Test Match
-
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
గతేడాది టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్గా.. బ్యాటర్గా తెంబా బవుమా (Temba Bavuma) రాణించడంతో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్-2025కి చేరుకుంది.డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పన్నెండు మ్యాచ్లకు గానూ ఎనిమిది గెలిచిన బవుమా బృందం.. మూడింట ఓడి.. ఒకటి డ్రా చేసుకుంది, ఫలితంగా 100 పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. విజయాల శాతం (69.440) పరంగా మాత్రం అన్ని జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచి అగ్రస్థానాన్ని సంపాదించింది.ఆస్ట్రేలియాతో మ్యాచ్ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా జూన్ 11న మొదలయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (SA vs AUS)తో తలపడనుంది. అయితే, ఈ మెగా మ్యాచ్కు ముందు సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ సౌతాఫ్రికా ఫోర్-డే సిరీస్ మ్యాచ్ సందర్భంగా తెంబా బవుమా గాయపడ్డాడు.దేశీ రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న బవుమా గాయపడ్డాడు. అతడి ఎడమ మోచేతికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. కాగా లయన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరుకుని.. టైటాన్స్ జట్టుతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.ఇక గురువారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుండగా.. బవుమా గాయపడిన విషయం ఆఖరి నిమిషంలో లయన్స్ వర్గాలకు తెలిసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. లయన్స్ కెప్టెన్ డొమినిక్ హెండ్రిక్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. అయితే, గాయం తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.2022లో మూడు నెలలపాటుకాగా 2022లో బవుమా ఎడమ మోచేయి ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అదే రీతిలో గతేడాది ఐర్లాండ్తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు. దీంతో బంగ్లాదేశ్తో టెస్టులకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఎడమ మోచేయికి గాయం కావడం సౌతాఫ్రికా బోర్డులో ఆందోళన రేకెత్తిస్తోంది.డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంకా సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. అయితే, బవుమా గనుక అప్పటికి కోలుకోలేకపోతే.. జట్టుకు ఎదురుదెబ్బ తప్పదు. ఏదేమైనా బవుమా గాయంతో.. తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా టైటిల్ గెలవాలన్న సౌతాఫ్రికాకు నిరాశ ఎదురయ్యే పరిస్థితులు తలెత్తాయి.శతకాలతో అలరించికాగా బవుమా చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికాను సెమీ ఫైనల్కు చేర్చాడు. ఎడమ మోచేయికి కట్టుతోనే అతడు ఈ మెగా వన్డే టోర్నమెంట్లో బ్యాటింగ్ చేశాడు. ఇక టెస్టు ఫార్మాట్ విషయానికొస్తే... గతేడాది బవుమా ఐదు మ్యాచ్లు ఆడి 503 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకంతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆడిన ఒకే ఒక్క టెస్టులోనూ శతక్కొట్టాడు.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీని 2019లో ప్రవేశపెట్టగా.. తొలి సీజన్లో టీమిండియాను ఓడించి న్యూజిలాండ్ ఈ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక 2021-23 సీజన్లోనూ భారత్ ఫైనల్కు చేరింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక తాజాగా 2023-25 ఎడిషన్లో మరోసారి ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రోహిత్ సేనను 3-1తో ఓడించి మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. చదవండి: పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త! -
గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్కు విశాఖపట్నం వేదిక కానుంది. -
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్రౌండర్ ఆండీ మెక్బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్న నితీష్ రెడ్డి.. పిచ్పై పుష్ప స్టైల్ వార్నింగ్ (ఫొటోలు)
-
IND Vs AUS: ఆస్ట్రేలియా- భారత్ నాలుగో టెస్టు టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
భారత్ పై ఆస్ట్రేలియా విజయం
-
ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!
-
INDvsAUS - 295 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం
-
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం
-
ఆస్ట్రేలియా ఢమాల్
-
IND vs NZ 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఓటమి
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీ బ్యాటర్లు విల్ యంగ్(48), రచిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో బ్లాక్ క్యాప్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.అంతకముందు 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ తొలి ఇన్నింగ్స్లో 45 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధి ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.సర్ఫరాజ్ సూపర్ సెంచరీ..మొదటి ఇన్నింగ్స్లో భాతర బ్యాటర్లు విఫలమైనప్పటకి రెండో ఇన్నింగ్స్లో మాత్రం అదరగొట్టారు. కేఎల్ రాహుల్, జడేజా మినహా మిగితా ప్లేయర్లందరూ తమ బ్యాట్కు పనిచెప్పారు. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్లతో 150 పరుగులు చేశాడు. సర్ఫరాజ్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లి(70), రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.36 ఏళ్ల తర్వాత తొలి సారికాగా భారత్ గడ్డపై కివీస్ టెస్టు విజయం సాధించడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ చివరగా 1988లో వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు భారత్లో 36 ఏళ్ల తర్వాత బ్లాక్ క్యాప్స్ విజయకేతనం ఎగరవేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పుణే వేదికగా ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. Who else but Bumrah?! ⚡Catch the thrilling finale to the first #INDvNZ Test, LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/NDEGpW64Se— JioCinema (@JioCinema) October 20, 2024 -
భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు: జడేజా
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. ప్రత్యర్ధి ముందు కేవలం 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.అయితే టీమిండియా ఇప్పటివరకు ఇంతటి స్వల్ప లక్ష్యాన్ని ఒకే ఒక్కసారి కాపాడుకుంది 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ 107 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని విజయం సాధించింది. ఆస్ట్రేలియాను 93 పరుగులకే ఆలౌట్ చేసి 13 పరుగుల తేడాతో చారిత్రత్మక విజయం నమోదు చేసింది. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో భారత జట్టు కూడా అదే అద్భుతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత గెలుపుపై ఆశలు పెట్టకోవద్దని జడేజా తెలిపాడు."107 పరుగులను భారత్ డిఫెండ్ చేసుకుంటే నిజంగా చాలా గ్రేట్. కానీ వాస్తవం మాట్లాడుకుంటే టీమిండియా గెలవడం చాలా కష్టం. ఐదో రోజు ఉదయం తేమ ఎక్కువగా ఉంటుంది. భారత్ పేస్ బౌలింగ్తో ఆటను ప్రారంభిస్తారు. కాబట్టి బంతి పెద్దగా స్వింగ్ అవుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ పిచ్ పేసర్లకు సహకరించి ఒకట్రెండు వికెట్లు పడినా, ఆ పరిస్థితులను అడ్వాంటేజ్ తీసుకునేందుకు భారత్ వద్ద మూడవ సీమర్ లేరు" అని జడేజా జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం ఇద్దరు పేసర్లతోనే ఆడుతోంది. ఆకాశ్దీప్ను బెంచ్కే పరిమితం చేశారు.చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. పట్టిందో ఎవరో తెలుసా? -
లక్ష్యం కివీస్107 పరుగులు... భారత్ 10 వికెట్లు!
మూడు రోజులుగా మలుపులతో టెస్టు క్రికెట్ మజాను చూపించిన బెంగళూరు మ్యాచ్ ఆసక్తికర ముగింపునకు చేరింది... తప్పులు సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్లో చెలరేగిన భారత్కు తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన వెంటాడింది... ఫలితంగా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యం... కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువే కానీ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు నిలువరించలేరా, కుప్పకూల్చలేరా... బుమ్రా వేసిన తొలి నాలుగు బంతులు ఇదేనమ్మకాన్ని కలిగించాయి... అయితే చివరి రోజు బౌలింగ్తో పాటు వాతావరణం, పిచ్ కూడా మనకు కలిసి రావాలి! 35.1 ఓవర్లలో 177 పరుగులు...సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యం శనివారం భారత అభిమానులను అలరించింది...ఈ జోడీ మెరుపు బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా జట్టు సాగుతున్నట్లు అనిపించింది... సర్ఫరాజ్ ఖాన్ కెరీర్లో తొలి సెంచరీతో మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోగా, శతకం చేజారినా...పంత్ చేసిన 99 పరుగులు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే న్యూజిలాండ్ తీసుకున్న కొత్త బంతి భారత్ రాత మార్చింది. 408/3తో పటిష్టంగా కనిపించిన టీమ్ 54 పరుగులకే తర్వాతి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ మళ్లీ కివీస్ వైపు మొగ్గింది. బెంగళూరు: భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గేందుకు న్యూజిలాండ్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థి ముందు భారత్ కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 బంతులే ఎదుర్కొన్న కివీస్ పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి, ఆపై వాన కారణంగా అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం 51.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అంతకు ముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 99.3 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (195 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా...రిషభ్ పంత్ (105 బంతుల్లో 99; 9 ఫోర్లు, 5 సిక్స్లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రూర్కే, హెన్రీ చెరో 3 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. భారీ భాగస్వామ్యం... ఓవర్నైట్ స్కోరు 231/3 వద్ద సర్ఫరాజ్, పంత్ నాలుగో రోజు ఉదయం జత కలిశారు. అక్కడినుంచి కివీస్ బౌలర్లపై వీరిద్దరి ఆధిపత్యం కొనసాగింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించగా...కివీస్ బౌలర్లంతా చేతులెత్తేశారు. లేట్ కట్, ర్యాంప్ షాట్లతో సర్ఫరాజ్ పరుగులు రాబట్టగా, స్లాగ్ స్వీప్లతో పంత్ విరుచుకుపడ్డాడు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలో సర్ఫరాజ్ 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌతీ బౌలింగ్లో డీప్ కవర్ దిశగా కొట్టిన ఫోర్తో అతని సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పంత్ తన జోరును ప్రదర్శించారు. సౌతీ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను... పటేల్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్తో చెలరేగాడు. ఆ తర్వాత 55 బంతుల్లో అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే నిర్ణీత లంచ్ సమయానికి కాస్త ముందే ఆరంభమైన వర్షం...ఆ తర్వాతా కొనసాగడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆట మొదలయ్యాక వీరిని నిలువరించడంతో కివీస్ బౌలర్ల వల్ల కాలేదు. ఎట్టకేలకు కొత్త బంతి ఆ జట్టుకు కలిసొచ్చింది. అదే వైఫల్యం... 150 పరుగులు పూర్తి చేసుకున్న వెంటనే సర్ఫరాజ్ను అవుట్ చేసి సౌతీ భారత్ పతనానికి శ్రీకారం చుట్టాడు. సౌతీ తర్వాతి ఓవర్లో సిక్స్తో పంత్ 96కు చేరుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. 99 పరుగుల వద్ద రూర్కే వేసిన బంతిని డ్రైవ్ చేయబోగా...అతని బ్యాట్ను తగిలి బంతి స్టంప్స్పై పడింది. చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించగా, పంత్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత అభిమానులు మరింత నిరాశ చెందే సమయం వచ్చింది. తొలి ఇన్నింగ్స్లాగే అదే వరుసలో రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15) విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో హెన్రీ రెండు వికెట్లు తీసి భారత్ కథ ముగించాడు. పంత్ రనౌట్ అయి ఉంటే... సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యంలో ఒకే ఒక్క సారి కివీస్కు మంచి అవకాశం వచ్చింది. పంత్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని జట్టు చేజార్చుకుంది. హెన్రీ వేసిన బంతిని పంత్ గల్లీ దిశగా ఆడగా సింగిల్ పూర్తి కాగా, రెండో పరుగు కోసం పంత్ బాగా ముందుకొచ్చేశాడు. సర్ఫరాజ్ వారించడంతో అతను వెనక్కి వెళ్ళాడు కానీ క్రీజ్కు చాలా దూరంగా ఉన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు తన స్థానం నుంచి చాలా దూరం జరిగిన కీపర్ బ్లన్డెల్ తన వెనక ఉన్న పరిస్థితిని గుర్తించలేకపోయాడు. అతను సరైన చోట ఉంటే పంత్ అక్కడే వెనుదిరిగేవాడు! 107 గతంలో 107 లేదా అంతకంటే తక్కువ ల„ ్యాన్ని సొంతగడ్డపై భారత్ ఒకే ఒక సారి కాపాడుకుంది. 2004లో స్పిన్కు బాగా అనుకూలించిన ముంబై టెస్టులో 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 93 పరుగులకే కుప్పకూలింది. 7 టెస్టుల్లో పంత్ 90ల్లో అవుట్ కావడం ఇది ఏడో సారి. అతని ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. 7 భారత్ తరఫున ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్లలో కలిపి అత్యధికంగా ఏడుగురు డకౌట్ అయ్యారు. గతంలో ఇలాంటి ప్రదర్శన 1952లో (ఇంగ్లండ్పై) నమోదైంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లన్డెల్ (బి) పటేల్ 35; రోహిత్ (బి) పటేల్ 52; కోహ్లి (సి) బ్లన్డెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (సి) పటేల్ (బి) సౌతీ 150; పంత్ (బి) రూర్కే 99; రాహుల్ (సి) బ్లన్డెల్ (బి) రూర్కే 12; జడేజా (సి) యంగ్ (బి) రూర్కే 5; అశ్విన్ (ఎల్బీ) (బి) హెన్రీ 15; కుల్దీప్ (నాటౌట్) 6; బుమ్రా (సి) బ్లన్డెల్ (బి) హెన్రీ 0; సిరాజ్ (సి) సౌతీ (బి) హెన్రీ 0; ఎక్స్ట్రాలు 18; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్) 462. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231, 4–408, 5–433, 6–438, 7–441, 8–458, 9–462, 10–462. బౌలింగ్: సౌతీ 15–2–53–1, హెన్రీ 24.3–3–102–3, విలియమ్ రూర్కే 21–4–92–3, ఎజాజ్ పటేల్ 18–3–100–2, ఫిలిప్స్ 15–2–69–1, రచిన్ 6–0–30–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 0; కాన్వే (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 0; మొత్తం (0.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 0. బౌలింగ్: బుమ్రా 0.4–0–0–0. -
బెంగళూరులో వర్షం.. భారత్ - కివీస్ తొలి టెస్టు మొదటి సెషన్ ఆట కష్టమే! (ఫొటోలు)
-
పాక్ గడ్డపై ఇంగ్లండ్ వీరుల విధ్వంసం(ఫోటోలు)
-
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
IND vs BAN: చెపాక్ టెస్టులో భారత్ ఘన విజయం
India vs Bangladesh, 1st Test Chennai Day 4 Updates:భారత్ ఘన విజయంచెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్పై 280 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 233 పరుగులకు ఆలౌటైంది. 158/4 వ ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ అశ్విన్ స్పిన్ ఉచ్చులో చిక్కు కుంది. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్తో పాటు జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో(82) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.విజయానికి చేరువలో భారత్.. తొలి టెస్టులో విజయానికి భారత్ కేవలం రెండు వికెట్ల దూరంలో నిలిచింది. వరుస క్రమంలో బంగ్లాదేశ్ వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ ఏడో వికెట్గా వెనుదిరగా.. కెప్టెన్ షాంటో(82) ఎనిమిదో వికెట్గా పెవిలియన్కు చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆరో వికెట్ డౌన్..చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. లిట్టన్ దాస్ రూపంలో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దాస్.. జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో నిలిచింది.ఐదో వికెట్ డౌన్..194 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన షకీల్ అల్ హసన్.. అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అశ్విన్ నాలుగో రోజు ఆటలో తన వేసిన తొలి ఓవర్లో భారత్కు వికెట్ను అందించాడు. క్రీజులోకి లిట్టన్ దాస్ వచ్చాడు. 54 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.నిలకడగా ఆడుతున్న బంగ్లా..నాలుగో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్లు షాంటో(64), షకీల్ అల్ హసన్(25) నిలకడగా ఆడుతున్నారు. 51 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. బంగ్లా విజయానికి ఇంకా 321 పరుగులు అవసరం.చెపాక్ వేదికగా బంగ్లాదేశ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో(51), షకీబ్ అల్ హసన్(5) ఉన్నారు. బంగ్లాదేశ్ తమ విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నైటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
భారత్ vs బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అంతా అనుకున్నట్టే.. న్యూజిలాండ్- అఫ్గాన్ టెస్టు రద్దు
అందరూ ఊహించిందే జరిగింది. నోయిడా వేదికగా అఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "నోయిడాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు చేయబడింది. ఐదవ రోజు ప్రారంభంలోనే అంపైర్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బ్లాక్ క్యాప్స్ శ్రీలంకకు పయనం కానున్నారు అని న్యూజిలాండ్ క్రికెట్ ఎక్స్లో రాసుకొచ్చింది.కాగా ఈ సిరీస్ వాస్తవానికి సెప్టెంబర్ 9న ప్రారంభమవ్వాల్సింది. కానీ కుండపోత వర్షం వల్ల మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అయితే తొలి రెండు రోజులు పగలు సమయంలో పెద్దగా వర్షం కురవనప్పటకి.. మైదానాన్ని గ్రౌండ్ స్టాప్ సిద్దం చేయలేకపోయారు. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో సరైన మౌళిక సదుపాయాలు లేకపోవడమే అందుకు కారణం. గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేవు. ఆ తర్వాత మరింత వర్షాలు కురవడంతో గ్రౌండ్ మొత్తం చిన్నపాటి చెరువులా తయారైంది. ఆఖరి మూడు రోజులు కనీసం ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియం కూడా రాలేదు. అంటే నోయిడా మైదానంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆర్ధం చేసుకోవచ్చు. చివరికి టాస్ పడకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేయాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలని భావించిన అఫ్గానిస్తాన్కు నిరాశే ఎదురైంది.చదవండి: IPL 2025: రోహిత్ ముంబై ఇండియన్స్తోనే కొనసాగాలి.. ఎందుకంటే? -
Afg vs NZ: మొన్న అలా.. ఇప్పుడిలా! ఖేల్ ఖతం?
అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. వర్షం కారణంగా మూడో రోజు ఆట కూడా.. కనీసం టాస్ పడకుండానే ముగిసిపోయింది. కాగా 2017లో టెస్టు హోదా సంపాదించిన అఫ్గన్ జట్టు.. తటస్థ వేదికలపై తమ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్తో తొలిసారిగా టెస్టు ఆడేందుకు వేదికగా భారత్ను ఎంచుకుంది.సోమవారమే మొదలు కావాలి.. కానీభారత క్రికెట్ నియంత్రణ మండలిని సంప్రదించి తమ రాజధాని కాబూల్కు దగ్గరగా ఉన్న గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియానికి విచ్చేసింది. ఇందులో భాగంగా.. షెడ్యూల్ ప్రకారం అఫ్గన్- కివీస్ జట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ మొదలుకావాలి.. కానీ రెండు రోజుల పాటు ఆటగాళ్లు మైదానంలో దిగే పరిస్థితి లేకపోయింది. ఆట ముందుకు సాగడమే గగనమైంది.తొలి రెండు రోజులు వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆటకు సిద్ధం కాలేదు. గత రెండు వారాల క్రితం నోయిడాలో కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి అదే విధంగా... మైదానాన్ని ఆటకు వీలుగా ఆరబెట్టే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యమయ్యే దుస్థితి తలెత్తింది. కేవలం నోయిడా స్టేడియంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే అఫ్గనిస్తాన్ జట్టుకు భంగపాటు ఎదురవుతోంది. రెండోరోజు ఆట జరిపించేందుకు మంగళవారం మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.ల్యాండ్స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చినా అవుట్ఫీల్డ్ పొడిబారలేదు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేసినా ఫలితం శూన్యం. దీంతో కనీసం మూడో రోజైనా పరిస్థితి మెరుగపడుతుందని అఫ్గన్- న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూశారు.ఇప్పుడిక వర్షంఅయితే, ఈరోజు వర్షం కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. వాన కురుస్తున్న కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లతో కప్పేశారు గ్రౌండ్స్మెన్. దీంతో మూడో రోజు కూడా ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక మరో రెండు రోజుల పాటూ నోయిడాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఫ్గన్- కివీస్ టెస్టు మొదలుకాకుండానే ముగిసిపోయే దుస్థితి నెలకొంది.చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
అయ్యో పాపం!.. అఫ్గనిస్తాన్ జట్టుకు ఏమిటీ ‘పరీక్ష’?
న్యూజిలాండ్తో తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన అఫ్గనిస్తాన్ జట్టుకు వరుసగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో సరైన వసతిలేని కారణంగా రెండో రోజు ఆట కూడా రద్దైపోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మంగళవారం నాటి ఆట ముగిసిపోయింది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో స్టేడియం నుంచి నిష్క్రమించినట్లు సమాచారం.కారణం ఇదేకాగా స్వదేశంలో మ్యాచ్లు నిర్వహించే పరిస్థితిలేని కారణంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలో తొలిసారిగా కివీస్తో టెస్టు ఆడేందుకు భారత్లోని గ్రేటర్ నోయిడా మైదానాన్ని ఎంచుకుంది. ఇందుకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా ఆమోదం రావడంతో అఫ్గన్ జట్టు నోయిడాకు చేరుకుంది.ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారమే(సెప్టెంబరు 9) అఫ్గన్- కివీస్ ఏకైక టెస్టు ఆరంభం కావాల్సి ఉంది. అయితే, గత రెండు వారాలుగా కురిసిన భారీ వానల కారణంగా నోయిడా స్టేడియం అవుట్ ఫీల్డ్ మొత్తం తడిసిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గ్రౌండ్స్మెన్ ఎంతగా కష్టపడినా ఫలితం లేకపోయింది. ఈ స్టేడియంలో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి మళ్లీ ఎండకాస్తే తప్ప గ్రౌండ్ ఆరే పరిస్థితి లేదు. అయితే, రెండురోజులుగా నోయిడాలో వర్షం లేకపోయినా.. వాతావరణం మాత్రం పొడిగా లేదు. అయినప్పటికీ సూపర్ ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే కాస్త పరిస్థితి మెరుగైనా ఆట మొదలుపెట్టేందుకు అనుకూలంగా లేకపోయింది. రెండో రోజు కూడా టాస్ పడకుండానేఈ నేపథ్యంలో టాస్ పడకుండానే అఫ్గన్- న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసిపోయింది. దీంతో రెండో రోజు నుంచి అరగంట ఎక్కువసేపు మ్యాచ్ నిర్వహిస్తామని అంపైర్లు తెలిపారు. అయితే, ఈ రోజు(మంగళవారం) కూడా అదే పరిస్థితి ఎదురైంది. అవుట్ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ అధికారులు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కివీస్కు నష్టమేమీ లేదు.. కానీనోయిడా స్టేడియం మేనేజ్మెంట్ వల్ల తమ చారిత్రాత్మక మ్యాచ్కు అవరోధాలు ఎదురవుతున్నాయని.. మరోసారి ఇక్కడకు రాబోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-2025 సైకిల్లో ఈ మ్యాచ్ భాగం కాదు కాబట్టి న్యూజిలాండ్కు పెద్దగా వచ్చే నష్టమేమీలేదు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్తో టెస్టు ఆడి.. సత్తా చాటాలని భావించిన అఫ్గన్ ఆటగాళ్లకే తీవ్ర నిరాశ ఎదురైంది.చదవండి: Ind vs Ban T20Is: టీమిండియాకు శుభవార్త -
Afg vs NZ: ‘చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోము’
న్యూజిలాండ్తో తమ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్కు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నోయిడా స్టేడియంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. కనీస వసతులు కూడా లేవంటూ పెదవి విరిచారు. ఇలాంటి చోట ఇంకోసారి అడుగు కూడా పెట్టబోమంటూ ఘాటు విమర్శలు చేశారు.తటస్థ వేదికలపైకాగా తమ దేశంలో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితి లేదు కాబట్టి తాము ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలపై ఆడుతోంది అఫ్గన్ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదంటే భారత్ వేదికగా ప్రత్యర్థి జట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గతంలో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ పాతిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను హోం గ్రౌండ్గా చేసుకుని పలు మ్యాచ్లు ఆడింది అఫ్గన్ జట్టు. వర్షం కురవనేలేదు.. అయినా..ఈ క్రమంలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టుతో తొలిసారి టెస్టు ఆడేందుకు సిద్ధమైన మరోసారి నోయిడాకు విచ్చేసింది. అయితే, సోమవారం(సెప్టెంబరు 9) మొదలుకావాల్సిన అఫ్గన్- కివీస్ మ్యాచ్కు ప్రతికూల పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఫలితంగా ఇరుజట్ల మధ్య మొదలుకావాల్సిన ఏకైక టెస్టు తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యింది. నిజానికి సోమవారం ఏమాత్రం వర్షం కురవనేలేదు. కానీ కొన్నిరోజుల పాటు కురిసిన కుండపోత వర్షాల వల్ల నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ ఏమాత్రం అనుకూలంగా లేదు.ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ లేదుదీంతో ఆటగాళ్లు మైదానంలో దిగే అవకాశమే లేకపోవడంతో పలుమార్లు స్టేడియాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా చేసేదేమి లేక తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేకపోవడంతో మైదానం తడారిపోయేందుకు ఎండకాయాల్సిందే! కాబట్టి.. దీని కారణంగా మ్యాచ్పై ఎన్నిరోజులు ప్రభావం పడుతుందో స్పష్టంగా చెప్పడం కష్టం.చెత్తగా ఉంది.. ఇంకోసారి ఇక్కడకు రాబోముఈ నేపథ్యంలో అఫ్గన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ‘‘ఇక్కడి పరిస్థితి చెత్తగా ఉంది. ఇంకోసారి ఇక్కడకు రాకూడదని నిశ్చయించుకున్నాం. ఇక్కడ కనీస వసతులు లేవు. మా ఆటగాళ్లు కూడా నిరాశకు లోనయ్యారు. నిజానికి.. గతంలో మేము ఇక్కడకు వచ్చినపుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది.మాకు సొంతగడ్డ లాంటిదిఅందుకే ముందుగానే సంబంధిత అధికారులతో మాట్లాడాము. మాకు ఎలాంటి ఇబ్బంది కలగబోదని స్టేడియం వాళ్లు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ఏమాత్రం అభివృద్ధి చెందలేదు’’ అని అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది బీసీసీఐ, ఏసీబీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తమకు సొంతగడ్డ లాంటిదని.. ఇక్కడ తాము ఆడబోయే మ్యాచ్కు మంచి వేదికను ఏర్పాటు చేయాలని కోరాడు. అయితే, పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటంతో అతడు కూడా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. కాగా 2017లో టెస్టు హోదా పొందిన అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి.. ఆరింట ఓడిపోయింది. ఇక న్యూజిలాండ్తో అఫ్గన్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే! చదవండి: ముషీర్ ఖాన్కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
కివీస్తో టెస్టుకు అఫ్గన్ జట్టు ప్రకటన.. రషీద్ లేకుండానే!
