Vaishnavi Chaitanya
-
పూల చీరలో మెరిసిపోతున్న వైష్ణవి.. వైరల్ అవుతున్న ఫోటోస్
-
'90s' పాత్రల్లో ‘బేబీ’ జోడీ.. మిడిల్ క్లాస్ బాయ్ లవ్స్టోరీ
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్టైన్మెంట్. ఒకపక్క పెద్ద సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క చిన్న చిత్రాలతో అదరగొడుతోంది. సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తూ.. విజయాలను అందుకుంటుంది.తాజాగా మరో కొత్త కాంబినేషన్తో సినిమాని ప్రకటించింది. అదే ‘90s’, ‘బేబీ’ కాంబినేషన్.'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే '90s' వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), తమ ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటించింది.ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. '90s' సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. "మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ." అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది.తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకటన వీడియోతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్, 'బేబీ' ద్వయంతో కలిసి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: యష్మి ఎలిమినేట్!)'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
ఓటీటీకి బేబీ హీరోయిన్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో ఆశిష్, బేబి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'లవ్ మీ'. ఇఫ్ యూ డేర్ అనేది సబ్ టైటిల్. మే 25న ఈ మూవీ థియేటర్ల రిలీజై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హారర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా.. దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.Get ready to be spooked and enchanted by #GhostLove! Brace yourself for chills and thrills in the ultimate love story. 🥶❤️#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' coming soon on @PrimeVideoIN! @AshishVoffl @iamvaishnavi04 @iamsamyuktha_ @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu… pic.twitter.com/edT60T2o1c— Dil Raju Productions (@DilRajuProdctns) June 12, 2024 -
ఎర్ర చీరలో కుందనపు బొమ్మలాగా మెరిసిపోతున్న బేబీ భామ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
దెయ్యాన్ని ప్రేమించిన హీరో.. లవ్ మీ ట్రైలర్ చూశారా?
దెయ్యంతో ప్రేమ.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ..! ఈ కాన్సెప్ట్తో వస్తోన్న క ఒత్త మూవీ లవ్ మీ. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ గురువారం (మే 16న) రిలీజైంది. రోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక అలారం మోగుతుంది. రాత్రి 8 గంటలకు..ఆ సమయానికి ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ టంచనుగా ఆ టైంకు ఇంటి తలుపును మూసేస్తారు. కానీ ఓ ఆడపిల్ల మాత్రం గది తలుపు తెరిచి చూసి కెవ్వుమని అరుస్తుంది. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ వేశారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. అక్కడ డేంజర్ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుందంటూ తన స్వభావాన్ని ట్రైలర్లో చూపించాడు. దెయ్యంతో లవ్అందుకే అందరూ భయపడే దెయ్యంతో ప్రేమలో పడతాడు. దెయ్యం చంపుతుందని అందరూ హెచ్చరించినా హీరో మాత్రం ఆ ఘోస్ట్ ప్లేస్లోకి వెళ్తాడు. చివరికి ఆ దెయ్యం అర్జున్ పీక పట్టుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. మరి ఈ మనిషి-దెయ్యం ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మే 25 వరకు ఆగాల్సిందే! మే 25న రిలీజ్అంటే సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకులను భయపెట్టేందుకు లవ్ మీ థియేర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
'లవ్ మీ' మూవీ ఆడియో వేడుక (ఫొటోలు)
-
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
'ఒకసారి డేట్కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్లైన్తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
Vaishnavi Chaitanya: సింపుల్ లుక్స్లో మెస్మరైజ్ చేస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బేబీ హీరోయిన్.. బీచ్లో ప్రగ్యా జైస్వాల్!
►బేబీ హీరోయిన్ బర్త్ డే స్పెషల్ పిక్ ►బీచ్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులు ►బ్లూ డ్రెస్లో అమృత అయ్యర్ హోయలు ►దుబాయ్లో యషిక ఆనంద్ స్టిల్స్ ►బ్యాంకాక్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ దిశా పటానీ ►మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
నాకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఇవే
-
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
అలా మాట్లాడుతూ యూత్ పరువు తీస్తున్నారు..!
-
ఇంకా మంచి నటుడు అనిపించుకోవాలని నా కోరిక
-
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్కి తగ్గట్టు ఫుల్గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్బండ్కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది చెప్పలేం. అలా కొన్నాళ్ల ముందు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి, బీభత్సం సృష్టించిన మూవీ అంటే గుర్తొచ్చేది 'బేబి'నే. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు తీసిన ఈ ట్రాయాంగిల్ లవ్స్టోరీ.. యువతకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిపై కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఆ చిన్న సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. 'బేబి' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఈమె నటనకిగానూ అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేసే బిజీలో ఉన్న ఈమె.. తాజాగా ఓ యూట్యబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, సినిమా కష్టాలు అన్ని చెప్పింది. అయితే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. 'నాకు కాబోయే భర్త గురించి పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా, అందంగా లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి మనసు ఉంటే చాలు' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అయితే ఈ కాలంలో ఇలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిలంటే చాలా వెతకాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటి నుంచి స్ట్రీమింగ్) -
మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్!
రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. ఎంత దూరంలో ఉన్నా సరే, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకచోటకు చేరాల్సిందే! రాఖీ కట్టి తీరాల్సిందే! ఎంతో ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి అన్న/తమ్ముడు తనకు తోచినంతలో ఎంతో కొంత డబ్బో లేదంటే ఏదైనా బహుమతో ఇస్తాడు. తనకు కూడా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడంటోంది వైష్ణవి చైతన్య. అయితే ఆ గిఫ్ట్ రాఖీ పండగకు కాకుండా తన బర్త్డేకి ఇచ్చాడంది. కానీ, ప్రతి రాఖీ పండగకు అదే గిఫ్ట్ చూపిస్తున్నాడంటోంది. ఇంతకీ ఆ బహుమతి మరేంటో కాదు పచ్చబొట్టు! వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'నా బర్త్డేకి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలా తన ఎడమచేతిపై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అది నిజమైన టాటూ అనుకోలేదు, జోక్ చేస్తున్నాడనుకున్నాను. కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని అర్థమైంది. ఈ పచ్చబొట్టు వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట! చాలా ఎమోషనల్ అయిపోయా.. ఏడ్చేశాను. అప్పటి నుంచి రాఖీ కట్టిన ప్రతిసారి పచ్చబొట్టు చూపిస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే యూట్యూబ్ సెన్సేషన్ అయిన వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హీరోయిన్గా మారింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. జూలై 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.90 కోట్ల మేర వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసింది. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
దుస్తులు మార్చుకునేందుకు గది కూడా లేదు, అమ్మ ఏడ్చేసింది: బేబి హీరోయిన్
ఈ మధ్య కాలంలో థియేటర్ దగ్గర సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో బేబి మూవీ ఒకటి. ఈ మూవీతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. నిజానికి ఆమెకు హీరోయిన్ అవకాశం అంత ఈజీగా రాలేదు. మొదట డబ్స్మాష్, టిక్టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. తర్వాత యూట్యూబ్లో షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫేమస్ అయింది. వెండితెరపైనా పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 10వ తరగతిలోనే కుటుంబ బాధ్యత అందం, ప్రతిభ ఉన్నప్పటికీ హీరోయిన్ ఛాన్స్ ఆమెను ఆలస్యంగానే వరించింది. డైరెక్టర్ సాయి రాజేశ్ బేబి కథకు వైష్ణవి సరిపోతుందని భావించడంతో ఆమెను సెలక్ట్ చేశాడు. తర్వాత ఆ మూవీ ఓ రేంజ్లో హిట్టవడం.. హీరోయిన్కు ఎక్కడలేని క్రేజ్ రావడం తెలిసిందే! తాజాగా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను పదో తరగతి నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకున్నా. అప్పుడు నాకు తెలిసిందల్లా డ్యాన్స్ ఒక్కటే! బర్త్డే, పెళ్లి.. ఇలాంటి ఈవెంట్స్లో డ్యాన్స్ చేసేదాన్ని. అలా ఒక్కరోజు డ్యాన్స్ చేస్తే రూ.700 ఇచ్చేవాళ్లు. మా అమ్మ ఆ డబ్బుతో బియ్యం కొనుక్కువచ్చేది. దుస్తులు మార్చుకునేందుకు గది లేదు యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకుందామన్నా ప్రత్యేక గది ఉండేది కాదు. అక్కడున్న వాష్రూమ్కి వెళ్లి దుస్తులు మార్చుకునేదాన్ని. అది మా అమ్మ ఏడ్చేసింది. ఎందుకమ్మా, ఇదంతా వద్దు.. వదిలేయ్ అని బాధపడింది. అప్పుడే ఏదైనా సాధించాలనుకుని ఫిక్సయ్యాను. ఒకసారేం జరిగిందంటే.. ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ కారవాన్ ఉండదు. పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకువెళ్లి వాష్రూమ్ కోసం మీ కారవ్యాన్ వాడుకోవచ్చా? అని అడిగితే ఆమె నానామాటలు అంది. నాకు ఏడుపొక్కటే మిగిలింది. ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. అంతేకాదు, ఈ పిల్ల ఏం చేయలేదు, తను ముందుకు వెళ్లలేదు అని చాలామాటలన్నారు. అవి ఎంత పట్టించుకోవద్దనుకున్నా అవి నన్ను ఏదో ఒకరంగా బాధించాయి' అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. చదవండి: -
Baby Movie In OTT: ఓటీటీలోకి బేబి సినిమా.. ప్రకటించిన మేకర్స్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం 'బేబీ'. జులై 14న విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమచారం. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్బాస్లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే ఆగష్టు 25 నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్రసారం కానుంది. ఓటీటీ కోసం ఇందులో ఒక సాంగ్తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారని తెలుస్తోంది. 10 కోట్ల కలెక్షన్ల టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ను రీచ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ కూడా భారీగా లాభాల్లోకి వచ్చారు. ఇక 25 నుంచి ఓటీటీలోకి వస్తున్న బేబీని చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. -
'బేబీ' బ్యూటీని ఎవరూ పట్టించుకోవట్లేదా.. లేదంటే?
తెలుగులో చిన్న సినిమాలు హిట్ అవ్వడం అరుదు. ఒకవేళ అయినా వసూళ్లు సాధించిన సందర్భాలు తక్కువని చెప్పొచ్చు. అలాంటిది ఈ రెండు విషయాల్లో 'బేబీ' మూవీ సెన్సేషన్ సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా కొన్నాళ్లు ముందు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈమెని తెగ పొగిడేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈమెని పెద్దగా పట్టించుకోవట్లేదా అని డౌట్ వస్తుంది. (ఇదీ చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్గా నటించాడని మీకు తెలుసా?) డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. ఆ తర్వాత యూట్యూబర్గా మారింది. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ మెల్లమెల్లగా క్రేజ్ పెంచుకుంది. ఈమె అయితే తన కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు సాయి రాజేశ్.. 'బేబీ' హీరోయిన్గా ఈమెని ఎంపిక చేశాడు. బోల్డ్ స్టోరీకి తోడు ఈమె యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది. దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది. 'బేబీ' ప్రొడ్యూసర్ ఎస్కేన్ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది. కానీ వీటికి ఇంకా చాలా టైముందని అంటున్నారు. అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. దీనిపై క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. 'బేబీ'లో తన క్యారెక్టర్ బోల్డ్ కావడం కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రాకపోవడానికి కారణమేమో అని వైష్ణవిని కన్ఫ్యూజన్లో పడిపోయినట్లు తెలుస్తోంది. మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏంటనేది చూడాలి. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) -
నా జీవితంలో మీ అందరినీ మరిచిపోను: బేబీ హీరోయిన్ ఎమోషనల్ వీడియో!
బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. కొబ్బరిమట్ట దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ చిత్రంలో ఆనంద్, దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించారు. జూలైన 14న థియేటర్లలోకి వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పేరు ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అంతలా పేరు తీసుకొచ్చింది ఈ సినిమా. (ఇది చదవండి: ఆడిషన్స్ కోసం చాలా కష్టపడ్డా.. 8 ఏళ్ల తర్వాత ‘బేబీ’ చాన్స్: వైష్ణవి చైతన్య) అయితే తాజాగా వైష్ణవి చైతన్య ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరిచిపోనని చెబుతోంది. తన కెరీర్ ప్రారంభం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను పనిచేసిన సంస్థ ఇనిఫినిటం సంస్థ కొత్త బ్యానర్ ఏర్పాటు చేయడంపై అభినందనలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..' నా జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫినిటం. యాక్టర్గా నా జర్నీ స్టార్ట్ అయింది అక్కడే. అక్కడ పని చేసేటప్పుడు ఎప్పుడు అంటుండేవారు. తను ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అవుతుందని. తనకు ఆ సత్తా ఉంది అనేవారు. ఇందుకు నాకు సపోర్ట్గా నిలిచినవారికి థ్యాంక్స్. నా జీవితంలో ఇది మరిచిపోలేను. మరీ ముఖ్యంగా నేను ఎక్కడి నుంచి వచ్చానో జీవితాంతం గుర్తుంటుంది. నా జర్నీలో ఉన్న మనుషులు, సంఘటనలు ఎప్పటికీ మరిచిపోను. నా లైఫ్లో ఎంత ముందుకెళ్లినా నా మూలాలు మరిచిపోను. మంచి, చెడులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. నన్ను బేబీ సినిమాలో చూసి ఇంతలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.' అంటూ పోస్ట్ చేసింది. బేబీ హీరోయిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్గా ఉందేంటి బ్రో! ) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
చిన్న సినిమా.. పెద్ద విజయం
శ్రీకాకుళం అర్బన్: బేబి చిత్ర యూనిట్ శనివారం సిక్కోలులో సందడి చేసింది. శ్రీకాకుళంలోని సరస్వ తి థియేటర్కు యూనిట్ రాగా థియేటర్ మేనేజర్ చిన్నరాజు సాదర స్వాగతం పలికారు. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేష్లు ప్రేక్షకులు, అభిమానులతో మా ట్లాడారు. సినిమాలోని డైలాగ్ను ఆనంద్ దేవరకొండ చెప్పడంతో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో హాల్ను హోరెత్తించారు. హీరో, హీరోయిన్లు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద హిట్ చేసి ఆదరించిన తీరు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ కథలో కంటెంట్ ఉంటే ఎంతటి చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారన్నారు. ముఖ్యంగా సిక్కోలు వాసులు తన చిత్రాలను ఆదరించడం ఎన్నటికీ మరచిపోలేనన్నారు. ఈ రోజు వరకూ బేబి చిత్రం రూ. 87 కోట్లు వసూలు చేసిందన్నారు. తన గత చిత్రాలను కూడా సిక్కోలు వాసులు ఆదరించా రని గుర్తు చేసుకున్నారు. తాను నిర్మాతగా, సుమన్ అనే వ్యక్తి దర్శకత్వంలో ఒక సినిమా నిర్మించనున్న ట్లు తెలిపారు. ఈ సినిమాకు ఇన్స్ట్రాగామ్లో పరిచ యమైన హారికా అనే అమ్మాయిని హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నా రు. తన చిత్రాల ద్వారా సంపూర్ణేష్బాబు, సుహాన్ లు ఓ స్థాయిలో హీరోలుగా నిలదొక్కుకున్నారన్నా రు. శ్రీకాకుళం యాసతో ఈ జిల్లాలోనే పూర్తిస్థాయి లో షూటింగ్ జరుపుకొని సినిమాను నిర్మిస్తానని తెలిపారు. -
పూరి జగన్నాథ్, రామ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య !
-
బేబి సినిమా నిర్మాతతో గొడవ.. ఆపై క్షమాపణ చెప్పడంతో..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా 'బేబీ'. సాయి రాజేశ్ దర్శకుడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిరోజే రూ.7 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టింది. విడుదలై 20 రోజులు దాటిని ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సుమారు రూ.85 కోట్ల మేరకు ఇప్పటి వరకు రాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొనసాగుతుంది. (ఇదీ చదవండి: ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్) తాజాగా ఈ సినిమా యూనిట్ విజయ యాత్రలో భాగంగా ఏపీలోని భీమవరం పర్యటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారితో పాటు కొంతమంది స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా గుంపుగా రావడంతో.. వారు మీడియా ప్రతినిధులు అని గమనించక బౌన్సర్లు తోసేశారు. అంతేకాకుండా వారి పట్ల కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు. దీంతో వారందరూ ఆందోళనకు దిగారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కారును వారందరూ అడ్డుకున్నారు. దీంతో కారు నుంచి దిగిన ఎస్కేఎన్తో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన కూడా కొంతమేరకు సీరియస్ అయ్యారు. అనంతరం వారికి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అక్కడున్న వారిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆస్పత్రికి ఎస్కేన్ సిబ్బంది తరలించారట. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ #BabyTheMovie #Baby pic.twitter.com/rflAImEYMU — Telugu Scribe (@TeluguScribe) August 4, 2023 -
ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్
చిన్న సినిమాగా విడుదలైన 'బేబి' బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్లు నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. అలాగే SKN ఈ మూవీకి నిర్మాత. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టించే దిశగా పయనం అయింది. ఎంతలా అంటే ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా 'అర్జున్ రెడ్డి' ని కూడా బేబి బ్రేక్ చేసింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) ఈ సినిమా ఇప్పటికి విడుదలై 20 రోజులు దాటింది. త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీగా ఉంది. ఇదే విషయంపై తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బేబి సినిమా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది. సుమారు 3గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ఓటీటీలో మాత్రం సుమారు నాలుగు గంటల నిడివితో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. (ఇదీ చదవండి: కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!) దీనిని నెట్ ఫ్లిక్స్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఇందులో ఒక సాంగ్తో పాటు కొన్ని సీన్లను చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాటితో పాటు ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం కలుపుతున్నారని తెలుస్తోంది. 4 గంటల నిడివితో సరికొత్తగా ఓటీటీలో వచ్చే బేబిని మళ్లీ చూసేయండి. -
బేబీ హీరోయిన్కు బంపర్ ఆఫర్.. తెలుగులో ఆ యంగ్ హీరోతో జోడీ!
వైష్ణవి చైతన్య.. యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలింస్తో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఆమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. నెమ్మదిగా వెండితెరపైనా అడుగుపెట్టింది. అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ చెల్లిగా నటించింది. ఇలా చిన్న పాత్రలు చేస్తున్న సమయంలో అదృష్టం డైరెక్టర్ సాయి రాజేశ్ రూపంలో ఆమె తలుపు తట్టింది. అతడు బేబీ సినిమా కథ వినిపించాడు. భయంతో నో చెప్పిన బ్యూటీ జనాలు తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయంతో మొదట చేయనని చెప్పేసింది వైష్ణవి. అప్పుడు సాయిరాజేశ్ ఆమె పాత్ర గురించి సవివరంగా చెప్పి ధైర్యం నూరిపోయడంతో ఆయనపై నమ్మకం పెట్టుకుని సినిమా ఓకే చేసింది. ఇంట్లో వాళ్ల అంగీకారం తీసుకున్న తర్వాతే బెడ్రూమ్ సీన్స్లో నటించింది వైస్ణవి. చివరకు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. బేబీ ఎవరూ ఊహించనంత విజయం సాధించింది. హీరోయిన్గా తొలి సినిమా సక్సెస్ కావడంతో వైష్ణవి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రామ్ పోతినేనికి జోడీగా ఇకపోతే గీతా ఆర్ట్స్ బ్యానర్లో వైష్ణవి ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బేబీ మరో బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. పూరీ జగన్నాథ్.. రామ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బేబీని పొగిడిన రామ్ బేబీ సినిమాలో ఆమె నటన చూసి పూరీ ఫిదా అయ్యాడని, అందుకే వెంటనే తనకు డబుల్ ఇస్మార్ట్లో ఛాన్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రామ్ పోతినేని కూడా వైష్ణవిని మెచ్చుకుంటూ తనకు పుష్పగుచ్ఛాన్ని పంపించాడు. ఈ మూవీలో బేబీ ఉంటే తన దశ తిరగడం ఖాయమని నెటిజన్లు భావిస్తున్నారు. ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇటీవలే వెల్లడించింది. చదవండి: సినిమాల్లోకి పబ్జీ వీర ప్రేయసి.. భర్తను వదిలి ప్రియుడు కోసం ఇండియాకు వచ్చిన పాక్ మహిళ -
'బేబీ' వైష్ణవి తమ్ముడు ఎలా ఉన్నాడో చూశారా? (ఫొటోలు)
-
బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్
ఇండస్ట్రీలో చాలామంది నటుల్లానే విజయ్ దేవరకొండ కూడా సొంత టాలెంట్తోనే ఎదిగాడు. సినిమా అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా ఎలాంటి పాత్ర వచ్చినా నటించాడు. అలా ఒక్కోమెట్టు ఎదుగుతూ నేటి యువతకు బ్రాండ్గా మారాడు. అలాంటి 'లైగర్' పక్కన బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య తమ్ముడు దిగిన ఫోటో ఒకటి ట్రోలింగ్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) బేబి సినిమాతో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ట్రెండింగ్లోకి వచ్చారు. సినిమా సక్సెస్ అయ్యాక విజయ్ దేవరకొండతో వారిద్దరు కలిసి ఫోటోలు దిగారు. అందులో వైష్ణవి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆపై వాటిని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలో వైష్ణవి తమ్ముడే హైలెట్ అవుతూ స్టిల్ ఇవ్వడంతో వారికి నచ్చలేదు. అంతేకాకుండా విజయ్పైన చెయి వేయడంతో ఈ ట్రోలింగ్కు మరింత దారి తీసింది. (ఇదీ చదవండి: యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు) వైష్ణవి తమ్ముడి పైనా విజయ్ ఫ్యాన్స్ ఇలా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఏమైనా సాధారణ వ్యక్తిలా ఫీలయ్యావా ఏంటి అంటూ వారు విరుచుకుపడుతున్నారు. 'నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా..? అలా విజయ్ పైనా చెయి వేసి ఫోజు కొడుతున్నావ్.. నీతో ఫోటో దిగేందుకు విజయ్, ఆనంద్లు మీ ఇంటికి వచ్చారా..? కొంచెం ఇలాంటి ఆటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిది.' అని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరైతే వీడేంటి అర్జున్ రెడ్డిలో ప్రీతి తమ్ముడులా లుక్ ఇచ్చాడు అంటుంటే మరికొందరేమో వీడు చైల్డ్ ఆర్టిస్టా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటో వార్ ఇంతటితో ఆపేయండని పలువురు అంటుంటే.. పెద్దవారితో ఎలా ప్రవర్తించాలో వైష్ణవి అయినా తమ్ముడికి చెప్పాలి కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
Vaishnavi Chaitanya: బ్లాక్ చీరలో కొప్పున పూలెట్టుకుని మెరిసిపోతున్న బేబీ హీరోయిన్
-
ఈ సినిమా చూసి ప్రతి అమ్మాయి, తల్లి దండ్రులు జాగ్రత్త పడాలి..
-
వైష్ణవి చైతన్య మాటలకు దండం పెట్టిన చిరంజీవి..
-
వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి
‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది. అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్మూవీ మేకర్స్ పతాకంపై సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది. రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది. నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్ ఫిల్మ్లా అనిపించింది. చాలామంది యువత సోషల్ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్మీట్కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్ పేర్కొంది. -
రికార్డులు కొల్లగొడుతోన్న 'బేబీ'.. స్టార్ హీరో మూవీ రికార్డ్ బ్రేక్!
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించి ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించగా.. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం మౌత్టాక్తో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.70 కోట్ల మార్కును దాటేసిన బేబీ మూవీ మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ప్రతి సినిమా ఓ పాఠం నేర్పించింది: రాజమౌళి ఎమోషనల్ ట్వీట్) ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్-2 రికార్డ్ను బద్దలుకొట్టింది. గతంలో కేజీఎఫ్-2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం వరుసగా 13 రోజుల పాటు కోటికి పైగా వసూళ్లను రాబట్టి కేజీఎఫ్ను వెనక్కి నెట్టింది. ఈ చిత్రం రిలీజై రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్లపరంగా ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం అర్జున్ రెడ్డి కలెక్షన్లను దాటేసిన బేబీ మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: ముంబయిలో ఫ్లాట్.. నాలుగు రోజులు నరకం చూశా: హీరోయిన్) -
'బేబీ' డైరెక్టర్కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?
'బేబీ' సినిమా జోరు తగ్గట్లలేదు. ఓ గొడవ ఇంకా చల్లారట్లేదు. అవును మీరు కరెక్ట్గానే విన్నారు. హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ మూవీ.. 12 రోజుల్లో రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్తో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఈ చిత్రం విషయంలో ఓ వివాదం ప్రస్తుతం మరింతగా ముదురుతోంది. మొన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు పరోక్షంగా హీరో విశ్వక్సేన్ వాటికి కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!) ఏం జరిగింది? 'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' తదితర చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న సాయి రాజేశ్.. 'కలర్ ఫొటో' సినిమాని నిర్మించాడు. అలా కొంతలో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'బేబీ' స్టోరీని రెడీ చేసి హీరో విశ్వక్ సేన్ని అప్రోచ్ అయ్యాడట. ఆ దర్శకుడు అయితే కనీసం స్టోరీ కూడా విననని సదరు హీరో అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సాయి రాజేశ్.. 'బేబీ' సక్సెస్ సెలబ్రేషన్స్ లో చెప్పుకొచ్చాడు. కాకపోతే ఓ హీరో అని అన్నాడు తప్పితే అది విశ్వక్సేన్ అని బయటపెట్టలేదు. ట్వీట్ వార్ దీని తర్వాత విశ్వక్ సేన్.. బేబీ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఇన్డైరెక్ట్గా ఓ ట్వీట్ పెట్టాడు. 'నో అంటే నో. ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉండండి, అరిచి గోల చేయొద్దు. జస్ట్ రిలాక్స్' అని అందులో రాసుకొచ్చాడు. దీనిపై దర్శకుడు సాయి రాజేశ్ పరోక్షంగా మరో ట్వీట్ తో స్పందించాడు. ఇదలా ఉండగానే ఇప్పుడు ఓ మూవీ ఈవెంట్లో భాగంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. "No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️ — VishwakSen (@VishwakSenActor) July 20, 2023 (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'స్పై'.. స్ట్రీమింగ్ అందులోనే) విశ్వక్ ఏం చెప్పాడు? 'ఎవరి స్థాయిని బట్టి వాళ్లు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో క్లారిటీ లేనప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలా 'కలవలేం, కథ వినలేం' అని చెబుతుంటాం. దానికి కొందరు ఫీలవుతుంటారు. ఈ విషయంలో నేనేం చేయలేను. అందరినీ సంతోషపెట్టడానికి నేను బిర్యానీని కాదు. సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ కించపరచొద్దు. అదొక్కటే బాధగా ఉంది' 'చిన్న సినిమా ఇలా హిట్ కావడం ఆనందించే విషయం. వాళ్లకు నా శుభాకాంక్షలు కూడా చెప్పాను. మూవీ బాగుందని డైరెక్టర్స్ గ్రూప్ లో ముందు నేనే మెసేజ్ చేశాను. అయినా డైరెక్టర్ని కలవలేదని మీమ్స్ వచ్చాయి. గంటసేపు చర్చించి చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అని నో చెప్పాను' అని విశ్వక్ సేన్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ వివాదాన్ని మాట్లాడుకుని తేల్చుకోవాల్సింది పోయి, ఇలా బయటపెట్టుకుని ఇద్దరు పొరపాటు చేశారని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్లు!) -
ఆ సీన్ వైష్ణవి నాన్నకు చెప్పాకే తీశా.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిత్రం 'బేబీ'. కేవలం మౌత్ టాక్తో విడుదలైన పది రోజుల్లోనే రూ.66 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి హిట్స్ అందించిన డైరెక్టర్ సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా వైష్ణవి చైతన్య పాత్రకే ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఆమె సంబంధించిన డైలాగ్స్, సీన్స్ ఈ సినిమాకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాయి. (ఇది చదవండి: కలెక్షన్స్లో 'బేబీ' ఆల్టైమ్ రికార్డ్!) అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యుకు హాజరైన డైరెక్టర్ సాయి రాజేశ్ హీరోయిన్పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ కథ చెప్పగానే తాను మొదట అంగీకరించలేదని.. తాను మరింత క్లారిటీ ఇచ్చాకే ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో వచ్చే బెడ్ రూమ్ సీన్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఈ షాట్ గురించి వైష్ణవి వాళ్ల నాన్నకు పూర్తిగా వివరించానని పేర్కొన్నారు. వాళ్లకు చెప్పిన తర్వాత ఆ షాట్ తీశానని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడే ఆపేస్తానని చెప్పానన్నారు. అంతే కాకుండా నీ కెరీర్కు ఏదైనా ఇబ్బంది వస్తే మూడు సినిమాల్లో నేను అవకాశమిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాతో మరో సాయి పల్లవి దొరికిందంటూ ప్రశంసలు వస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని సాయి రాజేశ్ అన్నారు. వైష్ణవి గురించి మాట్లాడుతూ..'వైష్ణవిలో ఓ విధమైన హంగర్ ఉంటుంది. ఏదైనా షాట్ రాకపోతే మళ్లీ తనే ఫోన్ చేసి ఈ ఆ షాట్ చేద్దామని చెప్పేదని సాయి రాజేశ్ అన్నారు. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి పెళ్లి.. ఆమె ధరించిన చీర ఎన్ని కోట్లంటే? ) -
విజయవాడలో సందడి చేసిన ‘బేబీ’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!
విడుదలైన 10 రోజులు అవుతున్నా 'బేబీ' దూకుడు తగ్గట్లేదు. ఇందులో హీరోహీరోయిన్లు వైష్ణవి, ఆనంద్, విరాజ్తోపాటు సహాయ పాత్రల్లో నటించిన వాళ్లు తమ యాక్టింగ్తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ ఫ్రెండ్గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిరాక్ సీత ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనని కొందరు లైంగిక వేధించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని బయటపెట్టింది. 'ఓ ఈవెంట్కి నేను వెళ్లొస్తున్న టైంలో కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారు. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. కొందరైతే నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ వీటన్నింటినీ నేను లైట్ తీసుకున్నాను' (ఇదీ చదవండి: కలెక్షన్స్లో 'బేబీ' ఆల్టైమ్ రికార్డ్!) 'నన్ను అంతలా బెదిరించినా సరే వాటిని నేను లైట్ తీసుకోవడానికి ఒక్కటే కారణం. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి, వాళ్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. కానీ నా రియల్ లైఫ్ వేరే అని వాళ్లకు తెలీదు. అందుకే వాటిని పట్టించుకోలేదు. 'బేబీ'లో పాత్ర వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ నాకు ముందే చెప్పారు' అని కిరాక్ సీత చెప్పుకొచ్చింది. గతంలో యూట్యూబర్ సరయూతో కలిసి వర్క్ చేసిన ఈమె.. ఆ తర్వాత ఏదో సమస్య కావడంతో ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేసింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో బోల్డ్ తరహా పాత్రల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె, తనని కొందరు బెదిరించారని చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బేబీ మూవీ టీం
-
కలెక్షన్స్లో 'బేబీ' ఆల్టైమ్ రికార్డ్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. కంటెంట్ బాగుండి, టైమ్ కలిసొచ్చి బ్లాక్బస్టర్ వసూళ్లు సాధిస్తుంటాయి. అలా ఈ మధ్య కాలంలో జనాలకు 'బేబీ' తెగ నచ్చేసింది. ఎంతలా అంటే థియేటర్లలోకి ఈ మూవీ వచ్చి 10 రోజులు అవుతున్నాసరే ఇంకా చాలాచోట్ల హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్) పెద్దగా ఫేమ్ లేని యువ నటీనటులతో తీసిన 'బేబీ'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వారంపాటు థియేటర్లలో ఆడటమే గగనమైపోయింది. అలాంటిది 'బేబీ' రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూలైంది. పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే 'బేబీ' చిత్రానికి ఈ ఆదివారం రూ.3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను' చిత్రాలతో పాటు అల్లు అర్జున్ 'సరైనోడు' కలెక్షన్స్ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయిపోయింది. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
'బేబీ' ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'బేబీ' సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 9 రోజుల్లో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే మూడు-నాలుగు రెట్ల లాభాలతో దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 'బేబీ' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. అనుకున్న సమయం కంటే ఓటీటీలోకి ఆలస్యంగా రానుందట. (ఇదీ చదవండి: ఉపాసనపై రామ్చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!) వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమాను ట్రయాంగిల్ లవ్స్టోరీగా తీశారు. ముగ్గురికి ముగ్గురు కూడా అద్భుతమైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అయితే మూవీని మరో లెవల్ కి తీసుకెళ్లింది. దర్శకుడు ప్రతిభని కూడా కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలా అన్ని అంశాలు 'బేబీ'కి కలిసొచ్చాయి. రిలీజ్కి ముందే 'బేబీ' డిజిటల్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. 4-5 వారాల విరామం తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే థియేటర్లలో వస్తున్న స్పందన చూసి, ఆ నిర్ణయంలో మార్పు జరిగిందని టాక్. కాస్త ఆలస్యంగా అంటే ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరులో తొలివారంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!) -
బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!
చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.60 కోట్ల మార్కును దాటేసింది. కంటెంట్ ఉంటే చాలు.. సినిమాలకు ఆదరణ తగ్గదని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. సినీ ప్రముఖులు కూడా బేబి మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ప్రతి పాత్ర అందరిని కదిలించిందని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: నటితో డేటింగ్.. నాకంత టైం కూడా లేదు!) ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. హృదయ కాలేయం సినిమాతో హిట్ కొట్టిన సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి రాజేశ్.. ఈ చిత్రంలో హీరోయిన్గా వైష్ణవి తీసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎందుకంటే వైష్ణవి పాత్ర డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్గా నిలిచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ' ఈ సినిమాకు వైష్ణవి తీసుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. నేను ఈ చిత్రం కథ రాసుకున్నప్పుడు మొదట తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలనుకున్నా. అంతే కాదు తెలంగాణ భాష, యాసపై పట్టున్న అమ్మాయి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని భావించా. అలా అనుకున్న సమయంలో మా మేనేజర్ వైష్ణవి ఫోటోను నాకు చూపించారు. దీంతో నేను ఆలస్యం చేయకుండా వైష్ణవి సంప్రదించా. ఫస్ట్ తను ఈ కథ చెప్పగానే అంగీకరించలేదు. ఆ తర్వాత నేను ప్రతి సీన్ గురించి తనకు వివరించి చెప్పా. ఆ తర్వాతే తను అంగీకరించింది. నేను చెప్పిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా చేసింది.' అని అన్నారు. (ఇది చదవండి: కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?) -
కేవలం తొమ్మిది రోజుల్లోనే 'బేబీ'కి ఇన్ని కోట్ల కలెక్షన్సా?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. 'కలర్ఫోటో'తో అలరించిన సాయి రాజేష్నే ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్కేఎన్ ఈ మూవీకి నిర్మాత. జులై 14న చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రాన్ని కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మొదటి ఐదురోజులు చాలా థియేటర్స్లలో హౌస్ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దాంతో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన బేబి సినిమా కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి. 'మొదటి ప్రేమకి మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే కొటేషన్తో వచ్చిన ఈ సినిమాను చూసిన వారందరూ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో వైష్ణవి పాత్రని కూడా తిట్టుకుంటున్నారు. అంతలా కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే రూ. 60.3 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టింది. ఒక రకంగా చిన్న సినిమాల పరంగా చూస్తే తక్కువ రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన మూవీగా బేబీ రికార్డు క్రియేట్ చేసింది. (ఇదీ చదవండి: డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్) ఈ సినిమా నిర్మించేందుకు సుమారు రూ. 10 కోట్ల వరకు బడ్జెట్ అయిందని టాక్. సినిమాకు హిట్ టాక్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం వచ్చేసినట్లే. తర్వాత ఈ మూవీ మంచి లాభాల్లో కొనసాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా అన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ సాధించేసింది. తాజాగా రెండో వారంలో అడుగు పెట్టింది. వీకెండ్ కాబట్టి సినిమా కలెక్షన్స్ మళ్లీ పెరిగాయి. కాబట్టి మరికొన్ని రోజులపాటు బేబీ ఫాలోయింగ్ కొనసాగడం గ్యారెంటీ. Alaa aravai kotla mark ki….9 rojullo#BabyTheMovie pic.twitter.com/uR5FT1JH3m — Sai Rajesh (@sairazesh) July 23, 2023 -
'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే
బేబీ హీరోయిన్ 'వైష్ణవి చైతన్య' పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది. టాలీవుడ్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చి. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్గా అయినా కొనసాగాలని పలు షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ.. ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ ఉంటున్న తనకు డైరెక్టర్ సాయిరాజేశ్ వల్ల బేబీతో సిల్వర్ స్క్రీన్పై మొదటిసారి మెరిసింది. వచ్చిన అవకాశం నిలబెట్టుకునేందకు తను కూడా ఎంతగానో కష్టపడింది కూడా. (ఇదీ చదవండి: నో డౌట్.. ఈ కామన్ మహిళ బిగ్బాస్లోకి ఎంట్రీ ఖాయం) మొదట కథ విన్నప్పుడు ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తావని డైరెక్టర్ చెప్పినప్పుడు ఎగిరి గంతేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చెప్పింది. ఎందుకంటే తాను కూడా చాంద్రాయణగుట్టలోని ఒక బస్తీ అమ్మాయినే కాబట్టి అంటూ తన ఐడెంటీని దాచుకోకుండా చెప్పుకొచ్చింది. దీంతో ఒక తెలుగమ్మాయి టాలెంట్కు దక్కాల్సిన ఫేమ్ తనకు వచ్చింది. (ఇదీ చదవండి: నీకు కృతజ్ఞతే లేదు.. బన్నీని ముందు పెట్టి మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్) తాజాగా వైష్ణవి టాలీవుడ్లో ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తనను అల్లు అరవింద్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధంచి స్టోరీ కూడా తన వద్ద ఉందని, అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్లోనే అల్లు అరవింద్ కొంతమేరకు లీకులు ఇచ్చారు. మరోవైపు అల్లు శిరీష్- వైష్ణవి జంటగా మరో స్టోరీతో కూడా మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్గానే చెప్పాడు. అల్లు కుటుంబం నుంచి తనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి. ఎదో ఒక ప్రాజెక్ట్లో గీతా ఆర్ట్స్ ద్వారా తన జర్నీలో మరో అడుగు పడటం ఖాయమని తెలుస్తోంది. -
నమ్మాను... ఆఫర్లు వచ్చాయి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్ కాగానే చాలా ఆఫర్స్ వచ్చాయి’’ అన్నారు. -
ఆ విషయంలో తప్పు నాదే.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. వారం రోజుల్లో ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిత్రబృందం ఇటీవలే వేడుకలు కూడా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. (ఇది చదవండి: సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ.. అసలేంటీ కథ!) కాగా.. ఈ చిత్రంలో డైలాగ్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ముఖ్యంగా ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ప్రధానంగా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పాత్రకు సంబంధించిన డైలాగ్స్పై డైరెక్టర్ సాయి రాజేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఓ డైలాగ్ విషయంలో మాత్రం తప్పు చేశానన్నారు. అంతే కాకుండా సినిమా రివ్యూలపై సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయి రాజేశ్ మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయిని వాడు ఎంత హార్ట్ చేస్తే కానీ.. అమ్మాయి డివియేట్ అవ్వదు. అంత ప్రేమ ఉన్న వాళ్లద్దరి మధ్య బ్రేక్ రావాలంటే ఆ పదం వాడాల్సిన అవసరమొచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు' అనే డైలాగ్ విషయంలో నాది తప్పు. కానీ ఆ డైలాగ్ వాడాకుండా ఉండాల్సింది. ఆ డైలాగ్కు నేను సారీ చెబుతున్నా. కానీ మిగతా డైలాగ్స్ మాత్రం ఈ సినిమాకు ఉండాల్సిందే.' అని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంపై మాట్లాడుతూ.. 'ఇప్పటికీ థియేటర్లకు అరవైశాతం ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. ఇది సినిమాలో పాత్రలా కాకుండా వారి లైఫ్లో జరిగిన సంఘటన భావిస్తున్నారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మాయిని ఆనంద్ తిడుతుంటే.. దానికి విజిల్స్ పడుతున్నాయి. కానీ ఆనంద్ను తిడుతుంటే.. విజిల్స్ పడాల్సిన చోట పిన్డ్రాప్ సైలెన్స్ ఉంది. ఇలాంటివీ కొన్ని నాకు షాక్ కలిగించాయి. ఒక అమ్మాయి తప్పు చేసిన విషయం లవర్కి తెలిస్తే వయోలెన్స్లోకి వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్ సోసైటీలోకి వెళ్లకూడదనే పరిస్థితిని తగినట్లు మార్చా. ఆల్కహాల్, సిట్యువేషన్స్తో అమ్మాయిని కార్నర్ చేసి.. తప్పులు చేయడానికి కారణమైందనే పాయింట్ను హైలెట్ చేశా. వైష్ణవి పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశా. ' అని అన్నారు. (ఇది చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) -
బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి
-
బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?
ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఈ సినిమాలో తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) ఆమె నటనకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. సినిమా చూసిన వారు సినిమాలోని ఆమె పాత్రను అంత దారుణంగా తిడుతుంటే. ఆనంద్ దేవరకొండ తన అద్భుతమైన నటనతో కన్నీళ్లు తెప్పించాడు. వారిద్దరికీ ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ అశ్విన్ కూడా మెప్పించాడు. ఇంతలా ఆకట్టుకున్న వీరందరికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..? అంటూ నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు ఎవరూ ఊహించని విధంగా ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఇందులో లీడ్ రోల్ చేసిన ఆనంద్ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. యూత్ గుండెలపై బలంగా తన మార్క్ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్గా ఇచ్చారని టాక్. విరాజ్ అశ్విన్కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: HER: Chapter 1 Movie Review - ‘హర్’ మూవీ రివ్యూ) ముఖ్యంగా ఇందులో వైష్ణవి ఫైనాన్సియల్గా కూడా చాలా ఇబ్బందులు పడిందని డైరెక్టర్ సాయి రాజేష్ సినిమా ప్రమోషన్స్ టైమ్లో చెప్పాడు. దీంతో సినిమా బజ్ తగ్గాక మరికొంత రెమ్యునరేషన్గా వైష్ణవికి ఇవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయం కాస్త పక్కనపెడితే తను ఇదే సంస్థతో మరో రెండు సినిమాలు చేయనున్నది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు కూడా. మరోవైపు గీతా ఆర్ట్స్లో కూడా ఓ సినిమా ఛాన్స్ రానున్నదని టాక్. -
Vaishnavi Chaitanya : ‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో రెడ్ డ్రస్లో మెరిసిపోతున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
నన్ను చెల్లెలు అంటే జనాలు చంపేస్తారు
-
తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి చైతన్య
-
బిగ్ బాస్ హౌస్లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్కు రెడీ అయిపోయింది. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై ప్రత్యేక చర్చ మొదలైంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల సైతం బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. (ఇది చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!) కానీ ఆ లోపే కొంతమంది సెలబ్రిటీల పేర్లను నెటిజన్స్ ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ సీజన్లో ముఖ్యంగా అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను హౌస్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. బుల్లితెర నటి శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. వారితో పాటు సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యాంకర్ దీపికా పిల్లి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పేరు తెరమీదకొచ్చింది. ఇప్పుడిపప్పుడే మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టనుందని ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఎవరినోటా విన్నా బేబీ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా బేబీ హీరోయిన్ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బేబీ సినిమా వైష్ణవి చైతన్య కెరీర్కు ఓ టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. (ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్పై పెరుగుతున్న ఒత్తిడి) -
తెలుగు అమ్మాయిలకు.. ఇదేనా రిక్వెస్ట్..!
-
స్టేజ్ పై పుష్ప 2 డైలాగ్తో దుమ్ము దులిపిన బన్నీ..
-
‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
సినిమా బాగుంటే ఎందుకు చూడరు
‘‘7/జి బృందావన కాలనీ, అర్జున్ రెడ్డి’ సినిమాలు ప్రేమలోని బాధను చూపిస్తాయి. అలాంటి సినిమాలు తీయాలంటే చాలా కష్టం. అదే కోవలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘బేబి’ సినిమాని అద్భుతంగా తీశారు సాయిరాజేష్’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఎస్కేఎన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘బేబి అప్రిషియేషన్ మీట్’కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను చూడరు అంటుంటారు. కానీ అది అబద్ధం.. సినిమా బాగుంటే ఎందుకు చూడరు? సాయి రాజేష్గారు చాలా బాగా తీశారు. ఆయన రాసిన కథ విధానం ఇంకా బాగా నచ్చింది’’ అన్నారు. -
వాళ్లకు సారీ చెప్పిన 'బేబీ' డైరెక్టర్!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఆరు రోజుల్లో రూ.43.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం.. నాలుగైదు రెట్ల లాభాలతో దూసుకెళ్తోంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్ యాక్టింగ్.. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, సాయి రాజేశ్ డైరెక్షన్కి అందరూ ఫిదా అవుతున్నారు, వాళ్లని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో బూతులు, కొన్ని సీన్లపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి స్వయంగా దర్శకుడే స్పందించాడు. ప్రేక్షకులకు సారీ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) 'హీరోహీరోయిన్ల మధ్య లవ్స్టోరీ బలంగా ఉన్నట్లు సినిమా మొదట్లో చూపించాను. హీరో తన మాటలతో నొప్పిస్తేనే హీరోయిన్ మనసు మరోవైపు చూస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు ఇంటర్వెల్లో కొన్ని అభ్యంతరకర పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. 'తెరవాల్సింది కళ్లు కాదు..' అనే డైలాగ్ని పెట్టుండాల్సింది కాదు. ఆ మాటలు రాయకుండా ఉండాల్సింది. ఈ విషయంలో ప్రేక్షకులు క్షమాపణలు. మిగతావి మాత్రం సినిమాకు కచ్చితంగా కావాల్సినవే' 'బేబీ సినిమా నిడివి విషయంలో తొలుత విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తున్న ఎవరూ కూడా దాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే క్లైమాక్స్ కోసం సినిమా మొదట్లో 16 నిమిషాల సీన్ పెట్టాను. దాన్ని ఎంతో కష్టపడి ఎడిట్ చేసి 7 నిమిషాలకు తీసుకువచ్చాను' అని దర్శకుడు సాయి రాజేశ్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
ఆ డైరెక్టరా? అంటూ ఓ హీరో 'బేబీ' కథే వినలేదు: సాయి రాజేష్
‘‘బేబి’కి నా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారనే నమ్మకం ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో? అనే భయం కూడా ఉండేది. ఫ్లాప్ అయినా సంగీతం, కెమెరా, నటీనటులు.. ఇలా అందరికీ పేరు వస్తుంది.. కానీ నా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా రిస్క్ చేసి ‘బేబి’ చేశాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. బేబీ’కి ఆనంద్ కంటే ముందు ముగ్గురు హీరోలను అనుకున్నామని ఆయన చెప్పారు. అందులో ఓ హీరోని కలిశాక హ్యాండిల్ చేయలేనేమో అని భయపడి వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. దీంతో మరో హీరోకి కథ చెప్పడం కోసం నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేస్తే ‘సాయిరాజేశ్ దర్శకత్వం అయితే చేయనని ఓపెన్గానే అన్నట్లు పేర్కొన్నాడు. ‘హృదయం కాలేయం’ సినిమాతో తనపై పడిన ముద్ర అలాంటిదని చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే ‘బేబి’ జాతకం మారిపోయింది. ఆ రోజంతా చాలా బాధపడ్డానని, ఆరోజు నిద్రకూడా పట్టలేదని తెలిపాడు. నిజానికి ‘బేబి’తో పోలిస్తే 'హృదయ కాలేయం'లాంటి సినిమా చేయడమే కష్టమని సాయిరాజేశ్ చెప్పాడు. -
ప్రతి సీన్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది: సుకుమార్ ప్రశంసలు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటించిన ట్రాయాంగిల్ లవ్స్టోరీ బేబీ. ఈ నెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బేబీ మూవీ కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గేట్లేదు. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వ వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంర్ల పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం అభినందించారు. ఈ మేరకు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 26 ఏళ్ల అమ్మాయితో నటుడి పెళ్లి.. అంతకుముందే చాలా మందితో!) సుకుమార్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'చాలా కాలం తర్వాత ఓ అసాధారణమైన రచనను చూశా. కచ్చితంగా ఈ సినిమా కొత్త ఒరవడిని, కొత్త పంథాను తీసుకొస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం నాకు సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపించింది. సినిమాలోని పాత్రల తరహాలో సిట్యుయేషన్స్ ఎక్కడ కనిపించాయో చూడటం ఇదే మొదటిసారి. మంచి కథను అందించిన సాయి రాజేశ్కు నా వందనాలు. ఇలాంటి సంప్రదాయేతర సినిమాని సాధికారత కల్పించినందుకు ఎస్కెఎన్, మారుతీలను అభినందిస్తున్నా. వైష్ణవి ఇప్పటివరకు చేసిన ఐకానిక్ పాత్రలలో ఇది ఒకటి. వైష్ణవి చైతన్య తన పాత్రకు ఊపిరి పోసింది. ఆనంద్ చాలా తెలివైనవాడు. అతను తన పాత్రలో లీనమైపోయాడు. విరాజ్ తన మార్కు చూపించాడు. విజయ్ బుల్గానిన్ సంగీతం, బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్. బేబీని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు టీమ్ మొత్తానికి నా అభినందనల.' అంటూ రాసుకొచ్చారు. కాగా.. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (ఇది చదవండి: సీన్ రివర్స్.. ధనుష్ డైరెక్షన్లో నటించనున్న సెల్వ రాఘవన్!) View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
'బేబీ' హిట్ అవడానికి అదే కారణం: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'బేబీ' సినిమా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ యాక్టింగ్కి, నిర్మాతగా ఎస్కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు తదితరులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇదే ఈవెంట్లో 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'విజయ్ యాక్టింగ్కు నేను అభిమానిని. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ల వల్లే ఇవాళ ఈ వేదిక మీదున్నా. ఫ్యూచర్లో మీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తాను. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది. మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్' అని చెప్పింది. (ఇదీ చదవండి: నాలుగో రోజు కూడా 'బేబీ'కి ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!) విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'థియేటర్లో కూర్చున్న వెంటనే 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట వచ్చింది. అప్పుడే ఒక మంచి లవ్ స్టోరీ చూపిస్తున్నారనే ఫీల్లోకి వెళ్లిపోయా. ఇప్పుడు ఈ సినిమా గురించి డిబేట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లుంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు' 'దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్గా అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్... ఒకరి సపోర్ట్తో మరొకరు ఇలా వస్తున్నాం. మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది. 'బేబీ' మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా' అని విజయ్ దేవరకొండ అన్నారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్హిట్ సినిమా!) -
నాలుగో రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!
Baby Movie Collection: కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటినే అద్భుతాలు అంటారు. సినిమాల విషయంలోనూ అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 'బేబీ' సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఇప్పుడు అదే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 'ఆదిపురుష్' లాంటి సినిమాలో నాలుగో రోజుకి డీలా పడిపోయాయి. 'బేబీ' మాత్రం గుర్రంలా దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్హిట్ సినిమా!) నాలుగో రోజు కూడా అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన 'బేబీ' సినిమా యూత్కి తెగ కనెక్ట్ అయిపోయింది. సింగిల్, రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లు.. ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. వైష్ణవి పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'బేబీ' నాలుగురోజైనా వర్కింగ్ కూడా హౌస్ఫుల్స్తో కళకళలాడిపోయింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజే రూ.7.5 కోట్ల గ్రాస్ వసూలైంది. కళ్లుచెదిరే లాభాల్లో మొత్తంగా చూసుకుంటే కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. రెండో రోజుకే పెట్టుబడి తిరిగి తెచ్చేసుకున్న 'బేబీ'.. మూడోరోజుకి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాల్లో ఉన్నారు. ఈ శుక్రవారంలోపు రూ.50 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుందని అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో? 🙏🏻 em cheppaali …1st day kante working day roju ekkuva 🙏🏻 Dear telugu audience 🙏🏻 pic.twitter.com/GjkGjO9199 — Sai Rajesh (@sairazesh) July 18, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా?) -
హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో 'బేబీ' సినిమా మానియా ఏ మాత్రం తగ్గడం లేదు. సాధారణంగా సినిమా బాగుంటేనే వీకెండ్లో థియేటర్లు ఫుల్ అవడం అంతంతమాత్రమే.. అలాంటిది ఈ కల్ట్ లవ్ స్టోరీ సినిమా దెబ్బ యూత్ గుండెలపైన డైరెక్ట్గా కొట్టడంతో సోమవారం కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా విజయంతో చాలా మంది లైమ్లైట్లోకి వచ్చారు. (ఇదీ చదవండి: బిగ్బాస్లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య,విరాజ్ అశ్విన్,మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్లకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్లకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఇలా వీరందరికీ బేబీ సినిమా ఊహించలనేంత పేరును తీసుకొచ్చింది. కానీ అందరూ ఆ బేబీ (వైష్ణవి) గురించే కాకుండా హీరోయిన్ పక్కన నటించిన మరో అమ్మాయి గురించి కూడా ఇంటర్నెట్లో నెటిజన్లు వెతుకుతున్నారు. ఇంతకు ఆమె పేరే 'కుసుమ డేగలమర్రి'. తనకు ఇదే మొదటి సినిమా కానీ.. ఇప్పటికే యూట్యూబ్ కోసం పలు షార్ట్ ఫిలిమ్స్లో కుసుమ నటించింది. అందులో ఆర్య-3 ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తనకు ఇన్స్టాగ్రామ్లో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. మొదట సోషల్ మీడియా ద్వారానే వారి టాలెంట్ చూపించుకుని తర్వాత సినిమాల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు కుసుమ కూడా అదే బాటలో పయనిస్తుంది. తనకు అందంతో పాటు టాలెంట్లో కూడా ఏ మాత్రం తీసిపోని కుసుమ సినిమాల్లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. బేబీ సినిమాలో పల్లెటూరి పిల్లాల నటించిన కుసుమ ట్రెండీ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బేబీ సినిమా తెచ్చిన ఫేమ్తో తనకు మరిన్ని సినిమా అవకాశాలు రానున్నాయని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Kusuma Degalamari (@kusuma_degalamari) (ఇదీ చదవండి: విడాకుల బాటలో కలర్స్ స్వాతి.. నిహారిక,సమంత మాదిరే క్లూ ఇచ్చేసిందంటూ..) -
వైష్ణవి చైతన్య ఇకనుంచి నీ టైం స్టార్ట్ అయ్యింది.. జాగ్రత్త..
-
వైష్ణవిని గట్టిగ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను..
-
అమ్మ నాన్న మీకు కచ్చితంగా చెడ్డ పేరు తీసుకురాను..
-
వైష్ణవి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది
-
డైరక్టర్ మాటలకు ఏడ్చేసిన వైష్ణవి చైతన్య
-
బేబీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
SKN స్పీచ్ తో దద్దరిల్లిన స్టేజ్
-
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
'బేబీ' సినిమా.. ఆ దర్శకుడి రియల్ ప్రేమకథేనా?
Baby Movie Director Details: ప్రస్తుతం ఎవరిని కదిపినా డిస్కషన్ అంతా 'బేబీ' గురించే. ఎందుకంటే రియలస్టిక్ లవ్స్టోరీతో తీసిన ఓ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా కాలమైపోయింది. సరిగ్గా ఈ పాయింట్నే క్యాష్ చేసుకున్న 'బేబీ'.. యూత్కి పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఇది దర్శకుడి రియల్ లైఫ్ ప్రేమకథేనా అని సందేహపడ్డారు. ఇప్పుడు ఆ ప్రశలన్నింటిపై స్వయంగా ఆ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు. తెలిసిన కథే 'బేబీ' సినిమాలోని కథ కొత్తదేం కాదు. బస్తీలో పెరిగిన ఓ అమ్మాయి, తన ఇంటికి ఎదురుగా ఉన్న అబ్బాయిని స్కూల్లో ఉన్నప్పుడు లవ్ చేస్తుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత మరో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్తుంది. ఏకంగా ఆ విషయంలో అడ్వాన్స్ అవుతుంది. ఇది మొదటి బాయ్ ఫ్రెండ్కి తెలిసిపోతుంది. దీంతో గొడవ జరుగుతుంది. చివరకు ఏమైందనేది అసలు స్టోరీ. రోజూ పేపర్, న్యూస్లో చదివే వార్తలానే ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు చాలామందికి అనిపించింది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) అదే కారణం 'బేబీ' సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించగా అందులో దర్శకుడు సాయి రాజేశ్కు.. అసలు ఈ సినిమాకు ప్రేరణ ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. '20 ఏళ్ల క్రితం నేను లవ్ చేశాను. ఓ 8 నెలలపాటు చాలా బాధ, కఠినమైన పరిస్థితులు అనుభవించాను. ఇది జరిగి చాలా కాలమైపోయినప్పటికీ ఆ బాధ అలానే ఉండిపోయింది. దాన్ని స్క్రీన్పై చూపిద్దామనే ఆలోచనతోనే ఈ స్టోరీ రాసుకున్నాను' అని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ నాది కాదు 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ పాత్ర మీదేనా అనే ప్రశ్నకు డైరెక్టర్ సాయి రాజేశ్ సమాధానమిచ్చారు. 'ఆనంద్ పాత్ర నేను కాదు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. నా ఫస్ట్ లవ్ నా భార్యనే. కాకపోతే లవ్లో ఉన్నప్పుడు 8 నెలలు బాధ అనుభవించాను. ఆమెని ఎక్కడో దాచిపెట్టారు. ఎక్కడుందో తెలియకపోయేసరికి తెగ ఇబ్బంది పడ్డాను. ప్రేమలో నేను సక్సెస్ అయినా.. నా పిల్లలు ఎక్కడ లవ్ చేస్తారో అనే భయముంది. వాళ్లు నాలా బాధపడకూడదనే ఫీలింగ్ లోలోపల ఉంటుంది. ఇదంతా నేను స్క్రీన్పై చూపించాను' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) -
'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!
Baby Movie Collection: 'బేబీ' అస్సలు తగ్గట్లేదు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే పెట్టుబడి రిట్నర్ అయి, బ్రేక్ ఈవెన్ కావడానికి తక్కువలో తక్కువ వారమైనా పడుతుంది. కానీ ఈ మూవీ మాత్రం జస్ట్ మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన 'బేబీ'లో మెయిన్ హైలెట్ పాటలు. కథ ఇప్పటి జనరేషన్ కి రిలేట్ అయినప్పటికీ.. అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దీనికి తోడు లీడ్ రోల్స్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అయింది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అవేవి కలెక్షన్లని అడ్డుకోలేకపోతున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'బేబీ' హవా నడుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్వైడ్ రూ.23.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే.. ఇకపై వచ్చే వసూళ్లంతా కూడా లాభాల కింద లెక్క. 'బేబీ' మూవీని రూ.7 కోట్లు పెట్టి తీశారనే సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే లాంగ్ రన్ లో రూ.40-50 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిర్మాతలకు పెట్టుబడి మీద 2-3 రెట్లు లాభాలు రావడం గ్యారంటీ. బేబీ మూడు రోజుల కలెక్షన్స్ నైజాం 8,56,50,706 వైజాగ్ 2,82,56,239 ఈస్ట్ 1,38,06,945 వెస్ట్ 83,00,334 కృష్ణా 1,33,22,572 గుంటూరు 1,08,04,046 నెల్లూరు 69,56,210 సీడెడ్ 2,09,11,880 కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 77,93,808 ఓవర్సీస్ 3,94,00,000 మొత్తం 23,52,02,740 CULT BLOCKSBUSTER #BabyTheMovie proves it yet again that content is the king 👑 Breakeven in all areas with 23.5 Crores and racing into profit zone in just 3 days 💥 Experience the #CultBlockbusterBaby https://t.co/W41DguZjiF pic.twitter.com/IuY5kImUnN — Ramesh Bala (@rameshlaus) July 17, 2023 (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) -
లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా జులై 14న విడుదలై సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. మొదట్లో టిక్టాక్, యూట్యూబ్ వీడియోలతో జర్ని ప్రారంభంచి వెండితెరపైన మెరిసింది. ఈ సినిమా వల్ల హీరోయిన్ వైష్ణవికి మంచి గుర్తింపు దక్కింది. తను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) ఎక్కడో ఓ బస్తీ నుంచి టిక్టాక్ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చానని వైష్ణవి చెప్పింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడగలననే ధైర్యం నాగతం నాకు ఇచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టింది. దీంతో ఎన్నో ఇబ్బందులు కూడా చూశానని చెప్పింది. నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో తనకు లేదని, సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి.. అంతే తన ఆశ అంటూ పేర్కొంది. కానీ బేబీ అంతకు మించి గుర్తింపు ఇచ్చిందని తెలిపింది. బోల్డ్ సీన్స్ గురించి 'ఒక సినిమాలో రొమాన్స్, లిప్లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం. కానీ నా అదృష్టం ఏమిటంటే బేబీ టీమ్ నన్ను కంఫర్ట్గా చూసుకున్నారు. ఆ సీన్ చేసే రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ రోజు విరాజ్ అశ్విన్ కూడా ఇలా అన్నాడు 'సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో అన్నాడు. అంతేకాకుండా ఇదీ జస్ట్.. మనం నటిస్తున్నామంతే' అంటూ ధైర్యాన్ని నింపాడు. ఆ సమయంలో నేనూ కూడా సన్నివేశంలో భాగంగానే చూశాను. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారు. కానీ సినిమాను పూర్తిగా చూసిన తర్వాత ఆ లిప్లాక్, బోల్డ్ సీన్స్ గుర్తుండవు. ఇందులో అంతకు మించిన భావోద్వేగాలు చాలా ఉన్నాయి. 'అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'మేమిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ థైస్ చూసేందుకు కారులో వెళ్లాం') -
Baby Movie Memes: 'బేబీ'కి ఫిదా అయిన యూత్.. ఈ మీమ్స్ చూస్తే ఏం క్రియేటివిటీరా అంటారు
'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అని 'బేబీ' సినిమా దర్శకుడు సాయి రాజేష్ ముందే చెప్పాడు. అలాగే ఈ కథను కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు జులై 14న విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే బేబీ కథ యూత్ గుండెల్ని బలంగా తాకింది. ఇందులో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకుపోయారని చెప్పవచ్చు. 'బేబీ' కథలో మాధుర్యంతో పాటు విషాదం కూడా ఉంది. హృదయ కాలేయం లాంటి కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్లో ఫీల్ గుడ్, ఎమోషనల్ టచ్ ఉందని నిరూపించిన సినిమా ఇది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సినిమా చూస్తూ కథకు కనెక్ట్ అయిన యూత్ వైష్ణవి పాత్రను దారుణంగా తిట్టుకుంటున్నారు. అంతలా ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చివరకు బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా వైష్ణవిని తిట్టకండి అని, ఇదీ కథలో భాగమే అంటూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ సినిమాపై పలు ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఉపేంద్ర హీరోగా నటించిన ఓ సినిమాలోని సీన్ అందరినీ నవిస్తోంది. ఈ మీమ్స్ మీరు కూడా చూసేయండి. Just Imagine Upendra As Hero In #BabyTheMovie 😆😂 pic.twitter.com/Ovf9lIiajP — PawanKalyan Devote (@SidduOfficial) July 15, 2023 My committed friend after watching Baby Movie 🚶🏻♂️ #BabyTheMovie pic.twitter.com/iizZdj6vpz — crusher 🙂💦 (@crusherrrrrrrr) July 15, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/9wPFOKQ5v2 — SalaarMania™ (@Salaarmania28) July 15, 2023 #BabyTheMovie Singles while watching movie :🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣🤣 pic.twitter.com/Y4li8x1kcU — VenkyCHARAN (@RC_diehard_fan) July 16, 2023 #BabyTheMovie Thank uuu anna @sairazesh pic.twitter.com/jcCHJU9lTc — PESSIMIST 🥀🏃 (@ArjunPalwai_) July 14, 2023 Baby Review in one line :#BabyTheMovie pic.twitter.com/5tvt5qam4K — 🔸సిద్ధార్థ _రాయ్ 💫 #OG (@Siddu4PSPK) July 14, 2023 #BabyTheMovie Girls while watching baby movie 🌚🌝 pic.twitter.com/og2BlK11SB — Rajinikanth (@NameisNaniiiii) July 15, 2023 #BabyTheMovie in 30 seconds: pic.twitter.com/LzlDpxi5cW — చాండ్లర్😳 (@chandler999999) July 15, 2023 After watching #BabyTheMovie Singles be like : 👇#BabyMovie pic.twitter.com/R1YNzn0VU5 — ʇɹǝʌoɹʇuI (@the_introwert) July 15, 2023 Babyyyyyyyyy 🏃🏃♀️#BabyTheMovie #BabyMovie #AnandDeverakonda #VaishnaviChaitanya pic.twitter.com/Db3HpRjvhQ — Addicted To Memes (@Addictedtomemez) July 15, 2023 #BabyTheMovie Plot pic.twitter.com/IrPFHY8t18 — .......🕊️ (@SK_Tarock) July 14, 2023