galla jayadev
-
పెమ్మసాని మంత్రి పదవి? గల్లా అభినందనలు
సాక్షి, ఢిల్లీ: పెమ్మసానికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారు కావడంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అభినందనలు తెలిపారు. రాజకీయ మొదటి అడుగులోనే కేంద్ర మంత్రి పదవి పొందడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర మంత్రి పదవితో సానుకూల మార్పులు తీసుకురావాలన్నారు.కాగా, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడికి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. Congratulations to Dr. @PemmasaniOnX on being confirmed as a Minister of State. Such an honour to serve the nation at the central level during your very first political stint. The people of Guntur and entire AP are proud of you. All the best for your new role. May you bring… pic.twitter.com/NAvPMViMLc— Jay Galla (@JayGalla) June 9, 2024 Congratulations to my young friend @RamMNK on being confirmed as a cabinet minister in the new #NDA Government! Your sincerity and humble nature will surely be an asset to the development of the country. Wishing you all the best in your new role! pic.twitter.com/VkgGu8kdHB— Jay Galla (@JayGalla) June 9, 2024 -
గల్లా జయదేవ్ రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ!
సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి. తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు. ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ! ► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు. ► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు. ► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. అదనపు పెట్టుబడులు కనిపించవా? ► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది? రిలయన్స్కు వివాదాస్పద భూములు ► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్టాప్ బ్యాక్స్ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. ► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్ ఛాలెంజింగ్గా తీసుకువస్తున్న జీయో నెట్ వర్క్ కోసం ఈ యూనిట్ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్ సెట్టాప్స్ బాక్స్ల తయారీని థర్డ్ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఫ్రాంక్లిన్ పరిస్థితి తెలియదా? ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా భారీ డెట్ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్ ఫండ్స్ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది. ► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ? ► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? ► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? ► లాజిస్టిక్ ఈజ్ ఎక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)రిపోర్ట్ 2022లో ఆంధ్రప్రదేశ్ అచీవర్గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్10 రీజియన్స్లో చిత్తూరు–నెల్లూరు రీజియన్ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. ► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది. ► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి. ‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం. గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’ – కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి -
తెలంగాణలో పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం?
ఆంధ్రప్రదేశ్లో క్షుద్ర రాజకీయం రోజురోజుకు శృతి మించుతోంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న వ్యవహారంగా కనిపిస్తోంది. గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ తన కంపెనీ అయిన అమరరాజా బాటర్ యూనిట్ ఒక దానిని తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే పదేళ్లలో తొమ్మిదివేల కోట్లు పెట్టుబడులు పెడతామని ఆయన అంటున్నారు. తొలి దశలో రెండువేల కోట్లు వ్యయం చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని ప్రకటించారు. అంతవరకు సంతోషమే. ఎక్కడ ఎవరు కొత్త కంపెనీ పెట్టినా స్వాగతించాల్సిందే. కాకపోతే ఆయన తెలంగాణలో యూనిట్ పెట్టడానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమి సంబంధం?ఆయన పెట్టుబడి , ఆయన ఇష్టం. ఏ పెట్టుబడిదారుడు అయినా అనేక అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కాని గల్లా జయదేవ్ ను ఏపీ ప్రభుత్వం వేధించిందని, అందుకే ఆయన అక్కడ పెట్టుబడి పెట్టారని ఈనాడు, జ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి. జయదేవ్ ఆ మాట చెప్పలేదు. కాని ఈ మీడియా మాత్రం ప్రపంచం తలకిందులైనంతగా గగ్గోలుపెట్టాయి. జయదేవ్ ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయి తాను ఈ పెట్టుబడి పెట్టదలిచానని అడిగి, అప్పుడు ప్రభుత్వం నుంచి సహాకరం అందకపోతే తాను వేరే రాష్ట్రానికి వెళుతున్నారని చెప్పవచ్చు. అలాంటిదేమీ జరగలేదు. అయినా ఆయన ఏపీలో పెట్టుబడి పెట్టలేదు కనుక, వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి టీడీపీ మీడియా దీనిని ఒక అవకాశంగా వాడుకునే యత్నం చేసింది. ఇదంతా చూస్తే ఒక అనుమానం వస్తోంది. గల్లా జయదేవ్ తో టీడీపీ వారు, లేదా వారికి మద్దతు ఇచ్చే మీడియా వారు ఈ విధంగా ప్లాన్ చేసి, తెలంగాణలో పెట్టుబడులు అని అనౌన్స్ చేయించి ,ఏపీ ప్రభుత్వంపై విషం కక్కాలని అనుకున్నారా అన్న సందేహం కలుగుతుంది.ఈ దిక్కుమాలిన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక పత్రిక కావాలని 1.73 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని పచ్చి అబద్దపు వార్త ప్రచురించడం, తదుపరి గల్లా వార్తను ఇవ్వడం ఇవన్ని చూస్తుంటే వచ్చే ఏడాదిన్నరలో ఇంకెన్నో డ్రామాలు చూడాల్సిరావచ్చనిపిస్తుంది. నిజానికి గల్లా జయదేవ్ ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదో ఆయనను అడగాలి. గుంటూరు నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ పక్షాన గెలిచారు. ఆయన తల్లి మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తాత రాజగోపాలనాయుడు ఎంపీగా, ఎమ్మెల్యేగా పదవులు చేశారు. ఏపీ ప్రజలు ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలు వారికి ఇన్ని అవకాశాలు ఇస్తే , ఆ కృతజ్ఞతతో ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా అక్కడికి ఎలా వెళతావు అని అడగవలసిన మీడియా, ఆయన అక్కడకు వెళ్లగానే రెచ్చిపోయి ప్రభుత్వంపై చెడరాసేశాయి. అదేమంటే ఆయన పరిశ్రమలలో కాలుష్యం పేరుతో వేధించారని ఈ పత్రికలుచెబుతున్నాయి. అంటే ఏదైనా పరిశ్రమలో కాలుష్యం వస్తుంటే దానిని అరికట్టడం ప్రభుత్వ బాద్యత కాదా? నిజంగానే కాలుష్యం లేకపోతే ,సంస్థ యాజమాన్యం ఆ విషయం ప్రభుత్వానికి వివరించవచ్చు. అయినా ప్రభుత్వం వినకపోతే అప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వవచ్చు. విశాఖలో ఎల్.జి పాలిమర్స్ సంస్థలో విష వాయువులువెలువడి 13 మంది మరణించినప్పుడు ఇదే మీడియా ఏమని రాసింది. ఆ సంస్థ యాజమాన్యాన్ని జగన్ కాపాడుతున్నారని, అరెస్టు చేయడం లేదని ఆరోపించింది.కాని జగన్ ప్రభుత్వం వారిని కూడా అరెస్టు చేయించింది. అంటే మనవాడు అయితే ఒకలా, వేరే వాడు అయితే ఇంకోలా చూడాలని టీడీపీ మీడియా చెబుతోందన్నమాట.అసలు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా, సార్ట్ అవుట్ చేసుకుని ఇక్కడ పెట్టాలి కాని, వేరే రాష్ట్రానికి ఇలాంటి రాజకీయ నేతలు వెళితే ఏమిటి దాని అర్ధం. సరే.. ఇప్పుడు ఏపీలో పరిశ్రమ పెట్టలేదు. మరి తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో గల్లా ఇదే పరిశ్రమను ,లేదా మరో పరిశ్రమను ఎందుకు పెట్టలేదు ?ఆయనే కాదు.. టీడీపీ పారిశ్రామిక వేత్త ఎవరూ కూడా ఆ పని చేయలేదు. చంద్రబాబును చూసి ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు పెట్టి ఉండాలి కదా? అమరావతి రియల్ ఎస్టేట్ పై చూపిన శ్రద్ద ఈ విషయంలో ఎందుకు చూపలేదు. ఇక మరో సంగతి చూద్దాం. నిజంగానే జగన్ ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకంగా ఉందా? అలా అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పలు పరిశ్రమల సంగతేమిటి? బద్వేలులో సెంచరీ ప్లైవుడ్ కంపెనీని పెట్టిన యజమాని ఏమన్నారు..తమిళనాడులో పెట్టాలనుకున్న 2900 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ఏపీలోనే వ్యయపరుస్తానని అన్నారు. దానికి కారణం ముఖ్యమంత్రి జగన్ చూపిన చొరవే అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరిలో ఒక కర్మాగారం స్థాపిస్తున్న టెక్ మహింద్ర ఎమ్.డి గుర్నానీ దావోస్ లో జగన్ ను కలిసిన అరక్షణంలో తనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు కదా! ఆదిత్య బిర్లా తొలిసారిగా ఏపీలో పరిశ్రమ స్థాపించింది జగన్ ప్రభుత్వ హయాంలోనే. విశాఖలో ఇన్ పోసిస్ కాంపస్ ఎలా వచ్చింది. మరో ఐటి పరిశ్రమ 3 వేల మందికి ఉపాధి కల్పించేలా ఎలా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీసిటీ, అనకాపల్లి తదితర చోట్ల వచ్చిన పరిశ్రమల సంగతేమిటి? గ్రీన్ ఎనర్జీ మాటేమిటి? జగన్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలుఏమీ రాలేదని, వెళ్ళిపోతున్నాయని వెకిలి రాతలు రాస్తున్నవారి అంధత్వాన్ని చూసి జాలిపడడం తప్ప ఏమి చేయగలం!నిజమే ! ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని రాసి నిర్మాణాత్మకంగా సూచనలు చేయవచ్చు. కాని ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టకపోతే, అది కూడా టీడీపీ ఎమ్.పి చేస్తే, ఆనందంతో తాండవం చేస్తూ,ఏపీకి భలే అయింది అని చంకలు గుద్దుకునే మీడియా,ప్రతిపక్షం ఉంటే ఏపీకి ఏమి మేలు జరుగుతుంది?అందుకే ఇదంతా టీడీపీ వారే కావాలని గల్లా జయదేవ్ ను అడ్డుపెట్టుకుని ఈ డ్రామా ఏమైనా ఆడిస్తున్నారా అన్న సందేహం వస్తుంది. అయితే గల్లా జయదేవ్ ఎక్కడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాని ఆయనను అడ్డుపెట్టుకుని టీడీపీ మీడియా నానా రభస చేశాయి.వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ విన్యాసం తప్పదు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తప్ప, వీరి నోర్లు మూతపడవు. విషపు రాతలు ఆగవు..అంతవరకు వెయిట్ చేయాల్సిందే. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 16 గిగావాట్అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్కు లాజిస్టిక్స్పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎంపీ గల్లా కనపడటం లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే. మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. అమలుకానీ హామీలు.. వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. -
Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?
ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ్యాపార పనుల్లో ఎంపీ అన్న సంగతి మరిచిపోయారేమో..? రెండోసారి గెలిచాక.. ఈ మూడేళ్ళలో ఐదారు సార్లు కూడా నియోజకవర్గానికి రాలేదట. ప్రజలు తమ ఎంపీని చూడాలనుకుంటే టీవీల్లో మాత్రమే దర్శనమిస్తారు. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. కానీ గల్లా అంటే ఎంపీగా కంటే.. పారిశ్రామికవేత్తగానే అందరికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా నియోజకవర్గానికి రావడం చాలా అరుదు. అసలు గుంటూరు ప్రజలను మీ ఎంపీ ఎవరని అడిగితే.. ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా గుంటూరుకు వచ్చి పోతుండేవారు. అది కూడా ఆయన సొంత పనులకోసం మాత్రమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందారు. గల్లా పోటీ చేసే సమయంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లా గెలిస్తే టీవీలో చూసుకోవాల్సిందేనంటూ ప్రచారం చేశారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. గల్లా జయదేవ్ గుంటూరును పూర్తిగా మర్చిపోయారు. గతంలోలా అప్పుడప్పుడు కూడా రావడంలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వచ్చినా కూడా ఎంపీ మాత్రం కనిపించడు. టీడీపీ తరపున ఏ కార్యక్రమం నిర్వహించినా గల్లా మాత్రం గైర్హాజరవుతారు. ఎంపీగా గెలిచి మూడేళ్లు అయినా ఐదారుసార్లు మాత్రమే గుంటూరు వచ్చారంటే ఆయనకు ప్రజలపట్ల ఎంత బాధ్యత ఉందో అర్దమవుతుంది. గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలైతే అసలు మనకు ఎంపీ ఉన్నాడా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. గల్లాను చూడాలంటే పార్లమెంట్ సమావేశాల్లో టీవీల్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా కనిపించరు. గల్లా తీరుపై తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి అసంతృప్తి కనిపిస్తోంది. ఎంపీతో ఏదైనా పని పడితే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. గల్లా జయదేవ్ను కలవాలంటే ఎవరిని సంప్రదించాలో తెలియదు. గుంటూరులోని ఆయన ఆఫీసులో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఉంటారు. వారిని అడిగితే ఎంపీ ఎప్పుడొస్తారో, ఇప్పుడెక్కడున్నారో తెలియదంటారు. ఎంతో కష్టపడి గల్లాను ఎంపీగా గెలిపించుకుంటే ఇప్పుడు తమ సమస్యలు వినడానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొంతమంది సీనియర్ నేతలైతే చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలుండడంతోనే తానేం చేసినా చెల్లుబాటు అవుతుందని గల్లా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వ్యాపారదృక్పధంతో మునిగి తేలే నాయకులను ఎంపీలుగా ఎన్నుకుంటే ఇలాగే ఉంటుందని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలకు చంద్రబాబు అపాయింట్మెంట్ అయినా దొరుకుతుందేమో కానీ గల్లా అపాయింట్మెంట్ దొరకడం కష్టమని సెటైర్లు వేస్తున్నారు. -
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
-
గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు
సాక్షి ప్రతినిధి,తిరుపతి: ‘అమరరాజా’ సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2నెలల కిందట కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతోసహా ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఐపీసీ 109, 120బి, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ149 ఐపీసీ ఆర్/డబ్ల్యూ 156(3) సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాజన్న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, చైర్పర్సన్ గల్లా అరుణకుమారి, సభ్యులు గల్లా రామచంద్రనాయుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, కార్యదర్శి సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సలనాయుడు, ఎం.మోహన్బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపై కేసులు నమోదు చేసినట్టు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ వెల్లడించారు. -
‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ మూవీలో హైదరాబాద్ షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ రోజు మాదాపూర్లోని ఓ స్టార్ హోటల్లో మూవీ షూటింగ్ జరిగింది. అయితే షూటింగ్ సెట్లోకి ఆకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ ప్రత్యక్షం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చదవండి: ఆర్సీ 15 కాన్సెప్ట్ పోస్టర్కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా! As it happens, at our hotel in Hyderabad, the @TridentHyd, I ran into Superstar MaheshBabu @urstrulyMahesh along with my colleague (& his brother-in-law) @JayGalla, a member of the Committee. What a delightful personality! pic.twitter.com/rhrTDOQBQy — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 ఆయన ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు మాదాపూర్లోని ట్రిడెంట్ హోటల్లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ను జరుపుకుంది.అది తెలిసి నేను నా సహా ఉద్యోగులతో కలిసి వెళ్లి మహేశ్ను కలిశాను. మా వెంట ఆయన బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. ఆయనను కలిసి కాసేపు మాట్లాడాను. నిజంగా ‘సూపర్ స్టార్’ ఎంత గొప్ప వ్యక్తి. ఆయనను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్లో మహేశ్తో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! అంతేగాక అదే సమయంలో ఆయన విలన్లతో పోరాడే సన్నివేశాలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా థరూర్ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Talking to MaheshBabu @urstrulyMahesh shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… @JayGalla pic.twitter.com/2ZaKSVBOIi — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 -
గల్లా ఫుడ్స్కి ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకోండి..
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనాపల్లి, పేట అగ్రహారం గ్రామాల పరిధిలో పరిశోధనాభివృద్ధి కేంద్రం(ఆర్ అండ్ డీ) ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి 2011లో 28 ఎకరాల భూమి తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒప్పందం మేరకు ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేయనందున ఆ ఒప్పందాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పూతలపట్టు మండలం నల్లగట్లపల్లికి చెందిన గాలి పురుషోత్తంనాయుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ చైర్మన్ అండ్ ఎండీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, గల్లా ఫుడ్స్ లిమిటెడ్లకు నోటీసులిచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పి.హేమచంద్ర వాదనలు వినిపిస్తూ.. ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ఒప్పందంతో భూమి తీసుకున్న గల్లా ఫుడ్స్.. ఆ భూమిలో ఎలాంటి కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదన్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఆ భూమిని ఉపయోగించనప్పుడు తిరిగి స్వాధీనం చేయాల్సిన బాధ్యత గల్లా ఫుడ్స్పై ఉందన్నారు. అయితే ఇప్పటి వరకూ భూమి స్వాధీనానికి అటు గల్లా ఫుడ్స్ గానీ, ఇటు ఏపీఐఐసీ అధికారులు గానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హేమచంద్ర వివరించారు. చదవండి: ఏపీ: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు -
అఫ్గాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను రూపొందించాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఫ్గాన్లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడంతోపాటు అక్కడ భారత్ పెట్టుబడులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అఫ్గాన్లో చాలామంది తెలుగు వారు పనిచేస్తున్నారని మిథున్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాలిబన్లతో చర్చలు జరిపి అందరినీ క్షేమంగా తీసుకురావాలన్నారు. తాను సూచించిన అంశాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నోట్ చేసుకున్నారని తెలిపారు. అఫ్గాన్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారన్నారు. కాగా, అఫ్గాన్లో ఇప్పటిదాకా భారత్ పెట్టిన 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వివరించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. -
పీసీబీ తనిఖీలను అడ్డుకోవద్దు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో తనిఖీలు చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి ఉందని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. పీసీబీ తనిఖీలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం చేయొద్దని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తనిఖీలకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. అలాగే తనిఖీలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని పీసీబీని కోరింది. తనిఖీలకు వెళ్లే ముందు అమరరాజా బ్యాటరీస్కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆ సంస్థ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటిని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా మూసివేత ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. తనిఖీలను అడ్డుకుంటోంది.. పీసీబీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐఐటీ నిపుణులతో కూడిన బృందం తనిఖీలకు వెళ్తే వారిని అమరరాజా బ్యాటరీస్ తన ప్రాంగణంలోకి అనుమతించడం లేదని తెలిపారు. తనిఖీలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తోందని వివరించారు. ఈ కంపెనీ టీడీపీ ఎంపీదని.. అందువల్ల ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ఐఐటీ నిపుణులతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ కంపెనీ ఉద్యోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు ఉన్నాయని, పూర్తి వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీబీపై ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. తనిఖీలు చేపట్టకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అమరరాజా యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ఆ సంస్థ తరఫు న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. పీసీబీకి సంబంధం లేని థర్డ్ పార్టీ వారిని మాత్రమే అనుమతించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు 8 మంది ఉద్యోగులను సీసం రహిత ప్రాంతానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. పీసీబీ వెంట ఉన్నది ఐఐటీ నిపుణులే తప్ప థర్డ్పార్టీ కాదని మోహన్రెడ్డి చెప్పారు. నిపుణుల సాయం తీసుకునే అధికారం పీసీబీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘అమర్రాజా’లో ప్రమాదకర స్థాయిలో లెడ్
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమర్రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకర స్థాయిలో లెడ్ కాలుష్యం వెలువడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. కార్మికుల రక్తంలోనూ లెడ్ శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని వెల్లడించింది. గాలి, నీరు, భూమిలో కూడా లెడ్ శాతం ప్రమాదకరస్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యాన్ని హెచ్చరించింది. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసివేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. అమర్రాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ కాలుష్య నివేదికలు సరికాదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. నివేదికలోని అంశాలను తాము సమగ్రంగా పరిశీలించామని స్పష్టం చేసింది. -
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యత్వానికి గల్లా రాజీనామా
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె గురువారం చంద్రబాబుకు లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నా అరుణ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు. ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కూడా టీడీపీలో గతంలో మాదిరిగా చురుగ్గా ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. -
వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే అధికార పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్దే బాధ్యత అని గతంలోనే చెప్పానని, తనను అంతం చేయాలని చూస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్పై, ఆయన గన్మెన్, అనుచరులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఎంపీ నందిగం సురేష్ సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (ఎంపీ సురేష్పై టీడీపీ నేతల దాడి) బాబుది రక్తం రుచి చూసిన చరిత్ర ఆయన మాట్లాడుతూ.. ‘జేఏసీ ముసుగులో టీడీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు? లేళ్ల అప్పిరెడ్డి కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఉంది. గన్మెన్లు, సిబ్బంది కళ్లల్లో మహిళలు కారం చల్లారు. అమరావతికి సంబంధం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారు. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే ఈ ఘటనకు పాల్పడ్డారు. కారం చల్లి నా గన్మెన్లు, సిబ్బందిపై దాడి చేశారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అమరావతి ప్రజలు బలి అవుతున్నారు. చంద్రబాబుది రక్తం రుచి చూసిన చరిత్ర. దళితలు ఎప్పుడూ ఊరు బైట ఉండాలనుకొనే చరిత్ర ఆయనది. ఇప్పటికైనా చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా వాస్తవాలు రాయాలి. (ఐటీ గుప్పిట్లో బిగ్బాస్ గుట్టు!) రాజధాని నీ అబ్బ సొత్తు కాదు అరే ఎంపీ అంటూ ఏమి పీకుతారు అంటూ నోటి కొచ్చినట్లు తిట్టారు.. కళ్లలో కారం చల్లారు. గతంలో కూడా నాపై దాడి చేశారు. నా పీఎపై చెప్పుతో దాడి చేశారు. నా పక్కన ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకొని కొట్టారు. మాపై దాడి చేసినవారు రాజధానికి సంబంధించిన వాళ్లు కాదు. నాపై దాడి చేసిన వారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. చంద్రబాబు చేతకాని రాజకీయాలు చేయొద్దు. రాజధాని మీ అబ్బ సొత్తు కాదు. అమరావతి చంద్రబాబు బినామిల రాజధాని. ఇప్పటికైనా ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాయాలి. అలా తప్పుడు వార్తలు రాసి చంద్రబాబుకు 23 సీట్లు తెచ్చారు. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదు. తాను, తన సామాజిక వర్గం మాత్రమే రాజ్యాధికారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తహసీల్దార్ వనజాక్షిపై మరోసారి టీడీపీ దాడి నీచ రాజకీయాలు చేయొద్దు.. టీడీపీ మహిళలు ప్రయాణించిన బస్సులో ఎంపీ గల్లా జయదేవ్, ఆలపాటి రాజా ఉన్నారు. బస్సు పోలీస్ స్టేషన్కు వెళ్లేలోగా అక్కడికి వాళ్లు ఎలా వచ్చారు? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని వెధవ రాజకీయాలు చేయొద్దు. మహిళలైతే ఏ ఇబ్బంది రాదని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రాజధాని పేరుతో అక్రమాలకు అడ్డగా మార్చుకున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారు. కారం మాపై వేసి, పైపెచ్చు వాళ్లే వేశారని చెప్పమంటున్నారు. బాబు తొత్తుగా మారిన ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని తెలిసి మాపై దాడులు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను అంతం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత. (ఆంధ్రా అనకొండ) నీ అంతు చూస్తామంటూ బెదిరింపులు దళితులకు ఎలాగు గౌరవం ఇవ్వరు. కనీసం ఎంపీ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా? దళితులు అమరావతిలో తిరగడానికి అర్హులు కాదా? అమరావతిలో ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి కూడా అర్థరాత్రి నాకు ఫోన్లు వస్తున్నాయి. నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఉప్పు, కారం తింటున్న మాకు రోషం ఉండదా?. సామాన్యులపైనా టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. దాంతో మేము నిబద్ధతతో పని చేస్తున్నాం. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి పర్యటన సందర్భంగా పసుపు నీళ్లు చల్లించారు. ఇప్పుడు దళిత ఎంపీ అయిన నాపై దాడులు చేయించారు.’ అని మండిపడ్డారు. (దృష్టి మళ్లించడానికే ఆ దిక్కుమాలిన రాతలు..!) -
అసెంబ్లీ నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీ చేసిన నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరని, అసెంబ్లీ అధికారంలో జోక్యం చేసుకోజాలరని బుధవారం లోక్సభలో ప్యానెల్ స్పీకర్ ఎ.రాజా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాజా పలుమార్లు జోక్యం చేసుకుని వారించారు. అయినా వినిపించుకోకుండా గల్లా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావించడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజా స్పందిస్తూ.. ‘అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ(పార్లమెంటులో) ప్రశ్నించలేరు.. ప్రస్తావించనూ లేరు. అది అసెంబ్లీ అధికారం. దానిలో జోక్యం చేసుకోజాలం’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారుపై విమర్శలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన గల్లా జయదేవ్ తన ప్రసంగమంతా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతోనే సరిపుచ్చారు. ఏపీలోని కొత్త ప్రభుత్వం హేతుబద్ధం కాని నిర్ణయాలు తీసుకుంటోందని, రెండంకెల వృద్ధి సాధించిన తమ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటోందని విమర్శించారు. రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను పరిశ్రమలు ఉపసంహరించుకున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలుగా చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని అభ్యంతరం వ్యక్తంచేశారు. జయదేవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని వికేంద్రీకరణను రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ ఆమోదించిందని, అయితే శాసన మండలిలో చైర్మన్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ప్రభుత్వం కౌన్సిల్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తన సమాధానంలో రాజధాని నిర్ణయం రాష్ట్రాలదేనని చెప్పారని, కానీ రాజధానులని ప్రస్తావించలేదని పేర్కొన్నారు. అమరావతిని నోటిఫై చేస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కేంద్రం గుర్తించిందన్నారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టి పెట్టండి.. ఈ నేపథ్యంలో ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని ‘మీరు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తున్నారు. దానికే పరిమితం కావాలి..’ అంటూ గల్లా జయదేవ్కు సూచించారు. అయితే గల్లా వినిపించుకోలేదు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ చెప్పిందని, ఇప్పుడు మూడు రాజధానులు తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో విషయంలోకి రావాలంటూ ప్యానెల్ స్పీకర్ ఆయనకు సూచించారు. ‘‘మీ ప్రకటన వివాదానికి దారితీస్తోంది. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించజాలరు.. దానిని గుర్తుంచుకోవాలి..’’ అని ఒకింత ఘాటుగా చెప్పారు. దీంతో తాను ప్రశ్నించట్లేదని, కేవలం నేపథ్యమే చెబుతున్నానంటూ గల్లా తిరిగి అవే విషయాలు మాట్లాడారు. ప్యానెల్ స్పీకర్ మరోసారి జోక్యం చేసుకుంటూ.. ‘‘మీ సమయాన్ని వృథా చేసుకోరాదు. రాష్ట్రపతి ప్రసంగంపైనే దృష్టిపెట్టండి..’’ అని హితవు పలికారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే గల్లా తిరిగి మాట్లాడుతూ నిపుణుల కమిటీకి చట్టబద్ధత లేదని, ముఖ్యమంత్రి వాటిని ప్రభావితం చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల వల్ల ఆర్థిక భారం మూడు రెట్లు పడుతుందన్నారు. తిరిగి ప్యానెల్ స్పీకర్ జోక్యం చేసుకుని.. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ ప్రశ్నించలేరు.. కనీసం ప్రస్తావించనూ లేరని, అసెంబ్లీ అధికారంలో మనం జోక్యం చేసుకోజాలమని అంటూ మీరు వినకపోతే నేను ఇంకో సభ్యుడిని పిలుస్తానని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా జయదేవ్ ముఖ్యమంత్రిపై విమర్శలు కొనసాగించారు. దీంతో ‘ఆ వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవు’ అని ప్యానెల్ స్పీకర్ స్పష్టంచేశారు. కానీ జయదేవ్ అమరావతిపైనే మాట్లాడుతుండడంతో వేరొక సభ్యుడి పేరును రాజా పిలిచారు. దీనిపై జయదేవ్ అభ్యర్థించడంతో నిమిషం సమయమిస్తూ ప్రసంగాన్ని ముగించాలని కోరారు. కానీ గల్లా మళ్లీ పాత విషయాలే ప్రస్తావించడంతో ప్యానెల్ స్పీకర్ మాట్లాడాలంటూ మరొక సభ్యుడి పేరును పిలిచారు. -
రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మద్దతు పలికింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లోక్సభకు మంగళవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో టీడీపీ వాదనలన్నీ ప్రజలను పక్కదారి పట్టించేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది. రాజధాని అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుయుక్తి బెడిసికొట్టింది. లోక్సభ వేదికగా టీడీపీ వేసిన పాచిక వారికే ఎదురుతిరిగింది. రాష్ట్ర రాజధాని అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమివ్వడంతో ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం సరైనదేనని స్పష్టమైంది. నిత్యానంద్రాయ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్రం స్పందన ఏమిటి?: గల్లా రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ రాజకీయ ఎత్తుగడ వేసింది. ఈమేరకు ఎంపీ గల్లా జయదేవ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో ప్రశ్నలు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే దీనిపై కేంద్రం స్పందన ఏమిటి? ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సహాయపడుతుంది? పెట్టుబడుల వాతావరణం దెబ్బతినడమే కాకుండా రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతున్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుందా? ఇస్తే అందుకు సంబంధించి వివరాలేమిటి?’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మరో సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అమరావతిలో నిరసన అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తూ ప్రశ్న అడిగారు. ‘అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్లో సామూహిక నిరసనలు జరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందా? నిరసనకారులపై పోలీసుల దాడులు కేంద్రం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఈ విషయంలో జోక్యం చేసుకునే యోచన ఉందా?’ అని అడిగారు. రాజధాపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే మూడు రాజధానుల అంశంపై టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని ఎక్కడైనా నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది’ అని విస్పష్టంగా ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్ 23న జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది..’ అని పేర్కొన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని కూడా కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు టీడీపీ సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ప్రజల భద్రత, పోలీసింగ్ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, చట్టప్రకారం అపరాధులపై చర్యలు తీసుకునే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో శాంతి భద్రతల స్థితిని పర్యవేక్షిస్తుంది. భారీగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లైతే రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) పంపడం ద్వారా సాయం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనేదీ కేంద్ర హోం శాఖకు ఇంతవరకూ రాలేదు’ అని వివరించారు. రాజకీయ లబ్ధికి టీడీపీ పాట్లు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం లేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని మొదటి నుంచీ చెబుతోంది. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖను పరిపాలనా రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. కానీ దీనికి వక్రభాష్యం చెబుతూ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. బీజేపీలో చంద్రబాబు కోవర్టు సుజనా చౌదరి తదితరులు కూడా టీడీపీ వాదనను వినిపిస్తూ వికేంద్రీకరణను అడ్డుకుంటామని చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. కేంద్రం ప్రకటనపై హర్షాతిరేకాలు.. మూడు రాజధానుల విధానానికి అనుకూలంగా ప్రజా మద్దతు పెరుగుతోంది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా ‘రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. అందులో కేంద్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకోదు. నిబంధనల మేరకే వ్యవహరిస్తుంది’ అని చెబుతూ వస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకోవడమే లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగానే కీలక ప్రకటన చేయడం గమనార్హం. కేంద్రం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ విధానానికి ఇటు ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తుండటం అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని పేర్కొంటున్నాయి. -
'చంద్రబాబు ఉచ్చులో రైతులెవరు పడొద్దు'
సాక్షి, విశాఖపట్నం : ఏపీ రాజధానికి సంబంధించి పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమంటూ కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారంటూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కేంద్రానికి అర్థమైన విషయం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబుకు అర్థం కాకపోవడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం క్యాపిటలిస్టు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, రాజధాని చుట్టూ ఉన్న రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు అనే అంశం రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న బాబు మాటలు ఎవరు నమ్మొద్దని, అతని ఉచ్చులో రైతులెవరు పడొద్దని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్న విషయం నగ్నసత్యమని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని అప్పట్లో ప్రజలు బాబుకు అధికారమిస్తే రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి మరింత నీచ స్థితికి దిగజార్చారని అమర్నాథ్ మండిపడ్డారు. (సభలో కాకుండా ఈనాడు, ఏబీఎన్లో చర్చించాలా?) -
టీడీపీ పొలిట్బ్యూరోలోకి కొత్త ముఖాలు
సాక్షి,అమరావతి: టీడీపీ పొలిట్బ్యూరోలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. కొత్తగా ముగుర్గు సభ్యుల్ని పొలిట్బ్యూర్లోకి తీసుకుంటున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నాయకులు గల్లా జయదేవ్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలకు పొలిట్బ్యూరోలో చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. కాగా, టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రానున్న సంస్థాగత ఎన్నికలు, పార్టీ కమిటీలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు కచ్చులూరు పడవ ప్రమాద మృతులకు పొలిట్బ్యూరో సంతాపం తెలుపనుంది. -
ఆర్టికల్ 370 రద్దు; మాకు పాఠాలు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వాదం గురించి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదని ఎంపీ శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు కశ్మీర్ పౌరులకు మద్దతుగా నిలబడుతుందని ప్రకటించారు. కశ్మీరీలు మన తోటి పౌరులని గర్వంగా చెబుతామన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను నిందించడం సరికాదన్నారు. ఆర్టికల్ 370 రూపకల్పనలో సర్దార్ వల్లభాయ్పటేల్ పాత్ర ఉందని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని చీకటి దినంగా కాంగ్రెస్ పార్టీ వర్ణించడంపై వివరణయిస్తూ.. ‘జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్ట్ చేశారు. లోక్సభలో మన సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా ఏమయ్యారో తెలియడం లేదు. అఖిలపక్ష నాయకులను కశ్మీర్ తీసుకెళ్తే అక్కడ పరిస్థితులను స్వయంగా అంచనా వేసేవార’ని శశిథరూర్ అన్నారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా సొంత ఇంట్లోనే ఉన్నారని, ఆయనను నిర్బంధించలేదని హోంమంత్రి అమిత్ షా వివరణయిచ్చారు. కశ్మీర్లో కొత్త శకం: గల్లా జయదేవ్ ఒకే దేశం, ఒకే రాజ్యాంగానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. 370 అధికరణను రద్దు చేయడం ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సరిచేశారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం కశ్మీర్కు ఎంతో మేలు జరుగుతుందని, రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. -
ఎంపీ గల్లా అనుచరులపై కేసు
పెదకాకాని (పొన్నూరు) : పాత వాహనం కొనుగోలు విషయంలో కత్తితో దాడికి పాల్పడిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు తెలిపారు. గుంటూరు ఆటోనగర్లో శనివారం పాత బస్సు కొనుగోలు చేసిన వ్యవహారంలో జరిగిన ఘర్షణలో ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు షబ్బీర్ ఆయన కుమారులు ఇంతియాజ్, రియాజ్, ఫిరోజ్, ఆయన సోదరుని కుమారుడు సయ్యద్ గఫార్లు కలిసి వైఎస్సార్సీపీ కార్యకర్త మురాద్ అలీపై దాడి చేయగా, అడ్డుకున్న మురాద్ అలీ సోదరుని కుమారుడు అక్రమ్పై కత్తితో దాడి చేసి గాయపరచిన సంగతి విదితమే. ఈ ఘటనలో మురాద్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపీ అనుచరులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, ఇదే వ్యవహారంలో ఇంతియాజ్ ఫిర్యాదు మేరకు మురాద్ అలీ, అక్రమ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.అనురాధ తెలిపారు. చదవండి : గల్లా అనుచరుల దాష్టీకం -
కత్తులు, రాడ్లతో స్వైర విహారం
సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అనుచరులు, ఆ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఆటోనగర్లో మామూళ్లు వసూలుచేస్తూ రెచ్చిపోతున్నారు. తమ అక్రమాలను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. తమ అక్రమాలను నిలదీశారనే కారణంతో పాత లారీ కొనుగోలు విషయంలో తగాదా పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్రమ్పై ఎంపీ గల్లా అనుచరులు ఇంతియాజ్, రియాజ్, ఫెరోజ్, గఫూర్ శనివారం హత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీకి చెందిన ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ షబ్బీర్ ఎన్నికల ముందు అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఇతర మంత్రుల సమక్షంలో గల్లా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడిగా చలామణీ అవుతున్న షబ్బీర్.. గత కొన్ని రోజులుగా తన అనుచరులతో ఆటోనగర్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఆటోనగర్లో మరమ్మతుల కోసం వచ్చే లారీకి రూ.500, కారుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నాడు. కాగా, ఇక్కడే స్పేర్పార్ట్స్ వ్యాపారం చేస్తున్న వైఎస్సార్సీపీకి చెందిన మురాద్ అలీ.. షబ్బీర్, అతని అనుచరుల ఆగడాలను తొలి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. దీంతో మురాద్ అలీపై షబ్బీర్, అతని అనుచరులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటోనగర్లో జానీ అనే వ్యాపారి రాజమండ్రిలో పాత లారీ కొనుగోలు చేసిన విషయంలో సంబంధం లేకపోయినప్పటికీ షబ్బీర్ కుమారులు, అనుచరులు మురాద్తో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మురాద్పై షబ్బీర్ తనయుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో మురాద్ సోదరుని కుమారుడు అక్రమ్ ప్రతిఘటించడంతో అతని కుడి భుజానికి తీవ్ర గాయమైంది. గొడవ అనంతరం షబ్బీర్ అనుచరులు చాలాసేపు ఆటోనగర్లో కత్తులు, రాడ్లతో హడావుడి చేశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు అక్రమ్ను జీజీహెచ్కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో స్వల్పంగా గాయపడ్డ షబ్బీర్ను కూడా ఆస్పత్రికి తరలించారు. ఎంపీ అండదండలతోనే.. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం అల్తాఫ్ అనే వ్యాపారిపై కూడా షబ్బీర్, అతని కుమారులు, అనుచరులు హత్యాయత్నం చేశారు. ఈ కేసు విషయంలో అప్పటి సీఐ, హెడ్కానిస్టేబుళ్లు షబ్బీర్కు సహకరించడంతో బాధితుడు అల్తాఫ్ అర్బన్ ఎస్పీకి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆటోనగర్లో షబ్బీర్, అతని అనుచరుల అరాచకాలు తగ్గడంలేదు. టీడీపీ ఎంపీ గల్లా అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, నారా లోకేశ్తో షబ్బీర్ (ఫైల్). గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రమ్ -
గల్లా జయదేవ్ అనుచరుల వీరంగం..
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. వివరాలు.. వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రమ్పై.. టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆటోనగర్లో చోటుచేసుకుంది. గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ అనుచరులు హబ్బీర్, ఫిరోజ్, గఫూర్, ఇంతియాజ్, రియాజ్లు వైఎస్సార్సీపీ కార్యకర్త అక్రంను అంతమెందించడానికి ప్రయత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నాడు. కత్తులతో మెడపై దాడి చేయడానికి ప్రయత్నించగా అక్రం తప్పించుకునే క్రమంలో భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అక్రమ్ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కేశినేని నాని కినుక వెనుక..
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీలో లోక్సభ పదవుల పందేరం చిచ్చు రేపింది. పార్టీ ఇవ్వజూపిన పార్లమెంటరీ చీఫ్ విప్ పదవిని పార్లమెంటరీ విప్ పదవిని విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరస్కరించారు. ఇటీవ ల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా పార్టీ పెద్ద తీరు మారకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గల్లా కుటుంబానికి పార్టీ పొలిట్బ్యూరో, పార్లమెంటరీ పదవులు కట్టబెట్టడంతో కేశినేని కినుక వహించినట్టుగా తెలుస్తోంది. తాను బీజేపీలో చేరతానని ప్రచారం జరుగుతున్న సమయంలో తనకు పార్లమెంటరీ విప్ ఇవ్వడం చూపడం పట్ల సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా పార్టీలో పనిచేసింది ఎవరు, పెత్తనం చేసింది ఎవరనేది గుర్తించాలని కేశినేని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్ను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, కేశినేని నాని పార్టీ మారడం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆయన బీజేపీలో చేరతారనడం అవాస్తవమని పేర్కొన్నారు. కేశినేని నాని పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనతో జయదేవ్ సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం తన నివాసానికి రావాలని కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. (చదవండి: టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్!) -
ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ
సాక్షి, విజయవాడ : పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ పార్టీలో చేరే ఉద్దేశంతోనే నాని విప్ పదవిని తిరస్కరించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను నాని వద్దకు పంపించారు. విజయవాడలోని కేశినేని నాని కార్యాలయానికి వచ్చిన గల్లా.. విప్ పదవి తిరస్కరించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విప్ పదవి తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం లేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడవద్దని ఈ సందర్భంగా నాని తెలిపారు. తనకు విజయవాడ ఎంపీ పదవి కన్నా పెద్ద పదవి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టానని, విభజన హామీలపై పోరాడానని గుర్తు చేశారు. లోక్సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్గా తనను నియమించడంపై కేశినేని నాని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ...తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్న కేశినేని నాని... పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపొందిన విషయం విదితమే. -
పసుపు కండువాతో గల్లా జయదేవ్
-
మీడియాపై గల్లా జయదేవ్ అనుచరులు దౌర్జన్యం
-
జీర్ణం.. జీర్ణం.. భూములూ జీర్ణం
సాక్షి, అమరావతి : చట్టాలు, నిబంధనలను చట్టుబండలుగా మార్చేసిన సీఎం చంద్రబాబు అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ప్రభుత్వ భూములను దర్జాగా కేటాయించడం ద్వారా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకు కేటాయించిన టీడీపీ సర్కారు ఫక్తు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు మాత్రం రూ.10 లక్షలకే అప్పగించడం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. తమ నేత భూ దందాలను చూసి మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు అదే దారిలో నడిచారు. ఫుడ్ పార్కులు, పరిశ్రమల ముసుగులో విలువైన భూములు కాజేసి కోట్లకు పడగలెత్తారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని దళారీగా మార్చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని భూములు అప్పగించేసి ప్రతిఫలంగా వాటాలు పొందారు. అయిన వారికి అప్పనంగా భూములిచ్చి వాటాలు పొందడమే లక్ష్యంగా ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి ఉచితంగా ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కారు ఏకంగా జీవోనే జారీ చేసింది. రాష్ట్ర పారిశ్రామిక రాజధాని విశాఖ నగరంలో రూ.400 కోట్ల విలువైన భూమిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు రూ. 13 కోట్లకే ధారాదత్తం చేయడం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను అస్మదీయ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా సీఎం చంద్రబాబు సింహభాగం వాటాలు పొందారు. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకుని రూ.వేల కోట్లు మింగేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి నగరాల్లో రూ.వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమలు, ఐటీ సంస్థల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగినన్ని క్విడ్ ప్రోకోలు (నీకది... నాకిది) రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సర్కారు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఐవైఆర్, అజేయకల్లం ఈ కుంభకోణాలను నిర్థారిస్తూ పుస్తకాలను కూడా ప్రచురించడం వీటిని బలపరుస్తోంది. ఇష్టారాజ్యంగా ధరల నిర్ణయం భూముల కేటాయింపులకు సంబంధించి ధరల నిర్ణయంలో సర్కారు ఓ విధానం, పద్ధతిని పాటించలేదు. అమరావతి పేరుతో రైతుల నుంచి సమీకరించిన భూమిని కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన ధరలో పదో వంతు కంటే తక్కువ మొత్తానికే ప్రైవేట్ కంపెనీల పరం చేయడం గమనార్హ్హం. ఎల్ఐసీకి ఎకరం రూ.4 కోట్లకు ఇచ్చిన ప్రభుత్వం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ఎకరం రూ. 12 లక్షల చొప్పున 12 ఎకరాలు ఇచ్చేసింది. జేవియర్ స్కూల్కు ఎకరం రూ.లక్షకే కట్టబెట్టింది. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వార్షిక ఫీజులు వసూలు చేసే ఎస్ఆర్ఎం, విట్, అమృత తదితర ప్రైవేట్ విద్యాసంస్థలకు నామమాత్రపు ధరకే భూములు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్ట్రానిక్స్కు అమరావతిలో రూ.160 కోట్ల విలువైన 40 ఎకరాలు రూ.20 కోట్లకే ఇచ్చేశారు. అది కూడా ఎన్నికలు రెండు నెలలు ఉండగా ఇచ్చేయడం గమనార్హం. ఇలా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఇప్పటికే 46 ప్రైవేట్ సంస్థలకు 1,260 ఎకరాలకుపైగా సర్కారు కట్టబెట్టింది. నందమూరి సంస్థకు అప్పనంగా అప్పగింత ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్గా వ్యవహరిస్తున్న నందమూరి బసవ తారకం ఆస్పత్రికి రాజధాని ప్రాంతంలో ఎకరా రూ.10 కోట్లు పలికే భూమిని ఎకరా రూ.25 లక్షలకే కట్టబెట్టారు. బాలకృష్ణ కుటుంబానికి చెందిన సంస్థకు రూ.150 కోట్ల విలువైన భూమిని రూ.3.75 కోట్లకే అప్పనంగా ఇచ్చేశారు. పేదల భూములకూ టెండర్ పరిశ్రమల కోసం 10 లక్షల ఎకరాలను సేకరించాలని ఏపీఐఐసీకి నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేదలకు పంచిన అసైన్డ్, పట్టా భూములను లాక్కునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాలను విండ్పవర్ సంస్థలకు అడ్డగోలుగా ఇచ్చేశారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ‘ముడా’ను కూడా భూ దళారీగా మార్చేశారు. ముడా నిధులతో మౌలిక వసతులు కల్పించి పారిశ్రామిక సంస్థల ముసుగులో 33 వేల ఎకరాలను కొట్టేయాలని సర్కారు పెద్దలు వ్యూహ రచన చేశారు. అనంతపురం – అమరావతి ఎక్స్ప్రెస్ హైవే పేరుతో 26,890 ఎకరాలను కొత్త భూసేకరణ చట్టం/సమీకరణ ద్వారా లాక్కోవాలని ప్రణాళిక రచించారు. గల్లాకు సంతర్పణ గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్కు తిరుపతిలోని కరకంబాడిలో రూ.108.45 కోట్ల విలువైన 21.69 ఎకరాల భూమిని రూ.4.88 కోట్లకే రాసిచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూమి కేటాయించాలంటూ పెట్టుకున్న దరఖాస్తు గల్లా అరుణకుమారి (జయదేవ్ తల్లి) మంత్రిగా ఉండగానే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. ఆమె కుటుంబానికి చెందిన అమర్రాజా బ్యాటరీస్కు సమీపంలోనే భారీగా భూములున్నందున ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె మంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ సర్కారు పేర్కొంది. అయితే చంద్రబాబు సర్కారు రాగానే ఆగమేఘాలపై ఈ ఫైలును తెప్పించుకుని మంగళ్ ఇండస్ట్రీస్కు కారు చౌకగా భూమిని కట్టబెట్టడం గమనార్హం. కేటాయించిన భూమికీ ధర తగ్గించారు వైఎస్సార్ జిల్లాలో ట్రైమాగ్ అల్లాయిస్కు భూకేటాయింపు వ్యవహారంలో సర్కారు అనుసరించిన వైఖరిపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎకరా రూ.15.01 లక్షల చొప్పున ఈ సంస్థకు వంద ఎకరాలు కేటాయించారు. డబ్బు కట్టలేనని ఈ సంస్థ చేతులెత్తేస్తే భూమిని వెనక్కు తీసుకోవాల్సిందిపోయి తాజాగా ఈ సంస్థకు ఎకరా భూమి ధరను రూ.3.50 లక్షలకు తగ్గించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా చేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. ఇది కర్నూలు జిల్లాలో శాంతిరాముడు అనే టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా భూమి విలువ రూ.30 లక్షలు పలుకుతోంది. ఇదే వ్యక్తికి చెందిన శాంతిరాం కెమికల్స్కు ఎకరా రూ.1.05 లక్షల నామమాత్రపు ధరతో 150 ఎకరాలు కేటాయించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు శాంతిరాముడు సహకరించినందుకు ఇవి బాబు ఇచ్చిన బహుమానాలని అధికారులు అంటున్నారు. విక్రయ హక్కులు కల్పిస్తూ జీవో కారు చౌకగా కట్టబెట్టిన భూములను తాకట్టు పెట్టుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు విక్రయ (సకల) హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. బ్యాంకు రుణాల మెలిక పెట్టి విక్రయ హక్కులనూ కల్పించింది. రూ. 300 కోట్ల భూమి రూ. 40 కోట్లకే... తిరుపతి చెంతన ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లో మెడికల్ డివైజ్ పార్కు ఏర్పాటు కోసం మేజెస్ ఎలక్ట్రానిక్ పార్కుకు 200 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. తిరుపతి–కాళహస్తి మార్గంలో ప్రస్తుతం ఎకరం కోటిన్నర రూపాయలు పలుకుతుండగా ఎకరం కేవలం రూ.20 లక్షలతో ఇచ్చేశారు. రూ. 300 కోట్ల విలువైన భూమిని రూ. 40 కోట్లకే ధారాదత్తం చేశారు. 2014–20 పారిశ్రామిక విధానం రాయితీల పేరుతో మరో రూ.50 కోట్ల మేర కూడా లబ్ధి చేకూర్చారు. అయిన వారికి ఫుడ్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం ముసుగులో చంద్రబాబు తన అస్మదీయులకు సుమారు రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.126 కోట్లకే కట్టబెట్టారు. తద్వారా అధికార పార్టీ లోని ముఖ్యనేతలు భారీ ఎత్తున ప్రయోజనం పొందారు. రూ.520 కోట్ల భూమి రూ.4.99 కోట్లకే ధారాదత్తం ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులను దోచిపెట్టారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భరత్ (మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనువడు) మంత్రి నారా లోకేష్కు తోడల్లుడు కావడం గమనార్హం. భరత్ కుటుంబానికి చెందిన విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీ (వీబీసీ)కి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498.93 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.900 కోట్ల పెట్టుబడితో యూరియా కర్మాగారం పెడతామంటూ బహిరంగ మార్కెట్లో రూ.520 కోట్ల విలువైన భూమిని రూ.4.99 కోట్లకే కొట్టేశారు. ఈ భూముల విలువ పెంచడం కోసమే జగ్గయ్యపేటను సీఆర్డీఏ పరిధిలోకి చేర్చారు. ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని మూడేళ్లు దాటినా ఇప్పటివరకు అక్కడ కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం స్థలం తీసుకున్న మూడేళ్లలోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలి. కానీ అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాకపోయినా భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇది చాలదన్నట్లు విశాఖ జిల్లా యారాడ సమీపంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్, ఆదాయపన్ను కమిషనరేట్, కస్టమ్స్ కమిషనరేట్, సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ తదితరాలకు కేటాయించిన అత్యంత విలువైన 34 ఎకరాల భూమిని ఇదే కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూమిని కేబినెట్ ద్వారా ఏకంగా రద్దు చేశారు. ఆంధ్రజ్యోతికి ధారాదత్తం తనకు భజన చేస్తున్నందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రజ్యోతికి విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రూ.37.50 కోట్ల విలువైన భూమిని రూ.1.70 కోట్లకే ధారాదత్తం చేశారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని పరదేశి పాలంలో బహిరంగ మార్కెట్లో భూమి విలువ ఎకరా రూ.15 కోట్లుపైగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లు ఉందని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రతిపాదన పంపించారు. ఇదే ధరతో కేటాయించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ (ఏపీ ఎల్ఎంఏ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం 1.5 ఎకరాల భూమిని కేవలం రూ.50 లక్షల ఐదు వేలకే కేటాయించింది. చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలోని తూకివాకంలో బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.10 కోట్లు పలుకుతున్న భూమిని ఆంధ్రజ్యోతికి కేటాయించారు. ఈ భూమి బెంగళూరు–విజయవాడ హైవేలో ఉంది. ఇది చెన్నై–తిరుపతి హైవేకు కూడా పక్కనే ఉండటం వల్ల ఈ భూమి విలువ చాలా ఎక్కువ. 1.5 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 కోట్లు కాగా, ప్రభుత్వం రూ.1.20 కోట్లకే ధారాదత్తం చేసింది. ‘లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా భజంత్రీలు వాయిస్తున్న ఆ సంస్థకు చంద్రబాబు సొంత ఆస్తి ఇస్తే తప్పు లేదు. ప్రభుత్వ భూములు, అడ్డగోలుగా ఖజానా సొమ్మునుంచి ప్రకటనలు ఇవ్వడం అన్యాయం’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రూ.లక్ష కంపెనీకి రూ.300 కోట్ల భూమి రూ.లక్ష మూలధనంతో 2018 అక్టోబర్లో ప్రారంభమైన మేజెస్ ఎలక్ట్రానిక్స్ పార్కుకు చిత్తూరు జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూమిని రూ.40 కోట్లకే కేటాయించారు. అత్యంత వేగంగా భూమి కేటాయించడమే కాకుండా 2014–20 పారిశ్రామిక పాలసీలో లభించే రాయితీలకు అదనంగా రూ.50 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. ఇది బాబు బినామీ సంస్థ అని పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మొగిలి ఇందుమౌళిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బాబు బినామీ సీఎం రమేష్ దుబాయ్లో కలిసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇది సీఎం రమేష్, ముఖ్యమంత్రి బినామీది అనడానికి ఆధారమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సొంత సంస్థ హెరిటేజ్కు.. హెరిటేజ్ సంస్థకు గుట్టు చప్పుడుకాకుండా ప్రభుత్వం మూడు జిల్లాల్లో 26.46 ఎకరాల భూములు కేటాయించింది. పశువుల దాణా తయారీ కేంద్రం పేరుతో రాజధానికి సమీపంలో కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాలు, అనంతపురంలో 6.46 ఎకరాలు కట్టబెట్టారు. ఇందుకు సంబంధించి ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. ఏపీఐఐసీ మాత్రం భూములు ఇచ్చేసింది. హెరిటేజ్కు కేటాయించిన 26.46 ఎకరాల భూమి ధర రూ.50 కోట్లకుపైనే ఉంటుందని అనధికారిక అంచనా. హెరిటేజ్ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి అధిపతులుగా కొనసాగుతుండటం గమనార్హం. – ఎల్.రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి -
‘ఆయన్ని ఓడించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’
-
‘ఆయన్ని ఓడించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా’
సాక్షి, గుంటూరు: ఎన్నికలు వచ్చినవి కాబట్టే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారని స్థానిక వైఎస్సార్సీపీ లోక్సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గల్లా జయదేవ్ కేవలం అతిథి ఎంపీ అని, ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను ఏమైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. గుంటూరులో జయదేవ్ను తాను, మంగళగిరిలో లోకేష్ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్కే భారీ మెజార్టీతో లోకేష్ను మట్టికరిపించడం ఖాయమన్నారు. గల్లాను ఓడించేందుకే తాను గుంటూరు ఎంపీగా పోటీచేస్తున్నానని మోదుగుల వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న భావన్న ప్రజలందరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. (విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!) ఐదేళ్ల కాలంలో గల్లా జయదేవ్ ఎన్నిసార్లు గుంటూరు వచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాల పేర్లు కూడా గల్లాకు సరిగ్గా తెలియవని ఆరోపించారు. ఆయనకు ఎంపీ పదకి ఆభరణమని, తనకు ఆయుధమని వర్ణించారు. దాని ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదాని తీసుకువస్తామని వ్యాఖ్యానించారు. పొన్నురులో ఐదుసార్లు గెలిచిన ధూళ్లిపాళ్ల నరేంద్రకి ఈసారి చెక్పెడతామని, ఆయనొక కిలాడి అని విమర్శించారు. గుంటూరుకు ఐదేళ్ల కాలంలో తొమ్మిది మంది మున్సిపల్ కమిషనర్లను మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీలో చేరిన గుంటూరు టీడీపీ నేత షేక్ షౌకత్
-
‘గల్లా జయదేవ్ మాట తప్పారు’
సాక్షి, హైదరాబాద్: ఎంపీ గల్లా జయదేవ్ తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పారని గుంటూరు ఈస్ట్ టీడీపీ నాయకుడు షేక్ షౌకత్ ఆరోపించారు. గురువారం లోటస్పాండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశానని వెల్లడించారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని గల్లా జయదేవ్ మీడియా ముఖంగా చెప్పారని తెలిపారు. మద్దాల గిరి, గల్లా అరుణ కూడా తనకు హామీయిచ్చారని చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకుడికి రాయపాటి సాంబశివరావు రెండు రోజుల్లోనే టిక్కెట్ ఇప్పించారని, తనకు మాత్రం మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మాట ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా టీడీపీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు, మైనార్టీలను ఒక తాటిపై తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రచారం సాగిస్తానని షౌకత్ స్పష్టం చేశారు. -
అయ్యో లోకేషా... ఎంత పని జరిగింది?
సాక్షి, మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్కు అనుకోని సంఘటన ఎదురైంది. అనుకోకుండా తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి అయ్యగోరు బిత్తరపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే....అల్లుడు రియల్గా చూపించాడబ్బా, దీన్ని కూడా ప్రతిపక్షం కుట్ర అంటారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ విషయంలోకి వస్తే... మంత్రి నారా లోకేష్ గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు ఒక్కసారిగా కూలింది. అయితే ప్రచార సభలో పాల్గొన్న కార్యకర్తలపై ఈ బోర్డు పడింది. లోకేష్తో పాటు ఎంపీ గల్లా జయదేవ్...మిగతా నేతలు అంతా కొద్ది దూరంలో ఉన్నా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. చిన్న పిల్లలతో ఇదేమీ పని? మరోవైపు.... ఎదుట వాళ్లకు చెప్పేందుకే నీతులు ఉంటాయనేది.. టీడీపీ నేతల విషయంలో రుజువైంది. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపించి.... నానా హంగామా చేసే పచ్చ తమ్ముళ్లకు మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టదనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అధికారాన్ని, అధికారులను, పోలీసులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, గెలుపే లక్ష్యంగా ఎన్నో అరాచకాలు సృష్టిస్తున్నారు. అది చాలదన్నట్లు చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రిని మోపించారు. లోకేష్ నిన్న మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో పర్యటించారు. ఆ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో నాయకులు తప్ప, కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట లేకపోవడంతో పాఠశాలల విద్యార్థుల చేత బాణాసంచా మోయించారు. ఆయన పర్యటన అయ్యేంతవరకూ చిన్నారులు బాణాసంచాను తన భుజాలపై మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులతో పాటు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాకొద్దీ దిగుమతి
సాక్షి, అమరావతి: దిగుమతి అభ్యర్థులతో టీడీపీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. పక్క నియోజకవర్గం, పక్క జిల్లా, ప్రాంతం నుంచి ఆ ప్రాంత ప్రజలకు తెలియని, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చంద్రబాబు అభ్యర్థిగా పెట్టడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు. సమీకరణలు, పరిస్థితుల పేరు చెప్పి పలుచోట్ల స్థానిక నాయకులకు షాకిచ్చి కనీసం జిల్లాకు సంబంధం లేని నేతలను అభ్యర్థులుగా పెట్టడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు. కొవ్వూరులో ఆయనపై ప్రజల్లో, ఆ పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇలా చేశారు. కొవ్వూరు ప్రజలు వద్దనుకున్న నేత తమకెందుకని టీడీపీ శ్రేణులు నెత్తీనోరు కొట్టుకుంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వంగలపూడి అనితను రెండు జిల్లాలు దాటించి కొవ్వూరుకు తరలించారు. దీంతో అక్కడి టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీరామ్ మాల్యాద్రికి ఈసారి అదే జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే సీటు కేటాయించారు. వాస్తవానికి మాల్యాద్రిది నెల్లూరు జిల్లా. ఆయన గతంలో గెలిచాక నియోజకవర్గంలో ఆయన పట్టుమని పది సార్లు కూడా పర్యటించలేదు. దీంతో ఈ దిగుమతి సరుకుని ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవాలని అక్కడి నాయకులు ఒత్తిడి తేవడంతో జిల్లాలోని రాజధాని ప్రాంత నియోజకవర్గానికి మార్చారు. ఏడాదికోసారీ దక్కని గల్లా దర్శనం గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి గల్లా జయదేవ్ను గుంటూరుకు దిగుమతి చేశారు. గెలిచాక ఆయన ఒక సెలబ్రిటీలా సంవత్సరానికోసారి కూడా అక్కడి నేతలకు దర్శనం ఇవ్వలేదు. తమ కష్టాలు చెప్పుకునేందుకు గల్లా అందుబాటులో ఉండకపోవడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మళ్లీ రెండోసారి కూడా ఆయనకే గుంటూరు సీటు ఇవ్వడంతో స్థానిక నాయకులకు ఏం చేయాలో తెలియక వెర్రిచూపులు చూస్తున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ను మాల్యాద్రి స్థానంలో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎగుమతి చేశారు.తమ ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వకుండా మరో కొత్త నేతను అంటగట్టడంతో బాపట్ల క్యాడర్ నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇక తిరుపతి స్థానంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పనబాకి లక్ష్మిని పంపుతున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ స్థానికేతర ముద్రతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితి గ్రహించి తానే పక్కకు తప్పుకున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోను అదే పరిస్థితి గతంలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ను అదే జిల్లాలోని పత్తిపాడు అభ్యర్థిగా ఎంపిక చేశారు. విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ను గుడివాడ స్థానం నుంచి పోటీకి దింపారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కరణం బలరామకృష్ణమూర్తిని చీరాలకు పంపారు. ఇంకా పలుచోట్ల దిగుమతి అభ్యర్థుల్ని టీడీపీ బరిలో దింపగా వారు తమకొద్దని టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. గెలిచిన తర్వాత అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ సమస్యలు, పార్టీ వ్యవహారాలపై ఎవరిని కలవాలో తెలియడంలేదని వాపోతున్నాయి. స్థానికేతరులు అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో ఉంటోందని, వారి వల్ల తమ ప్రాంతానికి మేలు జరగదని నమ్ముతున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి. -
విజిటింగ్ ప్రొఫెసర్ గల్లా.. గుల్లే..!