న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. హష్మతుల్లా షాహిద్ కెప్టెన్సీలోని ఈ టీమ్లో మొత్తంగా పదహారు మంది సభ్యులకు చోటిచ్చిన్నట్లు తెలిపింది. ఇందులో ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లు రియాజ్ హసన్, షామ్స్ ఉర్ రహమాన్, ఖలీల్ అహ్మద్లను తొలిసారి జట్టుకు ఎంపికచేసినట్లు పేర్కొంది. నోయిడా వేదికగా.. రషీద్ ఖాన్ లేకుండానేఅయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మాత్రం ఈ మ్యాచ్కు దూరం కానున్నాడు.కాగా భారత్ వేదికగా అఫ్గనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య సెప్టెంబరు 8 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే కివీస్ ఆటగాళ్లు భారత్కు చేరుకున్నారు. అఫ్గన్తో జరుగనున్న మొట్టమొదటి టెస్టులో విజయమే లక్ష్యంగా సన్నాహకాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో అఫ్గన్ బోర్డు సైతం ఆచితూచి జట్టును ఎంపిక చేసుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ తొలి టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ను ఢీకొట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. ఈ మ్యాచ్లో ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, వంటి టాప్ బ్యాటర్లతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు అఫ్గన్కు కీలకం కానున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్కు నో ప్లేస్అదే విధంగా ఓపెనింగ్ బ్యాటర్లు అబ్దుల్ మాలిక్, బహీర్ షా, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇక్రం అలిఖిల్, అఫ్సర్ జజాయ్లతో బ్యాటింగ్ విభాగం సిద్ధమైంది. ఇక అజ్మతుల్లాతో పాటు ఆల్రౌండర్ల విభాగంలో షాహిదుల్లా కమల్, షామ్స్ ఉర్ రహమాన్ చోటు దక్కించుకున్నారు. ఇక రషీద్ ఖాన్ గైర్హాజరీలో కైస్ అహ్మద్, జియా ఉర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, జాహీర్ ఖాన్ స్పిన్దళంలో చోటు దక్కించుకోగా.. ఫాస్ట్ బౌలర్లలో నిజత్ మసూద్ ఒక్కడికే ఈ జట్టులో స్థానం దక్కింది. అయితే, రహ్మనుల్లా గుర్బాజ్కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడి కేవలం మూడింట గెలిచింది.న్యూజిలాండ్తో గ్రేటర్ నోయిడాలో ఏకైక టెస్టుకు అఫ్గన్ జట్టుహష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, అబ్దుల్ మాలిక్, రియాజ్ హసన్, అఫ్సర్ జజాయ్, ఇక్రం అలిఖిల్, బహీర్ షా మహబూబ్, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షామ్స్ ఉర్ రహమాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, జహీర్ ఖాన్ పక్తీన్, కైస్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నిజత్ మసూద్. -
PAKvBAN: క్లీన్స్వీప్ దిశగా బంగ్లాదేశ్
రావల్పిండి: పాకిస్తాన్ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), షాద్మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు. దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. -
పాకిస్తాన్ కు ఘోర అవమానం.. రెచ్చిపోయిన బంగ్లాదేశ్
-
ఏకైక టెస్టు.. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
భారత మహిళల ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటను ఓటమితో ముగించింది. గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్లో 45 పరుగుల తేడాతో ఆసీస్తో చేతిలో భారత్ ఓటమి పాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 243 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాటర్లలో ఉమన్ ఛెత్రి 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ప్రియా పునియా(36), శుభా సతీష్(45) పరుగులతో తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫ్లింటాఫ్, నాట్ తలా మూడు వికెట్టు పడగొట్టారు. అంతకుముందు ఆ్రస్టేలియా ‘ఎ’ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 92 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాడీ డార్క్ (197 బంతుల్లో 105 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. డి బ్రోగే(58) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో మిన్నుమణి 6 వికెట్లు తీయగా, సయాలీ, ప్రియా మిశ్రా చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 28 పరుగులు కలుపుకొని భారత్ ముందు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలమైంది. -
NZ vs SL: అంతర్జాతీయ క్రికెట్లో 6 రోజుల టెస్టు మ్యాచ్..
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్లో, అనాధకరిక టెస్టు మ్యాచ్లు నాలుగు రోజులు పాటు కూడా జరగుతాయి. కానీ గతంలో ఆరు రోజుల టెస్టు మ్యాచ్లు కూడా జరిగేవి ఉన్న విషయం మీకు తెలుసా?1980లు, 90ల్లో 6 రోజుల టెస్టు మ్యాచ్ బాగా పాపులర్. ఇంగ్లండ్లో అనేక మ్యాచ్లు ఆరు రోజుల పాటు జరిగాయి. చివరగా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఇదింతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.16 ఏళ్ల తర్వాత తొలిసారి..?అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల తర్వాత తొలిసారి ఆరు రోజుల మ్యాచ్ జరగనుంది. ఈ అరుదైన ఘట్టానికి సెప్టెంబర్ 18 నుంచి శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కానున్న తొలి టెస్టు వేదిక కానుంది. వచ్చె నెలలలో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు శ్రీలంకకు రానుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరు రోజుల పాటు జరగనుంది. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా సెప్టెంబర్ 21 న మ్యాచ్ జరగడం లేదు. ఆ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. తొలి రెండు రోజుల తర్వాత ఒక్క రోజు(సెప్టెంబర్ 21 )ను రెస్ట్ డేగా ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ 22, 23, 24 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. అయితే రెండో టెస్టు మాత్రం యధావిధిగా 5 రోజుల పాటే జరగనుంది. కాగా ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.అప్పుడు బంగ్లాలో.. ఇప్పుడు శ్రీలంకలోశ్రీలంక చివరగా ఆరు రోజుల టెస్టు మ్యాచ్ 2008లో ఆడింది. ఆ ఏడాది శ్రీలంక క్రికెట్ జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే ఈ సిరీస్లో తొలి టెస్టు మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగింది. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఆరు రోజుల పాటు టెస్టును షెడ్యూల్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 31 వరకు ఆ టెస్టు మ్యాచ్ కొనసాగింది. మళ్లీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్.. ఒకే మ్యాచ్లో 10 వికెట్లు
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళ స్పిన్నర్ స్నేహ రాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది.. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు చుక్కలు చూపించిన రానా.. రెండో ఇన్నింగ్స్లో కూడా రెండు కీలక వికెట్లతో సత్తాచాటింది.ఈ మ్యాచ్లో ఓవరాల్గా రానా 10 వికెట్లు పడగొట్టి సఫారీలను కట్టడి చేసింది. ఈ క్రమంలో స్నేహ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టెస్టు క్రికెట్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా స్నేహ రాణా రికార్డులకెక్కింది. ఈ జాబితాలో స్నేహ రాణా కంటే ముందు భారత మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జులాన్ 10 వికెట్లు సాధించింది. అయితే ఈ ఫీట్ సాధించిన తొలి భారత మహిళా స్పిన్నర్ స్నేహనే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది.ఈ క్రమంలోనే ఫాలో ఆన్ ఆడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌలైంది. దీంతో భారత్ ముందు కేవలం 37 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే దక్షిణాఫ్రికా ఉంచింది. అంతకముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. Edged and taken!Shubha Satheesh takes a sharp low catch at first-slip 👌👌South Africa lose their 8th wicket.Follow the match ▶️ https://t.co/4EU1Kp6YTG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/LDYR5uCeme— BCCI Women (@BCCIWomen) July 1, 2024 -
భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు అదే జట్టుతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం సిద్దమవుతోంది. భారత్-దక్షిణాఫ్రికా మహిళల మధ్య ఏకైక టెస్టుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఈ చారిత్రత్మక టెస్టు మ్యాచ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ను వీక్షించేందుకు ఫ్యాన్స్కు ఉచితంగా ఎంట్రీ ఇవ్వాలని టీఎన్సీఏ నిర్ణయించింది. ఈ మెరకు టీఎన్సీఏ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళా క్రికెట్ ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎన్సీఏ తెలిపింది. అదే విధంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు టీ20ల సిరీస్ కూడా ఇదే వేదికలో జరగనుంది. ఈ సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.ఈ సిరీస్కు సంబంధించిన టిక్కెట్లను కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. గరిష్ట ధర రూ.150గా నిర్ణయించింది. కాగా టీ20 సిరీస్కు కూడా C, D ,E దిగువ స్టాండ్లకు అభిమానులను ఫ్రీగా ఎంట్రీ ఇవ్వనున్నారు.దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టుకు భారత జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ (ఫిట్నెస్కు లోబడి), రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్ (ఫిట్నెస్కు లోబడి), అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియా, షబ్నమ్ షకీల్. -
చరిత్ర సృష్టించిన ఆసీస్ వికెట్ కీపర్.. పంత్ రికార్డు బద్దలు
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ కీలక పాత్ర పోషించాడు. 98 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. నాలుగో రోజు ఆటలో ఆసీస్ విజయానికి 202 పరుగులు అవసరమైన దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన క్యారీ కివీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తృటిలో సెంచరీతో చేసే అవకాశాన్ని క్యారీ కోల్పోయాడు. ఇక ఈమ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన క్యారీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్లో విజయవంతమైన ఛేజింగ్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో వికెట్ కీపర్గా క్యారీ(98*) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2021లో బ్రిస్బేన్ వేదికగా ఆసీస్తో జరిగిన ఓ టెస్టులో పంత్ నాలుగో ఇన్నింగ్స్లో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1999లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నాలుగో ఇన్నింగ్స్లో గిల్ క్రిస్ట్ 149 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. -
ఇవాళ 4వ రోజు జరగనున్న భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
-
విశాఖ టెస్టులో భారీస్కోర్ దిశగా భారత్
-
కాసేపట్లో ప్రారంభంకానున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు
-
భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
-
భారత్ కొంపముంచిన బజ్ బాల్...!
-
పోప్ సెంచరీ తాలింపు...
తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైనప్పుడు భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ్ ఆలౌట్ అయ్యే సమయానికి ఆ ఆధిక్యం 190 పరుగులకు చేరింది. ముందుగా ఈ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ శనివారం ఆట ముగిసేసరికి 126 పరుగులు ముందంజలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాటర్ల పోరాటం జట్టును ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒలీ పోప్ అద్భుత బ్యాటింగ్తో చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్కు ముందు భారత గడ్డపై 9 ఇన్నింగ్స్లలో కలిపి 154 పరుగులే చేసిన పోప్ ఈ ఇన్నింగ్స్లోనే దాదాపు అన్నే పరుగులు సాధించడం విశేషం. అతని స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు భారత స్పిన్నర్ల వద్ద జవాబు లేకపోయింది. ఆధిక్యం మరీ ఎక్కువ కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా టీమిండియా చేతుల్లోనే ఉంది. అయితే మారిపోతున్న పిచ్పై నాలుగో ఇన్నింగ్స్ సవాల్ను రోహిత్ బృందం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఓటమి ఖాయమనిపించే స్థితి నుంచి కోలుకొని ఇంకా పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఒలీ పోప్ (208 బంతుల్లో 148 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగులు ముందంజలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 421/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 121 ఓవర్లలో 436 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (180 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. మరో 15 పరుగులు జోడించి... మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 11 ఓవర్లు సరిపోయాయి. ఒకేస్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది. రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రా (0)లను అవుట్ చేయగా... తర్వాతి ఓవర్లో అక్షర్ పటేల్ (100 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్)ను రేహన్ బౌల్డ్ చేశాడు. రాణించిన డకెట్... తొలి ఇన్నింగ్స్లాగే రెండో ఇన్నింగ్స్లోనూ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. క్రాలీ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ కలిసి చకచకా పరుగులు జోడించారు. అశ్విన్ చక్కటి బంతితో క్రాలీని అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీసినా... డకెట్, పోప్ జోరుగా ఆడటంతో తొలి సెషన్ ముగిసేసరికి జట్టు 6 రన్రేట్తో 15 ఓవర్లలోనే 89 పరుగులు చేసింది. అయితే లంచ్ తర్వాత భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బుమ్రా బౌలింగ్లో డకెట్ ఎల్బీ అయ్యే అవకాశం ఉన్నా... భారత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతను బతికిపోయాడు. రీప్లేలో బంతి స్టంప్స్ను తాకేదని తేలడంతో బుమ్రా తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే తన తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో డకెట్ను బౌల్డ్ చేసిన భారత పేసర్ భావోద్వేగం ప్రదర్శించాడు. జట్టు టాప్ బ్యాటర్ రూట్ (6 బంతుల్లో 2)ను కూడా తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా అవుట్ చేశాడు. జడేజా బంతిని ఆడకుండా వదిలేసి బెయిర్స్టో (24 బంతుల్లో 10; 1 ఫోర్) బౌల్డ్ కాగా... బెన్ స్టోక్స్ (33 బంతుల్లో 6)కు వరుసగా మూడు ఓవర్లు మెయిడిన్ వేసి ఒత్తిడి పెంచిన అశ్విన్ అదే జోరులో చక్కటి బంతితో అతని ఆట కట్టించాడు. మరోవైపు పోప్ మాత్రం చక్కటి షాట్లతో పరుగులు రాబడుతూ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ భాగస్వామ్యం... స్టోక్స్ ఐదో వికెట్గా వెనుదిరిగినప్పుడు ఇంగ్లండ్ స్కోరు 163/5. ఆ జట్టు మరో 27 పరుగులు వెనుకబడి ఉంది. ఈ దశలో భారత్ మిగిలిన వికెట్లను టపటపా పడగొట్టి మ్యాచ్ను ముగిస్తుందని అనిపించింది. అయితే మరో 30 ఓవర్ల పాటు పోప్, బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34; 2 ఫోర్లు) కలిసి భారత బౌలర్లను ఆడుకున్నారు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఆరంభంలో కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న తర్వాత ధాటిగా ఆడారు. భారత బౌలర్లలోనూ ఎవరూ వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. దాంతో ముందుగా తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకున్న ఇంగ్లండ్... ఆ తర్వాత ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఈ క్రమంలో పోప్ 154 బంతుల్లో తన కెరీర్లో ఐదో టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్కు పోప్తో 112 పరుగులు జత చేసిన ఫోక్స్ను అక్షర్ బౌల్డ్ చేయడంతో భారత్కు ఎట్టకేలకు ఊరట లభించింది. అయితే రేహన్ (31 బంతుల్లో 16 బ్యాటింగ్; 2 ఫోర్లు) కలిసి పోప్ మరో వికెట్ పడకుండా మూడో రోజును జాగ్రత్తగా ముగించాడు. చివరి సెషన్లో ఇంగ్లండ్ 35 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 144 పరుగులు సాధించింది. 110 పరుగుల వద్ద పోప్ ఇచ్చిన క్యాచ్ను అక్షర్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) రోహిత్ (బి) అశ్విన్ 31; డకెట్ (బి) బుమ్రా 47; పోప్ (బ్యాటింగ్) 148; రూట్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; బెయిర్స్టో (బి) జడేజా 10; స్టోక్స్ (బి) అశ్విన్ 6; ఫోక్స్ (బి) అక్షర్ 34; రేహన్ (బ్యాటింగ్) 16; ఎక్స్ట్రాలు 22; మొత్తం (77 ఓవర్లలో 6 వికెట్లకు) 316. వికెట్ల పతనం: 1–45, 2–113, 3–117, 4–140, 5–163, 6–275. బౌలింగ్: బుమ్రా 12–3–29–2, అశ్విన్ 21–3–93–2, అక్షర్ 15–2–69–1, జడేజా 26–1–101–1, సిరాజ్ 3–0–8–0. -
తొలి ఇన్నింగ్స్ లో 436 రన్స్ కు భారత్ ఆలౌట్
-
ఆసక్తికరంగా ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్
-
తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం
న్యూఢిల్లీ: తెలుగు క్రికెట్ అభిమానులకు ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్తే! భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్, విశాఖపట్నంలలో ఇంగ్లండ్ జట్టుతో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్లకు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే ఈ టాపార్డర్ బ్యాటర్ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. భారత పర్యటన కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆదివారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ టూర్లో బెన్ స్టోక్స్ బృందం ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. ఈ నెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టును, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టును ఆడుతుంది. సీనియర్ స్టార్లంతా ఉంటారని తెలుగు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా కోహ్లి ఈ రెండు మ్యాచ్లకు గైర్హాజరు కానున్నాడు. ‘కోహ్లి కోరిక మేరకే ఆడటం లేదు. ఈ మేరకు బోర్డుతో ముందుగానే అనుమతి తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో ఈ విషయమై మాట్లాడాడు. టీమ్ మేనేజ్మెంట్తోనూ కోహ్లి చర్చించాడు. అతను లేకపోవడం జట్టుకు ఇబ్బందికరమే అయితే వ్యక్తిగత కారణాల వల్లే దూరమవుతున్నాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అతని నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని, అతనికి మద్దతుగా నిలుస్తుందని జై షా చెప్పారు. అఫ్గానిస్తాన్తో ఇటీవల జరిగిన టి20 సిరీస్లోనూ కోహ్లి తొలి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత్ అంతర్గత జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకొని లండన్ వెళ్లొచ్చాడు. టెస్టులకు సంబంధించి 2021లో విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడి తర్వాతి మూడు టెస్టులకు గైర్హాజరయ్యాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రసవం కోసం అతనుస్వదేశానికి వచ్చాడు. తాజా ఇంగ్లండ్ సిరీస్ కోసం కోహ్లి స్థానాన్ని రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
INDA Vs ENGA: శతక్కొట్టిన పాటిదార్.. పాపం సర్ఫరాజ్!
India A vs England Lions, 2-day Practice Match: ఇంగ్లండ్ లయన్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్ రజత్ పాటిదార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లయన్స్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ శతక్కొట్టాడు. మొత్తంగా 141 బంతులు ఎదుర్కొన్న ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్... 18 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 111 పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ సెంచరీ మిస్ పాటిదార్కు తోడు సర్ఫరాజ్ ఖాన్ కూడా రాణించాడు. అయితే, సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి 96 పరుగుల వద్దే నిలిచిపోయాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ(లయన్స్) జట్లు అనధికారిక టెస్టు ఆడనున్నాయి. 223 ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా అహ్మదబాద్ వేదికగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాయి. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో... భారత బౌలర్లు మెరుగ్గా రాణించి 233 పరుగులకే ఇంగ్లండ్ను ఆలౌట్ చేశారు. మానవ్ సుతార్ మూడు, ఆకాశ్ దీప్ రెండు- తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, పులకిత్ నారంగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 32 పరుగులు చేయగా.. రజత్ సెంచరీ(111) సాధించాడు. భరత్, ధ్రువ్ ఫిఫ్టీలు మిగిలిన వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ (96), శ్రీకర్ భరత్(64), ధ్రువ్ జురెల్ (50) అర్ధ శతకాలతో దుమ్ములేపారు. దీంతో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 91ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్-ఏ జట్టు 462 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. ఇక భారత్-ఏ- ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య జనవరి 17 నుంచి నాలుగు రోజుల అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. సర్ఫరాజ్ను ఇకనైనా టీమిండియాలోకి? మరోవైపు.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 5 నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించి రెండు మ్యాచ్ల కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, మిగిలిన మ్యాచ్లకు జట్టును ఎంపిక చేసేటపుడైనా సర్ఫరాజ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ, భారత్- ఏ జట్ల తరఫున ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా అతడిని పక్కనపెట్టడం సరికాదని సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. చదవండి: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
2 నుంచి విశాఖలో భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. ఈ వివరాలను కమిటీ చైర్మన్, కలెక్టర్ ఎ.మల్లికార్జున మీడియాకు వెల్లడించారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, ఆహారం కోసం స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అభిమానుల కోసం రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి మాట్లాడుతూ.. టెస్ట్ మ్యాచ్ టికెట్లను ఈనెల 15 నుంచి పేటీఎం యాప్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందించనున్నట్లు తెలిపారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా నిర్ణయించామన్నారు. వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
తిలక్ వర్మ కెప్టెన్సీ అదుర్స్.. టెస్టుల్లో అరంగేట్రానికి ‘సై’!
Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు. తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు. తిలక్ వర్మ అజేయ సెంచరీ తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది. చిత్తుగా ఓడిన నాగాలాండ్ అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది. ఇక నాగాలాండ్తో మ్యాచ్లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు. కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్ గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాహుల్ గుర్తింపు పొందాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
పాకిస్తాన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ క్రికెట్లోనే తొలి జట్టుగా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లాబుషేన్ 63 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ ఏకంగా ఎక్స్ట్రాస్ రూపంలో ఏకంగా 52 అదనపు పరుగులను సమర్పించుకుంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును పాకిస్తాన్ తమ పేరిట లిఖించుకుంది. చారిత్రత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక ఎక్స్ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. పాకిస్తాన్ సమర్పించుకున్న ఎక్స్ట్రాస్లో 15 వైడ్లు, 20 బైలు ఉన్నాయి. చదవండి: IND vs SA: 'అతడు అన్ఫిట్.. కెప్టెన్గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు' -
ఆసీస్ పోరాడినా... భారత్ చేతుల్లోనే..!
ముంబై: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్కు స్వల్ప ఆధిక్యం లభించినా...టెస్టు ఇంకా భారత్ చేతుల్లోనే ఉంది. చివరి రోజు ఆసీస్ను తొందరగా ఆలౌట్ చేయగలిగితే స్వల్ప ల„ ్యాన్ని భారత్ ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ కాస్త మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...శనివారం ఆట చివర్లో భారత్కు మళ్లీ పట్టు చిక్కింది. ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. తహీలా మెక్గ్రాత్ (177 బంతుల్లో 73; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (91 బంతుల్లో 45; 5 ఫోర్లు), బెత్ మూనీ (33), కెప్టెన్అలీసా హీలీ (32) కీలక పరుగులు జోడించారు. భారత బౌలర్లలో హర్మన్ప్రీత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఆసీస్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 376/7తో ఆట కొనసాగించిన భారత్ మరో 30 పరుగులు జోడించి తమ తొలి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (78)ను గార్త్ బౌల్డ్ చేయగా...పూజ వస్త్రకర్ (47), రేణుకా సింగ్ (8)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. దాంతో భారత్కు 187 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కీలక భాగస్వామ్యాలు... రెండో ఇన్నింగ్స్లో ఆ్రస్టేలియాకు మెరుగైన ఆరంభం లభించింది. మూనీ, లిచ్ఫీల్డ్ (18) తొలి వికెట్కు 49 పరుగులు జోడించారు. అయితే మూనీ స్వయంకృతంతో రనౌట్ కావడంతో భారత్కు తొలి వికెట్ దక్కింది. రాణా బౌలింగ్లో మూనీ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడగా చురుగ్గా ఉన్న సిల్లీ పాయింట్ ఫీల్డర్ రిచా వెంటనే బంతికి వికెట్లపైకి విసిరింది. సరైన సమయంలో వెనక్కి వెళ్లలేక మూనీ వెనుదిరిగింది. లిచ్ఫీల్డ్నూ రాణానే అవుట్ చేశాక మెక్గ్రాత్, పెరీ కలిసి జట్టును ఆదుకున్నారు. భారత స్పిన్నర్లను వీరు సమర్థంగా ఎదుర్కొన్నారు. 15 పరుగుల వద్ద మెక్గ్రాత్ ఇచ్చిన క్యాచ్ను రాణా వదిలేయడం ఆసీస్కు కలిసొచ్చింది. మెక్గ్రాత్, పెరీ మూడో వికెట్కు 84 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత హీలీతో కలిసి మెక్గ్రాత్ ఇన్నింగ్స్ను నడిపించింది. 119 బంతుల్లో ఈ మ్యాచ్లో రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మెక్గ్రాత్...రేణుక ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో ఆసీస్ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆసీస్ బ్యాటర్లు పాతుకుపోగా, వరుసగా 28.2 ఓవర్ల పాటు భారత్ వికెట్ తీయడంలో విఫలమైంది. ఈ దశలో కెపె్టన్ హర్మన్ తానే స్వయంగా బౌలింగ్కు దిగింది. తొలి ఓవర్లోనే చక్కటి బంతితో మెక్గ్రాత్ను బౌల్డ్ చేసి 66 పరుగుల పార్ట్నర్షిప్కు తెర దించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే హీలీని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని హర్మన్ మ్యాచ్ను మళ్లీ భారత్ చేతుల్లోకి తెచ్చింది. అంతకు ముందు బంతికే హర్మన్, హీలీ మధ్య ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’కు సంబంధించి తీవ్ర వాదోపవాదన జరిగిన తర్వాత ఈ వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత 62 బంతుల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా సదర్లాండ్ (12 నాటౌట్), గార్డ్నర్ (7 నాటౌట్) ఆటను ముగించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 219; భారత్ తొలి ఇన్నింగ్స్ 406; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: మూనీ (రనౌట్) 33; లిచ్ఫీల్డ్ (బి) రాణా 18; పెరీ (సి) యస్తిక (బి) రాణా 45; తహీలా మెక్గ్రాత్ (బి) హర్మన్ 73; హీలీ (ఎల్బీ) (బి) హర్మన్ 32; సదర్లాండ్ (నాటౌట్) 12; గార్డ్నర్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221. బౌలింగ్: రేణుకా సింగ్ 8–3–22–0, పూజ వస్త్రకర్ 8–0–36–0, స్నేహ్ రాణా 17–3–54–2, దీప్తి శర్మ 19–5–30–0, రాజేశ్వరి 27–10–42–0, జెమీమా 2–0–13–0, హర్మన్ప్రీత్ 9–0–23–2. -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు.. బ్యాట్తో చెలరేగిన దీప్తి, పూజ
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్నర్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు. -
మన మహిళలు అదుర్స్
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించింది. ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల ఏకైక టెస్టులో మన బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు సాధించడంతో తొలి రోజే రికార్డు స్కోరు నమోదైంది. ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే రోజు నమోదైన పరుగుల జాబితాను చూస్తే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (95 బంతుల్లో 60 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా, కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ (81 బంతుల్లో 49; 6 ఫోర్లు) త్రుటిలో ఆ అవకాశం చేజార్చుకుంది. ప్రస్తుతం దీప్తితో పాటు పూజ వస్త్రకర్ (4 బ్యాటింగ్) క్రీజ్లో ఉంది. డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున ముగ్గురు ప్లేయర్లు జెమీమా, రేణుకా సింగ్, శుభ సతీశ్ ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశారు. వీరిలో శుభకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. ఓపెనర్లు షఫాలీ వర్మ (19), స్మృతి మంధాన (17) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా, ఆ తర్వాత భారత బ్యాటర్లు క్రీజ్లో పట్టుదలగా నిలబడ్డారు. కుదురుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించారు. మూడు భారీ భాగస్వా మ్యాలతో జట్టును నడిపించారు. శుభ, రోడ్రిగ్స్ మూడో వికెట్కు 115 పరుగులు... యస్తిక, హర్మన్ ఐదో వికెట్కు 116 పరుగులు జోడించగా... దీప్తి, స్నేహ్ రాణా (73 బంతుల్లో 30; 5 ఫోర్లు) ఏడో వికెట్కు 92 పరుగులు జత చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) బెల్ 17; షఫాలీ (బి) క్రాస్ 19; శుభ (సి) సివర్ (బి) ఎకెల్స్టోన్ 69; జెమీమా (బి) బెల్ 68; హర్మన్ప్రీత్ (రనౌట్) 49; యస్తిక (సి) బెల్ (బి) డీన్ 66; దీప్తి (బ్యాటింగ్) 60; స్నేహ్ రాణా (బి) సివర్ 30; పూజ (బ్యాటింగ్) 4; ఎక్స్ట్రాలు 28; మొత్తం (94 ఓవర్లలో 7 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–25, 2–47, 3–162, 4–190, 5–306, 6–313, 7–405. బౌలింగ్: కేట్ క్రాస్ 14–0–64–1, లారెన్ బెల్ 15–1–64–2, నాట్ సివర్ 11–4–25–1, లారెన్ 15–1–84–0, చార్లీ డీన్ 17–1–62–1, సోఫీ ఎకెల్స్టోన్ 22–4–85–1. 2 మహిళల టెస్టు క్రికెట్లో ఒకేరోజు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో భారత జట్టు రెండో స్థానం (410)లో నిలిచింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ ఒకే రోజు 431 పరుగులు సాధించింది. సొంతగడ్డపై భారత్కు ఇదే అత్యధిక స్కోరు కూడా. -
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్
-
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్గా
ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
టీమిండియాపై గెలిచి రెండు దశాబ్దాలు దాటిపోయింది.. ఇప్పుడు అస్సలు కాదు..!
ఒకప్పటి మేటి జట్టు వెస్టిండీస్.. టెస్ట్ల్లో టీమిండియాపై విజయం సాధించి రెండు దశాబ్దాలు దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. విండీస్ జట్టు చివరిసారిగా 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియాపై గెలుపొందింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలుగా విండీస్కు టీమిండియాపై గెలుపే లేదు. విండీస్తో రేపటి నుంచి (జులై 12) తొలి టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మరి 21 సంవత్సరాల తర్వాతైనా విండీస్.. టీమిండియాపై గెలుస్తుందా అంటే..? అసంభవమనే చెప్పాలి. ప్రస్తుత భారత జట్టుకు విండీస్ కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్్కప్ క్వాలిఫయర్స్లో ఆ జట్టు దయనీయ పరిస్థితిని అందరం చూశాం. అయితే ముఖాముఖి రికార్డుల్లో మాత్రం భారత్పై విండీస్దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 98 మ్యాచ్ల్లో.. విండీస్ 30 గెలిస్తే, భారత్ 22 మ్యాచ్ల్లో మాత్రమే విజయాలు సాధించింది. 46 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. జట్ల వివరాలు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయ్దేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైని, ముఖేశ్ కుమార్. వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, త్యాగ్నారాయణ్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జోష్వా ద సిల్వా, షనోన్ గాబ్రియల్, జేసన్ హోల్డర్, అల్జారి జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికన్ రిజర్వ్ ఆటగాళ్లు: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ -
చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడం మ్యాచ్ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు వీరోచిత పోరాటం ఆసీస్ను గెలుపు దిశగా నడిపించింది. బజ్బాల్ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం. ► ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం ► ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్ను, 1984లో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ 342 పరుగుల టార్గెట్ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్ 322 పరుగుల టార్గెట్ను, 2008లో ఎడ్జ్బాస్టన్ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్ను చేధించాయి. ► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇంతకముందు బాబ్ సింప్సన్ నాలుగుసార్లు, జార్జ్ గిఫెన్ రెండుసార్లు, వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్, రిచీ బెర్నాడ్, అలెన్ బోర్డర్, పాట్ కమిన్స్ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు. ► టెస్టుల్లో చేజింగ్ సందర్భాల్లో తొమ్మిదో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్ కమిన్స్-నాథన్ లియోన్ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్తో టెస్టులో తొమ్మిదో వికెట్కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్టౌన్, 1999 ఉన్నారు. ► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్ కమిన్స్ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో కమిన్స్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్ 2005లో న్యూజిలాండ్పై ఐదు సిక్సర్లు, ఇయాన్ చాపెల్ 1972లో పాకిస్తాన్పై నాలుగు సిక్సర్లు కొట్టాడు. ► యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్ను అడిలైడ్ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్ను మెల్బోర్న్ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్బాస్టన్లో(2023లో) 281 పరుగుల టార్గెట్ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్ను చేధించింది. ► యాషెస్ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్ మూడు సందర్భాల్లో ఒక వికెట్ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: బజ్బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
బజ్బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్బాల్ క్రికెట్తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్లను మట్టికరిపించి సిరీస్ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్బాస్టన్లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్బాల్ క్రికెట్ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
#Ashes2023: ఇంగ్లండ్కు ఏడు వికెట్లు.. ఆసీస్కు 174 పరుగులు
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ తొలి టెస్టు హోరాహోరీగా సాగుతున్నది. టెస్టుల్లో కొత్త సంప్రదాయానికి తెరతీసిన ‘బజ్బాల్’ శైలితో ఇంగ్లండ్ దూకుడు కనబరుస్తుంటే..ఆసీస్ అంతే దీటుగా సై అంటున్నది. దీంతో ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదల కనబరుస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జరుగుతున్నది టెస్టు మ్యాచ్ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ను తలపిస్తూ ఇరు జట్ల బ్యాటర్లు తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిర్దేశిత లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు మెరుగైన శుభారంభమే దక్కింది. ఫామ్లేమితో సతమతమవుతున్న వార్నర్(36) ఫర్వాలేదనపించగా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ(34 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలింగ్ను కాచుకుంటూ వీరిద్దరు లక్ష్యఛేదనను ప్రారంభించారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వార్నర్ను రాబిన్సన్ ఔట్ చేయడం ద్వారా ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాడు. వార్నర్ వెనుదిరుగడంతో తొలి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్(13) మరోమారు నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో జట్టును గట్టెక్కించే లబుషేన్(13) బ్రాడ్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా నిష్క్రమించాడు. జట్టును ఆదుకుంటాడనుకున్న స్టీవ్ స్మిత్ (6)..బ్రాడ్కు వికెట్ సమర్పించుకున్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. ఇంగ్లండ్ 273 ఆలౌట్: ఓవర్నైట్ స్కోరు 28/2 నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమదైన రీతిలో దూకుడు మంత్రాన్ని పటించింది. బ్యాటర్లు ఆది నుంచే బాదుడు మొదలుపెట్టారు. ముఖ్యంగా జో రూట్(46), హ్యారీ బ్రూక్(46), కెప్టెన్ బెన్ స్టోక్స్(43) కీలక పరుగులు జత చేశారు. ఆసీస్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ వైవిధ్యమైన షాట్లతో స్కోరు బోర్డుకు పరుగులు జతచేశారు. ఇన్ఫామ్ బ్యాటర్ రూట్..ర్యాంప్ షాట్లతో టి20 ఫార్మాట్ బ్యాటింగ్ను తలపించాడు. అయితే మరో ఎండ్లో కమిన్స్(4/63), లియాన్(4/80) బౌలింగ్తో ఇంగ్లండ్ను ఇబ్బందులకు గురిచేశారు. వీరిద్దరు ఇంగ్లండ్ భారీ స్కోరు ఆశలకు గండికొట్టారు. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 103/3 -
546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం
బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్లు చెరొక వికెట్ పడగొట్టారు. ఇక టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకముందు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్ హక్ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్) మార్క్ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అఫ్గానిస్తాన్: తొలి ఇన్నింగ్స్ : 146 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 115 ఆలౌట్ బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్: 382 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 425/4 డిక్లేర్ ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం Walton Test Match: Bangladesh vs Afghanistan | Only Test | Day 04 Bangladesh won by 546 runs. Full Match Details: https://t.co/MDvtIwN35K#BCB | #Cricket | #BANvAFG pic.twitter.com/sk24j4tteZ — Bangladesh Cricket (@BCBtigers) June 17, 2023 చదవండి: 'వరల్డ్కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? -
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
ఆడటమే కాదు, ఏకంగా తొలి మ్యాచ్లోనే 5 వికెట్ల ఘనత
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ ఓ ఆసక్తికర పరిణామం ద్వారా వార్తల్లో నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని ఓ వ్యక్తి 14 ఏళ్ల కిందట 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) పందెం కాసి గెలవడంతో ఈ వార్సెస్టర్షైర్ బౌలర్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా నిలిచాడు. టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో జాక్పాట్ కొట్టిన పందెం కాసిన వ్యక్తి, ప్రస్తుతం రెట్టింపు సంతోషానికి లోనవుతున్నాడు. టంగ్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించడం సదరు వ్యక్తి అదనపు సంతోషానికి కారణం. టంగ్ ఇంగ్లండ్ తరఫున తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు సాధించడంతో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబైపోతున్నాడు. అందులోనూ టంగ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈ ఫీట్ సాధించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా, ఐర్లాండ్తో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో టంగ్ ఐదేయడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 11 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండానే ఛేదించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
ENG VS IRE One Off Test: చేతులెత్తేస్తుందనుకుంటే చుక్కలు చూపిస్తుంది..!
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో పసికూన ఐర్లాండ్ ప్రతిఘటిస్తుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. తొలుత హ్యారీ టెక్టార్ (51), లోర్కాన్ టక్కర్ (44) నిలకడగా ఆడి ఇంగ్లీష్ బౌలర్లకు విసుగు తెప్పిస్తే.. ఆతర్వాత ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన ఆండీ మెక్బ్రైన్ (71 నాటౌట్), తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్కు దిగిన మార్క్ అదైర్ (88 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లను డిఫెన్స్లోకి నెట్టేస్తున్నారు. వీరిద్దరు ప్రతిఘటిస్తుండటంతో ఐర్లాండ్ 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. 352 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కేవలం 27 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను అధిగమించి వారికి కొద్దో గొప్పో టార్గెట్ సెట్ చేసినా అది కచ్చితంగా ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతలను ఎత్తి చూపినట్లవుతుంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 93 ఏళ్ల కిందటి బ్రాడ్మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్ -
టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..?
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టుబిగించింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విధ్వంసం సృష్టించగా.. జాక్ క్రాలే (56), జో రూట్ అర్ధసెంచరీలతో రాణించారు. అంతకుముందు వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైంది. టెస్ట్ మ్యాచా లేక వన్డేనా.. ఏమా కొట్టుడు..? ఇటీవల కాలంలో టెస్ట్ల్లో బజ్బాల్ అప్రోచ్ అంటూ ఆటలో వేగం పెంచిన ఇంగ్లీష్ క్రికెటర్లు, ఐర్లాండ్తో ఏకైక టెస్ట్లోనూ అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు. వీరు ఎంత వేగంగా ఆడారంటే.. ఈ మ్యాచ్ను చూసిన ఫాలోవర్స్కు ఇది టెస్ట్ మ్యాచా లేక వన్డేనా అన్న డౌట్ వచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా 6కు పైగా రన్ రేట్ మెయింటైన్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ స్కోర్లు సాధించడంతో పాటు వేగంగా పరుగులు రాబట్టారు. వీరి వేగం చూస్తుంటే రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తుంది. రెండో రోజు మరో 25 ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐర్లాండ్ను సెకెండ్ ఇన్నింగ్స్లో ఆలౌట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. టెస్ట్ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీ.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఓలీ పోప్ టెస్ట్ల్లో ఏడో వేగవంతమైన డబుల్ సెంచరీని, ఇంగ్లండ్ తరఫున రెండో వేగవంతమైన ద్విశతకాన్ని బాదాడు. సిక్సర్తో డబుల్ హండ్రెడ్ను పూర్తి చేసిన పోప్.. 207 బంతుల్లో ఈ మార్కును అందున్నాడు. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ డబుల్ హండ్రెడ్ రికార్డు జట్టు సారధి బెన్ స్టోక్స్ (163 బంతుల్లో) పేరిట ఉంది. ఓవరాల్గా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు నాథన్ ఆస్టల్ (153) పేరిట ఉంది. ఆస్టల్ తర్వాత స్టోక్స్, సెహ్వాగ్ (168), సెహ్వాగ్ (182), మెక్కల్లమ్ (186) ఈ రికార్డును సాధించారు. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
ఇంగ్లండ్కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్పాట్ కొట్టేశాడు
ఐర్లాండ్తో ఇవాళ (జూన్ 1) మొదలైన ఏకైక టెస్ట్ ద్వారా 25 ఏళ్ల జాషువ టంగ్ అనే ఇంగ్లండ్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో, అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాక్పాట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. టంగ్ 11 ఏళ్ల వయసులో ఉండగా, టిమ్ పైపర్ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు, టంగ్పై ఓ పందెం కాసాడు. టంగ్ భవిష్యత్తులో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని టిమ్ అప్పట్లో కొంత మొత్తం పందెం కాసాడు. ఇవాళ టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో టిమ్ పందెం గెలిచి, 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) జాక్పాట్ కొట్టేశాడు. టంగ్.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడట. 14 ఏళ్ల తర్వాత టిమ్ జోస్యం నిజమై, టంగ్ ఇంగ్లండ్ 711వ ప్లేయర్గా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. కాగా, ఐర్లాండ్తో టెస్ట్కు తొలుత ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో టంగ్కు చోటుదక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల చేత అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్కు జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. టంగ్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్లలో 162 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51), జాక్ లీచ్ (3/35), మాథ్యూ పాట్స్ (2/36) సత్తా చాటడంతో ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌటైంది. టంగ్కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. చదవండి: WTC Final: ఆసీస్కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
నెట్ ప్రాక్టీస్లో కోహ్లి.. లండన్కు పయనం కానున్న ఆ ఐదుగురు!
WTC Final 2023- Ind Vs Aus: లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో కసరత్తు మొదలుపెట్టారు. స్టార్ బ్యాటర్ కోహ్లి ట్రెయినింగ్ సెషన్లో పాల్గొన్నాడు. లెఫ్టార్మ్ సీమర్ ఉనాద్కట్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, వెటరన్ స్పిన్నర్ అశ్విన్లు కాసేపు ఎక్సర్సైజ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం యశస్వి జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్ చేరుకోగా... మంగళవారం నుంచి వీరిద్దరు ప్రాక్టీస్ మొదలుపెడతారు. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. టీమిండియా- ఆస్ట్రేలియా ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ మెగా మ్యాచ్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల బోర్డులు ఫైనల్కు సంబంధించిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు లండన్కు చేరకుని ప్రాక్టీస్ షురూ చేశారు. ఐదోసారి చాంపియన్గా చెన్నై.. ఆలస్యంగా ఆ ఐదుగురు ఇక ఐపీఎల్-2023 ఫైనల్ ముగించుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (సీఎస్కే), అజింక్య రహానే(సీఎస్కే) సహా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మహ్మద్ షమీ, శుబ్మన్ గిల్, కేఎస్ భరత్ కాస్త ఆలస్యంగా యూకేకు బయల్దేరనున్నారు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. వర్షం ఆటంకం కారణంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరిగిన రిజర్వ్ డే మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలుపొందింది. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆస్ట్రేలియా జట్టు ఇదే భారత జట్టుతో వచ్చే నెల 7 నుంచి 11 వరకు ఓవల్లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు.పక్కటెముకల్లో నొప్పితో ఐపీఎల్ టోర్నీ మధ్యలో నుంచి స్వదేశానికి వెళ్లిపోయిన పేస్ బౌలర్ జోష్ హాజల్వుడ్ (ఆర్సీబీ)కు 15 మందితో కూడిన ఆసీస్ జట్టులో చోటు లభించింది. అయితే ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, బ్యాటర్ రెన్షాలకు స్థానం దక్కలేదు. 32 ఏళ్ల హాజల్వుడ్ 59 టెస్టులు ఆడి 222 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్ చదవండి: చాంపియన్గా చెన్నై.. గిల్ సరికొత్త చరిత్ర! అవార్డులు, ప్రైజ్మనీ పూర్తి వివరాలు ఇవే.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ధోని ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ #TeamIndia members begin their preparations for the #WTC23 at Arundel Castle Cricket Club. pic.twitter.com/2kvGyjWNF7 — BCCI (@BCCI) May 29, 2023 -
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
WTC Final 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఫైనల్ జట్టును ప్రకటించింది. తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన బోర్డు.. తాజాగా ఐసీసీకి సమర్పించిన వివరాల్లో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. కాగా తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న మిచెల్ మార్ష్, మ్యాట్ రెన్షా మాత్రం తాజాగా టీమ్లో చోటు కోల్పోయారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనలకు అనుగుణంగా బోర్డు ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఇక ఐపీఎల్-2023లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ హాజిల్వుడ్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ జట్టులో కొనసాగనున్నారు. వారిద్దరు అవుట్.. వార్నర్కు కోచ్ మద్దతు మార్ష్, రెన్షాలకు మాత్రం నిరాశ తప్పలేదు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అండగా నిలవడంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు, యాషెస్ సిరీస్లోనూ వార్నర్ కీలక పాత్ర పోషించగలడంటూ మెక్డొనాల్డ్ అతడికి మద్దతుగా నిలవడం గమనార్హం. కాగా జూన్ 7-11 వరకు ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే కొంతమంది టీమిండియా ఆటగాళ్లు లండన్కు చేరుకున్నారు. ప్రాక్టీసు కూడా మొదలుపెట్టేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023 ఆస్ట్రేలియా తాజా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. కాగా భారత ప్రధాన జట్టులో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్. చదవండి: WTC Final 2023: రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ Get your friends, form a circle and replicate this fun drill! 😉😀😀🏏#TeamIndia pic.twitter.com/X6iOuXPrhY — BCCI (@BCCI) May 26, 2023 -
రోహిత్ శర్మతో కలిసి లండన్కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్
WTC Final 2021-23 Ind Vs Aus: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ముంబై యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ లండన్కు పయనమయ్యారు. వీరిద్దరు ఆదివారం సాయంత్రం యూకే బయల్దేరారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023 నేపథ్యంలో ఈ ముంబైకర్లు ఇంగ్లండ్ విమానం ఎక్కేశారు. కాగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత జూన్ 7న మొదలుకానున్న ఈ మెగా ఫైట్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లి, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ సహా పలువురు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్కు చేరుకున్నారు. మరోవైపు.. డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపికైన జట్టులో ఉన్న అజింక్య రహానే, శుబ్మన్ గిల్, మహ్మద్ షమీ తదితరులు ఐపీఎల్-2023 ఫైనల్ ముగిసిన తర్వాత బయల్దేరనున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టుకు స్టాండ్బై ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవడంతో.. అతడి స్థానంలో రాజస్తాన్ రాయల్స్ సంచలన ఓపెనర్ యశస్వికి ఛాన్స్ వచ్చింది. ఇంతవరకు టీమిండియా తరఫున అరంగేట్రం చేయని 21 ఏళ్ల యశస్వి మెగా ఫైట్ నేపథ్యంలో సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్ ఈ క్రమంలో రోహిత్ శర్మతో కలిసి లండన్కు బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను యశస్వి జైశ్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు. ‘‘వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం ఇంగ్లండ్కు పయనం. అది కూడా వన్ అండ్ ఓన్లీ రోహిత్ శర్మతో’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇక యశస్వి పోస్టుకు స్పందించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ‘‘చాలా సంతోషంగా ఉంది జస్సూ’’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. రాజస్తాన్ రాయల్స్లో యశస్వి సహచర ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ సైతం యశ్కు గుడ్ లక్ చెప్పాడు. రోహిత్తో యశస్వి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి 14 మ్యాచ్లు ఆడి 625 పరుగులు సాధించాడు. ఓ శతకం నమోదు చేశాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ స్టాండ్ బైగా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా లండన్కు బయల్దేరినట్లు సమాచారం. కాగా ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహా రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తదితరులు గాయాల కారణంగా దూరమైన విషయం తెలిసిందే. చదవండి: IPL 2023 Final: ధోని సేనకు శుభ సూచకం View this post on Instagram A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28) -
‘వివాదాస్పద సాఫ్ట్ సిగ్నల్’ రూల్ రద్దు! ఆ మ్యాచ్ నుంచే అమలు!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా చెప్పాల్సిందే! అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే. మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే! బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు. క్లియర్గా కనిపించినా ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్కన్క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది. నాటి మ్యాచ్లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్లో సామ్ కరన్ బౌలింగ్లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు. అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది. ఇలాంటి రూల్ను రద్దు చేయాల్సిందే! దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. చదవండి: కేకేఆర్కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ! వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని -
WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
#WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 గెలిచిన టీమిండియా.. ఆసీస్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తుదిపోరులో పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇరు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఆసీస్తో తలపడే భారత జట్టును ప్రకటించింది. రాహుల్ అవుట్ అయితే, ఐపీఎల్-2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. కుడి తొడ పైభాగంలో నొప్పి తీవ్రమైన నేపథ్యంలో సర్జరీ చేయించుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపింది. వాళ్లిద్దరి సంగతి ఏంటి? ఇక ఎడమ భుజానికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. అతడి గాయం తీవ్రతపై పూర్తిగా స్పష్టత వచ్చిన తర్వాతే డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో కొనసాగే అంశంపై క్లారిటీ వస్తుందని తెలిపింది. ముగ్గురికి ఛాన్స్ అదే విధంగా మరో పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా కేకేఆర్ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడన్న బీసీసీఐ.. తమ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటోందని తెలిపింది. ఇక శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాండ్బై ప్లేయర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్లతో పాటు బౌలర్ ముకేశ్ కుమార్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్ ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్). స్టాండ్ బై ప్లేయర్లు: రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్. చదవండి: లక్నో సూపర్ జెయింట్స్కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
WTC Final: టీమిండియా టీ20 స్టార్కు బంపరాఫర్!
ICC World Test Championship 2023 Final: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్ ఆడే జట్టులో అతడికి స్టాండ్బైగా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. కాగా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1గా కొనసాగుతున్న సూర్య.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలో విఫలం నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మొట్టమొదటి సారి బరిలో దిగిన సూర్య పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రెండో మ్యాచ్ నుంచి అతడిని పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు ఎంపిక సమయంలో సూర్య పేరును పరిగణనలోకి తీసుకోలేదు. రాహుల్కు గాయం అదే సమయంలో వెటరన్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్.. ఐపీఎల్-2023లో అదరగొడుతున్న అజింక్య రహానేకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా మెగా మ్యాచ్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. యూకే వీసా రెడీ చేసుకో! ఈ నేపథ్యంలో సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి కోలుకుంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. సూర్యను స్టాండ్బైగా ఎంపిక చేసి లండన్ పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘ఇంతవరకు ఈ విషయంపై అంతిమ నిర్ణయం తీసుకోలేదు. అయితే, సూర్యను యూకే వీసా సిద్ధంగా ఉంచుకోవాలని మాత్రం చెప్పారు’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఐపీఎల్తో తిరిగి ఫామ్లోకి కాగా స్వదేశంలో టెస్టుల్లో విఫలమైన సూర్య.. వన్డే సిరీస్లోనూ వరుసగా డకౌట్ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్-2023 ఆరంభంలోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన సూర్య.. ప్రస్తుతం మూడు అర్ధ శతకాలతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. లండన్లోని ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్కు జూన్ 12ను రిజర్వ్ డేగా ఫిక్స్ చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్-2023కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కెఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్. చదవండి: ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం.. నా వల్లే ఇలా! అతడు మాత్రం.. -
సరిపోని ఐర్లాండ్ పోరాటం.. బంగ్లాదేశ్ ఖాతాలో మరో సిరీస్
ఢాకా వేదికగా ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఐర్లాండ్ వికెట్కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. స్కోర్ వివరాలు.. ఐర్లాండ్: 214 & 292 బంగ్లాదేశ్: 369 & 138/3 -
శతక్కొట్టిన టకెర్.. ఐర్లాండ్ అసాధారణ పోరాటం
మిర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ అసాధారణ పోరాటపటిమను కనబరిచింది. 131 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్నైట్ స్కోరు 27/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ ఆట ముగిసే సమయానికి 107 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ లొర్కాన్ టకెర్ (162 బంతుల్లో 108; 14 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ చేశాడు. హ్యారీ టెక్టర్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్), మెక్బ్రైన్ (71 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టెక్టర్, టకెర్ ఆరో వికెట్కు 72 పరుగులు... టకెర్, మెక్బ్రైన్ ఏడో వికెట్కు 111 పరుగులు భాగస్వామ్యం జోడించారు. -
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్లో 126) వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్కు ముందు ఐర్లాండ్తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. కేన్మామ స్థానంలో లంక ఆల్రౌండర్ ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం! వన్డే వరల్డ్కప్ టోర్నీకి కూడా -
INDvsAUS నాలుగో టెస్ట్ : మైదానంలో భారత్-ఆసీస్ ప్రధానుల సందడి (ఫొటోలు)
-
ఢిల్లీ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం
-
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 ఆలౌట్
-
మళ్లీ స్పిన్ మంత్రం
న్యూఢిల్లీ: మరోసారి స్పిన్ ప్రభావం ఉంటుందా...తొలి మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిస్తే ఇది ఎన్ని రోజులు సాగుతుంది... ఆసీస్ మన స్టార్లు అశ్విన్, జడేజాలను ఎదుర్కోగలదా...అసలు ఆ జట్టు పోరాడగలదా...టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శిస్తుందా... ఇలాంటి ఆలోచనలు, అంచనాల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియాకు పెను సవాల్ విసిరేందుకు మరో స్పిన్ వికెట్ స్వాగతం పలుకుతోంది. ప్రపంచ టెస్టు క్రికెట్లో టాప్–2 జట్లయిన ఆసీస్, భారత్ల మధ్య నేటి నుంచి ఢిల్లీ కోటలో రెండో టెస్టు జరుగుతుంది. ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి టెస్టు గెలిచి 1–0తో పైచేయి సాధించింది. మరోవైపు మేటి జట్టు ఆ్రస్టేలియా రెండు ఇన్నింగ్స్ల్లోనూ వంద ఓవర్లయినా ఎదుర్కోలేకపోవడం జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు సిరీస్లో పుంజుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత బౌలింగ్ను దీటుగా ఎదుర్కోవాల్సిందే! ఉత్సాహంగా భారత్ సిరీస్లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్లో రోహిత్ ఫామ్లో ఉండగా, వందో టెస్టు ఆడనున్న చతేశ్వర్ పుజారా దీన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గత టెస్టులో పుజారా, కోహ్లి విఫలమయ్యారు. కానీ తన సొంతగడ్డయిన ఢిల్లీపై కోహ్లి చెలరేగడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సాధించడంతో సూర్యకుమార్ బెంచ్కే పరిమితమవుతాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజాతో పాటు శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్ వరకు అంటే తొమ్మిదో వరుస వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం కచి్చతంగా అదనపు బలం కాగలదు. అశ్విన్కు ఢిల్లీ అచ్చొచ్చిన పిచ్. ఇక్కడ నాలుగు టెస్టులాడి ఏకంగా 27 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్ల స్పిన్ తప్పకుండా మ్యాచ్ను మలుపుతిప్పగలదు. కొన్ని గణాంకాలు భారత జట్టును ఊరిస్తున్నాయి. 1987 తర్వాత ఢిల్లీలో భారత్ పరాజయమే ఎరుగదు. చివరిసారిగా ఆ ఏడాది విండీస్ చేతిలో ఓడిన టీమిండియా తదనంతరం గెలవడం లేదంటే డ్రా చేసుకుంది కానీ... ఏ టెస్టులోనూ ఓడలేదు. 249 వికెట్లతో ఉన్న జడేజా ఒక్క వికెట్ తీస్తే 250 మార్క్ను అధిగమిస్తాడు. పుంజుకోవడం ఎలా! భారత్లో అడుగుపెట్టినప్పటి నుంచి స్పిన్ బూచిపై కంగారు పడిన ఆ్రస్టేలియా ప్రత్యేక కసరత్తులు చేసింది. వార్నర్, ఉస్మాన్ ఖాజా, లబుõÙన్, స్మిత్ ఇలా మేటి బ్యాటర్స్ అంతా పూర్తి స్థాయి ఫిట్నెస్తో అందుబాటులో ఉన్నారు. కానీ ఆట దగ్గరకు వచ్చేసరికి వార్నర్ (1, 10), ఖాజా (1, 5)ల ఓపెనింగ్ అత్యంత పేలవంగా మొదలైంది. ఇది రెండు ఇన్నింగ్స్ల్లోనూ జట్టును చావుదెబ్బ తీసింది. ప్రత్యర్థి స్పిన్ అస్త్రాలకు మిడిలార్డర్ ఇంకాస్త బలహీనపడింది. ఢిల్లీ కూడా అలాంటి వికెటే కావడంతో ఆ్రస్టేలియా శిబిరంలో ఆందోళన పెరుగుతుంది. అనుభవజు్ఞడైన స్మిత్, ఫామ్లో ఉన్న లబుõÙన్ బాధ్యతగా ఆడితే బ్యాటింగ్లో జట్టు నిలబడేందుకు అస్కారం వుంటుంది. కమిన్స్, మరీ్ఫ, లయన్, బోలండ్లతో కూడిన బౌలింగ్ దళం కూడా ఆతిథ్య బ్యాటర్లపై ప్రభావం చూపిస్తేనే ఈ మ్యాచ్లో పుంజుకుంటుంది. -
భారత్ నంబర్వన్... కాదు కాదు నంబర్ 2
దుబాయ్: టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ రెండో ర్యాంక్ నుంచి నంబర్వన్ ర్యాంక్కు ఎగబాకిందని ఐసీసీ బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. దాంతో ఇప్పటికే వన్డే, టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ అందుకోవడంతో ఏకకాలంలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) టీమిండియా నంబర్వన్ ర్యాంక్లో నిలిచిందని అభిమానులు సంబరపడ్డారు. అయితే భారత్ ఇంకా టాప్ ర్యాంక్కు చేరుకోలేదని... రెండో ర్యాంక్లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చింది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్తో టాప్ ర్యాంక్లో, భారత్ 115 రేటింగ్తో రెండో ర్యాంక్లో ఉన్నాయి. -
ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. తొలి టెస్టులో ఘన విజయం (ఫొటోలు)
-
Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు
WI VS ZIM 1st Test: 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) అజేయ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో బ్యాలెన్స్ పలు అరుదైన రికార్డులను నెలకొల్పాడు. అరంగేట్రం టెస్ట్లోనే శతకం బాదిన 24వ క్రికెటర్గా, రెండు దేశాల తరఫున సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా (కెప్లర్ వెసెల్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తరఫున) రికార్డు పుటల్లోకెక్కాడు. బ్యాలెన్స్ ఈ రికార్డులు సాధించే క్రమంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. జింబాబ్వేలోనే పుట్టి పెరిగిన బ్యాలెన్స్ తొలుత తన సొంత దేశం తరఫున కాకుండా ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్లు, 18 వన్డేల్లో 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున అవకాశాలు రాకపోవడంతో సొంత గూటికి చేరుకున్న బ్యాలెన్స్ అరంగేట్రం టెస్ట్లోనే సెంచరీ బాదాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. బ్యాలెన్స్ 8 ఏళ్ల కిందట తన చివరి టెస్ట్ సెంచరీని వెస్టిండీస్పైనే సాధించాడు. ఆ మ్యాచ్లో ప్రత్యర్ధి జట్టులో శివ్నరైన్ చంద్రపాల్ ఉండగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ సెంచరీ బాదిన మ్యాచ్లో శివ్నరైన్ చంద్రపాల్ కొడుకు తేజ్నరైన్ చంద్రపాల్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో తేజ్నరైన్ అజేయమైన డబుల్ సెంచరీ బాది తన తండ్రి అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ను అధిగమించాడు. ఇదిలా ఉంటే, విండీస్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది. ఆట చివరి రోజు విండీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆటలో చివరి సెషన్ మాత్రమే మిగిలింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ఫలితం తేలడం కష్టం. గ్యారీ బ్యాలెన్స్ (10), తఫడ్జా సిగా (10) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 447 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 203 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో తేజ్నరైన్ చంద్రపాల్ అజేయమైన 207 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్ 182 రన్స్ చేశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో బ్యాలెన్స్ సెంచరీ చేయగా.. బ్రాండన్ మవుటా (56) అర్ధ శతకంతో రాణించాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో రీఫర్ (58), బ్లాక్వుడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో చాము చిబాబా (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన జింబాబ్వే క్రికెటర్.. అత్యంత అరుదైన ఘనత సొంతం
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బాలెన్స్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. రెండు దేశాల (ఇంగ్లండ్, జింబాబ్వే) తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 16వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. బ్యాలెన్స్ తొలుత పరాయి దేశం (ఇంగ్లండ్) తరఫున ఆడి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం. చరిత్రలో ఇలా ఓ క్రికెటర్ తొలుత ఇతర దేశానికి, ఆతర్వాత సొంత దేశానికి ఆడటం ఇదే మొదటిసారి. రెండు దేశాల తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన 15 మంది క్రికెటర్లు తొలుత సొంత దేశం తరఫున.. ఆతర్వాత వివిధ కారణాల చేత ఇతర దేశాల తరఫున ఆడారు. బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. వెస్టిండీస్తో నిన్న (ఫిబ్రవరి 4) మొదలైన టెస్ట్ మ్యాచ్ ద్వారా బ్యాలెన్స్ జింబాబ్వే తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్ల్లో బ్యాలెన్స్ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన తొలి మ్యాచ్లో విండీస్ టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. ఓపెనర్లు టగెనరైన్ చంద్రపాల్ (55), క్రెయిగ్ బ్రాత్వైట్ (55) అజేయమైన అర్ధసెంచరీలతో క్రీజ్లో ఉన్నారు. రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన క్రికెటర్లు.. బిల్లీ మిడ్ వింటర్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విలియమ్ లాయిడ్ ముర్డాక్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) జె జె ఫెర్రిస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) సామీ వుడ్స్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ హియర్న్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) అల్బర్ట్ ట్రాట్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫ్రాంక్ మిచెల్ (ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడి (ఇంగ్లండ్, ఇండియా) గుల్ మహ్మద్ (ఇండియా, పాకిస్తాన్) అబ్దుల్ హఫీజ్ కర్దార్ (ఇండియా, పాకిస్తాన్) అమీర్ ఇలాహి (ఇండియా, పాకిస్తాన్) సామీ గుయిలెన్ (వెస్టిండీస్, న్యూజిలాండ్) జాన్ ట్రైకోస్ (సౌతాఫ్రికా, జింబాబ్వే) కెప్లర్ వెసల్స్ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) బాయ్డ్ రాంకిన్ (ఇంగ్లండ్, ఐర్లాండ్) గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లండ్, జింబాబ్వే) -
వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఆంధ్ర సంచలన విజయం
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది. చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? -
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. తొమ్మిది మంది ‘సున్నా’లే! మరీ చెత్తగా
Vijay Merchant Trophy- సూరత్: భారత దేశవాళీ క్రికెట్లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వీష్ ఒక ఫోర్ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా... తొలి ఇన్నింగ్స్లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సిక్కిం ఓపెనర్ రోహిత్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో సున్నాకే అవుట్ కావడంతో భారత సారథి రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్ దిన్రీ రెండు ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్ కెప్టెన్ మనాల్ చౌహాన్ 170 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? Sikkim bowled out for 6 in the Vijay Merchant Trophy against Madhya Pradesh. — Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2022 -
ఛటోగావ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
-
ఉప్పల్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ..!
-
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్షిప్లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్షైర్కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్తో ఆరంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
Ind Vs Eng: రూట్, బెయిర్స్టోపై సచిన్ ప్రశంసలు.. మరీ ఇంత ఈజీగా!
India Vs England 5th Test: ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్స్టోపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచారని కొనియాడాడు. కాగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో మాజీ కెప్టెన్ జో రూట్(142 పరుగులు- నాటౌట్), బెయిర్స్టో(114 పరుగులు- నాటౌట్) 269 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భీకర బ్యాటింగ్తో చెలరేగారు. ఇరువురూ సెంచరీలతో అజేయంగా నిలిచారు. తద్వారా మూడో రోజు వరకు పర్యాటక జట్టు చేతుల్లో ఉన్న మ్యాచ్ను.. అమాంతంగా లాక్కొని ఇంగ్లండ్ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించారు. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన సచిన్.. రూట్, బెయిర్స్టోలను అభినందించాడు. ‘‘ఇంగ్లండ్కు ఇది ఓ ప్రత్యేకమైన విజయం. సిరీస్ సమమైంది. జో రూట్, జానీ బెయిర్స్టో అద్భుత ఫామ్ కనబరిచారు. బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీనా అనిపించారు’’ అంటూ ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన రూట్.. కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. టీమిండియాతో సిరీస్లోనూ తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఈ అవార్డును పంచుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఐదో టెస్టులో బెయిర్ స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అదే విధంగా ర్యాంకింగ్స్లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Ind Vs WI 2022: విండీస్తో సిరీస్.. శిఖర్ ధావన్కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్గా.. బీసీసీఐ ప్రకటన Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 Special win by England to level the series. Joe Root & Jonny Bairstow have been in sublime form and made batting look very easy. Congratulations to England on a convincing victory. @Bazmccullum #ENGvIND pic.twitter.com/PKAdWVLGJo — Sachin Tendulkar (@sachin_rt) July 5, 2022 -
ఆరేళ్లలో ఇదే తొలిసారి.. నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!
ICC Test Rankings- Virat Kohli Rank: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్లోనూ మరోసారి విఫలమయ్యాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 11 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా టెస్టు ర్యాంకింగ్స్లో కోహ్లి ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో అతడు టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి 714 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. కాగా గత ఆరేళ్లలో కోహ్లి టాప్-10 ర్యాంకు కూడా సాధించలేకపోవడం ఇదే తొలిసారి. EDGBASTON GOES POTTY! 🎉 Scorecard/Videos: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/X5G3B2HsRU — England Cricket (@englandcricket) July 1, 2022 ఇలా ‘రన్మెషీన్’ స్థాయి రోజురోజుకూ పడిపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏంటిది కోహ్లి.. నీకే ఎందుకిలా జరుగుతోంది. ఇకనైనా బ్యాట్ ఝులిపించు ప్లీజ్’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే విధంగా ఐదో టెస్టులో కోహ్లి- ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో మధ్య వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రకృతి కూడా వీరిద్దరి వైరం కొనసాగాలని కోరుకుంటుందేమో! అందుకే ర్యాంకింగ్స్లో విరాట్ స్థానాన్ని బెయిర్స్టో ఆక్రమించాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అద్భుత శతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో తోడ్పడ్డ బెయిర్స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరికొంత మంది నెటిజన్లు... ‘‘ఇప్పుడు కూడా కోహ్లి కళ్లు తెరవకపోతే.. ఎవరూ అతడికి సాయం చేయలేరు. నిర్లక్ష్యఫు షాట్లు మానుకోవాలి. లేదంటే తుది జట్టులో కూడా స్థానం కోల్పోతాడు. ఆరోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Ind Vs WI 2022: విండీస్తో సిరీస్.. శిఖర్ ధావన్కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్గా.. బీసీసీఐ ప్రకటన Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 -
Ind Vs Eng: నన్ను నా పని చేసుకోనివ్వు.. నువ్వు నోర్ముయ్: అంపైర్ వార్నింగ్!
India Vs England 5th Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్కు టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చిన బ్రాడ్.. చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బ్రాడ్ చెత్త రికార్డు సాధించిన బౌలర్గా రికార్డుకెక్కాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్రాడ్ ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. ఇదే మ్యాచ్లో మూడో రోజు ఆటలో భాగంగా బ్రాడ్కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన స్టువర్ట్ బ్రాడ్ను టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తమ షార్ట్ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్ అంపైర్కు పదేపదే ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన అంపైర్.. ‘‘నన్ను అంపైరింగ్ చేసుకోనివ్వు. నువ్వు బ్యాటింగ్ చేయ్! ఓకే! లేదంటే నువ్వు మళ్లీ ఇబ్బందుల్లో పడతావు. ఒక్క ఓవర్కే ఇలానా! బ్రాడీ..! బ్రాడీ! నువ్వు బ్యాటింగ్ చెయ్! అలాగే కాస్త ఆ నోరు మూసెయ్’’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి ఇన్నింగ్స్లో 5 బంతులు ఎదుర్కొన్న బ్రాడ్.. ఒకే ఒక పరుగు తీసి సిరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగో రోజు పట్టు సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ ఐదో రోజు విజయం దిశగా దూసుకుపోతోంది. చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో! Richard Kettleborough#FromYorkshire pic.twitter.com/SIIczXE4UQ — Sɪʀ Fʀᴇᴅ Bᴏʏᴄᴏᴛᴛ (@SirFredBoycott) July 4, 2022 An incredible day that leaves us with a chance of making history 🙏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/QvDmaK20tp — England Cricket (@englandcricket) July 5, 2022 -
Ind Vs Eng: టీమిండియా ఫ్యాన్స్కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..
India Vs England 5th Test Day 4: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో టీమిండియా రీషెడ్యూల్డ్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలిని ట్యాగ్ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్బాస్టన్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్ చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3. చదవండి: Dutee Chand: మసాజ్ చేయమని బెదిరించేవారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్ Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz — Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022 We are very concerned to hear reports of racist abuse at today's Test match. We are in contact with colleagues at Edgbaston who will investigate. There is no place for racism in cricket — England and Wales Cricket Board (@ECB_cricket) July 4, 2022 -
Ind Vs Eng: కావాలని రెచ్చగొడితే ఇలాగే ఉంటది మరి.. నీకిది అవసరమా?
ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొడితే ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అన్నాడు. స్లెడ్జింగ్ ఒక్కోసారి బ్యాక్ఫైర్ అవుతుందంటూ భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో కోహ్లి, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటివరకు ఆచితూచి ఆడిన బెయిర్ స్టో కోహ్లి తన నవ్వు, మాటలతో కవ్వించడంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 140 బంతుల్లోనే 106 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో శతకంతో రాణించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కోహ్లిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ‘‘నిజంగానే కోహ్లి స్లెడ్జింగ్ బెయిర్ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవుననే చెప్పొచ్చు. అంతవరకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆడిన బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే ఒక్కోసారి మనకే బ్యాక్ఫైర్ అవుతుంది. ఏమో స్లెడ్జింగ్కు బదులిచ్చే క్రమంలో బెయిర్ స్టో మరింత దూకుడు ప్రదర్శించాడేమో?’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలింగ్ విభాగంపై జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గానే రాణించారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్ను 284 పరుగులకే కట్టడి చేశారు’’ అని కితాబిచ్చాడు. కాగా బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్తో రాణించడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. చదవండి: Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా.. It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
Ind Vs Eng: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు: సిరాజ్
India Vs England 5th Test- Mohammed Siraj: ‘‘తనొక యోధుడు. ఆస్ట్రేలియాలో తానేంటో నిరూపించుకున్నాడు. ఇక్కడ కూడా అదే పునరావృతం చేస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి తను అండగా నిలబడతాడు. కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి తానున్నానని ధీమా ఇస్తాడు’’ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నయావాల్ ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. అందుకు గల కారణాన్నీ వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. సీమర్ల దూకుడుకు తోడు పుజారా, రిషభ్ పంత్ పట్టుదలగా ఆడటంతో బుమ్రా సేనకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఈ మ్యాచ్లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఆలౌట్ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా పుజారా, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి పుజారాకు బౌలింగ్ చేయడం కష్టం. ఎందుకంటే తను అటాక్ చేయడు. బంతులు వదిలేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నెట్స్లో బౌలింగ్ చేస్తుంటే విసుగు వస్తుంది. తను వారియర్. జట్టుకు అవసరమైనపుడు కచ్చితంగా రాణిస్తాడు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఆటగాడిగా అయినా, కెప్టెన్గా అయినా బుమ్రాలో ఎలాంటి మార్పూ ఉండదని.. అన్ని వేళలా అతడు తనకు అండగా నిలబడ్డాడని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేసిన ప్రతిసారి వాటిని సరిదిద్ది.. ఏ పరిస్థితుల్లో ఎలా బౌల్ చేయాలో నేర్పించేవాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా మొదటి ఇన్నింగ్స్లో పుజారా విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి రిషభ్ పంత్తో కలిసి క్రీజులో ఉన్నాడు. చదవండి: IND VS ENG: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ An action-packed day of Test cricket 🏏 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/jbiekFiJ7H — England Cricket (@englandcricket) July 4, 2022 -
Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్కు కష్టమే.. టీమిండియాదే విజయం!
India Vs England 5th Test: ‘‘257 పరుగుల ఆధిక్యం అంటే కాస్త కష్టమే! లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ జట్టు చాలా కష్టపడాలి’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియా మరో 150 పరుగులు చేస్తే అప్పుడు కొండంత లక్ష్యం ఆతిథ్య జట్టు ముందు ఉంటుందని.. స్టోక్స్ బృందానికి తిప్పలు తప్పవని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో బుమ్రా సేన 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జానీ బెయిర్ స్టో(106 పరుగులు) మినహా ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే కుప్పకూలింది. The glorious summer of Jonny Bairstow 😍 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 | @IGcom pic.twitter.com/Ycl8Odq8ur — England Cricket (@englandcricket) July 3, 2022 పుజారా పట్టుదల! ఇక రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియా దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ గిల్ విఫలమైనా.. మరో ఓపెనర్ ఛతేశ్వర్ పుజారా అర్ధ శతకంతో రాణించాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది భారత్. దీంతో పర్యాటక జట్టుకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ టీమిండియా నయా వాల్ పుజారా ఆడిన తీరు అమోఘమని ప్రశంసించిన వాన్.. అదే సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారని పెదవి విరిచాడు. An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 మైకేల్ వాన్(ఫైల్ ఫొటో) టీమిండియాదే విజయం! ‘‘ఇలాంటి పిచ్ వాతావరణ పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి 139 బంతులు ఎదుర్కొని 50 పరుగులు(నాటౌట్) చేయడం అంత సులభమేమీ కాదు. నిలకడగా రాణిస్తూ ముందుకు సాగిన విధానం అమోఘం. పుజారా, పంత్ వంటి ఆటగాళ్లు ఉంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. వాళ్లిద్దరూ ఒక్కసారి పైచేయి సాధించారంటే అంతే సంగతులు. ఇప్పుడు 257 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈజీగా మరో 150 పరుగులు చేస్తుంది. అప్పుడు టార్గెట్ ఇంచుమించు 400. మిగిలింది రెండ్రోజుల ఆట. ఇంగ్లండ్ గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది’’ అని మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియానే విజయం వరిస్తుందని జోస్యం చెప్పాడు. చదవండి: Ind Vs Eng 5th Test: వాళ్లేమో అదరగొడుతున్నారు.. వీళ్లేమో ఇలా.. ఛాన్స్ ఇస్తే జట్టులో పాతుకుపోవాలి! కానీ.. IND VS Northamptonshire: హర్షల్ ఆల్రౌండ్ షో.. రెండో మ్యాచ్లోనూ టీమిండియాదే విజయం -
Ind Vs Eng: వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
India vs England 5th Test: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో గిల్ 17 పరుగులకు అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు. He is just so, so good 🥰 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/WlwQjxDxo6 — England Cricket (@englandcricket) July 3, 2022 ఇలా ఎడ్జ్బాస్టన్ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘గిల్, విహారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బ్యాట్ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45). చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..! An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 -
ENG vs IND: ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’.. చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీ
గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్లో చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. బర్మింగ్హామ్: ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’ బిగించింది. భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. సీమర్ల ఉత్సాహానికి బ్యాటర్లు జతకలవడంతో ఇంగ్లండ్ ముందు లక్ష్యం కొండంతలా పెరుగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్మన్ గిల్ (4), వన్డౌన్ బ్యాటర్ విహారి (11) రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచారు. కోహ్లి 20 పరుగులే చేసి నిష్క్రమించగా, మరో ఓపెనర్ చతేశ్వర్ పుజారా (139 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్ల ముందు గోడలా నిలబడ్డాడు. హిట్టర్ రిషభ్ పంత్ (46 బంతుల్లో 30 బ్యాటింగ్; 4 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్కు 50 పరుగులు జోడించారు. అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్ బిల్లింగ్స్ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 132 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 257 పరుగులకు చేరగా... చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది. భళా బెయిర్స్టో రెండో రోజు సగం వికెట్లను కోల్పోయి కుదేలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు ఆదివారం బెయిర్స్టో వెన్నెముకగా నిలిచాడు. ఓవర్నైట్ స్కోరు 84/5తో ఆట కొనసాగించిన బెయిర్స్టో, స్టోక్స్ కాసేపటికే జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. 81 బంతుల్లో 7 బౌండరీలతో బెయిర్స్టో ఫిఫ్టీ పూర్తికాగా... కాసేపటికే స్టోక్స్ (25; 3 ఫోర్లు) బుమ్రా అద్భుత క్యాచ్కు వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బిల్లింగ్స్ అండతో బెయిర్స్టో యథేచ్ఛగా బౌండరీలు బాదాడు. 119 బంతుల్లో (14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని షమీ అవుట్ చేయగా, టెయిలెండర్లలో పాట్స్ (19; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఆలౌట్ను కాస్త ఆలస్యం చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284. భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (బ్యాటింగ్) 50; విహారి (సి) బెయిర్స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (బ్యాటింగ్) 30 ఎక్స్ట్రాలు 10; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75. బౌలింగ్: అండర్సన్ 14–5–26–1, బ్రాడ్ 12–1– 38–1, పాట్స్ 8–2–20–0, లీచ్ 1–0–5–0, స్టోక్స్ 7–0–22–1, రూట్ 3–1–7–0. -
Virender Sehwag: కోహ్లితో ఫైట్.. దంచికొట్టిన బెయిర్ స్టో.. సెహ్వాగ్ ట్రోలింగ్!
భారత్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఆదిలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. తన ఫామ్ను కొనసాగిస్తూ (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) చేశాడు. అయితే, మహ్మద్ షమీ వేసిన 32 ఓవర్లో కోహ్లి, బెయిర్స్టో మధ్య మాటల యుద్ధం నడిచింది. షమీ బౌలింగ్లో బెయిర్స్టో ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అతన్ని చూసి నవ్వుకున్నాడు. ‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా’ అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా ‘నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయ్’ అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. దీనిపై బెయిర్స్టో స్పందించాడు. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. విషయం ముదిరి కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ సమయానికి బెయిర్ స్టో 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి👉🏻బెయిర్ స్టో రికార్డులు! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ! ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లికి చురకలు అంటించాడు. పుజారా తరహా నింపాదిగా ఆడుతున్న బెయిర్ స్టోను అనవసరంగా గెలికాడని, దాంతో ఇంగ్లిష్ బ్యాటర్ పంత్ మాదిరిగా రెచ్చిపోయాడని ట్విటర్లో పేర్కొన్నాడు. కోహ్లితో గొడవకు ముందు బెయిర్ స్టో స్ట్రయిక్ రేట్ 21 ఉండగా.. దాని తర్వాత అతని స్ట్రయిక్ రేట్ అమాంతం 150 కి పెరిగిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. చదవండి👉🏻ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! Jonny Bairstow's Strike Rate before Kohli's Sledging -: 21 Post Sledging - 150 Pujara ki tarah khel rahe thhey, Kohli ne Pant banwa diya bewajah sledge karke #IndvsEng — Virender Sehwag (@virendersehwag) July 3, 2022 It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
వారెవ్వా బెయిర్ స్టో! ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడో సెంచరీ!
11 ఓవర్లు ముగిసేసరికి 44 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్ను స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో ఆదుకున్నాడు. భారీ స్కోరుతో ఆదిత్య జట్టును బెంబేత్తించిన ప్రత్యర్థికి తన ఫామ్ను కొనసాగిస్తూ కొరకరాని కొయ్యగా మారాడు. 119 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బిల్లింగ్స్తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బెయిర్ స్టో తాజా సెంచరీతో పలురికార్డులు సాధించాడు. 2016 అనంతరం టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అయితే, 55 వ ఓవర్ మొదటి బంతికి షమీ బౌలింగ్లో బెయిర్ స్టో (140 బంతుల్లో 106; ఫోర్లు 14, సిక్సర్లు 2) కోహ్లికి ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జట్టును కష్ట సమయంలో ఆదుకున్న అతడికి సహచర ఆటగాళ్లు స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చారు. సెంచరీల వరద గత రెండు టెస్టు మ్యాచుల్లోనూ బెయిర్ స్టో పరుగుల వరద పారించాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 8 మరియు 136 పరుగులు చేశాడు. అదే న్యూజిలాండ్తో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్లో 162 మరియు 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్తో మ్యాచులోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బెయిర్ స్టోకి టెస్టుల్లో ఇది 11వ సెంచరీ కావడం విశేషం. వరుసగా మూడు టెస్టుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్ 15 వ ఆటగాడిగా బెయిర్ స్టో రికార్డు నెలకొల్పాడు. క్లార్క్ తర్వాత బెయిర్ స్టో! ఐదో స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. 2012లో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేశాడు. -
అదరగొట్టిన టీమిండియా.. ఇంగ్లండ్ 84/5
బుమ్రా బ్యాటింగ్లో చెలరేగిపోయాడు... ఆ తర్వాత బుమ్రా బౌలింగ్లో ప్రత్యర్థి పని పట్టాడు...జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా...షమీ, సిరాజ్ తలో చేయి వేశారు. టీమిండియా సమష్టి ప్రదర్శన ముందు ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ విలవిల్లాడింది. భారత పేసర్లను ఎదుర్కోలేక 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టు సొంతగడ్డపై రెండో రోజే భారత్ ముందు బేలగా మారిపోయింది... ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన మన జట్టుకు మ్యాచ్పై పట్టు చిక్కేసింది. ఏకంగా 332 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ను బెయిర్స్టో, స్టోక్స్ కలిసి ఎంత వరకు రక్షిస్తారనేది చూడాలి. బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన భారత జట్టు రెండో రోజే దానికి బాటలు పర్చుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జో రూట్ (31) టాప్ స్కోరర్గా నిలవగా...ప్రస్తుతం బెయిర్స్టో (12 బ్యాటింగ్), స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 338/7తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) సెంచరీ సాధించగా, జస్ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో రెండో రోజు 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 11.5 ఓవర్లు...78 పరుగులు... తొలి ఇన్నింగ్స్లో మిగిలిన 3 వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆ ప్రయత్నంలో సఫలమైంది. ఓవర్కు 6.7 పరుగుల రన్రేట్తో బ్యాటింగ్ చేసిన టీమిండియా 71 బంతుల్లో 78 పరుగులు సాధించింది. పాట్స్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన జడేజా 184 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. జడేజాకు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ కాగా, విదేశాల్లో మొదటిది. షమీ (16)ని అవుట్ చేసి బ్రాడ్ టెస్టుల్లో 550వ వికెట్ పూర్తి చేసుకోగా, అండర్సన్ బౌలింగ్లో జడేజా క్లీన్బౌల్డయ్యాడు. బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్లో విశ్వరూపం చూపించిన బుమ్రా స్కోరును 400 పరుగులు దాటించగా, సిరాజ్ (2) అవుట్ చేసి అండర్సన్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోవడంతో భారత్ ఆట ముగిసింది. టపటపా... బ్యాటింగ్లో చెలరేగిన జోరులో బౌలింగ్ మొదలుపెట్టిన బుమ్రా ఇక్కడా దానిని కొనసాగించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను ఊపిరి సలపనీయకుండా చేసిన బుమ్రా తన 25 బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా దెబ్బకు లీస్ (6), క్రాలీ (9), పోప్ (10) పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షంతో బుమ్రా, షమీకి తగినంత విరామం లభించి సుదీర్ఘ స్పెల్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలిగారు. వాన ఆగి ఆట మళ్లీ మొదలైన తర్వాత ఇంగ్లండ్ అతి జాగ్రత్తగా ఆడబోయింది. ఇదే క్రమంలో సిరాజ్ అద్భుత బంతితో రూట్ను పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. నైట్వాచ్మన్ లీచ్ (0) కూడా నిలబడలేకపోవడంతో స్టోక్స్ బరిలోకి దిగాల్సి వచ్చింది. రెండు నోబాల్లు, 2 వికెట్లు... బుమ్రాకు శనివారం అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్లో అనూహ్య ఇన్నింగ్స్తో చెలరేగిన అతను అదే జోరులో బౌలింగ్లో తన సత్తాను ప్రదర్శించాడు. టాప్–3 వికెట్లు అతని ఖాతాలోనే చేరాయి. ఇందులో రెండు అదనపు బంతుల ద్వారానే రావడం విశేషం. తన రెండో ఓవర్ చివరి బంతికి బుమ్రా నోబాల్ వేయగా...తర్వాతి బాల్కు లీస్ వికెట్ దక్కింది. ఆ తర్వాత తన ఆరో ఓవర్ చివరి బంతిను కూడా అతను నోబాల్ వేశాడు. దాంతో ఏడో బాల్ వేయాల్సి రాగా... దానికీ పోప్ అవుటయ్యాడు. -
పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా
ఆకాశం మేఘావృతమై ఉంది... ఇంగ్లండ్ టాస్ గెలిచింది... ఇంకేముంది... మరో ఆలోచన లేకుండా స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు! అతని నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. భారత ప్రధాన బ్యాటర్లను కుదురుకోనీయలేదు. గిల్, పుజారా, విహారి, కోహ్లిలకు తోడు శ్రేయస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరారు. భారత్ స్కోరు 98/5... బౌలర్ల జోరు ఇలాగే సాగితే రెండో సెషన్లో రెండు వందలకు లోపే జట్టు ఆలౌట్ అయిపోయేదేమో! కానీ రిషభ్ పంత్ ఇంగ్లండ్కు ఆ అవకాశం ఇవ్వలేదు. బౌలర్లపై ఎదురు దాడికి దిగి ఒంటి చేత్తో ఆటను మలుపు తిప్పాడు. ఇటీవల పరిమిత ఓవర్ల మ్యాచ్లలో తన బ్యాటింగ్పై వస్తున్న అనుమానాలను టెస్టు ఇన్నింగ్స్తో పటాపంచలు చేశాడు. విదేశాల్లో భారత ఆటగాళ్లు సాధించిన అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచిపోయే ప్రదర్శనతో తన విలువేంటో చూపించాడు. పంత్ను ఎలా ఆపాలో తెలీక ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మరో ఎండ్లో సమయోచిత బ్యాటింగ్తో జడేజా అందించిన సహకారం టీమిండియాను మెరుగైన స్థితికి చేర్చింది. బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భారత్కు మంచి పునాది పడింది. బ్యాటింగ్తో ఆధిపత్యం ప్రదర్శించిన మన జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (111 బంతుల్లో 146; 19 ఫోర్లు, 4 సిక్స్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, రవీంద్ర జడేజా (163 బంతుల్లో 83 బ్యాటింగ్; 10 ఫోర్లు) శతకానికి చేరువయ్యాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 222 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్కు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం రవీంద్ర జడేజాతో పాటు మొహమ్మద్ షమీ (0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. రెండో రోజు మిగిలిన 3 వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే భారత్కు మ్యాచ్పై పట్టు లభిస్తుంది. తొలి రోజు ఏకంగా 4.63 రన్రేట్తో పరుగులు రావడం విశేషం. భారత వికెట్ కీపర్లలో వేగవంతమైన సెంచరీ (89 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. మెరుపు బ్యాటింగ్... ఓపెనర్లు గిల్ (17), పుజారా (13) ఎక్కువ సేపు నిలవలేకపోవడంతో భారత్కు సరైన ఆరంభం లభించలేదు. 6 పరుగుల వద్ద క్రాలీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన విహారి (20) దానిని వాడుకోలేకపోగా, పాట్స్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక కోహ్లి (11) బౌల్డయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (15) కూడా విఫలం కావడంతో భారత్ సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్ స్కోరు 13, జడేజా స్కోరు 0 పరుగులు! వేగంగా ఆడిన జడేజా 24 పరుగులకు చేరగా, పంత్ 25 వద్ద నిలిచాడు. ఆ తర్వాత పంత్ విధ్వంసం షురూ అయింది. లీచ్ తొలి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6తో దూకుడు మొదలు పెట్టిన అతను 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ బౌలర్నూ వదలకుండా జోరు పెంచాడు. పాట్స్ బౌలింగ్లో 7 ఫోర్లు కొట్టిన అతను లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్పై విరుచుకుపడ్డాడు. అతని ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 96కు చేరిన పంత్ ... బ్రాడ్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా ఆడి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని శతకానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి భారత ఆటగాళ్లు చప్పట్లతో అభినందించగా... సాధారణంగా ప్రశాంతంగా కనిపించే కోచ్ ద్రవిడ్ కూడా భావోద్వేగాలు ప్రదర్శించడం ఇన్నింగ్స్ ప్రత్యేకతను చూపించింది. అదే ఓవర్లో 109 బంతుల్లో జడేజా హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం లీచ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4, 6 బాది పంత్ 22 పరుగులు రాబట్టాడు. సుదీర్ఘ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పార్ట్టైమర్ రూట్ చక్కటి బంతితో పంత్ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ శిబిరం కాస్త ఊరట పొందింది. అయితే మరో ఎండ్లో మాత్రం జడేజా పట్టుదలగా నిలబడి ఆటను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 17; పుజారా (సి) క్రాలీ (బి) అండర్సన్ 13; విహారి (ఎల్బీ) (బి) పాట్స్ 20; కోహ్లి (బి) పాట్స్ 11; పంత్ (సి) క్రాలీ (బి) రూట్ 146; శ్రేయస్ (సి) బిల్లింగ్స్ (బి) అండర్సన్ 15; జడేజా (బ్యాటింగ్) 83; శార్దుల్ (సి) బిల్లింగ్స్ (బి) స్టోక్స్ 1; షమీ (బ్యాటింగ్) 0; ఎక్స్ట్రాలు 32; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 338. వికెట్ల పతనం: 1–27, 2–46, 3–64, 4–71, 5–98, 6–320, 7–323. బౌలింగ్: అండర్సన్ 19–4–52–3, బ్రాడ్ 15–2–53–0, పాట్స్ 17–1–85–2, లీచ్ 9–0–71–0, స్టోక్స్ 10–0–34–1, రూట్ 3–0–23–1. ►టెస్టుల్లో పంత్కు ఇది ఐదో సెంచరీ. ఇందులో నాలుగు విదేశాల్లోనే (ఓవల్, సిడ్నీ, కేప్టౌన్, బర్మింగ్హామ్) వచ్చాయి. మరొకటి అహ్మదాబాద్లో చేశాడు. చదవండి: Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా? Rishabh Pant, you beauty! 🤩💯 Is there a more exciting Test cricketer in the modern game?! 🔥 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z — Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022 -
తొలి రోజు ముగిసిన ఆట.. టీమిండియా 338/7
India Vs England 5Th Test Rescheduled Match ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 83 బ్యాటింగ్, మహ్మద్ షమీ(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రిషబ్ పంత్ (111 బంతుల్లో 146, 20 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డే తరహాలో ఆడాడు. 9: 22 PM: ఆరంభంలో వికెట్లు పడ్డా రిషభ్ పంత్, జడేజా టీమిండియా ఇన్నింగ్స్ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. ఈ క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 191/5. పంత్ 66, జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. పంత్ హాఫ్ సెంచరీ ఇంగ్లండ్తో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జాక్ లీచ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. మరో ఎండ్లో పంత్కు జడేజా సహకారం అందిస్తున్నాడు. టీ బ్రేక్ సమయానికి జడ్డూ 65 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 8: 08 PM: జడేజా, పంత్ నిలకడగా ఆడుతున్నారు. 35 ఓవర్లు ముగిసే సరికి జడ్డూ 20 పరుగులు, రిషభ్ పంత్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు: 130-5. 7: 23 PM: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా, పంత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 105-5. వాన తెరిపి ఇవ్వడంతో లంచ్ బ్రేక్ తర్వాత ఆగిన ఆట మొదలైంది. ఈ క్రమంలో కాసేపటికే టీమిండియా మరో రెండు వికెట్లు కోల్పోయింది. కాగా 22.2 ఓవర్లో హనుమ విహారిని ఇంగ్లండ్ యువ బౌలర్ మాథ్యూ పాట్స్ బోల్తా కొట్టించాడు. దీంతో విహారి 20 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లిని సైతం అద్బుత రీతిలో బౌల్డ్ చేశాడు పాట్స్. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు ఓపెనర్లు గిల్, పుజారాలను ఆండర్సన్ అవుట్ చేశాడు. ఇక ప్రస్తుతం రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉండగా.. భారత్ స్కోరు: 89/4 (26.4). EDGBASTON GOES POTTY! 🎉 Scorecard/Videos: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/X5G3B2HsRU — England Cricket (@englandcricket) July 1, 2022 05: 25 PM: ఇంగ్లండ్- భారత్ మధ్య రీ షెడ్యూల్డ్ టెస్టుకు వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా మొదటి రోజు లంచ్ బ్రేక్ తర్వాత ఆట ఆగింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 4: 45 PM: ఇంగ్లండ్తో టెస్టు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి ఒకటి, విహారి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు గిల్ 17, పుజారా 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించారు. 4:30 PM: టీమిండియా ఇన్నింగ్స్ నిలకడగా సాగుతుందనుకున్న సమయంలో భారీ షాక్ తగిలింది. ఓపెనర్, నయావాల్ ఛతేశ్వర్ పుజారా అవుటయ్యాడు. ఆండర్సన్ బౌలింగ్లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు 52/2 (19). కాగా మరో ఓపెనర్ గిల్ వికెట్ కూడా ఆండర్సన్ తన ఖాతాలో వేసుకున్నాడు. హనుమ విహారి, విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతూ.. ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఓపెనర్ ఛతేశ్వర్ పుజారా, వన్డౌన్లో వచ్చిన ఛతేశ్వర్ పుజారా నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరు పరస్పర సమన్వయంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 45/1. అంతకు ముందు గిల్ ఆండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టులో 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: ఒక వికెట్ నష్టానికి 31 పరుగులు. హనుమ విహారి, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ డౌన్ ఇంగ్లండ్తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ మ్యాచ్లో ఓపెనర్ శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు ఆండర్సన్ బౌలింగ్(6.2 ఓవర్)లో క్రాలేకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. అతడి స్థానంలో హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. పుజారాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. Jimmy is back with a 💥 Scorecard/Videos: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/dalxxQ26yQ — England Cricket (@englandcricket) July 1, 2022 ►ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 18-0. శుబ్మన్ గిల్(17), ఛతేశ్వర్ పుజారా(4) క్రీజులో ఉన్నారు. టీమిండియా ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్ టెస్టు శుక్రవారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లుగా యువ ఆటగాడు శుబ్మన్ గిల్, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా బరిలోకి దిగారు. ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమిండియాతో స్వదేశంలో జరుగుతున్న రీ షెడ్యూల్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు జూలై 1 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్కు భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా దూరం కాగా.. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేపట్టాడు. తుది జట్లు: ఇంగ్లండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జొ రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్. ఇండియా: శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్). చదవండి: ENG vs IND: 'భారత్ అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్తో బరిలోకి దిగాలి.. లేదంటే' -
పాత పోరు... కొత్తగా
గత ఏడాది సెప్టెంబర్... భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగు టెస్టులు జరిగాయి. రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా సిరీస్లో 2–1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్లో చివరి టెస్టు ఆరంభానికి ముందు భారత శిబిరంలో నెలకొన్న కరోనా ఆందోళనతో అనూహ్యంగా ఐదో టెస్టు ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇదే టెస్టును ఆడాలని ఇరు బోర్డులు అంగీకారానికి రావడంతో ఇప్పుడు మళ్లీ టెస్టు పోరు కోసం భారత జట్టు ఇంగ్లండ్కు తరలి వెళ్లింది. ఇన్ని రోజుల్లో ఇరు జట్లలో పలు మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎలాంటి ఫలితం రానుందనేది ఆసక్తికరంగా మారింది. బర్మింగ్హామ్: ఇంగ్లండ్ గడ్డపై 2007లో చివరి సారి టెస్టు సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు మరోసారి అదే ఫలితం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్తో నేటినుంచి జరిగే ఐదో టెస్టులో టీమిండియా తలపడనుంది. గత పర్యటనతో పోలిస్తే రెండు జట్లూ కూడా కొత్త కోచ్లు, కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి. అశ్విన్ లేదా శార్దుల్ గత ఏడాది ఓవల్లో జరిగిన నాలుగో టెస్టుతో పోలిస్తే ఈ సారి తుది జట్టులో పలు మార్పులు ఖాయం. రోహిత్, రాహుల్, రహానే జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఓపెనర్గా శుబ్మన్ గిల్, మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి ఆడటం లాంఛనమే. టెస్టు స్పెషలిస్ట్ పుజారా కీలకం కానుండగా...కెప్టెన్సీనుంచి దూరమైన కోహ్లి తన స్థాయి మేరకు సత్తా చాటితే భారత్కు తిరుగుండదు. ఆరో బ్యాటర్ రిషభ్ పంత్నుంచి భారత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్ సందేహం లేకుండా బరిలోకి దిగుతారు. ప్రధాన స్పిన్నర్గా రవీంద్ర జడేజా స్థానానికి కూడా ఢోకా లేదు. అయితే మిగిలిన మరో స్థానం కోసమే పోటీ నెలకొని ఉంది. బౌలింగ్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దీని కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్లో ఇటీవల పిచ్లు బాగా మారిన నేపథ్యంలో నాలుగో పేసర్కంటే రెండో స్పిన్నర్ ప్రభావం చూపగలడనుకుంటే అశ్విన్కు చాన్స్ లభిస్తుంది. దూకుడే మంత్రం... చివరి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును గురువారం ప్రకటించింది. భారత్తో జరిగిన నాలుగో టెస్టుతో పోలిస్తే ఇంగ్లండ్ టీమ్లో ఏకంగా ఏడు మార్పులు జరగడం విశేషం! రూట్, బెయిర్స్టో, అండర్సన్, పోప్ మాత్రమే తమ స్థానాలు నిలబెట్టుకోగా, గత సిరీస్ ఆడని బెన్ స్టోక్స్ ఈ సారి కెప్టెన్గా వచ్చాడు. ఎప్పటిలాగే ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు రూట్ మూలస్థంభం కాగా, బెయిర్స్టో తన కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. వరుసగా విఫలమవుతున్నా ఓపెనర్ క్రాలీపై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచింది. కీపర్ బిల్లింగ్స్ కూడా సమర్థుడైన బ్యాటర్. బౌలింగ్లో వెటరన్ స్టార్లు అండర్సన్, బ్రాడ్ మరోసారి ప్రత్యర్థిపై చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘36వ కెప్టెన్’ రోహిత్ కోవిడ్నుంచి కోలుకోకపోవడంతో ఇంగ్లండ్తో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా భారత్ 36వ టెస్టు కెప్టెన్గా బరిలోకి దిగుతున్నాడు. కుంబ్లే తర్వాత ఒక బౌలర్ భారత్కు కెప్టెన్ కావడం ఇదే తొలిసారి కాగా, కపిల్దేవ్ తర్వాత నాయకత్వం వహిస్తున్న మొదటి పేసర్. అయితే ఒక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ భారత టెస్టు కెప్టెన్ కావడం మాత్రం ఇదే మొదటిసారి. -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న రోహిత్..?
Rohit Sharma: టీమిండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల కోవిడ్ బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడని తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ అయ్యే సమయానికి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రోహిత్.. తాజాగా పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఇవాళ (జూన్ 28) సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ఈ వార్తకు బలం చేకూరుస్తుంది. A thumbs up from Rohit Sharma in his latest Instagram story. pic.twitter.com/ZAILwMR0gj — Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2022 రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్వయంగా షేర్ చేసిన ఈ ఫోటో చూసి టీమిండియా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. రోహిత్ ఈ ఫోటోలో థమ్స్ అప్ చెబుతూ నవ్వుతూ కనిపించడంతో అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ సమయానికి తప్పక అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంపై బీసీసీఐ లేదా రోహిత్ శర్మ స్పందించాల్సి ఉంది. This makes me feel like he's going to play the test match. @ImRo45 🔥 pic.twitter.com/Jsk5LdR680 — ANSHUMAN🚩 (@AvengerReturns) June 27, 2022 ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్తో రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల ముందు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మ్యాచ్ సమయానికి రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో అన్న సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాకప్ ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ను కూడా ఇంగ్లండ్కు రప్పించారు. కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ కూడా క్రికెట్ వార్గల్లో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో రోహిత్ కోలుకున్నాడన్న వార్త టీమిండియాకు మనోధైర్యాన్ని ఇస్తుంది. చదవండి: నాన్న రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు.. టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్
బర్మింగహమ్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ సహా ఉపఖండం అభిమానుల కొరకు మ్యాచ్ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది. తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించిందిఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టి20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ట్విటర్లో తెలిపింది. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్గా తేలిన రోహిత్.. ఆర్టీపీసీఆర్లోనే పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది. దీంతో ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ లేదా కోహ్లి, రహానేలలో ఎవరో ఒకరు తుది జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: రోహిత్ దూరమైతే!.. కోహ్లి లేదా పంత్ కాదనుకుంటే రహానే? IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా.. -
రోహిత్ దూరమైతే!.. టీమిండియాను నడిపించేది ఎవరు?
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్కు ముందు టీమిండియాకు బిగ్షాక్ తగిలింది. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్గా తేలాడు. దీంతో వారం పాటు రోహిత్ ఐసోలేషన్లో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే జూలై 1న ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే జట్టును నడిపించేది ఎవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కోహ్లి లేదా పంత్.. కాదనుకుంటే రహానే? వాస్తవానికి కెప్టెన్ దూరమైతే జట్టును వైస్ కెప్టెన్ నడిపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు రోహిత్ కెప్టెన్గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే రాహుల్ గజ్జల్లో గాయంతో ఇంగ్లండ్ సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ కూడా ప్రత్యేకంగా వైస్ కెప్టెన్ ఎవరనేది వెల్లడించలేదు. అనుభవం దృష్యా కోహ్లి లేదా పంత్లలో ఎవరు ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంతకముందు టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి నుంచే రోహిత్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. 2-1తో ఆధిక్యంలో ఉన్న దశలో కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. తాజా పర్యటనలో ఆ ఐదో టెస్టును ఏకైక టెస్టుగా మార్చి మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జట్టుకు కెప్టెన్గా ఉన్న కోహ్లికి మరోసారి అవకాశం ఉంది. అయితే కోహ్లి దీనికి అంగీకరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అలా కాకుండా పంత్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే యోచనలోనూ బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియాను విజయవంతగా నడిపించాడు. అది టి20... అందునా యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఇక్కడేమో టెస్టు జట్టు.. పైగా జట్టులో పంత్ కన్నా సీనియర్లు ఉండడంతో జట్టును సమర్థంగా నడిపించగలడా అనే సందేహాలు వస్తున్నాయి. వీరిద్దరు కాదనుకుంటే రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశము లేకపోలేదు. రోహిత్ శర్మకు నెగెటివ్ వస్తే.. తాజాగా రోహిత్ శర్మకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. ర్యాపిడ్ టెస్టులో ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. అందుకే రోహిత్ శర్మకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. దీని ఫలితం మరికొద్ది గంటల్లో రానుంది. ఒకవేళ నెగెటివ్ వస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇంగ్లండ్తో టెస్టుకు రోహిత్ సారధ్యం వహిస్తాడు. అలా కాకుండా పాజిటివ్ వస్తే మాత్రం వారం రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి వస్తుంది. చదవండి: కోహ్లి, శ్రేయస్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు.. స్కోర్: 364/9 టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..! -
Ind Vs Eng: ఇంగ్లండ్తో టీమిండియా పోరు.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు!
India Vs England 2022- Test, 3 T20, 3 ODI Matches Schedule: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్తో పోరుకు సిద్ధమైంది. రీషెడ్యూల్డ్ టెస్టు సహా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 1 నుంచి ప్రారంభంకానున్న టెస్టు మ్యాచ్ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. కాగా సోమవారం లీసెస్టర్ నగరానికి చేరుకున్న టీమిండియా వారం రోజుల పాటు ఇక్కడే ఉండనుంది. తొలి రోజు ఆటగాళ్లంతా తేలికపాటి డ్రిల్స్, ఫుట్బాల్కే పరిమితమయ్యారు. అయితే రెండో రోజు మంగళవారం మాత్రం జట్టు పూర్తి స్థాయి ప్రాక్టీస్లో పాల్గొంది. ఇక మంగళవారం ఉదయమే శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్తో కలిసి లండన్ చేరుకున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెంటనే లీసెస్టర్కు వెళ్లి జట్టుతో చేరాడు. ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లంతా సాధన చేశారు. టెస్టుకు ముందు గురువారం నుంచి ఇక్కడే లీసెస్టర్షైర్ కౌంటీతో భారత్ నాలుగు రోజుల పూర్తి స్థాయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు తుది జట్టులో స్థానం దక్కే ఆటగాళ్లే ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాగా గతేడాది కరోనా కలకలం కారణంగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య జరగాల్సిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో కేవలం నాలుగు మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి మ్యాచ్కు కోవిడ్ ఆటంకం కలిగించడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర ఒప్పందంతో రీషెడ్యూల్ చేశాయి. ఇక ఈ సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే. ఈ సిరీస్ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఆఖరి టెస్టును కనీసం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కాగా గతంలో ఈ సిరీస్కు విరాట్ కోహ్లి సారథ్యం వహించగా... రోహిత్ శర్మ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్లకు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. మరోవైపు ఇంగ్లండ్ టీమిండియాతో సిరీస్కు ఇంకా జట్లను ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్ పర్యటనలో ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్, టెస్టు జట్టు వివరాలు.. ►జూన్ 24-27 వరకు లీసెస్టర్షైర్తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ►జులై 1- రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఆరంభం- ఎడ్జ్బాస్టన్ మైదానం, బర్మింగ్హాం ►జులై 1- డెర్బిషైర్ వర్సెస్ ఇండియా- తొలి టీ20 వార్మప్ మ్యాచ్ ►జులై 3- నార్తాంప్టన్షైర్ వర్సెస్ ఇండియా- రెండో టీ20 వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా: టీ20 సిరీస్ ►జులై 7- మొదటి టీ20-ది రోజ్ బౌల్, సౌతాంప్టన్ ►జులై 9- రెండో టీ20-ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హాం ►జులై 10- మూడో టీ20-ట్రెంట్బ్రిడ్జి, నాటింగ్హాం ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా: వన్డే సిరీస్ ►జులై 12- తొలి వన్డే-కెనింగ్టన్ నావల్, లండన్ ►జులై 14- రెండో వన్డే-లార్డ్స, లండన్ ►జులై 17- మూడో వన్డే, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్ ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా: వన్డే సిరీస్ ►జులై 12- తొలి వన్డే ►జులై 14- రెండో వన్డే ►జులై 17- మూడో వన్డే ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ (గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరం). చదవండి: IND VS ENG: రంగంలోకి దిగిన రాహుల్.. రాగానే రుద్దుడు షురూ Practice 🔛 Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia's practice session in Leicester as we build up to the #ENGvIND Test. 💪 pic.twitter.com/qxm2f4aglX — BCCI (@BCCI) June 21, 2022 -
ఫాస్ట్ బౌలర్లతో వచ్చిన సమస్య ఇదే.. రక్తం చిందించిన వేళ
క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లంటే వేగానికి పెట్టింది పేరు. వారు అత్యంత వేగంతో విసిరే బంతులు ఎవరి మూతులు, ముక్కు విరగ్గొడతాయేమోనని చిన్నపాటి భయం ఉంటుంది. 1970వ దశకంలో వెస్టిండీస్ నుంచి అరవీర భయంకరమైన బౌలర్లు ఉండేవారు. వారు బౌలింగ్కు వస్తున్నారంటే ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టేది. అప్పట్లో హెల్మెట్ సహా కీలకమైన గార్డ్స్ అందుబాటులో లేకపోడంతో ఆటగాళ్ల తలలు పగిలి రక్తాలు కారడం సహజంగా కనిపించేది. కానీ కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. బ్యాట్స్మన్కు గ్లోవ్స్, ప్యాడ్స్, హెల్మెట్ లాంటి రక్షణ కవచాలు వచ్చాయి. ఫాస్ట్ బౌలర్లు ఎంత వేగంతో సంధించినా చిన్నపాటి గాయాలు తప్ప పెద్దగా నష్టం ఉండేది కాదు. షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, షేన్ బాండ్లు వేగానికి పెట్టింది పేరు. ఆ తర్వాత 2014లో ఆస్ట్రేలియా క్రికెట్లో పిలిప్ హ్యూజ్ ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచంలో విషాదాన్ని మిగిల్చింది. సీన్ అబాట్ వేసిన బంతి హ్యూజ్ హెల్మెట్ సందులో నుంచి వెళ్లి మెడ వెనుక సున్నితమైన ప్రాంతంలో తగలడంతో గ్రౌండ్లోనే కుప్పకూలాడు. ఆ తర్వాత రెండు రోజులకే పిలిప్ హ్యూజ్ ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనే అంతకముందు 2008లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వేసిన ఒక బంతి ప్రత్యర్థి బ్యాటర్ రక్తం చిందేలా చేసింది. తాజాగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అండర్సన్ మరోసారి ఫ్లిన్ అంశాన్ని గుర్తు చేశాడు. 2008లో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ సందర్భంగా కివీస్ ఆటగాడు డేనియల్ ఫ్లిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటికే ఫుల్ స్వింగ్లో ఉన్న అండర్సన్ మరోసారి బౌలింగ్కు వచ్చాడు. అప్పటికే 12 బంతులు మాత్రమే ఆడిన ఫ్లిన్.. అండర్సన్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా వచ్చి హెల్మెట్ గ్రిల్స్ లోపలకి వచ్చి ప్లిన్ మూతిని పగలగొట్టింది. ఈ దెబ్బకు ప్లిన్ నోటి నుంచి పన్ను ఊడి రక్తం కారసాగింది. ఈ దెబ్బకు ఫ్లిన్ క్రీజులోనే కూలబడ్డాడు. నోటి నుంచి రక్తం దారగా కారడంతో ఆటగాళ్లు కాస్త భయానికి లోనయ్యారు. వెంటనే ఫ్లిన్ను ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని.. బంతి వేగానిక పన్ను మాత్రమే ఊడిందని.. మిగతా ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు పేర్కొన్నారు. దీంతొ లంచ్ అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఫ్లిన్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే వాంతులు చేసుకున్నాడు. దీంతో భయపడిన అంపైర్లు ఫ్లిన్ను పెవిలియన్కు పంపించారు. అయితే కేవలం భయంతోనే ఫ్లిన్ వాంతులు చేసుకున్నాడని.. ఆ రాత్రంతా వాంతులు అయ్యాయని.. న్యూజిలాండ్ బోర్డు మరుసటిరోజు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్గా మారింది. చదవండి: Ranji Trophy 2022: రంజీ చరిత్రలో ముంబై అతిపెద్ద విజయం.. ప్రపంచ రికార్డు బద్దలు 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
'చెత్త ప్రదర్శనతో తక్కువంచనా వేయొద్దు.. నేనేంటో నిరూపించుకుంటా'
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 15 మ్యాచ్లాడి..10.07 ఎకానమీతో కేవలం తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. కాగా వచ్చే నెలలో ఇంగ్లండ్తో జరగబోయే టెస్టులో బాగా ఆడతాననే విశ్వాసంతో సిరాజ్ ఉన్నాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్లో నేను బాగా ఆడలేదు. ఇంగ్లండ్తో జరిగే చివరి టెస్టు కోసం డ్యూక్స్ బంతులతో సాధన చేస్తున్నా. మంచి ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకముంది. సిరీస్లో 2–1తో ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంది’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు. ఇక ఆర్సీబీ ఈ సీజన్లో మరోసారి ప్లేఆఫ్స్కే పరిమితమైంది. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో దుమ్మురేపిన ఆర్సీబీ అదే టెంపోనూ రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో మాత్రం చూపట్టలేక చతికిలపడింది. -
తొలి టెస్టు కోసం భారత్, శ్రీలంక జట్ల సాధన
-
‘వంద’లు లెక్కించడం కొత్త కాదు..కోహ్లికి ఈ ‘వంద’ మాత్రం ప్రత్యేకమైందే
విరాట్ కోహ్లికి ‘వంద’లు లెక్కించడం కొత్త కాదు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు పదుల శతకాలు బాదిన ఈ దిగ్గజం కెరీర్లో ప్రతీ ‘వంద’ ప్రత్యేకమైందే. కానీ ఈ సారి అతను సాధించబోయే ‘సెంచరీ’కి విశేష స్థానం ఉంది. ఆరంభంలో పరిమిత ఓవర్ల ఆటగాడిగానే గుర్తింపు తెచ్చుకొని మూడేళ్ల తర్వాత గానీ తొలి టెస్టు అవకాశం రాని కోహ్లి ఇప్పుడు 100 మ్యాచ్ల మైలురాయిని చేరుకుంటున్నాడు. వన్డేలు, టి20ల్లో అత్యద్భుత రికార్డులు, అసాధారణ ఘనతలు ఉన్నా... నాకు టెస్టులంటేనే ఇష్టమంటూ ఢంకా బజాయించి చెప్పిన ఈ కాలపు అరుదైన బ్యాటర్ అతను. ‘భారత్కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టం’ అంటూ సంప్రదాయ శైలి ఆటకు పతాకధారిగా మారిన కోహ్లి... మాటలతో మాత్రమే కాకుండా తన బ్యాటింగ్తోనూ సమకాలీకుల్లో మేటిగా నిలిచాడు. అందమైన కవర్డ్రైవ్తో ఆకట్టుకునే బ్యాటింగ్ను చూపించినా... ఎలాగైనా గెలవాలనే కసితో ప్రత్యర్థిపై ఆవేశాన్ని ప్రదర్శించేందుకు వెనుకాడని తత్వమైనా అది కోహ్లికే చెల్లింది. శ్రీలంకతో జరిగే తొలి టెస్టుతో శుక్రవారం కోహ్లి తన కెరీర్లో వందో మ్యాచ్కు సిద్ధమవుతున్న వేళ కొన్ని విశేషాలు... అలా మొదలైంది... 2008లో అండర్–19 ప్రపంచకప్లో భారత్ను విజేతగా నిలిపిన కెప్టెన్గా విరాట్ కోహ్లి టి20, వన్డే టీమ్కు తొందరగానే ఎంపికయ్యాడు. అయితే దిగ్గజాలతో నిండిన టెస్టు టీమ్లో అవకాశం దక్కించుకునేందుకు అతను ఎదురు చూడాల్సి వచ్చింది. కెరీర్లో 59 వన్డేలు ఆడిన తర్వాత కోహ్లి వెస్టిండీస్ గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్లో 5 ఇన్నింగ్స్లలో 76 పరుగులే చేసి అతను పేలవంగా ఆరంభించాడు. అయితే సొంతగడ్డపై ఆడిన తన నాలుగో టెస్టులో విండీస్పై రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలతో అతని ఆటకు గుర్తింపు దక్కింది. మేలిమలుపు... ఆస్ట్రేలియా గడ్డపై 2011–12 సిరీస్లో తొలి రెండు టెస్టుల్లోనూ కోహ్లి విఫలమయ్యాడు. బౌన్సీ పిచ్లపై ఆడే విషయంలో అతని టెక్నిక్పైనా సందేహాలు రేగాయి. అయితే టీమ్ మేనేజ్మెంట్ అతనిపై నమ్మకముంచి మూడో టెస్టులోనూ అవ కాశం కల్పించింది. పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లి తానేంటో చూపించాడు. చక్కటి బ్యాక్ఫుట్ షాట్లతో 75 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆపై మరింత మెరుగైన ప్రదర్శన కనబ రుస్తూ అడిలైడ్లో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు. భారత్ 0–4తో చిత్తుగా ఓడిన సిరీస్లో మన జట్టు తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే కావడం కోహ్లి విలువను చాటింది. ఆ రెండూ సూపర్... సచిన్ రిటైరయ్యాక 2013 చివర్లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్బర్గ్ టెస్టులో తొలిసారి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్లలోనూ 119, 96 పరుగులతో చెలరేగిన అతను సచిన్ స్థానంలో ఆడేందుకు తానే సరైనవాడినని రుజువు చేసుకొని ‘నంబర్ 4’ను ఖాయం చేసుకున్నాడు. మరో రెండు నెలల తర్వాత వెల్లింగ్టన్లో న్యూజిలాండ్పై చేసిన 105 పరుగులు కూడా కోహ్లి ఎక్కడైనా ఆడగలడని రుజువు చేశాయి. చేదు జ్ఞాపకం... విరాట్ అద్భుత కెరీర్లో ఎప్పటికీ మరకగా ఉండిపోయే సిరీస్ ఏదైనా ఉందంటే అది 2014 ఇంగ్లండ్ టూర్. విపరీతంగా స్వింగ్ అవుతున్న ‘డ్యూక్’ బంతులతో అండర్సన్ స్థాయి బౌలర్ను ఎదుర్కోలేక కోహ్లి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 134 పరుగులే చేయడం అతని పేలవ టెక్నిక్కు అద్దం పట్టింది. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా తర్వాతి పర్యటనలో కోహ్లి తన బ్యాటింగ్తో అదే ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టాడు. 2018లో 10 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 593 పరుగులు తన వాడిని ప్రదర్శించిన కోహ్లి ఒక్కసారి కూడా అండర్సన్కు అవుట్ కాలేదు! హైలైట్ ప్రదర్శన టెస్టు క్రికెటర్గా కోహ్లిని గుర్తు చేసుకోవాలంటే 2014–15 ఆస్ట్రేలియా పర్యటనలో అతని ఆట చాలు. ధోని గైర్హాజరులో అడిలైడ్లో తొలిసారి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి రెండు ఇన్నింగ్స్లలో 115, 141 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులను ఛేదించే క్రమంలో దూకుడు కనబరుస్తూ జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. 48 పరుగులతో భారత్ ఓడినా... జాన్సన్ పై అతను విరుచుకుపడిన తీరు, ఎలాగైనా గెలవాలనే కసితో ఆడిన శైలి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సారథిగా అదరగొట్టే ఆట టెస్టు కెప్టెన్గా కోహ్లి ఎన్నో రికా ర్డులు నెలకొల్పాడు. 68 టెస్టుల్లో నాయకత్వం వహిస్తే అందులో 40 విజయాలు, 17 పరాజయాలు (విజయశాతం 58.82) మాత్రమే ఉన్నాయి. అయితే కెప్టెన్గా ఉన్నప్పుడు అతని ఆట మరింత ఎత్తుకు ఎదిగింది. సారథి కాని సమయంలో కోహ్లి బ్యాటింగ్ సగటు 41.13 కాగా... కెప్టెన్సీలో అది 54.80 కావడం అతనిపై ఎలాంటి నాయకత్వ భారం లేదని స్పష్టం చేసింది. కోహ్లి ఏకంగా 7 డబుల్ సెంచరీలతో ఏ కెప్టెన్కూ అందనంత ఎత్తులో నిలిచాడు. 99 టెస్టుల్లో కోహ్లి 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. -
కోహ్లిని మరోసారి అవమానించిన బీసీసీఐ.. 100వ టెస్ట్ యధాతథంగా..!
Srilanka Tour Of India: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని బీసీసీఐ మరోసారి అవమానించింది. కెరీర్లో అరుదైన మైలురాయిగా నిలిచే తన 100వ టెస్ట్ మ్యాచ్ని, ప్రత్యేక అనుబంధం ఉన్న బెంగళూరు(ఐపీఎల్) నగరంలో కాకుండా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మొహాలిలో నిర్వహించేందుకు మొగ్గు చూపింది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్ధనను మన్నించి, ముందుగా టీ20 సిరీస్కు అనుమితిచ్చిన బీసీసీఐ, కోహ్లికి చిరకాలం గుర్తుండిపోయే టెస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా కొనసాగించేందుకు రెడీ అయ్యింది. దీంతో అటు ఆర్సీబీ అభిమానులతో పాటు విరాట్ కోహ్లి కూడా తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కారణంగా విరాట్ కోహ్లికి బెంగళూరుతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్తో కలుపుకుని మొత్తం 15 సీజన్ల పాటు అతను నిరాటంకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు కోహ్లిలా ఒకే జట్టుకు ఆడింది లేదు. ఇదిలా ఉంటే, కోహ్లి వందో టెస్ట్ విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ కొద్ది రోజుల ముందే ఓ ప్రకటన చేశాడు. శ్రీలంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసైనా కోహ్లి మైలురాయి టెస్ట్ని బెంగళూరులో నిర్వహిస్తామని, అందులోనూ అది డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్ట్గా ఉంటుందని ప్రకటించాడు. అయితే, బీసీసీఐ తాజాగా వేదికల మార్పు అంశాన్ని పక్కన పెట్టి.. ముందుగా టీ20 సిరీస్ను ఆతర్వాత టెస్ట్ సిరీస్ను నిర్వహించాలని డిసైడ్ చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్ మార్చి 3 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రోహిత్ సారధ్యంలోని టీమిండియా.. వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ సేన.. విండీస్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు ప్రారంభంకానుంది. చదవండి: 4 Nation T20 Series: భారత్-పాక్ టీ20 సిరీస్పై జై షా కీలక ప్రకటన -
భారత్VSదక్షిణాఫ్రికా రెండో టెస్టు హైలెట్స్ ఫోటోలు
-
ఇంగ్లండ్ పోరాటం
బ్రిస్బేన్: కెప్టెన్ జో రూట్ (158 బంతుల్లో 86 బ్యాటింగ్; 10 ఫోర్లు), డేవిడ్ మలాన్ (177 బంతుల్లో 80 బ్యాటింగ్; 10 ఫోర్లు) వీరోచిత ఆటతీరుతో యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ కోలుకుంది. మ్యాచ్ మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రూట్, మలాన్ మూడో వికెట్కు 159 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు ఏకంగా 278 పరుగుల ఆధిక్యం కోల్పోయి పరాజయానికి బాటలు వేసుకున్నట్లు కనిపించిన ఇంగ్లండ్... ప్రస్తుతం మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. చేతిలో 8 వికెట్లతో చెప్పుకోదగ్గ పరుగులు సాధిస్తే చివరి ఇన్నింగ్స్లో ఆసీస్కు సవాల్ విసరవచ్చు. అర్ధ సెంచరీ చేసిన క్రమంలో రూట్ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్గా నిలిచాడు. మైకేల్ వాన్ (2002లో 1,481 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్ సవరించాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో రూట్ ఇప్పటికి 1,541 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 343/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 104.3 ఓవర్లలో 425 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (152; 14 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి వికెట్గా వెనుదిరిగాడు. -
సాజిద్ ఖాన్ మాయాజాలం.. కష్టాల్లో బంగ్లాదేశ్
ఢాకా: పాక్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/35) మాయాజాలంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 188/2తో బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్తాన్ 98.3 ఓవర్లలో 4 వికెట్లకు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బాబర్ ఆజమ్ (76; 9 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆలమ్ (50 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. -
పాకిస్తాన్కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు...
చిట్టగాంగ్: బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆట మూడో రోజు బౌలర్లు చెలరేగడంతో ఆదివారం ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. దాంతో ఇరు జట్లను గెలుపు ఊరిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో 4 వికెట్లకు 39 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (12 బ్యాటింగ్; 1 ఫోర్), యాసిర్ అలీ (8 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 145/0తో ఆటను ఆరంభించిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 115.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. పాక్ను తైజుల్ ఇస్లామ్ (7/116) దెబ్బ తీశాడు. మూడో రోజు తొలి ఓవర్లోనే అతడు అబ్దుల్లా షఫీక్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్లు), అజహర్ అలీ (0) వికెట్లను తీశాడు. ఓవర్నైట్ బ్యాటర్ ఆబిద్ అలీ (133; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీని పూర్తి చేశాడు. ఆబిద్ అలీని కూడా తైజుల్ అవుట్ చేయడంతో పాకిస్తాన్ పతనం ఆరంభమైంది. చదవండి: IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది! -
ఆరంగేట్ర మ్యాచ్లో మరో రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్..
Shreyas Iyer Registers Impressive Record On Kanpur Test: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో మరో రికార్డు సాధించాడు. భారత తరుపున ఆరంగేట్ర మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఈ మ్యాచ్లో రెండు ఇన్నిగ్స్లు కలిపి అయ్యర్ 170 పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 105, రెండో ఇన్నిగ్స్లో 65 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు డెబ్యూ టెస్ట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా ఆరంగేట్ర మ్యాచ్లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. -
India Vs Nz: మూడోరోజు ముగిసిన ఆట.. 63 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
India Vs Nz 1st Test Day 3 2021 Highlights Updates.. న్యూజిలాండ్, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 4, పుజారా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక గిల్ ఒక పరుగు చేసి జేమిసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఓవరాల్గా టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు టామ్ లాథమ్(95), విల్ యంగ్(89) మినహా మిగతావారు విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో మెరిశాడు. 4:15PM.. న్యూజిలాండ్ను 296 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్మన్ గిల్(1) కైల్ జేమీసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. కాగా జేమీసన్కు ఇది 50వ టెస్టు వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 1, పుజారా 4 పరుగులతో ఆడుతున్నారు. 4:00PM: న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. 142.3 ఓవర్లలో 296 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను పూర్తి చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్(95), విల్ యంగ్(89) అద్భుతంగా రాణించగా.. మిగతా ఆటగాళ్లెవరూ కనీసం 25 పరుగులు కూడా చేయలేదు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా... అశ్విన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఉమేశ్, జడేజా చెరో వికెట్ తీశారు. 3: 40 PM: మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో కైలీ జెమీషణ్ అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియం సోమర్విల్లే, అజాజ్ పటేల్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 284/9 న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కివీస్ ఆటగాడు టిమ్ సౌథీని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. విలియం సోమర్విల్లే, కైలీ జెమీషన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లలో అశ్విన్కు ఒకటి, ఉమేశ్ యాదవ్కు ఒకటి, అక్షర్ పటేల్కు 5, జడేజాకు ఒక వికెట్ దక్కాయి. విల్ యంగ్ను అశ్విన్ పెవిలియన్కు పంపడంతో వికెట్ల ఖాతా తెరిచిన టీమిండియా.. మొత్తంగా 8 వికెట్లు పడగొట్టింది. 3:32 PM: న్యూజిలాండ్ స్కోరు: 282/8 (136). 3:06 PM: ఎనిమిదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ 2:56 PM: న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 258 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన బ్లండెల్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 124 ఓవర్లు ముగిసేసరికి కీవిస్ 7వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం , కైలీ జెమీషన్, టిమ్ సౌథీ క్రీజులో ఉన్నారు. 2:50 PM: న్యూజిలాండ్ స్కోరు: 256/2 (123) 2:33 PM: భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోతోంది. 241 పరుగుల వద్ద కీవిస్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టామ్ బ్లండెల్, కైలీ జెమీషన్ క్రీజులో ఉన్నారు. 02:00 pm: 13 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండల్(4) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా కైల్ జామీసన్ క్రీజులోకి వచ్చాడు. 227 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 95 పరుగులు చేసిన లాథమ్.. అక్షర్ పటేల్ వేసిన అద్భుతమైన బంతికి లాథమ్ స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండల్(4), రచిన్ రవీంద్ర (5) పరుగులుతో క్రీజులో ఉన్నారు. ►అక్షర్ పటేల్ మరోసారి మాయ చేశాడు. అద్భుతమైన బంతితో కివీస్ బ్యాటర్ హెన్రీ నికోలస్ను పెవిలియన్కు పంపాడు. దీంతో.. న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్, చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ►కాన్పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రాస్ టేలర్.. వికెట్ కీపర్ కేఎస్ భరత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టామ్ లాథమ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా హెన్రీ నికోలస్ క్రీజులోకి వచ్చాడు. మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 64 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టామ్ లాథమ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 11:33 AM: న్యూజిలాండ్ స్కోరు: 197/2 (85.3). 11:15 AM: కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఓపెనర్ టామ్ లాథమ్ నిలకడగా ఆడుతున్నారు. 82 ఓవర్లు ముగిసే సరికి కివీస్ ఒక వికెట్ కోల్పోయి 192 పరుగులు చేసింది. న్యూజిలాండ్ స్కోరు- 192/1 (82) 10:46 AM: కేన్ విలియమ్సన్ 13 పరుగులు, ఓపెనర్ టామ్ లాథమ్ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 74 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 182. ఎట్టకేలకు టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. భారత బౌలర్లకు చుక్కలు చూపించిన న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్ట్యూట్గా వచ్చిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. విల్ యంగ్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో కివీస్ మొదటి వికెట్ కోల్పోయింది. 10:15 AM: న్యూజిలాండ్ స్కోరు: 152/1 (67) ► భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటను కీవిస్ ధాటిగా ఆరంభించింది. 63 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా న్యూజిలాండ్ 143 పరుగులు చేసింది. విల్ యంగ్ 85, టామ్ లాథమ్ 52 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ►భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి మెరుగైన స్థితిలో నిలిచిన న్యూజిలాండ్ మూడో రోజు ఆటమెదలు పెట్టింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. విల్ యంగ్ 75, టామ్ లాథమ్50 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత జట్టు: శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. చదవండి: IND vs NZ: క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు బాధ్యత ఉన్నోడు! -
దుమ్ము రేపిన కీవిస్ ఓపెనర్లు.. చేతులెత్తేసిన భారత బౌలర్లు
సొంతగడ్డపై భారత్కు ప్రపంచ చాంపియన్ న్యూజిలాండ్ నుంచి అనూహ్య ప్రతిఘటన... ఆశించిన రీతిలో రెండో రోజు బ్యాటింగ్లో భారీగా పరుగులు జోడించలేకపోయిన టీమిండియా ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. ముగ్గురు స్పిన్నర్లు కలిసి 41 ఓవర్లు వేసినా కివీస్ ఓపెనర్లు అదరకుండా, బెదరకుండా ఆడి ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. శనివారం ఎవరు పైచేయి సాధించి టెస్టును శాసిస్తారనేది చూడాలి. కాన్పూర్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్లో కివీస్ వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. విల్ యంగ్ (180 బంతుల్లో 75 బ్యాటింగ్; 12 ఫోర్లు), టామ్ లాథమ్ (165 బం తుల్లో 50 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 258/4తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (171 బంతుల్లో 105; 13 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీ పూర్తి చేసుకోగా... సౌతీ (5/69) చెలరేగాడు. రెండో రోజు 27.1 ఓవర్లు ఆడిన భారత్ మరో 87 పరుగులే జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది. సౌతీ జోరు... సీనియర్ బౌలర్ సౌతీ రెండో రోజు భారత్ను గట్టిగా దెబ్బ కొట్టాడు. భారత్ రెండో రోజు కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగు అతని ఖాతాలోనే చేరాయి. విరామం లేకుండా వేసిన తన 11 ఓవర్ల సుదీర్ఘ స్పెల్లో అతను పదునైన బంతులతో బ్యాటర్ల పని పట్టాడు. తన రెండో ఓవర్లోనే రవీంద్ర జడేజా (112 బంతుల్లో 50; 6 ఫోర్లు)ను బౌల్డ్ చేసిన అతను కొద్ది సేపటికే సాహా (1)ను కూడా పెవిలియన్ పంపించాడు. మరోవైపు అయ్యర్ మాత్రం దూకుడుగా ఆడాడు. జేమీసన్ బౌలింగ్లో పాయింట్ దిశగా ఆడి రెండు పరుగులు తీసిన అయ్యర్ 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సౌతీ తన వరుస ఓవర్లలో అయ్యర్, అక్షర్ పటేల్ (3)లను అవుట్ చేసి కెరీర్లో 13వసారి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ దశలో అశ్విన్ (56 బంతుల్లో 38; 5 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే అశ్విన్ను బౌల్డ్ చేసిన ఎజాజ్... ఇషాంత్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ ఆలౌటైంది. ఓపెనర్లు సూపర్... తక్కువ ఎత్తులో వస్తున్న బంతి, ఒక్కోసారి అనూహ్యమైన బౌన్స్, టర్న్... ఇలాంటి పిచ్పై భారత బ్యాట్స్మెన్ ఇబ్బంది పడిన చోట కివీస్ బ్యాటర్లకు కూడా సమస్య తప్పదనిపించింది. అయితే ఓపెనర్లు లాథమ్, యంగ్ దానిని తప్పుగా నిరూ పించారు. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా మన ముగ్గురు స్పిన్నర్లను వారు జాగ్రత్తగా ఆడిన తీరు కివీస్ పట్టుదలను చూపించింది. మన పేసర్లు తొలి 7 ఓవర్లు వేయగా... వాటిలో చివరి 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా రాలేదు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ నుంచే స్పిన్తో భారత్ దాడికి సిద్ధమైంది. అయితే ఈ వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. చూస్తుండగానే భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న యంగ్ బౌండరీలతో చెలరేగగా, లాథమ్ అండగా నిలిచాడు. టీ విరామానికి కివీస్ 72/0 వద్ద నిలిచింది. చివరి సెషన్లోనూ భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోగా... ప్రత్యర్థి ఓపెనర్లు దూసుకుపోయారు. 88 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి కాగా, 39వ ఓవర్లో పార్ట్నర్షిప్ వంద పరుగులకు చేరింది. చివర్లో లాథమ్ 157 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోగా, భారత బౌలర్లు ఎంత ప్ర యత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) బ్లన్డెల్ (బి) జేమీసన్ 13; గిల్ (బి) జేమీసన్ 52; పుజారా (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్ 35; శ్రేయస్ (సి) యంగ్ (బి) సౌతీ 105; జడేజా (బి) సౌతీ 50; సాహా (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 1; అశ్విన్ (బి) ఎజాజ్ 38; అక్షర్ (సి) బ్లన్డెల్ (బి) సౌతీ 3; ఉమేశ్ (నాటౌట్) 10; ఇషాంత్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (111.1 ఓవర్లలో ఆలౌట్) 345. వికెట్ల పతనం: 1–21; 2–82; 3–106; 4–145; 5–266; 6–288; 7–305; 8–313; 9–339; 10–345. బౌలింగ్: సౌతీ 27.4–6–69–5; జేమీసన్ 23.2–6–91–3; ఎజాజ్ 29.1–7–90–2; సోమర్ విలే 24–2–60–0; రచన్ రవీంద్ర 7–1–28–0. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 50; యంగ్ (బ్యాటింగ్) 75; ఎక్స్ట్రాలు 4; మొత్తం (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 129. బౌలింగ్: ఇషాంత్ శర్మ 6–3–10–0; ఉమేశ్ యాదవ్ 10–3–26–0; అశ్విన్ 17–5–38–0; జడేజా 14–4–28–0; అక్షర్ 10–1–26–0. -
బంగ్లాతో పాక్ టెస్టు... మ్యాచ్ ఆరంభానికి ముందు భూకంపం..
Earthquake hits Chattogram ahead of opening Test: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్26) ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఛటోగ్రామ్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అనుకున్న సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది. కాగా టీ20 సిరీస్లో పాకిస్తాన్ ఆతిథ్య బంగ్లాదేశ్ను వైట్ వాష్(0-3) చేసింది. దీంతో కనీసం టెస్ట్ సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మరో వైపు బంగ్లా టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న బంగ్లాదేశ్ 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్గానే! -
లంక స్పిన్నర్ల ప్రతాపం.. తొలి టెస్టులో వెస్టిండీస్ ఘోర పరాజయం
Sri Lanka Won By 187 Runs Vs West Indies 1st Test.. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ 160 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్స్లో క్రుమ్హా బానర్ 68 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. జోషువా డిసిల్వా 54 పరుగులు చేయగా.. మిగిలిన 8 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో సత్తా చాటగా.. లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 83 పరుగులతో మెరిసిన కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు నవంబర్ 29 నుంచి జరగనుంది. శ్రీలంక: తొలి ఇన్నింగ్స్ 308 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 191/4 వెస్టిండీస్: తొలి ఇన్నింగ్స్ 230 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 160 ఆలౌట్ -
తలకు బలంగా తగిలిన బంతి.. ఫీల్డ్లోనే కుప్పకూలాడు
Jeremy Solozano taken to hospital after blow to head.. వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్యరీతిలో గాయపడ్డాడు. ఆట తొలి సెషన్లో 24వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. రోస్టన్ చేజ్ వేసిన షార్ట్ డెలివరిని లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే షార్ట్లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జెరెమీ సోలోజానో హెల్మెట్కు తాకింది. అయితే షాట్ పవర్ఫుల్ కావడంతో హెల్మెట్ గ్రిల్స్ అదిరి తలకు బలంగా తాకింది. చదవండి: Tim Paine scandal: క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు దీంతో సోలోజానో ఫీల్డ్లోనే కిందపడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. కాసేపటికి ఫిజియో వచ్చి అతన్ని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా జెరెమీ సోలోజానోకు టెస్టుల్లో ఇదే డెబ్యూ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఘటనతో అటు లంక, విండీస్ క్రికెటర్లు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సోలోజానోను స్కానింగ్, వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో ఉంచారు. అతను తొందరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక మూడో సెషన్లో 61 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే 90, మాథ్యూస్ 1 బ్యాటింగ్ ఆడుతున్నారు. అంతకముందు పాతుమ్ నిస్సంక 56 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్ 🚨Injury Update 🚨 Debutant Jeremy Solozano was stretchered off the field after receiving a blow to his helmet while fielding. He has been taken to the hospital for scans. We are hoping for a speedy recovery 🙏🏽#SLvWI pic.twitter.com/3xD6Byz1kf — Windies Cricket (@windiescricket) November 21, 2021 Get Well soon Jeremy Solozano 🥺#SLvWI #SLvsWI #WIvSL pic.twitter.com/k5w2Zn7EFa — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 21, 2021 -
ఆఫ్ఘనిస్తాన్కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
Australia Postpone First Ever Test Match Against Afghanistan: ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. దేశంలో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా క్రికెట్పై నిషేధం కొనసాగితే టెస్టును రద్దు చేయాలని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లుఘా దేశ క్రికెట్ బోర్డును సూచించినట్లు సమాచారం. "ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందకే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత టెస్టు మ్యాచ్ను వాయిదా వేయాలాని నిర్ణయించకున్నాము. ఆఫ్ఘనిస్తాన్లో పురుషులు, మహిళల క్రికెట్ అభివృద్దికి ఆస్ట్రేలియా ఎప్పడూ కట్టుబడి ఉంటుంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ నబీ స్పందించాడు. ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది అని తెలిపాడు. "ఈ సంవత్సరం టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది, అయితే మ్యాచ్ వాయిదా మాత్రమే వేయబడింది. పూర్తిగా రద్దు కానుందున నేను సంతోషంగా ఉన్నాను" అని నబీ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్కు తృటిలో తప్పిన ప్రమాదం.. -
Ind Vs Eng: ఐదో మ్యాచ్ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా
-
టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా పాజిటివ్
-
ఆసీస్తో చారిత్రక సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
జింబాబ్వే లక్ష్యం 477
హరారే: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో జింబాబ్వే జట్టు పోరాడుతోంది. 477 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. బ్రెండన్ టేలర్ (92; 16 ఫోర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్ విజయం సాధించా లంటే చివరి రోజు ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 45/0తో శనివారం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ను 67.4 ఓవర్లలో 284/1 వద్ద డిక్లేర్ చేసింది. నజ్ముల్ (117 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్లు), షాద్మన్ ఇస్లామ్ (115 నాటౌట్; 9 ఫోర్లు) శతకాలు సాధించారు. -
పిచ్పై బంగ్లా బ్యాట్స్మెన్ డ్యాన్స్.. గొడవకు దిగిన జింబాబ్వే బౌలర్
హరారే: జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల మధ్య హరారే వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ తస్కిన్ అహ్మద్ పిచ్పై డ్యాన్స్ వేయడం ఈ గొడవ మొదలైంది. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి వేసిన బంతిని వికెట్ కీపర్కు వదిలేసిన తస్కిన్.. ఆ వెంటనే ఓ డ్యాన్స్ స్టెప్ వేశాడు. ఇది చూసిన ముజరబాని అతనిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు ఒకరి ముఖంలో మరొకరు కోపంగా చూసుకుంటూ మాటామాటా అనుకున్నారు. Now this is something! Muzarabani and Taskin get into each other's faces! 🎥 Rabbitholebd #ZIMvBAN #BANvZIM #Cricket pic.twitter.com/mJmR8QfpFI — Shihab Ahsan Khan (@shihabahsankhan) July 8, 2021 అయితే, ముజరబాని అలా రియాక్ట్ కావడానికి ఓ కారణం ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్.. ఓ దశలో 132 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే లిటన్ దాస్ (95), మహ్మదుల్లా (150), చివర్లో తస్కిన్ అహ్మద్ (75) అద్భుతంగా రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 468 పరుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా 9వ వికెట్కు మహ్మదుల్లాతో కలిసి తస్కిన్ 191 పరుగులు జోడించడం ముజరబాని జీర్ణించుకోలేకపోయాడు. దీనికి తోడు తస్కిన్ తనను అవమానించే విధంగా డ్యాన్స్ వేయడంతో ముజరబాని సహనాన్ని కోల్పోయాడు. ఓ దశలో ఇద్దరు ఆటగాళ్లు పిచ్పైనే కొట్టుకునేలా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 468 పరుగుల భారీ స్కోర్ చేయగా, ఆతిధ్య జట్టు సైతం ధీటుగానే బదులిస్తుంది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి జింబాబ్వే 2 వికెట్లు నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్(81), ఓపెనర్ మిల్టన్ షుంబా(41) రాణించగా, కెయిటానో(63), డియాన్ మయర్స్(21) క్రీజ్లో ఉన్నారు. -
ఎనిమిదో నెంబర్ ఆటగాడు అజేయ శతకం; బంగ్లా భారీస్కోరు
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ మహ్ముదుల్లా (150 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. దీంతో 294/8 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 126 ఓవర్లలో 468 పరుగుల వద్ద ఆలౌటైంది. మహ్ముదుల్లా, టెయిలెండర్ టస్కిన్ అహ్మద్ (75; 11 ఫోర్లు) తొమ్మిదో వికెట్కు 191 పరుగులు జోడించడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండవ అత్యధిక తొమ్మిదవ వికెట్ భాగస్వామ్యంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది. కైటనో (33 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
మ్యాగజైన్ స్టోరీ 17 June 2021
-
వన్డేల్లోనూ..టెస్టుల్లోనూ ‘తొలి’ ఘనత!
టీమిండియా, ఇంగ్లండ్ ఉమెన్ టీమ్స్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ద్వారా ఒక అరుదైన ఫీట్ నమోదు అయ్యింది. భారత బౌలర్ దీప్తి శర్మ అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) ద్వారా ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్ నటాలియా స్కివర్ను అవుట్ చేసింది. తద్వారా డీఆర్ఎస్ ద్వారా టెస్ట్ ఫార్మట్లో తొలి వికెట్ దక్కించుకున్న మొదటి ఇండియన్ బౌలర్గా 23 ఏళ్ల దీప్తి ఘనత సాధించింది. ఇక అరుదైన ఘటన ఏంటంటే.. గతంలో వన్డేల్లోనూ డీఆర్ఎస్ ద్వారా వికెట్ దక్కించుకున్న తొలి ఇండియన్ బౌలర్ కూడా దీప్తి శర్మనే కావడం విశేషం. ఇంకో ఖతర్నాక్ విషయం ఏంటంటే.. ఆ వికెట్ కూడా నాట్ స్కివర్దే కావడం. జూన్ 24, 2017న జరిగినే వన్డే మ్యాచ్లో దీప్తి, స్కివర్ను అవుట్ చేసి ఈ ఫీట్ దక్కించుకోగా, తాజాగా (జూన్ 16న) టెస్ట్ల్లోనూ ఆ ఘనత దక్కించుకుని అరుదైన ఫీట్ను తన సొంతం చేసుకుంది దీప్తి శర్మ. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ జర్నలిస్ట్ అన్నెషా ఘోష్ తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. ఇక ఈ క్రేజీ కో ఇన్సిడెంట్పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. డీ ఫర్ దీప్తి.. డీ ఫర్ డీఆర్ఎస్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో ఏకైక టెస్ట్ మ్యాచ్లో భాగంగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) India Women's first wicket in ODIs involving the use of the DRS was Nat Sciver, off Deepti Sharma's bowling (June 24, 2017). India Women's first wicket in Test cricket involving the use of the DRS was Nat Sciver, off Deepti Sharma's bowling (June 16, 2021).#ENGvIND #WWC17 — Annesha Ghosh (@ghosh_annesha) June 16, 2021 చదవండి: స్మృతి మంధాన ఆస్తుల విలువ ఎంతంటే.. -
సమరానికి సమయం...
ఇంగ్లండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఒకవైపు... దీని గురించి సుదీర్ఘ చర్చోపచర్చలు సాగుతుండగా మరోవైపు సౌతాంప్టన్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో భారత మహిళల జట్టు ప్రశాంతంగా తమ సన్నాహాలు కొనసాగిస్తోంది. పురుషుల టీమ్తో పాటే ప్రయాణించి ఒకేసారి ఇంగ్లండ్ చేరిన మహిళలు డబ్ల్యూటీసీ ఫైనల్కంటే రెండు రోజుల ముందుగానే మైదానంలోకి దిగబోతున్నారు. నేటి నుంచి ఆతిథ్య జట్టుతో మిథాలీ బృందం తలపడే ఏకైక టెస్టు మ్యాచ్కు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. భారత జట్టు తాము ఆడిన గత వరుస మూడు టెస్టుల్లో కూడా గెలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తే నాలుగో విజయంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. సీనియర్లపైనే భారం... భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా... అందరూ ఆడిన మ్యాచ్లు కలిపి 30 మాత్రమే. వన్డే, టి20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. పైగా వీరందరూ కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా నాలుగు రోజుల మ్యాచ్లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత సీనియర్లే మ్యాచ్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి. బ్యాటింగ్లో మిథాలీ కీలకం కానుంది. ఆమె బలమైన డిఫెన్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోగలదు. అయితే జులన్ చాలా కాలంగా బౌలింగ్లో సుదీర్ఘ స్పెల్లు వేయలేదు కాబట్టి ఎలా ఆడుతుందనేది చూడాలి. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. క్రీజ్లో కాస్త ఓపిక ప్రదర్శించి ఎక్కువ సమయం క్రీజ్లో గడపగలిగితే వీరిద్దరు పరుగులు రాబట్టగల సమర్థులు. దీప్తి శర్మ ఆల్రౌండ్ నైపుణ్యంతో పాటు ఓపెనర్గా పూనమ్ రౌత్ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. స్పిన్నర్గా పూనమ్ యాదవ్కు కూడా తన సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. పేసర్లలో శిఖా పాండే, అరుంధతి రెడ్డిలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. అన్నింటికి మించి అందరి దృష్టి ఉన్న బ్యాటర్ షఫాలీ వర్మ. టి20లు మినహా కనీసం వన్డేల అనుభవం కూడా లేని షఫాలీని టెస్టులోకి ఎంపిక చేసింది ఆమె దూకుడైన ఆట కారణంగానే. షఫాలీ చెలరేగితే భారత్ పైచేయి సాధించగలదు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్కు ముందు భారత్కు ఆశించినంత ప్రాక్టీస్ లభించలేదు. అయితే పరిమిత వనరులతోనే మెరుగ్గా ఆడగలమని జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అనుభవజ్ఞులతో... 15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా దాదాపుగా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్రౌండర్ బ్రంట్లకు తమకంటూ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్సోల్, కేట్ క్రాస్లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్నెస్పరంగా కూడా వీరంతా మన జట్టు సభ్యులతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో నేను చాలా తక్కువ టెస్టులే ఆడాననేది వాస్తవం. అయితే ఫార్మాట్ ఏదైనా సన్నాహాలు మాత్రం ఒకే తరహాలో ఉం టాయి. మేం అలాగే సిద్ధమయ్యాం. ఈ క్రమం లో అనేక మంది ఇతర క్రికెటర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాం. జట్టులోని జూనియర్ సహచరులకు కూడా టెస్టులు ఎలా ఆడాలనేదాని గురించి మేం చెప్పాం. చాలా మందికి కొత్త కాబట్టి అనవసరపు ఒత్తిడి పెంచుకోవద్దని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్ను ఆస్వాదించాలని చెప్పాం. మున్ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్లలో తప్పనిసరిగా కనీసం ఒక టెస్టు ఉంటే బాగుంటుందనేది నా సూచన. –మిథాలీ రాజ్, భారత కెప్టెన్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్కు 10 రోజులు బర్మింగ్హమ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరిగే తేదీల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి. ఆగస్టు వరకు లీగ్ మ్యాచ్లు, ఆగస్టు 6న సెమీఫైనల్ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్తో పాటు మూడో స్థానం కోసం పోరు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా... ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఒకే వెస్టిండీస్ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్, 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తాయి. -
Cricket History: మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున ఏం జరిగిందంటే..?
టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడేళ్ల కిందట ఇవాల్టి రోజున మహాద్భుతం జరిగింది. 2018 జూన్ 15న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో 119 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్లో ఒకే రోజులో ఏకంగా 24 వికెట్లు పడ్డాయి. దీంతో ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ రికార్డును 119 సంవత్సరాల తర్వాత టీమిండియా తిరగరాసింది. ఈ మ్యాచ్లో రహానే నేతృత్వంలోని భారత్.. తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్(103), శిఖర్ ధవన్(107) సూపర్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్లో ధవన్ పేరిట ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్ట్ క్రికెట్లో భోజనానికి ముందే సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా ధవన్ రికార్డు నెలకొల్పాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్(54), హార్దిక్ పాండ్యా(71) అర్ధశతకాలు సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 154 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. ఆఫ్ఘన్ జట్టులో మహ్మద్ నబీ అత్యధికంగా 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి రెండో ఇన్నింగ్స్లనూ మారలేదు. జడేజా(4), ఉమేశ్ యాదవ్(3) విజృంభించడంతో ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్.. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. చదవండి: నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు -
వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్లకు సమాన పాయింట్లు
దుబాయ్: రాబోయే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో సిరీస్ ప్రకారం కాకుండా ఒక్కో టెస్టు మ్యాచ్ విజయానికి పాయింట్లు కేటాయించాలని ఐసీసీ యోచిస్తోంది. తొలి డబ్ల్యూటీసీలో ఒక్కో సిరీస్కు ఐసీసీ 120 పాయింట్లు ఇచ్చింది. మూడు టెస్టుల సిరీస్ అయితే ఒక్కో టెస్టు విజయానికి 40 పాయింట్లే దక్కేవి. అదే రెండు టెస్టుల సిరీస్ అయితే ప్రతీ గెలుపునకు జట్టు ఖాతాలో 60 పాయింట్లు చేరాయి. దీనిని సరిదిద్దేందుకు సిరీస్లో ఎన్ని మ్యాచ్లు ఉన్నా... ఒక్కో టెస్టుకు విడిగా పాయింట్లు కేటాయిస్తే అన్ని జట్లకు సమాన అవకాశం ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. -
97 పరుగులకే ఆలౌట్.. చెత్త రికార్డు నమోదు
జోహెన్నెస్బర్గ్: వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గురువారం గ్రాస్ ఐలెట్లో ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 97 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై విండీస్కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్ జేసన్ హోల్డర్ (20) టాప్ స్కోరర్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఇన్గిడి కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ఆన్రిచ్ నోర్జే 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలిరోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. మక్రమ్ 60 పరుగులు చేసి ఔట్ కాగా.. ప్రస్తుతం వాండర్ డుసెన్ 34, క్వింటన్ డికాక్ 4 పరుగులతో ఆడుతున్నారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు తీశాడు. చదవండి: కెప్టెన్గా గబ్బర్.. వైస్కెప్టెన్గా భువీ అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్గా.. ఎడ్జ్బాస్టన్: న్యూజిలాండ్తో బర్మింగ్హామ్లో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (81) టాప్ స్కోరర్గా నిలవగా, డాన్ లారెన్స్ (67 బ్యాటింగ్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎజాజ్, బౌల్ట్, హెన్రీతలా 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ద్వారా అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ (162)గా పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గుర్తింపు పొందాడు. అలిస్టర్ కుక్ (161)ను అతను అధిగమించాడు. చదవండి: కోహ్లి నా దగ్గరికి వచ్చేవరకు ప్లాన్స్ చెప్పను: రహానే -
లార్డ్స్ మైదానంలో టీమిండియా తొలి విజయం.. నేటితో 35 ఏళ్లు
చాలా మంది క్రికెటర్లు లార్డ్స్ క్రికెట్ స్టేడియాన్ని దేవాలయంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్ మైదానంలో ఆడలాని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు. కాగా ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 35 సంవత్సరాల క్రితం 1986 లో ఈ రోజున తొలి విజయాన్ని నమోదుచేసుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా అతిథ్య ఇంగ్లండ్ జట్టుపై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కపిల్దేవ్ ఫీల్డింగ్ను ఎంచుకోగా, బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్సింగ్స్లో 294 పరుగులకు ఆలౌట్ అవ్వగా , రెండో ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. ఇంగ్లండ్ జట్టులో తొలి ఇన్సింగ్స్లో గ్రహమ్ గూచ్ 114 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 341 పరుగులను చేయగా రెండో ఇన్సింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులను చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో క్రీజులోకి వచ్చిన కపిల్దేవ్ కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్కు లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం వరించింది. ఈ మ్యాచ్లో కపిల్ దేవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైయ్యాడు టీమిండియా నుంచి తొలి ఇన్నింగ్స్లో దిలీప్ వెంగ్సర్కార్ 126 పరుగులు చేశాడు. లార్డ్స్లో తొలి విజయాన్నిఅందుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్తో అతిథ్య ఇంగ్లండ్ జట్టును ముప్ఫుతిప్పలు పెట్టారు. కపిల్ దేవ్ కెప్టెన్సీలో రోజర్ బిన్నీ, చేతన్ శర్మ, మొహిందర్ అమర్నాథ్, రవిశాస్త్రి, మనీందర్ సింగ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, దిలీప్ వెంగ్సర్కార్, మహ్మద్ అజారుద్దీన్ భారత జట్టు తరపున ఆడారు. ప్రస్తుత టీమిండియా జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్దమౌతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: WTC Final : లెజెండ్తో నేను సిద్ధంగా ఉన్నా -
ఐదు వికెట్లు తీస్తావన్నాడు, అలాగే జరిగింది..
ముంబై: తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి తనను ఓదార్చడమే కాకుండా, కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని తనలో ధైర్యం నింపాడని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆ బాధాకర సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్తో కలిసి రవి సర్ తనకు అండగా నిలిచారని, వారే లేకపోయుంటే ఆసీస్ పర్యటన నుంచి వైదొలిగేవాడినని చెప్పుకొచ్చాడు. తండ్రి మరణవార్త తెలియగానే విరాట్ భాయ్ తనను కౌగిలించుకుని ఓదార్చడని, కోచ్ రవి సర్ ఆ సమయంలో తనతో మాట్లాడిన మాటలను జీవితాంతం మర్చిపోలేనని వెల్లడించాడు. "నువ్వు దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలని నీ తండ్రి కలగన్నాడని, ఆ అవకాశం ఇప్పుడు నీకు వచ్చిందని, ఈ సమయంలో నీ తండ్రి లేకపోయినా అతని ఆశీర్వాదం నీతో ఉంటుందని" ఆయన నాలో స్పూర్తిని రగిల్చారని గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసాక రవి సర్ తనను ప్రశంసలతో ముంచెత్తిన విషయాన్ని తలచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం లండన్కు బయల్దేరిన సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా నవంబర్ 20న తండ్రిని కోల్పోయాడు. క్వారంటైన్ ఆంక్షలు ఉండటం, టెస్ట్ క్రికెట్ ఆడాలన్న తండ్రి కల నెరవేర్చేండం కోసం అతడు అక్కడే ఉండిపోయి, తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరు కాలేకపోయాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు దుఃఖాన్ని దిగ మింగి బరిలోకి దిగిన ఈ హైదరబాదీ క్రికెటర్కు, ఆసీస్తో టెస్ట్ సిరీస్ మరపురాని అనుభూతులను మిగిల్చింది. చదవండి: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. -
SL Vs BAN: ప్రవీణ్ సంచలనం.. శ్రీలంక ఘన విజయం
పల్లెకెలె: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక క్రికెట్ జట్టు 209 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 1–0తో సొంతం చేసుకుంది. 437 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 177/5తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 23 ఓవర్లు ఆడి మరో 50 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన శ్రీలంక అరంగేట్రం స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ రెండో ఇన్నింగ్స్లో 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్గా అతను ఈ మ్యాచ్లో 178 పరుగులిచ్చి 11 వికెట్లు తీసుకొని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. రెండు టెస్టుల్లో కలిపి మొత్తం 428 పరుగులు చేసిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. చదవండి: పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా.. -
ZIM Vs PAK: రెచ్చిపోయిన హసన్ అలీ, పాక్ ఘనవిజయం
హరారే: మీడియం పేస్ బౌలర్ హసన్ అలీ (5/36) హడలెత్తించడంతో... జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 116 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 374/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 133 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్ ఆలమ్ (140; 20 ఫోర్లు) తన ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో 32 పరుగులు జోడించి చివరి వికెట్గా పెవిలియన్ చేరుకున్నాడు. హసన్ అలీ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి ఫవాద్ ఆలమ్ ఏడో వికెట్కు 61 పరుగులు జోడించాడు. 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో తరిసాయ్ మసకందా (43; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ ఐదు వికెట్లు, నౌమాన్ అలీ రెండు వికెట్లు తీశారు. హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. రెండో టెస్టు ఈనెల 7 నుంచి హరారేలోనే జరుగుతుంది. చదవండి: T20 World Cup: వేదిక మారినా హక్కులు మావే! -
ZIM Vs PAK: ఫవాద్ ఆలమ్ అజేయ సెంచరీ
హరారే: మిడిలార్డర్ బ్యాట్స్మన్ ఫవాద్ ఆలమ్ (155 బంతుల్లో 108 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ పటిష్ట స్థితికి చేరుకుంది. ఓవర్నైట్ స్కోరు 103/0 తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 374 పరుగులు సాధించింది. ప్రస్తుతం పాకిస్తాన్ 198 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓపెనర్లు ఇమ్రాన్ బట్ (91; 7 ఫోర్లు), ఆబిద్ అలీ (60; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి తొలి వికెట్కు 115 పరుగులు జత చేశారు. అదే విధంగా.. అజహర్ అలీ (36; 5 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (45; 4 ఫోర్లు) కూడా రాణించారు. కెరీర్లో నాలుగో టెస్టు సెంచరీ చేసిన ఫవాద్ ఆలమ్తో కలిసి ప్రస్తుతం హసన్ అలీ (21 బ్యాటింగ్; ఫోర్, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్ తిరిపానో మూడు వికెట్లు తీసుకున్నాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు Covid-19: ధావన్ రూ. 20 లక్షలు, ఉనాద్కట్ 30 లక్షలు ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
SL vs BAN: శ్రీలంక భారీ స్కోరు
పల్లెకెలె: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. ఆట రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 291/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక శుక్రవారం వెలుతురు మందగించి ఆట నిలిపి వేసే సమయానికి 155.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 469 పరుగులు సాధించింది. వెలుతురులేమి కారణంగా రెండో రోజు కేవలం 65.5 ఓవర్ల ఆట సాధ్యపడింది. ఓపెనర్ తిరిమన్నె (140; 15 ఫోర్లు) తన ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించి అవుటయ్యాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో వన్డౌన్ బ్యాట్స్మన్ ఒషాడా ఫెర్నాండో (81; 8 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం నిరోషన్ డిక్వెలా (64 బ్యాటింగ్; 7 ఫోర్లు), రమేశ్ మెండిస్ (22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. చదవండి: పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా.. -
పదేళ్ల తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలిసారిగా..
పల్లెకెలె: బంగ్లాదేశ్తో ఆరంభమైన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంకను ఓపెనర్లు దిముత్ కరుణత్నే (190 బంతుల్లో 118, 15 ఫోర్లు), లహిరు తిరిమన్నె (253 బంతుల్లో 131 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీలతో ముందుకు నడిపించారు. దాంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో వికెట్ నష్టపోయి 291 పరుగులు చేసింది. కరుణరత్నే, తిరిమన్నె తొలి వికెట్కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2011 తర్వాత శ్రీలంక ఓపెనర్లు నెలకొల్పిన తొలి డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఇదే. కాగా... స్వదేశంలో 21 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం విశేషం. కరుణరత్నే 165 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో అతడికిది 12వ శతకం. అంతేకాకుండా టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అతను అందుకున్నాడు. మరో ఓపెనర్ తిరిమన్నె 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆటలో 90 ఓవర్ల పాటు చెమటోడ్చిన బంగ్లాదేశ్ బౌలర్లు కేవలం కరుణరత్నే వికెట్తోనే సంతృప్తి పడ్డారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఒషాడా ఫెర్నాండో (98 బంతుల్లో 40 బ్యాటింగ్; 4 ఫోర్లు) కూడా కుదురుగా ఆడాడు. ఫెర్నాండోతో కలిసి తిరిమన్నె అభేద్యమైన రెండో వికెట్కు 82 పరుగులు జోడించాడు. చదవండి: కరుణరత్నే అజేయ డబుల్ సెంచరీ -
ఏడేళ్ల విరామం తర్వాత... తొలి టెస్టు..
లండన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భారత జట్టుకు టెస్టు మ్యాచ్ ఆడే భాగ్యం లభించింది. ఈ ఏడాది జూన్–జూలైలలో భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ సహా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 8న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈ ఏడాది భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడుతుందని ప్రకటించారు. అయితే ఆ రోజు ఆయన వేదిక, తేదీని వెల్లడించలేదు. కాగా సోమవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత మహిళల పర్యటన వివరాలను ప్రకటించింది. జూన్ 16 నుంచి 19 వరకు (నాలుగు రోజులు) బ్రిస్టల్ మైదానంలో ఇంగ్లండ్, భారత మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు జరుగుతుందని ఈసీబీ తెలిపింది. భారత మహిళల జట్టు టెస్టు మ్యాచ్ ఆడి ఏడేళ్లయింది. చివరిసారి భారత జట్టు 2014 నవంబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు ఆడి ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఇంగ్లండ్ జట్టుతో భారత్ 2014 ఆగస్టులో చివరిసారి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల జట్టు మొత్తం ఎనిమిది టెస్టులు ఆడి ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా, మిగతా ఆరు టెస్టులను ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఓవరాల్గా భారత జట్టు 1976 నుంచి 2014 వరకు మొత్తం 36 టెస్టులు ఆడి 5 మ్యాచ్ల్లో గెలిచి, ఆరింటిలో ఓడి, 25 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించింది. చదవండి: మరోసారి విలియమ్సన్కే... ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా భువీ.. -
కావాలనే బౌండరీ లైన్ తొక్కాడు..
అబుదాబి: అప్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్ఘన్ ఆటగాడు హస్మతుల్లా షాహిది చేసిన తప్పిదం జింబాబ్వే జట్టుకు ఒక అదనపు పరుగు వచ్చేలా చేసింది. విషయంలోకి వెళితే.. మూడో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఆడుతుంది. క్రీజులో సికందర్ రజా 79, ముజరబనీ 0 పరుగులతో ఉన్నారు. ఇన్నింగ్స్ 90వ ఓవర్ చివరి బంతిని షిర్జాద్ యార్కర్ వేయగా.. రజా దానిని కవర్స్ దిశగా ఆడాడు. కవర్స్లో ఉన్న హస్మతుల్లా బంతిని అందుకొని బౌండరీ లైన్ ఆవల తన పాదాన్ని ఉంచాడు. రూల్ ప్రకారం ఒక ఆటగాడు బంతి చేతిలో ఉండగా బౌండరీ లైన్ దాటితే.. దానిని ఫోర్గా భావిస్తారు. కానీ ఇక్కడ హస్మతుల్లా కావాలనే అలా చేశాడని వీడియోలో కనిపించింది. ఆఖరి బంతికి సింగిల్ లేదా మూడు రన్స్ వస్తే రజా స్ట్రైక్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన హస్మతుల్లా రజాకు స్ట్రైక్ రాకూడదనే ఉద్దేశంతో.. తర్వతి ఓవర్లో స్ట్రైకింగ్కు వచ్చే ముజరబనీ ఔట్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐసీసీ నిబంధనల్లోని రూల్ 19.8 ప్రకారం.. స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మన్ ఆడిన షాట్ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఒక పరుగు ఇస్తారు. అలా జింబాబ్వే జట్టుకు అదనపు పరుగు రావడంతో పాటు.. తదుపరి ఓవర్లో రజా స్ట్రైక్లోకి వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రజా ఔట్ కావడంతో జింబాబ్వే 287 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్లో పడింది. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామం ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లెర్ చేసింది. చదవండి: పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్ -
ఏడేళ్ల విరామం తర్వాత...
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు చివరిసారి 2014 నవంబర్లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఇంకా చెప్పాలంటే 1976 నుంచి మన మహిళల జట్టు ఆడిన టెస్టుల సంఖ్య 36 మాత్రమే. వన్డేలు, ఆ తర్వాత టి20ల హోరులో మహిళల టెస్టు అనేదే వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు సుమారు ఏడేళ్ల విరామం తర్వాత మన జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. రాబోయే జూన్/జూలైలో భారత జట్టు ఇంగ్లండ్తో వారి గడ్డపై ఏకైక టెస్టు మ్యాచ్లో తలపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంతోషకర విషయాన్ని వెల్లడిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు. ఇంగ్లండ్ టీమ్ స్వదేశీ సీజన్ షెడ్యూల్పై మరింత స్పష్టత వచ్చిన తర్వాత టెస్టు మ్యాచ్ తేదీలు ఖరారవుతాయి. 2014లో మైసూరులో దక్షిణాఫ్రికాతో తమ చివరి టెస్టు ఆడిన భారత్ ఇన్నింగ్స్, 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో మహిళల టెస్టులు దాదాపుగా అంతరించిపోయాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే అప్పుడప్పుడు ఈ సంప్రదాయ ఫార్మాట్లో ఆడుతున్నాయి. 2015 ఆగస్టు నుంచి 6 టెస్టులు మాత్రమే జరగ్గా... ఇవన్నీ ఆసీస్, ఇంగ్లండ్ మధ్యే నిర్వహించారు. -
అదే నాకు కోహ్లి చెప్పాడు: సిరాజ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో చివరిదైన నాల్గో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మెరిశాడు. జో రూట్, బెయిర్ స్టోలను ఎల్బీగా ఔట్ చేసి బౌలింగ్లో సత్తా చాటాడు. ఈ ఇద్దరికి తక్కువ ఎత్తులో బంతులు వేసిన సిరాజ్.. వారిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి రోజు ఆట తర్వాత సిరాజ్ మాట్లాడుతూ.. ఇదొక బ్యాటింగ్ వికెట్ అని, తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ను తొలి రోజు ఆలౌట్ చేశామన్నాడు. ఎంతో సహనంతో ఓపిగ్గా బౌలింగ్ వేసి ఇంగ్లండ్పై పైచేయి సాధించామన్నాడు. ‘ ఇది బ్యాటింగ్ వికెట్. బ్యాట్పైకి బంతి మంచిగా వస్తుంది. కానీ బౌలింగ్లో మా వ్యూహాలు అమలు చేసి ఇంగ్లండ్ను ఆలౌట్ చేశాం. పదే పదే ఒకే స్పాట్లో బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇబ్బందిపడి వికెట్లు సమర్పించుకున్నారు. నాకు కోహ్లి భయ్యా ఒకటే చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు ఇద్దరే ఉన్న సంగతిని గుర్తుచేశాడు. మీ ఇద్దరూ(ఇషాంత్) ఫాస్ట్ బౌలింగ్ రొటేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. నేను రిలయన్స్ ఎండ్ నుంచి బౌలింగ్ చేయడం ప్రారంభించా. అదనపు బౌన్స్ రావడాన్ని గమనించా. ఇది బౌలర్లకు లాభిస్తుందని అనుకున్నా. నేను ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కానీ ఇక్కడ ఆడుతున్నప్పుడు కానీ ప్రతీ బంతిని వంద శాతం కచ్చితత్వంతో వేయాలనే చూస్తున్నా. నేను నా ప్రణాళిక అమలు చేసినప్పుడు అది ఒత్తిడి నుంచి బయటపడటానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు కూడా నా ప్లాన్ను అమలు చేశా. ఇక స్టోక్స్ నాతో వాగ్వాదానికి దిగినప్పుడు కోహ్లి హ్యాండిల్ చేసిన విధానం బాగుంది’ అని సిరాజ్ తెలిపాడు. వారిద్దర్నీ ప్లాన్ చేసి ఔట్ చేశా.. ఇక రూట్, బెయిర్ స్టోలను ఔట్ చేయడం ఒక వ్యూహం ప్రకారమే జరిగిందన్నాడు. ‘ రూట్ కోసం ప్రత్యేకంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేయాలని ప్లాన్ చేశా. అలా చేసి ఒక బంతిని ఇన్స్వింగర్గా వేయాలనుకున్నా. ఈ వ్యూహం ఫలించింది. ఇక బెయిర్ స్టోకు ఔట్ చేయడానికి అతనికి సంబంధించి కొన్ని వీడియోలు చూశా. ఇన్స్వింగ్కు ఔటయ్యే విషయాన్ని గ్రహించా. అదే లెంగ్త్తో బంతులు వేసి సక్సెస్ అయ్యా’ అని తెలిపాడు. ఇక్కడ చదవండి: ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా? నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్ మధ్య వాగ్వాదం! -
జింబాబ్వే అద్భుతం.. రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్
దుబాయ్: ఆఫ్గనిస్తాన్తో జరిగిన మొదటి టెస్టులో జింబాబ్వే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్గనిస్తాన్ను రెండు సార్లు ఔట్ చేసిన జింబాబ్వే రెండు రోజుల్లోనే మ్యాచ్ను సొంతం చేసుకుంది. కాగా చాలాకాలం తర్వాత టెస్టుల్లో జింబాబ్బే చెప్పుకోదగ్గ విజయం సాధించడం విశేషం. మొదటి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ తొలి ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కెప్టెన్ సీన్ విలియయ్స్ (105 పరుగులు) సెంచరీతో ఆకట్టుకోవడం.. రజా 43, చకాబ్వా 44 పరుగులతో అతనికి సహకరించారు. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులకు ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్లో 119 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం ఆఫ్గన్.. జింబాబ్వే బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 17 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించిన జింబాబ్వే అద్బుత విజయాన్ని నమోదు చేసి రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవరాల్గా రెండో రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలడం విశేషం. అయితే మొటేరా వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కూడా రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. చదవండి: దుమ్మురేపిన కాన్వే.. రాహుల్ మాత్రం అక్కడే 'మ్యాచ్ను 5 రోజుల వరకు తీసుకెళ్లలేం' -
ఈ పిచ్లోనూ అంతే.. టెస్ట్ మ్యాచ్ ఇక..
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగే చివరి టెస్టులోనూ స్పిన్కు బాగా అనుకూలించే పిచ్నే టీమిండియా కోరుకుంటోంది. గత రెండు టెస్టుల తరహాలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు ఇది సరైన వ్యూహమని భావిస్తోంది. భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి. నాలుగో టెస్టులో కూడా స్పిన్ పిచ్ ఎదురవుతుందని, అంతా సన్నద్ధంగా ఉండాలని రహానే పిలుపునిచ్చాడు. ‘నాకు తెలిసి రెండో, మూడో టెస్టుల్లో ఎలాంటి పిచ్పై ఆడామో ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పిచ్ సిద్ధమవుతోంది. కచ్చితంగా అది స్పిన్కు అనుకూలిస్తుంది. గత మ్యాచ్లో గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్ పిచ్లపై నేరుగా లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్మన్ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ లేదా బ్యాక్ ఫుట్ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్ పిచ్పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు’ అని రహానే విశ్లేషించాడు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఇంగ్లండ్ జట్టును తాము తక్కువగా అంచనా వేయడం లేదని అతను స్పష్టం చేశాడు. మరోవైపు స్పిన్ పిచ్లపై ఇంగ్లండ్ మీడియా నుంచి వస్తున్న విమర్శలకు కూడా రహానే సమాధానమిచ్చాడు. ‘ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్ పిచ్ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు’ అని రహానే వ్యాఖ్యానించాడు. -
మహిళా క్రికెటర్తో ట్వీటర్ క్లాష్: ఈసీబీ వార్నింగ్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ రోరీ బర్న్స్కు ఈసీబీ వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్లీ సరదాగా చేసిన ట్వీట్ను సీరియస్గా తీసుకున్న బర్న్స్ అందుకు ఆమెతో ట్వీటర్ వేదికగా వాదనకు దిగాడు. దీనిపై ఈసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్ చేసిన ట్వీట్పై అంతలా స్పందించాల్సిన అవసరం లేదని బర్న్స్కు తెలిపింది. ఈ క్రమంలోనే అతనికి మందలింపుతో సరిపెట్టింది. ఈ తరహా ఘటనలు మళ్లీ రిపీట్ కాకూడదని భారత్ పర్యటనలో ఉన్న ఆ జట్టు మేనేజ్మెంట్కు స్పష్టం చేసింది. దాంతో బర్న్స్ ఆ ట్వీట్ను వెంటనే తొలగించాడు. ఇక్కడ చదవండి: కీలకమైన నాల్గో టెస్టుకు బుమ్రా దూరం వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్ మహిళలు, న్యూజిలాండ్ మహిళల మధ్య జరిగిన సెకండ్ వన్డేను ఉద్దేశించి అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ బెడిసి కొట్టింది. ‘బాగుంది అబ్బాయిలు.. న్యూజిలాండ్ మహిళల మ్యాచ్ ప్రారంభానికి ముందే టెస్ట్ మ్యాచ్ను పూర్తి చేయడం బాగుంది'అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై రోరీ బర్న్స్ సైతం తీవ్ర అభంతరం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్కు మద్దతు లభించేందుకు తాము ఓడిపోవాలనుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నాడు. ‘అబ్బాయిలందరూ మహిళల క్రికెట్కు మద్దతు ఇవ్వడానికి ఇది నిరాశపరిచే వైఖరి'అంటూ హార్ట్లీ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశాడు. ఇక రోరీ బర్న్స్ ట్వీట్ను బెన్ స్టోక్స్తో సహ జేమ్స్ అండర్సన్ లైక్ చేయడం గమనార్హం. భారత్తో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన మ్యాచ్ మరుసటిరోజు ఇంకా పూర్తి కాకుండానే ముగిసింది. కాగా, ఇంగ్లండ్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను ఇంకా వన్డే మిగిలి ఉండగానే ఇంగ్లండ్ మహిళల జట్టు కైవసం చేసుకుంది. -
పేసర్లకు పండగేనా?
-
మూడో టెస్టు: మొటెరా స్టేడియం విశేషాలు ఎన్నో..
భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారంనుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్తో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న మొటెరా మైదానం తొలి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటివరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటాన్ని ప్రేక్షకులు ఒక అదృష్టంగా భావిస్తుండగా, ఇప్పుడు భారత అభిమానులకు కూడా మన ‘ఎంసీజీ’లో అలాంటి ‘లక్ష’ణమైన అవకాశం దక్కనుంది. పైగా ఈ టెస్టు మ్యాచ్ పింక్ బంతులతో జరిగే డే అండ్ నైట్ టెస్టు కావడంతో మైదానం మరింత వెలుగులు విరజిమ్మనుంది. సాక్షి క్రీడా విభాగం ‘సర్దార్ పటేల్ స్టేడియం’గా కూడా పిలిచే మొటెరా మైదానంలో 1983 నవంబర్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. సునీల్ గావస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్దేవ్ తన 432వ వికెట్ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది. 2006 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో దీనిని ఆధునీకరించారు. 2011 ప్రపంచకప్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్కు వేదికైన ఈ గ్రౌండ్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ 2012 డిసెంబర్లో జరిగింది. 2015లో దీనిని పూర్తిగా పునాదులనుంచి కూలగొట్టి కొత్త స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గత ఏడాది ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ ఇక్కడే జరగ్గా, ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లతో తొలిసారి క్రికెట్ పోటీలకు గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు తొలిసారి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమైంది. మొటెరా స్టేడియం విశేషాలు చూస్తే.. ► స్టేడియం సామర్థ్యం 1 లక్షా 10 వేలు ► నిర్మాణ వ్యయం సుమారు రూ. 678 కోట్లు ► (ఎల్ అండ్ టీ సంస్థ) ► మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది ► అవుట్ ఫీల్డ్ పరిమాణం ► 180 గజాలు X 150 గజాలు ► 6 ఇండోర్, 3 అవుట్డోర్ ప్రాక్టీస్ పిచ్లు, జిమ్ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్ రూమ్లు ► 40 మందికి వసతి కల్పిస్తూ ► ఇండోర్ క్రికెట్ అకాడమీ ► 76 కార్పొరేట్ బాక్స్లు ► స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు. ఇతర మైదానాల తరహాలో ఫ్లడ్ లైట్లు వాడకుండా పైకప్పు కింది భాగంనుంచి వరుసగా లైట్లను అమర్చారు. ► ప్రేక్షకులకు అన్ని వైపులనుంచి స్పష్టమైన ‘వ్యూ’ ఉండే విధంగా ఇంత పెద్ద మైదానంలో ఒక్క పిల్లర్ కూడా లేకుండా కొత్త టెక్నాలజీతో నిర్మించడం విశేషం. ► ప్రధాన గ్రౌండ్లో 11 పిచ్లు ఉన్నాయి. ► 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా వెంటనే ఆట కోసం సిద్ధం చేసే అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ► ఒకేసారి స్టేడియం పరిసరాల్లో కనీసం 60 వేల మంది స్వేచ్ఛగా తిరగగలిగే విధంగా ప్రత్యేక ర్యాంప్లు ఏర్పాటు చేశారు. ► 3 వేల కార్లు, 10 వేల ద్విచక్రవాహనాల పార్కింగ్ సౌకర్యం -
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు ఫోటోలు
-
Ind Vs Eng Highlights: అశ్విన్ విజృంభణ: ఇంగ్లండ్ ఆలౌట్
చెన్నై: టీమిండియాతో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ 419 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బర్న్స్, సిబ్లే, స్టోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర్చర్, అండర్సన్ వికెట్లను అశ్విన్ సాధించాడు. ఇక నదీమ్కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది. హైలెట్స్: ► తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో రూట్ చేసిన పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత ఓలీ పాప్(28), బెస్(25), బట్లర్(24)లు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు. ►అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. పంత్కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక అంతకు ముందు ఇషాంత్ లారెన్స్ను పెవిలియన్కు పంపగా, ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ►వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన డానియల్ లారెన్స్ను ఇషాంత్ శర్మ పెవిలియన్కు పంపాడు. 18 పరుగులు చేసి లారెన్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక లారెన్స్ను ఔట్ చేయడం ద్వారా, టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఇషాంత్ శర్మ.. ఈ ఘనత సాధించిన భారత మూడో పేసర్గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆతిథ్య జట్టు కంటే ప్రస్తుతం 305 పరుగుల ఆధిక్యంలో ఉంది. ►ఆతిథ్య జట్టు కంటే 282 పరుగుల ఆధిక్యంలో జో రూట్ సేన.. రెండో ఇన్నింగ్స్లో రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సిబ్లీ అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో, పుజారాకు క్యాచ్ ఇచ్చి 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ జో రూట్, లారెన్స్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.బంతికే ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్గా వెనుదిరిగాడు. రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. . ►ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆటలో భాగంగా 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో మెరుగైన స్కోరు సాధించాడు. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను ముగించగా.. టీమిండియా ఇంకా 241 పరుగులు వెనుకబడి ఉంది. ►ఆండర్సన్ బౌలింగ్లో ఇషాంత్ శర్మ(4) తొమ్మిద్ వికెట్గా పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ (84), బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోరు 336/9. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను ముగించగా.. టీమిండియా ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది. ►జాక్ లీచ్ బౌలింగ్లో నదీం డక్ అవుట్ అయ్యాడు. స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.కాగా జాక్ లీచ్కు ఈ మ్యాచ్లో ఇది రెండో వికెట్. అంతకు ముందు అశ్విన్ వికెట్ కూల్చాడు. టీమిండియా తాజా స్కోరు 318/8. వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ►అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వాషింగ్టన్ సుందర్కు తోడుగా మరో ఎండ్లో సహకారం అందిస్తున్న అశ్విన్(31).. జాక్ లీచ్ బౌలింగ్లో అవుటయ్యాడు. బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 305 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ►నాలుగో రోజు ఆటలో భాగంగా, బ్యాటింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 111 బంతుల్లో 59 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫార్వర్డ్, కవర్ డ్రైవ్ షాట్లతో అలరిస్తూ 10 ఫోర్ల సాయంతో సొంత గడ్డపై తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ►మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 257 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను ముగించగా.. భారత్, 271 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 307/7. వశీ, నదీం క్రీజులో ఉన్నారు. ►భారత గడ్డపై వాషింగ్టన్ సుందర్ తొలి హాఫ్ సెంచరీ. చదవండి: చెన్నై టెస్టులో భారత్ ఎదురీత -
బ్రిస్బేన్ నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం