Advertisement
Yuzuvendra Chahal
-
ప్రపంచ రికార్డు ముంగిట యజువేంద్ర చహల్
ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చంఢీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది. ఇక వరుసగా నాలుగు విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి రుచి చూసిన రాజస్తాన్.. తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉండగా.. వరుస పరాజయాలతో చతికిలపడ్డ పంజాబ్ సొంత మైదానంలో సత్తా చాటాలని ఉవ్విళూర్లుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఈ మ్యాచ్లో గనుక అతడు మూడు వికెట్లు తీస్తే ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. చహల్ ఇప్పటి వరకు 157 ఐపీఎల్ మ్యాచ్లలో కలిపి 197 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై ఇండియన్స్ ద్వారా 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ మణికట్టు స్పిన్నర్.. 2014 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సుదీర్ఘకాలం పాటు ఆడాడు. అయితే, 2022 మెగా వేలానికి ముందు ఆర్సీబీ చహల్ను విడుదల చేయగా.. రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్-2024లో రాజస్తాన్ తరఫున ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన చహల్ 10 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్పై యజువేంద్ర చహల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 19 మ్యాచ్లు ఆడిన చహల్ 29 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని చహల్ పట్టుదలగా ఉన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ కింగ్స్ ఐదింట కేవలం రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! Saturday Night Goosebumps: Delivered 🔥 pic.twitter.com/cdPMksvqId — Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2024 -
IPL 2024: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే!
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్. యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL) అదే విధంగా.. రాయల్స్లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్. తద్వారా క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు! ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ -
అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం నుంచి స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో డకౌట్ అయిన ఈ ముంబై ఆటగాడు.. అఫ్గనిస్తాన్పై 25(నాటౌట్) పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో అజేయ అర్ధ శతకం(53)తో ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో మరోసారి విఫలమై(19) పాత కథ పునరావృతం చేశాడు. అనంతరం న్యూజిలాండ్తో మ్యాచ్లో 33 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో మ్యాచ్లో 4 పరుగులకే పెవిలియన్ చేరి మళ్లీ నిరాశ పరిచాడు. తప్పించాలంటూ డిమాండ్లు దీంతో నిలకడలేని ఫామ్తో సతమవుతున్న అయ్యర్పై వేటు వెయ్యాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో.. సొంతమైదానం వాంఖడేలో అద్భుతమైన ఇన్నింగ్స్తో సత్తా చాటాడు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్. ఒక్క ఇన్నింగ్స్తో దిమ్మతిరిగేలా సమాధానం పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్నాననే జాగ్రత్త పడకుండా నిస్వార్థ ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. శుబ్మన్ గిల్ (92), విరాట్ కోహ్లి (88)లు అవుటైన తర్వాత వేగవంతమైన ఆట తీరుతో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ సిక్సర్తో రికార్డు ఈ క్రమంలో విమర్శించిన వారే అయ్యర్ను ప్రశంసిస్తూ అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే.. లంకతో మ్యాచ్ సందర్భంగా ఈ వరల్డ్కప్ ఎడిషన్లో అతి భారీ సిక్సర్ను నమోదు చేశాడు. కసున్ రజిత బౌలింగ్లో 106 మీటర్ల సిక్స్ను బాది చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక.. ఓవైపు అయ్యర్ షాట్ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చహల్- ధనశ్రీలపైకి బంతి విషయమేమిటంటే.. వన్డే వరల్డ్కప్-2023లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి గురువారం వాంఖడే మైదానానికి వచ్చాడు. అయితే, అయ్యర్ బాదిన భారీ సిక్సర్ ఈ దంపతులు కూర్చున్న స్టాండ్స్లో ల్యాండ్ అవడం విశేషం. శ్రుతిమించిన ట్రోల్స్ దీంతో.. ‘‘పాపం చహల్పై అంత కోపమెందుకు అయ్యర్.. ఏదేమైనా ధనశ్రీ రావడంతో అయ్యర్కు లక్ కలిసివచ్చినట్లుంది’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధనశ్రీతో కలిసి అయ్యర్ డ్యాన్స్ చేసిన వీడియోలు, వీరిద్దరు కలిసి పార్టీలకు హాజరైన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తీసేసినపుడు.. అయ్యర్ పేరుతో ఆమె పేరును జతచేసి దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగక చహల్తో ధనశ్రీ విడిపోబోతుందంటూ వదంతులు వ్యాప్తి చేయగా.. చహల్ స్వయంగా వీటిని ఖండించాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిగో మళ్లీ ఇప్పుడిలా ఈ సిక్సర్ కారణంగా వాళ్లిద్దరిని ట్రోల్ చేస్తూ మీమ్స్తో రెచ్చిపోతున్నారు. అయితే, అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం వీటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిభను గుర్తించకుండా అనవసరపు విషయాల్లోకి లాగి అయ్యర్ ఆటను తక్కువ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
అయినా.. చహల్ను ఎందుకు సెలక్ట్ చేస్తారు? నా ఛాయిస్ అతడే: స్పిన్ దిగ్గజం
Muttiah Muralitharan's Blunt Take: కేవలం వైవిధ్యం కోసమని అదనపు స్పిన్నర్ను ఎంపిక చేయడం సరికాదని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. వరల్డ్కప్-2023 జట్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే సరిపోయేదంటూ బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే, అదే సమయంలో.. యజువేంద్ర చహల్ను పక్కన పెట్టి మంచి పని చేశారని సమర్థించాడు. కాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లతో పాటు.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కింది. అయితే, మరో మణికట్టు స్పిన్నర్ చహల్కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై స్పందించిన మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బయోపిక్ ‘800’ ప్రమోషన్లలో భాగంగా.. జడేజా ఉన్నాడు కదా ‘‘ఒకవేళ జడేజా, కుల్దీప్లను తీసుకుని ఉంటే సరిపోయేది. వైవిధ్యం పేరిట ముగ్గురు స్పిన్నర్లను ఎంపిక చేయడం మాత్రం సరికాదు. జడ్డూ ఎలాగో ఆల్రౌండర్ కాబట్టి కుల్దీప్ను స్పెషలిస్టు బౌలర్గా వాడుకునేవాళ్లు. ఇక రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ల ప్రస్తుత ఫామ్ ఎలా ఉందో నాకు తెలియదు. అయినా, టీ20 ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా వన్డేలకు సెలక్ట్ చేయలేరు కదా! 50 ఓవర్ల ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ చహల్ కంటే కుల్దీప్ ప్రదర్శన మెరుగ్గా ఉంటే అతడిని ఎంపిక చేయడంలో తప్పులేదు. ఒక్కోసారి అనుభవం కంటే ఫామ్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చహల్ను ఎలా ఎంపిక చేస్తారు? వన్డేల్లో అతడి ప్రదర్శన చెప్పుకోదగ్గదిగా లేనపుడు అతడిని ఎవరైనా ఎలా సెలక్ట్ చేయగలరు? కాబట్టే అతడిని విస్మరించి ఉంటారు. ఇంతకీ చహల్ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడా? తిరిగి ఫామ్ పొందాలంటే అంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదు కదా!’’ అని టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టిన ముత్తయ్య మురళీధరన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అశ్విన్ ఉంటే ఒకవేళ తనకు ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకునే అవకాశం ఉంటే మాత్రం.. జడేజా, అశ్విన్, కుల్దీప్లవైపే మొగ్గు చూపుతానని మురళీధరన్ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా.. ఐపీఎల్లో బాగా ఆడినంత మాత్రాన ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశాడు. చదవండి: వరల్డ్కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్గా అతడే? -