సాక్షి, మంగళగిరి : విజిటింగ్ ప్రొఫెసర్లా ఏడాదికి ఒకసారి గుంటూరుకు వచ్చే గల్లా జయదేవ్ ఈసారి పరాజయదేవ్గా పేరు మార్చుకోక తప్పదని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కలిసి ఆయన నిన్న నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉన్న తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శ్రీకోదండ రామసమేత శ్రీమద్వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దుర్యోధన, దుశ్శాసనుల్లాంటి నారా లోకేష్, గల్లా జయదేవ్లకు కృష్ణార్జునుల్లాంటి మోదుగుల, ఆర్కే చేతిలో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. లోకేష్లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాలేదని, అలాంటి సచ్ఛీలుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగస్వాములమై పోటీ చేస్తున్న ఆర్కేతో తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే మాట్లాడుతూ లోకేష్కి మంగళగిరి నియోజకవర్గ సరిహద్దులు తెలుసా? మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నానని చెప్పుకుంటున్న లోకేష్ ఏ రోజైనా మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో తాగునీరు వస్తుందా అని ప్రజలను అడగడం కానీ, అధికారులతో సమీక్ష కానీ చేశారా అని ప్రశ్నించారు. చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి అభివృద్ధికి ఏఏ ప్రాజెక్టుకి ఎంత కావాలో విపులంగా జాబితా తయారుచేసి, రూ.7కోట్లు నిధులు కావాలని లోకేష్ బాబుని అడిగానో లేదో ఇంటికి వెళ్లి రాత్రికి కనుక్కోవాలన్నారు. రూ.7కోట్లు నిధులు కావాలని విజయవాడ సీఎం క్యాంపు ఆఫీసులో చంద్రబాబును కలిస్తే మీరు వైఎస్సార్ సీపీ తరఫున గెలిచారు, మేం నిధులు ఇవ్వం అని చెప్పడం తెలియదా? తెలియకపోతే లోకేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు కొబ్బరికాయలతో, టెంకాయలతో అభ్యర్థులకు దిష్టితీయగా, మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి హారతులతో స్వాగతం పలికారు. -
శ్రీమంతుడి సవతి ప్రేమ
‘అనంతవరప్పాడు గ్రామాభివృద్ధి చరిత్రలో ఓ నూతన అధ్యాయం. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా చేశారు..’ ఇదీ ఎంపీ గల్లా జయదేవ్ దత్తత తీసుకున్న వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామాభివృద్ధిపై సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ‘సాక్షి’ ఆ గ్రామానికి వెళ్లగా పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. గ్రామస్తులను పలకరించగా.. బీసీలు నివసించే కాలనీలో సీసీ రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీలు, ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టలేదని ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామ జనాభా సుమారు 5 వేలు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈ గ్రామాన్ని 2014లో ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కింద దత్తత తీసుకున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమా తరహాలో తమ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశపడ్డారు. ఐదేళ్లు గడిచిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. గ్రామంలోని బీసీ కాలనీలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. పలుచోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా.. బీసీ కాలనీలో మాత్రం ఇవేమీ చేయలేదు. వీటి నిర్మాణానికి ఎంపీ గల్లా శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. వీళ్లంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే అక్కసుతోనే పట్టించుకోలేదని బీసీ కాలనీ వాసులు వాపోతున్నారు. ఎస్సీ కాలనీ నిర్లక్ష్యానికి గురైంది. ఎస్టీలు దుర్భర స్థితిలో బతుకీడుస్తున్నారు. ఊరి బయలే గుడారాలు అనంతవరప్పాడులో సుమారు 50 వరకూ ఎస్టీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కనీస అవసరాలు తీరే పరిస్థితి లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో ఎస్టీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టిస్తామని ఎంపీ వాగ్దానం చేశారు. ఆ హామీ నెరవేరకపోవటంతో ఎస్టీ కుటుంబాలు నేటికీ ఊరిబయట గుడారాల్లోనే బతుకీడుస్తున్నాయి. ఆ ప్రాంతానికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. అభివృద్ధికి ఆమడ దూరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించటం లేదు. ఎస్సీల్లో ఎవరైనా మరణిస్తే.. మృతదేహాన్ని ఖననం చేయడానికి కూడా దిక్కులేదు. శ్మశానం కోసం స్థలం కేటాయించాలని ఎంపీ గల్లా జయదేవ్ దృష్టికి తీసుకువెళ్లగా.. పట్టించుకోలేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజున పాఠశాలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన ఎంపీ ఈ ఊసే మర్చిపోయారని వాపోయారు. బేతపూడిలోనూ అదే దుస్థితి ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామాన్ని 2017 జనవరిలో ఎంపీ దత్తత తీసుకున్నారు. కానీ.. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. 5,700 జనాభా ఉన్న బేతపూడిలో 3,025 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినా.. అది అలంకార ప్రాయంగానే మారింది. ఇప్పటికీ అందులో నీరు నింపలేదు. చైతన్య నగర్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వైఎస్సార్ హయాంలో వేసిన ఒక్క సీసీ రోడ్డు మాత్రమే ఉంది. ఆ తరువాత ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు. 300 మంది ఓటర్లున్న చైతన్యనగర్లో ఎక్కువ భాగం వైఎస్సార్ సీపీ అభిమానులు ఉన్నందునే పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. చుట్టపు చూపుగా అయినా రాలేదు ఎంపీ జయదేవ్ దత్తత తీసుకున్న గ్రామాలకు చుట్టపు చూపుగా కూడా వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. నాలుగైదుసార్లు కూడా గ్రామాలకు పోలేదంటే అతిశయోక్తి కాదు. దత్తత గ్రామాలను విస్మరించిన ఎంపీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారో చూస్తామని, ఓటుతోనే సమాధానం చెబుతామని అక్కడి ఓటర్లు అంటున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమనే.. మా కాలనీలో నివసిస్తున్న వారంతా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే ఇక్కడ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించకుండా ఆపేశారు. ఎంపీ దత్తత తీసుకున్నా మా సమస్యలు తీరలేదు. –బి.రామ్మూర్తి, బీసీ కాలనీ వాసి, అనంతవరప్పాడు పొలం గట్లను ఆశ్రయిస్తున్నాం నాలుగేళ్ల క్రితం ఎంపీ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎస్సీలకు శ్మశాన వాటిక స్థలం కావాలని కోరాం. నేటికీ మంజూరు చేయలేదు. ఎవరైనా మరణిస్తే పొలం గట్లమీద ఖననం చేస్తున్నాం. మండల పరిషత్ పాఠశాలనూ అభివృద్ధి చేయలేదు.– కొమ్మనూరి లక్ష్మణరావు,ఎస్సీ కాలనీ వాసి, అనంతవరప్పాడు చిన్నచూపు చూస్తున్నారు ఎంపీ దత్తత తీసుకున్న గ్రామం అయినా అభివృద్ధికి నోచుకోలేదు. వైఎస్సార్ సీపీ అభిమానులమని మా కాలనీల్లో రోడ్లు వేయలేదు. మా సమస్యల్ని గ్రామదర్శినిలో అధికారులకు చెప్పుకోడానికి వెళితే అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎస్సీలంటే చిన్నచూపు చూస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతాం. – జి.ఏడుకొండలు, ఎస్సీ కాలనీ, అనంతవరప్పాడు తాగునీటి సమస్యతో సతమతం బేతపూడిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పట్టించుకునే నాథుడే లేడు. కొత్తగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ అలంకార ప్రాయంగా మారింది. ఎంపీ దత్తత తీసుకుంటే గ్రామంలో సమస్యలు తీరతాయని ఆశపడ్డాం. కానీ ఏం లాభం లేదు. – షేక్ ఖాజావలి, బేతపూడి ఎన్నికలప్పుడే గుర్తొస్తాం ఎన్నికలొస్తేనే నాయకులకు మేం గుర్తొస్తాం. మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న ఎంపీ కనీసం అప్పుడప్పుడైనా వచ్చిన పాపాన పోలేదు. రోడ్లు, డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ మాత్రం అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకోవడం ఎందుకు. పత్రికల్లో ప్రచారం చేసుకోవడం తప్ప. – షేక్జాకీర్, బేతపూడి -
మోదుగుల టీడీపీని వీడినట్లే
సాక్షి, నగరంపాలెం(గుంటూరు): గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీని వీడినట్లేనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న ఆశావహులు, పార్టీ నగర నేతలతో ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ.. మోదుగుల వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. (ఎంపీని తెచ్చి ఎమ్మెల్యేను చేశారు.. ఇప్పుడేమో..!!) నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేతలను విస్మరించి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారికే పార్టీ, నామినేటెడ్ పదవులకు సిఫార్సు చేశారన్నారు. దీనిపై గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే కావటంతో మోదుగుల వైఖరిని సహించాల్సి వచ్చిందని వివరించారు. సీఎం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు సైతం మోదుగుల రాకపోవటంతో పార్టీని వీడుతునట్లు స్పష్టమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో అందరిని కలుపుకొనిపోయే అభ్యర్థినే అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుబ్బారావు పాల్గొన్నారు. -
తెరుచుకోని ‘గల్లా’ పెట్టె
సాక్షి, అమరావతి బ్యూరో: కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని కూడా ఖర్చు చేసే తీరిక లేనంత బిజీగా ఎంపీ గల్లా ఉండటంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో పలు సమస్యలు తిష్ట వేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటు సభ్యులకు వారి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసేందుకు కేంద్రం ఏటా రూ.5 కోట్లు కేటాయిస్తోంది. ఇందులో 80 శాతం ఖర్చు చేస్తేనే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 5 కోట్లను విడుదల చేస్తారు. అయితే, విజిటింగ్ ప్రొఫెసర్గా అప్పుడప్పుడు నియోజక వర్గానికి వచ్చే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కు , కేంద్రం ప్రభుత్వం ఏటా ఇచ్చే నిధుల్ని ఖర్చు చేసే తీరిక లేదు. దీంతో 2017–18కి ఆగిపోయాయి. దీని ప్రభావం 2018–19 ఆర్థిక సంవత్సరంపై కూడా పడుతోంది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలకు సంబంధించి రూ.10 కోట్లు మురిగి పోయే అవకాశం ఉంది. ఎంపీ నిర్లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు ప్రజలకు చేరువ కాకుండా పోయే ప్రమాదముంది. ఎంపీగా గల్లా జయదేవ్ పూర్తిగా విఫలం అయ్యారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చుట్టం చూపుగా పర్యటనలు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పటికీ, పెద్దగా నియోజక వర్గం పై దృష్టి సారించలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. పార్లమెంటు పరిధిలో సమస్యల గురించి పట్టించుకోకుండా ఏదో చుట్టపు చూపుగా వచ్చి వెళుతూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో జరిగే అధికారిక సమావేశాలకు సైతం ఆయన హాజరుకావడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ అనధికారికంగా తల్లి గల్లా అరుణకు బాధ్యతలు అప్పజెప్పడంపై స్థా¯నిక నేతల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిధులు ఇవ్వటం లేదని కుంటి సాకులు చెప్పే టీడీపీ నాయకులు... తమకు కేటాయించే పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని ఖర్చు చేయడంలో ఎందుకు విఫలం అయ్యారో చెప్పాలని పలువురు నిలదీస్తున్నారు. పనుల గురించి పట్టించుకునే నాథుడే లేడు 15వ పార్లమెంటుకు సంబంధించి మిగలు నిధులు రూ. 1.73 కోట్లను 2014–15 సంవత్సరానికి అదనంగా కేటాయించారు. ఇప్పటికి ఎంపీ గల్లా జయదేవ్ 622 పనులను మంజూరు చేయగా, వాటిలో ఇంకా 277 పనులు పూర్తి కాలేదు. 2104–15లో మంజూరు అయిన పనులు సైతం ఇప్పటికి సాగుతున్నాయి. ఏ దశలో ఉన్నాయో ఇప్పటికీ కనీసం అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఆ పనుల గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. ఎంపీ శ్రద్ధ చూపితే ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఆయన నిర్లక్ష్యం నియోజక వర్గం పాలిట శాపంగా మారింది. ఎలక్షన్ కోడ్ ముంచుకొస్తున్న ఈ సమయంలోనైనా ఎంపీ స్పందించి అభివృద్ధి పనులవైపు దృష్టి సారించి, కోటా నిధుల్ని ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ ప్రజలు కోరుతున్నారు. -
మహేష్ మేనల్లుడి సినిమా ప్రారంభం
-
సూపర్ స్టార్ వారసుడి సినిమాలో నభా
డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అశోక్ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను స్టార్ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో అశోక్ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాలో అశోక్కు జోడిగా నన్ను దోచుకుందువటే ఫేం నభా నటేష్ తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దరశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘ఆ మాటలను వెంటనే వాపసు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరులను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట విభజన అనైతికం అనే వ్యాఖ్యలు వెంటనే వాపసు తీసుకోని, వివరన ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మోదీ స్పీచ్ 2019 ఎన్నికల స్పీచ్లా ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న అనేక సమస్యలు, 2014లో మోదీ ఇచ్చిన హామీ అంశాలు ప్రస్తావించలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్ గురించి మోదీ మాట్లడం మరిచారని విమర్శించారు. రాహుల్ గాంధీ పరిణితి చెందిన రాజకీయాలు చేస్తారన్నారు. నిజాలను పార్లమెంట్ వేదికగా ప్రజలముందు ఉంచిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. విభజన హామీలను సాధించడంలో చంద్రబాబు, కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. -
హోదాపై కేంద్రం అసత్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ కేంద్రం అసత్యాలు చెబుతోందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇచ్చిన హామీని విస్మరించిన వ్యక్తి ఎన్నటికీ మనిషి కాలేడని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమాను ప్రస్తావించారు. ‘విభజన పాపంలో బీజేపీకి సగం వాటా ఉంది. నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా? ప్రత్యేక హోదా ఐదు కాదు..పదేళ్లు ఇస్తామంటూ తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్కు నిర్మిస్తామని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని నాడు మోదీ మాటిచ్చారు. చివరికి అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు మాత్రం ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు రూ.3,000 కోట్లు, ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఖర్చు పెడతారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.6 వేల కోట్లే ఇచ్చారు’ అని అన్నారు. ‘మోసగాడు’ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా.. ప్రధాని మోదీ మోసగాడు అంటూ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అనడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శివప్రసాద్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి సీతారామన్ ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. సమీక్షించనేలేదు: రామ్మోహన్ విభజన చట్టం అమలుపై కేంద్రం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో విలాసవంతమైన కార్యాలయాన్ని కట్టుకున్న బీజేపీ నాలుగేళ్లు అయినా ఏపీలో కేంద్ర సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. చట్టంలో హోదా లేదంటున్న బీజేపీ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో ఎలా కలిపారో అలా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
జగన్ మాటే.. జయదేవ్ నోట
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసగిస్తున్న వైనాన్ని మూడేళ్ల క్రితం అసెంబ్లీలో ఎలుగెత్తిన సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలనే శుక్రవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొనటం గమనార్హం. జయదేవ్ మాట్లాడిన విషయాలను గమనిస్తే ముందు నుంచి హోదా విషయంలో మడమతిప్పని వైఎస్సార్ సీపీ వైఖరినే అనుసరించినట్లైంది. అలాగే చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాకు 14 ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వచ్చాయని మోదీ చెప్పడం సరికాదన్నారు. హోదా రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు.. 2015 సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి హోదా సాధించుకోవడంలో టీడీపీ సర్కారు మెతక వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ఇదే సమయంలో కేంద్రం చేస్తున్న మోసాన్ని కూడా ప్రస్తావించారు. ‘ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అసలు ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు..’ అని వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆధారాలతో సహా వివరించారు. ‘ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సూచించలేదని కమిషన్ సభ్యులు అభిజిత్సేన్ లేఖ రాశారు. మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు’ అని మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ శాసనసభ దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందంటూ సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని జగన్ అప్పట్లోనే తప్పుబట్టారు. మూడేళ్ల క్రితం నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అవే అంశాలను ఇప్పుడు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ జయదేవ్, మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించడం విశేషం. -
బీజేపీ-కాంగ్రెస్లతో టీడీపీ అ'విశ్వాస' డ్రామా
సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అ'విశ్వాస' బంధం కొనసాగింది. నన్ను ఏం చేయొద్దు.. నేను ఏమీ చేయను అన్న చందంగా కాంగ్రెస్-బీజేపీలతో టీడీపీ బంధం ప్రతిబింబించింది. శుక్రవారం రోజున అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేశినేని నాని బదులుగా గల్లా జయదేవ్ పార్లమెంట్లో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని చెప్పారు. అయితే రాష్ట్రానికి నిధులు, పరిశ్రమల కోసం రాయితీలు ఇవ్వడంలో దారణంగా విఫలైమందని చెప్పిన గల్లా ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పకపోవడం విశేషం. ప్రత్యేక ప్యాకేజీని అర్ధరాత్రి వేళ స్వాగతించిన తెలుగుదేశం.. హోదా కంటే ప్యాకేజీనే మేలంటూ అరుణ్ జైట్లీకి చేసిన సన్మాన కార్యక్రమం గురించి ప్రస్తావించలేదు. పైగా కేంద్రం నుంచి అందరికంటే ఎక్కువగా సాధించామని, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఈ విషయంపై కూడా గల్లా నోరు మెదపలేదు. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారని చెప్పిన గల్లా, విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం పూర్తి చేస్తామన్న పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో చెప్పలేదు. నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా టీడీపీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏనాడు బీజేపీని ప్రశ్నించలేదు. పైగా అన్నీ సాధించామంటూ జబ్బలు చరుచుకున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసే అలవాటు ఉన్న బాబు నాలుగేళ్ల తరువాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం జరిగిదంటూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే బీజేపీపై గల్లా విమర్శలు చేశారు. కానీ రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ను మాత్రం తెలుగుదేశం పల్లెత్తు మాట అనలేదు. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇస్తూ చంద్రబాబు ఇచ్చిన లేఖ విషయాన్ని ప్రస్తావించలేదు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ ప్రసంగాన్ని విన్నానని చెప్పారు. గల్లా ప్రసంగంలో ఆవేదన కనిపించిందంటూ గల్లను వెనుకేసుకొచ్చారు. పైగా 21వ శతాబ్ధంలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం అంటూ మొసలి కన్నీరు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ అంతా చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఆర్థిక లోటుతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసి.. ఇప్పుడు మాత్రం కంటి తుడుపు చర్యగా పార్లమెంట్లో తెలుగుదేశం వ్యాఖ్యలకు మద్దతుగా రెండు ముక్కలు ప్రసంగించారు. విభజన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని చట్టంలో పొందు పరచకుండా ఏపీ ప్రజల గొంతు కోశారు. ఆనాడు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్లపై సానుకూలతలు పరిశీలించాలంటూ తీర్మానాలు చేసి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే ప్రభుత్వం వాటిని అమలు చేయాలంటూ ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలను తీర్మానాల పాలు చేశారు. ఏపీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసి కూడా ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం నేడు పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కార్చింది. అనుకున్న ప్రకారం టీడీపీ, కాంగ్రెస్లు భాయ్ భాయ్ అనుకుంటూ కొత్త డ్రామాకు తెరదీశాయి. ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఏమీ అనకపోవడం గమనార్హం. పార్లమెంట్ సాక్షిగా మూడు పార్టీలు ఇలా మరోసారి తెలుగు ప్రజలను వంచన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
అవిశ్వాసంపై చర్చ: గల్లా ప్రసంగం సాగిందిలా...
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. గతంలో కాంగ్రెస్పై చేసిన విమర్శలే ఇప్పుడు బీజేపీపైనా చేయటం విశేషం. ముందుగా భరత్ అనే నేను చిత్ర కథతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించిన.. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్లారు. ‘ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన ఏపీకి తీవ్రమైన లోటు. మోదీ పాలనతో ఏపీ ఇబ్బందులకు గురయ్యింది. లక్షా 3 వేల కోట్ల రుణ భారం ఏపీపై పడింది. మేం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. విభజన చట్టాన్ని అప్రజాస్వామికంగా సభలో నెగ్గించారు. విభజనతో పాటు కేంద్రం తీరుతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయింది. ఆంధ్రపదేశ్కు రాజధాని, మౌలిక సదుపాయాలు లేవు’ అని వ్యాఖ్యానించారు. అయితే గల్లాజయ్ దేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. వెంటనే మేడమ్ స్పీకర్ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది. ... ‘ఎన్నికలకు ముందు మోదీ ఏపీకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. తెలుగు తల్లిని కాంగ్రెస్ రెండు ముక్కలు చేసిందని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా మోదీ ఏదో చేస్తారని ప్రజలు ఎదురు చూశారు. తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని మోదీ అన్నారు. హోదా ఇస్తానని ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకు ముడిపెడుతున్నారు. మోదీ మోసం చేశారని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నెల్లూరు, విశాఖ, తిరుపతి సభల్లో మోదీ ఇచ్చిన హామీలకు విలువ లేదా?.. ‘ఆర్థిక సంఘం సాకు చూపి ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడం సరికాదు. ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఆర్థిక సంఘం సభ్యులు ఇచ్చారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదు. ఇది దేశాన్ని, ప్రజలను పక్కదారి పట్టించడమేనని భావిస్తున్నాం. ఏపీకి హోదా ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నారు. సభలో ఒక మాట.. బయట ఒక మాట్లాడటం సరికాదు’. మార్చి 15, 2018న హోదా గురించి రాజ్యసభలో మంత్రి అభిజిత్ మాట్లాడారు కూడా. హోదా ఇస్తానని మ్యానిఫెస్టోలో చెప్పిన బీజేపీ మొండిచేయి చూపించింది. హోదా కావాలని మేము అడిగితే.. దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నారు’..‘పరిశ్రమలకు రాయితీలు ఇస్తామన్నారు.. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామన్నారు.. అది నామమాత్రమే. ఏపీ సంబంధించిన విషయాలు ప్రధాని కార్యాలయంలో ఆగిపోయాయి.’ మోదీపై సంచలన వ్యాఖ్యలు... ‘ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి నిధులిస్తామన్న కేంద్రం హామీ ఏమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఎన్నో నిధులు రావాలి. ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని మోదీ చెప్పారు. రూ. 1500 కోట్లతో రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది??.ఇప్పుడు నిధులు లేమితో ఇబ్బందులు వస్తున్నాయి... అయితే మరోసారి టీఆర్ఎంపీలు ప్రసంగానికి అడ్డుపడ్డారు. మళ్లీ స్పీకర్ వారించటంతో ఆయన ప్రసంగం తిరిగి కొనసాగింది. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. -
126 : 325 : వీగిన అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ సాగింది. సుదీర్ఘ చర్చ, సమాధానం అనంతరం రాత్రి 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వీస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు. విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సమాధానంలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చకు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా మోదీ సమాధానమిచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన మరోవైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రధాని ప్రసంగం తర్వాత రైట్ టు రిప్లీ కింద టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా, 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అందరికి బీమా, రైతుల్లో భరోసా నింపడానికి కిసాన్ భరోసా వంటి పథకాలను వివరిస్తూ త్వరలోనే ఆయుష్మాన్ భారత్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు చర్చలో పాల్గొన్న సభ్యులు లేవనెత్తిన పలు అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి సమాధానం ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు కొత్త డ్రామా మొదలు పెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగ సమయంలో చంద్రబాబు తమకు మిత్రుడని అన్నప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన టీడీపీ ఎంపీలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు డైరెక్షన్లో మరో డ్రామాకు తెరలేపారు. ప్రధాని మోదీ ప్రసంగం చేస్తుండగా పోడియం వద్ద కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తూ టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను బయటపెట్టారు. ప్యాకేజీ ఒప్పుకున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని టీడీపీ అంగీకరించిన తర్వాతే ప్యాకేజీ ప్రకటించినట్టు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు సమాధానంగా మాట్లాడుతూ, ఆయన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అంశాలను ప్రస్తావించారు. ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత ప్రకటించామని, ఇప్పుడు టీడీపీయే యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఉచ్చులో పడొద్దని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో కొద్ది రోజుల కిందట తాను చంద్రబాబుతోమాట్లాడినట్టు చెప్పారు. మోదీ తన సుదీర్ఘప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరించారు. 14 వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు టీడీపీ దాన్ని స్వాగతించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని చంద్రబాబు అంగీకరించిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించినట్టు వెల్లడించడంతో టీడీపీ ఎంపీలు ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో అర్థంకాక న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్థించారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని, విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ తీర్మానం ద్వారా అందరి నిజస్వరూపాలు బయటపడ్డాయన్నారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోందన్నారు. నావికుడు లేని పడవలా ప్రతిపక్షాల పయనం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు దేశంలోని ఏ వ్యవస్థపైనా నమ్మం లేదని, ఆఖరికి ఈవీఎం, రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అవినీతిపై బాణం ఎక్కువ పెట్టిన వెంటనే వారికి ఇబ్బంది మొదలైందని ధ్వజమెత్తారు. 2024లో కూడా వారికి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. రాఫెల్ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారు..సర్జికల్ స్ట్రైక్స్ కూడా రాజకీయం చేశారు.. చైనా రాయబారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కలవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్ను ఆదాచేసేందుకు దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశాం..ఇంకా చేస్తున్నామని వివరించారు. అంతకుముందు జరిగిన చర్చలో అన్ని పార్టీల నేతలు ప్రసంగించారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని కేంద్రాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు. మూక దాడులు ఇప్పటివి కావని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోందన్న రాజ్నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. అంతకు ముందు రాజ్నాథ్ మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చర్చ కొనసాగుతోంది. లోక్ సభలో రాహుల్ ప్రవర్తించిన తీరును లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తన విమర్శనాస్త్రాలను కొనసాగించారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకెళ్లి ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. నేటి ఉదయం తీర్మానంపై మొదట చర్చను టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించగా.. అనంతరం బీజేపీ తరపున జబల్పూర్ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి శాపగ్రస్థమైందన్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చను కొనసాగిస్తూ, బీజేపీ, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చర్చలు ఎందుకు జరపరు? కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని ఆయన ప్రశ్నించారు. హిందు, ముస్లిం గొడవలతో మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామన్నారు. ‘నేను భారతీయుడిని. ఇదే గడ్డపై పుట్టా. ఇక్కడే చనిపోతా’ అని చెప్పారు. కశ్మీర్పై కేంద్రం వైఖరి ఏంటి? ముస్లింలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కశ్మీర్పై కేంద్రం వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. మూక దాడులు ఇప్పటివి కావని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాదులే కాదు సైనికులు చనిపోతున్నారని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసిన హరిబాబు.. ‘కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకండా పోరాడారు. కానీ నిస్సిగ్గుగా నేడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’అని చెప్పిన బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అవిశ్వాసంపై టీడీపీని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు... కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్గా చెప్పుకుంటోందన్న రాజ్నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. ప్రజల సమస్యల గురించి అడిగితే పురాణాలు చెప్పారని ఎద్దేవా చేశారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరకమన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ విభజించి పాలించు సూత్రాలను పాటిస్తున్నారని మండిపడ్డారు. నోరు మెదపని టీడీపీ ఎంపీలు!.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్సభలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది.. లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు. లోక్సభ మళ్లీ ప్రారంభం దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారని, విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభను సాయంత్రం 4:30 గంటల వరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతం సభ మళ్లీ ప్రారంభమైంది. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..? - నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తోందని సమాద్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఇచ్చిన హామీ ఏమైందని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ పాలనపై రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వమూ అన్ని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్.. కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, మోదీ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయమే తమకు నచ్చలేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో సరైన సమాచారం లేదన్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. కాగా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాలతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందాలు చేసుకుని 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తూ ముందుకు సాగుతున్నారని’ఎంపీ వినోద్ వివరించారు. ‘రఫెల్’పై వివరణ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రఫెల్ డీల్ ఆరోపణలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘రఫెల్ ఒప్పందం యూపీఏ హయాంలోనే జరిగింది. ఆ సమయంలో ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒప్పంద వివరాలు బయటపెట్టొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే వెల్లడించటం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రధాని మాటకు విలువ ఉండాలి... ‘గల్లా స్పీచ్ విన్నాను. 21వ శతాబ్ధంలో అతిపెద్ద రాజకీయ బాధితురాలు ఆంధ్ర ప్రదేశ్. జీఎస్టీ మేం తెస్తామంటే వద్దన్నారు. ఐదు శ్లాబ్ల్లో వాళ్లు(బీజేపీ ప్రభుత్వం) తీసుకొచ్చారు. దేశానికి సేవకుడిగా ఉంటానని మోదీ.. పేదల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆయన కళ్లకు వ్యాపారవేత్తలే కనిపిస్తారు. వారికి లబ్ధి చేకూరేలానే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగమే నోట్ల రద్దు. కనీసం నా కళ్లలోకి చూసి కూడా మాట్లాడే స్థితిలో మోదీ లేరు(వెంటనే ప్రధాని చిరునవ్వులు చిందించారు)’ అంటూ రాహుల్ ఏకిపడేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసి రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగగా.. సభ పది నిమిషాలు వాయిదా పడింది. టీడీపీ శాపగ్రస్థురాలైంది... అవిశ్వాసానికి వ్యతిరేకంగా అధికార పక్షం తరపున ఎంపీ రాకేష్ సింగ్ చర్చ ప్రారంభించారు. ‘గతంలోనూ చాలాసార్లు అవిశ్వాసం పెట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్తో కలిసి టీడీపీ అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్థురాలైన కాంగ్రెస్తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్తో చేతులు కలపడం వల్ల టీడీపీ కూడా శాపగ్రస్థురాలైంది. టీడీపీ మాకు శాపనార్థాలు పెడుతోందా?.. అసలు గల్లా జయదేవ్ పూర్తి ప్రసంగం వింటే అవిశ్వాస తీర్మానం అవసరం లేదనిపిస్తోంది. మోదీ పాలనలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. పేద ప్రజల అభ్యున్నతికి బీజేపీ పాటు పడుతోంది.’ అని రాకేష్ సింగ్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత్కు విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ను కొత్త శక్తిగా గుర్తిస్తున్నాయి. ఉజ్వల పథకంతో 8 కోట్ల మంది మహిళలకు లబ్ధి. నెలకు ఒక్క రూపాయితో 2 లక్షల బీమా కవరేజ్. రోజుకు 90 పైసలతో జీవన్ జ్యోతి యోజన పథకం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టలేదు. మోదీని ఎలాగోలా అడ్డుకోవాలనే తపనతోనే అవిశ్వాసం. కొందరి లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దు... గల్లాపై సీతారామన్ ఆగ్రహం.. ప్రసంగం కొనసాగించిన వేళ ప్రధానిని ఉద్దేశించి మోసగాడు అని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సీటులోంచి లేచి టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను ఆమె కోరారు. మరోవైపు అప్రజాస్వామికంగా తెలుగు రాష్ట్రాలను విభజించారన్న గల్లా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరగా.. పరిశీలిస్తామని మేడమ్ స్పీకర్ చెప్పటంతో జితేందర్ రెడ్డి శాంతించారు. గల్లా జయదేవ్ ప్రసంగం... సుమారు గంటపాటు ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పాత విషయాలనే చెప్పుకురావటం గమనార్హం. గతంలో కాంగ్రెస్పై చేసిన కామెంట్లనే.. ఇప్పుడు ఆయన బీజేపీపై చేశారు. అయితే రాష్ట్రాన్ని అప్రజాస్వామిక్యంగా విభజించారన్న వ్యాఖ్యపై టీఆర్ఎస్ భగ్గుమంది. ఒకానోక దశలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లే యత్నం చేయగా.. స్పీకర్ వారించటంతో సభ సర్దుమణిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాంగ్రెస్ అభ్యంతరాలు.. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘కాంగ్రెస్కు 38 నిమిషాలే ఇచ్చారు. సభలో ఏం జరగబోతుందోనని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అవసరమైతే అవిశ్వాసంపై చర్చ మూడురోజులపాటు సాగాలి’ అని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అనంతకుమార్ సెటైర్లు.. వన్డే మ్యాచ్ల కాలంలో టెస్ట్ మ్యాచ్లు ఆడతామనటం సరికాదు అంటూ విపక్షాల అవిశ్వాస చర్చపై బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే సెటైర్లు పేల్చారు. అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు. బీజేడీ వాకౌట్... లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది.ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. ప్రారంభమైన లోక్సభ... సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సాయంత్రం 6గంటల వరకు చర్చ కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. -
వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ
సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. తమ మాటలను మార్ఫింగ్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
సూపర్స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో!
సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేశ్ బాబు, మహేశ్ బాబు, మంజుల, సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే ఇందులో మహేశ్ బాబు మాత్రమే సూపర్స్టార్గా నిరూపించుకున్నారు. రమేశ్బాబు ఎప్పుడో సినిమాలు చేయడం ఆపేశారు. మంజుల ఇటీవలే ‘మనసుకు నచ్చింది’ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ అది నిరాశ పరిచింది. సుధీర్ బాబు తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు. ప్రస్తుతం సుధీర్బాబు ‘సమ్మోహనం’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే వీరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడి ఎంట్రీ ఖరారైంది. మహేశ్ బాబు బావ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లాను వెండితెరకు పరిచయం చేయనున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలు.. ఇది ఒక టర్కిష్ మూవీకి రీమేక్గా తెరకెక్కుతోంది. ఇక్కడి నేటివిటికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ‘ఆడు మగాడ్రా బుజ్టి’ డైరెక్టర్ క్రిష్ణారెడ్డి దర్శకత్వం వహించగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఐవానా ఫాలో ఫాలో ఫాలో యు
అదేంటీ మహేశ్బాబు ఫొటో పెట్టి, ఎన్టీఆర్ సాంగ్ రాశారేంటి అనుకుంటున్నారా? మేటర్లోకి వెళ్తే మీకే అర్థం అవుతుంది. మహేశ్ ట్వీటర్లో ఎంత యాక్టీవ్గా ఉంటారో మనందరికీ తెలిసిందే. సినిమా అప్డేట్స్ దగ్గర నుంచి వాళ్ల పిల్లలు గౌతమ్, సితార ఫొటోల దాకా అన్నీ అభిమానులతో పంచుకుంటుంటారు మహేశ్. లక్షలమంది అభిమానులు ఆయన్ను ఫాలో అవుతుంటారు. ఇటీవలే 6 మిలియన్ (60 లక్షలు) ఫాలోవర్స్ను టచ్ చేశారు ఆయన. కానీ మహేశ్ మాత్రం తన బావ గల్లా జయదేవ్ను మాత్రమే ఫాలో అవుతారు. మహేశ్ ట్వీటర్ ఖాతా తెరిచినప్పటినుంచి కేవలం తన బావని మాత్రమే ఫాలో అయ్యారు. ఇప్పుడు మరొకర్ని కూడా ఫాలో అవుతున్నారు. ఈ రెండో వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా? మహేశ్కు ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. మహేశ్ కెరీర్లో హిట్స్ కచ్చితంగా డెలివర్ చేయాల్సిన ప్రతిసారీ కొరటాల శివ సినిమా హిట్ అందించారు. సో.. ఆ అభిమానంతోనే కొరటాల శివను మహేశ్ ఫాలో ఫాలో అవుతున్నారని ఊహించవచ్చు. -
మహేశ్ బాబు లిస్ట్లో ఆ ఇద్దరు!
సూపర్స్టార్ మహేశ్ బాబు యమ హ్యాపీగా ఉన్నాడనీ ఇట్టే అర్థమైపోతోంది. సక్సెస్ మీట్లో భావోద్వేగంగా మాట్లాడటం, కొరటాల శివను హత్తుకోవడం, తన శ్రీమతి నమ్రతను ముద్దుపెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇవన్నీ చూస్తే మహేశ్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుస్తోంది. రెండు భారీ డిజాస్టర్స్ తరువాత కసితో తీసిన ‘భరత్ అనే నేను’ సినిమా సూపర్హిట్ టాక్తో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. గతంలో శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మళ్లీ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. మహేశ్ను ట్వీటర్లో ఎంతో మంది ఫాలో అవుతున్నా...మహేశ్ మాత్రం ఇంతకాలం ఒక్కడినే ఫాలో అయ్యేవాడు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్. అంటే తన మనసులో ఎంతో ప్రేమ ఉంటే తప్ప ట్వీటర్లో ఫాలో అయ్యేవాడు కాదని తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొత్తగా ఒక పేరు వచ్చి చేరింది. అది ఎవరూ అనేది ఈపాటికే తెలిసుంటుంది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో మళ్లీ పీక్స్లో నిలబెట్టిన దర్శకుడు కొరటాల శివనే మహేశ్ ఫాలో అవుతున్న రెండో వ్యక్తి. సో...మహేశ్కు కొరటాల అంటే ఎంత ప్రేమనో చెప్పకనే చెప్పాడు కదా. -
మీడియాపై ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం
-
మీడియాపై ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం
సాక్షి, అమరావతి : టీడీపీ గల్లా జయదేవ్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి సాధించారని సన్మానాలు చేయించుకున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ను పక్కదోవ పట్టించవద్దన్న ఎంపీ గల్లా జయదేవ్ ... మీరు మాకు సన్మానం చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. తాను ఎక్కడా సన్మానాలు చేయించుకోలేదని, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో చేశారని, దాన్ని తాము కాదనలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. సీఎంతో టీడీపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో టీడీపీ పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఎంపీల ఒక్కొక్కరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. -
‘జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్’
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. టీడీపీ తమకు కటీఫ్ చెప్పినా అభ్యంతరం లేదని బీజేపీ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా కృష్ణమోహన్, యువమోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రాంప్రసాద్ వ్యాఖ్యానించారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘మాతో రాంరాం అనుకుంటే రాంరామే. ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే మేమూ చేస్తాం. అందుకు కావాల్సిన ఆయుధాలు కూడా మా దగ్గర ఉన్నాయి. టీడీపీ నేతలు తమ భాషను మృదువుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంద’ని అన్నారు. ఏం సాధించారని సన్మానం.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏం సాధించారని సన్మానం చేస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన్ను విజిటింగ్ ఫ్రొఫెసర్ అని పిలుస్తారని ఎద్దేవా చేశారు. అవకాశమెస్తే జయదేవ్ కన్నా తాము ఇంకా బాగా మాట్లాడగలమన్నారు. -
టీడీపీలో ‘గల్లా’ కలకలం!
సాక్షి, అమరావతి: టీడీపీలో ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం కలకలం రేపింది. అధికార పార్టీ ఎంపీల మధ్య విభేదాలు టీడీపీ అధినేత చంద్రబాబు సాక్షిగా బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న ఎంపీలతో ఆదివారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కృష్ణా జిల్లా ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హజరయ్యారు. విజయవాడలో ఉన్నప్పటికీ కేశినేని నాని సమావేశానికి రాలేదు. గల్లా జయదేవ్కు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితోనే వీరు సమావేశానికి గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గీయులుగా ముద్రపడిన కేశినేని, నారాయణరావు సమావేశానికి రాకపోవడంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. హంగామా అవసరమా..? మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుతో కలిసి చేసిన హంగామా చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమీ సాధించకుండానే విజయోత్సవాలు నిర్వహించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని సరి చేసేందుకు కేంద్రం ఎటువంటి హామీలు ఇవ్వనప్పటికీ, ఏదో సాధించినట్టు టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయకపోయినా సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీల్లో చెలరేగిన అసంతృప్తి ఏవిధంగా మారుతుందోన్న చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై మిత్రపక్షంగా తాము అసంతృప్తిగా ఉన్నామంటూనే టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం కొసమెరుపు. -
టీడీపీ ఎంపీల విజయోత్సవ ర్యాలీలు.. విస్తుపోయిన జనం!
సాక్షి, అమరావతి : పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గుంటూరు, మంగళగిరిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు జయజయధ్వానాలతో వీరికి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ఎంపీల సంబరాలను చూసి జనం విస్తుపోతున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదాపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది కూడా ఏమీ లేదు. ఈ విషయమై పార్లమెంటు వేదికగా ఆందోళన డ్రామాలు నిర్వహించిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా.. సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఎంపీ గల్లా జయదేశ్ ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంటులో ప్రసంగించారు. హోదాకు బదులు ప్యాకేజీ కావాలని ఆయన కోరారు. గల్లా జయదేవ్ బాగా ప్రసంగించారంటూ టీడీపీ నేతలు ప్రశంసిస్తుండటం గమనార్హం. పార్లమెంటులో నాలుగురోజులపాటు ఆందోళనల పేరిట హైడ్రామా నడిపిన టీడీపీ ఎంపీలు.. ఇప్పుడు కేంద్రం తీరుపై నోరు మెదపడం లేదు. అంతేకాకుండా కేంద్రం దగ్గర అన్నీ సాధించామన్నట్టుగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. టీడీపీ ఎంపీల తీరును చూసి జనం ఇదేమి చోద్యమని విస్తుపోతున్నారు. -
టీడీపీ ఎంపీల విజయోత్సవ ర్యాలీలు,సర్వత్రా విస్మయం
-
ఏపీ సీఎం అసమర్థుడు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం బడ్జెట్పై చర్చలో గల్లా జయదేవ్ వైఎస్సార్సీపీపై దూషణలతో ప్రసంగం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి సభలోకి వచ్చి జయదేవ్ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఆ వెంటనే స్పీకర్ను కలిసి ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. బడ్జెట్పై చర్చలో భాగంగా తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో వరప్రసాదరావుకు అవకాశం కల్పించారు. ‘‘టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో మా పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా జరిగి ఉంటే సిల్లీ కారణాలపై 16 నెలలు జైల్లో ఉండేవారు కాదు. ఒక వ్యక్తి ఇక్కడ లేనప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతారు? ఇది పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధం. ఆ వ్యాఖ్యలను స్పీకర్ తొలగించాలి..’’ అని వరప్రసాదరావు కోరారు. దీనికి వెంటనే సభాపతి స్థానంలో ఉన్న ఉపసభాపతి స్పందిస్తూ.. అన్పార్లమెంటరీ పదాలు ఉంటే వాటిని తొలగిస్తామని ప్రకటన చేశారు. ఆ తర్వాత వరప్రసాదరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘ఏపీ ముఖ్యమంత్రి పూర్తిగా అసమర్థుడు. నాలుగేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయారు’’ అని మండిపడ్డారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ తప్పు పట్టిందని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఇల్లు ఖాళీ చేయించడంలో ఉద్రిక్తత
బ్యాంకు వేలంలో ఇల్లు కొన్న ఎంపీ గల్లా జయదేవ్ పట్నంబజారు (గుంటూరు): గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రాబ్యాంకు వేలంలో కొనుగోలు చేసిన ఇంటిని అధికారులు ఖాళీ చేయించే విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో గుంటుపల్లి శ్రీనివాస్ వ్యాపారం నిమిత్తం ఆంధ్రాబ్యాంకులో రూ.2.50 కోట్ల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చకపోవడంతో గత జూన్లో బ్యాంకు అధికారులు ఆయన ఇంటిని వేలం వేశారు. అప్పటికే ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎంపీ జయదేవ్ రూ.3.09 కోట్లకు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబాన్ని ఆ ఇంట్లోంచి ఖాళీ చేయించాలని అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా వారు ఖాళీ చేయకపోవడంతో శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బ్యాంకు అధికారులు.. పోలీసు, రెవెన్యూ అధికారుల సాయంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ భార్య పద్మ తనకుమారుడు సమంత్తో పాటు రెండు లీటర్ల పెట్రోల్ తీసుకుని గదిలోకెళ్లి తలుపులు వేసుకు న్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెనుకాడబోమని చెప్పారు.దీంతో అధికారులు ఆందోళన చెందారు. చివరకు శ్రీనివాస్ తండ్రి పూర్ణచంద్రరావు సర్దిచెప్పడంతో పద్మ బయటకు వచ్చారు. అధికారులు ఇంటిని సీజ్ చేశారు. -
సూపర్ స్టార్ వారసుడిగా మరో హీరో
డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. దాదాపు 30 దశాబ్దాలకు పైగా వెండితెరపై మెరిసిన ఈ సూపర్ స్టార్ తరువాత తన వారసుడిగా మహేష్ బాబును పరిచయం చేశాడు. ఆ తరువత కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ కృష్ణలు వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా మరో అందాల నటుడు ఈ ఫ్యామిలీ నుంచి తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, ప్రముఖ వ్యాపార వేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ల కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్న అశోక్ సరైన కథ కోసం ఎదురుచూస్తున్నాడట. తమ సొంత బ్యానర్ లోనే అశోక్ ఎంట్రీ ఉంటుందని గల్లా జయదేవ్ కూడా ప్రకటించటంతో.. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రాబోయే మరో నటుడి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వరద ముంపుపై మొదటి నుంచి పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేసినా ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సర్కార్ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు మాత్రం వరద ముప్పు ఉందని పరోక్షంగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమన్న ఎంపీ గల్లా జయదేవ్.. లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరదనీరు మళ్లింపునకు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు రుణాల కోసం కేంద్ర జలవనరులశాఖకు ఫైలు పంపిన టీడీపీ ఎంపీలు ఆమోదం తెలపాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. -
అమరావతికి వరద ముప్పు: టీడీపీ ఎంపీ
-
ఏపీలో తప్ప నాకెక్కడా పరిశ్రమలు లేవు- గల్లా జయదేవ్
- స్వచ్ఛభారత్ను తొలుత ప్రవేశపెట్టింది చంద్రబాబేనని వెల్లడి మంగళగిరి : తనకు ఆంధ్రప్రదేశ్లో తప్ప మరే రాష్ట్రంలోనూ పరిశ్రమ లేదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం మున్సిపల్ అతిథి గృహాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన మీరు ప్రత్యేక హోదా గల రాష్ట్రాలలో పరిశ్రమలు పెట్టడానికి కారణమేమిటని విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. తొలుత ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో ఎవరూ రాజీపడడం లేదని, ప్యాకేజీతోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవచ్చని దీనికి అంగీకరించడం జరిగిందని చెప్పారు. విభజన చట్టంలో హామీలను సాధించడంతోపాటు మరిన్ని నిధులను సాధించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్వచ్ఛభారత్పై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గత పరిపాలనలోనే క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అనుమతి లేని బోట్లో ఎంపీ షికారు
ఎంపీ గల్లా జయదేవ్ నిర్వాకం సీతానగరం (తాడేపల్లి రూరల్) : అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. ఫలితంగా అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలపై మరింత చులకన భావంతో చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. కృష్ణా పుష్కరాలలో భాగంగా శుక్రవారం ఉదయం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి సీతానగరం ఘాట్ను సందర్శించారు. అనంతరం లోటస్ నుంచి బెంగళూరు చాంపియన్షిప్ సంస్థకు చెందిన బోట్లో తాళ్ళాయిపాలెం వరకూ ప్రయాణించారు. వాస్తవానికి ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉంటేనే ఆ బోట్ నదిలో ప్రయాణించాలి. అనుమతులు లేకపోతే రాకపోకలు సాగించడం నిబంధనలకు విరుద్ధం. ఎంపీ జయదేవ్ ప్రయాణించిన బోట్కు ఇరిగేషన్ శాఖ అనుమతి లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పార్టీ మీద అభిమానంతో ఇల్లు అద్దెకిచ్చాం
-
పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం
యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు. ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్లు : మంత్రి సునీత రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. -
ఎంపీ గల్లా చౌక బేరం
అద్దెకున్న భవనంపై కన్నేసిన జయదేవ్ సగం ధరకే కొట్టేయడానికి పథకం ఎంపీకి సహకరించిన బ్యాంకు డీజీఎం? రూ.7.5 కోట్ల భవనం ప్రారంభ ధర రూ.2.80 కోట్లుగా నిర్ణయం డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలూ బుట్టదాఖలు నేడు 11-12 గంటల మధ్య వేలం ఆసక్తి చూపిన వారికి ఎంపీ అనుచరుల బెదిరింపులు సాక్షి ప్రతినిధి, అమరావతి: 50 శాతం డిస్కౌంట్ అని దుస్తుల దుకాణం ముందు బోర్డు పెడితేనే కొనడానికి క్యూ కట్టే కాలమిది. అలాంటి ప్రైమ్ ఏరియాలో భవనాన్ని సగానికి సగం ధరకే గుంటూరు నగరంలో బ్యాంకు వేలం వేస్తామంటే.. పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ అద్దెకున్న భవనాన్ని చౌకగా కొట్టేయడానికి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చక్రం తిప్పారు. బ్యాంకు అధికారుల సహకారంతో వేలానికి పోటీ లేకుండా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... గుంటుపల్లి శ్రీనివాసరావు గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని 300 గజాల్లో మూడు అంతస్తుల భవనాన్ని 2013లో ఆంధ్రాబ్యాంకులో తాకట్టుపెట్టి రూ. 2.30 కోట్ల రుణం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. ఈ భవనాన్ని 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమాని ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో... బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనం వేలానికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత బ్యాంకు డీజీఎంతో కుమ్మక్కై రిజర్వు ధర మరీ తక్కువగా ఉండేలా చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈమేరకు.. ప్రస్తుతం రూ.7.5 కోట్లు మార్కెట్ విలువున్న భవనం ప్రారంభ ధర రూ. 2.80 కోట్లుగా నిర్ణయించి బ్యాంకు ఇటీవల వేలం ప్రకటన జారీ చేసింది. ఆసక్తి చూపినవారికి బెదిరింపులు తన భవనాన్ని వేలం వేయడాన్ని శ్రీనివాసరావు ఆర్డీటీ(డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో సవాల్ చేశారు. తాను బాకీ పడిన మొత్తం రూ. 1.98 కోట్లు చెల్లించడానికి కొంత గడువు కావాలని కోరారు. ఈ నెల 24లోగా రూ. కోటి చెల్లిస్తే, మిగతా సగం చెల్లించడానికి సహేతుకమైన గడువు ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తూ 24వ తేదీ ఉదయం 11-12 గంటల మధ్య వేలం వేయడానికి బ్యాంకు సిద్ధమైంది. వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు భవనాన్ని సందర్శించడానికి ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించింది. అయితే భవనాన్ని సందర్శించడానికి వెళ్లిన వారిని... ‘అధికార పార్టీ ఎంపీ నివాసం ఉన్న భవనాన్ని కొని, ఖాళీ చేయించే దమ్ము మీకు ఉందా?’ అని బెదిరించడంతో పోటీకి రాకుండా తప్పుకున్నారు. స్థానిక వ్యాపారి దేనా బ్యాంకు నుంచి ధరావత్తు సొమ్ము చెల్లించినా.. గురువారం రాత్రి వరకు వేలంలో పొల్గొనడానికి వీలు కల్పించే పాస్వర్డ్ను చెప్పలేదు. పోటీ నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. యథేచ్ఛగా నిబంధల ఉల్లంఘన రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం.. వేలం వేయాల్సిన భవనాన్ని ఖాళీ చేయించి బ్యాంకు స్వాధీనం చేసుకోవాలి. బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు అందరికీ కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో భవనం మీద రాయాలి. భవనానికి తాళం వేయాలి. కానీ... భవనంలో నివాసం ఉంటున్న ఎంపీ గల్లా జయదేవ్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఖాళీ చేయలేదు. బ్యాంకుకు తనఖా పెట్టినట్లు ఎక్కడా రాయనూ లేదు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ను ‘సాక్షి’ ప్రశ్నించగా... అవన్నీ ఇంటి యజమాని అడగాలి, మీరడుగుతున్నారేంటి? అని ఎదురు ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అందితే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ ప్రారంభ ధరపై సమాధానం దాటవేశారు. -
సాయంపై సాంకేతిక కారణాలు వెతకొద్దు
లోక్సభలో ఎంపీ గల్లా జయదేవ్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి సాయమందించే విషయంలో సాంకేతిక కారణాలను వెతకడం ఇకనైనా పక్కనపెట్టి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్రాన్ని టీడీపీ ఏంపీ గల్లా జయదేవ్ కోరారు. లోక్సభలో బుధవారం ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. -
మహేశ్ ఎవరిని ఫాలో అవుతాడు?
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు అభిమానుల సంఖ్య ఎక్కువే. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులలో చాలామంది ఆ తర్వాత మహేశ్ వైపు వచ్చారు. పైగా యువతరంలోను, విద్యార్థి లోకంలో కూడా ఆయనకు కావల్సినంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ట్విట్టర్లో మరీ అంత ఎక్కువగా కాకపోయినా ఓ మాదిరి యాక్టివ్గా ఉండే మహేశ్ను 2.02 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు. అంటే 20 లక్షల మందికి పైగా అన్న మాట. మరి మహేశ్ ఎంతమందిని ఫాలో అవుతున్నారన్న ప్రశ్న కూడా చాలామందికి వస్తుంది. అందుకోసం ఆయన ట్విట్టర్ పేజీలోకి వెళ్లి చూస్తే.. కేవలం ఒకే ఒక్కరిని మహేశ్ ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కరూ ఎవరో తెలుసా.. ఆయన బావ, పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్. గుంటూరు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనకు నచ్చిన దర్శకులు, హీరోలు, హీరోయిన్లు.. ఇలా చాలామంది ఉన్నా కూడా వాళ్లెవరినీ ట్విట్టర్లో మహేశ్ ఫాలో కావడం లేదు. కేవలం గల్లా జయదేవ్ను మాత్రమే ఫాలో అవుతున్నారు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంటి వాళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంటి రాజకీయ ప్రత్యర్థులను కూడా ఫాలో అవుతారు. కానీ మహేశ్ మాత్రం 'నలుగురికీ నచ్చినదీ నాకసలే ఇక నచ్చదురో' అనుకుంటూ.. తనదైన దారిలోనే వెళ్తున్నారన్నమాట. -
పార్లమెంటు సమాచారం
► సభాకార్యక్రమాలకు తరచూ ఆటంకం కలిగించే ఎంపీల సభ్యత్వాన్ని రద్దుచేయాలనే ప్రైవేటు బిల్లును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ► స్వలింగ సంపర్కం నేరం కాదనే భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్లో సవరణలు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన బిల్లును లోక్సభ తిరస్కరించింది. ► విమాన ప్రయాణికులకు పరిహారాన్ని పెంచే బిల్లుకు పార్లమెంటు ఆమోదించింది. ► పొగాకు ఉత్పత్తులపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలని పార్లమెంటు ప్యానల్ ఉభయ సభలకు సూచించింది. దేశంలో 27.5 కోట్ల మంది పొగాకు ఉత్తత్తులను వినియోగిస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారని చెప్పింది. ► భారతదేశంలోని 20 విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో ఉండేలా సహాయం చేయనున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. ► మార్చి 2019 కల్లా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి పాశ్వాన్ తెలిపారు. ► యూరియాకు వేప పూత ఉండాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా యూరియా వినియోగం తగ్గిందని కేంద్ర మంత్రి హన్స్రాజ్ ఆహిర్ తెలిపారు. -
‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ఎన్నికల్లో చేసిన సాయానికి... రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్ను గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. ‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజుల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. కేవలం 42 రోజుల్లో... కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది. ‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు. మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని.. గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్కుమార్రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు. -
బైకు పైనుంచి పడిన ఎంపీ గల్లా జయదేవ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్కు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో బైకు పైనుంచి పడి గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన కుమారుడి కోసం కొత్త బైకు కొని ట్రయల్స్ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎంపీ గల్లాకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెన్నెముకకు మాత్రమే గాయమైందని చెప్పారు. బైకు అదుపు తప్పడంతో ఆయన దాని మీద నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. పక్కన ఉన్న వారు వెంటనే గమనించి ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసి తక్షణమే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎంపీ గల్లా జయదేవ్.. టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు సమీప బంధువు. -
గల్లా జయదవ్కి గాయాలు
-
హైకోర్టులో గల్లా జయదేవ్ కు ఊరట
-
హైకోర్టులో గల్లా జయదేవ్ కు ఊరట
హైదరాబాద్:ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికకు సంబంధించి నెలకొన్న వివాదంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు స్వల్ప ఊరట లభించింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కు రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఆ వివాదం హైకోర్టుకు చేరింది. అంతకముందు ఏప్రిల్ 19వ తేదీనే జరిగిన ఎన్నికే సరైనదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు సరైన ఎన్నిక ఎవరిదో తేల్చాలంటూ సింగిల్ బెంచ్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికపై వివాదాన్ని జూన్ మొదటి వారంలో హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఏపీ అసోసియేషన్ కు రెండు సార్లు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తొలి ఎన్నికలో ఏపీ ఒలింపిక్ అసోసియన్ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నికైనట్లు తెలపగా, తరువాత జరిగిన ఎన్నికలో సీఎం రమేష్ అధ్యక్షుడిగా నియమితులైనట్లు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికపై వివాదం నెలకొంది. -
గల్లా వర్సెస్ సీఎం రమేష్
► టీడీపీలో ఒలంపిక్ ఎన్నికల చిచ్చు ► వర్గాలుగా విడిపోయిన ఇద్దరు ఎంపీలు ► నిన్న సంస్థాగత ఎన్నికలు ► నేడు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలే వేదిక ► రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు సాక్షి, చిత్తూరు : జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇందుకు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు వేదికగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్ పోటీకి దిగడంతో జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు తెలుగు తమ్ముళ్లు రైండు వర్గాలుగా విడిపోయారు. కొందరు జయదేవ్కు మద్దతు పలకగా మరికొందరు సీఎం రమేష్ను బలపరుస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ సైతం రెండుగా విడిపోయింది. దీనికి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 4వ తేదీన తిరుపతిలో సమావేశమైన ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో జిల్లాకు చెందిన ుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లదని, తాను కూడా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని జిల్లాకు చెందిన అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించారు. జిల్లాలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇదే సమయంలో ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఆంద్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలలో సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక వివాదంగా మారింది. ముందు ఎన్నికైన గల్లా జయదేవ్ నిజమైన అధ్యక్షుడంటూ అదే రోజు గుంటూరులో సమావేశమైన ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎన్నికలకు ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ ప్రతినిధులు హాజరు కాలేదని, ఈ ఎన్నిక చెల్లదని వారు వాదిస్తున్నారు. గల్లా జయదేవ్ను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జయదేవ్ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదని, సంఘంలోని సభ్యులెవరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదని సీఎం రమేష్ వాదిస్తున్నారు. ఎన్నికలు సభ్యుల సమక్షంలో జరగాలన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికే సక్రమమైందిగా ఆయన వాదిస్తున్నారు. అధ్యక్షుడిగా తానే ఎన్నికైనట్లు రమేష్ ప్రకటించారు. తీవ్ర స్థాయికి విభేదాలు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నిక వేదికగా గల్లా జయదేవ్, సీఎం రమేష్ వర్గాలు తలపడడంతో అధికార పా ర్టీలో వర్గ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పటికే ఆ రెండు వర్గాల మధ్య జిల్లాలో గ్రూపు తగదాలున్నాయి. ప్రతిదానికీ ఇద్దరూ పోటీపడుతుండడంతో నేతలు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి తలపడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం క్రషింగ్ నిలిపివేసిన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు గల్లా బృందం పావులు కదపగా, కర్మాగా రం తనకే కావాలంటూ సీఎం రమేష్ పోటీకి దిగినట్లు సమాచారం. గల్లా అరుణకుమారికి ఎమ్మెల్సీ పదవి వి షయంలోనూ సీఎం రమేష్ అడ్డుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లోనూ ఈ విభేదాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మొదలైన తెలుగు తమ్ముళ్ల గొడవలు ఇప్పటికే జిల్లా మొత్తం పాకాయి. తాజాగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి విషయంలో మరోసారి రచ్చకెక్కాయి. -
ఒలింపిక్ ఎన్నిక ‘సిత్రం’
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండేసి కార్యవర్గాలు సిద్ధం ఇక ఎవరు అసలో తేలాలి సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు అంటే ఒకే పదవి కోసం పలువురు పోటీ పడతారు. కానీ తెలుగు రాష్ట్రాల ఒలింపిక్ సంఘాల ఎన్నికల్లో మాత్రం విభిన్న ‘సిత్రం’ తయారయింది. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో రెండేసి కార్యవర్గాలు సిద్ధమయ్యాయి. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించుకుని రెండేసి సంఘాలను సిద్ధం చేసుకున్నారు. తమదే అసలు సంఘమని వాదిస్తున్నారు. ఈ రెండు కార్యవర్గాల్లో ఏది అసలుదో తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) పాత అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణకు జితేందర్ రెడ్డి, ఏపీకి సీఎం రమేశ్ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే ఇటు తెలంగాణలో దీనికంటే ముందే రంగారావు అధ్యక్షుడిగా ఒక సంఘాన్ని ఎన్నుకున్నారు. అటు ఏపీలో గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఒక సంఘం సిద్ధంగా ఉంది. జయదేవ్ సంఘానికి ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపునివ్వగా... దీనిపై సీఎం రమేశ్ వర్గం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో రంగారావు నిర్వహించిన ఎన్నికలకు కూడా ఐఓఏ పరిశీలకుడు వచ్చారు. రాజగోపాల్ నిర్వహించిన ఎన్నికలకు ఐఓఏ నుంచి ఎవరూ పరిశీలకులుగా రాలేదు. కాబట్టి రంగారావు కార్యవర్గానికే గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే జితేందర్ రెడ్డి వర్గం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. మొత్తం మీద కోర్టు తీర్పులు, ఐఓఏ దగ్గర పంచాయితీలు పూర్తయ్యి, కొత్త కార్యవర్గాలు పని ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. -
‘దేశం’లో ఒలింపిక్స్!
తెలుగుదేశం ఎంపీల మధ్య ఒలింపిక్ క్రీడ లోకేష్ రంగ ప్రవేశంతో రాజుకున్న దుమారం ఎవరికి వారు తమదే అసలైన కార్యవర్గం అంటున్న వైనం ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ఏపీ ఒలింపిక్ సంఘాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోడానికి టీడీపీలోని ఇద్దరు ఎంపీలు ఎత్తులకు పైఎత్తులు, ఒత్తిళ్ల మధ్య ఇదో రాజకీయ ఒలింపిక్లా వేడెక్కింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ఈ నెల 4న తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఏపీ ఒలింపిక్ సంఘానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికలను గుర్తించడంలేదంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన వర్గంతో రంగంలోకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. జయదేవ్ ఎన్నిక చెల్లదన్న రమేష్ అసోసియేషన్కు ఆదివారం(ఈ నెల 19న) ఎన్నికలు జరిగాయి. దీనికి తెరవెనుక ప్రాణం పోసింది లోకేష్ కావడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరి న్యాయస్థానం వరకు వెళ్లింది. జయదేవ్ గ్రూపు ఎన్నికలు చెల్లవంటూ గుంటూరు జిల్లా న్యాయస్థానంలో ఒకరు పిటిషన్ దాఖలు చేయగా, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుతో ఎవరో పిటిషన్ వేశారని ఏపీ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రాజేష్కుమార్ కోర్టుకు విన్నవించడం, దానిపై కోర్టు విచారణకు ఆదేశించింది. జయదేవ్ను తప్పుకోవాలన్న లోకేష్ తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఎంపికైనట్టు ప్రకటించిన నేపథ్యంలో కత్తులు నూరిన సీఎం రమేష్ తొలుత ఈ విషయాన్ని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ముందు పెట్టారు. ఆయన వెంటనే గల్లాకు ఫోన్ చేసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఏపీఓఏ ఎన్నికల అంశాన్ని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే తాను రంగంలోకి దిగానని తేల్చిచెప్పారు. అయినప్పటికీ సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు సహకరించాలని జయదేవ్పై లోకేష్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ససేమిరా అన్న గల్లా జయదేవ్ జరిగిన విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు. జయదేవ్ చె ప్పిన అంశాలను పూర్తిగా విన్న చంద్రబాబు అవునా... అని మిన్నకుండిపోయారు. మరోవైపు సీఎం రమేష్ కూడా ఈ ఎన్నిక వ్యవహారాన్ని మరో సందర్భంలో చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు చూద్దాం అని మాత్రం సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఈ పంచాయతీ మధ్య రమేష్తో పాటు పవన్కుమార్లను ఎలాగైనా ఏపీఓఏ అధ్యక్ష, కార్యద ర్శులుగా ఎంపిక చేయాలనే పట్టుదలతో పెద్ద నాయకులు లోకేష్తో అంతర్గతంగా మంతనాలు జరిపారు. మాలక్ష్మీ గ్రూప్ అధినేత హరిశ్చంద్రప్రసాద్తో పాటు పలువురు ఇదే అంశంపై చర్చలు జరిపారు. దీంతో లోకేష్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థతో పాటు ఒలింపిక్ సంఘంలో కీలకంగా వ్యవ హరించే వారితో నేరుగా ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే ఆయా క్రీడలకు సంబంధించిన సంఘాలన్నీ ఇందులో సభ్యులుగా ఉంటారు. దాంతో వారందరినీ తమవైపు తిప్పుకోవడానికి లోకేష్ శతవిధాలా ప్రయత్నించారు. ఎలాగైనా సీఎం రమేష్ ఏపీఓఏ అధ్యక్షుడు కావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే వారందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పున్నయ్య చౌదరిపై టీడీపీ నేత కరణం బలరాం ద్వారా లోకేష్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. బాబుతో ఇద్దరూ చైనాకు... చంద్రబాబు చైనా పర్యటించిన బృందంలో గల్లా జయదేవ్, సీఎం రమేష్లిద్దరూ ఉన్నారు. దాదాపు వారం పాటు వారిద్దరూ చైనాలో కలిసి తిరిగినప్పటికీ రాష్ట్రంలో వారి మద్దతుదారులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. 17 అర్థరాత్రి రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు వచ్చీ రాగానే తమ మద్దతుదారులతో సమాలోచనలు జరిపారు. జయదేవ్కు అవగాహన లేదు: శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రమేష్ క్రీడలపట్ల వాటి సంఘాల పట్ల గల్లా జయదేవ్కు అవగాహన లేదని విమర్శించారు. చైనా పర్యటనలో తమ మధ్య అవగాహన కుదిరిందని, జయదేవ్కు తమ అసోసియేషన్ గౌరవాధ్యక్ష పదవి ఇస్తామని రమేష్ చెప్పారు. ఎవరైనా సరే సహించం లోకేష్ ఎంత ఒత్తిడి తెచ్చినా నేతలు దిగిరాలేదు. ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులమడమేంటని ప్రశ్నించారు. మరోసారి ఇలాగే ఒత్తిడి తెస్తే తాము పార్టీతో పాటు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామని పలువురు నేతలు హెచ్చరించారు. పార్టీకి సంబంధం లేని ఒక మాజీ ఎంపీ హస్తం ఉన్న ప్యానెల్ను ఏ రకంగా వెనకేసుకొస్తారని, పైగా రమేష్ పోటీ పడుతున్న ప్యానెల్లో ఇతర పార్టీల వారూ ఉన్నారని జయదేవ్ తరఫున కొందరు నేతలు లోకేష్ ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలకు తావులేదు గుంటూరు: క్రీడల్లో రాజకీయాలకు తావులేదని, అలాంటి రాజకీయాలు తాను చేయబోనని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గల్లా జయదేవ్ ఆదివారం మీడియాతో అన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకే రాష్ట్ర సంఘం ఏర్పడిందన్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్లో ఒలింపిక్ అసోసియేషన్కు చెందిన కొంతమంది సభ్యులు సమావేశమై ఏప్రిల్ 4న తిరుపతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం 4వ తేదీన తిరుపతిలో సమావేశం నిర్వహించి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, చైర్మన్గా కె.వి.ప్రభాకర్, కార్యదర్శిగా ఆర్.కె.పురుషోత్తం, ట్రెజరర్గా కె.పద్మనాభం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ కార్యవర్గానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) గుర్తింపు కూడా ఇచ్చిందని జయదేవ్ వర్గం చెబుతోంది. అయితే ఆ ఎన్నిక చెల్లదని, ఈ నెల 19న జరిగిన ఎన్నికలే అసలైనవని వాదిస్తూ సీఎం రమేష్ వర్గం తాజా ఎన్నికల ప్రక్రియను ప్రకటింపజేసుకుని ఐఓఏ పరిశీలకుడిని పంపాలని కోరింది. అయితే, ఒలింపిక్ సంఘం ఎవరినీ పంపలేదు. ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో విజయం సాధిస్తే క్రీడాకారులతో సన్నిహిత సంబంధాలతో పాటు రాష్ర్టం, దేశంలో జరిగే ముఖ్యమైన క్రీడలకు ప్రతినిధులుగా హాజరయ్యే వీలుంటుంది. దీంతో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్లు అధ్యక్షులుగా అసోసియేషన్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగించారు. ఈ సంఘాలకు కేంద్ర క్రీడల శాఖ నుంచి పెద్ద ఎత్తున నిధులందుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ అధ్యక్షుడిగా, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి కుమారుడు పవన్కుమార్రెడ్డి కార్యదర్శిగా పోటీకి ప్యానల్ తయారైంది. నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్యానెల్ వ్యవహారాలన్నీ లోకేష్ కనుసన్నల్లో జరిగిపోయాయి. -
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీఎం రమేష్