూ నాకు మంచి అనుబంధం ఉంది. వారిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మా వ్యాఖ్యలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇలా కాంట్రవర్సీ చేస్తున్నారు’అని తేజ సజ్జ అన్నారు. కాగా, ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుక అబుదాబిలో నిర్వహించారు. సెప్టెంబర్లో జరిగిన ఈ వేడుకలో రానా-తేజ సజ్జ హోస్ట్గా వ్యవహరించారు. పలువురు టాలీవుడు స్టార్ హీరోహీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
'రోటి కపడా రొమాన్స్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
రానా, తేజ సజ్జా సారీ చెప్పాల్సిందే.. మహేశ్ బాబు ఫ్యాన్స్ డిమాండ్!
టాలీవుడ్లో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజే వేరు. అగ్రహీరోల సినిమాలన్నీ ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాయి. పొంగల్ బాక్సాఫీస్ పోటీకి థియేటర్లు దొరకడం అంతా ఆషామాషీ కాదు. అందుకే పెద్ద హీరోలంతా ముందుగానే కర్చీఫ్ వేసేస్తారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ చిత్రం రెడీ అయిపోయాయి. త్వరలోనే మరిన్నీ చిత్రాలు పొంగల్ బాక్సాఫీస్ పోటీకి సై అంటున్నాయి.అయితే ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలే సందడి చేశాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్తో పాటు ప్రశాంత్ వర్మ హనుమాన్ పోటీలో నిలిచాయి. తేజ సజ్జా నటించిన ఈ చిత్రం ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ను షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలకు గట్టి పోటీనిచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సీక్వెల్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో తేజ సజ్జా కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్కు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్గా వ్యవహరించారు. వేదికపై వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. తేజను రానా పొగుడుతూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత వెంటనే నేను మహేశ్ బాబు గురించి మాట్లాడనంటూ రానా ఫన్నీగా చెప్పారు. ఇదేంటి ఇది నాకు కూడా సింక్ అయిందేంటని తేజ సజ్జా అన్నారు. ఆ తర్వాత రానా అతను సూపర్ స్టార్, మీరు ఒక సూపర్ హీరో మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు. సంక్రాంతి మ్యాటర్ ఇప్పుడు మాట్లాడవద్దంటూ తేజ సరదాగా అనడంతో.. దానికి ఎందుకు.. అదంతా సెన్సిటివ్ టాపిక్ హా' అని రానా బదులిచ్చాడు.అయితే ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి సంభాషణ మహేశ్ బాబును కించపరిచేలా ఉందంటూ నెట్టింట మండిపడుతున్నారు. తమ అభిమాన హీరో మహేశ్ బాబును ఎగతాళి చేశారని తేజ సజ్జా, రానాపై ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 25 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న మహేష్ మీద సెటైర్ వేయడం కరెక్ట్ కాదంటున్నారు ఫ్యాన్స్. మహేష్ సినిమాను కించపరిచినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. గుంటూరు కారం సినిమాపై మాట్లాడినందుకు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రానా, తేజ సజ్జా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Context 😤pic.twitter.com/PBTuhvgD3W— Cinderella🦋 (@GlamGirl_Geetha) November 6, 2024 U had one success man, one! Daniki 25 yrs ga ace filmography unna Mahesh meedha satireUnless you come up with a sequel for Hanuman, aa collections thechkolev and yk why @tejasajja123 Inka Rana gurinchi enduku, shelved project adhi— Jimhalpert (@satvikdhfm) November 5, 2024 Dear @tejasajja123 ,Need apology to superstar @urstrulyMahesh garu and his fans You and rana degrade comments about 2024 sankranthi films , in this sankranthi one of my beloved superstar film also there you know also,Please try to understand this situation.Thanks and…— Sagar MB (@dhfmbabu4005) November 5, 2024 -
నెవర్ బిఫోర్ అనేలా 'హను-మాన్' మేకింగ్ వీడియో
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. వీడియోతో పాటు హనుమాన్ చాలీసాను యాడ్ చేశారు. ఆ వీడియో నిడివి 2:43 నిమిషాలు ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న హనుమాన్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
జపాన్లో ‘హను-మాన్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. (చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్కి మెయిల్స్.. నిజమేంటి?)ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు. After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024 -
శిల్పకళావేదికలో మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
-
‘మిరాయ్’ ది సూపర్ యోధ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
యోధుడిగా మంచు మనోజ్.. 'మిరాయ్' గ్లింప్స్ విడుదల
తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్లైన్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది బ్లాక్ స్వాడ్' గ్లింప్స్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మంచు మనోజ్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. అసలుసిసలైన యోధుడిగా కత్తితో చేస్తున్న పోరాట సన్నివేశాన్ని చూపించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024 -
తేజ సజ్జపై చిరంజీవి కామెంట్స్ వైరల్
-
నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే 150కి పైగా సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం 'విశ్వంభర' అనే మూవీ చేస్తున్న చిరు.. యంగ్ హీరోలపై ఎప్పటికప్పడు తన అమితమైన ప్రేమని చూపిస్తుంటారు. ఇప్పుడు అలానే సౌత్ ఇండియా ఫెస్టివల్-2024లో మాట్లాడుతూ 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జాని ఆకాశానికెత్తేశారు. (ఇదీ చదవండి: సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?) 'ఆ కుర్రాడిని చూశారా? (తేజ సజ్జాని యాంకర్ కి చూపిస్తూ..) అతడు 'హనుమాన్' సినిమా చేశాడు. కానీ 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాతో మూవీస్ చేశాడు. ఇంద్ర చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. నన్ను అభిమానిస్తూ, నా చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకుని హీరో అయ్యాడు. 'హనుమాన్'తో తనని తాను నిరూపించుకున్నాడు' 'నేను కూడా హనుమాన్ పై సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ చేయలేకపోయాను. నా ప్రయత్నానికి ముందే అతడు చేసేశాడు. కానీ ఈ విషయంలో నేను పూర్తిగా సంతృప్తి చెందాను. ఎందుకంటే అతడు కూడా నా ప్రయాణంలో భాగమే. నటుడిగా నిరూపించాడు. ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు' అని చిరు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గుండె బద్దలైంది.. బయటపడటానికి చాలా టైమ్ పట్టింది: మృణాల్) Padma Vibhushan, Mega 🌟 @KChiruTweets lauds @tejasajja123 for his impressive journey in cinema at #SIFF pic.twitter.com/3d6DtdDFAC — Vamsi Kaka (@vamsikaka) April 12, 2024 -
అంజనాద్రి 2.0.. 'జై హనుమాన్' వీడియో పోస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేసింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సీక్వెల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ తాజాగా స్పెషల్ మ్యూజిక్ థీమ్ను షేర్ చేశారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియోలో అందమైన కొండల మధ్యలో పెద్ద నది ఉంది. పార్ట్ -1 మాదిరి ఈ వీడియోలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించిన ప్రశాంత్.. 'వెల్కమ్ టు అంజనాద్రి 2.0' అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఆపై టైటిల్ నేమ్ అయిన #Jai Hanuman హ్యాష్ట్యాను కూడా దానికి జత చేశారు. ఫైనల్గా ఈ వీడియోకు 'హనుమాన్' నుంచి 'రఘునందన' పాటను అటాచ్ చేయడం విశేషం. హనుమాన్ సినిమా ముగింపులోనే పార్ట్2 ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగా 'జై హనుమాన్' తెరకెక్కుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ విడుదల కావచ్చు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికే జై హనుమాన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను ఒక స్టార్ హీరో చేస్తారని చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరీ ఆ స్టార్ హీరో ఎవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఇకపోతే హనుమాన్ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్ పలు రికార్డులు కొల్లగొట్టింది. స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ అప్డేట్ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట. Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb — Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024 -
హనుమాన్ ఖాతాలో తొలి అవార్డు.. ప్రశాంత్ వర్మ ట్వీట్
ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం ఖాతాలో మొదటి అవార్డు వచ్చి చేరింది. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతో పోటీని తట్టుకుని రూ. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం జీ5 ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం రూ. 40 కోట్లతో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా .. హనుమాన్ కథకు ఇండియన్ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో ప్రశాంత్ వర్మ కష్టం కనిపిస్తుంది. హనుమాన్ విజువల్స్ చూసిన చిన్న పిల్లల.పెద్దలు ఫిదా అయ్యారు. అందుకే వారందరినీ మరోసారి సినిమా చూసేలా చేశాయి. థియేటర్స్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన హనుమాన్.. ఓటీటీలో కూడా సత్త చాటుంది. కొద్దిరోజుల క్రితమే హనుమాన్ కలెక్షన్స్ వర్షం ఆగింది.. ఇప్పుడు అవార్డుల వర్షం మొదలైంది. ఈ క్రమంలో రేడియో సిటీ తెలుగు నిర్వహించిన ఐకాన్ అవార్డ్స్లో హనుమాన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డును ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయనకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. First award for #HanuMan 🙂 Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro — Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024 -
బాక్సాఫీస్ సంచలనం.. ఓటీటీలో కేవలం 11 గంటల్లోనే!
బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్గా నిలబెట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్తో గ్లోబల్గా జీ5లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. హనుమాన్ కథేంటంటే... అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్. RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles. https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU — ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024 -
ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్ సీన్ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx — Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024 -
ఓటీటీకి హనుమాన్.. ఇంతలోనే సడన్గా ఏమైంది?
టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్తో పాటే సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్పై అప్డేట్స్ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్గా స్ట్రీమింగ్ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆడియన్స్కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్ కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్కు.. డిజిటల్ ఫ్లాట్ఫామ్కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్ రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. All of Sudden Negativity on #HanuMan What is the reason? pic.twitter.com/7lTcGKec1P — Telugu Bit (@telugubit) March 17, 2024 Why, suddenly people are spreading negativity on #HanuMan cinema, after releasing it in OTT What is making them cry 🤔 pic.twitter.com/Aa90IxjIq6 — 🚩అజ్ఞాతవాసి Ãgnathavasì 🕉️ (@myselfBharath__) March 17, 2024 -
రెండు ఓటీటీల్లో హనుమాన్..
-
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం వెబ్ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్ హిందీ వర్షన్ రిలీజ్ చేశారు. జియోలో స్ట్రీమింగ్ నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో నార్త్ ఇండియన్స్ వీకెండ్లో సినిమా చూస్తూ తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ సీన్ అదుర్స్, ఆ సీన్ సూపర్బ్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్పింగ్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. అయితే సడన్గా మరో ఓటీటీలోనూ హనుమాన్ను తీసుకొచ్చేశారు. జీ5లో హనుమాన్ మూవీని అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. జీ5లోకి వచ్చేసిన హనుమాన్ అంతా ఓకే కానీ చివర్లో దీన్ని ఫ్రీగా ఇవ్వట్లేదని కొనుక్కోమని చెప్పారు. ఇది చూసిన అభిమానుల ఫ్యూజులెగిరిపోయాయి. సబ్స్క్రైబర్స్కు ఫ్రీగా ఇవ్వాలి కానీ మళ్లీ ఇలా ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనుక్కోమని తిరకాసులేంటో అని తిట్టిపోశారు. కానీ కాసేపటికే రెంట్ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడొచ్చని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్లో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల మేర రాబట్టింది. HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw — Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024 చదవండి: త్వరలో ఎలక్షన్స్.. మన్సూర్కు కోలుకోలేని దెబ్బ.. అధ్యక్ష పదవి ఊస్ట్ -
'హనుమాన్' ఓటీటీ రిలీజ్పై డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
ఈ ఏడాది సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలతో పాటు ఎలాంటి అంచనాలు లేకుండా 'హనుమాన్' సినిమా విడుదలైంది. యంగ్ హీరో తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్కుమార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్తో దుమ్మురేపింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే పలు ఓటీటీలలో వచ్చేశాయి. కానీ ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే వారికి మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పట్లో ఓటీటీలోకి హనుమాన్ వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం అనేది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది కాదు. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావడానికి మా యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. మీకు ఉత్తమమైనది అందిచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఆలస్యం విషయంలో దయచేసి అర్థం చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇప్పటి వరకు మా చిత్ర యూనిట్కు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.' అని తెలిపారు. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్పై నెటిజన్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన సినిమాకు కొత్తగా మీరు యాడ్ చేసేది ఏంటి..? ఆలస్యానికి కారణాలు ఏంటి..? కనీసం ఎప్పుడు వస్తుందో అంచనా తేదీనైనా ప్రకటించలేనంత స్థితిలో ఉన్నారా..? మీరు చేస్తున్న అతికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా పోతుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొదట హనుమాన్ సినిమా మార్చి 2 నుంచి 'జీ5'లో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపించింది. అప్పుడు జరగలేదు. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల అన్నారు. అప్పుడూ లేదు. తాజాగా మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీ లేదు.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ పోస్ట్తో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో కూడా తెలయని పరిస్థితి అని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురయ్యారు. భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమాకు తాము ఎంతగానో సోషల్మీడియాలో ప్రమోట్ చేస్తే ఇప్పుడు ఇలా గేమ్స్ అడుతున్నారా అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికి అయితే హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అనే విషయంపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. #HanuMan OTT streaming delay was not intentional! We have been working tirelessly round the clock to sort things and bring the film to you asap! Our intention is always to give you nothing but the best! Please try to understand and continue supporting us! Thank you! 🤗… — Prasanth Varma (@PrasanthVarma) March 15, 2024 -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
ఓటీటీకి హనుమాన్.. ప్రశాంత్ వర్మ లేటేస్ట్ అప్డేట్.. నెటిజన్స్ కామెంట్స్ వైరల్!!
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం. #HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼 — Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024 -
ఫ్యాన్స్కు హనుమాన్ టీం సర్ప్రైజ్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. తాజాగా ఓటీటీ రిలీజ్పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ మూవీ ఈనెల 16 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ సినిమాను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా కలర్స్ సినీఫ్లెక్స్ ఛానెల్లో మార్చి 16 రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తెలుగు ఆడియన్స్తో పాటు సౌత్ ఫ్యాన్స్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺 16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh — Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024 -
టాలీవుడ్ గామా అవార్డ్స్.. హనుమాన్ హీరోకు అవార్డ్..!
తెలుగు సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. గామా పేరిట అందిస్తున్న అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందింటారు. ఈ వేడుకల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులుతో పాటు మరికొందరు ముఖ్య అతిథులు విన్నర్స్కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నేహాశెట్టి, ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్ తమ డ్యాన్స్లతో ప్రేక్షకులను అలరించారు. 2021 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు) ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (పుష్ప) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్) ఉత్తమ గాయకుడు- ధనుంజయ్ (నా మది నీదే) ఉత్తమ గాయని - ఎంఎల్ శృతి (అడిగా అడిగా) గామా బెస్ట్ పాపులర్ సాంగ్ - మౌనిక యాదవ్ (సామి నా సామి - పుష్ప) మూవీ ఆఫ్ ది ఇయర్ - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని) 2022 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - నిఖిల్ (కార్తికేయ 2) ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి) మూవీ ఆఫ్ ది ఇయర్ - సీతా రామం (వైజయంతి మూవీస్) ఉత్తమ దర్శకుడు - హను రాఘవపూడి (సీతా రామం) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్) ఉత్తమ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్) ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్) ఉత్తమ గాయని - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య) 2023 గామా అవార్డుల విజేతలు ఉత్తమ నటుడు - ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి - సంయుక్త (విరూపాక్ష) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ) బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హను-మాన్) మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్) ఉత్తమ దర్శకుడు - బాబీ (వాల్తేరు వీరయ్య) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - సందీప్ కిషన్ (మైఖేల్) ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ పలు కేటగిరీల్లో అవార్డులు గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్) ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి) ఉత్తమ గేయ రచయిత - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమా) అత్యంత ప్రజాదరణ పొందిన పాట - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్) గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం) గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె) ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా) ఉత్తమ గాయని - చిన్మయి (ఆరాధ్య - ఖుషి) గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న -
ఇది అయ్యే పని కాదు.. ఇప్పట్లో హనుమాన్ లేనట్లేనా?!
సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి.. ఒక్కటి తప్ప! అవును హనుమాన్ ఒక్కటే ఇంకా ఏ ఓటీటీలోనూ అందుబాటులోకి రాలేదు. గుంటూరు కారం.. నెట్ఫ్లిక్స్లో, సైంధవ్.. అమెజాన్ ప్రైమ్లో, నా సామిరంగ.. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నాయి. కానీ హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తూ ఓటీటీని లైట్ తీసుకుంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రానుందని కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. అదిగో రిలీజ్.. ఇదిగో రిలీజ్.. అంటూ ఊరిస్తున్నారే తప్ప నిజంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి! దీంతో ఓ నెటిజన్.. హనుమాన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అని ఎక్స్(ట్విటర్)లో మొర పెట్టుకున్నాడు. ఇది చూసిన జీ5.. సదరు ట్వీట్కు స్పందించింది. 'హనుమాన్ రిలీజ్ విషయంలో మాకే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు.. ఓటీటీ ప్లాట్ఫామ్కే క్లారిటీ లేనప్పుడు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో? ఏంటో? అని నిరాశ చెందుతున్నారు. రేపు రిలీజ్ చేస్తే సినిమా చూస్తూ అర్ధరాత్రి జాగారం చేసేవాళ్లంగా అని కామెంట్లు చేస్తున్నారు. Hi! We have not received any update in this regard. Please keep an eye on our website and social handles for more updates! — ZEE5 (@ZEE5India) March 7, 2024 -
శివరాత్రికి ఓటీటీలో హనుమాన్??
సంక్రాంతి బ్లాక్బస్టర్ 'హనుమాన్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది పండక్కి థియేటర్లలో విడుదలైన వాటిలో ఈ చిత్రంపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. అయితేనేం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసిందీ చిత్రం. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'హనుమాన్'. ఓ సాధారణ మనిషికి హనుమంతుడికి ఉండే సూపర్ పవర్స్ వస్తే.. వాటిని ఎలాంటి పనులకు ఉపయోగించాడు. చివరకు ఏమైంది? అనే సింపుల్ కాన్సెప్ట్తో సినిమా తీశారు. కానీ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, పాటలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు భలే నచ్చేశాయి. ఈ క్రమంలోనే సూపర్ సక్సెస్ అందుకుంది. ఇకపోతే 'హనుమాన్' డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. తొలుత ఈ సినిమా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది. కానీ థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి వాయిదా వేసుకున్నారు. మార్చి 2న ఓటీటీ రిలీజ్ అనుకున్నారు. కానీ అది కూడా మారిపోయింది. శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్సయ్యారు. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. సంక్రాంతికి థియేటర్లలో 'హనుమాన్' నామస్మరణతో ఊగిపోయాయి. ఇప్పుడు శివరాత్రికి మళ్లీ అదే సీన్ రిపీట్ కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV — the.cineholic (@the_cine_holic) March 1, 2024 -
హనుమాన్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ పెంచేసిన తేజ సజ్జ!
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలతో అలరించిన తేజా సజ్జా..ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా అందుకున్నాడు తేజ. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని జాంబిరెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనే ‘హను-మాన్’ చేశాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ‘హను-మాన్’ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.. రికార్డు సృష్టించింది. ఇక హను-మాన్ మూవీ ఊహించిదాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో అటు ప్రశాంత్ వర్మ.. ఇటు తేజ సజ్జ ఫుల్ జోష్లో ఉన్నారు. పలువురు బడా నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా తేజ సజ్జ కూడా తన రెమ్యునరేషన్ని పెంచేశాడట. పారితోషికం అమాంతం పెంచేసిన తేజ సాధారణంగా హిట్ రాగానే హీరోలు తమ పారితోషికాన్ని కొంచెం కొంచెం పెంచేస్తారు. ఇక హను-మాన్ లాంటి భారీ హిట్ వస్తే మాత్రం దాన్ని డబుల్ చేస్తారు. ఇప్పుడు తేజ సజ్జ అదే చేశాడట. హను-మాన్ రిలీజ్ తర్వాత తేజతో సినిమా చేయడానికి పలువురు బడా నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్లు కూడా ఇచ్చారట. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో తేజ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడట. హను-మాన్ కోసం రూ. కోటి రెమ్యునరేషన్గా తీసుకున్న తేజ.. ఇప్పుడు రూ. 5 కోట్ల డిమాండ్ చేస్తున్నాడట. మరో హిట్ వస్తేనే.. హను-మాన్తో తేజ సజ్జ స్థాయి పెరిగింది.అందులో అనుమానమే లేదు. అయితే ఈ చిత్రం ద్వారా తేజ కంటే ఎక్కువగా ప్రశాంత్ వర్మకు పేరొచ్చింది. అతని పని తీరు పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కథను అద్భుతంగా తీర్చి దిద్దాడని మెచ్చుకున్నారు. ఈ చిత్రం అతని కెరీర్కు బాగా ప్లస్ అయింది. తేజ సజ్జని ఈ మూవీ పాన్ ఇండియా స్టార్గా మార్చింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా తన తదుపరి సినిమాలపై ఉంటుంది. అతని నుంచి వచ్చే సినిమాలో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా తేజ సజ్జ కథలను ఎంచుకోకపోతే కెరీర్కే ముప్పు వస్తుంది. రాబోయే సినిమా హిట్ అయితే తేజ సజ్జ కెరీర్కు కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు. ప్రస్తుతం తేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బెజవాడ ప్రసన్న-నక్కిన త్రినాధరావు కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈసారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే 'హనుమాన్' మాత్రమే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికే పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ రన్ అవుతూనే ఉంది. జనాలు చూడటానికి వెళ్తూనే ఉన్నారు. తాజాగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే థియేట్రికల్ రన్ చివరకొచ్చేసినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!) తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' సినిమా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల వల్ల ఆలస్యమవుతూ ఈ సంక్రాంతికి రిలీజైంది. అయితే మహేశ్, వెంకటేశ్, నాగార్జున సినిమాలు ఇదే టైంకి విడుదలకు రెడీ అయ్యాయని.. 'హనుమాన్'ని వాయిదా వేసుకోవాలని బెదిరించారు. కానీ తగ్గకుండా బరిలో నిలిబడ్డారు. పండగ విజేతగా నిలిచారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) 'హనుమాన్' చిత్ర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5 సంస్థ.. తొలుత 3-4 వారాల గ్యాప్లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ దృష్ట్యా డిజిటల్ స్ట్రీమింగ్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ చివరకొచ్చేయడంతో ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
హనుమాన్ మూవీ.. భారీ ఆఫర్ ప్రకటించిన మేకర్స్!
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజుల పూర్తయ్యాక కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ఆడియన్స్కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్స్లో హను-మాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ ధర రూ.175లుగా ఉంది. ఈ టికెట్స్ ఇకపై రూ.100 కే లభించనున్నాయి. అలాగే మల్టీప్లెక్స్లలో రూ.295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ.150 కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. The #HanuManRAMpage is not over yet❤️🔥 Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥 Book your tickets now! - https://t.co/nM6rXb7n54#HanuMan 🔥 Nizam Release by @MythriOfficial A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/wV0cWFvAA6 — Prasanth Varma (@PrasanthVarma) February 16, 2024 -
బిగ్గెస్ట్ మార్క్కు చేరుకున్న 'హనుమాన్' కలెక్షన్స్
తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఎప్పుడో సాధించేసింది. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. కేవలం 25 రోజుల్లో రూ. 300 కోట్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికి హనుమాన్ సినిమా కలెక్షన్లు భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో రూ. 50 కోట్లు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి సమయంలో విడుదలైన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్గా 'జై హనుమాన్' రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు. 'ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండొచ్చు.' అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ చెప్పారు. రాముడిగా మహేశ్బాబు అయితే సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్లో కూడా రాముడి పాత్రను మహేశ్ ముఖంతో రీక్రియేట్ చేసి చూసినట్లు ఆయన తెలిపారు. పార్ట్ 1లో నటించిన తేజ కూడా పార్ట్ 2లో కనిపిస్తారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ
సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' అల్టిమేట్ విన్నర్గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కలెక్షన్స్ సాధిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ చేయడానికి ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి గానీ హీరో తేజ సజ్జా గురించి తెలుగులోనే పెద్దగా తెలియదు. అలాంటిది ఈ చిత్రం.. పాన్ ఇండియా రేంజులో సక్సెస్ కావడంతో వీళ్లకు ఊహించనంత ఫేమ్ వచ్చింది. ఈ క్రమంలోనే హీరో తేజ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తేజ.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోల చిత్రాల్లో చిన్నప్పటి పాత్రలు చేశాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత 'ఓ బేబీ', 'జాంబీ రెడ్డి', 'అద్భుతం' లాంటి చిత్రాలతో హీరోగా చేశాడు. అయితే హీరోగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ 'హనుమాన్' దెబ్బకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే దాదాపు 70-75కి పైగా ప్రాజెక్టుల్ని రిజెక్ట్ చేశానని తేజ చెప్పుకొచ్చాడు. ''హనుమాన్' మూవీ చేస్తున్న సమయంలోనే దాదాపు 70-75 సినిమాల్ని రిజెక్ట్ చేశారు. వీటిలో దాదాపు 15 స్టోరీల్ని సినిమాలుగా చేయొచ్చు. కానీ హనుమాన్'కి పూర్తిస్థాయిలో కమిట్మెంట్ ఇవ్వాల్సి రావడంతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది' అని తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజ ఓ మల్టీస్టారర్లో నటించినట్లు సమాచారం. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. -
హనుమాన్ దెబ్బకు రికార్డులన్నీ ఉఫ్..
-
తేజ సజ్జతో రవితేజ స్పెషల్ ఇంటర్వ్యూ
-
రవితేజ వల్ల మాలాంటి వారికి ఇబ్బందులు: తేజ సజ్జా కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్తో సూపర్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేశ్బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది. అయితే ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలరించేందుకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తేజ సజ్జాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా. (ఇది చదవండి: దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో!) మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు. టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల మాలాంటి యంగ్ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా.. మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా. కాగా.. రవితేజ నటించిన ఈగల్ కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. పోటీ పెరగడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదలవుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. -
వాళ్ళ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది..పాదాభివందనం
-
హనుమాన్ నా బాధ్యత పెంచింది
‘‘హనుమాన్’ సినిమా విజయానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ అందరి రుణం ‘జై హనుమాన్’ సినిమాతో తీర్చుకోబోతున్నాను. ‘హనుమాన్’కి వంద రెట్లు ఎక్కువగా ‘జై హనుమాన్’ ఉంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ–‘‘హనుమాన్’కి వచ్చిన స్పందన చూసిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నాపై ఇంకా బాధ్యత పెంచింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చే చిత్రాలను బాధ్యతగా తీస్తాను’’ అన్నారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’’ అన్నారు తేజ. ‘‘హనుమాన్’ని హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
కలిసొచ్చిన రిపబ్లిక్ డే.. రికార్డు సాధించిన హనుమాన్
అటు అయోధ్య రామమందిర ప్రారంభం ఎంత ఘనంగా జరిగిందో ఇటు హనుమాన్ కలెక్షన్స్ అంత భారీగా రాబడుతోంది. అక్కడ రాముడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమాన్ కోట్లాది రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. మొత్తానికి ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో తేజ సజ్జ హీరోగా నటించాడు. హనుమాన్ ప్రభంజనం.. ఇప్పటికే రెండు వందల కోట్ల క్లబ్బులో చేరి ఈ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న గణతంత్ర దినోత్సవం కావడంతో వసూళ్ల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కేవలం 15 రోజుల్లోనే ఈ అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ చేతిలో 12 కథలు ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే! ఇది భారీ బడ్జెట్తో పెద్ద ఎత్తున ఉండబోతుందని తెలిపాడు. సౌత్, బాలీవుడ్ హీరోలు కూడా ఇందులో ఉంటారని చెప్పాడు. ఈ ఒక్కటే కాదు తన దగ్గర మొత్తం 12 కథలు ఉన్నాయన్నాడు. మరి ఆ సినిమాలతో ప్రశాంత్ వర్మ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి! చదవండి: వచ్చే జన్మలో పూర్ణ కడుపున పుడతానన్న దర్శకుడు.. నటి ఎమోషనల్ -
చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు: మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ మెగాస్టార్ను దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించి సత్కరించింది. ఈ ఘనత దక్కడం పట్ల మెగాస్టార్ ఎమోషనలయ్యారు. ఈ ఘనత దక్కడానికి కారణం మీరేనంటూ అభిమానులను ఉద్దేశించి వీడియో రిలీజ్ చేశారు. మెగాస్టార్కు అత్యున్నత గౌరవం దక్కడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ట్విటర్ వేదికగా సినీ ప్రముఖులు మెగాస్టార్ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చిరంజీవికి కంగ్రాట్స్ చెప్పారు. పద్మవిభూషణ్కు ఎంపికైనందుకు ప్రియమైన చిరు భాయ్కి హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా టాలీవుడ్ హీరోలు నాని, కిరణ్ అబ్బవరం, తేజా సజ్జా, నటుడు సత్యదేవ్, అడివి శేష్, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ, నటి ఖుష్బు సుందర్, రాధిక శరత్కుమార్ ట్విటర్ ద్వారా మెగాస్టార్కు కంగ్రాట్స్ తెలియజేశారు. Congratulations to #Megastar @KChiruTweets on being honoured with the #PadmaVibhushan , a great honour bringing great pride to #TeluguCinema and to his people who love him. Hard work never fails🙏 pic.twitter.com/2l4SEPFIII — Radikaa Sarathkumar (@realradikaa) January 25, 2024 Hearty congratulations, Dear Chiru Bhai, for being conferred with the Padma Vibhushan.@KChiruTweets — Mammootty (@mammukka) January 25, 2024 Congratulations sir ❤️❤️ You are always an Inspiration 😊#PadmaVibhushanChiranjeevi #Megastar https://t.co/41qCnAkw2K — Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 25, 2024 Many congratulations to you, Sir @KChiruTweets Gaaru, on the honor bestowed upon you. You rightly deserve it. Your contribution to cinema, the world of art, your philanthropic lifestyle, your good work for the public and the blessings of your elders brings you this. As a friend,… https://t.co/DXKj4RgZw7 — KhushbuSundar (@khushsundar) January 26, 2024 Good morning Padma Vibhushan Chiranjeevi gaaru :) ♥️@KChiruTweets 🙏🏼 — Hi Nani (@NameisNani) January 26, 2024 Telugu vadi Garva Karanam Mega 🌟 Padma Vibhushan@KChiruTweets garu #MegastarChiranjeevi Garu — Teja Sajja (@tejasajja123) January 25, 2024 Congratulations Annaya @KChiruTweets on being recipient to the second highest civilian award #PadmaVibhushan Much Deserving Honour for your inspiring legacy & contribution. Thank you for holding cinema high at every instance. ❤️ pic.twitter.com/SvqDpnCBfI — Satya Dev (@ActorSatyaDev) January 25, 2024 My favorite picture I have of us sir @KChiruTweets ❤️ Thank you for always being kind and warm to me. Thank you for the amazing films. Thank you for the brilliant performances. Thank you for being our MEGASTAR. You are now a #PadmaVibhushan Sir. A proud moment for us, for TFI… pic.twitter.com/Wa7Q9x6V4P — Adivi Sesh (@AdiviSesh) January 26, 2024 Congratulations to our BOSS @KChiruTweets Garu on being felicitated with the honorary award #PadmaVibhushan ❤️ Thank you for making us all proud yet again and again. pic.twitter.com/pW5LEbVtuo — Vassishta (@DirVassishta) January 25, 2024 -
హను–మాన్లో అదే పెద్ద సవాల్
ఆంజనేయుడు భూమి నుంచి ఆకాశానికి ఎదిగే సీన్ ‘హను–మాన్’లో మేజర్ హైలైట్. క్లైమాక్స్లో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల ఒళ్లు పులకరించేలా చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్తో మేజిక్ చేసిన ఇలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి. అయితే క్లైమాక్స్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు జీవం పోయడం ఈ చిత్రం పరంగా తాను ఫేస్ చేసిన పెద్ద సవాల్ అంటున్నారు వీఎఫ్ఎక్స్ నిపుణుడు ఉదయ్ కృష్ణ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హను–మాన్’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి రూ. 200 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ చేసిన ఉదయ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘విజువల్ ఎఫెక్ట్స్లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న నాకు ‘హను–మాన్’ చిత్రం చేసే చాన్స్ రావడం పూర్వజన్మ సుకృతం. వీఎఫ్ఎక్స్ని అద్భుతంగా వినియోగించుకునే ప్రతిభ ప్రశాంత్ వర్మలో ఉంది. ఎన్నో ప్రతికూలతలు, పరిమిత వనరులతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా విజయం మా కష్టం మరచిపోయేలా చేసింది. వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఓ సంస్థను నెలకొల్పాలన్న నా కలను ‘బీస్ట్ బెల్స్’తో నెరవేర్చుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’కి సంబంధించిన కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ చేశానని, హిందీలో ‘జోథా అక్బర్’, ‘పద్మావత్’ వంటి చిత్రాలు, త్రీడీ యానిమేషన్ ఫిల్మ్ ‘అర్జున్: ది వారియర్ ప్రిన్స్’, పూర్తి స్థాయి వీఎఫ్ఎక్స్ మూవీ ‘అల్లాదీన్’ వంటివి చేశానని ఉదయ్కృష్ణ తెలిపారు. -
హనుమాన్ సీక్వెల్లో ఆంజనేయుడిగా స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ
హనుమాన్ సినిమా హిట్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ట్రెండింగ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం. హనుమాన్ విజయంతో దానికి సీక్వెల్గా జై హనుమాన్ చిత్రం ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించాడు. జై హనుమాన్ చిత్రాన్ని ఉద్దేశించి తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్లో తేజ హీరో కాదని ఆయన తేల్చి చెప్పారు. సూపర్ హీరో కథలకు ఇతిహాసాలలోని దేవుళ్లకు ముడిపెట్టి తెరకెక్కించేందుకు తన వద్ద 12 కథలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ చెప్పిన విషయం తెలసిందేజ ఈ క్రమంలో వచ్చిన చిత్రమే 'హను-మాన్'. దీనికి రానున్న సీక్వెల్ హను-మాన్ కంటే వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుందని ఆయన తెలిపారు. కానీ సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదు.. కానీ, అందులో హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని చెప్పాడు. సీక్వెల్లో హీరో ఆంజనేయ స్వామి అని ఆ పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని ఆయన పేర్కొన్నాడు. జై హనుమాన్ చిత్రం 2025లో కచ్చితంగా విడుదల చేస్తామని ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు తను డైరెక్ట్ చేసిన అధీర,మహాకాళీ విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్లో రామ్ చరణ్ నటించనున్నాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరో క్లారిటీ రానుంది. -
హనుమాన్ చిత్రానికి జీవం పోసిన ఉదయ్ కృష్ణ
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. హనుమాన్లో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని విజువల్స్ అన్నీ అబ్బురపరిచేలా ఉన్నాయి. హనుమాన్ అద్భుతాల వెనుక గ్రాఫిక్స్ మాంత్రికుడు ఉదయ్ కృష్ణ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న ఆయన హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత సత్తా ప్రశాంత్ వర్మలో ఉందని ఆయన పేర్కొన్నారు. తేజ సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన "హనుమాన్" జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. సినిమా విడుదలకు ముందే టీజర్ విజువల్స్ చూసిన ప్రేక్షకుల్లో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ముగింపులో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్కు ఆయన జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్లలో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్... మన తెలుగు దర్శకులు కలలుగనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు. -
'హనుమాన్' కలెక్షన్స్.. తొలి భారతీయ సినిమాగా రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. जय श्री राम 🙏 With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥 2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥 Nizam Release by @MythriOfficial ❤️🔥 A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr — Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024 -
ఆర్సి పురం పటాన్చెరులో ఆసియా వైష్ణవి మల్టీప్లెక్స్ లాంచ్ చేసిన హీరో
-
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్, చరణ్ రికార్డు బద్దలు..కొట్టిన తేజ..
-
సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్పై సమంత రివ్యూ..
సంక్రాంతి కానుకగా రిలీజైన హను-మాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, హిందీలో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు లెక్కలేనన్ని ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత హనుమాన్పై రివ్యూ ఇచ్చింది. 'మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి. హనుమాన్లో విజువల్స్, కామెడీ, మ్యాజిక్, మ్యూజిక్.. అన్నీ ఎంతో బాగున్నాయి. థాంక్యూ ప్రశాంత్ వర్మ.. నీ యూనివర్స్ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా.. నీ యాక్టింగ్తో నన్ను ఆశ్చర్యపోయేలా చేశావు. నీ కామిక్ టైమింగ్, నీ అమాయకత్వం, నీ నటన.. హనుమంతుగా నువ్వు చేసిన అద్భుతమైన నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సంగీతం, వీఎఫ్ఎక్స్ ఈ సినిమాను మరింత అందంగా మలిచాయి. సినిమా చూసేకొద్దీ చూడాలనిపించేలా చేశాయి. ఇందులో నటించి హిట్ అందుకున్న వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్రాయ్లకు శుభాకాంక్షలు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
Teja Sajja Rare Unseen Photos: వంద కోట్ల సినిమా హనుమాన్ హీరో తేజ సజ్జ.. రేర్ ఫొటోలు
-
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్
చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) small film - BIG JUSTICE from the audience ❤️ The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪 1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory -… pic.twitter.com/4LNGkhYz8f — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2024 -
హనుమాన్ దెబ్బ అదుర్స్.. కేజీఎఫ్, కాంతార రికార్డులు బద్ధలు..
కథలో దమ్ముంటే చాలు జనాలు ఇట్టే కనెక్ట్ అవుతారు. అది హనుమాన్తో నిరూపితమైంది. ఇప్పటివరకు హాలీవుడ్ సూపర్ హీరోలనే ఇష్టపడిన జనాలు హనుమాన్ చూసి యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమాన్ను అందరికంటే బెస్ట్ సూపర్ హీరోగా కొనియాడుతున్నారు. పాజిటివ్ టాక్, సెలవుల కారణంగా రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోందీ చిత్రం. పుష్పతో సమానంగా.. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. '2024లో బోణీ కొట్టిన తొలి సినిమా హనుమాన్. మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్.. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్, కాంతార హిందీ డబ్బింగ్ వర్షన్స్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పుష్ప హిందీ వర్షన్తో సమానంగా వసూళ్లు రాబడుతోంది. కేవలం హిందీ వర్షన్ తొలి రోజు రూ.2.15 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.4.05 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.6.06 కోట్లు వచ్చాయి. జనవరి 25వరకు పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. హాఫ్ సెంచరీకి చేరువలో మరోవైపు హనుమాన్కు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ జరుగుతోంది. ఈ కారణంగా రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి., ఇప్పటివరకు ఈ మూవీ కలెక్షన్స్ రూ.40 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ బాక్సాఫీస్ లెక్కలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. హీరో రానా తన చెప్పులు ఓ మూలన విడిచేసి హనుమాన్ పోస్టర్, గద ముందు ఫోటోలు దిగాడు. ఇది చూసిన జనాలు రానాను మెచ్చుకుంటున్నారు. మొదటి విరాళం ఎన్ని లక్షలంటే? ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడినన్ని రోజులు ప్రతి టికెట్పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు తొలిరోజు కలెక్షన్స్ ఆధారంగా రూ.14 లక్షలను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూస్తుంటే రానున్న రోజుల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేట్లు కనిపిస్తున్నారు. Here’s the BIGGG SURPRISE… #HanuMan first *3-day* [opening weekend] total is HIGHER than #KGF [first part] and #Kantara, at par with #Pushpa [note: all #Hindi dubbed versions]… Yes, you read it right!#HanuMan emerges FIRST HIT OF 2024… Packs an impressive total in its… pic.twitter.com/OkzYxnmkmc — taran adarsh (@taran_adarsh) January 15, 2024 South Indian actor #RanaDaggubati removing shoes before standing next to the poster of #HanumanMovie and Gada (mace). pic.twitter.com/568GOfGWc3 — Smriti Sharma (@SmritiSharma_) January 15, 2024 చదవండి: ఆఫీసుల చుట్టూ తిరిగా.. అవమానించారు.. భరించలేక వెళ్లిపోదామనుకున్నా! -
' వాటిని భోగి మంటల్లో వేయడం మరిచిపోయా'.. వారికి ప్రశాంత్ వర్మ కౌంటర్!
ఈ ఏడాది సంక్రాంతికి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన హనుమాన్ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన సినిమాను తీశారంటూ పలువురు సినీ ప్రమఖులు ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కొందరు నకిలీ ప్రొఫైల్స్తో సోషల్ మీడియాలో మా టీమ్ పట్ల కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. కానీ నిన్న జరిగిన భోగి వేడుకల్లో వాటిలో మంటల్లో విసిరివేయడం మరిచిపోయా అంటూ.. అలాంటి వారిని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ చురలకంటించారు. ప్రశాంత్ వర్మ తన ట్వీట్లో రాస్తూ.. 'కొందరు నకిలీ ప్రొఫైల్స్తో మాపై విపరీతంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో మా టీంను ట్రోల్ చేశారు. ఇంకా అలాంటి చెత్తను నిన్న భోగి మంటల్లో వేయడం మరిచిపోయా. ఏది ఏమైనా 'ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు' అనే విషయం మరోసారి రుజువైంది. తమ తిరుగులేని మద్దతును అందించిన సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తమపై వచ్చిన నెగెటివిటీని తొక్కేసి.. ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం మరింత ఎత్తుకు ఎగరడానికి సిద్ధంగా ఉంది. ' అంటూ పోస్ట్ చేశారు. అయితే హనుమాన్ రిలీజ్కు ముందే పెద్దఎత్తున వివాదం నడిచింది. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. కానీ ప్రశాంత్ వర్మ చెప్పిన తేదీకే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పొంగల్ పోటీ తీవ్రం కావడంతో రవితేజ మూవీ ఈ పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బహుశా సినిమా రిలీజ్కు ముందు జరిగిన వివాదాన్ని ఉద్దేశించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్,సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 12 భాషల్లో విడుదల హనుమాన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. I've encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday's Bhogi fire. However, I express my sincere… — Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024 -
హనుమాన్ పార్ట్-2 కాదు.. ఏకంగా సినిమానే: ప్రశాంత్ వర్మ తండ్రి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తక్కువ బడ్జెట్లో అద్భుతమైన సినిమా తీశారంటూ నెటిజన్స్, సినీ ప్రముఖులు సైతం హనుమాన్ మేకర్స్ను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత వర్మ తండ్రి తన కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. (ఇది చదవండి: మెగా హీరో బర్త్డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!) ఆయన మాట్లాడుతూ.. 'హనుమాన్ తీసినోడు మా అబ్బాయే. నా లైఫ్లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అనుభవం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ పార్ట్-2 కాదు. హనుమాన్పై ఏకంగా సినిమానే వస్తది.' అంటూ దర్శకుడి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అభినందించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. అయితే తాను జ్వరంతో బాధపడుతున్నాననీ.. ఆరోగ్యం కుదుటపడగానే అందరినీ కలుస్తానంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మీ శరత్కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. Proud Moment for Prasanth Varma Family #HanuMan 👏👏 Bro @PrasanthVarma, you achieved your dream. You made your father proudly say he is my son 🥹@tejasajja123 #HanuManRAMpage @NirvanaCinemas pic.twitter.com/JjHeyfqdcy — EPIC (@Koduri_526) January 13, 2024 -
ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను
‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఉంటుందంటుంటారు. నా కెరీర్లో ‘హను–మాన్’ని నా బెంచ్ మార్క్ ఫిల్మ్గా ఫీలవుతున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. క్లైమాక్స్లో ఓ సన్నివేశం కోసం రోప్ సాయంతో ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను. రెండున్నరేళ్లు ఏ సినిమా ఒప్పుకోలేదు. యాక్టర్గా నా కెరీర్ పరంగా, నా వయసు పరంగా ఈ రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. ‘హను–మాన్’ సక్సెస్ కావడం సంతోషంగా ఉంది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘హను–మాన్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతూ, శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో తేజ సజ్జా పంచుకున్న విశేషాలు. ∙తెలుగుతో పాటు హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా ‘హను–మాన్’ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ రానంత స్పందన ఈ సినిమాకు హిందీలో వస్తోందని చెబుతున్నారు. మా సినిమాకు కాస్త సింపతీ వర్కౌట్ అయ్యిందని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సినిమా ట్రైలర్, టీజర్ చూసి హిందీ, కన్నడవారు మమ్మల్ని అడిగి సినిమా తీసుకున్నారు. ఏం జరి గినా అంతిమంగా సినిమానే మాట్లాడుతుంది. సినిమానే నిలబడుతుంది. నిర్మాత నిరంజన్రెడ్డిగారు, ప్రశాంత్వర్మ ‘హను–మాన్’ సినిమాను బాగా చేశారు. ‘హను–మాన్’ సినిమా సమయంలో నేను ఇతర సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆ సినిమాల ఇంపాక్ట్ ‘హను–మాన్’ పై పడకూడదని. ఈ సినిమా సక్సెస్ మా అందరిదీ. ఈ సినిమా యూనిట్ సభ్యులు వారి వారి డిపార్ట్మెంట్స్లోనే కాక, ఇతర క్రాఫ్ట్స్లో కూడా కలుగజేసుకుని బాధ్యతగా చేశారు. ఉదాహరణకు నా లుక్ లోని కొన్ని కాస్ట్యూమ్స్కు మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఈ సినిమా విషయంలో మొదట్నుంచి ఏదో ఆధ్యాత్మిక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిందని నా నమ్మకం. ‘హను–మాన్’ సినిమాను మేం చేయలేదు. ‘హను–మాన్’ సినిమా మా చేత చేయబడింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని మేం అనుకుంటున్నాం. ‘హను–మాన్’ సినిమాలోని హనుమంతుని విగ్రహం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. గ్రాఫిక్స్ అలా చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. క్లైమాక్స్ చిత్రీకరణకు 60 రోజులకు పైగా సమయం పట్టింది. ‘హను–మాన్’ప్రాజెక్ట్ గురించి చిరంజీవిగారికి తెలుసు. ఈ సినిమాలోని హనుమంతుని పాత్ర గురించి ఆయనకు తెలుసు. మా ఇంటెన్షన్ హనుమంతుని పాత్రలో చిరంజీవిగారు అనే. ఆ సంగతి అలా ఉంచితే చిరంజీవిగారు ఇంకా ‘హను–మాన్’ సినిమా చూడలేదు. అయితే రిలీజైన రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపారు. -
'హను-మాన్'ను వెంటాడుతున్న సమస్య.. నిర్మాతలకు నష్టం!
సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్పై మొన్నటివరకు పెద్ద చర్చే జరిగింది. ఓవైపు పెద్ద హీరో సినిమా గుంటూరు కారం, మరోవైపు చిన్న హీరో చిత్రం హను-మాన్ జనవరి 12వ తేదీకే గురి పెట్టాయి. హనుమాన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయొచ్చుగా అని సలహా ఇచ్చాడు దిల్ రాజు. కానీ హను-మాన్ నిర్మాతలు మాత్రం.. ఒక్క రోజు కూడా ముందుకూ వెనక్కూ జరిగేది లేదని తేల్చి చెప్పేసింది. చివరకు అన్నట్లుగానే గుంటూరు కారం చిత్రానికి పోటీగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమకు సరిపడా థియేటర్లు ఇవ్వలేదని మొదటి నుంచీ మొత్తుకున్నారు హనుమాన్ మేకర్స్. ఆ గొడవ అలా సాగుతుండగానే రిలీజ్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ బేఖాతరు తాజాగా మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే పెద్దగా థియేటర్లు లేవంటే హను-మాన్ కోసం అగ్రిమెంట్లు కుదుర్చుకున్న థియేటర్లు సైతం సదరు చిత్రాన్ని ప్రదర్శించడం లేదట! ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూర్లు, నిర్మాత నిరంజన్ రెడ్డి.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. థియేటర్ల యజమానులు ఇలా నిబంధనలు అతిక్రమించడాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'జనవరి 12 నుంచి హనుమాన్ ప్రదర్శించేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాళ్లు ఈ అగ్రిమెంట్ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో సినిమా ప్రదర్శించడం లేదు. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం కలిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హను-మాన్ సినిమాను ప్రదర్శించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి. థియేటర్ల యజమానులు ఇలా ఇష్టారీతిన వ్యవహరించడం తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం. ఇప్పటికైనా పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ సినిమాకు సత్వర న్యాయం చేయండి' అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది. చదవండి: హను-మాన్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? -
తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది : అమృత అయ్యర్
‘‘హను–మాన్’ సినిమా ప్రేక్షకులకు నచ్చాలనే లక్ష్యంతోనే యూనిట్ అంతా పని చేశాం. ఆడియన్స్తో కలిసి ఈ సినిమా చూశాను. వారి స్పందన చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నా కెరీర్లో తొలిసారి అలాంటి అనుభూతి దక్కింది’’ అని హీరోయిన్ అమృతా అయ్యర్ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. (చదవండి: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఈ సందర్భంగా అమృతా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్ వర్మగారు ‘హను–మాన్’ని అద్భుతంగా తీశారు. ఈ మూవీలో మీనాక్షి పాత్రని చక్కగా చేశావని ప్రేక్షకులు చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఈ మూవీ జర్నీలో సహనంగా ఉండటం నేర్చుకున్నాను.. నటీనటులకు సహనం చాలా ముఖ్యం. ‘హను–మాన్ 2’ ఉంటుందని నాకూ తెలియదు. స్క్రీన్పై చూసి, సర్ప్రైజ్ అయ్యాను. ప్రస్తుతం తెలుగులో ‘అల్లరి’ నరేశ్కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రశాంత్ వర్మ హను-మాన్.. తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం హను-మాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేశ్బాబుతో చిత్రంతో పోటీలో నిలిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. చిన్న సినిమాగా విడుదలై హనుమాన్ చిత్రానికి సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్కు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి సైతం విపరీతమైన స్పందన వస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. -
HanuMan Movie Stills: బాక్సాఫీస్ ట్రెండింగ్లో ప్రశాంత్ వర్మ హనుమాన్.. ఈ స్టిల్స్ చూశారా? (ఫొటోలు)
-
టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల హడావుడి మొదలైపోయింది. 'హను-మాన్', 'గుంటూరు కారం' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. రెండింటిని పోల్చి చూసుకుంటే చాలామంది 'హను-మాన్' వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రెమ్యునరేషన్ టాపిక్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ 'హను-మాన్' టీంలో ఎవరికెంత ఇచ్చారు? 'హను-మాన్' టాక్ ఏంటి? ఈసారి సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి. వీటిలో చాలామంది మహేశ్ 'గుంటూరు కారం' హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ దీనికంటే బెటర్ రివ్యూస్ ఇప్పుడు 'హను-మాన్' మూవీకి వస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్, ఆంజనేయుడి సెంటిమెంట్తోపాటు కంటెంట్ కూడా భలే క్లిక్ అయింది. గురువారం సాయంత్రం ప్రీమియర్స్ పూర్తవగానే.. అందరూ 'జై హనుమాన్' నామజపం చేస్తున్నారు. (ఇదీ చదవండి: Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ) అదే టైంలో దర్శకుడు ప్రశాంత్ వర్మని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కేవలం రూ.55 కోట్ల బడ్జెట్తో ఈ రేంజు సినిమా తీశాడంటే.. మరికాస్త బడ్జెట్ ఇచ్చుంటే వేరే లెవల్ మూవీ తీసేవాడని అనుకుంటున్నారు. సరే ఇది పక్కనబెడితే ఈ మూవీకి నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్.. రూ.10 కోట్లు కూడా దాటలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 'హను-మాన్' సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి గానూ ఇతడికి రూ.2 కోట్లు ఇచ్చారట. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. రూ.70 లక్షల నుంచి రూ.కోటి మధ్య పారితోషికం అందుకున్నాడట. మిగతా నటీనటుల్లో హీరోయిన్ అమృత అయ్యర్-రూ 1.5 కోట్లు, వరలక్ష్మీ శరత్ కుమార్ రూ. కోటి, వినయ్ రాయ్ రూ.65 లక్షలు, వెన్నెల కిశోర్ రూ.55 లక్షలు, గెటప్ శీను రూ.35 లక్షలు అనే టాక్ వినిపిస్తుంది. మిగతా నటీనటులకు కాస్తోకూస్తే ఇచ్చారు. మొత్తంగా చూసుకుంటే రూ.10 కోట్ల లోపే రెమ్యునరేషన్ తేల్చేశారనమాట. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
Hanuman OTT Rights: భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) విడుదలైన హనుమాన్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఒకరోజు ముందే అంటే నిన్ననే భారీగా ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో 'సూపర్మ్యాన్' జోనర్ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంతో ఆ లోటు తీర్చడమే కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో కథానాయకుడు తేజ సజ్జా రోల్ చాలా చక్కగా ఉంటుంది. తనలోని ఉన్న టాలెంట్ మొత్తాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించాడు. అందుకే అతను తెరపై కనిపించినప్పుడు విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్తో అద్భుతమైన సినిమాను ప్రశాంత్ వర్మ తీశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్కు తగ్గట్లు సినిమా ఉండటంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పడవచ్చని సమాచారం. (ఇదీ చదవండి: Hanu Man Review : ‘హను-మాన్’ మూవీ రివ్యూ) ఏదేమైనా మార్చి నెలలో హనుమాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉన్నట్లు సినిమా ఎండ్ కార్డ్లో ఉంటుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రకటించాడు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్,సముద్రఖని వంటి నటీనటులు హనుమాన్లో నటించారు. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్ని పెంచుకొని 12 భాషల్లో విడుదల అయ్యేలా ప్రాజెక్ట్ను సిద్ధం చేశారు. పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలిచి హిట్ టాక్తో దూసుకుపోతున్నాడు. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే.. హనుమాన్ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. ఓటీటీ హీందీ వర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్ రూ. 11 కోట్లకు హనుమాన్కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్టైనింగ్ సంస్థ 'జీ5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. -
రాజమౌళిగారు చేస్తానన్నారని నేను డ్రాప్ అయ్యాను
‘‘ఒక ఫిల్మ్ మేకర్గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడంపైనే నా ఏకాగ్రత ఉంటుంది. సినిమా విడుదల, థియేటర్ల కేటాయింపులు వంటివి నిర్మాతలకు చెందినవి. ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే పదేళ్లల్లో తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేసేలా మేం కొన్ని ప్లాన్ చేసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఇదంతా (థియేటర్స్ గురించిన వివాదం గురించి పరోక్షంగా స్పందిస్తూ..) జరుగుతోంది. తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు అన్నట్లుగా ఓ సామెత ఉంది. అందుకే కొన్ని విషయాలపై స్పంది స్తున్నాను’’ అన్నారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ప్రశాంత్ వర్మ చెప్పిన విశేషాలు. ∙‘హను–మాన్’ సినిమా కోసం తేజ సజ్జా కొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇక యాక్టింగ్ గురించి నేను అతనికి నేర్పించాల్సింది ఏమీ లేదు. పైగా సెట్స్లో ఫలానా సన్నివేశంలో ఇలా యాక్ట్ చెయ్ అని నటించి, చూపించడం నాకు రాదు. ‘హను–మాన్’పై నా కన్నా ఎక్కువగా తేజ ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా సమయం కేటాయించాడు. కొత్త సినిమాలేవీ చేయలేదు. రీసెంట్గా ఓ సినిమా ఒప్పుకున్నాడు. సినిమా మొదలైన ఇరవై నిమిషాలు హీరో క్యారెక్టర్ సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైతే హీరో పాత్రకు సూపర్ పవర్స్ వస్తాయో అప్పట్నుంచి కథ మరింత ఆసక్తిగా ముందుకు వెళ్తుంది. ∙పురాణాలు, ఇతిహాసాల కథలు, హనుమంతునిపై వచ్చిన కొన్ని ఆర్టికల్స్, ప్రచారంలో ఉన్న కొన్ని అంశాల ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేసుకున్నాను. తెలుగు సినిమా స్టైల్ని పోలి ఉండే సూపర్ హీరో సినిమా ‘హను–మాన్’. ‘బ్యాట్మేన్’ సినిమాను రాజమౌళిగారు తీస్తే ఎలా ఉంటుందో అలా ‘హను–మాన్’ ఉంటుంది. ‘కేజీఎఫ్’లో యశ్ను ఎలివేట్ చేసినట్లుగా ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. నిర్మాత నిరంజన్ రెడ్డిగారు నాకన్నా పాజిటివ్ పర్సన్. మేం సినిమా కోసం ఓ ఆలోచన చెబితే, దానికి ఎక్స్టెన్షన్ లెవల్లో ఆయన ఆలోచించేవారు. దాశరథి శివేంద్రగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ∙మేం అనుకున్నదాని కన్నా ‘హను–మాన్’ బడ్జెట్ మూడింతలు పెరిగింది. కానీ పదింతల క్వాలిటీ సినిమాను ఆడియన్స్ చూస్తారు. ఇక ఈ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయాలంటే మరికొంత బడ్జెట్ కావాలి. అందుకే త్రీడీలో విడుదల చేయడం లేదు. అయితే రిలీజ్ తర్వాత మంచి స్పందన వస్తే, భవిష్యత్లో రీ–రిలీజ్లో త్రీడీలో కూడా రిలీజ్ చేస్తాం. ఓ నెల గ్యాప్ తర్వాత విదేశీ భాషల్లో ‘హను–మాన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ∙పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. మహాభారతంపై ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ రాజమౌళిగారు చేయాలను టున్నారని తెలిసి డ్రాప్ అయ్యాను. -
Hanu Man Movie Review: ‘హను-మాన్’ మూవీ రివ్యూ
టైటిల్: హను-మాన్ నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాత: కె.నిరంజన్ రెడ్డి దర్శకత్వం: ప్రశాంత్ వర్మ సంగీతం: గౌరహరి,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటర్: ఎస్.బి. రాజు తలారి విడుదల తేది: జనవరి 12, 2024 ఈ సంక్రాంతి బరిలో మూడు బడా హీరోల సినిమాలు ఉన్నాయి. వాటికి పోటీగా అన్నట్లు ‘హను-మాన్’ దిగాడు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రచార చిత్రాలు విడుదలయ్యాక ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి చర్చించుకున్నారు. ఇక ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘హను-మాన్’పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా అంజనాద్రి అనే ఫిక్షనల్ విలేజ్ చుట్టూ తిరుగుతుంది. అడవి ప్రాంతంలో ఉండే ఆ ఊర్లో అంజనమ్మ(వరలక్ష్మీ శరత్ కుమార్), తన సోదరుడు హనుమంతు(తేజ సజ్జ)తో కలిసి నివాసం ఉంటుంది. హనుమంతు ఓ చిల్లర దొంగ.ఊర్లో చిన్న చిన్న వస్తువులను దొంగలిస్తూ చిల్లరగా తిరుగుతుంటారు. ఆ ఊరి బడి పంతులు మనవరాలు మీనాక్షి(అమృత అయ్యర్) అంటే హనుమంతుకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓ రోజు బందిపోట్లు మీనాక్షిపై దాడి చేసేందుకు యత్నించగా.. హనుమంతు ఆమెను రక్షించబోయి జలపాతంలో పడిపోతాడు. అక్కడ హనుమంతుడి రక్త ధారతో ఏర్పడి రుధిర మణి హనుమంతుని చేతికి చిక్కుతుంది. అప్పటి నుంచి అతనికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదిలా ఉంటే.. చిన్నప్పటి నుంచి సూపర్ హీరో కావాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ రాయ్)..ఆ శక్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపేస్తాడు. ప్రపంచంలో తనకు మాత్రమే సూపర్ పవర్స్ ఉండాలని, ఆ దిశగా ప్రయోగాలు సైతం చేయిస్తుంటాడు. ఈ క్రమంలో హనుమంతుకి వచ్చిన శక్తుల గురించి తెలుస్తుంది. దీంతో మైఖేల్ తన అనుచరులతో అంజనాద్రి గ్రామానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హనుమంతుకి ఉన్న శక్తులను సొంతం చేసుకునేందుకు మైఖేల్ పన్నిన పన్నాగం ఏంటి? అసలు ఆ శక్తులు హనుమంతుకు మాత్రమే ఎందుకు వచ్చాయి? హనుమంతుకి ఆపద వచ్చినప్పుడలా రక్షిస్తున్న స్వామిజీ(సముద్రఖని) ఎవరు? ఎందుకు రక్షిస్తున్నాడు? హనుమంతుకి ఉన్న శక్తులు ఉదయం పూట మాత్రమే ఎందుకు పని చేస్తాయి? అంజనాద్రిని కాపాడుకోవడం కోసం హనుమంతు ఏం చేశాడు? అసలు మీనాక్షి-హనుమంతుల ప్రేమ సంగతి ఏమైంది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హీరోకి సూపర్ పవర్స్ రావడం.. ఆ శక్తిని మంచి కోసం ఉపయోగించడం.. విలన్ దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నించడం.. హీరో అతని ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ఆ శక్తిని లోక కల్యాణం కోసం వాడడం.. ఈ తరహా కాన్సెప్ట్తో హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ లాంటి సూపర్ హీరోలు అందరికి పరిచయమే. అయితే ఈ కథలన్నింటికి మూలం మన పురాణాలే. మన ఇండియాకు ఆంజనేయ స్వామిజీనే ఓ సూపర్ మ్యాన్ అని పురాణాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది లేదు. ఈ తరహా కాన్సెప్ట్తో తెలుగులోనూ సినిమాలు వచ్చాయి కానీ.. నేటివిటీ కామెడీని టచ్ చేస్తూ.. తనదైన స్క్రీన్ప్లేతో మాయ చేశాడు ప్రశాంత్ వర్మ. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీని చివరి వరకు కంటిన్యూ చేశాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కథను తీర్చి దిద్దాడు. కేవలం సూపర్ పవర్స్ కాన్సెప్ట్నే కాకుండా సిస్టర్ సెంటిమెంట్, ప్రేమ కథను కూడా ఇందులో జోడించాడు. అయితే అంతగా ఆకట్టుకోలేదు. అలా అని అనవసరంగా జోడించినట్లు కూడా లేవు. కథ రొటీన్గా సాగుతుందనే ఫీలింగ్ కలిగేలోపు ఆంజనేయ స్వామి తాలుకు కథను తీసుకురావడం..గూస్బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టడంతో చూస్తుండగానే సినిమా అయిందనే భావన కలుగుతుంది. హను-మాన్ కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. విలన్ ఎందుకు సూపర్ పవర్స్ కావాలనుకునేది ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించాడు. ఆ తర్వాత కథంతా అంజనాద్రి చుట్టూ తిరుగుతుంది. కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం..హీరో గురించి ఆ కోతి చెప్పే మాటలు నవ్వులు పూయిస్తాయి. హీరో హీరోయిన్ల లవ్స్టోరీ రొటీన్గా ఉంటుంది. హీరోకి ఎప్పుడైన సూపర్ పవర్స్ వస్తాయో అప్పటి నుంచి కథనం ఆసక్తిరంగా సాగుతుంది. రాకేష్ మాస్టర్ గ్యాంగ్తో హీరో చేసే ఫైట్ సీన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరోవైపు సత్య, గెటప్ శ్రీను కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో కథ సింపుల్గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలోనే అసలు కథంతా ఉంటుంది. సూపర్ పవర్స్ కోసం విలన్ ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయి. హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా విజుల్స్ వేయిస్తాయి. ఓ సందర్భంలో పెద్ద బండరాయిని కూడా ఎత్తేస్తాడు. అయినా కూడా అది అతిగా అనిపించడు. మరో యాక్షన్ సీన్లో చెట్టు వేర్లతో హెలికాప్టర్ని ఆపేస్తాడు..అయినా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. విఎఫెక్స్ అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉన్నా ఇంత తక్కువ బడ్జెట్(రూ. 25 కోట్లు అని సమాచారం)లో ఇలాంటి సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మను నిజంగా అభినందించాల్సిందే. రాముడికి ఆంజనేయ స్వామి ఇచ్చిన మాట ఏంటి ? అనే ఆసక్తికర ప్రశ్నతో సీక్వెల్ని ప్రకటించాడు. మరి ఆంజనేయ స్వామి ఇచ్చిన హామీ ఏంటి అనేది 2025లొ విడుదలయ్యే ‘జై హను-మాన్’లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. తేజ సజ్జకు నటన కొత్తేమి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించి, తనదైన నటనతో మెప్పించాడు. హీరోగాను మంచి మార్కులే సాధించాడు. ఇక హనుమాన్ కోసం మరింత కష్టపడినట్లు తెలుస్తోంది. కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. కామెడీ, ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్స్ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా.. సూపర్ పవర్స్ ఉన్న హను-మాన్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్్ చూపించి ఆకట్టుకున్నాడు. హీరో సోదరి అంజనమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు కూడా ఇందులో ఓ యాక్షన్స్ సీన్ ఉంది. అమృత అయ్యర్ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్ని తెరపై చూడాల్సిందే. వినయ్ రాయ్ స్టైలీష్ విలన్గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో గౌరహరి సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరకెక్కించాడు. వీఎఫెక్స్ వర్క్ అబ్బురపరిచేలా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘హను-మాన్’ గురించి ఈ విషయాలు తెలుసా?
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హను-మాన్ గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం... ♦ ‘జాంబి రెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ఊరి చుట్టే కథ తిరుగుతంది. ♦ హను-మాన్ షూటింగ్ 2021 జూన్ 5న ప్రారంభమైంది. వట్టినాగుపల్లిలో ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. తొలుత ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్థాయిలోనే తెరకెక్కించాలనుకున్నారు. కానీ నిర్మాత ప్రొత్సాహంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దారు. మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతుంది. ♦ ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. సంగీత దర్శకులు అనుధీప్ దేవ్, కృష్ణ సౌరభ్ చెరో పాటను కంపోజ్ చేశారు. ఇక మిగిలిన పాటలను, నేపథ్య సంగీతాన్ని గౌర హరి అందించాడు ♦ ఈ చిత్రం మొత్తం ఫుటేజీ నిడివి 2.45 గంటలు. సెన్సార్ తర్వాత ఇది 2.38 గంటలు అయింది. సినిమాకు ఏది అవసరమో దాన్నే షూట్ చేశామని, కేవలం ఐదారు నిమిషాలు ఫుటేజ్ మాత్రమే వృధా అయిందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. ♦ ఈ సినిమాను గతేడాది మే 12న విడుదల చేయాల్సింది. కానీ వీఎఫెక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ.. చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ♦ ఈ చిత్రంలో మొత్తం 1600 వీఎఫెక్స్ ఫాట్స్ ఉన్నాయట. వానరం, ఎలుకలు, చిరుత, పులి ఇవన్నీ వీఎఫెక్స్ సాధ్యమైయ్యాయని దర్శకుడు చెప్పాడు. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కొత్తతరం వీఎఫెక్స్ టీమ్తో పని చేశారట. ఔట్ఫుట్ మాత్రం అద్భుతంగా ఉంది. ♦ ఓ సారి అడవిలో షూటింగ్ చేస్తున్న సమయంలో తేజ సజ్జకు తృటిలో ప్రమాదం తప్పిందట. చెట్టుకింద ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తుంటే.. ఓ పాము తేజ సజ్జదగ్గరకు వచ్చిందంట. డైరెక్టర్ మానిటర్లో చూస్తే అది పాములా కనిపించలేదట. పక్కనే ఉన్న వ్యక్తి చెప్పబోతుంటే డైరెక్టర్ పట్టించుకోలేదట. షాట్ పూర్తయిన తర్వాత అక్కడ పాము ఉందని చెప్పడంతో అంతా భయంతో పరుగులు తీశారట. ♦ ఈ చిత్రంలో 'వాన' హీరో వినయ్ రాయ్ విలన్ రోల్లో కనిపించనుండగా, అషికా రంగనాథ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడిగా చిరంజీవి కనిపించబోతున్నట్లు టాక్. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. -
చిరంజీవి గారు లేకపోతె నేను లేను
-
హనుమాన్ దేవుడు చిరంజీవి గారితో వచ్చారు..!
-
హనుమాన్, గుంటూరు కారం కాంట్రవర్సీపై చిరంజీవి కామెంట్స్
సంక్రాంతి అంటేనే సినిమాలకు చాలా మంచి సీజన్. చిన్న సినిమా అయినా సరే కథ బాగుంటే హిట్ అవుతుంది. కంటెంట్లో సత్తా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా విడుదల అవుతుంది. కానీ హనుమాన్ సినిమాను చిన్న ప్రాజెక్ట్ అని మరో తేదీలో విడుదల చేసుకోవచ్చు కదా అంటూ చిత్ర పరిశ్రమ నుంచి కొందరు ఒత్తిడి తీసుకొస్తున్నారని గతంలో నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.. ఇదే అంశంపై చిరంజీవి వ్యాఖ్యానించారు. 👉: ‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు) జనవరి 12న గుంటూరు కారం, హను-మాన్ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. తాజాగా జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగస్టార్ చిరంజీవి గుంటూరు కారం కాంట్రవర్సీపై పరోక్షంగా కామెంట్లు చేశారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జ చాలా కష్టపడ్డాడు. ఈ సంక్రాంతి సీజన్కు ఎన్ని సినిమాలు వచ్చినా సరే.. కంటెంట్లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారని చిరంజీవి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కరలేదని ఆయన తెలిపారు. అయితే ఇదీ కాస్త పరీక్షా కాలం అనుకోవచ్చు.. అందరూ అనుకున్నట్లుగా హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకకపోవచ్చు.. సినిమాలో కంటెంట్ ఉంటే సెకండ్ షో చూస్తారు.. అదీ లేకపోతే మరో వారం తర్వాత అయినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలతో పాటు హను–మాన్ కూడా బాగా ఆడాలి.. ఆడుతుందని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆయన కోరారు. '2017 సంక్రాంతి సమయంలో కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి.. అప్పుడు రేసులోకి శతమానం భవతి చిన్న సినిమాను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఆ సమయంలో నేను రిస్క్ ఎందుకని దిల్ రాజుకు చెప్పాను.. అందుకు ఆయన ఒకటే మాట అన్నాడు సినిమా బాగుంది.. అందరికీ నచ్చుతుందని విడుదల చేశాడు.. అనుకున్నట్లే ఆ సమయంలో శతమానం భవతి సూపర్ హిట్ అయింది. ఈ ఏడాది కూడా చిన్న సినిమాగా వస్తున్న హనుమాన్ కూడా సూపర్ హిట్ అవుతుంది.' అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. -
‘హను–మాన్’ ప్రీ రిలీజ్ వేడుక ముఖ్యఅతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
హను–మాన్: ప్రతి టిక్కెట్పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళం
‘‘సంక్రాంతి అన్నది సినిమాలకు చాలా మంచి సీజన్. ఎన్ని చిత్రాలు వచ్చినా సరే కథ బాగుండి.. కంటెంట్లో సత్తా ఉండి.. దేవుడి ఆశీస్సులు ఉన్నాయంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరించి, విజయం అందిస్తారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ’ సినిమాలతో పాటు ‘హను–మాన్’ కూడా బాగా ఆడాలి.. ఆడుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హను–మాన్’. శ్రీమతి చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘హను–మాన్’ టీజర్, ట్రైలర్ చూడగానే అద్భుతంగా అనిపించడంతో డైరెక్టర్ ఎవరని అడిగి, ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నాను. ‘మీ సూపర్ హీరో ఎవరు?’ అని ఓ ఇంటర్వ్యూలో సమంత అడిగినప్పుడు.. ‘హను–మాన్’ అని టక్కున చెప్పేశాను. అదే ఈ సినిమాకి టైటిల్గా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ఆలోచన, తేజ కష్టం వృథా కావు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవచ్చు. కానీ, సినిమాని విడుదల రోజు.. లేకుంటే మరుసటి రోజు.. ఫస్ట్ షో.. లేదంటే సెకండ్ షో చూస్తారు. సినిమా బాగుంటే ఎన్ని రోజులైనా చూస్తారు. ‘హను–మాన్’లాంటి మంచి సినిమా తీసిన నిరంజన్ రెడ్డిగారికి థ్యాంక్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రం ఆడినన్ని రోజులు ప్రతి టిక్కెట్పై వచ్చే డబ్బులో ఐదు రూపాయలు అయోధ్యలోని రామమందిరానికి విరాళంగా ఇస్తామని యూనిట్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రామమందిరంప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది.. కుటుంబ సమేతంగా వెళతాను’’ అన్నారు. కె.నిరంజన్ మాట్లాడుతూ– ‘‘నేను ఏదైతే నమ్మానో దాన్ని అలాగే తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్కి థ్యాంక్స్. మా విజన్తో నిర్మించిన ‘హను–మాన్’ని ప్రేక్షకులు బిగ్స్క్రీన్స్లో చూసి ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవిగారికే. ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తున్నా. రామ్చరణ్గారికి రాజమౌళిగారు, రవితేజగారికి పూరి జగన్నాథ్గారు, నాకు.. ప్రశాంత్ వర్మగారు అని సగర్వంగా చెబుతున్నా’’ అన్నారు తేజ సజ్జా. ‘‘నన్ను నమ్మి ‘హను–మాన్’ తీయమని సపోర్ట్ చేసిన నిరంజన్ రెడ్డి సర్కి థ్యాంక్స్. కలలో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు తేజ.. తనకి సినిమా అంటే అంత ప్రేమ. ఈ సంక్రాంతికి పిల్లలు, పెద్దలందరూ థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేసేలా ‘హను–మాన్’ ఉంటుంది అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్కుమార్, నటుడు వినయ్ రాయ్, కెమెరామేన్ దాశరథి శివేంద్ర, డైరెక్టర్ కేవీ అనుదీప్, రచయిత–డైరెక్టర్ బీవీఎస్ రవి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, గౌర హరి తదితరులు పాల్గొన్నారు. -
'హనుమాన్'.. ఊహించనంత బ్రహ్మాండంగా వచ్చింది: వరలక్ష్మి
చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలకి వచ్చిన పలు సినిమాల్లో నటించిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 'హనుమాన్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడుతూ చిత్రబృందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళ వెర్షన్ నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. 'హనుమాన్' కోసం అందరూ ఎంతగానో శ్రమించారు. చిత్రం చాలా బాగా వచ్చింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా అయింది. హనుమాన్ చిత్రాన్ని తమిళనాట విడుదల చేస్తున్న శక్తిఫిలింస్ అధినేత శక్తివేల్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించనంత బ్రహ్మాండంగా 'హనుమాన్' వచ్చిందని చెప్పారు. ఇందులో తనతో పాటు సముద్రఖని, అమృతా అయ్యర్ ఇలా చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. హనుమాన్ చిత్రం వెనుక చాలా శ్రమ ఉందని హీరో తేజా పేర్కొన్నాడు. ఇది తెలుగు చిత్రంగా కాకుండా డైరెక్ట్ తమిళ చిత్రంగా ఉంటుందన్నారు. అందుకోసం చాలా శ్రమించామని చెప్పారు. (ఇదీ చదవండి: రిలీజ్ గందరగోళం.. ఇప్పుడేమో సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
హనుమాన్ హిట్ అవ్వాలంటూ హీరోకు నిర్మాత గిఫ్ట్!
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అక్కడి నుంచి హీరోగా ఎదిగాడు తేజ సజ్జ. ప్రస్తుతం అతడు నటించిన హనుమాన్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. అసలే సంక్రాంతికి మరో మూడు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా హనుమాన్ వెనక్కు తగ్గలేదు. వాటితో పాటు ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజవుతుందని నిర్మాతలు నొక్కి చెప్తున్నారు. దీంతో ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ హీరో తేజ సజ్జాకు ఓ బహుమతినిచ్చాడు. హీరోను కలిసి ఓ మహిమాన్విత బంగారు ఉంగరాన్ని గిఫ్ట్గా ఇచ్చాడట! ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ఏదైనా సినిమా హిట్టయ్యాక సదరు నిర్మాత హీరోకు బహుమతి ఇస్తుంటాడు. ఇక్కడ సినిమా రిలీజవకముందే వేరే నిర్మాత వచ్చి హీరోను అభినందిస్తూ గిఫ్ట్ ఇవ్వడం విశేషం. హనుమాన్ సినిమా విషయానికి వస్తే దీనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ పొంగల్ కానుకగా జనవరి 12న విడుదల కానుంది. View this post on Instagram A post shared by PrimeShow Entertainment (@primeshowentertainment) చదవండి: సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్ హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
సంక్రాంతి పోటీని తట్టుకునేందుకు 'హనుమాన్' ప్లాన్ అదుర్స్
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. విడుదల తేదీలు దగ్గరపడుతుండటంతో ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గుంటూరు కారం' ఈవెంట్ కోసం జనవరి 6వ తేదీని లాక్ చేసుకుంది. హైదరాబాద్లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున ఈ వేడుక జరగనుంది. తాజాగా హనుమాన్ చిత్రం కూడా 7న ఎన్ కన్వెన్షన్ లో సెలబ్రేషన్కు రెడీ అవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని హీరో తేజ సజ్జ తెలిపాడు. హనుమాన్ కోసం గాడ్ఫాదర్ ఉన్నాడు అంటూ ఆయన తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండటంతో సినిమాకు మరింత బజ్ క్రియేటే చేసేందుకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హనుమాన్ చిత్రంలో చిరంజీవి కూడా నటించారని వార్తలు వచ్చాయి. ట్రైలర్ లో హనుమంతుడి కళ్ళు అచ్చం చిరుని పోలి ఉన్నాయని కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రం ఈవెంట్ కోసం స్వయంగా ఆయనే రావడం చూస్తే ఏదో లింక్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. మెగాస్టార్కు హనుమంతుడు అంటే ఎనలేని భక్తి కాబట్టి ఇలాంటి చిత్రంలో ఆయన కొంతసేపు కనిపించడమో లేదా గొంతు వినిపించడమో ఉంటుందని భావిస్తున్నారు. హనుమాన్ ప్లాన్ అదుర్స్ తేజ సజ్జ చైల్డ్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగాడు. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు. అందుకు ఆయన నటన మీద నమ్మకంతో హనుమాన్ చిత్రాన్ని భారీ డడ్జెట్తో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సంక్రాంతి సినిమాల తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది. గుంటూరు కారం, హనుమాన్ రెండు చిత్రాలు జనవరి 12న విడుదల కానున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం చిత్రానికి భారీగా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో హనుమాన్ సినిమాకు ఎర్లీ ప్రీమియర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే జనవరి 11న రాత్రే భారీగా షోలు ఉండేలా ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే యూఎస్లో జనవరి 11 నుంచి ప్రీమియర్స్ ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కొంత వరకు కలెక్షన్స్ పెంచుకోవచ్చని హనుమాన్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ పెంచుకోవచ్చని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. My #GodFather for our #HanuMan ❤️@PrasanthVarma @Primeshowtweets pic.twitter.com/9dyebsLNs5 — Teja Sajja (@tejasajja123) January 4, 2024 -
గుంటూరు కారంతో పోటీ.. హనుమాన్ హీరో ట్వీట్ వైరల్
ఈ సంక్రాంతికి సినిమా అభిమానులకు పెద్ద పండుగ ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా భారీగానే సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. అదే రోజున తేజ సజ్జ నటించిన 'హనుమాన్' కూడా విడుదల కానుంది. జనవరి 12న ఏకంగా రెండు సినిమాలు ఉండటంతో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకొని మరోతేదికి వస్తారనుకుంటే ఎవరూ తగ్గలేదు. ఫైనల్గా గుంటూరు కారం,హనుమాన్ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయి. దీంతో పలు వెబ్సైట్లు మహేష్కు పోటీగా తేజ సజ్జ దిగుతున్నాడు అంటూ కొన్ని పోస్టులు పెట్టాయి. వాస్తవానికి మహేష్ లాంటి సూపర్ స్టార్కు తేజ సజ్జ ఎలా పోటీ అవుతాడు..? మహేష్కు మాస్,ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఇంత వరకు పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా రాలేదు.. అయినా పాన్ ఇండియా హీరోల్లో మహేష్ టాప్-10 లో ఉండటం విశేషం. అయితే తేజ సజ్జ ఒక ట్వీట్ చేశాడు. 'సూపర్స్టార్తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ఒక స్క్రీన్ షాట్కు రిప్లై ఇచ్చాడు. వాస్తవానికి 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో 'యువరాజు' అనే సినిమాలో నటించాడు తేజ సజ్జ.. అందులో మహేష్కు కుమారుడిగా ఆయన నటించిన విషయం తెలిసిందే. సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలా ఇద్దరీ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మరింత విశేషం. #SuperStar tho poti enti sir 🤦♂️🙏 అయన తో పోటీగ కాదు సర్ అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8 — Teja Sajja (@tejasajja123) January 2, 2024 -
'హనుమాన్'కు అడ్డంకులు.. ప్రభాస్ సాయం కోరుతున్న చిత్ర యూనిట్
హనుమాన్ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలే ఉన్నాయి. గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ చిత్రాలతో పాటు తమిళ్ డబ్ సినిమాలు అయిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్' చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి సినిమాలకు థియేటర్లు దొరకడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం విడుదలైన హనుమాన్ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. 2024 సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్గా గుంటూరు కారం ఉంది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కడంతో సాధారణంగా ఎక్కువ థియేటర్లు ఈ చిత్రం వైపే మొగ్గు చూపుతాయి. దీంతో 'హనుమాన్'ను వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే పలువురు తమ మూవీ టీమ్ను సంప్రదించారంటూ ఆయన తెలిపారు. హనుమాన్ సినిమాను ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సెన్సార్ విషయంలోనూ కూడా కొందరు ఇబ్బంది పెట్టారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్ని జరిగినా తాము ముందుగా అనుకున్నట్లే 'హనుమాన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిముషాలు ఉండనుంది. హనుమాన్ కోసం ప్రభాస్ జనవరి 12న హనుమాన్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ విభాగంలో సుమారు 1500 థియేటర్లలో హనుమాన్ విడుదల కానుందని సమాచారం. కానీ అక్కడ సినిమాకు బజ్క్రియేట్ కావాలంటే ఒక డైనోసార్ను దింపాలి. అదే పని ఇప్పుడు మేకర్స్ చేస్తున్నారు. హనుమాన్ ప్రమోషన్స్లో భాగంగా త్వరలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాస్ను తీసుకొచ్చేందుకు తనతో పాటు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందంటూ ప్రశాంత్ తెలిపారు. -
నీ రాక అనివార్యం హనుమా..విజువల్ వండర్లా ‘హను-మాన్’ ట్రైలర్
తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్’. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ డైలాగ్స్.. అద్భుతమైన విజువల్స్తో ట్రైలర్ అదిరిపోయింది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘యతో ధర్మ స్తతో హనుమ..యతో హనుమ..స్తతో జయ’అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పల్లెటూరిలో ఉండే హీరోకి ఒక స్పెషల్ పవర్ ఉండడం.. విలన్(వినయ్ రాయ్) ఆ పవర్ కోసం ప్రయోగాలు చేయడం.. హీరో గురించి తెలిసి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తే హనుమంతుడు ఎలా కాపాడాడు? అసలు హీరోకి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి? మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘పోలేరమ్మ మీద ఒట్టు..నా తమ్ముడి మీద చేతులు పడితే ఒక్కొక్కరికి టెంకాయలు పగిలిపోతాయి’ అని వరలక్ష్మీ శరత్ కుమార్ చేసే ఫైట్ సీన్ ట్రైలర్కి స్పెషల్ అట్రాక్షన్. ‘నీకు కనబడుతుంది ఒకడి ఉన్మాదం మాత్రమే కానీ దాని వెనుక ఒక ఉపద్రవం దాగిఉంది’, ‘కలియుగంలో ధర్మంకోసం పోరాటే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంటా ఉన్నాడు..మానవాళి మనుగడను కాపాడుకోవడం కోసం నీ రాక అనివార్యం హనుమా’ లాంటి డైగాల్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. -
ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోగా వస్తున్నా: తేజ సజ్జ
-
సంక్రాంతికి సై
సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ లుక్లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆయన కెరీర్లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్ పక్కా అని డుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ► ‘సైంధవ్’ సినిమాతో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్ కెరీర్లో ‘సైంధవ్’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్’ చిత్రాన్ని ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్. ► గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్ కౌంట్డౌన్ మొదలు పెట్టారు మేకర్స్. రవితేజ కెరీర్లోనే ‘ఈగల్’ వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్ పేర్కొంది. ► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్బాబు పక్కా మాస్ లుక్లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ చెబుతున్నాయి. ► ‘ఖుషి’ వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్నగర్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్లో షూటింగ్ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. ► ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డబ్బింగ్ కూడా.. పండగకి స్ట్రయిట్ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. ‘జైలర్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పొంగల్ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్కి రిలీజ్ కానుంది. -
సంక్రాంతి థియేటర్స్ లో హనుమాన్ తో పండగ చేసుకుందాం
-
ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?
నేటి బాలలే రేపటి పౌరులు.. అన్న విధంగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలనటులుగా నటించిన ఎందరో ఇప్పుడు అగ్రతారలుగా చలామణీ అవుతున్నారు. మరికొందరేమో స్టార్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిల్లలిద్దరూ టాలీవుడ్లో సినిమాలు చేశారు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? ఒకరేమో హీరో తేజ సజ్జ.. మరొకరేమో హీరోయిన్ శ్రీదివ్య. చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోగా ఈ స్టిల్ యువరాజు సినిమాలోనిది. తేజ టాలీవుడ్లో బిజీ అయిపోతుంటే శ్రీదివ్య కోలీవుడ్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. తేజ సజ్జ.. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, మహేశ్బాబు, శ్రీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో బుడ్డోడిగా నటించి మెప్పించాడు. చిన్నతనంలోనే నటనలో ఆరితేరిన తేజ.. జాంబి రెడ్డి సినిమాతో హీరోగా మారాడు. ఇష్క్, అద్భుతం చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతం హనుమాన్ సినిమా చేస్తున్నాడు. బిజీ అయిపోయిన శ్రీదివ్య శ్రీదివ్య.. హనుమాన్ జంక్షన్, యువరాజ్, వీడే, భారతి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది. మనసారా సినిమాతో హీరోయిన్గా మారింది. బస్ స్టాప్, కేరింత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగింటి అమ్మాయైన శ్రీదివ్య తమిళంలో బాగా బిజీ అయింది. మలయాళంలోనూ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే రైడ్ మూవీతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. View this post on Instagram A post shared by Sri Divya (@sd_sridivya) చదవండి: పాపం.. సెల్ఫీ అడిగినందుకు అభిమానిని కొట్టి మెడ పట్టి తోశారు.. మరీ ఇంత ఘోరమా? -
సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ 'హనుమాన్'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతి రేసులో హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోల సినిమాలు చూసి మనం ఆహో ఓహో అంటుంటాం. వాళ్లందరికీ గురువు లాంటివాడు ఆంజనేయుడు. ఆయన కథతో ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే చిత్రాన్ని తీస్తున్నాడు. గ్రాఫిక్స్ ప్రధానం కావడం వల్ల గత రెండేళ్ల నుంచి ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఏదో తొందరపడి విడుదల చేయాలని కాకుండా నిదానంగా ఒక్కో పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్లు ఉన్నాయి. మరో ఆరు నెలల్లో అంటే వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఏకంగా అన్ని సినిమాలు? వచ్చే సంక్రాంతి బరిలో ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు బోలెడన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మహేశ్ 'గుంటూరు కారం', రవితేజ 'ఈగిల్' ముగ్గుల పండక్కే వచ్చేందుకు సిద్ధమైపోయాయి. వీటితోపాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ, పవన్ కల్యాణ్ 'ఓజీ', చిరంజీవి-కల్యాణ్ కృష్ణ కాంబోలోని సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. 'హనుమాన్' స్పెషల్ ప్రశాంత్ వర్మ తీస్తున్న 'హనుమాన్' సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా 11 భాషల్లో విడుదల చేయబోతున్న తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇందులో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేస్తోంది. ఇలా సమ్థింగ్ స్పెషల్ అనిపిస్తున్న ఈ చిత్రం.. సంక్రాంతికి మిగతా సినిమాలతో కలిసి బరిలోకి దిగుతుందా? లేదా ప్లాన్ ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి. pic.twitter.com/LjAYhaDO9V — Prasanth Varma (@PrasanthVarma) July 1, 2023 (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
హనుమంతుణ్ణి నమ్మాం, ఆయన వల్లే ఇది.. : డైరెక్టర్
‘‘హను–మాన్’ చిత్రాన్ని చిన్నదిగా స్టార్ట్ చేశాం. అయితే మా మూవీ హనుమంతుని వలే భారీ ప్రాజెక్టు అయ్యింది. మేము హనుమంతుణ్ణి, కథని నమ్మాం. అద్భుతమైన విజువల్ ట్రీట్గా రూపొందిన ‘హను–మాన్’ అందరి అంచనాలు అందుకుంటుంది’’ అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నేడు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘తెలుగులో గొప్పదర్శకులు చాలా అద్భుతమైన చిత్రాలు తీశారు. వాళ్ల కంటే నేను బెటర్గా తీయలేను. నాకంటూ ఒక యూనిక్ జోనర్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో భాగంగా కొత్త జోనర్స్పై దృష్టి పెట్టాను. ఆ క్రమంలో ‘అ, కల్కి, జాంబి రెడ్డి’ సినిమాలు చేశాను. తర్వాత నాకు ఇష్టమైన సూపర్ హీరో కథతో ‘హను–మాన్’ తీశా. హనుమంతుని కథలో జరిగిన ఒక కీలక ఘటనని తీసుకొని ఈ మూవీ చేశాం. ‘హను–మాన్’ టీజర్ విడుదలైన తర్వాత రాజమౌళిగారిని కలిశాను. ఆయన ఇచ్చిన సూచనలతో మాకు చాలా సమయం కలిసొచ్చింది. జూలై ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ని(పీవీసీయూ) నా బర్త్ డే కానుకగా నేడు అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘అధీర’ ఫిల్మ్ రూపొందుతోంది. బాలకృష్ణగారితోనూ ఓ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
అంజనాద్రి కోసం సాహసాలు
అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్’ టీజర్పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్గా హను–మాన్ చిత్రం రిలీజ్ కానుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి. -
వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హనుమాన్. జాంబిరెడ్డి లాంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరూ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన టీజర్తో ఈ మూవీపై మరింత హైప్ నెలకొంది. దీంతో రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ గ్రాఫిక్ పనులు, ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని తెలిపారు. కాగా ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
Hanuman Movie Stills: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
Teja Sajja: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
Hanu-Man: అంజనాద్రి కోసం పోరాటం
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హను–మాన్’. అమృతా అయ్యర్ కథానాయిక. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారంతో పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హనుమంతుని శక్తులను పొందిన హీరో అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనేది చిత్ర కథాంశం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్గా ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
హనుమాన్ పాన్ వరల్డ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమృతా అయ్యర్ కథానాయిక. చైతన్య సమర్పణలో కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమా మే 12న తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారత్తో పాటు అమెరికా, చైనా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జెర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. హనుమంతుడి అనుగ్రహంతో ఓ కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేదే సినిమా కథ. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే రిలీజైన హనుమాన్ టీజర్లో వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టాండర్స్ను తలదన్నేలా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. #HanuManFromMay12th pic.twitter.com/SIDCSD6wns — Teja Sajja (@tejasajja123) January 9, 2023 చదవండి: -
'హనుమాన్'కి గ్రాఫిక్స్ హాలీవుడ్ కాదు.. మన హైదరాబాద్లోనే
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంజనాద్రి (Anjanadri) అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇటీవలె ఈ సినిమా టీజర్ విడుదలై జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ విశేషంగా ఆకట్టుకుంది. దీనికి మరో ప్రధాన కారణం "వి.ఎఫ్.ఎక్స్". హాలీవుడ్ స్టాండర్డ్స్ ను తలదన్నేలా కనిపిస్తున్న ఈ గ్రాఫిక్స్ అద్దింది హైదరాబాద్ కు చెందిన "హేలో హ్యూస్ స్టూడియోస్" సంస్థ. దీంతో ఈ గ్రాఫిక్స్ కంపెనీ గురించి పలువురు టాలీవుడ్ దర్శకులు చర్చించుకుంటున్నారు. -
అదే హనుమాన్ కథ, ఇది పాన్ వరల్డ్ చిత్రం: ప్రశాంత్ వర్మ
ఇది పాన్ వరల్డ్ చిత్రం ‘‘మన తెలుగు సినిమాలు ‘ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ పాన్ వరల్డ్ వెళుతున్నాయి. మా ‘హనుమాన్’ కూడా పాన్ వరల్డ్ ఫిల్మ్. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా ఉంటుంది’’ అని ప్రశాంత్ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘హనుమాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. చదవండి: అదిరిపోయిన 'హనుమాన్' టీజర్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన హనుమాన్ పేరుతో ఇంత పెద్ద సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు ఎక్కువ అయినా నిరంజన్ రెడ్డిగారు రాజీపడలేదు. పౌరాణిక పాత్ర అయిన హనుమాన్పై తొలిసారి పూర్తి స్థాయి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘‘స్పైడర్ మాన్, సూపర్ మాన్ ఫిక్షనల్ హీరోలు. కానీ, హనుమాన్ మన చరిత్ర. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడు? అనేది ఈ సినిమా’’ అన్నారు. ‘‘హనుమాన్’తో త్వరలోనే థియేటర్లో కలుద్దాం’’ అన్నారు అమృత. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?