బ్యాటింగ్ ఆధారంగా బౌలర్లను సెలక్ట్ చేస్తారా.. నిజమా?: మాజీ బ్యాటర్
India World Cup 2023 squad: ‘‘అక్షర్ పటేల్- యుజీ చహల్.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న విషయంలో కచ్చితంగా చర్చ జరిగి ఉంటుంది. టీమిండియాకు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలి. సరే.. అలాగే అనుకుందాం.. ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా చేశారు. కానీ.. నిజంగానే బ్యాటింగ్ చేయగల సమర్థత ఆధారంగానే బౌలర్లను సెలక్ట్ చేస్తారా?’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను కాదని.. ఆల్రౌండర్ అన్న కారణంగా అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం ఎందుకో సబబుగా అనిపించడం లేదని పేర్కొన్నాడు. చహల్కు నో ఛాన్స్ కాగా భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసియా వన్డే కప్-2023 టీమ్లో ఉన్న ప్రధాన ఆటగాళ్లందరికీ ఇందులో చోటు దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు మాత్రం ఈసారి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. కేవలం బ్యాటింగ్ చేస్తారన్న కారణంగా బౌలర్లను జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇద్దరూ తుదిజట్టులో ఉండరు కదా! అదే విధంగా.. ‘‘బ్యాటింగ్లో డెప్త్ కోసం నంబర్ 8లో ఆల్రౌండర్ను తీసుకుంటామని అంటున్నారు. నిజానికి.. జట్టులోని టాప్-6 బ్యాటర్లలో కొందరు విఫలమైనా జడేజా రూపంలో సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాడు అందుబాటులో ఉన్నాడు. టాప్ బ్యాటర్లంతా బాధ్యతాయుతంగా ఆడితే ఎనిమిదో నంబర్ ఆటగాడి గురించి ఆందోళనే ఉండదు కదా! ఒకేరకమైన నైపుణ్యాలు కలిగిన జడేజా, అక్షర్ తుదిజట్టులో కలిసి ఆడతారా? అంటే అదీ లేదు. లెఫ్టాండర్ బ్యాటర్ ఉన్నపుడు లెఫ్టార్మ్ ఫింగర్ స్పిన్నర్ చేతికి కెప్టెన్ బంతిని ఇవ్వడు. కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్లతో మిడిల్ ఓవర్లలో 20 ఓవర్లు ఎలా వేయిస్తారు? ఇలా జరగడం సాధ్యమేనా? దీనిని బట్టి అక్షర్ను బెంచ్కే పరిమితం చేస్తారనడం స్పష్టంగా అర్థమవుతోంది కదా!’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అగార్కర్ రీజన్ ఇదీ కాగా చహల్ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం.. జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేయగలరు.. అదే విధంగా.. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టే ఇద్దరినీ ఎంపిక చేశామని స్పష్టం చేశాడు. చదవండి: ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా.. WC: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. -
అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
India's ODI World Cup 2023 Squad: ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై హర్భజన్ సింగ్ స్పందించాడు. మ్యాచ్ విన్నర్కు చోటు లేకపోవడం ఏమిటంటూ ‘ఎక్స్’ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మంగళవారం ప్రపంచకప్ జట్టును ప్రకటించాడు. ఈసారి కూడా మొండిచేయి! ఇందులో.. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, నలుగురు ఆల్రౌండర్లకు చోటు దక్కింది. అయితే, ఆసియా కప్ జట్టులో స్థానం లేనప్పటికీ అనుభవం దృష్ట్యానైనా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఈసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. చహల్ కానీ.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా.. ఇకపై రిస్ట్ స్పిన్నర్లు కుల్-చా ద్వయాన్ని ఒకే జట్టులో చూడలేమన్న మాటలను నిజం చేస్తూ అగార్కర్.. చహల్పై వేటు పడటానికి కారణాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో చైనామన్ స్పిన్నర్కు చోటు దక్కగా.. చహల్కు భంగపాటు తప్పలేదు. ఆశ్చర్యం వేసింది ఈ విషయంపై స్పందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ప్రపంచకప్ జట్టులో యజువేంద్ర చహల్కు చోటు లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్యూర్ మ్యాచ్ విన్నర్ తను’’ అని ట్వీట్ చేశాడు.ఘీ క్రమంలో నెటిజన్లు సైతం యుజీకి మద్దతు తెలుపుతూ భజ్జీని సమర్థిస్తున్నారు. చహల్తో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కూడా అన్యాయం జరిగిందని మరికొంత మంది వాపోతున్నారు. అక్షర్ వద్దు.. ఎందుకంటే! తన వరల్డ్కప్ జట్టులో యజువేంద్ర చహల్కు చోటిచ్చిన హర్భజన్ సింగ్.. అక్షర్ పటేల్ను విస్మరించిన విషయం తెలిసిందే. ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘రవీంద్ర జడేజా.. అక్షర్ పటేల్ ఇద్దరూ ఒకేలాంటి ప్లేయర్లు. చహల్ బౌలింగ్ శైలి వేరు. అతడు మ్యాచ్ విన్నర్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి గణాంకాలు గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. వన్డే, టీ20లలో చహల్ లాంటి ప్రభావంతమైన స్పిన్నర్ లేడనే చెప్పాలి. జడ్డూ ఎలాగో జట్టులో ఉంటాడు కాబట్టి.. అక్షర్ను పక్కనపెట్టి యుజీని తీసుకుంటే బాగుంటుంది అని వరల్డ్కప్ జట్టు ప్రకటనకు ముందు భజ్జీ తన అంచనా తెలియజేశాడు. వన్డే వరల్డ్కప్-2023కి హర్భజన్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్. చదవండి: తిలక్తో పాటు అతడికి నో ఛాన్స్! ఇదే ఫైనల్.. మార్పుల్లేవు: అజిత్ అగార్కర్ Surprise not to see @yuzi_chahal in the World Cup squad for Team India. pure Match winner — Harbhajan Turbanator (@harbhajan_singh) September 5, 2023 -
WC 2023: మొన్న అలా.. ఇప్పుడిలా! మాట మార్చిన దాదా.. పాపం
World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్ను ఎంపిక చేసుకున్నాడు. ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా తన టీమ్ను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం. అందుకే చహల్పై వేటు! టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. దీంతో అనుభవజ్ఞుడైన చహల్ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు. తిలక్ వర్మకు నో ఛాన్స్ కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణను కూడా దాదా తప్పించాడు. అయితే, మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితే తిలక్ వర్మ, పేసర్ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్, స్పిన్నర్ గాయపడితే చహల్లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది. వన్డే వరల్డ్కప్-2023కి సౌరవ్ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే -
చహల్కు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2023: ‘‘ప్రస్తుతం యుజువేంద్ర చహల్కు టీమిండియాలో స్థానం దక్కించుకునే అర్హత లేదు. గత కొంతకాలంగా అతడు నిలకడలేమి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు.. కుల్దీప్ యాదవ్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొడుతూ జట్టుకు అవసరమైన సమయంలో రాణిస్తున్నాడు. చహల్ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి సరైన నిర్ణయం తీసుకున్నారు’’ పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా అన్నాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఈ లెగ్ బ్రేక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో యుజీ చహల్కు మొండిచేయి ఎదురైన విషయం తెలిసిందే. అందుకే చహల్పై వేటు అతడిని కాదని మరో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ విషయం గురించి బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లకు జట్టులో చోటు లేదని.. ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి చూడలేమని స్పష్టం చేశాడు. అదే విధంగా.. ఆసియా కప్ జట్టు జాబితా నుంచే వన్డే వరల్డ్కప్నకు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో.. కుల్దీప్ మెరుగ్గా రాణిస్తే ఐసీసీ ఈవెంట్పై కూడా చహల్ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది. అంతటి మొనగాడు లేడు..అయినా ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సహా సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు చహల్ను జట్టులోకి తీసుకోకపోవడంపై మేనేజ్మెంట్ తీరును విమర్శిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్పిన్నర్లలో చహల్ను మించి మొనగాడు లేడని.. అలాంటిది తనకు జట్టులో చోటు లేకపోవడం ఏమిటని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాత్రం బీసీసీఐ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. సెప్టెంబరు 2న టీమిండియా తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. చదవండి: అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా.. ఆరోజు నేను భయపడ్డాను: గంభీర్ -
అందుకే అతడికి జట్టులో చోటివ్వలేదు.. స్పందించిన చహల్! అప్పుడు రోహిత్..
India Asia Cup 2023 squad: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న అతడి ఆటిట్యూడ్తో అభిమానుల మనసు గెలవడం విశేషం. ఆసియా కప్-2023లో పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్లోనూ? వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు ప్రొవిజినల్ టీమ్గా భావిస్తున్న ఈ జట్టులో స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్వైపే మొగ్గు చూపింది మేనేజ్మెంట్. ఈ చైనామన్ స్పిన్నర్తో పాటు స్పిన్ విభాగంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లకు చోటిచ్చింది. క్రిప్టిక్ ట్వీట్తో చహల్ ఈ నేపథ్యంలో నిరాశకు గురైన యుజీ చహల్ క్రిప్టిక్ ట్వీట్తో ముందుకు వచ్చాడు. మబ్బుల్లో దాగిన సూర్యుడు... మళ్లీ ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీలతో క్యాప్షన్ ఏమీ లేకుండానే పోస్ట్ చేశాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న అర్థంలో నర్మగర్భ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ‘‘అవును.. నువ్వు చెప్పిందే నిజమే భాయ్. మళ్లీ నీకు మంచి రోజులు వస్తాయి’’ అని బదులిస్తున్నారు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ చహల్ను జట్టు నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై నో కుల్-చా! చోటు లేదు గనుకే అతడిని ఎంపిక చేయలేదని, అయితే.. వన్డే వరల్డ్కప్లో చహల్ దారులు మూసుకుపోలేదని హిట్మ్యాన్ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి జట్టులో చూసే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు జట్టులో చోటివ్వలేమని.. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో చైనామన్ బౌలర్కే ఓటు వేశామని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. అప్పుడు రోహిత్ సైతం.. ఇక గతంలో జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ సైతం.. ‘‘సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. 2018లో టెస్టుల్లో అతడికి స్థానం లేకపోవడంతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే రీతిలో చహల్ సైతం తన బాధను వ్యక్తపరుస్తూనే.. మళ్లీ తిరిగివస్తాననే ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. చదవండి: WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్ ⛅️——> 🌞 — Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023 Sun will rise again tomorrow 😊 — Rohit Sharma (@ImRo45) July 18, 2018 -
అందుకే చహల్పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు
India Asia Cup 2023 squad: ‘‘టీమిండియా తరఫున అత్యద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. టెర్రిఫిక్ పర్ఫార్మర్. కానీ.. కొన్నిసార్లు సమతూకమైన జట్టును ఎంపిక చేసే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. నిజానికి ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. 15 మందితో కూడిన జట్టు అయితే, ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరిని తప్పించాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తూ చహల్ డ్రాప్! లక్కీగా 17 మందికి చోటు ఉంది కాబట్టి.. సరిపోయింది. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడిని వదులుకోవాల్సి వచ్చింది. నిజానికి ప్రస్తుతం.. తన కంటే కుల్దీప్ ఓ అడుగు ముందే ఉన్నాడు. వైవిధ్యమైన బౌలింగ్తో మాకు మెరుగైన ఆప్షన్ అనిపించాడు. అందుకే చహల్ మిస్ అయ్యాడు’’ అని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆసియా కప్-2023 వన్డే టోర్నీ నేపథ్యంలో.. బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో రిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు చోటు దక్కలేదు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై మాత్రం మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అందుకే చహల్పై వేటు! జట్టు ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చహల్ గురించి ప్రశ్న ఎదురుకాగా అజిత్ అగార్కర్ పైవిధంగా స్పందించాడు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్లే చహల్ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో కుల్దీప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా ఆసియాకప్ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఆడనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. అంతకంటే ముందు అంటే.. సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. మరి వరల్డ్కప్లో..? ఈ క్రమంలో ప్రపంచకప్నకు ఆసియా కప్ జట్టును ప్రొవిజినల్ టీమ్గా పరిగణిస్తున్న తరుణంలో చహల్పై వేటు పడటం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అజిత్ అగార్కర్ కుల్దీప్నకు మద్దతుగా నిలవగా.. రోహిత్ శర్మ మాత్రం చోటు లేదు కాబట్టే అతడిని జట్టులోకి తీసుకోలేదన్నాడు. వరల్డ్కప్లో చహల్కు దారులు మూసుకుపోలేదని స్పష్టం చేయడం గమనార్హం. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో యుజీ చహల్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ గత రెండు సీజన్లుగా రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొడుతున్నాడు. చదవండి: Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! -
Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్..
Asia Cup Squad- Chahal Dropped- Rohit Sharma Reveals BIG reason: ఆసియా కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో కూడిన జట్టు శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలిపింది. ఈ మెగా ఈవెంట్తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తుండగా.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. వరల్డ్కప్ ప్రొవిజినల్ టీమ్! ఇక ఆసియా వన్డే కప్ నేపథ్యంలో ప్రకటించిన జట్టునే వన్డే వరల్డ్కప్ టోర్నీకి ప్రొవిజినల్ టీమ్గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ల గురించి క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. ఆసియా కప్ జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కగా.. అశ్విన్, చహల్, సుందర్లకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి ప్రపంచకప్ అవకాశాలు కూడా గల్లంతయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ముగ్గురికి గుడ్న్యూస్! అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ముగ్గురికి ఓ శుభవార్త చెప్పాడు. జట్టు ప్రకటన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... ‘‘17 మందికి మాత్రమే జట్టులో చోటు ఉంది. అందుకే చహల్ను తీసుకోలేకపోయాం. రవి అశ్విన్, చహల్, సుందర్లతో పాటు వరల్డ్కప్ ఆడే క్రమంలో ఎవరికీ దారులు మూసుకుపోలేదు’’ అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. చైనామన్ స్పిన్నర్కు ప్రాధాన్యం కాగా ఇటీవలి కాలంలో ఆల్రౌండర్లుగా జడ్డూ, అక్షర్ దూసుకుపోతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. విండీస్తో మూడు వన్డేల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్ జట్టులో అతడికి చోటు దక్కడం గమనార్హం. అయితే, చహల్ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ‘కుల్చా’ ద్వయాన్ని చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇప్పటి వరకు ఆరు వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. అయితే, చహల్ అనుభవజ్ఞుడైనప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల అక్షర్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మకు ఛాన్స్.. పాపం సంజూ! -
Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్తో టీ20లలో అడుగుపెట్టాడు. హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఊరిస్తున్న భారీ రికార్డు టీమిండియాతో పాటు ఐపీఎల్లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్లో 14 మ్యాచ్లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్ను భారీ రికార్డు ఊరిస్తోంది. సెంచరీ వికెట్ల క్లబ్లో చేరేందుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్గా నిలుస్తాడు. పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా? కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్తో మూడు మ్యాచ్లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్లో ఓడింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140 టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134 రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130 ఇష్ సోధి- న్యూజిలాండ్-118 లసిత్ మలింగ- శ్రీలంక- 107 షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104 ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు -
చాహల్ను కొట్టిన రోహిత్ శర్మ.. పక్కనే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే?
వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా డగౌట్ ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్లో కూర్చున్న యుజ్వేంద్ర చాహల్ను సరదగా కొట్టాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, జయదేవ్ ఉనద్కత్ కూడా చాహల్ పక్కనే కూర్చున్నారు. ఇది చూసిన కోహ్లి నవ్వును ఆపుకోలేకపోయాడు. కాగా చాహల్, రోహిత్ మంచి స్నేహితులుగా చాలా కాలం నుంచి ఉన్నారు. చాహల్ తన ఐపీఎల్ అరంగేట్రం కూడా ముంబై ఇండియన్స్ తరపునే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దూరమయ్యాడు. కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు వీరిద్దరికి విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా చాహల్కు తొలి రెండు వన్డేల్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. రెండో వన్డేలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్కు అవకాశం లభించింది. కానీ వారిద్దరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ట్రినాడాడ్ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: #Nicholas Pooran: పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్! 10 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగినా.. లాభం లేదు! IND vs WI: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! Rohit yaar😭😭 pic.twitter.com/t6rlt6KeLe — nidhi (@dumbnids) July 30, 2023 -
టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
Team India Cricketers: భారత్లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?! సముచిత గౌరవం సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు. అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్. కపిల్ దేవ్ టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది. ప్రభుత్వ ఉద్యోగంలో.. హర్భజన్ సింగ్ భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్గా నియమించింది. జోగీందర్ శర్మ టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా అవకాశం వచ్చింది. ఉమేశ్ యాదవ్ మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా అవకాశం కల్పించింది. యజువేంద్ర చహల్ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇలా భారత క్రికెట్కు తన వంతు సేవ చేస్తున్న చహల్కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. టాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! -
అప్పుడు పీయూశ్ చావ్లా ఆకట్టుకున్నాడు! ఈసారి టీమిండియా: గంగూలీ
ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభానికి దాదాపు మూడు నెలలకు పైగానే సమయం ఉంది. భారత్ వేదికగా పుష్కర కాలం తర్వాత మరోసారి ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న ప్రపంచకప్ సమరానికి తెరలేవనున్నట్లు గత మంగళవారం ప్రకటించింది. ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నేరుగా పోటీకి అర్హత సాధించాయి. మరోవైపు.. మాజీ చాంపియన్ వెస్టిండీస్ క్వాలిఫయర్స్లోనే నిష్క్రమించగా.. శ్రీలంక, జింబాబ్వే టాప్-10లో అడుగుపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఆ ముగ్గురు ఉంటారు.. అయితే ఈ నేపథ్యంలో వరల్డ్కప్ ఈవెంట్కు సంబంధించి జట్ల కూర్పులపై మాజీ క్రికెటర్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ రిస్ట్ స్పిన్నర్ను ఆడించాల్సిన ఆవశ్యకత గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ కోసం ఈసారి టీమిండియా ప్రత్యేకంగా మణికట్టు స్పిన్నర్ను ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. నాకు తెలిసి జడేజా, రవిచంద్రన్ అశ్విన్(ఫింగర్ స్పిన్నర్లు), అక్షర్ పటేల్కు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా అక్షర్.. ఎందుకంటే తను పర్ఫెక్ట్ ఆల్రౌండర్. చహల్పై కూడా కన్నేసి ఉంచాలి అయితే.. రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్లపై కూడా దృష్టి సారించాలి. నిజానికి యజువేంద్ర చహల్ టీ20, వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ చాలా వరకు ప్రధాన టోర్నీల్లో అతడికి అవకాశం రావడం లేదు. కాబట్టి బిష్ణోయి, కుల్దీప్లతో పాటు చహల్పై కూడా ఓ కన్నేసి ఉంచాలి’’ అని గంగూలీ పేర్కొన్నాడు. అప్పుడు పీయూశ్ చావ్లా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై రిస్ట్ స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపగలరని అభిప్రాయపడ్డాడు. 2011 వరల్డ్కప్లో తనకున్న పరిమితిలో పీయూశ్ చావ్లా(మూడు మ్యాచ్లలో నాలుగు వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేశాడంటూ గుర్తు చేశాడు. అదే విధంగా 2007లో సౌతాఫ్రికాలో ఫాస్ట్బౌలర్లతో పాటు మణికట్టు మాంత్రికులు కూడా రాణించారని దాదా చెప్పుకొచ్చాడు. ఈసారి ప్రపంచకప్ భారత్లో జరుగుతుంది కాబట్టి రిస్ట్ స్పిన్నర్లకు మరింత అనుకూలంగా ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! -
వెస్టిండీస్ టూర్కు ముందు చాహల్ కీలక నిర్ణయం.. మరో లీగ్లో ఆడేందుకు!
ఐపీఎల్-2023 తర్వాత క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెస్టిండీస్ సిరీస్తో తిరిగి మైదానంలో అడుగుపెట్టన్నాడు. విండీస్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ చోటు దక్కింది. అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందు చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. చాహల్ గ్లోబల్ చెస్ లీగ్లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. ఈ లీగ్లో ఆల్పైన్ వారియర్స్ జట్టుతో చాహల్ జట్టుకట్టాడు. కాగా క్రికెట్, చెస్ రెండింటిలోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు చాహల్ అన్న సంగతి తెలిసిందే. చాహల్ ఓ వైపు క్రికెట్లో బీజీబీజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమాయాల్లో మాత్రం చెస్మాస్టర్గా మారుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన మాస్టర్మైండ్ను చూపించేందుకు చాహల్ సిద్దమయ్యాడు. కాగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రపంచ చెస్ ఫ్రాంచైజీ లీగ్లో అత పెద్దది. ఇక ఈ విషయాన్ని చాహల్ కూడా దృవీకరించాడు. స్టీల్ ఆర్మీ(ఆల్పైన్ వారియర్స్) జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్పైన్ వారియర్స్ ఛాంపియన్స్ నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్టీల్ ఆర్మీ అంటూ ట్విటర్లో చాహల్ పేర్కొన్నాడు. విండీస్తో వన్డేలకు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: -
రాజస్తాన్ కెప్టెన్ చాహల్.. మరి శాంసన్ ఎవరు భయ్యా? వీడియో వైరల్
ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్తాన్ రాయల్స్ సజీవంగా నిలుపుకుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్తాన్.. ముంబైను వెనుక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకుంది. రాజస్తాన్ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్పై ఆధారపడి ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రాజస్తాన్, పంజాబ్ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ భారీ తప్పిదం చేసింది. టాస్ సమయంలో సంజూ శాంసన్ మాట్లాడుతున్నప్పుడు.. రాజస్తాన్ కెప్టెన్గా శాంసన్ పేరుగా బదులుగా యుజ్వేంద్ర చాహల్ పేరును కెప్టెన్గా ప్రదర్శించారు. 'యుజ్వేంద్ర చాహల్, రాజస్తాన్ కెప్టెన్' అని బోర్డులో కనిపించింది. కాగా టాస్ ముగిసిన కొద్దిసేపటికే ఈ తప్పిదంపై రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంజైజీ ఫన్నీగా స్పందించింది. చాహల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "రాజస్తాన్ కొత్త కెప్టెన్ యుజ్వేంద్ర చాహల్ అంటూ" క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్టార్స్పోర్ట్స్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. రాజస్తాన్ కెప్టెన్ చాహల్ అయితే, మరి శాంసన్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో సంజూ, చాహల్ ఇద్దరూ నిరాశపరిచారు. శాంసన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. చాహల్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా 40 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్ 🚨 Toss Update 🚨@rajasthanroyals win the toss and elect to field first against @PunjabKingsIPL. Follow the match ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/7j2KjpH0yr — IndianPremierLeague (@IPL) May 19, 2023 -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్లో మిగిలిన మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్తో మ్యాచ్లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్రైజర్స్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్పై కూడా చెలరేగితే రాజస్తాన్కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్మెయిర్ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
తనకు అన్నీ తెలుసు.. ఎక్కడ బాల్ వేస్తానో కూడా అంచనా వేయగలదు!
IPL 2023- Yuzvendra Chahal- Dhanashree Verma: ‘‘తను నాతో ఉంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మరింత కాన్ఫిడెంట్గా ఉంటాను. తనే నా బలం. తన ఉనికి నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. నేను మ్యాచ్ ఆడే సమయంలో తను స్టాండ్స్లో ఉండటం నాకిష్టం. తను నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తూనే నా ఆట తీరును నిశితంగా పరిశీలిస్తుంది. నేనెలా బౌలింగ్ చేస్తున్నానో గమనిస్తుంది. కొన్నిసార్లు నేను బాల్ ఎక్కడ వేస్తానో కూడా ముందే అంచనా వేస్తుంది. గత కొన్ని వారాల క్రితం నాకు ఈ విషయం తెలిసింది. తను నా పక్కన ఉంటే చాలు. అంతకంటే ఇంకేమీ అవసరం లేదు’’ అంటూ టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య ధన శ్రీ వర్మ ఎల్లవేళలా తనకు మద్దతుగా ఉంటుందంటూ ఆమెపై ఇలా ప్రేమను చాటుకున్నాడు. కాగా యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని చహల్ ప్రేమించి పెళ్లాడాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడిపోతోందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్ నుంచి చహల్ ఇంటిపేరు తొలగించడం, శ్రేయస్ అయ్యర్తో దిగిన ఫొటోలు వైరల్ కావడం ఇందుకు కారణం. అయితే, వాటన్నిటికీ చెక్ పెడుతూ తాము కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని ప్రకటించి చహల్- ధనశ్రీ దంపతులు అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. ఇక చహల్ ఎప్పుడు మ్యాచ్ ఆడినా ధనశ్రీ అతడి వెంటే ఉంటుంది. భర్తను చీర్ చేస్తూ అతడి ఘనతలు చూసి పొంగిపోతుంది. ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కూడా ధనశ్రీ ఉప్పల్ స్టేడియానికి విచ్చేసింది. అతడి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఈ క్రమంలో భార్య సపోర్టు గురించి చహల్ మాట్లాడిన వీడియోను రాజస్తాన్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారని పేర్కొంది. Goals! 💗💗💗 pic.twitter.com/EKT7nDBHsd — Rajasthan Royals (@rajasthanroyals) April 4, 2023 💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW — Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023 -
SRH Vs RR: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఒక్క మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన లేదు. గెలిపించే భాగస్వామ్యమే రాలేదు. టాప్–5లో ఒక్కరూ కనీసం ఒక్క సిక్స్ అయినా కొట్టలేదు. ఇలాంటి ఆటతో ఐపీఎల్ మ్యాచ్ గెలవాలని ఏ జట్టయినా కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఆదివారం ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆట ఇలాగే ఉంది. ముందుగా నియంత్రణ లేని బౌలింగ్తో రెండొందలకు పైగా పరుగులు ఇచ్చిన జట్టు ఆ తర్వాత బ్యాటింగ్లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇక కోలుకునే అవకాశమే లేకపోయింది. ఫలితమే సొంతగడ్డపై భారీ ఓటమి. అన్ని రంగాల్లో రాణించిన రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయంతో తమ సీజన్ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఐపీఎల్ సీజన్(2023)ను సన్రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి పోరులో పేలవ ప్రదర్శనతో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో సన్రైజర్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జట్టులో టాప్–3 ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసి ఓడిపోయింది. అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ చహల్ (4/17) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ల జోరు... పవర్ప్లేలో ఇద్దరు రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి, బట్లర్ విధ్వంసం సృష్టించారు. సన్రైజర్స్ తాత్కాలిక కెప్టెన్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులే వచ్చినా... ఆ తర్వాతి ఐదు ఓవర్లలో రాయల్స్ వరుసగా 14, 17, 19, 17, 12 పరుగులు రాబట్టింది. భువీ ఓవర్లో యశస్వి రెండు ఫోర్లు, బట్లర్ సిక్స్ కొట్టగా... వాషింగ్టన్ సుందర్ ఓవర్లో వరుస బంతుల్లో బట్లర్ రెండు సిక్స్లు బాదాడు. ఆపై నటరాజన్ ఓవర్లో బట్లర్ 4 ఫోర్లుతో చెలరేగాడు. ఫజల్ ఓవర్లో కూడా 3 ఫోర్లు కొట్టి 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 85 పరుగుల (35 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 7.4 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 100 పరుగులకు చేరింది. ఈ దశలో రాయల్స్ ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ సామ్సన్ తీసుకున్నాడు. సామ్సన్ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించగా, మరోవైపు 34 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తయింది. ఉమ్రాన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్, అతని తర్వాతి మరో ఫోర్, సిక్స్ బాదాడు. తక్కువ వ్యవధిలో రాజస్తాన్ జట్టు యశస్వి, దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) వికెట్లను కోల్పోగా, 28 బంతుల్లో సామ్సన్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. చేతులు కాలాక హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో 7–15 మధ్య తొమ్మిది ఓవర్లలో రాజస్తాన్ 75 పరుగులు చేసింది. ఆపై డెత్ ఓవర్లలో కూడా స్కోరును పెంచుకోవడంలో రాయల్స్ విఫలమైంది. మరోసారి హైదరాబాద్ బౌలర్లు చక్కటి బంతులతో ప్రత్యర్థిని నిరోధించగలిగారు. ఆఖరి ఐదు ఓవర్లలో సామ్సన్ వికెట్ కోల్పోయి రాజస్తాన్ 43 పరుగులే సాధించగలిగింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం కారణంగానే ఆ జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్కు ఆరంభంలోనే దెబ్బ పడింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0) వెనుదిరిగారు. పేలవ ప్రదర్శన కారణంగా పవర్ప్లేను హైదరాబాద్ 30 పరుగులతోనే ముగించింది. ఘనమైన రికార్డులు, ఎన్నో అంచనాలతో తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ (21 బంతుల్లో 13; 1 ఫోర్) ప్రభావం చూపలేకపోయాడు. 13.25 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అతడు.. తొలి మ్యాచ్లో కనీసం ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. యజువేంద్ర చహల్ బౌలింగ్లో బ్రూక్ బౌల్డయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (8) కూడా విఫలం కావడంతో 48 పరుగుల వద్ద హైదరాబాద్ సగం టీమ్ డగౌట్ చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు) అవుట్ కావడంతో సన్రైజర్స్ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో సమద్ కొన్ని మెరుపులు మెరిపించినా అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో సమద్ 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టగా, ఉమ్రాన్ (19 నాటౌట్) 2 సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు. సన్రైజర్స్ తన తదుపరి మ్యాచ్ను శుక్రవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడుతుంది. IPL 2023 SRH Vs RR Scorecard: స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) మయాంక్ (బి) ఫజల్ 54; బట్లర్ (బి) ఫజల్ 54; సామ్సన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55; పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2; పరాగ్ (సి) ఫజల్ (బి) నటరాజన్ 7; హెట్మైర్ (నాటౌట్) 22; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–85, 2–139, 3–151, 4–170, 5–187. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–36–0, ఫజల్ హఖ్ 4–0–41–2, సుందర్ 3–0–32–0, నటరాజన్ 3–0–23–2, ఆదిల్ రషీద్ 4–0–33–0, ఉమ్రాన్ 3–0–32–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (బి) బౌల్ట్ 0; మయాంక్ (సి) బట్లర్ (బి) చహల్ 27; త్రిపాఠి (సి) హోల్డర్ (బి) బౌల్ట్ 0; హ్యారీ బ్రూక్ (సి) చహల్ 13; సుందర్ (సి) హెట్మైర్ (బి) హోల్డర్ 1; ఫిలిప్స్ (సి) ఆసిఫ్ (బి) అశ్విన్ 8; సమద్ (నాటౌట్) 32; రషీద్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 18; భువనేశ్వర్ (బి) చహల్ 6; ఉమ్రాన్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–0, 2–0, 3–34, 4–39, 5–48, 6–52, 7–81, 8–95. బౌలింగ్: బౌల్ట్ 4–1–21–2, ఆసిఫ్ 3–0–15–0, హోల్డర్ 3–0–16–1, అశ్విన్ 4–0–27–1, చహల్ 4–0–17–4, నవదీప్ సైనీ 2–0–34–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Easy as you like 😉@yuzi_chahal wins the battle of the spinners 👌👌 Follow the match ▶️ https://t.co/khh5OBILWy#TATAIPL | #SRHvRR pic.twitter.com/7yIPE3juHm — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
నెట్టింట చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోలు వైరల్.. ఈసారి కూడా!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిగత అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుందామె. ఇన్స్టాగ్రామ్లో ధనశ్రీకి యాభై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె పోస్టులకు లక్షల్లో లైకులు రావడం సహా అదే స్థాయిలో కొన్నిసార్లు ట్రోలింగ్ బారిన పడుతుందామె. గతంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్- దేవిషా శెట్టి దంపతులతో పాటు.. మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్తో ఆమె దిగిన ఫొటో పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పటికే తన ఇన్స్టా అకౌంట్లో ధనశ్రీ భర్త ఇంటి పేరును తొలగించడం.. ఆపై ఇలా వేరే క్రికెటర్తో కలిసి కనిపించడంతో విడాకుల వార్తలు తెరమీదుకు వచ్చాయి. చహల్- ధనశ్రీ స్వయంగా తాము కలిసే ఉంటున్నామని చెప్పిన తర్వాతే రూమర్లకు అడ్డుకట్ట పడింది. తాజాగా.. టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ సంగీత్లో పాల్గొన్న ధనశ్రీ షేర్ చేసిన ఫొటోలు మరోసారి నెట్టింట చర్చకు దారితీశాయి. పెళ్లికొడుకు శార్దూల్తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా సజ్దే దంపతులు, ధనశ్రీ, శ్రేయస్ అయ్యర్ ఫొటో దిగారు. వీటిని ఇన్స్టాలో పంచుకున్న ధనశ్రీ 5 ఎక్స్ పవర్ అంటూ ఫైర్ ఎమోజీని జత చేసింది. దీంతో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘చహల్ భాయ్ ఎక్కడ? మీరు ప్రతిసారి భాయ్ను కావాలనే అవాయిడ్ చేస్తారా? రూమర్లు రావాలని కోరుకుంటారా? అప్పుడు ఆ ఫొటోలతో.. ఇప్పుడు ఈ ఫొటోలతో ఎందుకిలా వదినమ్మా? చహల్ భయ్యా కూడా ఉంటే బాగుండేది’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అప్పుడలా.. ఇప్పుడలా? ఏదో మతలబు ఉంది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలా ధనశ్రీ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. స్వదేశంంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో చహల్కు చోటు దక్కలేదు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు! View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
Ind Vs NZ: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!
India vs New Zealand, 3rd T20I- Predicted Playing XI: టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని హార్దిక్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా భారత గడ్డపై సిరీస్ గెలవలేకపోయిన కివీస్ ఈ మ్యాచ్లో గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య బుధవారం జరుగనున్న మూడో టీ20 మరింత రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ వద్దు యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్లో మరింత రాటుదేలాల్సి ఉందన్న వసీం.. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యజువేంద్ర చహల్నే మూడో టీ20లోనూ కొనసాగించాలని సూచించాడు. అదే విధంగా తొలి రెండు మ్యాచ్లలో విఫలమైన ఓపెనర్ శుబ్మన్ గిల్ను తప్పించాలని.. అతడి స్థానంలో పృథ్వీ షాను ఆడించాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘న్యూజిలాండ్ బ్యాటర్లు.. స్పిన్ బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు. టీమిండియాకు చహల్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ అందుబాటులో ఉన్నపుడు తప్పక అతడి సేవలు వినియోగించుకోవాలి. గతంలో నేను.. చెప్పినట్లుగానే ఉమ్రాన్ మాలిక్ ఇంకా పొట్టి ఫార్మాట్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోతున్నాడు. పేస్లో వైవిధ్యం చూపిస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలడు. కాబట్టి మూడో టీ20లోనూ చహల్ను కొనసాగించాలి. అతడే బెటర్ ఆప్షన్’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. పృథ్వీ షాను తీసుకురండి అదే విధంగా.. ‘‘టీమిండియా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. శుబ్మన్ గిల్ స్థానంలో పృథ్వీ షాను తీసుకురావాలి. టీ20 క్రికెట్లోనూ అతడు అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇక ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠిల విషయంలో మాత్రం నాకెలాంటి ఆందోళనా లేదు’’ అని జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్తో వన్డేలో సిరీస్లో డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగిన గిల్.. టీ20లలో మాత్రం జోరు చూపించలేకపోతున్నాడు. మొదటి రెండు మ్యాచ్లలో కేవలం 7, 11 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న పృథ్వీ షా చాలా కాలం తర్వాత టీమిండియాకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టీ20 తుది జట్ల అంచనా భారత్: శుబ్మన్ గిల్/పృథ్వీ షా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్ న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోది, జాకోబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లేయిర్ టిక్నర్. చదవండి: Nitish Rana: నెగెటివ్ ట్వీట్ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు KL Rahul: పెళ్లి వేడుక ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది -
WC 2023: చహల్ కంటే అతడు బెటర్.. కుల్దీప్ కూడా..: టీమిండియా మాజీ సెలక్టర్
ICC ODI World Cup 2023- Kul-Cha Spin Duo: ‘‘సుదీర్ఘ కెరీర్లో ప్రతి బౌలర్ కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం సహజం. ప్రస్తుతం చహల్ అదే స్థితిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ను రిక్వెస్ట్ చేసి తను దేశవాళీ క్రికెట్ ఆడితే బాగుంటుంది. పూర్తిస్థాయిలో తిరిగి ఫామ్లోకి రావాలంటే తను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలి. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా చహల్ ఈ మేరకు సన్నద్ధం కావాల్సి ఉంది’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సునిల్ జోషి అన్నాడు. ఇక వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో తానైతే ‘కుల్-చా’ స్పిన్ ద్వయంలో కుల్దీప్ యాదవ్కే ఓటు వేస్తానని పేర్కొన్నాడు. చహల్ ఇప్పటి వరకు ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు లెగ్బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్. న్యూజిలాండ్తో మ్యాచ్లో 2/43, శ్రీలంకతో వన్డేలో 1/58 గణాంకాలు నమోదు చేశాడు. ఇక టీ20ల విషయానికొస్తే.. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు చహల్ ఖాతాలో ఉన్నాయి. జడ్డూ ఉంటాడు.. బ్యాకప్గా అతడే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో ముచ్చటించిన సునిల్ జోషి.. తన ప్రపంచకప్ జట్టులో చహల్కు చోటు ఇవ్వలేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘15 మంది సభ్యులతో కూడిన జట్టు గురించి మాట్లాడినట్లయితే.. నా టీమ్లో జడేజా ఉంటాడు. ఒకవేళ తను ఫిట్గా లేనట్లయితే బ్యాకప్గా అక్షర్ పటేల్ ఉండాలి. ఆ తర్వాత వాషీ(వాషింగ్టన్ సుందర్). ఒకవేళ మరో లెగ్బ్రేక్ స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయి జట్టులో ఉండాలి. ఎందుకంటే రవి నిలకడైన ప్రదర్శన కనబరచగలడు. వరుస విరామాల్లో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. అంతేకాదు.. రవి బిష్ణోయి.. చహల్ కంటే మెరుగ్గా ఫీల్డింగ్ చేయగలడు’’ అని సునిల్ జోషి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భిన్న పరిస్థితుల నడుమ ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి చెబుతూ.. ‘‘కుల్దీప్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే, మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. భారత్లో ప్రపంచకప్ జరుగబోతోంది. ఇక్కడ విభిన్న తరహా మైదానాలు ఉన్నాయి. పిచ్, వాతావరణ పరిస్థితులు ఎక్కడిక్కడ భిన్నంగా ఉంటాయి. కాబట్టి వరల్డ్కప్లో ఒక్కో జట్టును ఒక్కో మైదానంలో ఎదుర్కొనేందుకు ఏ మేర సంసిద్ధమవుతాడనే అంశం మీదే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది’’ అని సునిల్ జోషి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో కూడా కుల్దీప్ పాత్ర కీలకం కానుందని సునిల్ అంచనా వేశాడు. అదరగొడుతున్న కుల్దీప్ ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో రెండు వన్డేల్లో ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్.. న్యూజిలాండ్తో సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. కివీస్తో టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లలో రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ తర్వాత ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: న్యూజిలాండ్లా కాదు.. పాక్ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్ మాజీ బౌలర్ Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది -
Ind Vs NZ: ఎట్టకేలకు వాళ్లిద్దరికి ఛాన్స్.. సిరాజ్, షమీ అవుట్
India vs New Zealand, 3rd ODI: న్యూజిలాండ్తో ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్కు రెస్ట్ ఇచ్చిన మేనేజ్మెంట్.. ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చహల్కు తుది జట్టులో చోటిచ్చింది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కాగా గత రెండు మ్యాచ్లలో ఉమ్రాన్ మాలిక్, చహల్కు బెంచ్కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పర్యాటక కివీస్ మంగళవారం నాటి ఇండోర్ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ పాతబడే కొద్ది బ్యాటింగ్కు మరింత అనుకూలిస్తుంది. చిన్న గ్రౌండ్ కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం. ఇక్కడ మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నాడు. జాకోబ్ డఫీ స్థానంలో హెన్రీ షిప్లేను ఆడిస్తున్నామని.. తమ జట్టులో ఇదొక్కటే మార్పు అని తెలిపాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే తుది జట్లు టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ బ్రాస్వెల్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, జాకోబ్ డఫీ, బ్లేయర్ టిక్నర్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు తీర్పు ఇదే Rohit Sharma: రోహిత్ కెరీర్ను మలుపు తిప్పిన ధోని నిర్ణయం.. దశాబ్ద కాలంగా.. సూపర్ ‘హిట్టు’! -
టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్!
గతేడాది ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లిన తారక్ ఇండియాకు తిరిగి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా విదేశాలకు వెళ్లిన యంగ్ టైగర్ న్యూ ఇయర్ను అక్కడే సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సందర్భంగా మూవీ టీం, రామ్ చరణ్తో పాటు తన భార్య ప్రణతితో కలిసి అమెరికాలో సందడి చేశాడు. ఇక ఈ సందడి అనంతరం ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. చదవండి: చిరంజీవి మెసేజ్లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. అయితే తాజాగా తారక్ను టీమిండియా కలిసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం భారత జట్టు హైదరాబాద్లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్తో పాటు పలువురు ఉన్నారు. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది మాత్రం క్లారిటీ లేదు. వారి బ్యాక్గ్రౌండ్లో ఫుల్ లైటింగ్ సెట్, కార్లు ఉన్నాయి. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? చూస్తుంటే ఇది ఓ లగ్జరీ కారు షోరూంలా కనిపిస్తోంది!. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్ను ఘనంగా ముగించిన టీమిండియా సోమవారం (జనవరి 16న) హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18న (బుధవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంది.