worry
-
బాధలో పలికే భావాలు.. ప్రపంచమంతటా ఒక్కటే
హాంకాంగ్: పల్లెటూరు మైదానం ఆటలాడేటప్పుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే పిల్లలైనా, పెద్దలైనా ఒకేలా ‘అబ్బా’అనో, ‘ఆ’అనో అరుస్తారు. ఇది తెలుగుభాషలో వచ్చే అక్షరాలేకదా అని అనకండి. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లోని అక్షరాలను గమనిస్తే మనిషి బాధపడినప్పుడు అసంకల్పితంగా వెలువడే చిట్టిచిట్టి పదాలు, శబ్దాల్లో తొలి అక్షరంగా ఎక్కువగా అచ్చులు ఉంటున్నట్లు ఒక అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఇంగ్లిష్ను చక్కగా నోరంతా తెరిచి పలికితే చలిదేశాల్లో అదే ఇంగ్లిష్ను సగం నోరు తెరిచి లోపల గొణుకుతున్నట్లు పలుకుతారు. ఒక్క భాషనే భిన్నంగా పలికే ప్రపంచంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు.. హఠాత్తుగా బాధపడినప్పుడు మాత్రం ఆయా భాషల అచ్చులను మాత్రమే అధికంగా పలకడం చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. ఏదైనా భాషలో ఒక పదం ఏమిటో తెలియాలంటే దాని అర్థం తెలిసి ఉండాలి. కానీ ఆశ్చర్యార్థకాలు, కొన్ని పదాలకు అర్థాలతో పనిలేదు. వాటిని వినగానే అవి బాధలో ఉన్నప్పుడు పలికారో సంతోషంతో పలికారో తెలుస్తుంది. బాధలో పలికే పదాల్లో ఎక్కువ అచ్చులు ఉండగా హఠాత్తుగా ఆదుర్తా, సంతోషం కల్గినప్పుడు పలికే పదాల్లో హల్లులు ఎక్కువగా ఉంటున్నాయి. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘అకౌస్టికల్ సొసైటీ ఆఫ్ అమెరికా’జర్నల్లో ప్రచురితమయ్యాయి. 131 భాషలను ఒడబోసి బాధ, సంతోషం, అసహనం, ఆదుర్దా ఇలా హఠాత్తుగా ఏదైనా భిన్న పరిస్థితిని మనిషి ఎదుర్కొన్నపుడు భాషతో సంబంధం లేకుండా రెప్పపాటులో మనిషి గొంతు నుంచి వచ్చే శబ్దాల్లో ఎక్కువగా హల్లులు ఉంటున్నాయా లేదంటే అచ్చులు ఉంటున్నాయా అనేది కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అధ్యయనకారుల బృందం బయల్దేరింది. ఆఫ్రికా, ఆసియా, ఆ్రస్టేలియా, యూరప్లలో అత్యధికంగా మాట్లాడే 131 భాషల్లో జనం బాధపడినప్పుడు, అసహనంగా ఫీల్ అయినప్పుడు, సంతోషపడినప్పుడు అత్యధికంగా వాడే 500కుపైగా ఆశ్చర్యార్థకాలు, పదాలను పరిశోధకులు అధ్యయనం కోసం ఎంపిక చేశారు. వీటిల్లో సంతోషం, బాధ, ఆదుర్దా ఇలా మూడు భాగాలుగా విడగొట్టి వాటిల్లో ఏ భావానికి ఏ పదం వాడారో, ఆ పదం అచ్చుతో మొదలైందో, హల్లుతో మొదలైందో లెక్కగట్టారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల ప్రజల్లో సంభ్రమాశ్చర్యాలకు లోనైతే ప్రస్తుత ట్రెండ్ను ఫాలో అవుతూ ఎక్కువగా ఔచ్, వావ్ అనే పదాలనే ఎక్కువగా పలుకుతున్నారు. ఇలా అన్ని ఆశ్చర్యార్థకాలను పట్టికగా వేశారు. ఏం తేలింది? భాషతో సంబంధం లేకుండా జనమంతా బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా పలికిన శబ్దాల్లో ఎక్కువగా అచ్చులే ఉన్నాయి. భాషలు వేరుగా ఉన్నాసరే జనం ఏదైనా ఎమోషన్కు లోనైనప్పుడు పలికే తొలిపలుకుల ధ్వనులు దాదాపు ఒకేలా ఉంటాయని తేలింది. మానవుడుకాకుండా ఇతర జీవులు.. అంటే పక్షులు, జంతువులు భయపడినప్పుడు, వేదనకు గురైనప్పుడు ఒకేలా శబ్దాలు చేస్తాయనే భావనకు మూలం దాదాపు తెలిసినట్లేనని పరిశోధకులు చెప్పారు. -
రానున్నది మరో మహమ్మారి.. బిల్గేట్స్ ఆందోళన
ప్రపంచం వచ్చే 25 ఏళ్లలో అత్యంత భారీ యుద్ధాన్నో లేక కోవిడ్ కంటే ప్రమాదకరమైన మరో మహమ్మారినో ఎదుర్కొనబోతోందని ఆందోళన చెందుతున్నారు మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్. ఇవే ఆందోళనలు తనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.వాతావరణ విపత్తులు, పెరిగిపోతున్న సైబర్ దాడులపై ప్రజలను హెచ్చరించిన బిల్గేట్స్.. తనను రెండు ఆందోళనలు అత్యంత కలవరపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో ఒకటి రానున్న మహా యుద్ధం కాగా మరొకటి కోవిడ్ను మించిన మహమ్మారి.‘ప్రపంచంలో ప్రస్తుతం చాలా అశాంతి నెలకొంది. ఇది మహా యుద్ధాన్ని రేకెత్తించవచ్చు. ఒక వేళ ఆ యుద్ధం నుంచి బయటపడినా రాబోయే 25 సంవత్సరాలలో మరొక మహమ్మారి విజృంభించే అవకాశం ఉంటుంది’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు.ఒకవేళ మహమ్మారి విజృంభిస్తే.. కోవిడ్కు మించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటుందని, దీనికి దేశాలు సిద్ధంగా ఉన్నాయా అనే ప్రశ్న తనను వేధిస్తోందన్నారు. అమెరికా విషయాన్ని తీసుకుంటే కోవిడ్ సమయంలో మిగిలిన దేశాల కంటే మిన్నగా ఉంటుందని, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అందరూ భావించారని కానీ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి..బిల్ గేట్స్ 2022లో “తదుపరి మహమ్మారిని నివారించడం ఎలా ” అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2020 కోవిడ్ సమయంలో వివిధ దేశాల సన్నద్ధత లోపాలను ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించారు. బలమైన క్వారంటైన్ విధానాలు, వ్యాధి పర్యవేక్షణ, టీకా పరిశోధన, అభివృద్ధి వంటి వాటిపై దేశాలకు పలు సూచనలు సైతం చేశారు. -
జొన్నలపై జగడం..
కల్హేర్ (నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్హేర్ మండలం బీ బీపేటలో అదనపు కలెక్టర్ మాధురి వాహనా న్ని రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వా హనం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగా రు. బీబీపేట పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి.. రైతులు తె చ్చిన జొన్నలు దెబ్బతిన్నాయని, శుభ్రంగా లే వని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడా ది ఇలాంటి జొన్నలే కొనుగోలు చేశారని వాదించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్నాయని వాపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా, తమ గోడు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారంటూ రైతులు మండిపడ్డారు. ఆమెను వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకొని బైఠాయించారు. ప్రభుత్వం, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్ డబ్బాతో రైతు ఆందోళన ఫత్తేపూర్కు చెందిన రైతు నరేందర్ పెట్రోల్ డబ్బా పట్టుకుని ఒంటిపై పోసుకునేందుకు యత్నించాడు. మార్క్ఫెడ్ డీఏం శ్రీదేవి, ఆర్డీఓ అశోక్చక్రవర్తి వెంటనే కలుగజేసుకుని నచ్చజెప్పారు. రైతులందరి జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. అనంతరం కల్హేర్, కృష్ణాపూర్, బోక్కస్గాంలో కొనుగోలు కేంద్రాలను కూడా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
గాంధీభవన్లో ఉద్రిక్తత
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
ఏలూరు జిల్లాలో రెచ్చిపోతున్న కలప స్మగ్లర్లు
-
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
అమ్మా.. డాడీని మర్చిపోమ్మా..
తిరుపతి క్రైమ్: భార్య, కుమార్తె ఉండగానే మరో మహిళను గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకొన్నాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన తిరుపతి పెద్ద కాపు వీధిలో జరిగింది. మొదటి భార్య సరస్వతిని భర్త వెంకట చలపతి ఇంటి నుంచి గెంటి వేసాడు. దీంతో సరస్వతి తన కుమారైతో కలసి న్యాయం చేయాలంటూ ఈస్ట్ పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించింది. బాధితురాలు, పోలీసుల కథనం.. స్థానిక పెద్దకాపు వీధిలో ఉన్న వెంకట చలపతితో 13 ఏళ్ల క్రితం సరస్వతికి వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి 6 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంతో తన భర్త గుట్టుగా రెండో వివాహం చేసుకున్నాడని సరస్వతి తెలుసుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో వెంకట చలపతి రెండో భార్య బంధువులు అందరూ సరస్వతిని కలిసి కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీనిపై ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా అక్కడే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఆమె వారి వద్దకు వెళ్లకుండా స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తన కుమార్తెతో కలిసి బైఠాయించి న్యాయం చేయాలంటూ బోరున విలపించసాగింది. ఈస్ట్ స్టేషన్ ఎస్ఐ జయచంద్ర అక్కడికి చేరుకుని మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో రెండో భార్యతో ఆమె భర్త బైక్పై పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. ఇది చూసిన సరస్వతి ఆగ్రహంతో ఊగిపోయింది. పరుగున భర్త వద్దకు వెళ్లి లాగే ప్రయత్నం చేసింది. రెండో భార్య మాత్రం ప్రేక్షకురాలైంది. సరస్వతి బైక్ తాళం లాక్కునేందుకు యత్నించేసరికి వెంకట చలపతి అక్కడి నుంచి రెండో భార్యతో ఉడాయించాడు. చివరకు మహిళా కానిస్టేబుల్ సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా... డాడీని మర్చిపోమ్మా.. తండ్రిని పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన ఆ చిన్నారి తల్లితో కలిసి... అతడి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. డాడీ మా పక్కకు రా డాడీ... అంటూ భోరున విలపించినా తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు తల్లి నడిరోడ్డుపై ఏడుస్తుండటంతో ...ఆ చిన్నారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ... అమ్మా డాడీని మర్చిపోమ్మా, నాకు డాడీ వద్దు, ఆయన మీద కేసు వేసి విడాకులు ఇచ్చేయ్. నాకు ఇంకా డాడీ లేడు.. నువ్వు ఏడవొద్దమ్మా’ అంటూ తల్లిని ఓదార్చింది. -
ఎగ్జిట్ ఫలితాలు చూసి ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ‘రాబోయే 24 గంటలు మనకు చాలా కీలకం. అప్రమత్తంగా ఉండండి. ధైర్యాన్ని కోల్పోకండి. మనం సత్యం కోసం పోరాడుతున్నాం. తప్పుడు ఎగ్జిట్ ఫలితాలను చూసి నిరాశచెందకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ కష్టం ఎప్పటికీ వృథా కాదు’ అని బుధవారం ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు, వదంతులను చూసి నిరాశచెందవద్దని ఇటీవల ప్రియాంక గాంధీ కూడా పార్టీ కార్యకర్తలకు సూచించిన విషయం తెలిసిందే. -
ఫేక్ న్యూస్ ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: సోషల్మీడియా ద్వారా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా అందుకునే నకిలీ వార్తలు భారత్లోని ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్న విషయమై బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ నకిలీ వార్తలు ఓటర్ల అభిప్రాయాన్ని ఎంతమాత్రం మార్చలేవనీ, అప్పటివరకూ ఉన్న ప్రజల నమ్మకాలను మరింత దృఢం చేస్తాయని పరిశోధకులు తేల్చారు. ఈ విషయమై భారత సంతతి పరిశోధకుడు సయాన్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నకిలీ వార్తలు, వదంతుల కారణంగా మతఘర్షణలు, జాతుల మధ్య గొడవలతో పాటు రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ పలు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మేం భారత్లోని యూపీ, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 18 లోక్సభ నియోజకవర్గాల్లో అధ్యయనం చేపట్టాం. ఇందులో భాగంగా 3,500 మందిని ఎంపిక చేసుకుని వారి రాజకీయ అభిరుచులను తెలుసుకున్నాం. అనంతరం వీరిలో కొందరికి సాధారణ వార్తలను, మరికొందరికి దేశభద్రత, మౌలికవసతులకు సంబంధించి నకిలీ వార్తలను పంపాం. అక్కడ రాజకీయ నేతలు, పార్టీల పేర్లను ప్రస్తావించలేదు. నకిలీ వార్తల కారణంగా ప్రజల రాజకీయ అభిప్రాయం మారకపోగా, వారిలో ప్రస్తుతమున్న భయాలు మరింత బలపడ్డాయి‘ అని తెలిపారు. వదంతులు మొదలయ్యేది ఇక్కడే.. భారత్లో రాజకీయ వాతావరణాన్ని నిర్దేశించేవాటిలో భద్రత, మౌలికవసతులు, ఆర్థిక రక్షణ అన్నవి కీలక పాత్ర పోషిస్తాయని సయాన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ‘భద్రతాపరమైన సమస్యలు అంటే కేవలం మీ కుటుంబం లేదా సామాజికవర్గానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. పౌర హక్కులతో పాటు న్యాయ, పోలీస్ సంస్థలు అందుబాటులో ఉండటం కూడా. పోలీస్శాఖతో పాటు న్యాయస్థానాల్లో దళితుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో న్యాయం పొందడం దళితులకు కష్టసాధ్యంగా మారింది. దళిత హక్కుల పరిరక్షణ కోసం తెచ్చిన చట్టాలు, రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇక్కడి నుంచే నకిలీ వార్తల పరంపర మొదలవుతోంది’ అని తెలిపారు. ‘నకిలీ’ సంస్కృతి ఇప్పటిది కాదు.. బీజేపీలాంటి రాజకీయ పార్టీలు తీవ్రమైన ప్రభావం చూపగల సందేశాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపుతోందని సయాన్ బెనర్జీ చెప్పారు. ‘ఇలాంటి సందేశాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదని భావిస్తున్నా. నకిలీ వార్తలు అన్నవి కొత్తగా వచ్చినవి కావు. గతంలో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించేందుకు ఈ నకిలీ వార్తలను వాడుకున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్లో నకిలీ వార్తలు, వదంతుల్ని పర్యవేక్షించడం సవాలుగా మారింది. కొత్త ఓటర్లపై సోషల్ ప్రభావం ప్రస్తుతం దేశంలో తొలిసారి ఓటేస్తున్న 15 కోట్ల మంది యువతలో మూడోవంతు ఓటర్లు సోషల్మీడియాలో రాజకీయ సందేశాల ప్రభావానికి లోనయ్యారని ఏడీజీ ఆన్లైన్ అనే సంస్థ తెలిపింది. ఈ విషయమై ఏడీజీ సంస్థ చైర్మన్ అనూజ్ మాట్లాడుతూ..‘తొలిసారి ఓటుహక్కు పొందిన 15 కోట్ల మందిలో 30% మంది యువత సోషల్మీడియాలోని సందేశాలతో ప్రభావితులయ్యారు. కొత్త ఓటర్లలో సగం సోషల్మీడియా ద్వారా రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. దేశంలో 18–24 ఏళ్ల యువతలో 40% మంది రాజకీయాల గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, షేర్చాట్, వాట్సాప్లపై ఆధారపడుతున్నారు’ అని చెప్పారు. 25 లక్షల మందిని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించామని వెల్లడించారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి సోషల్మీడియాలో ఎన్నికల ప్రచారం పెరిగిందన్నారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ను అభివృద్ధి చేసింది. -
నిద్రకు అష్టకష్టాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం. నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు. నిద్రపై శాస్త్రీయమైన దృష్టి నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది. నిద్ర అంటే... మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్ఆర్ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్ఆర్ఈఎమ్లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు. నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్ఆర్ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.) నిద్రలేమితో వచ్చే సమస్యలు నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు ∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం ∙దిగులు ∙మానసిక కుంగుబాటు ∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... మంచి నిద్ర కోసం... ►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం ► రోజూ వ్యాయామం చేయడం ►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు ►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు ►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు. ►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు. ►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి. ►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి. కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని... ►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు. ►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ. ►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు. జాగారంలో రికార్డు మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు. – పన్యాల జగన్నాథదాసు నిద్ర సంబంధమైన సమస్యలు కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. -
అభ్యర్థుల్లో ఆందోళన !
చుంచుపల్లి: గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు కూడా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 479 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 387 కార్యదర్శుల పోస్టులు ఈ కొత్త ఉద్యోగాలతో భర్తీ కానున్నాయి. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలలో అవకతవకలు జరిగాయని, ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ఉత్తర్వులను నిలిపివేయాలని గత బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నియామకాలు జరుపవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కొలువులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో ఎంపికైన 387 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కోర్టు ఉత్తర్వులతో వారిలో కొంత నిరాశ ఎదురైంది. నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు.. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపిక జాబితాలో ఒకే అభ్యర్థి నంబరును పలుసార్లు ప్రకటించటం, కనీస అర్హత సాధించని అభ్యర్థులు పేర్లు ఎంపిక జాబితాలో ఉండడంతో మిగిలిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించకుండానే మెరిట్ జాబితాను వెల్లడించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతానికి మించి పోస్టులు కేటాయించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నిబంధన ప్రకారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులనే నియమించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో గిరిజన అభ్యర్థులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఎంపిక ప్రక్రియ మరింత జాప్యం.. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందించాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఈ ఉద్యోగాల భర్తీ ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త పంచాయతీల పాలకవర్గం వచ్చే లోపైనా ఈ నియామక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారంనడుచుకుంటాం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్వులను నిలిపివేసి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్హుల ప్రక్రియ కొనసాగిస్తాం. జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఆర్ ఆశాలత:డీపీఓ -
ఎత్తుకు పైఎత్తు
అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్ శేఖర్ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్ తన నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చేశాడు. కానీ తొమ్మిదిన్నరకే రావాల్సిన సునీత ఇంతవరకు రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తోంది. సునీత తన ఫోన్ని ఎప్పుడూ స్విచాఫ్ చెయ్యదు. నగరంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపే సునీత రోజూ తొమ్మిదిన్నరకల్లా ఇంటికి చేరుకుంటుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి కావస్తున్నా రాలేదు. శేఖర్ బ్యూటీ పార్లర్లో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేశాడు. ఎప్పటిలాగే రాత్రి తొమ్మిదికి పార్లర్ మూసేశాక సునీత తన కారులో ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు. కొంపదీసి సునీత కారు ప్రమాదానికి గురైందా అనే అనుమానంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చెయ్యబోయాడు. అప్పుడే శేఖర్ సెల్ మోగింది. స్క్రీన్పై సునీత నంబర్ కనిపించగానే ఆత్రంగా ‘‘ఏమ్మా! ఎక్కడున్నావ్?’’ అని అడిగాడు. అవతల నుంచి సునీతకు బదులు ఇంకెవరో మాట్లాడారు.‘‘డాక్టర్ శేఖర్! మీ కూతురు ప్రస్తుతం మా బందీగా ఉంది. ఆమె ప్రాణాలతో దక్కాలంటే మీరు మేం చెప్పినట్లు చెయ్యాలి’’ అన్నాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కటువుగా.‘‘ఎవరు మీరు? మీకేం కావాలి? నా కూతుర్ని క్షేమంగా విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను’’ ఆందోళనగా అన్నాడు.‘‘మాకు డబ్బు అక్కర్లేదు. నువ్వు మాకొక చిన్న పని చేస్తే చాలు. మావాడికి భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ బయటకు తీసి కట్టు కట్టాలి. ఆ పని ఇప్పుడే చెయ్యాలి. నీ వంటి సర్జన్కి ఇదొక పెద్ద పని కాదు. సర్జరీకి కావలసిన పరికరాలు తీసుకొని నువ్వు ఇప్పుడే కారులో నేరుగా గాంధీనగర్ వచ్చెయ్. ఆలోగా మేం నీకు మళ్లీ ఫోన్ చేస్తాం. ఈ విషయం పోలీసులకు చెప్పవంటే నీ కూతురు శవం కూడా నీకు దొరకదు’’ అంటూ ఫోన్ కట్ చేశాడా వ్యక్తి.డాక్టర్ శేఖర్ ఇంటి పక్కనే ఉన్న తన నర్సింగ్హోమ్ లోంచి సర్జరీకి కావలసిన పరికరాలు, మత్తుమందు, బ్యాండేజీ సామగ్రిని ఒక బ్యాగులో వేసుకుని కారులో బయల్దేరాడు. అతను గాంధీనగర్లోకి ప్రవేశించగానే ఫోన్ మోగింది. కిడ్నాపర్ మాట్లాడాడు. ‘నీ కారును రేమండ్ షోరూమ్ ముందు పార్క్ చేసి, దానికి ఎదురుగా ఉన్న సందులోకి నడుచుకుంటూ రా’’ అని ఆదేశించాడు.శేఖర్ అతను చెప్పినట్టే చేశాడు. ఫోన్లో సూచనల ద్వారా కిడ్నాపర్ శేఖర్ని నాలుగైదు సందులు తిప్పి, చివరకు నిర్మానుష్యంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో ఆగమన్నాడు. అక్కడొక కారు నిలిపి ఉంది. కారు పక్కనే ఒక ముసుగు వ్యక్తి శేఖర్ చేతిలోని బ్యాగుతో పాటు అతని సెల్ఫోన్ కూడా తీసుకున్నాడు. సెల్ఫోన్ స్విచాఫ్ చేసి, బ్యాగును కారులో పెట్టాడు. తర్వాత శేఖర్ కళ్లకు గంతలు కట్టి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు ఉరికింది. పావుగంట ప్రయాణం తర్వాత ఒక చోట ఆగింది. ముసుగు వ్యక్తి శేఖర్ చెయ్యి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. గమ్యం చేరాక శేఖర్ కళ్లకు కట్టిన గంతలను తీసేశాడు. తానొక గదిలో ఉన్నానని గ్రహించాడు శేఖర్. గదిలోని మంచం మీద భుజానికి తూటా దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరి ముఖాలకు కూడా ముసుగులు ఉన్నాయి. గాయపడ్డ వ్యక్తి బాధకు విలవిల్లాడుతున్నాడు. డాక్టర్ శేఖర్ వెంటనే పని మొదలుపెట్టాడు. గాయపడ్డ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి అతని భుజంలో దిగిన తూటాను చాకచక్యంగా బయటకు తీశాడు. తర్వాత గాయానికి మందు రాసి, కుట్టు కుట్టి కట్టు కట్టాడు. తర్వాత పేపర్ మీద కొన్ని మందులు రాసిచ్చాడు. ‘‘తూటా చాలా లోపలకు దిగబడింది. పైగా చాలాసేపు లోపలే ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. వెంటనే ఈ మాత్రలు వాడండి. వాడకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువై ప్రాణం మీదకు వస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం చెయ్యవద్దు’’ అని ఆ ముసుగు వ్యక్తులతో చెప్పాడు.తర్వాత కిడ్నాపర్లు శేఖర్ని గాంధీనగర్ వరకు కళ్లకు గంతలతో తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దించి, సెల్ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు. శేఖర్ కారులో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి వేకువ జాము నాలుగు గంటలైంది. తెలతెలవారుతుండగా సునీత ఇంటికి వచ్చింది. తనను ఎవరో దుండగులు కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని, రాత్రంతా ఒక గదిలో బంధించి కొద్దిసేపటి కిందటే విడిచిపెట్టారని చెప్పింది. శేఖర్ రాత్రి జరిగినదంతా కూతురికి చెప్పాడు.సునీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది గనుక ఇప్పుడు కిడ్నాపర్ల గురించి పోలీసులకు చెప్పడం ధర్మం అనుకున్నాడు శేఖర్. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్కుమార్కి ఫోన్ చేసి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయ్ ఆ కిడ్నాపర్లు ఎవరో శేఖర్కి చెప్పాడు. ‘‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఈ దుర్మార్గులే నిన్న సాయంత్రం హైవేలో ఒక వజ్రాల వ్యాపారి కారును అటకాయించి, కోటి రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లారు. ఆ వ్యాపారి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు గాయపడ్డాడు. దుండగులు ఆ వజ్రాల వ్యాపారిని చంపి, తమ సహచరుణ్ణి కారులో ఎక్కించుకుని పరారయ్యారని మాకు తెలిసింది. వారు గాయపడ్డ తమ వ్యక్తిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళితే పట్టుబడిపోతామనే భయంతో మీ కూతుర్ని కిడ్నాప్ చేసి, మీ ద్వారా అతనికి చికిత్స చేయించారని ఇప్పుడర్థమవుతోంది నాకు. నిన్న రాత్రి కిడ్నాపర్లు మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన రూటును మీరు చెప్పగలిగితే మేం వారి స్థావరాన్ని కనుక్కొని వారిని అరెస్టు చేస్తాం’’ అన్నాడు విజయ్.‘‘సారీ ఇన్స్పెక్టర్. ఆ సమయంలో నా కళ్లకు గంతలు కట్టడం వల్ల నేనేమీ చూడలేకపోయాను. అయితే, వారి ఆచూకీ తెలుసుకోవడానికి నేనొక ట్రిక్కు ప్రయోగించాను. పేషెంటుకి ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేను రాసిచ్చిన మాత్రలు నెహ్రూ రోడ్డులోని అపోలో ఫార్మసీ మెడికల్ షాపులో మాత్రమే దొరుకుతాయి. నగరంలో ఇంకెక్కడా ఆ మందుల స్టాక్ లేదు. ఒక డాక్టర్గా నాకీ విషయం బాగా తెలుసు. ఆ మెడికల్ షాపు రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత తెరుస్తారు. మీరు ఆ అంగడి వద్ద మాటు వేసి, ఆ మందుల చీటీ తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే చాలు మిగిలిన వారు కూడా దొరికిపోతారు’’ ధీమాగా చెప్పాడు శేఖర్.‘‘థాంక్యూ డాక్టర్. మా పోలీసుల బుర్ర కన్నా మీ బుర్రే తెలివైనది. ఆ మందుల పేర్లు చెప్పండి చాలు. ఆ దుర్మార్గుల్ని ఇట్టే పట్టుకుంటాను.’’ హుషారుగా అన్నాడు విజయ్ రాసుకున్నాడు.తర్వాత విజయ్ అపోలో ఫార్మసీ షాపు తెరవగానే షాపు ఓనరుతో మాట్లాడి తన సిబ్బందితో కలసి మఫ్టీలో షాపు బయట మాటు వేశాడు. ఊహించినట్టే కాసేపట్లో ఒక కిడ్నాపర్ శేఖర్ రాసిచ్చిన మందుల చీటీతో అంగడికి వచ్చాడు. షాపు ఓనర్ సైగ చెయ్యగానే విజయ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత అతని ద్వారా అతని సహచరులను కూడా అరెస్టు చేసి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. - డి.మహబూబ్ బాషా -
పోరు ఆగదు
ఒంగోలు టౌన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. భావి భారత పౌరులను తీర్దిదిద్దే గురువులపై దమనకాండకు దిగింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసిన సర్కారుపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన బుధవారం సీపీఎస్ రద్దుకు సంబంధించి ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించమని ఫ్యాఫ్టో నాయకత్వం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడికక్కడ ఫ్యాఫ్టో నాయకులను బైండోవర్ చేయడం, విజయవాడలో కనిపించిన ప్రతి ఒక్కరిని బలవంతంగా అరెస్టులు చేసి అక్కడి పోలీసు స్టేషన్లన్నింటికి తరలించి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఫ్యాఫ్టో నాయకత్వం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వారి కుటుంబాల్లో 60 లక్షల ఓట్లు ఉన్నాయని, చంద్రబాబును గద్దె దించేవరకు తాము పోరాడతామంటూ హెచ్చరికలు చేశాయి. ఠాణాలకు టీచర్ల తరలింపు.. సీఎస్పురం: సీపీఎస్ రద్దు కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మంగళవారం సీఎస్పురం మండలంలోని ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఏపీటీఎఫ్, యూటీఎఫ్ల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రెండు బృందాలుగా వెళ్లారు. యూటీఎఫ్ సభ్యులను పెదకాకాని వద్ద, ఏపీటీఎఫ్ ఆద్వర్యంలో వెళ్లిన ఉపాధ్యాయులను గవర్నర్ పేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ఏరియాలలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోరాటం ఆగదు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిర్బం«ధం విధించింది. చలో అసెంబ్లీని భగ్నం చేసేందుకు ముందస్తు అరెస్టులు చేసింది. అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చి ఫ్యాఫ్టో నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అరెస్టు చేయించింది. యాభై శాతం నాయకత్వాన్ని అరెస్టు చేయించింది. మిగిలిన యాభై శాతం విజయవాడ చేరుకుంటే అక్కడ కూడా బలవంతంగా అరెస్టులు చేయించింది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అరెస్టులు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విజయవాడ వన్టౌన్ పోలీసు స్షేషన్లో తాము ఉపాధ్యాయులం కాదని చెప్పినా పదిమందిని అరెస్టు చేయించింది. రోడ్డుపై ఎవరూ కనిపించకూడదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేస్తారా, గద్దె దిగుతారా అనేది చంద్రబాబు ప్రభుత్వం తేల్చుకోవాలి. పిల్లి రమణారెడ్డి, ఫ్యాఫ్టో జిల్లా చైర్మన్ కనబడితే అరెస్టులు: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల విచక్షణారహితంగా వ్యవహరించింది. సీపీఎస్ రద్దు చేయాలంటూ కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా జాతా నిర్వహించాం. ఇంకోసారి విజయవాడలో మహా«ధర్నా చేపట్టాం. మరోసారి కలెక్టరేట్లను ముట్టడించి పాలనను స్తంభింప చేశాం. తప్పనిసరి పరిస్థితుల్లో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. ఉపాధ్యాయులు కనబడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేశారు. ఉపాధ్యాయులు కానివారిని కూడా అరెస్టు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు. ముపై ఏళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చల్లా శ్రీనివాసులు, ఫ్యాఫ్టో జిల్లా సెక్రటరి జనరల్ -
టీడీపీలో ఎయిర్ ఏషియా కలవరం
సాక్షి, అమరావతి : ఎయిర్ ఏషియా స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఆ పార్టీ నాయకుడు ఆశోక్ గజపతి రాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ ఏషియా ప్రతినిధుల మధ్య జరిగిన సంభాషణల ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ టేపులో చంద్రబాబు మనిషే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు.. ఆయన్ని పట్టుకుంటే మనకు కావాల్సిన పని అవుతుందని వారి మధ్య సంబాషణ నడిచింది. దీంతో సమస్యను పక్కదోవ పట్టించడానికి టీడీపీ రంగం సిద్ధం చేసింది. టీడీపీ గతంలో ఓటుకు కోట్లులో విషయంపై వివరణ ఇవ్వకుండా సమస్యను దాటవేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ స్కాంలో టీడీపీ నాయకుల పేర్లు రావడంపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎదురుదాడికి దిగారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతల గురించి వచ్చిన ఆరోపణలపై స్పందించకుండా ఎయిర్ ఏషియాలో స్కాం నిజమైతే కేంద్రమంత్రులంతా డబ్బులు తిన్నట్టే అంటూ వింత రాగం అందుకున్నారు. చంద్రబాబు ప్రస్తావన ఎలా బయటకి వచ్చిందంటూ ప్రశ్నించారు. భారత్లో ఫోన్ ట్యాపింగ్ అనుమతిస్తున్నారా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నవి బయటకెలా వచ్చాయన్నారు. ఈ అంశాన్ని కేంద్రానికి ముడిపెడుతూ.. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి కేంద్రం నియంత పాలన చేస్తుందని కుటుంబరావు ఆరోపించారు. -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యం
పరకాల రూరల్ : తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పలువురు రైతులు ఆదివారం పురుగు మందు డబ్బాలతో మండలంలోని సీతారాంపురం పరకాల–కంఠాత్మకూర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు మేల్ ఫిమేల్ వరి రకాన్ని 60 ఎకరాల్లో సాగు చేశారు. పంట పూర్తయిన అనంతరం 25 మందికి చెందిన 28 ఎకరాల వరి పంటను హార్వెస్టింగ్ చేసి మిగిలిన 32 ఎకరాల పంట విషయంలో రేపు, మాపు అంటూ కంపెనీ ఆర్గనైజర్ కాలం గడిపాడు. ఈ క్రమంలో ఈనెల మూడో తేదీన కురిసిన అకాల వర్షంతో 32 ఎకరాల్లో ధాన్యం గింజలు పూర్తిగా రాలిపోయాయి.ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను అడగితే పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీడ్ ఆర్గనైజర్ రఘుపతి తమ మిషన్తోనే హార్వెస్టింగ్ చేసుకోవాలని షరతు పెట్టడంతోపాటు కోతకు వచ్చిన తమ పంటలను వదిలి అధిక రేట్లతో ఇతర గ్రామాల్లో హార్వెస్టింగ్ చేశాడని, దీంతో తాము నష్టపోయామని వాపోయారు. -
భావోద్వేగాలను నియంత్రించుకోగలరా?
నిద్రలో కలత చెందటం, రోజుల తరబడి నిద్ర కరవు కావడం, శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లనుకోవటం, వారిలో వారు మాట్లాడుకోవటం, రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడటం. ఇవన్నీ వివిధరకాల భావోద్వేగాలకు లోనైనవారి లక్షణాలు. సంతోషంతో అరవటం, ఎదుటవున్నవారిని ఎత్తుకోవటం, ఆనందబాష్పాలు మొదలైనవి కూడ భావోద్వేగాలే అయితే వీటివల్ల మనిషికి సంతోషం కలుగుతుంది. ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సహజమైనాయి. ఎలాంటి స్థితిలోనైనా భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు. మీరు మీ ఎమోషన్స్ని నియంత్రించుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోండి. 1. మిమ్మల్ని బాధపెట్టే, ఇబ్బందిపెట్టే ఆలోచనలకు ప్రతిస్పందించకుండా ఉండే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. మీ రియాక్షన్ వల్ల లాభం జరుగుతుందా అని ఆలోచిస్తారు. మీవల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనుకుంటే అలాంటి ఆలోచనను మానుకుంటారు. ఎ. కాదు బి. అవును 3. మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే తదుపరి పర్యవసానాలు ఎలా ఉంటాయో విశ్లేషించగలరు. ఎ. కాదు బి. అవును 4. ప్రశాంతంగా, నిదానంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడ చాలా హుందాగా నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 5. మాటల వల్ల కొందరు బాధపడతారు. కొందరు తీవ్రంగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు తోచిన విధంగా మాట్లాడరు. ఎ. కాదు బి. అవును 6. ఆందోళనగా ఉన్నప్పుడు సంగీతాన్ని వింటారు. డ్యాన్స్ చేస్తారు. మీ అలవాట్లు ఎలావున్నాయోనని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటుంటారు. ఎ. కాదు బి. అవును 7. మీరెలాంటి సమయాల్లో చాలా ఆనందంగా గడుపుతారో (కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం మొదలైనవి) గుర్తిస్తారు. మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఆనందం కలిగించే పనులను చేయటం అలవాటుగా చేసుకుంటారు. ఎ. కాదు బి. అవును 8. ఎస్/నో, మంచి/చెడు ఇలా ప్రతి విషయానికి రెండు పార్శా్వలు ఉంటాయని మీకు తెలుసు. అందుకే మీరు భావోద్వేగాలకు లోనైనప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఎ. కాదు బి. అవును 9. మీ ఎమోషన్స్ను అణచివేయడం కన్నా వాటిని మంచిగా మలచుకోవటానికే ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని రకాల భావోద్వేగాలు అవసరమవుతాయని గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. మీ సమస్య మరీ ఎక్కువైనప్పుడు సైకాలజిస్ట్ సహాయం పొందటం మరచిపోరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే ఎమోషన్స్ని నియంత్రించుకోగలిగే శక్తి మీకుంటుంది. ఉత్సాహం కలిగినప్పుడు ఎలా ఉంటారో ఒత్తిడిలో కూడ అలాగే ఉండగలరు. ఒడిదుడుకులలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో మీరు చాలా వీక్. ప్రతి విషయానికీ డీలా పడిపోతూ అసంతృప్తితో ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ మిమ్మల్ని వెంటాడతాయి. ‘బి’ లను సూచనలుగా భావించి ఎమోషన్స్ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. -
స్కూల్ టెస్ట్ టెన్షన్..?
ఎగ్జామ్స్ మొదలవుతున్నాయంటే పిల్లలు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి పిల్లలు చురుగ్గా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి కల్పిస్తున్నారా? 1. పరీక్ష ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల నిద్ర తప్పని సరిగా పోయేటట్లు చూస్తున్నారు. ఎ. అవును బి. కాదు 2. టైమ్ అయిపోయిందని లేదా ఒత్తిడి కారణంగా తినాలనిపించక ఖాళీ కడుపుతో పరీక్షలకు వెళ్లిపోతుంటారు పిల్లలు. ఇది తప్పని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 3. తాజా పండ్లు, కూరగాయలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కాబట్టి పరీక్షల సమయంలో తప్పని సరిగా వీటిని తినిపిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 4. పిల్లలు ఒకింత ఆందోళన కొద్దీ అన్నం తినడానికి విముఖత చూపిస్తూ ఆర్టిఫీషియల్ షుగర్స్తో చేసిన స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, వేపుడు పదార్థాలు, మాంసం వంటి చిరుతిళ్లను ఇష్టపడతారు. ఇవి ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి తిననివ్వకుండా జాగ్రత్తపడతారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలు తినకూడని వాటిని ఇంట్లో సిద్ధంగా ఉంచి తినవద్దు అని కండిషన్ పెడితే చిన్నబుచ్చుకుంటారు, ఆ మూడ్తో చదువు మీద దృష్టికేంద్రీకరించలేరు కాబట్టి పరీక్షల సమయంలో ఇంట్లోకి రానివ్వరు. ఎ. అవును బి. కాదు 6. ఈ సమయంలో పిల్లలకు నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువ సేపు శక్తినిచ్చే మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలను ఆహారంలో భాగం చేస్తున్నారు. ఎ. అవును బి. కాదు 7. పరీక్షల గురించి భయపెట్టకుండా జాగ్రత్తలను మాత్రమే చెబుతున్నారు, ఎ. అవును బి. కాదు 8. ఉన్న సమయమంతా కూర్చుని చదవడమే కాకుండా రోజుకు పది నుంచి పదిహేను నిమిషాల సేపు వ్యాయా మం చేస్తే మెదడు చురుగ్గా ఉంటుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పిల్లలను పరీక్షల ఒత్తిడికి లోనుకానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అనుకోవాలి. ‘బి’లు ఎక్కువైతే ఒకసారి మనస్తత్వ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు చెప్పే విషయాలను గమనించండి. -
ఇంటర్ ‘స్పాట్’లో గొడవ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం చేసినందుకు చెల్లించే భత్యం (డీఏ) మంజూరులో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ అధికారులతో అధ్యాపకులు గొడవకు దిగారు. ఇందులో భాగంగా అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం పెన్డౌన్ చేసి నిరసన తెలిపారు. 50 కిలోమీటర్ల పైబడిన దూరం నుంచి స్పాట్ విధులకు వస్తున్న అధ్యాపకులకు రూ. 450 ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే 50 కిలోమీటర్ల లోపు దూరం నుంచి వచ్చేవారికి రూ. 300 ఇవ్వాల్సి ఉందన్నారు. రూ. 300ను రూ. 120కు తగ్గించినట్లు సామాజిక మాద్యమాల్లో మెసేజ్లు వస్తున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు. గతంలో కంటే ధరలు పెరిగాయని ఈ పరిస్థితుల్లో ఇంకా పెంచాల్సిందిపోయి డీఏ తగ్గించడం అన్యాయమని వాపోయారు. స్థానికంగా (లోకల్) ఉంటూ స్పాట్కు వచ్చే అధ్యాపకులకు గతంలో రూ. 130 దాకా ఇచ్చే రెమ్యూనరేషన్ ఈసారి రద్దు చేసినట్లు తెలిసిందని దీనిపై కూడా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ పరీక్షల విధుల్లో పాల్గొన్నవారికి డీఏ మొత్తంలో తగ్గించారు తప్ప స్పాట్ విధుల్లో పాల్గొన్నవారికి తగ్గించాలనే సమాచారం తమకు రాలేదన్నారు. -
భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్ కాపీయింగ్కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్ కాపీయింగ్కు అందరూ బాధ్యులేనంది. గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది. మాస్ కాపీయింగ్ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఉభయ రాష్ట్రాల్లోని మాస్ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్ కాపీయింగ్ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్ను కోరింది. మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది. -
పెట్రోల్ ధర తగ్గుతుంది!
ముంబై: పెట్రోల్లో 15 శాతం మిథనాల్ను కలపడం ద్వారా ఇంధనం ధరను, కాలుష్యాన్ని కూడా తగ్గించే విధానాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఇందుకు సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తానే ప్రకటన చేస్తానన్నారు. లీటర్ పెట్రోల్ ఖరీదు దాదాపు 80 రూపాయలు ఉంటుండగా, బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే లీటర్ మిథనాల్ మాత్రం రూ.22కే లభిస్తుందనీ, చైనాలో అయితే ఈ ధర మరీ రూ.17 మాత్రమేనని గడ్కారీ వివరించారు. స్వీడన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో ముంబై కోసం పూర్తిగా మిథనాల్తో నడిచే ప్రత్యేక బస్సులను తయారుచేసిందనీ, త్వరలోనే 25 బస్సులను నగరంలో తిప్పేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. మిథనాల్ను ముంబైలో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచే ఉత్పత్తి చేయవచ్చనీ, వాటి నుంచి వచ్చే ఇంధనాన్నే ఈ బస్సులకు వాడతామన్నారు. పెట్రోలియం శుద్ధి పరిశ్రమలను నిర్మించేందుకు రూ.70 వేల కోట్లు ఖర్చవుతుండగా, మిథనాల్పై అయితే ఈ వ్యయం రూ.లక్షన్నర కోట్లుగా ఉంటున్నప్పటికీ...మిథనాల్పై దృష్టి పెట్టాల్సిందిగా తాను పెట్రోలియం శాఖ మంత్రికి సూచించానన్నారు. దేశంలో పెరిగిపోతున్న వాహనాల సంఖ్యపై గడ్కారీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సగటున రోజుకు 28 కిలో మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామనీ, త్వరలోనే దీనిని 40 కిలో మీటర్లకు తీసుకెళ్తామని ఆయన చెప్పారు. 2018లో 20 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మిస్తామన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయనీ, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘జాతీయ రహదారుల, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ’ (ఎన్హెచ్ఐడీసీఎల్–నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ను స్థాపించామని ఆయన చెప్పారు. -
వారి ప్రాతినిధ్యం పెరగాలి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఇతర ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ న్యాయ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోవింద్ ప్రసంగించారు. ‘ఉన్నత న్యాయ వ్యవస్థలో బలహీన వర్గాలైన మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అంత తక్కువగా ప్రాతినిధ్యం ఉండటం ఆమోదయోగ్యం కాదు. ఇతర సంస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోని వైవిధ్యం ప్రతిబింబించేలా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాలి’ అని కోవింద్ అన్నారు. ప్రతి నలుగురు జడ్జీల్లో ఒక్కరే మహిళ ఉన్నారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులకు దూరంగానే పేదలు.. జిల్లా, సెషన్స్ కోర్టుల జడ్జీల నైపుణ్యాలు పెంచే గురుతర బాధ్యత ఉన్నత న్యాయ వ్యవస్థపైనే ఉందని కోవింద్ నొక్కిచెప్పారు. అలా అయితేనే చాలా మంది జిల్లా కోర్టుల జడ్జీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు పదోన్నతులు పొందుతారని పేర్కొన్నారు. దీని వల్ల దిగువ కోర్టులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా హైకోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నా, ఖర్చు, విచారణల ఆలస్యానికి భయపడి పేదలు కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని కోవింద్ పేర్కొన్నారు. ధనికులు లొసుగులను అడ్డుపెట్టుకుని కేసులను సాగదీస్తున్నారని, కాలం చెల్లిన, పనికిరాని చట్టాలను రద్దుచేసి పాలనను సులభతరం చేయాలని చెప్పారు. సీజేఐ వర్సెస్ కేంద్ర మంత్రి న్యాయ వ్యవస్థ క్రియాశీలతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ పవిత్ర కర్తవ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొనగా, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు దూరంగా ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గౌరవం ఉంటుందని చౌదరి అన్నారు. అలా కాకుండా న్యాయ క్రియాశీలత, సమీక్షల పేరుతో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయ స్వతంత్రత మూల స్తంభం వంటిదని, న్యాయ వ్యవస్థలోని జవాబుదారీతనం ఆ స్తంభానికి పునాది అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం, వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని అన్నారు. విధానపర నిర్ణయాలు చేయాలనే కోరిక న్యాయవ్యవస్థకు లేద ఆయన సమాధానమిచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణకు కోర్టులు చూపుతున్న చొరవను సీజేఐ సమర్థించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. -
జర్నలిస్టు హత్యను ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రంలో బెంగాలీ పత్రిక ‘షాన్దాన్ పత్రిక’ జర్నలిస్టు సుదీప్దత్త భౌమిక్ హత్యను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. తన అవినీతిపై కథనాలు ప్రచురించినందుకు ప్రతీకారంగా త్రిపుర స్టేట్ రైఫిల్స్(టీఎస్ఆర్) కమాండెంట్కు బాడీగార్డుగా పనిచేస్తున్న నంద రెయాంగ్ అనే కానిస్టేబుల్ సుదీప్ను మంగళవారం కాల్చిచంపిన సంగతి తెలిసిందే. పాత్రికేయుడిని కానిస్టేబుల్ హత్య చేయడం తీవ్రమైన విషయమని ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్ బుధవారం వ్యాఖ్యానించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రెండు నెలల్లోపే త్రిపురలో జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. ఇలాంటి హత్యలతో పాత్రికేయుల్లో అభద్రతాభావం పెరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడులకు ఉసిగొల్పుతున్న ఈ హింసావాతావరణాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్కే బ్లాక్డే: కిషన్రెడ్డి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తుంటే, కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ మాత్రమే ఆందోళన చెందుతున్నదని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్రెడ్డి అన్నారు. దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా కాంగ్రెస్ పార్టీ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తమ కడుపుమంటను బయట పెట్టుకున్నారని అన్నారు. అవినీతిపరులకు కొమ్ముకాస్తూ పెద్దనోట్ల రద్దును బ్లాక్ డే గా ప్రకటించారని కిషన్రెడ్డి ఆరోపించారు. ఎన్నో కుంభ కోణాలకు పాల్పడిన కాంగ్రెస్పార్టీకే తప్ప దేశప్రజలకు బ్లాక్డే కాదని అన్నారు. -
మహిళలకు ‘ఫ్లూ’ భయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా స్వైన్ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బాధితుల్లో 50 శాతం మంది 45 ఏళ్లు దాటిన మహిళలే కావడం విశేషం. పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఫ్లూ సులభంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంత కాలంగా ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన హెచ్1ఎన్1 స్వైన్ఫ్లూ కారక వైరస్ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలిఫోర్నియా స్ట్రెయిన్గా పిలవ బడే ‘మిషిగావ్ స్ట్రెయిన్’గా రూపాంతరం చెందినట్లు ఇటీవల పుణే వైరాలజీ విభాగం గుర్తించింది. హెచ్1ఎన్1 వైరస్తో పోలిస్తే ఇది మరింత శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, గర్భిణులు, చిన్నారులపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోంది. గ్రేటర్లోనే అత్యధిక కేసులు.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 మంది స్వైన్ఫ్లూ బాధితులు చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు అనుమానితులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,876 ఫ్లూ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 1,450 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మంది చనిపోగా, వీరిలో హైదరాబాద్కు చెందిన వారే 30 మంది ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఠి ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ రోగి శరీరం నుంచి గాలిలోకి ప్రవేశిస్తుంది. ఠి ఇలా ఒకసారి బయటకు వచ్చిన వైరస్ వాతావరణంలో రెండు గంటలకుపైగా జీవిస్తుంది. ఠి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ఠి ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు వస్తాయి. ఠి కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఠి ముక్కుకు మాస్కు ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఠి వీలైనంత వరకు నీరు ఎక్కువ తాగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. ఠి సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్లకపోవడమే ఉత్తమం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
కంటి నిండా నిద్ర కరవయిందా?
సెల్ఫ్ చెక్ చాలామంది తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నా, అందుకు సరైన నిద్రలేకపోవడం కూడా ఒక కారణమనుకోరు. మీకు కూడా నిద్ర రాని సమస్య ఉందా? తెలుసుకోవాలంటే ఈ సెల్ఫ్చెక్ పూర్తి చేయండి. 1. రాత్రి వేళ నడుం వాల్చాక గంటలకొద్దీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పగలు కాస్త కుదురుగా కూర్చుంటే చాలు, నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. ఎ. అవును బి. కాదు 3. అర్ధరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపోలేరు. ఎ. అవును బి. కాదు 4. పగలు చాలా ఆందోళనగా, చికాకుగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 5. మీటింగ్లలో వద్దనుకున్నా నిద్ర వస్తుంది. ఎ. అవును బి. కాదు 6. డ్రైవ్ చేస్తున్నప్పుడో, బస్సులో వెళుతున్నప్పుడో ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. నిద్రలేవగానే మీరు ఫ్రెష్నెస్ ఫీల్ కారు. ఎ. అవును బి. కాదు 8. నిద్రలో గురకపెడతారని సన్నిహితులు మీకు చెబుతుంటారు. ఎ. కాదు బి. అవును 9. పనిపై ఏకాగ్రత చూపలేరు. ఎ. అవును బి. కాదు 10. స్లీపింగ్ పిల్స్ తరచూ వాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు 7 దాటితే మీరు నిద్ర కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారని అర్థం. ఇందుకు కారణాలేమిటో విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.. ‘బి’లు 7 కన్నా ఎక్కువ వస్తే నిద్ర గురించి ఆందోళన చెందనక్కర లేదు. -
మీ దుఃఖానికి కారణం మీరేనా?
సెల్ఫ్చెక్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్చెక్ ద్వారా మీ భావాలను తెలుసుకోండి. 1. ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు. ఎ. అవును బి. కాదు 2. స్నేహితులు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే వ్యతిరేకిస్తారు. ఎ. అవును బి. కాదు 3. నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతోంది. ఎ. అవును బి. కాదు 4. తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకెవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు. ఎ. అవును బి. కాదు 7. మీకు రావలసిన ప్రొమోషన్ రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 8. అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 9. పార్టీలో మీపై సూప్ పడితే పెద్ద అవమానంగా భావిస్తారు. ఎ. అవును బి. కాదు 10. సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటున్నారని అర్థం. ఎప్పుడూ దిగాలుగా, నిరాశావాదంతో, అభద్రతలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను వదిలిపెట్టాలి. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా, పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు. -
డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి..
నిర్లక్ష్యంగా గర్భసంచి ఆపరేషన్.. పేగుతో కలిపి కుట్లు జమ్మికుంట(హుజూరాబాద్): కడుపు నొప్పి ఉందని ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ వైద్యుడి నిర్లక్ష్యంతో చివరికి ప్రాణం కోల్పోయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన జరగగా, మహిళ మృతిపై కోపోద్రిక్తులైన బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమిటిపల్లి గ్రామానికి చెందిన మెరుగు సుజాత(35) కడుపునొప్పితో బాధపడుతూ గత నెలలో జమ్మికుంటలోని జమ్మికుంట మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్ రాఘవేంద్ర వద్ద వైద్య పరీక్షలు చేసుకున్నారు. స్కానింగ్ చేసిన ఆయన గర్భసంచికి కంతులు, వాపు వచ్చిందని, ఆపరేషన్ చేయాలని సూచించాడు. ఈ నెల 1న ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ రాఘవేంద్ర నిర్లక్ష్యంగా పేగుతో కలిపి కుట్లు వేశాడు. నాలుగు రోజుల తర్వాత ఇంటికి పంపించాడు. తర్వాత సుజాతకు కడుపు నొప్పి తగ్గకపోగా.. కడుపు ఉబ్బుతూ వాంతులు మొదలయ్యాయి. రెండు రోజుల తర్వాత సుజాత మళ్లీ ఆస్పత్రికి వచ్చి సమస్య చెప్పింది. వైద్యుడు మందులు రాసి పంపించాడు. అయినా తగ్గకపోవడంతో గురువారం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హన్మకొండలో స్కానింగ్ తీసుకోవాలని వైద్యుడు పంపించాడు. కడుపులో పేగు మడత పడిందని అక్కడి వైద్యులు సూచించారు. స్కానింగ్ రిపోర్టును తీసుకొచ్చి చూపించగా, గురువారం రాత్రి 10 గంటలకు సుజాతకు డాక్టర్ ఆపరేషన్ చేశాడు. సుజాత భర్త తిరుపతిని రక్తం కోసం రాత్రి వేళ హన్మకొండకు పంపించాడు. రాత్రి ఒంటిగంట సమయంలో సుజాతను హన్మకొండకు తీసుకొస్తున్నామని, మీరు అక్కడే ఉండాలని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పడంతో తిరుపతి హన్మకొండలోని మాక్స్కేర్ ఆస్పత్రి వద్దే ఉన్నాడు. 2 గంటల సమయంలో హన్మకొండకు చేరుకోగా.. మాక్స్కేర్ వైద్యులు సుజాతను చూసి చనిపోయిందని నిర్ధారించారు. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆందోళన చేశారు. అయినా, వైద్యులు రాకపోవడంతో ఆస్పత్రి అద్దాలు, కంప్యూటర్ సామగ్రిని ధ్వంసం చేశారు. సీఐ ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో ఆస్పత్రి వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. చివరకు ఇరువర్గాల పెద్ద మనుషులు చర్చలు జరిపి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
అటకెక్కిన ‘సాక్షర భారత్’!
♦ రెండేళ్లుగా నిధులు విడుదల చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ నిలిచిపోయిన కార్యక్రమాలు.. మూతబడుతున్న కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: సాక్షర భారత్ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రాజెక్టుకు రెండేళ్లుగా నిధులు విడుదల చేయక పోవడంతో అమలు చేయాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామస్థాయిలో సాక్షర భారత్ కేంద్రాలు దాదాపు మూతపడ్డాయి. నిరక్షరా స్యులైన వయోజనులకు కనీస విద్య అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ను 2010లో అమల్లోకి తెచ్చింది. ఇందుకు గ్రామస్థాయి లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహ ణకు గ్రామ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 443 మండలాల్లో 17,500 కేంద్రాలు ప్రారంభించారు. గ్రామ స్థాయి సమన్వయకర్తలకు రూ.2 వేలు, మండల సమన్వయకర్తలకు రూ.6 వేల గౌరవ వేతనం ప్రక టించారు. ప్రాజెక్టుకు ని ధులు కేటాయించక పోవడంతో అనేక కేంద్రాలకు తాళం పడింది. మండల, గ్రామ సమన్వయకర్తలకు గౌరవ వేతనమూ అందక వారు విధులకు హాజర వడం లేదు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీల్లో ఎక్కువగా నిరక్షరాస్యులున్నారని, కాబట్టి కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అనుసంధానం చేయాలని సమన్వయకర్తలు కోరు తున్నారు. వేతనాలు, కార్యక్రమం అమలుపై ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేస్తామని, ఆగస్టులో దీనికి కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ సమన్వయకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శు లు సురేందర్, వెంకటయ్య పేర్కొన్నారు. -
ఇన్.. ఔట్
♦ జీఎస్టీతో మారుతున్న వ్యాపారుల తలరాతలు ♦ పాత డీలర్లలో చిరు వ్యాపారులకు ఊరట ♦ వారి స్థానంలో కొత్తగా టెక్స్టైల్స్ వ్యాపారుల చేరిక ♦ రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ కలిగిన డీలర్ల లైసెన్స్లు రద్దు ♦ జిల్లా రెవెన్యూ ప్రకారమే కొత్త సర్కిళ్ల ఏర్పాటు ♦ ఆహార ధాన్యాల మినహాయింపుతో 5 శాతం రెవెన్యూ లోటు. ♦ మొరాయిస్తున్న జీఎస్టీ పోర్టల్ సర్వర్లు నల్లగొండ: ఏకీకృత పన్ను విధానం వ్యాపారుల తలరాతను పూర్తిగా మార్చేస్తోంది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల్లోపు ఉన్న వ్యాపారులను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఈ అవకాశం కొందరు చిరువ్యాపారులకు ఊరట కలిగించింది. గతంలో వార్షిక టర్నోవర్ రూ.7.50 లక్షలు కలిగిన వ్యాపారులు కూడా వ్యాట్ చెల్లించాల్సి వచ్చేది. కానీ జీఎస్టీ విధానంలో పన్ను పరిధి రూ.20 లక్షలు దాటిన వ్యాపారుల పైన ప్రయోగించారు.దీంతో వ్యాట్ పరిధిలోని కొందరు డీలర్లు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే అదృష్టం కలిసొచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, ట్రేడర్లు, పారిశ్రామిక సంస్థలు ఇలా వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 9,673 మంది డీలర్లు ఉన్నారు. వీరిలో జీఎస్టీలోకి మైగ్రేట్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న డీలర్లు 9,348 మంది ఉన్నారు. వారందరికి కూడా జీఎస్టీ ప్రొవిజనల్ గుర్తింపుకార్డులు జారీ అయ్యాయి. జీఎస్టీ కోసం దరఖాస్తు చేసుకున్న డీలర్లకు ముందుగా ప్రొవిజనల్ గుర్తింపు కార్డులు జారీ చేసి ఆ తర్వాత మెల్లగా జీఎస్టీ లైసెన్స్లు ఇస్తారు. ఈ విధంగా పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ పొందిన డీలర్లు ఇప్పటి వరకు 7,689 మంది, దీని నుంచి మినహాయింపు పొందిన డీలర్లు 325 మంది ఉన్నారు. అయితే ఈ తరహా డీలర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కొత్త డీలర్ల ప్రవేశం.. జీఎస్టీలో టెక్స్టైల్స్ రంగాన్ని చేర్చడంతో కొత్త డీలర్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలోని ఐదు సర్కిళ్ల పరిధిలో సుమారు 150 నుంచి 200 మంది వ్యాపారులు కొత్తగా జీఎస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక సమస్యల కారణంగా కొత్త దరఖాస్తుల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రావడం లేదని అధికారులు అంటున్నారు. చిరువ్యాపారుల స్థానంలో వస్త్రవ్యాపారులను చేర్చడం వ ల్ల డీలర్ల సంఖ్యలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం వస్త్ర వ్యాపారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చేంత వరకు కొత్త డీలర్ల చేరికలు నామమాత్రంగానే ఉంటాయని తెలుస్తోంది. మొరాయిస్తున్న సర్వర్లు.. పాత డీలర్లు, కొత్త డీలర్ల దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తుండడంతో జీఎస్టీ సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీనికితోడు దరఖాస్తు విధానంలో డీలర్లు చేస్తున్న పొరపాట్లు కూడా కారణమవుతున్నాయి. జీఎస్టీ లైసెన్స్కు పాన్ కార్డు తప్పనిసరి కావడంతో డీలర్లు తప్పులో కాలేస్తున్నారు. పాన్ కార్డుల మిస్మ్యాచింగ్ వల్ల జీఎస్టీ లైసెన్స్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. భాగస్వాములతో కూడిన సంస్థలు కూడా జీఎస్టీలోకి మారేటప్పుడు అనేక తప్పిదాలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. డీలర్ల సందేహాలు తీర్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో హెల్ప్డెస్క్తో పాటు, సర్కిళ్ల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదాయం పైనే కొత్త సర్కిళ్లు.. జిల్లాలో ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్ కార్యాలయాలు నల్లగొండ, మిర్యాలగూడ ,కోదాడ, సూర్యాపేట, భువనగిరిలో ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినందున కార్యాలయాల సేవల పరిధి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సహజంగానే సిబ్బంది పెంపు, కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా జీఎస్టీ రూపంలో ఎంత రెవెన్యూ జిల్లా నుంచి వస్తుందో లెక్కకట్టాల్సి ఉంటుంది. జీఎస్టీ లెక్కల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ.కోటిన్నర వరకు ఉన్నట్లయితే దాంట్లో రాష్ట్రానికి 90 శాతం, కేంద్రానికి పది శాతం పన్ను వెళ్తుంది. అదే వార్షిక టర్నోవర్ రూ.కోటిన్నర దాటితే మాత్రం రాష్ట్రానికి 50 శాతం, కేంద్రానికి 50 శాతం పన్ను రూపంలో వెళ్లనుంది. ఈ లెక్కన ఎంత మంది డీలర్లు ఏ పన్ను పరిధిలోకి వస్తారనేది నిర్ధారణ కావాల్సి ఉంది. వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు జిల్లా నుంచి వచ్చే రెవెన్యూలో సింహభాగం బియ్యం, నూకలు, ధాన్యం పైన 5 శాతం పన్ను వసూలయ్యేది. ప్రస్తుతం జీఎస్టీలో ఆహారధాన్యాలను మినహాయించడం మూలానా 5 శాతం పన్ను రద్దైంది. దీంతో జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో 5 శాతం తగ్గిపోనుంది. గతంలో సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నటువంటి సేవా పన్నును జీఎస్టీలో కలిపారు. ఇలాంటి హెచ్చుతగ్గులన్నింటినీ బేరీజు వేసుకుని రెండు, మూడు మాసాల పాటు వేచిచూస్తే తప్పా జీఎస్టీ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని అధికారులు అంటున్నారు. ఆ తర్వాతే కొత్త సర్కిళ్ల ప్రతిపాదన పరిశీలిస్తారని వారు తెలిపారు. అప్పటి వరకు ప్రతి సర్కిల్ పరిధిలో జీఎస్టీ అధికారులతో మొబైల్ టీంలు పర్యటించనున్నాయి. వస్తు రవాణా వాహనాలను మొబైల్ టీంలు తనిఖీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. మూడు జిల్లాల్లోని డీలర్ల వివరాలు.... సర్కిల్ మొత్తం డీలర్లు జీఎస్టీలోకి మారిన డీలర్లు భువనగిరి 1,393 1,154 కోదాడ 1,752 1,480 ఎల్టీయూ నల్లగొండ 27 27 మిర్యాలగూడ 1,942 1,445 నల్లగొండ 3,010 2,378 సూర్యాపేట 1,549 1,205 -
తాత్కాలిక విరమణ
► జల్లికట్టు తరహాతో భయపెట్టిన అన్నదాతలు ► మెరీనాలో మోహరించిన పోలీసులు ► రెండు నెలల్లో డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం హామీ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నదాతలను ఆదుకోకుంటే జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని భయపెట్టారు. నగరం దిగ్బంధం అయిపోయింది. మెరీనా బీచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దిగివచ్చిన ప్రభుత్వం రెండునెలల గడువు కోరడంతో రైతన్నలు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం దక్షిణభారత నదుల అనుసంధానం సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేశారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపి డిమాం డ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఢిల్లీలో ఆందోళన విరమించారు. అయితే సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఆందోళనబాట పట్టారు. మధ్యప్రదేశ్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంజలి ఘటించడానికి, రైతులు కోర్కెల సాధన కోసం చెన్నై చేపాక్లోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద శుక్రవారం నిరవధిక ఆందోళన ప్రారంభించారు. కాల్పుల్లో మృతి చెందిన రైతుకు తొలిరోజున అంజలి ఘటించేలా ఆం దోళన జరిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి చెన్నైలోని పలు ప్రాంతాల నుంచి వం దల సంఖ్యలో యువకులు రైతుల ఆందోళనా శిబిరానికి చేరుకున్నారు. ఇంకా మరికొందరు ద్విచక్రవాహనాల్లో బయలుదేరగా నగరంలోని పలుచోట్ల పోలీసులు నిలిపివేసి వెనక్కు పంపారు. అ తరువాత రైతుల అందోళనా శిబిరం ఉన్న చేపాక్ ప్రభుత్వ అతిథిగృహం వైపు వెళ్లే అన్ని మార్గాలకు బారికేడ్లను అడ్డుపెట్టి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఆందోళనా శిబిరం వైపు వాహనాలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. వంద మందికి పైగా పోలీసులు ఆ పరిసరాల్లో బందోబస్తుగా నిలిచారు. వాలాజా రోడ్డులో వాహనాలను అనుమతించకుండా దారిమళ్లించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్యోగాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్నాశాలై, కామరాజర్శాలై ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. రైతుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో యువకులు తరలిరావడంతో మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందని కంగారుపడిన పోలీసు యంత్రాంగం మెరీనా బీచ్ వద్ద గట్టి బందోబస్తు పెట్టింది. రెండోరోజు ఆందోళన సందర్భంగా అర్ధనగ్నంగా శిబిరంలో కూర్చున్నారు. చేపాక్ స్టేడియం సమీపంలో కార్పొరేషన్ పార్కులోని టాయిలెట్ల వినియోగానికి అనుమతించారు. పోలీసులే రైతులకు ఆహార సదుపాయాన్ని కల్పించారు. కాగా, చెన్నై సచివాలయంలో సీఎంతో చర్చలకు రైతు ప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. అయ్యాకన్ను నేతృత్వంలో ఐదు గురు రైతులు సీఎంతో చర్చలు జరిపారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, చెరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్లను సీఎం ముందుంచారు. ముఖ్యమంత్రితో చర్చించిన ఆంశాలను రైతులకు వివరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సచివాలయంలో మీడియాకు అయ్యాకన్ను చెప్పాడు. సీఎంను కలిసిన అనంతరం అయ్యాకన్ను నేరుగా ఆందోళనా శిబిరానికి వచ్చి సీఎంతో చర్చించిన ఆంశాలను వివరించాడు. పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేద్దామని కోరగా అందరూ చేతులు ఊపుతూ తమ ఆమోదాన్ని తెలిపారు. ఆ తరువాత ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయ్యాకన్ను మీడియా వద్ద ప్రకటించాడు. రెండు నెలల్లోగా తమ డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం అంశాన్ని ప్రస్తావించగా, తమిళనాడులోకి వాటిని రానివ్వమని ఆర్థికమంత్రి జయకుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. అర్ధనగ్నంగానే సీఎం వద్దకు: సీఎంతో చర్చలకు వచ్చేవారు చొక్కాలు ధరించి రావాలని పోలీసులు కోరారు. దీంతో ఆందోళనా శిబిరాల్లోని వారికి చొక్కాలు తెచ్చివ్వాలని బందోబస్తులో ఉన్న పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే అయ్యాకన్ను సహా మిగిలిన రైతు ప్రతినిధులు చొక్కా వేసుకునేది లేదని భీష్మించుకోవడంతో అర్ధనగ్నంగానే సీఎం వద్దకు అనుమతించక తప్పలేదు -
తెలంగాణలో ఉండనివ్వరు.. ఏపీకి రానివ్వరు!
త్రిశంకుస్వర్గంలో ఉద్యానవర్సిటీ సిబ్బంది సాక్షి, అమరావతి: ‘‘దశాబ్దాల పాటు విద్యా బోధన చేశాం. ఇప్పుడేమో తెలంగాణలో వద్దంటారు, ఆంధ్రా వాళ్లు రానివ్వరు.. ఏడాదిన్నరగా తాము పడుతున్న మనోవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. మాకెందుకీ శిక్ష’’ అని ఉద్యాన వర్సిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సేవల్ని వినియోగించుకోవాలని, తెలుగు రాష్ట్రాలలోని రెండు ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్లు తలుచుకుంటే తమ సమస్యను గంటలో పరిష్కరిం చవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే... రాష్ట్ర విభజన అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని రెండుగా విభజించారు. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉన్నాయి. ఈ సంస్థల ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజనకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. ఇవి రాకుండానే యూని వర్సిటీకి తెలంగాణలో అనుబంధంగా ఉన్న ఉద్యాన కళాశాలలు, ఇతర పరిశోధన సంస్థలలో పని చేస్తున్న ఆంధ్రా స్థానికత కలిగిన 33 మందిని 2015 నవంబర్ 27న తెలంగాణ నుంచి రిలీవ్ చేశారు. రిలీవ్ చేసేటప్పుడు ఆంధ్రాలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ను కూడా సంప్రదించాలి. అలాంటిదేమీ జరక్కుండానే వీళ్లను తెలంగాణ నుంచి రిలీవ్ చేయడంతో వాళ్లిప్పుడు త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. పెరిగిన అధికారుల వేధింపులు! రిలీవ్ ఆర్డర్లతో ఆంధ్రాకు వెళ్లిన ఈ 33 మందిని తీసుకునేందుకు అక్కడి విశ్వవిద్యాలయం అధికారులు తిరస్కరించారు. తిరిగి వాళ్లు తెలంగాణకు వస్తే బాపూజీ విశ్వవిద్యాలయం వారు.. రిలీవ్ అయిన తర్వాత ఇక అవకాశమే లేదన్నారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక కొందరు జీతభత్యాలు, పోస్టింగ్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఉభయుల వాదన విన్న హైకోర్టు.. ఉద్యోగం సంగతి తర్వాత చూద్దాం, జీతాలను మాత్రం 52, 48 నిష్పత్తిన ఇవ్వండని రెండు వర్సిటీలను ఆదేశించింది. జీతాలయితే వస్తున్నాయి గానీ పని లేదు. ప్రమోషన్లు లేవు. కరవుభత్యాలు, ఇంక్రిమెంట్లు లాంటివేవీ లేవు. జూనియర్లు సీనియర్లవుతున్నారు. ఎక్కడో చోట పోస్టింగ్ ఇచ్చి తమ సేవల్ని వినియోగించుకోవాలని అటు గవర్నర్ మొదలు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. -
నగదు బదిలీ విధానంతో ఉపాధికి గండం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న రేషన్ సరుకులకు నగదు బదిలీ విధానం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఐఏడీపీ హాలులో జరిగిన డీలర్ల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానం అమలు జరిగితే రాష్ట్రంలోని 29 వేల మంది డీలర్ల కుటుంబాలకు, వారి దగ్గర పనిచేస్తున్న 29 వేల సహాయకుల కుటుంబాలు, రాష్ట్రంలోని 266 బియ్యం గోడౌన్లల్లో పనిచేస్తున్న 4 వేల మంది హామాలీల కుటుంబాలకు, 5 వేల మంది కిరోసిన్ హాకర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు ఎటువంటి ఖర్చు లేకుండా రేషన్ సరుకులను తమ షాపులకు దిగుమతయ్యేలా చర్యలు తీసుకోవాలని రేషన్ దుకాణం నిర్వహణ వ్యయం భారీగా పెరిగినందున వాటి నిర్వహణ ఖర్చు పోను గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.20 వేలు ఆదాయం వచ్చేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. పంచదార, కిరోసిన్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించడంతో డీలర్లు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయాల్సి వస్తుందని, దీనివల్ల వారికి వచ్చే కమిషన్లు కూడా నామమాత్రంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, కోశాధికారి పి.చిట్టిరాజు, నాయకులు పి.వెంకటరావిురెడ్డి, వాసిరెడ్డి వెంకట నరసింహరావులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 1500 మంది డీలర్లు పాల్గొన్నారు. -
నాకు భర్త కావాలి..
► భర్త ఇంటి ముందు భార్య ఆందోళన ► మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా): ‘నాకు భర్త కావాలి.. నాకు ఆయన ఇంట్లో ఆశ్రయం కల్పించండి’ అంటూ ఒక మహిళ తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గుండ్లదుర్తి రాజేంద్రప్రసాద్రెడ్డి స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని మాలెపాడు. అయితే కొన్నేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని లింగారెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో సుమలత చిన్న కూతురు. 2015 అక్టోబర్లో బాలాజినగర్–1లో నివాసం ఉంటున్న చిలకల గురు ప్రతాపరెడ్డితో సుమలత వివాహం జరిగింది. అతను హైదరబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. వివాహ సమయంలో తల్లిదండ్రులు కట్నకానుకల కింద 60 తులాల బంగారు ఇచ్చారు. పెళ్లైన నాలుగు రోజులకే ఆమె అత్తగారింటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత గురు ప్రతాప్ హైదరాబాద్కు సంసారాన్ని మార్చాడు. ‘ఐదు ఎకరాలు పొలం రాసిస్తేనే ఇక్కడ ఉండు, లేకుంటే మీ అమ్మగారింటికి వెళ్లిపో’ అని భర్త, అత్తా మామలు చెప్పారు. ఈ క్రమంలోనే గత ఏడాది భార్య చేతులు కట్టేసి, తాళి తెంచి భర్త చిత్రహింసలకు గురి చేశాడు. ఈ సంఘటనపై హైదరాబాద్లోని నాసింగ్ పోలీస్స్టేషన్లో భర్తపై 498 ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది. భర్తతోపాటు అత్తా, మామ, ఆడపడచుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హైదరాబాద్లోని మరో మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సుమలత ఆరోపిస్తోంది. ఏడాది నుంచి ఆమె అమ్మగారింట్లోనే ఉంటోంది. ప్రతాప్రెడ్డి రూ.15 లక్షలు నగదు ఇస్తే విడాకులు తీసుకునేలా పెద్దలు పంచాయితీ చేశారు. అయితే జరిగిన ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వలేదు. ఇటీవల రూ.4 లక్షలు మాత్రమే ఇస్తామని ఆమె అత్తా, మామలు చెప్పి పంపించారు. డబ్బు వద్దని తనకు భర్త కావాలని, ఇంట్లో తనకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఆమె బుధవారం బాలాజీనగర్లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. మహిళా సంఘం జిల్లా నాయకురాలు మరియమ్మ, సులోచన, ముంతాజ్, నాగలక్షుమ్మ, లక్ష్మీదేవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, వలి, విజయ్, చెన్నారెడ్డి, కొండన్న తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచారు. టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురిని స్టేషన్కు రమ్మని చెప్పారు. విచారించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె నిరసన విరమించింది. -
ఐపీఎల్ అభిమానులు ఆందోళన
-
‘వాసవి’ వద్ద తీవ్ర ఉద్రిక్తత
పెదతాడేపల్లి (తాడేపలి్లగూడెం రూరల్ ) : పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్య గురువారం రాత్రి 10 గంటలకు కూడా పరిష్కారం కాలేదు. మరోసారి శుక్రవారం నాటికి వాయిదా పడింది. కళాశాల బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 15 మందికి యాజమాన్యం అటెండె న్స్ తక్కువ చూపుతూ పరీక్షకు హాజరుకాకుండా(డిటెయిన్) చేసిందని విద్యార్థుల వాదన. ఎటువంటి సమాచారం లేకుండా తమను డిటెయిన్ చేస్తున్నట్టు ప్రకటించారని, అది కూడా వేరే బ్రాంచ్ నోటీస్ బోర్డులో తమ పేర్లు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం సహచర విద్యార్థులు చెప్పడంతో బుధవారం కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించగా తాత్సారం చేశారని పేర్కొంటున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆందోళన చేపట్టామన్నారు. అయితే గురువారం రికార్డులు సరి చూస్తామని చెప్పారని, నలుగురు విద్యార్థుల అటెండె న్స్ విషయంలో పొరపాటు జరిగిందని తెలిపారన్నారు. వారితో పాటు మరో ఇద్దరికి అటెండెన్స్ అడ్జెస్ట్మెంట్ చేసి పరీక్షకు హాజరయ్యేలా చూస్తామని చెప్పారన్నారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరోసారి మెకానికల్ బ్రాంచి విద్యార్థులు బస్సులను నిలుపుదల చేసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకానొక సమయంలో మెకానికల్ విద్యార్థులు కళాశాల భవనాలు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రాత్రి 9.30 గంటలకు విద్యార్థులు బస్సులకు అడ్డంగా పడుకున్నారు. తదుపరి తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, పట్టణ సీఐ ఎంఆర్ఎల్ఎస్ఎస్ మూర్తి, ఎస్సై ఎం.సూర్యభగవాన్ఆధ్వర్యంలో రాత్రి 9.40 గంటలకు విద్యార్థులను బయటకు లాగారు. చర్చల పేరుతో మెకానికల్ బ్రాంచి విద్యార్థులను మభ్యపెట్టి రాత్రి 9.50 గంటలకు మిగిలిన విద్యార్థులను బస్సుల్లో వారి వారి స్వస్థలాలకు తరలించారు. రాత్రి 10 గంటలకు కూడా మెకానికల్ విద్యార్థుల సమస్య పరిష్కారం కాలేదు. శుక్రవారం నాటికి వాయిదా వేశారు. సోమవారం నుంచి మెకానికల్ విద్యార్థులకు రెండో సెమిస్టర్ ప్రారంభం కానుంది. యాజమాన్యం వాదన ఆందోళన చేస్తున్న మెకానికల్ బ్రాంచి విద్యార్థులకు 40 నుంచి 50 శాతం మాత్రమే అటెండ న్స్ ఉందని కళాశాల కరస్పాండెంట్ చలంచర్ల సుబ్బారావు తెలిపారు. నూటికి నూరు శాతం అటెండె న్స్ తప్పనిసరని, 65 నుంచి 75 శాతం వరకూ ఉన్నా అర్హత పొందే అవకాశం ఉంద న్నారు. చివరకు మెడికల్ సర్టిఫికెట్తో కూడా వారికున్న అటెండె న్స్పై విద్యార్థులు పరీక్షకు అర్హత పొందే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
గళమెత్తిన డ్వాక్రా మహిళలు
అత్తిలి: డ్వాక్రా గ్రూపులకు రెండో విడతగా మంజూరు చేసిన రుణమాఫీ సొమ్ము ఇవ్వడం లేదంటూ అత్తిలి మండలం వరిఘేడు పంచాయతీ కార్యాలయంవద్ద మహిళలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రూపుల పొదుపు ఖాతాల్లో సొమ్ములు జమ చేసి నెలలు గడుస్తున్నా చేతికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు వద్దకు వెళితే నగదు లభ్యత లేదని, ఏప్రిల్లో ఇస్తామని చెబుతున్నారని అన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ములు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తిరుపతిపురం గోదావరి గ్రామీణ బ్యాంక్మేనేజర్ను వివరణ కోరగా నగదు విత్డ్రాపై ఇప్పటి వరకు ఆంక్షలు ఉండటం, నగదు లభ్యత పూర్తిస్థాయిలో లేకపోవడంతో రుణమాఫీ సొమ్ము ఇవ్వడానికి ఆటంకం ఏర్పడిందని, నగదు లభ్యతను బట్టి వారికి అందజేస్తామని చెప్పారు. త్వరలోనే గ్రూపు సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. -
పైసలేవీ సారూ!
కందులు అమ్మిన రైతులకు అందని సొమ్ము ►48 గంటల్లో బ్యాంకులో జమ చేస్తామన్న ప్రభుత్వం ►వారం పదిరోజులైనా దిక్కులేని వైనం ►ఇంకా రూ.152 కోట్లు పెండింగ్.. అటు కొనుగోళ్లూ తక్కువ ►పండింది 5 లక్షల టన్నులు.. ప్రభుత్వం కొన్నది 65 వేల టన్నులు ►విధిలేక దళారులకే తెగనమ్ముకుంటున్న రైతాంగం ►క్వింటాల్కు రూ. 800 నష్టం.. ఆందోళనలో అన్నదాత హైదరాబాద్ రాష్ట్రంలో కంది రైతుకు కష్టకాలం వచ్చింది. సరిగా వర్షాలు కురవక ఇప్పటికే పంట దిగుబడి తగ్గిపోగా.. వచ్చిన పంటకైనా సకాలంలో డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. కందులను కొన్న ప్రభుత్వ సంస్థలు వారం పదిరోజులైనా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు తక్షణావసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంస్థలకు అమ్మితే వెంటనే సొమ్ము చేతికందక.. మద్దతు ధరకన్నా తక్కువకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాల్ రూ.800 వరకు నష్టపోతున్నట్లు అంచనా. కేంద్ర సంస్థలు సకాలంలో సొమ్ము విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇవ్వకపోవడం వల్లే సకాలంలో సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ప్రచారం ఘనం.. చేయూత శూన్యం ‘పత్తి వద్దు.. సోయా, కంది పంటలే ముద్దు’అంటూ గతేడాది ప్రభుత్వం చేసిన ప్రచారానికి చాలా మంది రైతులు ఆకర్షితులయ్యారు. ధర కూడా ఎక్కువగా ఉండడంతో 2016 ఖరీఫ్లో 10.3 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఇది సాధారణం కంటే 4 లక్షల ఎకరాలు అదనం కావడం గమనార్హం. దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధర పడిపోయింది. గతేడాది కంది ధర మార్కెట్లో క్వింటాల్కు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4,200 వరకే పలికింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ. 5,050 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. కేంద్ర సంస్థలైన నాఫెడ్, ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మార్క్ఫెడ్, హాకాల ద్వారా 95 వేల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 5 లక్షల టన్నుల వరకు కంది దిగుబడి వస్తుందని అంచనా. కానీ చాలా తక్కువగా 95 వేల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపైనే విమర్శలు వచ్చాయి. చివరికి నిర్ణయించిన స్థాయిలోనూ కొనుగోళ్లు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలన్నీ కలసి ఇప్పటివరకు 65,538 మంది రైతుల నుంచి 65,723 టన్నుల కందులే కొనుగోలు చేశాయి. ఇందుకోసం రైతులకు రూ.341 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ రూ.189 కోట్లే చెల్లించారు. మిగతా రూ.152 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలి. కానీ వారం పది రోజులైనా చెల్లించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్ఫెడ్ కోరగా.. రూ.30 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కూడా విడుదల కాకపోవడంతో రైతులకు సొమ్ము చెల్లింపు ఆలస్యమవుతోందని అంటున్నారు. దళారులే దిక్కయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతులు 2.5 లక్షల టన్నుల కందిని విక్రయించారని అంచనా. అందులో 65 వేల టన్నులకుపైగా ప్రభుత్వ సంస్థల కేంద్రాల్లో విక్రయించగా.. మిగతా 1.85 లక్షల టన్నులు దళారులకే అమ్మినట్లు తెలుస్తోంది. మార్కెట్లో క్వింటాల్కు రూ.4,200 ధర మాత్రమే పలికినా.. తక్షణమే సొమ్ము చేతికి వస్తుందన్న భావనతో అమ్ముకున్నారు. ఇక సెకండ్ గ్రేడ్ కందులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. అందువల్ల కూడా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పలుచోట్ల అధికారులు, దళారులు కుమ్మక్కై.. గ్రేడ్–1 కందిని గ్రేడ్–2 అంటూ తిప్పి పంపినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఆ రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న దళారులు.. అదే కందిని మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసుకుంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మార్కెట్లోకి మరింతగా కంది పంట రానుంది. దీంతో దళారులు మరింతగా తెగించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరాలకు ఇబ్బందిగా ఉంది ‘‘ఈనెల 4న మార్క్ఫెడ్ కేంద్రంలో నాలుగు క్వింటాళ్ల కందులు అమ్మిన. మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. పది రోజులవుతున్నా డబ్బులు జమ కాలేదు. ఇంటి అవసరాలకు ఇబ్బందిగా మారింది..’’ – రైతు, మామిడి అంజిలప్ప, పగిడ్యాల్ (యాలాల) గతేడాదితో పోలిస్తే నష్టమే ‘‘గతేడాది కంది క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల దాకా ధర పలికింది. ఈసారి ధరలను అమాంతం తగ్గించేశారు. పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్ల కందులు పండాల్సి ఉండగా.. సరిగా వర్షాల్లేక రెండు మూడు క్వింటాళ్లే పండాయి. దీంతో నష్టమే మిగులుతోంది..’’ – రైతు శివారెడ్డి, అప్పక్పల్లి, నారాయణపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా 60 శాతం సొమ్ము చెల్లించాం: ‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన దాంట్లో ఇప్పటివరకు 60 శాతం వరకు నగదు చెల్లించాం. గతం కంటే ఇది ఎంతో ఎక్కువ. వాస్తవంగా దళారుల వద్దే రైతులకు చెల్లించడంలో ఆలస్యమవుతోంది..’’ – ఎం.జగన్మోహన్, మార్క్ఫెడ్ ఎండీ -
ఎనిమిది నెలలుగా అందని వేతనాలు
ప్రభుత్వాస్పత్రి ఎదుట పారిశుధ్య సిబ్బంది ఆందోళన పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్ తమకు ఎనిమిది నెలలు గా వేతనాలు ఇవ్వడంలేదని కార్మికులు శుక్రవారం ఆస్ప త్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టర్ మూడు మాసాలు, కొత్తగా పనులు తీసుకున్న కాంట్రాక్టర్ నుంచి ఐదు నెలల వేతనాలు అందాల్సి ఉందని కార్మికులు దాసరి లక్ష్మి, గుజ్జుల విజయ పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేశారు. ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున వేతనం ఇస్తున్న కాంట్రాక్టర్లు ఇపుడు తమకు అనుకూలమైన ఎనిమిది మందికే పనికల్పిస్తామంటున్నారని కార్మికురాలు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. తమకు నెలానెల వేతనాలివ్వకపోవడంతో పస్తులుంటున్నామని విజయ, లక్ష్మి, పద్మ, కనకమ్మ, ఈశ్వరి, ఈర్ల పోశమ్మ, బీబీ, భాగ్యమ్మ, రవి ఆవేదన వ్యక్తం చేశారు. 14 మంది పనిచేస్తున్నా ఎనిమిది మంది ఖాతాలకే వేతనాలు వేస్తామంటున్నారని తెలిపారు. తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పనిభద్రతను కల్పించేలా ఉన్నతాధికారులు చొరవచూపాలని కోరారు. ఈ విషయమై పారిశుధ్య పనులు పొందిన సావనీర్ కంపనీ ప్రతినిధిని ఫోన్ లో సంప్రదించగా అవసరానికి మించి సిబ్బంది ఉండడం ఇబ్బందిగా మారిందన్నారు. ఎనిమిది మందికే వేతనాలందించే అవకాశముందన్నారు. అయితే చాల కాలంగా పనిచేస్తున్నందున తాము ఇచ్చే వేతనాలను అందరూ పంచుకోవాలని సూచించామని పేర్కొన్నారు. -
పెద్దనోట్ల రద్దు బూటకం
ఎస్బీఐ వద్ద సీపీఎం ఆందోళన అనంతపురం : నల్లధనం బయటకు తీయడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెద్ద బూటకమేనని సీపీఎం నాయకులు విమర్శించారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ, సామాన్యులు నగదు కోసం పడుతున్న కష్టాలపై సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సాయినగర్లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి, అవినీతిని అంతం చేస్తామని ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద క్యూలో నిల్చుని 50 మంది, బ్యాంక్ పని ఒత్తిడితో 11మంది మరణించారని గుర్తుచేశారు. చిత్తూరులో స్వయానా సీఎం చంద్రబాబు తీసుకున్న టీటీడీ పాలకవర్గ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్రెడ్డి ఇంట్లో వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ సందర్బంగా పాతనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లను ప్రింట్ చేసేంతవరకు పాతనోట్లను చలామణిలో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే పింఛన్ల పంపిణీలో సైతం పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, నాగప్ప, బాబా ఫకృద్ధీన్ , ప్రకాష్, ముత్తుజాలతో పాటు అధిక సంఖ్యలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలపై బాబు తర్జనభర్జన
-
ఎమ్మెల్యే వ్యాఖ్యలు హాస్యాస్పదం
మాజీ ఎమ్మెల్యే నాడగౌడ సింధనూరు టౌన్ :తుంగభద్ర ఎడమ కాలువకు నీటిని వదిలే విషయంపై నిర్ణయాన్ని డివిజనల్ కమిషనర్ తీసుకోవాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే హంపనగౌడ్ అసహాయకమైన వ్యాఖ్యలు చేయ డం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే వెంకటరావు నాడగౌడ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎమ్మెల్యేనే స్వయంగా రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. నీటి సరఫరా నిలిపి వేసే విషయంపై తాము అధికారులను ప్రశ్నిస్తే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో తగినంత నీరు నిల్వ ఉందని, అందువల్ల నెలలో 10 రోజుల పాటు ఎడమ కాలువకు నీటి సరఫరాని నిలిపి వేయరాదన్నారు. కాలువకు నీటి సరఫరా నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, అందువల్ల ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కాలువకు నిరంతరంగా నీరు వదిలేలా చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. కాలువకు నిరంతరం గా నీటి ని సరఫరా చేయకుంటే రైతులతో కలిసి ఈనెల 18న సింధనూరులో రాస్తారోకో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా జేడీఎస్ అధ్యక్షుడు లింగప్ప దడేసూగూరు, నగర శాఖ అధ్యక్షుడు జహీరుల్లా హసన్, ప్రముఖులు ధర్మనగౌడ, సత్యనారాయణ, బసవరాజ నాడగౌడ, వెంకోబ కలూ ్లరు, సత్యనారాయణ, తిమ్మారెడ్డి, సుమిత్ తడకల్, వీరేష్ హట్టి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై మిరప రైతుల ఆందోళన
డోర్నకల్ : డోర్నకల్తో పాటు మన్నెగూడెం, వెన్నారం, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు చెందుతున్నారు. మిరప పంటలను సాగు చేస్తున్న పలువురు రైతులు చెట్లకు పూత, కాత తేడా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవా, సీఎస్ 333 రకం విత్తనాలతో సాగు చేసిన రైతులు చెట్లకు ఆశించినంత కాపు లేదని, కాయలు చిన్నగా లావుగా ఉండి కాపు తక్కువ ఉందంటూ ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పలువురి రైతుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఏఓ పద్మజ ఫర్టిలైజర్ దుకాణాల్లో విచారణ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఏఓ తెలిపారు. నర్సింహులపేటలో నర్సింహులపేట : నకిలీ మిరప విత్తనాలు విక్రయించారంటూ దంతాలపల్లిలోని పర్టిలైజర్ దుకాణాల ఎదుట రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నకిలీమిరప విత్తనాలు ఇవ్వడంతో మొక్క ఎదుగుదల, కాత, పూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణా యజమానులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్ష్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం, అగపేట, తూర్పుతండా, పడమటిగూడెంలకు చెందిన రైతులు రాము, వీరన్న, లచ్చిరాం, చైతన్యరెడ్డి, వెంకట్రెడ్డి, రవీందర్, లచ్చిరాం, సుధాకర్, నర్సింహరావు, ప్రసాద్, సోమ్లా, ధర్మాతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అట్టుడికిన అనంత
వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతల సస్పెన్షన్ దీనికి నిరసనగా ధర్నా.. నాయకుల అరెస్ట్ ఇటుకలపల్లి స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన ఎస్కేయూ: విద్యార్థి నాయకులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని సోమవారం చేపట్టిన ఆందోళనతో ఎస్కేయూనివర్సిటీ అట్టుడికిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, వర్సిటీ నేత వై.భానుప్రకాష్రెడ్డి, పరిశోధక విద్యార్థి జి. జయచంద్రారెడ్డిలను సస్పెండ్ చేస్తూ క్యాంపస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి నిరసనగా వర్సిటీ పాలక భవనం ముందు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థి నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎందుకు బనాయించారో తెలపాలన్నారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ వైఎస్సా ర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి నరసింహా రెడ్డి, భానుప్రకాష్, జయచంద్ర, సునీల్, చిరంజీవిలను ఇటుకలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్కు తరలించారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటుకలపల్లి పోలీస్స్టేçÙన్ వద్ద ఆందోళన చేపట్టారు. అక్రమ కేసులు, సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగీశ్వరరెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, మారుతీ నాయుడు, గువ్వల శ్రీకాంత్రెడ్డి, పి.శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ మోహన్, సుధీర్ రెడ్డి, లోకేష్ షెట్టి, పాలే జయరాం నాయక్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల తిరుగుబాటు : మరో వైపు ఉద్యోగులు తమకు జారీ చేసిన మెమోలపై వివరణ ఇచ్చేది లేదని భీష్మించారు. వివరణ ఇవ్వడానికి సోమవారం తుది గడువు కావడంతో ఏ తప్పూ చేయని తాము ఎందుకు వివరణ ఇవ్వాలనే సమష్టి నిర్ణయానికి ఉద్యోగులు వచ్చారు. ఎస్కేయూ బోధనేతర సంఘం నాయకులు ఉన్నతాధికారులను సంప్రదించి.. మెమోలు ఎందుకు జారీ చేశారని, బంద్లో ఉద్యోగుల ప్రమేయం ఏముందని ప్రశ్నించారు. ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి హామీ దక్కలేదు. దీంతో సోమవారం సాయంత్రం బోధనేతర సంఘం కార్యాలయంలో అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా, సస్పెన్షన్ విధించినట్లుగా విద్యార్థులకు నోటీసులు అందచేయాలని ప్రిన్సిపల్ ఆచార్య సీఎన్ కృష్ణానాయక్ ఆయా విభాగాధిపతులను కోరారు. -
దిగుబడిపై.. దిగులు!
♦ ఖరీఫ్ దిగుబడులపై రైతుల్లో ఆందోళన ♦ సకాలంలో కురవని వర్షాల ఫలితం ♦ మొక్కజొన్న, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం ♦ మరిన్ని వానలు కురిస్తేనే గట్టెక్కనున్న కంది.. ♦ ప్రాథమిక అంచనాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ ఖరీఫ్లో సాధారణ, సాగైన విస్తీర్ణం వివరాలు(హెక్టార్లలో)... పంట సాధారణం సాగు వరి 25,600 20,338 జొన్న 9,171 6,418 మొక్కజొన్న 42,857 48,723 కంది 35,247 42,282 పెసలు 5,651 6,387 మినుములు 4,465 5,532 ఆముదం 2,118 1,188 సోయా 17,200 5,259 పత్తి 57,247 40,069 ఖరీఫ్ చివరి దశకు చేరింది. ఈ నెలాఖరుతో సీజన్ ముగియనుంది. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ ఈసారి విస్తీర్ణం ఆశాజనకంగానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,17,295 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 1,85,713 హెక్టార్లే సాగైంది. సీజన్ ముగియడానికి మరో పక్షం రోజులు గడువున్నప్పటికీ విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ఈసారి సాధారణ విస్తీర్ణంలో 85శాతం సాగు జరిగినప్పటికీ... వర్షాల మధ్య అంతరం భారీగా ఉండడం, కొన్నిచోట్ల వర్షాభావ పరిస్థితులే నెలకొనడంతో దిగుబడిపై రైతాంగం ఆందోళన చెందుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : రెండేళ్లుగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఈసారీ పునరావృతమయ్యాయి. సీజన్లో క్రమంగా కురవాల్సిన వర్షాలు అడపాదడపా భారీగా కురిశాయి. దీంతో రైతులు మెట్టపంటలు సాగుచేశారు. అయితే, సాగుచేసిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో పలుచోట్ల పంటలు నేలవాలాయి. అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో అవి తిరిగి జీవం పోసుకున్నప్పటికీ దిగుబడి చేతికి వచ్చే అంశంపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు భారీ విస్తీర్ణంలో సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో సాగైనప్పటికీ... వాటిలో ప్రస్తుతం పూర్తిస్తాయి దిగుబడి ఇచ్చే పంటలు తక్కువని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జూ నెలలో వర్షాలు మురిపించినా జూలైలో మాత్రం కాస్త మందగించాయి. ఆ తర్వాత ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలే నమోదయ్యాయి. సీజన్లో 58.7 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా... ఇప్పటివరకు 45.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ వర్షాలతో అక్కడక్కడా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పంటల ఎదుగుదలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. వర్షాల మధ్య అంతరం 3 రోజులకుగాను కొన్ని చోట్ల 7 నుంచి 10 రోజుల వరకు ఉంది. ఈ సమయంలో పంటల ఎదుగుదల నిలిచిపోయే ప్రమాధం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పంటల దిగుబడి భారీగా పతనం కానుంది. వివిధ మండలాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ మేరకు విశ్లేషిస్తున్నారు. వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలపై ఈ ప్రబావం పడనుంది. కంది పంటకు మరింత సమయం ఉన్నందున... ఆ లోపు మరిన్ని వర్షాలు కురిస్తే సత్ఫలితాలు ఉంటాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. -
‘సమ్మె విరమిస్తేనే...’
మణికొండ: డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు మణికొండలోని మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారు ఆందోళనకు సిద్ధ పడుతుండగానే మంత్రి బయటకు వచ్చి వారితో చర్చించి వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగటం తగదన్నారు. రెండవ ఏఎన్ఎంల విషయంలో తాను ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించామని, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కేంద్రం మంజూరు చేయాల్సి ఉన్నందునే ఆలస్యం జరుగుతుందన్నారు. సమ్మె విరమించి తన వద్దకు వస్తేనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. దాంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఐటీయూ నేతలు జైపాల్రెడ్డి, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బలరాం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 4వేల మంది రెండ వ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలన్నా రు. 10 పీఆర్సీ ప్రకారం ఏఎన్ఎంలకు బేసిక్ జీతం రూ. 21.300లతో పాటు డీఏ, హెచ్ఆర్ఏలు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోనందునే సమ్మెకు దిగామన్నారు. కార్యక్రమం లో కవిత, రోజా, రమాదేవి, అనిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ జిల్లాలో కలపాలని రాస్తారోకో
స్తంభించిన రాకపోకలు బంద్ విజయవంతం నేరడిగొండ : నేరడిగొండ మండలాన్ని తిరిగి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఇచ్చిన బంద్లో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్ జిల్లాకు నేరడిగొండ మండలం వైద్య, విద్య, వాణిజ్య, చారిత్రాత్మక సంబందాలు ఉన్న నేరడిగొండ మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. దూరభారం తగ్గడంతో పాటూ అభివద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. మేజార్టీ ప్రజల అభిష్టానాన్ని పరిగణలోకి తీసుకుని నిర్మల్ జిల్లాలో కలపాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. అఖిల పక్ష నాయకులు సరసాని రవీంధర్రెడ్డి, ఆడే వసంత్రావ్, కొండ గోవర్ధన్, మద్దెల అడెల్లు, ఏలేటి రాజశేఖర్రెడ్డి, పొన్న గంగారెడ్డి, ఆడేపు నరెంధర్, సాబ్లే ప్రతాప్సింగ్, కొట్టాల మోహన్, కుంట కిరణ్కుమార్రెడ్డి, ఏలేటి దేవేందర్రెడ్డి ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. స్తంభించిన రాకపోకలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై అఖిల పక్ష నాయకులు రాస్తారోకో చేయడంతో ఆ దారి గుండా వెళ్లే వాహనాలు సుమారు 3కిలోమీటర్ల మేర స్థంబించాయి. ఆదిలాబాద్ వద్దు– నిర్మల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నేరడిగొండ ఏఎసై ్స దశరథ్, ఇచ్చోడ ఎసై ్స శంకర్ నాయక్లు రాస్తారోకో చేస్తున్న అఖిల పక్ష నాయకులతో మాట్లాడి కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తానని హామీనివ్వడంతో నాయకులు రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్ కూనల గంగాధర్, ఎసై ్స శంకర్నాయక్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కాగా మండలంలో విద్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వాంకిడిలో రాస్తారోకో నేరడిగొండ మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలపాలంటూ సోమవారం వాంకిడి వద్ద రాస్తారోకో చేపట్టారు. కాగా గ్రామంలోని వివిధ వ్యాపార సంస్థలతో పాటూ పాఠశాలలను స్వచ్చందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు. ఆందోళనలో నాయకులు రాథోడ్ రవీంధర్, పచ్చుసింగ్, శేక్అలీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేత నేరడిగొండ మండలాన్ని నూతనంగా ఏర్పాటవుతున్న నిర్మల్ జిల్లాలోనే కలపాలని కోరుతూ సోమవారం కలెక్టర్ జగన్మోహన్కు అఖిల పక్షం నాయకులు ఆడే వసంత్రావ్, సరసాని రవీంధర్రెడ్డి, మద్దెల అడెల్లు, కొండ గోవర్ధన్, రాజశేఖర్రెడ్డి, ఆడేపు నరెంధర్, ప్రపుల్రెడ్డి, తదితరులు కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. -
నీటమునిగిన పంటలు
రేపల్లె : సాగునీరు అందక, వర్షాలు లేక ఒక ప్రాంత రైతులు ఆందోళన చెందుతుంటే మరో ప్రాంత రైతులు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగి తల్లడిల్లిపోతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల పరిధిలో సుమారు 40 వేల హెక్టార్లలో వరిసాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు నారుమళ్ళు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని చెరుకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెం గ్రామంలో వేసవిలో వేసిన వేరుశనగ, మోటార్ల సాయంతో వేసిన వరినారుమళ్లు నీట మునిగి పంట నీటిలో నానుతుండటంతో రైతులకు కంటతడి పెడుతున్నారు. రాంబొట్లవారిపాలెం, కావూరు, తుమ్మలపాలెం గ్రామపంచాయితీల పరిధిలో సుమారు 500 ఎకరాల వరకు వేరుశనగ సాగు చేస్తున్నారు. రాంబొట్లవారిపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని చిన్న, సన్నకారు రైతులు 100 మంది సుమారు 200 ఎకరాలలో వేరుశనగ వేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తున్న తరుణంలో కురిసిన వర్షాలకు పంట చేలలోకి నీరు చేరి వేరుశనగ పంట కుళ్లిపోయే దశకు చేరింది. -
బాబోయ్ సినిమా హాళ్లు...
నిబంధనలను గాలికి.. సర్వత్రా విమర్శలు నరసరావుపేట టౌన్: వినోదం కోసం ఉత్సాహపడితే ప్రమాదం వెన్నంటే ఉంటోంది...ఇదీ జిల్లాలో సినిమా థియేటర్ల పరిస్థితి. కష్టాన్ని, అలసటను మరిచిపోయేందుకు సినిమాకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదంటూ సగటు ప్రేక్షకుడు ఆందోళన చెందే పరిస్థితి జిల్లాలో ఉంది. జిల్లాలో నిర్వహిస్తున్న సినిమా థియేటర్లలో 80శాతం హాళ్లకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేవని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఇక రెవిన్యూ డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పరిస్థితైతే మరీ దారుణం. ఇక్కడ ఆరు థియేటర్లు ఉంటే ఐదింటికి అగ్నిమాపకశాఖ అనుమతులు లేవు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ చర్యలకు తీసుకోవలసిన పరికరాలు అందుబాటులో లేవు. నరసరావుపేట పట్టణంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని నిబంధనలను గాలికి వదిలేశారని, డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? దాచేపల్లి మండలం నారాయణపురంలో అలంకార్ థియేటర్ షార్ట్ సర్క్యూట్తో బుధవారం అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగక పోయినా రెండుకోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లింది. నరసరావుపేట పట్టణంలోని థియేటర్లలో కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఎంతైనా ఉందనే భయాందోళనలు ప్రజానీకం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని సినిమా «థియేటర్లను అగ్నిమాపక శాఖ అనుమతులు, నివారణ పరికరాలు లేకుండా ఇలాగే కొనసాగిస్తే.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. థియేటర్లలో తనిఖీలు చేపట్టి, నిబంధనలను సరిగా పాటించకపోతే వాటిని నిలిపివేసే అధికారం అధికారులకు ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిసినా అధికారులు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారో అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. ప్రతి విడుదల సినిమాకు థియేటర్ల యాజమాన్యం నుంచి వివిధ శాఖల వారు వాటాలను తీసుకోవడం వల్లే ఆవైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు పాటించని సినిమాథియేటర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు పొందాలని మూడుసార్లు నోటీసు ఇచ్చాం.. నరసరావుపేటలో కొనసాగుతున్న ఆరు సినిమా «థియేటర్లలో చిత్రాలయ «థియేటర్కు మినహా మిగిలిన సినిమా హాళ్ళకు తమశాఖ అనుమతులు లేవని ఫైర్ ఆఫీసర్ జయరావు స్పష్టం చేశారు. ఉన్న ఒక్క థియేటర్ కూడా రెన్యువల్ గడువు ముగియవచ్చిందన్నారు. ఇప్పటికే అనుమతులు పొందాలని మూడుసార్లు నోటీసులు జారీ చేశామన్నారు. ఉన్నతా«ధికారుల ఆదేశాలతో చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. జయరావు ఫైర్ఆఫీసర్ -
చిల్లర దొంగల హల్చల్
పీఎం పాలెం: పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్లర దొంగల బెడద అధికంగా ఉంది. ఆర్నెల్లలో 45 చోరీ కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ దొంగతనాల జోరు ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గొలుసు దొంగతనాలు 5, ఇంటి దోపిడీలు 13, రెండు ద్విచకక్రవాహనాలు, రెండు ల్యాప్ ట్యాప్ కేసులున్నాయి.మిగిలినవి చిన్నచిన్న కేసులు. వీటిలో రెండు చైన్ స్నాచింగ్ , ఒక ఇంటి దొంగతనం కేసులను మాత్రమే పోలీసులు చేధించారు. వరుస దొంగతనాలతో బెంబేలు గత వారంలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఓ టైల్స్ మార్టుషాపు పైకప్పు తొలగించి షాపులోకి ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్లోని రూ. 1.85 లక్షలు దోచుకున్నారు. కారుషెడ్ కూడలి చుట్టు పక్కల ఉన్న చిరు, మధ్యతరహా షాపులతో పాటు ఆలయాల్లో హుండీలను కూడా చోరులు వదలడం లేదు. కూడలి ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 30 వరకు షాపులున్నాయి. వీధి దీపాలు సక్రమంగా వెలగక పోవడాన్ని అవకాశంగా తీసుకుని చిల్లర దొంగలు రాత్రి వేళల్లో తమ హస్త లాఘవం చూపుతున్నారు. పాన్షాప్లే లక్ష్యంగా.. కిళ్లీ బడ్డీలు, చిన్న చిన్న షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. చేతికి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు› ఇక్కడి స్క్రాప్ కొట్టులో చిల్లర దొంగలు ప్రవేశించి గళ్లా పెట్టెలో ఉన్న రూ. 500 దోచుకు పోయారు. కూడలికి సమీపంలో ఉన్న శివాలయానికి చెందిన హుండీని శుక్రవారం రాత్రి బద్దలు కొట్టి భక్తులు సమర్పించిన నగదు కానుకలు అపహరించుకు పోయారు. కిరాణా షాపు, సెల్ షాపుల కప్పు నుంచి లోపలకు చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నారు. వరుస చోరీలతో షాపులనిర్వహకులుబెంబేలెత్తి పోతున్నారు.చోరుకుల చెక్ పెట్టాలని కోరుతున్నారు. -
ఆందోళన.. ఉద్రిక్తత
న్యాయం చేయాలని మృతుని బంధువుల రాస్తారోకో 3 సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ కంకిపాడు : పునాదిపాడు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్వల్ప వివాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి శనివారం ఉదయం మృతిచెందాడు. దీందో మృతుని బంధువులు, గ్రామస్తులు కంకిపాడు సెంటర్కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన కొల్లూరు సాంబశివరావు (38)పై పునాదిపాడుకు చెందిన దేవరపల్లి కిరణ్ శుక్రవారం రాత్రి దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాంబశివరావు శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. మూడు సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని అతని బంధువులు స్వగ్రామమైన గడ్డిపాడు తీసుకెళ్తున్నారని సమాచారం రావడంతో మృతుడి భార్య బంధువులు, గ్రామస్తులు పోలీసుస్టేషన్కు సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐ శ్రీధర్, ఎస్ఐ హనీష్లను నిలదీశారు. మృతదేహాన్ని అతని బంధువులే తీసుకెళ్లారని, తిరిగి కోలవెన్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట ఈ క్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మంత్రులు ఘటనాస్థలానికి రావాలని పట్టుబడుతూ గ్రామస్తులు మరోమారు ఆందోళనకు దిగారు. డీసీపీ కోయ ప్రవీణ్, ఏసీపీ విజయభాస్కర్, ఇతర అధికారులు ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు జరుగుతున్న తరుణంలోనే డీసీపీ ప్రవీణ్ ఒక్కొక్కరినీ తోసుకుంటూ వెళ్లడం, చేయి చేసుకోవడంతో మిగిలిన పోలీసు సిబ్బంది కూడా రోప్ల సాయంతో ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగిం చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. స్పృహ కోల్పోయిన మృతుడి భార్య బుజ్జిని ఆసుపత్రికి తరలించాలనే నెపంతో బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుపడుతుండగా బుజ్జిని 108 వాహనంలో తరలించారు. ఖనన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని గడ్డిపాడు వాసులు చెప్పటంతో ఎంతో కాలంగా కోలవెన్నులోనే ఉంటున్నారని, భార్య బుజ్జి వచ్చి నిర్ణయం చెప్పాలనడంతో అందరూ సరేనన్నారు. వైద్య చికిత్స చేయించుకుని గ్రామానికి చేరుకున్న బుజ్జి కోలవెన్నులో ఖననం చేయాలని చెప్పడంతో వివాదం సమసింది. ప్రభుత్వపరంగా ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా మృతుడు సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని డీసీపీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవరపల్లి కిరణ్, సాంబశివరావు మధ్య పునాదిపాడు వద్ద రోడ్డు దాటే క్రమంలో గొడవ జరిగిందన్నారు. మృతుడి పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేర్చి ఉన్నత విద్య అందేలా చూస్తామన్నారు. ఆందోళనకారులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
అప్రమత్తం
ఎన్ఐఏ తాజా తనిఖీలతో మరోసారి కలకలం ‘ఉగ్ర’ కుట్రల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు వరుస పండగలతో.. సిటీలో పెరిగిన సందడి సిటీబ్యూరో ఇస్తాంబుల్, బాగ్దాద్... ఆపై హైదరాబాద్ లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఏయూటీ పక్కా స్కెచ్ వేసినట్లు ఆధారాలు లభ్యం కావటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎన్ఐఏ నగరంలో చేపట్టిన తనిఖీల్లో మారణహోమాన్ని సృష్టించే వ్యూహం, బుల్లెట్లు బయటపడటంతో సిటీజనుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో నగరం నలుమూలలా విస్తృత సోదాలు ప్రారంభించారు. అనుమానిత ప్రాంతాల్లో బాంబు, డాగ్స్క్వాడ్లతో అణవణువూ గాలిస్తున్నారు. రానున్న బోనాలు, ఇతర పండుగల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు పోలీసులు సన్నద్ధమవుతు న్నారు. ప్రజలకు భరోసా కల్పించే పనులు ప్రారంభించారు. మరోవైపు గడిచిన వారాంతంలో భారీ మారణ హోమానికి కుట్రపన్నిన ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, శుక్రవారం బార్కాస్, తలాబ్కట్ట తదితర ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేసి బుల్లెట్లు, కంప్యూటర్లు, హార్డ్డిస్క్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. గతంలో సిరియా వెళ్లే ప్రయత్నంలో పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ వారితో పాటు, ఇటీవలి హైదరాబాద్ విధ్వంసానికి స్లీపర్సెల్స్గా ఉపయోగపడ్డ వారి గుట్టును సేకరించే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది. ఆన్లైన్ ద్వారా బాంబు తయారీ అప్రమత్తం నేర్చుకున్న ఉగ్రవాదులు నగరంలోని వివిధ దుకాణాల్లో యూరియా పంచదార, మినరల్ యాసిడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్తో తదితర ఇంధనాలు కొనుగోలు చేసేందుకు ఎవరు సహకరించారు అన్న వివరాలపై నగర కౌంటర్ ఇంట లిజెన్స్తో పాటు ఎన్ఐఏ కూడా ఆరా తీస్తోంది. ఆలయాలు, ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చిక్కడపల్లి: బోనాలు, ఇతర పండుగలు సమీపిస్తుండడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నార్త్ జోన్ బాంబు డిస్పోజల్ టీమ్ సిబ్బంది(బీడీటీమ్) పద్మారావు నగర్లోని కంచి కామకోఠి పీఠం, స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ గణపతి, అమ్మవారి, హనుమాన్ దేవాలయాల వద్ద మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్ ఇన్చార్జి సి.సురేష్, జెనరేష్, శంకరయ్య, మహేందర్లు ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా సీఎస్ డబ్ల్యూ న్యూ సిటీవింగ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయని, వీరికి తోడుగా డీసీపీ, ఆర్.ఐ, నలుగురు ఏసీపీలు, అడిషనల్ డీసీపీ, జాయింట్ సీపీలు కలసి ప్రత్యేక బాంబుస్క్వాడ్లతో సోదాలు చేస్తున్నాయని అధికారులు వివరించారు. ప్రధానంగా సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గణపతి దేవాలయం, మదీనా, ఆల్ఫా హోటల్, 31 బస్టాప్, అమెరికన్ కాన్సులేట్, బేగంపేట రైల్వే స్టేషన్, తాడ్బంద్ హనుమాన్ దేవాలయం, పాస్పోర్ట్ ఆఫీస్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం తదితర ముఖ్యమైన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. -
మహాపచారం
ఆలయాల కూల్చివేత దారుణం సర్కారు వైఖరితో రాష్ట్రానికి అరిష్టం స్వామీజీలు, పూజారులు, భక్తుల మనోగతం ‘రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేస్తూ మహాపచారానికి ఒడిగడుతోంది. పాపభీతి, దైవభక్తి అనేవి లేకుండా వ్యవహరిస్తోంది. దేవుళ్లపైనా కక్ష కడుతోంది. కృష్ణా పుష్కరాల వంకతో విజయవాడలో ఈ దుర్మార్గానికి పూనుకుంటోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది’ అని స్వామిజీలు, పూజారులు, అర్చకులు, భక్తులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. మరికొందరు శాపనార్థాలూ పెడుతున్నారు. ఆలయాల కూల్చివేతలో ఆచారాలూ, సంప్రదాయాలూ, శాస్త్ర నియమాలూ పాటించడం లేదు.. హిందువుల మనోభావాలను, సంస్కృతిని, ధర్మాన్నీ దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నారని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. ఎక్కడో పొరుగు దేశాల్లో సైతం హిందూ ధర్మాన్ని కాపాడుతుంటే ఇక్కడ దేవాలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహోదగ్రులవుతున్నారు. దేవుళ్లను నడిరోడ్డుపైన, ఫుట్పాత్లపైనా పడేస్తున్నారు.. పశువులు, జంతువులకంటే హీనంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఖరి రాష్ట్రానికి అరిష్టమని ఆందోళన చెందుతున్నారు. సర్కారు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని, ఇందుకోసం భక్తులంతా ఐక్యం కావాలని హిందూధర్మ పెద్దలు పిలుపునిస్తున్నారు. సాక్షితో తమ ఆవేదనను పంచుకున్నారు. - సాక్షి, విశాఖపట్నం రాష్ట్రానికి అరిష్టం ఆలయాలను కూల్చేయడం వల్ల రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుంటుంది. మనం ఉన్నది సంప్రదాయ బద్ధమమైన భారతదేశంలోనూ.. లేక విదేశాల్లోనా అనే అనుమానం కలుగుతుంది. స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాను కూల్చడం అన్నది మహాపాపం. అలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడు. ఆలయాలను నమ్ముకున్న అర్చకులు, ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. - కాండూరి వెంకట జగన్నాథాచార్యులు, గాజువాక ఏరియా అర్చక సంఘం ప్రతినిధి ఆలయాలను అభివృద్ధి చేయాలే కానీ.. విజయవాడలో ఆలయాలను కూల్చివేస్తున్నారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మనం హిందూవులమా, లేక మూర్కులమా. భూమి మీద దేవుడు ఉండబట్లే వినాశనాలు జరగకుండా క్షేమంగా బతుకుతున్నాం. దేవుళ్లతో, దేవుని మందిరాలతో ఆడుకుంటే శిక్ష తప్పదు. కోటీశ్వరుల వద్ద డబ్బులు ఉంటే ఆలయాలను అభివృద్ధి చేయాలే తప్పా కూల్చకూడదు. - వెంకటాచార్యులు, బీహెచ్పీవీ ప్రసన్న వెంకటేశ్వరాలయం అర్చకులు హిందుత్వాన్ని పొడిచి చంపుతున్నారు... విజయవాడలో ఆలయాలను దుర్మార్గంగా కూల్చివేత చర్య హిందుత్వాన్ని పొడిచి చంపుతున్నట్లుగా ఉంది. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉంది. బ్రిటిషర్లు దేశాన్ని పాలించినా హిందుత్వాన్ని దెబ్బతీయలేదు. ఇపుడు ఆంధ్రపాలితులే జనంలో తిరగుతూ టైస్టుల్లా వ్యవహరిస్తున్నారు. హిందూధర్మ, సంస్కృతికి తూట్లు పొడుస్తున్నారు. విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి చర్యలపై హిందువులాంతా ఏకంకావాలి. - చంద్రమౌళి, శతాధిక ప్రతిష్టాచార్య, బ్రహ్మశ్రీ దొంతుకుర్తి రాజధాని నడిబొడ్డున ఘోరం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హిందూ దేవాలయాలను కూల్చడం ఘోరం. ప్రజల భక్తిభావాలు, సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతీశారు. మతసామరస్యాన్ని రెచ్చగొట్టారు. కనీసం ఆలోచన లేకుండా రాళ్లు రప్పల్లా భగవంతున్నే కూల్చేశారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో...అధికార యంత్రాంగం ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తుందో తెలుస్తోంది. - నూతపల్లి అప్పారావు, శ్రీహరిసేవ వాలంటీర్స్వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి హిందూ సంప్రదాయాన్ని కూల్చారు... విజయవాడలో ఆలయాలను కూల్చివేయడం దారుణం. హిందూ సంప్రదాయాన్ని నిలువునా కూల్చారు. మనోభావాల్ని దెబ్బతీశారు. ఇది అత్యంత బాధాకరం. అభివృద్ధి పేరుతో భక్తుల ఆత్మాభిమానాలు దెబ్బతీస్తే ఎవరు సహిస్తారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరం. దీన్ని హిందువులంతా ఖండించాలి. - శేఖర్శర్మ, శారదా పీఠపాలిత ఉమామహేశ్వరాలయ ప్రధానార్చకుడు ఆలయాల కూల్చివేతను ఖండిస్తున్నా విజయవాడలో ఆలయాల కూల్చి వే త చర్యను ఖండిస్తున్నా. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు సూచన మేరకు స్థలం కేటాయించి ఆలయాలను అక్కడకు తరలించాలి. ముందస్తు చర్యలు లేకుండా దేవాలయాలు పడగొట్టడం దారుణం. ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు చేస్తు చాలా మంది పురోహితులు బతుకుతున్నారు. వాళ్లందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -దగ్గుపల్లి సాయి, మాజీ చైర్మన్, పాండురంగస్వామి దేవస్థానం, పాయకరావుపేట మనోభావాలు దెబ్బతీయడమే నోటీసులు కూడా ఇవ్వకుండా ఆలయాలను కూల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఇది పరాకాష్ట. దేవుని విగ్రహాలు తొలగించి ఎక్కడికక్కడ పడేశారు. చాలా బాధపడ్డా. -అంబటి సీతారాం, దుర్గాలమ్మచెట్టు దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట ఇది మంచి పద్ధతి కాదు ఆలయాల తొలగింపు అన్యాయం. దేవాలయాలను తొలగించే ముందు ఆగమశాస్త్ర ప్రకారం చర్యలు చేపట్టాలి. దేవతామూర్తుల విగ్రహాలను పొక్లెయిన్లతో కూల్చి వేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. -వామాల శ్రీను, సీతారామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట హైందవ ధర్మానికి అపచారం ఆలయాలు కూల్చివేసి హైందవ ధర్మానికి ప్రభుత్వం అపచారం చేసింది. మరొక చోట దేవాలయాలు నిర్మించి ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహాలను అక్కడికి తరలించాల్సి ఉంది. కానీ విగ్రహాలను కూల్చి పక్కన పడేసింది. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. దేవుడు, దేవాలయాలకు విలువ లేకుండా చేశారు. -ధనిశెట్టి బాబూరావు, పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట దేవుడిని హత్య చేసినట్లే.. కృష్ణానది ఒడ్డున ఆలయాలు కూల్చడం దేవుడిని హత్య చేసినట్లే అవుతుంది. ఏన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలను తొలగించడం ఆగమశాస్త్రాన్ని వ్యతిరేకించడమే. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించాల్సిన ప్రభుత్వమే ఈ దుష్టచర్యకు పాల్పడటాన్ని పీఠాధిపతులు, భక్తులు ఖండించాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రజలకు అరిష్టం కలుగుతుంది. -స్వామి పరానంద భారతి, సుందరనగరం జ్ఞానానంద చారిటబుల్ ట్రస్ట్ పీఠాధిపతి ఆధ్యాత్మిక భావన దెబ్బతీయడమే.. దేవాలయాలను కూల్చడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక భావనను దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వమే ఇలాంటి పనికి పూనుకోవడం ఆశ్చర్యకరం. మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి చర్యలను ఖండించాలి. హిందూ ధర్మ పరిరక్షణకు పూనుకోవాలి. -స్వామీజీ సౌమాన్యంద అవదూత, ఆనంద్మార్గ్ ఆశ్రమం, డెయిరీఫారం అందరితో మాట్లాడాలి.. ఆలయాలను తొలగించాల్సి వస్తే ప్రజలు, భక్తులు, పీఠాధిపతులతో మాట్లాడాలి. అందరికి ఆమోదమైన చోటు కేటాయించాలి. అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత పాత ఆలయాన్ని కూల్చాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం దారుణం. ఇటువంటి చర్యలకు పాల్పడ్డం ఏమాత్రం మంచిదికాదు -రామాయణం సబ్రహ్మణ్య శర్మ, అర్చకుడు, భీమిలి అధికారమదంతో రెచ్చిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారమదంతో రెచ్చిపోతోంది. ఆలయాలను, విగ్రహాలను కూల్చేసి రోడ్లపై దిక్కులేకుండా పడేయడం దారుణం. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎవర్ని సంతృప్తి పర్చడం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో.. అర్థం కావడంలేదు. ఎండోమెంట్ విభాగం నిద్రపోతోందా అనే అనుమానం కలుగుతోంది. ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమైన మన భారతదేశ గౌరవం మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు. -వెలవెలపల్లి నాగబాబు శర్మ సాయిబాబా ఆలయ ప్రధానార్చకులు, గాజువాక -
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు అన్ని శాఖల్లో జూన్లోనే బదిలీలు చేపట్టారు. విద్యాశాఖలో మాత్రమే ఇప్పటివరకు బదిలీల ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అన్ని శాఖలతో పాటే బదిలీలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి. జూలై చివరి వారంలో బదిలీల ప్రక్రియ మొదలు కావొచ్చని తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభం అయిన తరువాత బదిలీలు జరిగితే పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జోక్యం చేసుకునే వరకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బదిలీలపై నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. ‘మీ శాఖలో ఏం జరుగుతోంది’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో బదిలీలపై కదలిక వచ్చిందని తెలిసింది. దీంతో హడావుడిగా జీవో నెం.63కి కొన్ని మార్పులు చేర్పులు చేసి బదిలీలపై ప్రతిపాదనలు పంపారని సమాచారం. చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశీ పర్యటనలో ఉండడంతో ఉపాధ్యాయ బదిలీలపై సందిగ్ధత నెలకొంది. బదిలీలు ఉంటాయా.. ఉండవా.. తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ బదిలీలు చేపట్టదలిస్తే.. ముఖ్యమంత్రి, మంత్రి పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత అనుమతులు తీసుకుని బదిలీలపై ఉత్తర్వులు వచ్చేసరికి నెల రోజులు గడుస్తాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పటికే తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించామని.. ఇప్పుడు బదిలీలు నిర్వహిస్తే తాము ఆర్థికంగా నష్టపోతామని చె బుతున్నారు. ఇళ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 45 రోజుల సెలవులను వృథా చేసి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పడంపై మండిపడుతున్నారు. కీలక తరుణంలో విద్యాశాఖ కమిషనర్ సిసోడియాను బదిలీ చేయడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆయన స్థానంలో విద్యాశాఖపై ఏమాత్రం అవగాహన లేని ఆదిత్యనాథ్ గుప్తాను కమిషనర్గా, ఇండియన్ పోస్టల్ సర్వీస్కు చెందిన సంధ్యారాణిని, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నియమించారంటున్నారు. ఈ గందరగోళంలోనే 45 రోజుల వేసవి సెలవులు వృథా అయ్యాయని చెబుతున్నారు. మంత్రికి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ విద్యపై లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వృత్యంతర పనులు అప్పజె ప్పుతూ విలువైన సమయాన్ని వృథా చేయిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. టీచర్ డేటా అప్లోడ్, ఆధార్ అనుసంధానం వంటి పనులకు రోజుకు కనీసం 3 గంటల సమయం పడుతోందని చెబుతున్నారు. ఈ పనుల వల్ల ఇప్పటివరకు పాఠాలు మొదలే పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. వృత్తేతర పనులను ఉపాధ్యాయులకు అప్పజెప్పడం వల్ల సమయానికి పాఠాలు పూర్తి చేయలేకపోతున్నామని అంటున్నారు. అమ్మో పాయింట్ల విధానం! పాయింట్ల విధానం అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. గత సంవత్సరం జరిగిన బదిలీల్లో పాయింట్ల విధానం అనుసరించడంతో అవకతవకలు జరిగాయని.. ఈ విధానంలో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, వ్యక్తిగతంగా స్కూల్కు మంచి పేరు తెచ్చిన వారికి అధిక పాయింట్లు కేటాయించాలని కోరుతున్నారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం ఉపాధ్యాయుడిది ప్రాథమిక బాధ్యత అయినప్పటికీ.. ఎక్కువ మంది పిల్లలను బడిలో చేర్పించిన వారికి పాయింట్లు కేటాయించే విధానంలో మార్పులు చేస్తే ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేరు అని చెబుతాం కానీ.. కచ్చితంగా చేరు అని ఒత్తిడి చేయలేమని వారు వాపోతున్నారు. ఇప్పుడు బదిలీలా ? వేసవి సెలవులను వృథా చేసి విద్యా సంవత్సరంలో బదిలీలలు ప్రారంభించడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఉపాధ్యాయ కుటుంబాలకు నష్టం జరుగుతుంది. పది నెలలు కాక మునుపే బదిలీలు చేపడుతున్నారు. మానసికంగా ఉపాధ్యాయులు బదిలీలను కోరుకోవడం లేదు. ట్రాన్స్ఫర్లు చేయాలనుకుంటే వేసవి సెలవుల్లోనే నిర్వహించి ఉండాల్సింది. - రెడ్డి శేఖర్ రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అసోసియేషన్.. చిత్తూరు గందరగోళంపై స్పష్టత ఇవ్వాలి వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ వంటి పనులను పూర్తిచేసి ఉండాల్సింది. పాఠశాలలు ప్రారంభం అయిన వెంటే బోధనలో నిమగ్నం అయ్యే వాతావరణాన్ని కల్పించాలని పలుసార్లు విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. గతంలో బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లే ఇంకా రిలీవ్ కాని దుస్థితి నెలకొంది. కావున విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో బదిలీలు, రేషనలైజేషన్కు సంబంధించి స్పష్టత ఇవ్వాలి. - గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ. -
చేతులెత్తేశారు..
గందరగోళంగా పోలియో వ్యాక్సినేషన్ గుర్తించింది 2.5 లక్షలు.. వేసింది 3.16 లక్షలు వ్యాక్సిన్ కొరతతో మన్సూరాబాద్ కేంద్రానికి తాళం ఆస్పత్రి ముందు తల్లిదండ్రుల ఆందోళన సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పోలియో టీకాల కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఆఖరి బిడ్డ వరకు వ్యాక్సిన్ వేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ లేక చేతులెత్తేసింది. బస్తీల్లోని పిల్లలను అంచనా వేయడంలోను, వ్యాక్సిన్ సరఫరాలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. టీకాల కోసం ప్రతిరోజు పలు ఆరోగ్య కేంద్రాల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ఆదివారం టీకాలు వేసేందుకు చివరి రోజుగా ప్రకటించడంతో వ్యక్తిగత పనులను వాయిదా వేసుకుని పిల్లలకు టీకాలు వేయించేందుకు తల్లిదండ్రులు భారీగా తరలి వచ్చారు. వ్యాక్సిన్ కొరత వల్ల కొన్నిచోట్ల పోలీసుల సహకారంతో పిల్లలకు టీకాలు వేస్తే, మరి కొన్ని చోట్ల పోలియో కేంద్రాలకు తాళాలు వేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం గుర్తించిన హైరి స్కు ప్రాంతాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న బస్తీల్లో ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎంత మంది వ్యాక్సిన్ వేయిం చుకునే అవకాశం ఉంది? ఎంత సరఫరా చేయాలి? వ ంటి అంశాలను అధికారులు అంచనా వేయలేక పోయారు. ఇదిలా ఉం టే, హైరిస్కు జోన్లలో 2.5 లక్షల మంది పిల్లలను గుర్తించామని, వీరందరికీ టీకా లు వేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని పిల్లలు టీకాలు వేయించుకోక పోయినా నష్టమేమీ లేదని స్పష్టం చేయడం గమనార్హం. అంచనాలో ఘోర విఫలం.. అంబర్పేట నాలాలో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్థారణ కావడంతో ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న హైదరాబాద్ జిల్లాలోని 69 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అంబర్పేట, బార్కాస్, కంటోన్మెంట్, మలక్పేట్, కోఠి, లాలాపేట్, డబీర్పుర, జంగంమెట్, పానిపుర, సీతాఫల్మండి, సూరజ్భానులో ప్రభుత్వం 750 పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని 12 ఆరోగ్య కేంద్రాల పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్నగర్, బాలాపూర్లో 136 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కంటోన్మెంట్ సహా ఈ 24 హైరిస్కు ప్రాంతాల్లో ఆరు వారాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 2.50 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. కేవలం ైెహ రిస్కు జోన్ల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు భారీగా పోటెత్తడంతో తొలి రెండు రోజుల్లోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మరో లక్ష డోసులు అదనంగా తెప్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిల్లలను అంచనా వేయడంలోనే కాదు.. చివరకు వాక్సిన్ తె ప్పించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. మన్సూరాబాద్ కేంద్రానికి తాళాలు వ్యాక్సిన్ కోసం పిల్లలతో మన్సూరాబాద్లోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న తల్లి దండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ లేకపోవడంతో స్థానికులు ఎక్కడ తమపై దాడి చేస్తారోనని భయపడిన సిబ్బంది కేంద్రానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మన్సూరాబాద్ పట్టణ ఆరోగ్య కేం ద్రంలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ను ఏర్పాటు చేశామని, ఇక్కడి వీకర్ సెక్షన్కాలనీ కమ్యూనిటీహాల్లో శనివారం రోజంతా కేంద్రం కొనసాగిం దని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం పోలియో ఇంజక్షన్ వేయాలనే ఆదేశం తమకు లేదని, అందుకే తాము టీకాలు వేయడం లేదని సిబ్బంది తెలి పారు. అంబర్పేట్లోని ప్రాధమిక ఆరో గ్య కేంద్రానికి స్థానిక పిల్లలతో పాటు ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పోటెత్తడంతో వారిని నియంత్రించడం కష్టమై పోలీ సుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. -
తెన్నేరు సొసైటీలో నిధులు గోల్మాల్?
తెన్నేరు (కంకిపాడు) : తెన్నేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొమ్మును అధ్యక్షుడు తన సొంతానికి వాడుకున్నారంటూ స్థానికులు కొందరు జిరాక్సు కాపీలు పంపిణీ చేసినట్లు తెలిసింది. సొసైటీ అధ్యక్షుడు భక్తవత్సలరావు సొమ్మును సొంతానికి వాడుకున్నారని గ్రామంలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. గల్లంతైన సొమ్ము సుమారుగా రూ.6 లక్షలు పైగా ఉంటుందని, దీనిలో ఇంకా రూ.3లక్షలు వరకూ సొసైటీ ఖాతాకు జమకావాల్సి ఉందని ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సొసైటీ కార్యదర్శిని కూడా పాలకవర్గం నిలుపుదల చేసింది. ఇది జరిగి 20 రోజులు పైగా గడుస్తుందని, అప్పటి నుంచి ఆ కార్యదర్శి విధులకు రావటం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీ సొమ్ము దుర్వినియోగం అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు వెలుగులోకి తేవాలని, సొసైటీని పరిరక్షించాలని కోరుతున్నారు. కేడీసీసీ బ్యాంకు సత్యనారాయణపురం బ్రాంచి అధికారులను సాక్షి సంప్రదించగా, నిధులు దుర్వినియోగం కాలేదన్నారు. అధ్యక్షుడు, కార్యదర్శికి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు. దుష్ర్పచారం, నిధులు దుర్వినియోగం కాలేదు సొసైటీలో సొమ్ము దుర్వినియోగం కాలేదు. 2014లో తాను వాడిన సొమ్మును పైసా తో సహా లెక్క కట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో చెల్లించాను. సొసైటీలో 70 కట్టలు ఎరువులు లెక్క తగ్గింది. కట్టలు లెక్కతేల్చమని అన్నందుకు కార్యదర్శి కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. సొసైటీ సొమ్ము సొంతానికి వాడుకోలేదు. ఇది వాస్తవం. భక్తవత్సలరావు పీఏసీఎస్ అధ్యక్షుడు -
సాక్షి టీవీ ప్రసారాల పునరుద్ధరణ
జర్నలిస్టుల విజయోత్సాహం నిరంతరాయంగా సాగిన ఉద్యమం ఒత్తిడి పెంచింది. హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయమనడం దానికి తోడైంది. గత్యంతరం లేక సర్కారు దిగొచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేస్తూ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఫలితంగా మంగళవారం రాత్రికే విశాఖ నగరంలో సాక్షి ప్రసారాలు పునఃప్రారంభమయ్యాయి. దీనికోసమే మొక్కవోని దీక్షతో గత 12 రోజులుగా రోడ్లేక్కి ఆందోళనలు చేసిన జర్నలిస్టుల సంఘాలు, సాక్షి సిబ్బంది బుధవారం విజయోత్సవాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. -
మాకు ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తరు?
ఎమ్మెల్యేను ప్రశ్నించిన చిన్నముల్కనూర్ గ్రామస్తులు చిగురుమామిడి : ‘మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారంటూ’ సీఎం దత్తత గ్రామమైన చిన్న ముల్కనూర్ మహిళలు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ను ప్రశ్నించారు. గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు ఆయన రాకకోసం గంటల తరబడి ఎదురుచూశారు. రాగానే తమకు డబుల్బెడ్రూం ఇళ్లు ఎప్పుడు మంజూరుచేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఒక్కొక్కరిగా పిలుచుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు లేక అవస్థలు పడుతున్నామని, సీఎం హామీ మేరకు తమ ఇళ్లు కూల్చివేసుకున్నామని తెలిపారు. ఉన్న వారికే ఇళ్లు ఇచ్చారని, పేదలకు అన్యాయం చేశారని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సతీష్కుమార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా శాంతించారు. -
మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!
⇒విషం పెట్టి చంపుతున్న గుర్తు తెలియని దుండగులు ⇒రాయదుర్గం పాన్మక్తా గుట్టల్లో వారాంతాల్లోనే వరుసగా ఘటనలు ⇒తెల్లారేసరికి మాయమవుతున్న నెమలి కళేబరాలు ⇒తాజాగా శనివారం రాత్రి ఆరు మయూరాలు మృత్యువాత ⇒ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, జంతు ప్రేమికులు రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్కు కూతవేటు దూరంలో వారాంతాల్లో నెమళ్లు అంతమవుతున్నాయి. ఈ జాతీయ పక్షికి గుర్తుతెలియని విషం పెట్టి చంపేస్తున్నారు. శనివారం రాత్రి ఏకంగా ఆరు మయూరాలు చనిపోయాయి. వీటిలో నాలుగింటి కళేబరాలు లభించగా... మరో రెండింటికి చెందిన ఈకలు మాత్రమే పడి ఉన్నాయి. రాయదుర్గం పాక్మక్తా గుట్టల్లో వరుసగా నాలుగైదు వారాలుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొన్ని ఉదంతాల్లో నెమలీకలు మాత్రమే మిగులుతుండగా... శనివారం రాత్రి నాలుగు నెమళ్ళ కళేబరాలూ కనిపించాయి. మనుషులపై ప్రభావం చూపని విషం పెట్టి మయూరాలను చంపేస్తున్న దుండగులు ఆనక వాటి మాంసాన్ని తీసుకువెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలపై ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు పట్టించుకోట్లేదని ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం నెమళ్లకు ఆలవాలం... గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్మక్తా శివారులోని దుర్గం చెరువు గుట్టల్లో ఏళ్ళుగా వందలాది నెమళ్లు నివసిస్తున్నాయి. ప్రతినిత్యం కనీసం 20 నుంచి 50 దాకా మయూరాలు గుంపులుగా నడుచుకుంటూ గుట్ట శివారు ప్రాంతాల్లో కలియ దిరగడంతో పాటు గుట్టలపై పురివిప్పి ఆడుతూ చుట్టుపక్కల వారితో పాటు ఆ మార్గంలో వెళ్లే వారికీ ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పశువుల కొట్టం ఈ నెమళ్లకు సుపరిచితం. అక్కడ పశువులున్నప్పటికీ నిర్భయంగా నడుచుకుంటూ వచ్చి నీళ్ళు తాగడం, పశువుల కోసం పెట్టిన దాణా తినడం చేసి తమ దారిన వెనక్కు వెళ్లిపోతుంటాయి. నెల్లాళ్ళుగా వరుస ఘటనలు... పాన్మక్తా శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడటం స్థానికుల్ని కలిచి వేస్తోంది. ఈ ఘటనలు వరుసగా వీకెం డ్స్లోనే చోటు చేసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. శునివారం ఓ నెమలి నురుగులు కక్కుతూ, ఎగురలేక స్థితిలో నెమ్మదిగా నడచి వెళ్ళడాన్ని గుట్టల్లో పశువులు మేపుకునే ఓ కాపరి గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకుని నీళ్ళు పట్టించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే అవి చనిపోవడంతో స్థానికులకు విషయం చెప్పారు. ఆది వారం గుట్టల్లోకి వెళ్లిన స్థానికులు, భజరంగ్దళ్ నాయకులు నాలుగు నెమళ్ల కళేబరాలను గుర్తించారు. దీనికి సమీపంలోనే ముళ్ళ పొద ల్లో మరో రెండు నెమళ్ళకు సంబంధించిన ఈకలు పడి ఉండటాన్ని గమనించారు. వేటాడుతున్నారనే అనుమానాలు... మయూరాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకున్న ఘటనల్ని గమనించిన స్థానికులు వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో తమ అనుమానాలు బలపడుతున్నామయని వ్యాఖ్యానిస్తున్నారు. మనుషులపై ప్రభావం చూపని గుర్తుతెలియని విషాన్ని వేటగాళ్లు వినియోగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దీని ప్రభావంతో చనిపోయిన నెమళ్ళను సేకరిస్తున్న వేటగాళ్ళు మాంసం కోసం వాటిని తీసుకువెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రెండు వారాలుగా నెమళ్ళు సాయంత్రం కనబడినా మరుసటి రోజుకు మాయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలి: భజరంగ్దళ్ నాయకుల డిమాండ్ రాయదుర్గం శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడుతున్నాయని భజరంగ్దళ్ జిల్లా ప్రముఖ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జాతీయ పక్షి అయిన నెమళ్లు వీకెండ్స్లో చనిపోవడంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెమలి అందమైన పక్షి అని, స్వేచ్ఛగా జీవనం సాగించేలా చేయాల్సింది పోయి చంపడమేమిటని ఆయన ప్రశ్నించారు. నెమళ్ళైపై కొందరు విషప్రయోగం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జింకలకు కుక్కల భయం... నగర శివార్లలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం జింకలకు ఆలవాలం. అక్కడ ఉన్న కుక్కలు వీటిని విచ్చలవిడిగా చంపేస్తుంటాయి. జనవరి 9న హెచ్సీయూ మశ్రుంరాక్ వద్ద కొలనులో నీరు తాగేందుకు వచ్చిన జింక పిల్ల, జనవరి 20న హ్యుమానిటీస్ ప్రాంగణంలో, ఫిబ్రవరి 11న గోపన్పల్లి గేట్ వద్ద మేత కోసం సంచరిస్తున్న జింకలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఏడాది జనవరి 3న హెచ్సీయూలో జింక వేట ఘటన కలకలం సృష్టించింది. -
పాఠశాలలపై పట్టింపేదీ?
♦ విద్యాశాఖ అలసత్వం ♦ టీచర్లు లేక మూతపడుతున్న స్కూళ్లు ♦ ప్రభుత్వ బడులపై విద్యాశాఖ అలసత్వం ♦ టీచర్లు లేక మూతపడుతున్న స్కూళ్లు ♦ కొన్నిచోట్ల విద్యావలంటీర్లతో సరి సర్కార్ బడుల్లో కార్పొరేట్ వసుతులు.. ఇంగ్లిష్ చదువులు.. అంటూ బడిబాట కార్యక్రమంలో ప్రచారార్భాటం చేసిన విద్యాశాఖకు క్షేత్రస్థాయిలో సమస్యలు కనిపించడం లేదు. వసతుల మాట దేవుడెరుగు.. అసలు ఉపాధ్యాయులే లేని విద్యాలయాలు ఉన్నయాంటే జిల్లా యంత్రాంగం ఏ స్థాయిలో ‘చదువు’లకు స్థానం కల్పించిందో అర్థం చేసుకోవచ్చు. మెదక్: జిల్లావ్యాప్తంగా 2,831 పాఠశాలలు ఉండగా వాటిలో ప్రాథమిక 1907, ప్రాథమికోన్నత 416, ఉన్నత పాఠశాలలు 508 ఉన్నాయి. ఇందులో 321 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయులు లేరు. విద్యావలంటీర్లు(వీవీ)లతో ఆయా పాఠశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలోని 16 పాఠశాలల్లో కనీసం వీవీలు లేకపోవడంతో డిప్యూటేషన్పై కొనసాగిస్తున్నట్టు సమాచారం. 531 బడుల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉండటం గమనార్హం. వారానికి రెండు, మూడుసార్లు స్కూల్కాంప్లెక్స్ మీటింగ్లు, ఎంఈఓ సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్లు నిర్వహిస్తుండటంతో కొన్నిచోట్ల ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సైతం వెళ్లిపోతుండటంతో పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. ఒక్క మెదక్ మండలంలో పొచమ్మరాల్ తండా, అజాంపురా, పిట్లంబేస్, గోల్కొండలోని అంబేద్కర్కాలనీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. వీవీలతోనే కొనసాగుతున్నాయి. పిట్లంబేస్ చెరువు కట్టకింది పాఠశాల టీచర్లు లేక మూతపడింది. అదేవిధంగా పట్టణంలోని గోల్కొండ వీధి అంబేద్కర్ కాలనీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండగా 95 మంది చదువుతున్నారు. అందులో ఒకే ఒక్క వీవీ.. విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి బోధిస్తున్నాడు. దీంతో ఏ తరగతికి ఏ పాఠం చెబుతున్నాడో అర్థంకాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అక్కరకురాని డీఎస్సీ సర్కార్ బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించడం లేదు. ‘సర్కారు బడుల్లోనే చక్కనైన విద్య’ అంటూ ప్రచారాలకే పరిమితమవుతూ.. క్షేత్రస్థాయి ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఉపాధ్యాయులే లేకుండా నాణ్యమైన బోధన ఎలా సాధ్యమవుతుందంటూ పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
బాబోయ్.. బడి
వామ్మో, ఇవేం బడులు.. ఎప్పుడు కూలుతాయో తెల్వదు. వర్షాలకు చెమ్మగిల్లుతున్న గోడలు.. పెచ్చులూడుతున్న పైకప్పులు. జీర్ణావస్థలో ఉన్న గదుల్లోనే పాఠాలు.. భయం గుప్పిట్లో చిన్నారులు.. భవనాల దుస్థితిపై పిల్లల తల్లిదండ్రులు సైతం బెంబేలు.. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు.. ఆపై పట్టనట్టు వ్యవహరించే యంత్రాంగం.. పాఠశాలలు పునఃప్రారంభమైనా దుస్థితి మారకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. స్కూళ్ల దుస్థితి ప్రభుత్వ పాఠశాలల భవనాలను చూస్తేనే భయమేస్తోంది. అందులో కూర్చోని పాఠాలు వినడానికి చిన్నారులు బెంబేలెత్తిపోతున్నారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పెల్చులూడి ఇనుప చువ్వలు తేలాయి. కొన్ని చోట్ల గదులు కూలిపోగా పక్క గదుల్లోనే పాఠాలు బోధిస్తున్నారు. ముందే వర్షాకాలం ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠాలు వింటున్నారు. పిల్లల తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. - సాక్షి నెట్వర్క్ -
నీటి తరలింపునకు బ్రేక్
యల్లయ్య కాలువ నీటిని స్టీల్ప్లాంట్కు తరలించే యత్నం అడ్డుకున్న రైతు సంఘాలు నీరు తరలిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక చివరకు వెనుతిరిగిన అధికారులు అనకాపల్లి: శారదానది నుంచి స్టీల్ప్లాంట్కు అడ్డగోలుగా నీటిని తరలించే ప్రక్రియను అనకాపల్లికి చెందిన రైతులు, ప్రజాసంఘాల సభ్యులు అడ్డుకున్నారు. అనకాపల్లి పట్టణ సరిహద్దులోని శారదానదికి ఆనుకొని ఉన్న యల్లయ్య, ఏలేరు కాల్వల కూడలి వద్ద జరుగుతున్న నీటిమళ్లింపును నిరసిస్తూ బుధవారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. రాత్రికి రాత్రి యల్లయ్యకాల్వకు నీరు పారే మార్గాన్ని మట్టితో కప్పివేసి ఆ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లించడంతో స్థానిక రైతులు ఆందోళనతో అఖిలపక్ష నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి వీరభద్రరావుతో పాటు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీల నాయకులు, వ్యవసాయదార్లసంఘం, నీటిసంఘం, రైతుసంఘం ప్రతినిధులు నీటి మళ్లింపు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండుగంటల వరకు అక్కడే ఉండి నీటిమళ్లింపు ప్రక్రియను నిలుపుచేయించారు. అప్రమత్తమైన రైతులు స్టీల్ప్లాంట్ నీటి అవసరాల కోసం యల్లయ్య కాలువ నీటిని ఏలేరు కాలువలోకి మళ్లించే పనిని ప్లెసిబో అనే ప్రైవేట్ ఇంజినీరింగ్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు. కొద్దిరోజుల నుంచి ఏలేరు కాలువకు ఆనుకొని రహదారులు, ఇంజిన్లు ఏర్పాటు చేస్తున్నారు. యల్లయ్యకాలువ నీటిని ఏలేరు కాల్వలోకి మళ్లిస్తున్నారని తెలుసుకున్న రైతులు అప్రమత్తమై కాలువ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు, రైతులు నీటిపారుదలశాఖ, స్టీల్ప్లాంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శారదానీటిని స్టీల్ప్లాంట్కు తరలించడం తగదన్నారు. అయితే తమకు అనుమతి ఉందని చెప్పేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ రైతులు వినకుండా అక్కడే కూర్చున్నారు. యల్లయ్య కాలువకు నీరు వెళ్లే మార్గాన్ని మూసివేసి ఏలేరు కాలువలోకి నీటిని మళ్లించడం పట్ల రైతుసంఘాలు, ప్రజాసంఘాలప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధుడెన నీటిపారుదలశాఖ ఎస్ఈ వల్లే ఈ దుస్థితి ఏర్పిడిందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పరిస్థితి తెలుసుకున్న పట్టణ ఎస్ఐలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ లీలారావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని నీటిపారుదలశాఖ, జీవీఎంసీ, స్టీల్ప్లాంట్ అధికారులతో చర్చలు జరిపారు. యల్లయ్యకాలువ నీటిని స్టీల్ప్లాంట్కు తరలించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని రైతులు భీష్మించుకొని కూర్చోవడంతో అధికారులు వెనుతిరిగారు. స్టీల్ప్లాంట్ జీఎంపై ఆగ్రహం చర్చలు పూర్తయిన తర్వాత యంత్రాలను తొలగించే అంశంలో స్టీల్ప్లాంట్ నీటి నిర్వహణ విభాగ జీఎం రామానుజం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అఖిలపక్ష నేతలు, రైతుసంఘాల సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు స్టీల్ప్లాంట్ నీటి నిర్వహణ జీఎం రామానుజం, వాటర్మేనేజ్మెంట్ మేనేజర్ శివరామకృష్ణ వెనుతిరిగారు. అక్కడ పరిస్థితిపై జీవీఎంసీ ఎస్ఈ ఆనందరావు, అడ్వయిజర్ జగన్మోహనరావు, నీటిపారుదలశాఖ ఏఈ తమ్మినాయుడులు కొద్దిసేపు చర్చించారు. ఈ ఆందోళనలో రైతుసంఘాల ప్రతినిధులు విల్లూరి పైడారావు, విల్లూరి రాము, కర్రి బలరాం, కర్రి మోదునాయుడు, కొణతాల శ్రీను, వైఎస్ఆర్ సీపీ నేతలు సూరిశెట్టి రమణఅప్పారావు, ఆడారి సూరి అప్పారావు, జాజుల రమేష్, ప్రజారాజకీయ ఐక్యవేదిక నాయకుడు కనిశెట్టి సురేష్బాబు, బీజేపీ నేత గంగుపాం నాగేశ్వరరావు, వ్యవసాయదార్లసంఘం నాయకులు భీశెట్టి కృష్ణ అప్పారావు, సీపీఎం నాయకుడు ఎ.బాలకృష్ణ, సీపీఐ నాయకుడు వై.ఎన్.భద్రం తదితరులు పాల్గొన్నారు. -
బహుళ అంతస్తులు.. బీ కేర్ఫుల్..!
బందరు రోడ్డు పక్కన ప్రమాదకరంగా నిర్మాణాలు కుప్పకూలిన మట్టి తప్పిన ప్రమాదం అనుమతులపై అనుమానాలు జాగ్రత్తలు పాటించడం లేదని ఆరోపణలు కానూరు (పెనమలూరు) : మొన్న గుంటూరులో మట్టిపెళ్లలు పడి ఏడుగురు మృతిచెందారు.. ఆ ఘటన మరువకముందే కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు సిరీస్ పక్కన నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం వద్ద శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మట్టి జారిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలతో బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానూరు సిరీస్ పక్కన ఓ బహుళ అంతస్తు భవన నిర్మాణం బందరు రోడ్డుకు ఆనుకుని జరుగుతోంది. భవన నిర్మాణానికి పెద్దఎత్తున మట్టి తొలగించి సెల్లార్ నిర్మిస్తుండడంతో శుక్రవారం వర్షం కారణంగా ఈ నిర్మాణం వద్ద మట్టి ఒక్కసారిగా జారిపోయి కుప్పకూలింది. బందరు రోడ్డుకు, అలాగే కానూరు పంటకాలువ రోడ్డుకు ఆనుకుని పెద్దఎత్తున మట్టి తవ్వి సెల్లార్ పనులు చేస్తున్నారు. సిరీస్ పక్కన పంటకాలువ రోడ్డు కింద ఉన్న మట్టి ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఎవ్వరికి ప్రమాదం జరుగకపోయినా స్థానికులు మాత్రం తీవ్ర ఆందోళన చెందారు. బందరు రోడ్డు మార్జిన్ కూడా తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం బందరు రోడ్డుకు బాగా మార్జిన్ వదలాల్సి ఉంది. మరి అధికారులు ఎలా అనుమతించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మట్టి జారుతుండడంతో బందరు రోడ్డుకు కూడా ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అగ్ని పరీక్షే
ఏటా పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఉన్నవి 11 స్టేషన్లు, 10 ఫైర్ ఇంజిన్లు అగ్నిమాపక శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత విశాఖపట్నం : వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది సహజం. ఆందోళనకర విషయం ఏమిటంటే జిల్లాలో ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఏ ఏటికాయేడు అగ్ని ప్రమాదాల భారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ అగ్ని పరీక్షను ఎదుర్కొనేందుకు సరైన సన్నద్ధత మాత్రం మద్ద వద్ద లేదు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన అగ్నిమాపకశాఖ అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. సమయానికి వెళ్లాలన్నా, బాధితులను రక్షించాలన్నా ఆ శాఖకు కష్టసాధ్యమవుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతే వేగంగా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్యకు అనుగుణంగా ఫైర్స్టేషన్ల సంఖ్య, సిబ్బంది పెరగడం లేదు. అరకొర సిబ్బందితో అవస్థలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 10 ఫైర్ ఇంజిన్లతో 11 ఫైర్ స్టేషన్లు నడుస్తున్నాయి. వాటిలో మూడు సిటీ పరిధిలో ఉన్నాయి. నక్కపల్లి, రావికమతంలో ఒక్కో స్టేషన్ చొప్పున మరో రెండు స్టేషన్లు అవుట్సోర్సింగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. వాటన్నిటికీ 154 మంది సిబ్బంది అవసరం కాగా 92 మంది మాత్రమే ఉన్నారు. దీంతో 62 మంది హోంగార్డులకు శిక్షణ ఇచ్చి వారి సాయంతో నెట్టుకొస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. ఏటా సిబ్బందిలో కొందరు రిటైర్ కావడం, బదిలీ అవుతుండటంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినప్పటికీ ఆ స్థాయిలో నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. జిల్లాలో కనీసం మరో రెండు ఫైర్స్టేషన్లు, శాశ్వత సిబ్బంది సరిపడా ఉంటే తప్ప ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. పెరుగుతున్న మరణాలు జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. 2013-14లో 847 ప్రమాదాలు జరిగితే 14 మంది, 2014-15లో 1479 ప్రమాదాల్లో 26 మంది, 2015-16లో 1031 ప్రమాదాలు జరిగి 43 మంది చనిపోయారు. ఈ లెక్కలను పరిశీలిస్తే ప్రమదాల సంఖ్యల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ మరణాలు మాత్రం భారీగా పెరగుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రమాదం సంభవించినపుడు త్వరిత గతిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతోంది. కానీ ఆ మేరకు స్పందించడానికి అగ్నిమాపక శాఖకు ఉన్న వనరులు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యక్తుల సాయం తీసుకుంటున్నారు. అత్యవరస సమయాల్లో ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నా నష్ట తీవ్రతను మాత్రం తగ్గించలేకపోతున్నారు. ప్రతిపాదనలు పంపించాం నగర శిశారు ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా జరుగుతోంది. గృహాలు, పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్నాయి. పది నుంచి 20 అంతస్తుల భారీ భవంతులు నిర్మిస్తున్నారు. మా వద్ద 54 మీటర్ల ఒక బ్రోన్టో స్కైలిఫ్ట్ మాత్రమే ఉంది. ఇది కేవలం 16 నుంచి 18 అంతస్తుల వరకే వెళ్లగలదు. కనీసం 90 మీటర్లు ఎత్తుకు వెళ్లగలిగే మూడు స్కైలిఫ్ట్లు అవసరం. లైఫ్ డిటెక్టర్లు, బాధితులున్న ప్రదేశాలను కనిపెట్టే కెమెరాలు, మల్టీ కట్టర్లు, తాళ్లు, డ్రాగన్ లైట్లు వంటివి కావాలి. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్లు, అధికారులను వేగంగా చేర్చేందుకు 13 మంది డ్రైవర్లు ఉండాలి. విశాఖ తూర్పు, పెందుర్తి ప్రాంతాల్లో రెండు ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వీటిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. - జె.మోహన్రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి -
మలమల..మార్చి!
మార్చిలోనే ఎండలు మలమల మాడ్చేస్తున్నాయి. మేనాటి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. జిల్లాలో ఆదివారం కాసిన ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. నూజివీడులో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదైంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. మేలో ఇంకెలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఒత్తిడితో మతిమరుపు
పరిపరి శోధన మానసిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే మతిమరుపు తప్పదని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఎదురయ్యే మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల పెద్దగా అనర్థాలేమీ ఉండకపోయినా, దీర్ఘకాలికంగా అదే పరిస్థితి కొనసాగుతుంటే మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ భాగంలో మార్పులు తలెత్తి, జ్ఞాపకశక్తి క్రమంగా క్షీణిస్తుందని ఓహయో స్టేట్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో తాము ఈ విషయాన్ని గుర్తించామని అంటున్నారు. దీర్ఘకాలం పాటు కొన్ని ఎలుకలను ఒత్తిడికి గురిచేసి, వాటి మెదడు పనితీరులో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన ఈ పరిశోధకులు తమ పరిశోధన వివరాలను ‘జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్’లో ప్రచురించారు. -
చిన్నేరు నిర్వాసితుల ఆందోళన
తంబళ్లపల్లె(చిత్తూరు జిల్లా)-- చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె తహశీల్దార్ కార్యాలయం వద్ద చిన్నేరు ప్రాజెక్టు నిర్వాసితులు మంగళవారం ఉదయం ధర్నా చేశారు. చిన్నేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ గ్రామం మునిగిపోతుందని, తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. -
ఏయూలో తాళాల బాగోతం!
రూ.20 లక్షలకు పైగా దుర్వినియోగం!! పాత తాళం కప్పలకు కొత్త వసూళ్లు ఆందోళనలో హాస్టల్ విద్యార్థులు విశాఖపట్నం: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాళం కప్పల బాగోతం కలకలం రేపుతోంది. తమ నుంచి యాజమాన్యం రూ.లక్షలు దోచుకుంటోందంటూ విద్యార్థి వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాత తాళాలను అంటగడుతూ కొత్త వాటి ధరలను ఏటా వసూలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర యూనివర్సిటీలో ఏటా వివిధ హాస్టళ్లలో 2600 మందికి పైగా అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రవేశ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి తాళం కప్పల నిమిత్తం రూ.150 వసూలు చేసేవారు. ఇలా ఒక్కో హాస్టల్ గదిలో ఇద్దరు ముగ్గురు, లేడీస్ హాస్టళ్లలో ఐదుగురు చొప్పున ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గదికి రూ.300-750 వరకు వసూలవుతుంది. ఆ సొమ్ముతో వారికి కొత్త తాళం కప్పలు ఇవ్వాలి. కానీ అలాకాకుండా అంతకు ముందు వాడిన వాటినే రొటేషన్లో వీరికిస్తున్నారు. లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ గరల్స్, బాయ్స్ హాస్టళ్లల్లో కొంతమందికి పాత తాళం కప్పలు కూడా ఇవ్వడం లేదని దీంతో తామే వాటిని కొంటున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ సొమ్మును వారి నుంచి వసూలు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం 2010 నుంచి కొనసాగుతూ వస్తోంది. దీనిపై కొంతమంది హాస్టల్ విద్యార్థులు కొన్నాళ్ల క్రితం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లగా రూ.150ను 100కు తగ్గించారు. దీంతో 2015 నుంచి రూ.100లు వసూలు చేస్తున్నారు. 2010 నుంచి వసూళ్ల లెక్కలను పరిశీలిస్తే.. మహారాణిపేట లేడీస్ హాస్టల్లో ఏటా 650 మంది కొత్తగా చేరుతుంటారు. వీరి నుంచి ఈ నాలుగేళ్లలో రూ.3.90 లక్షలు, 2015-16కి రూ.65 వేలు వెరసి రూ.4.55 లక్షలు వసూలు చేశారు. అలాగే ఆర్ట్స్, కామర్స్ హాస్టల్ విద్యార్థులు 761 మంది నుంచి రూ.5.30 లక్షలు, సైన్స్ హాస్టల్లో 400 మంది నుంచి రూ.2.80 లక్షలు బాయ్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు 800 మంది నుంచి సుమారు రూ.5.60 లక్షలు, గరల్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్లో 425 మంది నుంచి రూ.3 లక్షలు వెరసి సుమారు రూ.21 లక్షల వరకూ తాళం కప్పల సొమ్ము కింద ఏయూ యాజమాన్యం వసూలు చేసినట్టు అంచనా. వాస్తవానికి ఒక తాళం కప్ప ఖరీదు గరిష్టంగా రూ.150లకు మించదు. అది రెండు మూడేళ్ల వరకూ పనికొస్తుంది. అయినా ఏటా విద్యార్థినీ విద్యార్థుల నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు. తాళం కప్పల కొనుగోలు నిమిత్తం వసూలు చేసిన ఈ సొమ్ము దానికి వినియోగించ కుండా దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సరైన లెక్కాపత్రం లేదని సమాచారం. ఇన్నాళ్లూ సాగిన తాళాల వ్యవహారం ఇటీవల విద్యార్థుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. లోపాలను సరిచేస్తాం.. హాస్టల్ విద్యార్థులు ఏయూ యాజమాన్యానికి మెస్ బిల్లులు రూ.82 లక్షలు బకాయి పడ్డారు. ఇందులో రూ.22 లక్షలు చెల్లించగా ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నారు. బకాయిలుంటే హాస్టళ్లు నడపడం కష్టం. అందువల్ల తాళం కప్పల సొమ్మును హాస్టళ్ల నిర్వహణకు వెచ్చిస్తున్నారేమో? ఒకవేళ దుర్వినియోగం చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి లోపాలను సరిచేస్తాం. - వి. ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ -
‘రియల్’ దెయ్యం
అది మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట. కర్నాటక సరిహద్దులో ఉంటుంది. నారాయణపేట పేరుకి మండల కేంద్రమే కానీ వెనుకబాటుతనం ఛాయలు ఏ మాత్రం వీడలేదు. మండల కేంద్రమైన తర్వాత కొంత ఆధునికత తోడవుతూ పట్టణం విస్తరిస్తోంది. దాదాపుగా పదిహేను వందల కుటుంబాలు జీవిస్తుంటాయి. పట్టణానికి దూరంగా పురాతన నివాస ప్రాంతం ఉంది. అది నూటయాభై కుటుంబాలు నివసించే వాడ. ఆ వాడలో దాదాపుగా ఐదేళ్ల కిందట జరిగిందా సంఘటన. సాయంత్రం అవుతుంటే అందరి కళ్లలో బెరుకు. భయంభయంగా గడుపుతున్నారు. సాధారణంగా ఏడు దాటితే రొటీన్ పనులన్నీ బంద్ అయి ఇళ్లకు చేరే సంస్కృతి వారిది. గూట్లో దీపం, నోట్లో ముద్ద అన్నట్లు సందె చీకట్లు అలుముకోగానే రోజు ముగిసిందనే లైఫ్స్టయిలే అక్కడ. అలాంటిది పొద్దు కొండల్లో పడుతోందంటే... అంటే సాయంత్రం ఐదింటికల్లా ఇంటిదారి పడుతున్నారు. ఎవరికైనా ఏ పక్క ఊరికో వెళ్లి రాత్రి ఎనిమిదింటికి- తొమ్మిదింటికి ఇల్లు చేరాల్సి వచ్చిందంటే చాలు. గుండె గొంతులోకి వచ్చినంత పనవుతుంది. దడదడలాగే గుండెను అరచేత్తో అదుముకుంటూ వచ్చి ఇంట్లో పడేవాళ్లు. ‘అమ్మా ట్యూషన్ నుంచి ఒక్కదానివే రాకు. నేనొచ్చి తీసుకొస్తా’ అంటూ కూతురికి జాగ్రత్తలు చెబుతున్నాడో తండ్రి. ‘దెయ్యం ఎలా ఉంటుంది నాన్నా! ఏం చేస్తుంది?’ అంటూ అమాయకంగా అడిగే ప్రశ్నలకు జవాబు ఆ తండ్రి దగ్గర లేదు. తన బిడ్డ లక్షణంగా ఉంటే తనకదే చాలు అనుకోవడమే అతడికి తెలిసింది. చీకటి పడక ముందే వీధులు నిర్మానుష్యంగా మారేవి. ఒక్కొక్కరైతే పరుగుతో ఇంట్లోకి వస్తూనే కళ్లు తిరిగి పడిపోయేవాళ్లు. ఎవరో వెంబడించినట్లు అనిపించిందని, దూరంగా లీలగా ఓ రూపం కనిపించి ‘ఎక్కడికెళ్తున్నావు’ అని అరిచిందని చెప్పేవారు. మరికొంత మంది ‘తెల్ల దుస్తులు వేసుకున్న యువతి - ఇక్కడికి ఎందుకు వచ్చారు- అంటూ గద్దించింది’ అని చెప్పేవారు. ‘ఆ యువతి కళ్లు దేనికోసమే వెతుకుతున్నట్లు, తీవ్రమైన ఆశాభావం ఆ కళ్లలో గూడు కట్టుకున్నట్లు ఉండేవి. జుట్టు నిశీథిలా వీపంతా పరుచుకుని ఉంది’ ఇలాంటి అనేక కథనాలు. వాడవాడంతా భయం గుప్పెట్లో రోజు వెళ్లదీస్తోంది. ఊళ్లో దెయ్యం తిరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు. దెయ్యం అనే పదం లేకుండా పది మాటలు మాట్లాడడం లేదు. ఇంతకీ దెయ్యం ఎలా పుట్టిందంటే... ‘ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో మాకు తెలియదు కానీ ఆ ఖాళీ స్థలంలో ఉంటోంది’ అని ముక్తకంఠంతో చెప్పసాగారు. దెయ్యం ఉంటున్నదిక్కడే! ఇళ్ల మధ్య వందల ఏళ్ల నాటి కట్టడం. విశాలమైన ప్రహరీ, ఓ మూలగా చిన్న ఇల్లు. కప్పు కూలిపోయి, గోడల్లో నుంచి మొక్కలు పెరిగి, మట్టిదిబ్బలు, రాళ్లకుప్పలతో చూడడానికే భయంగొలిపేలా ఉందా ప్రదేశం. ఆవరణంతా పిచ్చిచెట్లు మొలిచాయి. ఎక్కడ అడుగుపెడితే ఏమవుతుందో అన్నట్లు తీగలు అల్లుకుపోయి ఉన్నాయి. పాములు, తేళ్లు యథేచ్చగా సంచరించే అవకాశం ఉంది. వాడలో అందరి వేళ్లూ ఆ జాగానే చూపిస్తున్నాయి. ‘ఆ యువతి ఇక్కడే ఉంటోంది. జన సంచారం తగ్గినప్పుడు వీధుల్లో తిరుగుతోంది. అప్పుడామెకు ఎవరు ఎదురు వచ్చినా భయపెడుతోంది’ ఇలా తమ అనుభవాలను కథలు కథలుగా చెప్తున్నారు. ‘రీల్’ దెయ్యంలాగానే! ఆ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి యజమాని అక్కడే మంచం మీద కూర్చుని చూస్తున్నాడు. అతడిని పలకరించినప్పుడు... ‘అబ్బే! దయ్యమా ఇంకేమైనానా! నే రోజూ ఇక్కడే మంచం వేసుకుని పడుకుంటా. నాకొక్కసారీ కనిపించందే’ అని తేలిగ్గా తీసిపారేశాడు. అక్కడ గుమిగూడిన ఆడవాళ్లను ‘మీరు చూశారా’ అని అడిగితే, తెల్లముఖం వేశారు. ఎలా ఉంటుంది దెయ్యం? అని అడిగితే... సినిమాల్లో కనబడినట్లు ఉంటుందని భయం వ్యక్తం చేశారు. స్థూలంగా తేలిందేమిటంటే... ‘మేము చూశామని చెప్పేవారి కంటే, ఫలానా వాళ్లకు కనిపించిందట’ అనేవాళ్లే ఎక్కువ. ఆ ‘ఫలానా’ వాళ్లు ఎవరూ అంటే... అందరి కళ్లూ ఏడెనిమిది మంది చుట్టూనే తిరుగుతున్నాయి. వారిలో ఎక్కువమంది ఆ జాగా పక్కనున్న ఇంటి వాళ్లే. వాళ్లు ‘మేము చూశామని స్థిరంగా చెబుతున్నారు. కానీ దయ్యం కనిపించిందనే ఆందోళన, భయం వారి మాటల్లో కానీ, స్వరంలో కానీ ఏ మాత్రం ధ్వనించడం లేదు. లీలగా దెయ్యాన్ని ఊహించుకుని, చూసినట్లు భ్రమించిన వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. స్పష్టంగా చూశామని చెప్తున్న వాళ్లు మాత్రం భయపడడం లేదు. విచిత్రమైన పరిస్థితి. ఇంత జరుగుతుంటే ఆ స్థలం యజమాని ఏమయ్యాడు? అని ఆరా తీస్తే... ‘రియల్’ దెయ్యమే! సెంటర్లో టీ దుకాణం నడుపుకుంటున్నాడు. పాత ఇంటిని పట్టించుకోకపోవడంతో శిథిలమైపోయింది. అతడికి దానిని అమ్మాల్సిన అవసరం రాలేదు. కొనేవాళ్లు ఆసక్తి కొద్దీ అడిగితే అందనంత ధర చెప్పసాగాడు. ఆ ప్లాట్ పనికిరానిదని నిర్ధారించగలిగితే తక్కువ వెలకు సొంతం చేసుకోవచ్చనే దుర్బుద్ధి కలిగింది పక్కింటి వాళ్లకు. కుయుక్తితో పక్కింటి వాళ్లు అల్లిన కథనాన్ని ఖాళీజాగా యజమాని కూడా నమ్మేశాడు. చివరికి అంతా గొప్ప ఫిక్షన్ స్టోరీ అని తేలాక ఊపిరి పీల్చుకుని, ఆ స్థలాన్ని శుభ్రం చేసి ఓ గది కట్టేసి నివాసయోగ్యంగా మార్చుకున్నాడు. మనుషుల్లో బలంగా నాటుకుపోయిన దెయ్యం భయం గురించి సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే... చిన్నప్పటి నుంచి విన్న సంగతులు, ముద్రపడిపోయిన విశ్వాసాలు మనిషి మనసుని ఆడుకుంటుంటాయి. ఆ బలహీనతలతో స్వార్థపరులు ఆటలాడుతుంటారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆ దెయ్యం ఇక కనిపించదు! స్థానిక వార్తాపత్రికల్లో వార్త ప్రచురితమైందని జనవిజ్ఞాన వేదిక మండల కమిటీ వాళ్లు మాకు తెలియచేశారు. హైదరాబాద్ నుంచి నేను వెళ్లాను. మా జిల్లా ప్రతినిధులు కూడా వచ్చారు. మొత్తం ఐదారుగురం కలిసి ఆ వాడంతా తిరిగాం. కనిపించిన వారితో మాట్లాడాం. ఆ పుకారును లేవదీసింది ఖాళీ జాగా పక్కన ఉన్న ఒక కుటుంబం. ప్రచారం చేసింది వారి స్నేహితులు, బంధువులు. వీరికి సలహా ఇచ్చింది ఓ మంత్రగాడు. ఆ కుటుంబ యజమానిని పిలిచి ‘ఇదంతా నువ్వు చేసిందేనని మాకు తెలుసు. ఎందుకు చేశావో చెప్ప’మని నిలదీశాం. మొదట అతడు సహకరించలేదు. పోలీసుల జోక్యంతో నిజం ఒప్పుకున్నాడు. ఆ స్థలాన్ని తక్కువ ధరకు కొట్టేయడానికేనని ఒప్పుకున్నాడు. ఆ వాడలోని వారందరికీ ‘దెయ్యాలుండవని చెప్పి, ఇక దెయ్యం కనిపించదు’ అని ధైర్యం చెప్పాం. ఆ తర్వాత ఆ వాడలో ఎవరూ దెయ్యం కనిపించిందనలేదు. - రమేశ్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అంతా భ్రాంతి..! మనిషి ఎమోషనల్ స్టేట్ని బట్టి ఇల్యూజన్స్ ప్రభావితం చేస్తాయి. దాహంతో ఉన్న వ్యక్తికి ఎడారిలో అడుగడుగునా ఎండమావులే కనిపిస్తాయి. చేతిలో నీళ్లు ఉంటే ఎండమావులు కనిపించవు. ఇదీ అలాగే. దెయ్యం విషయంలోనూ అంతే. ప్రీ ఫిక్సేషన్ ఆఫ్ మైండ్ అలా ఉంటుంది. అందుకు చదువు, విజ్ఞానం లోపించడంతోపాటు చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ ‘తినకపోతే దెయ్యం పట్టుకెళ్తుందని భయపెట్టడం’ వంటివన్నీ కారణాలే. అలాగే ఇళ్లలో దెయ్యాల మీద చర్చ, దెయ్యాల సినిమాలు చూడడం వల్ల చదువుకున్న వారిలోనూ మైండ్ దెయ్యం ఉందనే భావంతో నిండిపోతుంది. కనిపించిన వాటిని దెయ్యంతో పోల్చుకుంటుంటారు. లైటు దగ్గర పురుగు కదిలినా దెయ్యం కదలినట్లు భ్రాంతికి లోనవుతుంటారు. - డాక్టర్ కల్యాణ్చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
ధరాభారంపై నిరసన హోరు
{పభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ సమరశంఖం ర్యాలీలు..వినూత్న నిరసనలు ఆందోళనలతో హోరెత్తిన మండలకేంద్రాలు విశాఖపట్నం: ధరల పెరగుదలపై వైఎస్సార్ సీపీ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. పాడేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీలు వరసన ముత్యాలమ్మ,ఎంవీగంగరాజు,పెద్ద సంఖ్యలోపార్టీ నాయకులు అంబేద్కర్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ధరల నియంత్రణకు రూ.వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు ఆ ఊసు ఎత్తడం లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ పాలనలో ఒక్కపైసా పెంచలేదు.ః బూడిదివంగత వైఎస్సార్ ఆరేళ్ల పాలనలో ఒక్క పైసా భారాన్ని ప్రజలపై మోపలేదని.. బాబు ఏడాదిన్నరలోనే ఒక పక్క చార్జీలు..మరో పక్క ధరలు విపరీతంగా పెంచేశారని ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆరోపించారు. మాడుగుల నియోజకవర్గంలోచీడికాడ, దేవారపల్లి, మాడుగుల మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగిన ధర్నాల్లో ఎమ్మెల్యే బూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరలను అదుపు చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. ఈ ‘సర్కార్’కు పాలించే అర్హత లేదు..గుడివాడ ధరలు..చార్జీల భారంతో ప్రజలనడ్డి విరుస్తున్న ఈ సర్కార్కు పాలించే అర్హత లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తర నియోజకవర్గం పార్టీ శ్రేణులు విశాఖలోని సీతమ్మధార అర్భన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఉత్తర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్తో కలిసి గుడివాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.1000కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి..ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్ అలీ తదితరులు పాల్గొ న్నారు. చినగదిలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట తూర్పు నియోజకవర్గం కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాదరెడ్డి, రాష్ర్ట ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట కార్యదర్శి కంపా హనోక్ పాల్గొన్నారు. మల్కాపురంలోని డిప్యూటీ తహశీల్దార్ కార్యా లయం ఎదుట పశ్చిమ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. దక్షిణ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న సౌత్ ఎమ్మార్వో కార్యాల యం ఎదుట నిర్వహించిన ధర్నాలో కో ఆర్డినేటర్ కోలా గురువులు పాల్గొన్నారు. గాజువాక తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.ఎస్.రాయవరం తహశీల్దార్కారాలయాన్ని పాయకరావుపేట కో ఆర్డినేటర్, మాజీఎమ్మెల్యే చెంగల వెంకట్రావు పార్టీశ్రేణులతో కలిసిముట్టడించి ధర్నాచేశారు. నర్సీపట్నం కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీఒ కార్యాలయం ఎదుట బైటా యించి ధర్నా చేశారు. పెందుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో ఆర్డినేటర్ అదీప్రాజు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. యలమంచలి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కో ఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు, అరకు పార్లమెంటు నియోజక వర్గ పార్టీ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో ధర్నా చేశారు.అరకులోయలో పార్టీ నేతలు శెట్టి అప్పారావు, సమ్మర్ధి రఘునాధ్ పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలూ పార్టీ శ్రేణులు.. ధర్నాలతో హోరెత్తాయి. -
కదం తొక్కిన కార్మికులు
తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన చిత్తూరులో కలెక్టరేట్ ముట్టడి మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు కార్మికుల అరెస్టు నేటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామన్న నాయకులు తిరుపతి కార్పొరేషన్: జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో కార్మికులు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. సమ్మెలో ఉన్న కార్మికులు రోజుకో రీతిలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు లేదు. ఒక పక్క పట్టణాల్లో చెత్త పేరుకుపోవడం, దుర్గంధం వెదజల్లి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోతే రాష్ర్టవ్యాప్త బంద్ చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో మున్సిపల్ కార్మికుల్లో నూతనోత్తేజం నెలకొంది. అందులో భాగంగానే కార్మికులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలిపారు. చిత్తూరులో కలెక్టరేట్ ముట్టడించిన కార్మికులకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మద్దతు తెలిపి, ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాయత్రితో పాటు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకుడు నాగరాజు, సీఐటీయూ నాయకులు చైతన్యతో పాటు 150మంది కార్మికులను అరెస్టుచేశారు. ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మదనపల్లెలో కార్మికుల సమ్మెకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, కౌన్సిలర్లు బాలగంగారెడ్డి, మస్తాన్ రెడ్డి, ఖాజీ మద్దతు పలికి, ధర్నాలో పాల్గొన్నారు. తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పలమనేరు, పుత్తూరు, నగరిలో తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. పుంగనూరులో కార్మికుల ధర్నా చేశారు. ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
మత్స్యకారుల ఆచూకి గల్లంతు?
- యలమంచిలి సీఐకు బంధువుల ఫిర్యాదు యలమంచిలి : చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆది వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి సముద్రమార్గంలో బోటు పై ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్య ఈ నెల 19న బయలుదేరారు. శనివారం ఉదయానికే స్వగ్రామానికి చేరుకోవాలి. మచిలీపట్నం తీరానికి వచ్చే వరకు వారు ఫోన్లో మాట్లాడారని, అప్పటి నుంచి సమాచారం లేకుండా పోయిం దని కుటుంబ సభ్యులు ఆదివారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని పెంటకోట, కాకినాడ మెరైన్ పోలీస్టేషన్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కాశీరావు, కోటయ్య నెల రోజుల క్రితం చేపల వేటకు ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 7 గంటలకు బోటుపై బంగారమ్మపాలెం బయలుదేరారు. ఆదివారం వరకు రాకపోవడంతో కుటుంబీకు ల్లో ఆందోళన ఎక్కువైంది. ఆదివారం రాత్రి వరకు మత్స్యకారుల ఆచూకి తెలియకపోవడంతో సంబంధిత కుటుంబీకు లు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
కేంద్రం విధానాలతోనే రైతుకీ దుస్థితి..!
ఏఎన్యూ : దేశంలో ప్రధానరంగమైన వ్యవసాయంపై కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరించటం వల్లనే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ర్ట శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, చెన్నైకి చెందిన డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా మూడు రోజులపాటు వర్సిటీలో నిర్వహించిన ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ జీవితమంతా వ్యవసాయ రంగం అభివృద్ధికి కేటాయించారన్నారు. ఆయన నేతృత్వంలో వ్యవసాయ రంగంలో సమస్యల అధ్యయనంపై గతంలో కేంద్రప్రభుత్వం కమిటీలు వేసిందనీ, ఆయన ఇచ్చిన నివేదికలపై కనీసం పార్లమెంటులో చర్చ కూడా జరగకపోవటం దురదృష్టకరమన్నారు. దీన్నిబట్టే వ్యవసాయాభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని తెలుస్తోందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి సుస్థిరమైన విధానాలు ఉండాలన్నారు. మనదేశంలో పౌష్టికాహార లోపం వల్ల వస్తున్న అనేక వ్యాధులను నిర్మూలించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. 2025 నాటికి భారత్ను ప్రపంచశక్తిగా నిలపగల సత్తా యువతకే ఉందన్నారు. లాభసాటి రంగమైన వ్యవసాయంలో నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందని, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉండడం విచారకరమన్నారు. పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ల పేరుతో సాగుభూమిని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని దీని వల్ల వ్యవసాయం తగ్గిపోతుందన్నారు. ఆహార భద్రత చట్టం తేవటం మంచి పరిణామమేనని, ఇదే సమయంలో వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడం వల్ల చాలా మంది రైతులు ప్రైవేటు పరంగా ఆర్థిక సహకారాన్ని పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ముందుకు సాగితేనే గిట్టుబాటు ధర సాధ్యమన్నారు. దేశమంతటా ఒకే మార్కెట్ విధానం ఉండాలని పేర్కొన్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార, సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ ప్రజలను నైపుణ్యవ ంతులుగా తయారు చేసేందుకు దోహదం చేయాలన్నారు. యువ త సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి మూలస్తంభాలుగా నిలవాలన్నారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రజల జీవనవిధానాన్ని మార్చే దిశగా యువత చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార భద్రతకు పరిష్కారాలు కనుగొనే దిశగా నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలన్నారు. స్వామినాథన్ ఫౌండేషన్ ఈడీ డాక్టర్ అజయ్ఫరీదా నివేదిక సమర్పించారు. కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, స్వామి నాథన్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ పరశురామన్, డాక్టర్ రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, అధ్యాపకులు డాక్టర్ జె. చెన్నారెడ్డి పలువురు శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైవీయూకు తరలించాల్సిందే
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరులో ఉన్న యోగివేమన ఇంజినీరింగ్ కాలేజీని కడపలోని యోగివేమన యూనివర్శిటీకి తరలించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేశారు. పట్టణంలోని పాలిటెక్నిక్ ఆవరణంలో ఉన్న కళాశాల నుంచి వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా రాజీవ్సర్కిల్ మీదుగా పుట్టపర్తిసర్కిల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై మానవహారంగా కూర్చొని అరగంటకు పైగా నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు నోటికి కట్టుకుని రోడ్డుపైనే కూర్చొని చదువుకుంటూ నిరసన తెలిపారు. కళాశాల ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ కన్వీనర్ భాస్కర్ ఆరోపించారు. కళాశాలను ప్రారంభించే సమయంలో తమ అనుయాయులకు ఉద్యోగాలు వేయించు కోవడంతోనే పాలకులు తమ పని అయిపోయిందనుకుంటున్నారని అన్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఆందోళన చేస్తే అదేదో దేశ సమస్య అని ప్రభుత్వం ఆఘమేఘాల పైన స్పందిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తూన్నా ఏ ఒక్కరూ పట్టించు కోవడం లేదన్నారు. ఇప్పటికే అనేకమంది విద్యార్థులు వసతులు లేవని కళాశాలలో చేరకుండా వెనక్కివెళ్లిపోయారన్నారు. విద్యార్థుల ఆందోళన కారణంగా ట్రాఫిక్కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
సముద్రాన్ని ఇంత భయానకంగా ఎప్పుడూ చూడలేదు
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం జిల్లా మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతం సముద్ర కెరటాలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. తమ జీవితంలో సముద్రాన్ని ఇంత భయంకరంగా ఎప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెప్పారు. అయితే తీర ప్రాంతం నుంచి ఖాళీ చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి బోట్లను కొనుగోలు చేశామని, ఇవి దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు మంచినీళ్లు, ఆహారం అందించడంలేదని వాపోయారు. ఈ రాత్రికి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తుందని సాక్షి ప్రతినిధులతో చెప్పారు. అధికారులు తుపాన్ వచ్చినపుడు హడావుడి చేయడం మినహా తర్వాత తమను ఎవరూ ఆదుకోరని జాలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోకిరికిరి
అనంతపురం క్రైం : ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగినప్పుడు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్నారు మహాత్మాగాంధీ. అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు.. కనీసం పట్టపగలు కూడా అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. అనంతపురంలో యువతులు, మహిళలు పగటి పూట సైతం తండ్రో, అన్నో, తమ్ముడో, స్నేహితులో.. ఇలా ఎవరో ఒకరి తోడు లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఇటీవల చైన్స్నాచింగ్లు ఎక్కువ కావడంతో మహిళలు ఆభరణాలు వేసుకుని కనీసం ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇక యువతుల పరిస్థితి మరీ ారుణం. నడిరోడ్డుపైనే ఆకతాయిల వెకిలి చేష్టలతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా కొరవడడంతో రోడ్సైడ్ రోమియోలు రెచ్చిపోతున్నారు. కళాశాలల వద్ద కాపు కాస్తూ ఈవ్టీజింగ్కు పాల్పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో సైతం ఈ జాడ్యం పురుడుపోసుకుంటోంది. దీంతో ఎన్నో ఆశలతో ఉన్నత లక్ష్యంతో విద్యాభ్యాసం చేస్తున్న యువతులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంటి నుంచి కళాశాలకు, బయటకు వెళ్లాక తాము పడుతున్న ఇబ్బందులను ఇంట్లో వాళ్లకు చెబితే ఎక్కడ తమ చదువును అర్ధంతరంగా ఆపేస్తారోనన్న ఆందోళన విద్యార్థినులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు నరకయాతన అనుభవిస్తున్నారు. గ్యాంగ్లుగా ఏర్పడి ఈవ్టీజింగ్ అనంతపురంలోని కొన్ని కూడళ్లలో యువకులు గ్యాంగ్లుగా ఏర్పడి ఈవ్టీజింగ్కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు, యువతులు, మహిళలను వేధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక హాస్టళ్లు ఎక్కువగా ఉండే సాయినగర్, జీసెస్నగర్, కమలానగర్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండో రోడ్డు, విద్యుత్ నగర్, కమలానగర్, పాతూరు ప్రాంతాల్లో పోకిరీల బెడద ఎక్కువవుతోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని గుర్తించి వారి వెంటే వెళ్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ సమయంలో ఎదురుతిరిగితే ఎక్కడ తమ పరువు బజారున పడుతుందోనని యువతులు భయపడుతున్నారు. మూడ్రోజుల క్రితం ఓ వివాహిత మెడికల్ కళాశాల మీదుగా అశోక్నగర్ వైపు ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్తుండగా వెనుక వైపు నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు ‘హాయ్ ఆంటీ’ అని అసభ్యపదజాలంతో ఇబ్బంది పెట్టి వెళ్లిపోయారు. ఇదే తరహాలో సాయినగర్లోని ఓ హాస్టల్ యువతి కొన్ని వస్తువులు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్తుండగా అక్కడే కాపు కాసిన యువకులు ఈవ్టీజింగ్ చేయడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు చెప్పిన తర్వాత స్థానికులు స్పందించేలోగా ఆ యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా తల్లిదండ్రులకు చెబితే ఇబ్బందులు వస్తాయని అమ్మాయిలు లోలోపలే కుమిలిపోతున్నారు. కాగా కొన్ని మహిళా కళాశాలల్లోకి బయట వ్యక్తులు కూడా వచ్చి ఈవ్టీజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో కోచింగ్ సెంటర్లకు వెళ్తున్న యువతులు కూడా ఈవ్టీజింగ్ బాధితులుగా మారుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో వెంటబడి మరీ సతాయిస్తున్నారు. కొరవడిన నిఘా అనంతలో పరిస్థితి ఇంతగా దిగజారుతున్నా పోలీసులు మాత్రం నిఘా పెంచడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల విద్యార్థినులు, మహిళలకు భరోసా ఇచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు ఉండే కళాశాలల వద్ద గతంలో మఫ్టీలో పోలీసులు ఉండేవారు. మహిళా కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహించేవారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ఇలాంటి పోకిరీలకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యార్థినులు, మహిళలు, ప్రజలు కోరుతున్నారు. కళాశాలల్లో, ప్రధాన కూడళ్లలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేసి.. అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే ఏర్పాటు చేస్తే బావుంటుందని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోకిరీల పనిపట్టే అవకాశం ఉంటుంది. ముందస్తు చర్యలపై దృష్టి సారించాలి నగరంలో ఈవ్టీజింగ్ జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. అయితే ఫిర్యాదు అందిన తర్వాత మాత్రం పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. శనివారం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఓ ఎయిడెడ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలో ఈ విద్యార్థితో పాటు మరికొందరు ఈవ్టీజింగ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తల్లిదండ్రులను పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు. కేసుకడితే విద్యార్థి భవిష్యత్తు నాశనమవుతుందని కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి చేయడంతో కౌన్సెలింగుతోనే సర్దుకున్నారు. అలాగే ఫోన్లో తనను వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐలు జాకీర్హుసేన్, విశ్వనాథచౌదరి నలుగురు పోకిరీలకు తమైదనశైలిలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నలుగురు యువకులకు సప్తగిరి సర్కిల్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా వివాహితను సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన అనంతపురం రూరల్ జ్యోతిబసు కాలనీకి చెందిన శ్రీనివాసులుపై రూరల్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. కాగా తమను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్న వారు చాలా అరుదుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల సహాయంతో పోకిరీలకు అడ్డుకట్టవేయగలుగుతున్నారు. అయితే చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నా వారి తల్లిదండ్రులు మాత్రం మనకెందుకొచ్చిన గొడవంటూ సముదాయించి ముందడుగు వేయలేకపోతున్నారు. ఫిర్యాదు అందితే చర్యలకు ఉపక్రమిస్తున్న పోలీసులు ముందస్తుగా నిఘా పెంచి ఈవ్టీజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
ఎండుతున్న వరి పైరు
నగరం : వరుణుడు ముఖం చాటేయటంతో వరి సాగు ఎండుముఖం పట్టింది. పంట నేలలు బెట్టతీసి నెర్రెలిస్తున్నాయి. కాలువల్లో నీరు లేక వర్షాలు పడక వరి సాగు ఎలా చేయాలో అర్థం కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో 28 వేల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సివుండగా ఇప్పటివరకు 40 శాతం కూడా పూర్తికాలేదు. నాట్లు వేసిన రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు 20 నుంచి 25 రోజుల దశలో ఉంది. ఈ తరుణంలో సాగు నీరందకపోవడంతో పొలాలు నెర్రెలిచ్చి పైరు ఎండుదశకు చేరుతోంది. ఈ ఏడాది ఖరీప్ సాగు ఆరంభం నుంచి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంట కాలువలకు నీరు రాకపోవడంతో వరుణుడుపై భారం వేసి నాట్లు వేసిన రైతులు ప్రస్తుతం వాటిని రక్షించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. కాలువలకు అరకొరగావచ్చిన నీటిని ఎగువన ఉన్న రైతులు డీజిల్ ఇంజన్లు సాయంతో పొలాలకు పంపుతున్నారు. సాగర్ జలాశయం గరిష్టమట్టానికి చేరుకున్నా కాలువలకు నీరు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం సాగునీరు పుష్కలంగా ఉందనీ, రైతులు అందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నా, కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.