aerial survey
-
దాతలు, ప్రజలే ఆదుకోవాలి
సాక్షి, అమరావతి : వరద ముంపు తగ్గిన తర్వాత బాధితులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అతిపెద్ద సమస్యగా మారిందని, ఖజనా చూస్తే అటువంటి పరిస్థితులు కనిపించడంలేదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నా అప్పులుచేయడానికి ఎఫ్ఆర్బీఎం పరిధి అడ్డువస్తుండడంతో బ్యాంకులతో దీర్ఘకాలిక రుణాల ద్వారా ప్యాకేజీ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఆదుకునే అవకాశంలేకపోవడంతో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సామాజికసేవలో భాగం పంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల్లో అందరితో మాట్లాడి ఎంతవరకు ఆర్థికసాయం చేయగలమన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నివేదికను శనివారం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ..ఆదివారం నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకేజీని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 80,000 మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15,000 మందికి కూడా ఇవ్వలేకపోయామన్నారు. ఇంటి వద్దకే అందించే విధంగా వాహనాలను అత్యధిక సంఖ్యలో తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాక ఆహారం పంచే కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలుకుతామన్నారు. ఇక బుడమేరు మూడో గండిని శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం ఉదయానికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగిందన్నారు. తాజాగా.. గురువారం కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం 9,000 క్యూసెక్కులకు చేరడంతో నగరంలోకి మళ్లీ నీరు వచ్చిందన్నారు. అంతకుముందు.. హెలికాప్టర్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానన్నారు. ప్రకాశం బ్యారేజీ 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు కేంద్రంతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధానిలో భాగమైన విజయవాడ కూడా వరదలను తట్టుకునేలా ఒక మాస్టర్ప్లాన్ను కూడా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో గిగ్ ఎకానమీని విస్తరిస్తాం..ఇదిలా ఉంటే.. ఈ వరద సంక్షోభం గిగ్ ఎకానమీకి (నచ్చిన సమయంలో పనిచేసుకోవడం) ఒక చక్కటి అవకాశమని, ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటున్నానంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరదలపై సహాయక వివరాలను తెలియచేయడానికి ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుపై అందరూ విస్మయం వ్యక్తంచేశారు. ఇప్పుడు కాలం మారిందని.. నచ్చిన సమయంలో నచ్చిన చోట పనిచేసుకోవడానికి గిగ్ వర్కర్లు ముందుకొస్తున్నారని, వీరిని పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా సేవలు)తో తక్కువ ధరలో సేవలు అందించడం ద్వారా డిజిటల్ ఎంపవర్మెంట్ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరదల్లో కార్పెంటర్, ప్లంబర్, టీవీ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్స్, పెయింటర్స్.. ఇలా నైపుణ్యం కలిగిన వారి అవసరముందని.. ఇంతమందికి ఇక్కడ సేవలు అందించేవారు సరిపడా లేకపోవడంతో గిగ్ వర్కర్ల సేవలను ఆన్లైన్ సేవల సంస్థల ద్వారా అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అవకాశం తీసుకుని గిగ్ ఎకానమీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు. ఎందుకీ సుత్తి అంటూ బాబుపై సెటైర్లు..ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది, ఎంత వరద వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా గతంలో తాను వాసర్ ల్యాబ్ను అభివృద్ధి చేశానని, కానీ గత ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోకపోవడంతో తాను శిక్షణ ఇచ్చిన వారు వేరే రాష్ట్రాల్లో కన్సల్టెంట్లుగా ఉన్నారంటూ బాబు తన స్వోత్కర్షను చెప్పుకొచ్చారు. నిజానికి.. వాసర్ల్యాబ్ అనేది ప్రాజెక్టుల నీటి స్థితిగతులపై రియల్ టైమ్లో సేవలందించే విధంగా ఒక ఐటీఐ విద్యార్థి పెట్టుకున్న సంస్థ. ఇది మన రాష్ట్రంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయిపోవడంతో వారిప్పుడు వేరే రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ, అసలు వాసర్ల్యాబ్ను తానే సృష్టించినట్లు, వారికి తానే శిక్షణ ఇచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతో విలేకరులు తెల్లమొహం వేశారు. వరదల సమయంలో అసలు విషయాలు వదిలి ఈ సుత్తి ఎందుకంటూ వారు సెటైర్లు వేసుకున్నారు. -
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
భోగాపురం పరుగుల్ని పరిశీలించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మూలపేట పోర్టు పనులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
ఊరు కాదు వీధి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక ఊరు అనుకుంటే పొరపాటే. అదొక వీధి. అక్కడ ఏకంగా 6 వేల మంది నివసిస్తున్నారు. ఆ వీధి మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడుంటుందో అక్కడ నివసించే వారికే సరిగ్గా తెలీదు. ఇలాంటి వీధి పోలండ్లో ఉంది. ఈ వీధికి సంబంధించిన ఏరియల్ వ్యూ ఫొటో ఇటీవల వైరల్గా మారింది. దక్షిణ పోలండ్లో సులోస్జోవా అనే పట్టణంలో ఈ వీధి ఉంది. దీని పొడవు ఏకంగా తొమ్మిది కిలో మీటర్లు. ప్రపంచంలోనే అతి పెద్ద వీధి ఇదే. ఇరువైపులా పచ్చని పంట పొలాలతో, పొందికగా అమర్చిన ఇళ్లతో ఈ వీధి ఫొటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. -
లక్ష ఎకరాల్లో పంట నష్టం!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ అగ్రికల్చర్/ మర్పల్లి/ వికారాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు అన్నదాతలను నిండా ముంచాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలను దెబ్బతీశాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానలతో వరి, మామిడి, నిమ్మ, బత్తాయి, పుచ్చ, టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుము పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అనేక చోట్ల వరి నేలవాలగా కొన్ని ప్రాంతాల్లో మక్కలు తడిసి ముద్దయ్యాయి. అలాగే మామాడి, బత్తాయి, నిమ్మ తోటల్లో పిందెలు, కాయలు రాలిపోయాయి. పచ్చిమిరప చేన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధిక పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నల్లగొండ జిల్లాలో 1,060 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో దెబ్బతిన్న ఉద్యాన, వ్యవసాయ పంటలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. క్యాబేజీ, ఉల్లి, మొక్కజొన్న, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సాగు విధానంలో మార్పు అవసరం మన దేశంలో వ్యవసాయానికి ఓ విధానమంటూ లేదని, దీనిని సరిచేసే విషయమై కేంద్రం చొరవ తీసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని, ఈలోగా పంటలు చేతికి వచ్చేలా సాగువిధానంలో మార్పులు రావాలన్నారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోకుండా సీజన్లో మార్పులు చేసుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులు కూడా ఆ దిశగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు, ఉద్యానవన శాఖ సంచాలకులు హన్మంతారావు, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు... రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు పండించే రైతులు పొలాల్లో అధిక వర్షపు నీరు బయటకు పోవడానికి వీలుగా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం.వెంకటరమణ సూచించారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి అధికం కాకుండా ఉండేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత.. దేశంలోనే తొలిసారి
సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు (ఓఆర్ఐ) తీస్తున్నారు. అయితే ప్రయోగాత్మకంగా విమానం ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు (ఓఆర్ఐ) తీయించారు. అవి మంచి నాణ్యతతో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎక్కువ పిక్సెల్స్తో, ఎక్కువ పరిధిని కవర్ చేసే కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఒక రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా రీ సర్వే నిర్వహించారు. ఈ చిత్రాలు ఎక్కువ వ్యాసార్థంలో ఉంటాయి. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతగా రావడం వల్ల రీ సర్వే సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి ఏరియల్ సర్వే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 13,953 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ టెండర్లు పిలిచింది. ఎల్1గా నిలిచిన ముంబైకి చెందిన జెనిసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఏరియల్ సర్వే బాధ్యత అప్పగించారు. ఈ సంస్థే నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఏరియల్ సర్వే చేపట్టింది. వాటిని హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో పరీక్షించి అనుకున్న దానికంటే ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నట్లు నిర్ధారించారు. ఐదు సెంటీ మీటర్ల తేడాతో కొలతలు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. దీంతో సెప్టెంబర్ నుంచి ఈ సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి ఏరియల్ సర్వే మొదలు పెట్టనుంది. తనకు అప్పగించిన 13,953 చదరపు కిలోమీటర్లను రెండు విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా కొలవనుంది. రోజుకు 200 – 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కొలవడానికి ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంటే 3 నెలల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తంలో ఏరియల్ సర్వే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్ సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అవసరాన్ని బట్టి మిగిలిన జిల్లాల్లో ఏరియల్ సర్వే కొనసాగించనున్నారు. గొలుసు నుంచి విమానం వరకు.. ► భూముల సర్వేను పాత కాలంలో చైన్ (గొలుసు), టేపులతో నిర్వహించే వారు. 1900 నుంచి బ్రిటీష్ హయాంలో ఈ విధానంలోనే సర్వే జరిగింది. చాలా కాలం ఈ విధానంలోనే భూములను కొలిచేవారు. ► టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) విధానంలో జియో కో – ఆర్డినేట్స్ ద్వారా భూముల కొలత ప్రారంభమైంది. శాటిలైట్లు వచ్చాక డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా భూముల కొలత నిర్వహిస్తున్నారు. ► శాటిలైట్లను మరింతగా వినియోగించుకునే క్రమంలో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్) రోవర్స్ అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరింత ఆధునికంగా సీఓఆర్ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్) నెట్వర్క్ ద్వారా జీఎన్ఎస్ఎస్ రోవర్లతో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వాటితో సర్వే చేయడం ప్రారంభించారు. తొలిసారి విమానాలతో.. ► గతంలో మైనింగ్, జాతీయ రహదారుల కోసం కొన్ని రాష్ట్రాల్లో విమానాల ద్వారా ఏరియల్ సర్వే చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు అడుగులు ముందుకు వేసి దేశంలోనే తొలిసారిగా ఏకంగా విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలిచే పద్ధతికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూములను కొలిచే విధానాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. ► ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేస్తున్న రీ సర్వేలో ఈటీఎస్ నుంచి విమానాల వరకు అన్నింటినీ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునిక విధానాలతో ముందుకు వెళుతోంది. ఏరియల్ సర్వేతో మంచి ఫలితం ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఏరియల్ సర్వేలో మంచి ఫలితం వచ్చింది. కొలతలు కచ్చితంగా ఉన్నట్లు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. వర్షాలు తగ్గాక, పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే విజయవంతంగా సాగుతోంది. డ్రోన్ల ద్వారా ఇప్పటికే వేగంగా సర్వే నిర్వహిస్తున్నాం. విమానాలతో సర్వే చేయడం ద్వారా ఇంకా వేగంగా సర్వే చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు రీ సర్వే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. – సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
-
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. -
KCR Aerial Survey: సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. బాధితులను కలిసి..
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆది, సోమవారాలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదలతో ప్రజలకు జరిగిన కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి సాంత్వన కలిగించడానికి పునరావాస, ఇతర ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. సీఎం ఆదేశాలతో ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్మ్యాప్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భద్రాచలంలో సీఎం సమీక్ష.. సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వరంగల్కు చేరుకొని అక్కడ వరద పరిస్థితులపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన వరంగల్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలుచోట్ల హెలికాప్టర్ నుంచి కిందికి దిగి వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించి అక్కడ జరిగిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నారు. అక్కడి నుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సోమవారం ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర ముంపు ప్రాంతాల మీదుగా ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ముంపు గ్రామాల్లో వైద్య శిబిరాలు.. గోదావరి పరీవాహకంలోని వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంత ఆస్పత్రుల వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సమీక్షించారు. నేటి పర్యటనకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హరీశ్రావు ఆదేశించారు. వైద్యులంతా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో వైద్య పరీక్షల సదుపాయంతోపాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగూడెం కేంద్రంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్రెడ్డి వైద్య శిబిరాలతోపాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. వరదలపై శాశ్వత ప్రణాళిక: సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏటా గోదావరి భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు, వరదలు రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన ఇంజనీర్ల సలహాలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి రోడ్డు మార్గంలో హనుమకొండకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్, కరకట్టల నాణ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు రూ. కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును ఆదేశించారు. మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ వెళ్లేదాకా.. ఏరియల్ సర్వే గుర్తు రాలేదా? కేసీఆర్పై బండి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు ప డుతున్న బాధలను స్వయంగా తెలుసుకుని సాయం చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయిస్తే.. ఉలిక్కిపడ్డ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు బయల్దేరిన విషయం వా స్తవం కాదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ ప్రశ్నించారు. వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది మంది ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులైతే, వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన లే కుండా ఎంపీలతో సమావేశం పేరుతో కేంద్రంపై బురద చల్లే రాజకీయాలు చేయ డం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సంజయ్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ సీఎం మాట్లాడటం ఓ వింత అని ఎద్దే వా చేశారు. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతుంటే ఉద్యోగులకు జీతాలెందుకు సక్రమంగా ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.390 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం.. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రూ.16,500 కోట్ల లోటు బడ్జెట్కు దిగజారిందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే కస్తూర్బా విద్యాలయాల ఉద్యోగులకు 60% మాత్రమే జీతాలు చెల్లిస్తూ.. రాష్ట్రం వాటా నిధులను కేటాయించకుండా, వారికి పూర్తి జీతా లివ్వకుండా ఇబ్బంది పెడుతోంది నిజం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు. -
రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు(ఆదివారం) ఏరియల్ స్వరే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా వరద ముంపు ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. రేపు(ఆదివారం) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాచలానికి వెళ్లనున్నారు. వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాలను పరశీలించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో గవర్నర్ తమిళిసై.. భద్రాచలానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయానికి భద్రాచలం చేరుకోనున్నారు. ఇది కూడా చదవండి: ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం -
CM YS Jagan: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని, గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లోతట్టు ప్రాంతాల వారందరినీ సహాయ శిబిరాలకు తరలించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఇది చాలా ప్రధాన అంశమని, వచ్చే 24 గంటలు చాలా కీలకమని (క్రిటికల్), హై అలర్ట్ (అత్యంత అప్రమత్తం)గా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లా, యానాం ప్రాంతాల్లో పరిస్థితులను హెలికాప్టర్ ద్వారా సుమారు గంటన్నర పాటు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, సహాయ చర్యలపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, వైద్యం.. మందులు సహా అత్యవసర సేవలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులకు సైతం తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అందుబాటులో సీఎంవో కార్యదర్శులు ►వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాం. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోరినా.. సీఎస్ సహా వీరంతా యుద్ధ ప్రాతిపదికన వారికి ఆ సాయం అందించేలా చూడాలి. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. శనివారం కూడా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ►గట్లు బలహీనంగా ఉన్న చోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన పక్షంలో గండ్లకు ఆస్కారం ఉన్న చోట తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా వీలైనన్ని ఇసుక బస్తాలు తదితర సామగ్రిని సిద్ధం చేయాలి. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధం ►రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు వీటిని వినియోగించుకోవాలి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య రాకుండా, తాగునీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలి. పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. ►వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. బాధితులను ఆదుకోవడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. సెల్ టవర్లకు డీజిల్ సరఫరా చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలి. ►వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఇవ్వాలి. ►సమీక్షలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
ఏపీ వరదలు.. సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం
Live Updates: 6:00 PM గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం వచ్చే 24 గంటలు హైఅలర్ట్గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం 4: 24 PM ►గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్ ►గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష ►ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం ► గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షించనున్నారు. ► విశాఖపట్నంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు. ►ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
AP: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం చేపట్టిన ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం జగన్.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్కు తెలిపారు. ఎగువన తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతోంది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్కు అధికారులు వెల్లడించారు. దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని సీఎం జగన్ సూచించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు రీసర్వేకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొల్లేరులో ఆక్రమణలకు గురై వెలుగులోకి రాని భూములు వేల ఎకరాలు ఉన్నాయి. చెరువుల సాగుకు అనుకూలమైన భూములైనప్పటికీ ఆక్రమణల పర్వంతో స్థానిక కొల్లేరు ప్రజలకు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఈ క్రమంలో కొల్లేరు రీసర్వే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. దీంతో కొల్లేరు ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కొల్లేరు రీసర్వే చేయిస్తామని గత నెలలో గణపవరంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సర్వేపై అధికారులు వేగంగా దృష్టి సారించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. సర్వే ప్రక్రియ ఇలా కొల్లేరు అభయారణ్యంలో నిర్వహించనున్న సర్వే ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖాధికారులు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్వే ప్రక్రియను జలవనరుల శాఖ పర్యవేక్షించింది. రాడార్ ల్యాండ్ సర్వే ద్వారా కొల్లేరు భూముల విస్తీర్ణం లెక్క తేల్చనుంది. అభయారణ్యం ఉపరితలంపై రాడార్ను అమర్చి డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహించనుంది. ఒక్కొక్క కాంటూరు పరిధిలో అభయారణ్యం భూములు ఎంత ఉన్నాయి.. జిరాయితీ భూములు ఎంత ఉన్నాయి.. అనధికారిక చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ఆక్రమణ భూములు ఎంత ఉన్నాయి ఇలా కాంటూరుల వారీగా అభయారణ్యం విస్తీర్ణం పక్కాగా లెక్క తేలనుంది. సర్వే ద్వారా ఐదో కాంటూరు లోపే సుమారు 70 వేల ఎకరాల భూమి వెలుగులోకి వస్తుందని, దీనిలో 55 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 10 వేల ఎకరాలు జిరాయితీ భూమి ఉంటుందని అధికారిక అంచనా. ఐదో కాంటూరు వరకు అభయారణ్యంలో 77,340 ఎకరాల భూమి ఉన్నట్టు అటవీ శాఖ రికార్డులు చెబుతున్నాయి. రాడార్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం అనుమతితో వచ్చే నెలాఖరు నాటికి సర్వే ప్రక్రియ జిల్లాలో ప్రారంభం కానుంది. మరోవైపు స్వచ్ఛ కొల్లేరుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ.420 కోట్ల వ్యయంతో మూడు చోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రెగ్యులేటర్ల నిర్మాణం ద్వారా సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీటితో కొల్లేరు కలుషితం కాకుండా కట్టడి చేయనున్నారు. సర్వేతో వెలుగులోకి అభయారణ్య, జిరాయితీ భూములు.. మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రపంచ ఖ్యాతిగాంచింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 901 చదరపు కిలోమీటర్ల మేర 2,22,300 ఎకరాల్లో ఉన్న కొల్లేరు రెండు జిల్లాల్లో 12 మండలాల్లో విస్తరించి ఉంది. కొల్లేరుపై ఆధారపడి మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. 1959లో కొల్లేరులో చేపల సాగుకు ప్రభుత్వం మొదటగా అనుమతినిచ్చింది. అప్పటి నుంచి క్రమక్రమంగా చేపల సాగు పెరిగి వేల ఎకరాలకు చేరింది. కొల్లేరు సర్వే వల్ల అభయారణ్య భూములు, జిరాయితీ భూములు వెలుగులోకి రానున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొల్లేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2007లో కొల్లేరులో ప్రక్షాళనలో భాగంగా సుమారు 55 వేల ఎకరాల అనధికారిక చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేర పరిహారం అందించారు. 2005లోనే సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. వాటి ఆధారంగానే కొల్లేరు ప్రక్షాళనకు దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది. సమగ్ర సర్వే నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాలతో కొల్లేరు రీసర్వేకు ప్రతిపాదనలు, సర్వే నిర్వహించాల్సిన క్రమం, ఇతర అంశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రూ.4 కోట్ల వ్యయంతో సర్వే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అభయారణ్యం భూముల లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిస్తాం. – ఎస్వీకే కుమార్, ఏలూరు అటవీ శాఖ రేంజర్ -
మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు ఇవ్వండి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, తిరుపతి: వరద ముంపు బాధితులకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలకు గురైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని ప్రాంతాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం 10.32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి.. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ విజయరామరాజు, ప్రత్యేక అధికారి శశిభూషణ్కుమార్లు వైఎస్సార్ జిల్లాలో పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఇరు జిల్లాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్పోర్టులో చిత్తూరు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉదారంగా వ్యవహరించండి ► వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఉదారంగా ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల సాయం అందజేయాలి. ఊహించని వరదలతో పంటలు, పంట పొలాలు, ఇళ్లు నష్టపోయిన వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► చెయ్యేరు ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలి. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికే కాకుండా ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. ► అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇందుకు సంబంధించి డీపీఆర్లు సిద్ధం చేయాలి. కడప నగరంలో బుగ్గవంక పరిధిలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. కడప నగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు రూ.68 కోట్లతో స్వామ్ వాటర్ డ్రైయిన్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. విద్యుత్, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి. ► వివిధ మునిసిపాల్టీల నుంచి ఇప్పటికే రప్పించిన 500 మంది సిబ్బందితో కలిసి తిరుపతి పట్టణంలో వెంటనే పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలి. ► తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలి. వరద తగ్గగానే పంట నష్టంపై అంచనాలు రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలి. శిబిరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలి. ► ఈ పర్యటనలో హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వెంట వచ్చారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వరద ప్రభావిత ప్రాంతం ఏరియల్ వ్యూ సీఎం ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రాంతాలు ► బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు. ► పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు. ► వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు, ముంపునకు గురైన గ్రామాలు. ► పింఛ ప్రాజెక్టు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు. ► రేణిగుంట, తిరుపతి, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాలు. -
Aerial Survey : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కడప-తిరుపతి: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. చదవండి: ఏపీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతో పాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రేణిగుంట ఎయిర్పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుపతి టౌన్లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వెంటనే రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే దృశ్యాలు
-
ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన
-
యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
-
గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
-
మానవత్వంతో ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వరదల్లో నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి.. డిసెంబర్ 15లోపు నివేదిక అందించాలని, 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్బాషా మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సమగ్రంగా పరిశీలన ► పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం చెప్పారు. ఉదారంగా వ్యవహరించి, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు విడిచి వెళ్లిపోయినా సరే, అలాంటి వారందరికీ రూ.500 ఇవ్వాలని చెప్పారు. బుగ్గవంకకు రూ.39 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో పెండింగ్లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు రూ.39 కోట్లు కేటాయించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.65 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆయన మృతితో ఆ పనులు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అదనంగా 1.2 కిలోమీటర్ల మేర కొత్త నిర్మాణాలకు రూ.39 కోట్లు వెచ్చించాల్సి ఉందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, కలెక్టర్ హరికిరణ్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు. ► అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించాలని, తక్కువ ఖర్చుతో విస్తరణ చేపట్టవచ్చని, అలాగే పింఛా ప్రాజెక్టును 2 టీఎంసీలకు విస్తరించవచ్చని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సూచించగా, ప్రతిపాదనలు చేపట్టాలని సీఎం తెలిపారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.15 గంటలకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ఎస్బీ అంజద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, భూమన కారుణాకర్రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాకనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో అపార నష్టం ► వైఎస్సార్ జిల్లాలోని మైనర్ ఇరిగేష్ ప్రాజెక్టులలో పూర్తి సామర్థ్యం మేరకు 0.327 టీఎంసీల నీరు ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ► జిల్లాలో 825 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 72,755 హెక్టార్లు, ఉద్యాన వన శాఖకు సంబంధించి 3,240 హెక్టార్లలో పంట నీట మునిగిందని, 757 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ► జిల్లా వ్యాప్తంగా 12,741 మందిని రేస్క్యు ఆపరేషన్లో కాపాడామని, పునరావాస కేంద్రాలలో 15,289 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 192.6 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు, 1,234 కి.మీ మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 8,129 మేకలు, గొర్రెలు, కోళ్లు మృతి ► చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లోని 245 గ్రామాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి 9,658 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 1,729.52 హెక్టార్లల్లో పంటలు నీట మునిగాయని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త ముఖ్యమంత్రికి వివరించారు. ► పశు సంవర్థక శాఖకు సంబంధించి మేకలు, గొర్రెలు, కోళ్లు కలిపి 8,129 మృత్యువాత పడ్డట్లు తెలిపారు. 245 కచ్చా ఇళ్లు దెబ్బ తిన్నాయని, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి పలువుర్ని కాపాడామన్నారు. ► 44 పునరావాస కేంద్రాలలో 4,012 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 543.8 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్ల ఉపరితలం దెబ్బతినిందని చెప్పారు. రూ.1,082.5 లక్షలు విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయన్నారు. 34,200 హెక్టార్లలో పంటలు మునక ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 మండలాల్లోని 107 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 33,269 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 931 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని కలెక్టర్ చక్రధర్బాబు సీఎంకు వివరించారు. రేస్క్యూ ఆపరేషన్ ద్వారా 17,163 మందిని కాపాడామని, 155 పునరావాస కేంద్రాల్లో 17,163 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 343.04 లక్షల విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. 290 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, తిరుపతి : వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. (మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే) అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నివర్ తుపాను : సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన జగన్ ఏరియల్ సర్వే
-
చిత్తూరు,కడప,నెల్లూరు జిల్లాల్లో జగన్ ఏరియల్ సర్వే
-
మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్ నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దృష్టికి తేనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు, వంతెనలకు గండ్లు పడ్డాయి. స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరదలకు చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మూడు గ్రామాల్లో తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులకు 465 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. జలదిగ్భంధంలో గ్రామాలు సోమశిల బ్యాక్వాటర్తో నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరు మండలాల్లో 16 లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. 42 చెరువులకు గండ్లు పడ్డాయి. ఒక వంతెన కొట్టుకుపోవడం, సోమశిల బ్యాక్వాటర్తో రోడ్డు మునిగిపోవడంతో వైఎస్సార్– నెలూరు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మనుబోలు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. చెరువులు, వరదల్లో చిక్కుకున్న ఆయా ప్రాంతాల్లోని సుమారు 4,000 మందిని, నెల్లూరు నగరంలో 1100 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. పెన్నా ఉగ్రరూపంతో నెల్లూరు నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాథస్వామి ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎమ్మెల్యేలు.. కాకాణి గోవర్దన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వరప్రసాద్రావు, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రాళ్లపాడు, గుళ్లకమ్మ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో దిగువకు నీరు వదిలేశారు. యుద్ధప్రాతిపదికన 234 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పాలేరు, ముసి, మన్నేరు, అట్లేరు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాధితులను రక్షించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, అధికారులు చిత్తూరు జిల్లాలో వర్షాలతో వాగులు పొంగడంతో నలుగురు మృతి చెందారు. ఐరాల వద్ద గార్గేయ నదిలో కొట్టుకుపోయి వైఎస్సార్సీపీ కార్యకర్త వినయ్రెడ్డి, కేవీపల్లి నూతన కాలువలో గల్లంతై రెడ్డి భాష ప్రాణాలు విడిచారు. శ్రీరంగరాజపురం పుల్లూరు పెద్దవంక వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. రేణిగుంట రాళ్ల కాలువలో గల్లంతైన రైతు ప్రసాద్ మృతి చెందాడు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును వారికి అందించారు. ప్రసాద్ భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఏర్పేడు మండలం శివగిరి కాలనీకి చెందిన 14 మంది గిరిజనులు కోన కాలువలో చిక్కుకుపోగా బియ్యపు మధుసూదన్రెడ్డి స్వయంగా డ్రోన్ను తెప్పించి వారి ఆచూకీని కనిపెట్టారు. వారికి డ్రోన్ ద్వారా బిస్కెట్లు, పండ్లు, రొట్టె, తాగునీళ్లు పంపారు. ప్రస్తుతం గిరిజనులంతా కాలువకు అవతల ఉన్న మామిడి తోటలో సురక్షితంగా ఉన్నారు. అలాగే పీలేరు మండలం ఆకులవారిపల్లెలో పూరి గుడిసె కూలిపోవడం, పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి రాలేకపోయిన ఒక కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాపాడారు. చిత్తూరు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న 3,661 మందిని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 15 మంది వరదలో చిక్కుకుని సమీపంలోని తోటలో ఉండిపోగా అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని యానాది కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన 10 మందితోపాటు మరో 12 మంది మామిడి తోటలో చిక్కకుపోగా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా రెస్క్యూ టీం సహకారంతో వారిని కాపాడారు. అలాగే వైజాగ్కు చెందిన 200 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి అధికారులు ఫిషింగ్ హార్బల్లో వసతి సౌకర్యం కల్పించి తాగునీరు, ఆహారాన్ని అందించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో ఉన్న హేమాద్రివారిపల్లి వరద నీటిలో చిక్కుకుంది. అధికారులు, రెస్క్యూ సిబ్బంది బోటులో గ్రామానికి చేరుకుని 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డు స్థాయి వర్షం ఈ నెల 23 – 26 వరకు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు సాధారణ వర్షపాతం 31.0 మిల్లీమీటర్లు కాగా 288.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో గత రెండు దశాబ్దాల్లోనే లేనంతగా 25 నుంచి 28 సెం.మీ. వర్షం కురిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 99 మండలాల పరిధిలోని 299 గ్రామాలు వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 15.87 లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 664 ఇళ్లు నీట మునగగా 673 ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 76.7 మి.మీ., కర్నూలు జిల్లాలో 19.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, కడప, బద్వేలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలోని పాపాఘ్ని, మాండవ్య, బహుదా, పింఛా, జంగమేరు, పెన్నా, సగిలేరు, పాగేరు, మొగమూరుతోపాటు పలు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పింఛా నీటితో నిండి శుక్రవారం ఉదయం తెగిపోయింది. వరద ఉధృతికి మాండవ్య నదిలో చిన్నమండెం ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న ఓ కారు కొట్టుకుపోయింది. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. బుగ్గవంక నీటిని దిగువకు విడుదల చేయడంతో కడప నగరంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం అంజద్ బాషా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలో 300కు పైగా కూలిన చెట్లు తుపానుతో తిరుమలలో దాదాపు 300కు పైగా వృక్షాలు కూలినట్టు ఎఫ్ఆర్వో ప్రభాకరరెడ్డి తెలిపారు. టీటీడీ అటవీ శాఖ ఉద్యోగులు, గార్డెనింగ్ సిబ్బంది 150 మంది బృందాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారన్నారు. కాగా, తిరుమల కొండల నుంచి ఉబికి వస్తున్న నీటితో తిరుపతిలోని రహదారులు వాగుల్లా మారాయి. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దెబ్బతిన్న పంటలు క్షేత్రస్థాయి ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అంచనా. జిల్లాల వారీగా గుంటూరులో 1,24,392, కృష్ణాలో 94,464, తూర్పు గోదావరిలో 25,000, పశ్చిమ గోదావరిలో 21,000 చిత్తూరులో 10,166, ప్రకాశంలో 1,06,000, వైఎస్సార్లో 4,886, నెల్లూరులో 33,269, కర్నూలులో 15,798, అనంతపురంలో 802 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం హాఫ్పేట, ఖాజీపేట గ్రామాల్లో తుపాను తాకిడికి దెబ్బతిన్న మినుము, వరి పంటలను వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. -
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాల్లో వరద నష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శనివారం) ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షా సమావేశం అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. నివర్ తుపానుపై నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్ ఆమోదం) తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: ‘నివర్’ బీభత్సం) -
పంట నష్టం త్వరగా అంచనా వేయండి
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను, లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. – ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే ఐదు నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్ను అందిస్తోంది. – మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలి. – సీఎం వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఆదుకునేందుకు పలు చర్యలు – భారీ వర్షాలు, వరదలపై ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. – ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,450 కోట్ల నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవడానికి రూ.2,250 కోట్ల సాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. – వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. -
సీఎం జగన్ ఏరియల్ సర్వే ఫొటోలు
-
వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. (చదవండి: అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్ వెంట ఉన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ప్రభుత్వం, వరద బాధితులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. -
వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి : వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం పరిశీలించారు. సీఎం వెంట హోమ్ మంత్రి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్షజరిపిన విషయం తెలిసిందే. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరా కిందవెంటనే రూ.2250 కోట్లు సాయం అందించాల్సిందిగా సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. (అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్) వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పలు అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాసిన లేఖలో సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్ షా దృష్టికి తీసుకుపోయారు. (హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖ) -
వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
మావోయిస్ట్ ఏరియాలో మరోసారి డీజీపీ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు రెండో రోజు కొనసాగుతోంది. గురువారం డీజీపీ మహేందర్రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు. మావోయిస్టులసంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు. మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్లోనే డీజీపీ మహేందర్రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డి రెండోసారి పర్యటించారు. తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్మెంట్కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా కూంబింగ్ ఆపరేషన్పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్ ఏ ఆర్ సివిల్ పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. చదవండి: మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే -
మావో ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే
సాక్షి, అసిఫాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీస్తున్నారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడంతో స్థానికంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు విషయమై కూడా చర్చ కొనసాగుతోంది. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
మిడతల దండుపై ఆందోళన వద్దు
ఎదులాపురం (ఆదిలాబాద్): మిడతల దండు విషయంలో రాష్ట్ర రైతులు ఆందోళన చెందవద్దని, వివి ధ మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని కీటక శాస్త్రజ్ఞుడు ఎస్జే రహమాన్ అన్నారు. మిడతలు రాష్ట్రంలో ప్రవేశించేలోపు తీసుకోవాల్సిన ముం దస్తు చర్యల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన కమిటీ సభ్యులు ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా ఆదిలాబా ద్ జిల్లాకు చేరుకున్న కమిటీ సభ్యులు రాష్ట్ర సరిహ ద్దు పెన్గంగ పరీవాహక ప్రాంతంతోపాటు నిర్మల్ జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మం దిరంలో కమిటీ సమావేశమైంది. కమిటీ సభ్యుడు, కీటక శాస్త్రవేత్త రహమాన్ మాట్లాడుతూ మిడతలు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ప్రవేశించేందుకు ఆస్కారం ఉందో అంచనా వేసేందుకు ఈ ఏరియల్ సర్వే చేపట్టామన్నారు. ఆయన వెంట కమిటీ సభ్యురా లు, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఆర్.సునీత ఉన్నారు. -
మిడతల కదలికలపై ఏరియల్ సర్వే
సాక్షి, ఆదిలాబాద్: మిడతల కదలికలపై ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై మిడతల ప్రభావం లేదని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మిడతల దండు దిశను మార్చుకున్నాయని... తెలంగాణకు ముప్పులేదని స్పష్టం చేశారు. మిడతలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని కమిటీ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో మిడతల దండు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కమిటీ వెల్లడించింది. -
బెంగాల్కు తక్షణ సాయం వెయ్యి కోట్లు
బసీర్హాట్/కోల్కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్కు తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం బెంగాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ వెంట ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసీర్హాట్లో గవర్నర్, ముఖ్యమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారిపై పోరాడుతూనే మరోవైపు తుపాను సహాయక చర్యలు చేపట్టడంలో సమర్థంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశం మొత్తం బెంగాల్ ప్రజలకు అండగా ఉంటుందని మోదీ చెప్పారు. రూ.లక్ష కోట్ల నష్టం: మమతా బెనర్జీ ఉంపన్ తుపాను వల్ల పశ్చిమ బెంగాల్కు రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.53 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. బెంగాల్లో 77కి చేరిన మరణాలు బెంగాల్లో ఇప్పటిదాకా అంపన్ తుపాను వల్ల మరణించిన వారి సంఖ్య 77కు చేరింది. రాజధాని కోల్కతా సహా దాదాపు సగం జిల్లాలు అంపన్ ధాటికి దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఒడిశా సీఎంకు ప్రధాని ప్రశంస సైక్లోన్ వల్ల నష్టపోయిన ఒడిశాకు రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను నష్టంపై నివేదిక వచ్చాక తదుపరి ఆర్థిక సాయం ప్రకటిస్తామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంతో గొప్ప చొరవ చూపారని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. తుపాను కారణంగా తమ రాష్ట్రంలో 45 లక్షల మంది ప్రభావితులైనప్పటికీ, వేలాది ఇళ్లు దెబ్బతిన్నప్పటికీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలి: విపక్షాలు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అంపన్ తుపాను సృష్టించిన బీభత్సాన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని 22 ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా రాష్ట్రాలను సముచిత రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాయి. 22 పార్టీల నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలకు, ప్రజలకు అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, కమ్యూనిస్టు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఉంపన్.. కోల్కతా వణికెన్
కోల్కతా/భువనేశ్వర్/న్యూఢిల్లీ/ఢాకా: కరోనా వైరస్తో దేశమంతా అల్లాడిపోతున్న సమయంలో పులి మీద పుట్రలా పశ్చిమబెంగాల్ను ఉంపన్ తుపాను గట్టి దెబ్బ తీసింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 72 మంది మరణించారు. వందలాది ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వంతెనలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్కతా చిగురుటాకులా వణికిపోయింది. ఒక తుపాను ఈ స్థాయిలో కోల్కతాను ధ్వంసం చేయడం వందేళ్ల తర్వాత ఇదే తొలిసారి. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కోల్కతా అతలాకుతలమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు, వెయ్యికిపైగా సెల్ టవర్లు నేలకొరిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీసుల కియాస్క్లు ధ్వంసమయ్యాయి. కోల్కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని కొన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు మూగబోయాయి. కమ్యూనికేషన్ సదుపాయం లేక అంత పెద్ద నగరం అల్లాడిపోతోంది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా ధ్వంసం కాగా, కోల్కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరాలలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఇప్పట్నుంచే అంచనా వెయ్యలేమని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సుందర్బన్ డెల్టాలో కొన్ని కిలో మీటర్ల మేర ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. మరోవైపు తుపాను సహాయకకార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన నాలుగు అదనపు బృందాలు ఢిల్లీ నుంచి కోల్కతాకు చేరుకున్నాయి. రెండు జిల్లాలు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో ఈ అదనపు బలగాలు వచ్చాయి. ఢిల్లీలో నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బెంగాల్, ఒడిశాలో సహాయ కార్యక్రమాలపై చర్చించినట్టు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ప్రధాన్ చెప్పారు. ఒడిశాలో భారీగా పంట నష్టం ఉంపన్ తుపాను ఒడిశాలో కూడా తన ప్రతాపం చూపించింది. తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్, టెలికం వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. పంట నష్టం అత్యధికంగా ఉంది. రాష్ట్రంలో 44.8 లక్షల మందిపై తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తీవ్రంగా నష్టపోయిన బెంగాల్ను అన్నివిధాల ఆదుకుంటామన్నారు. బంగ్లాదేశ్లో 10 మంది మృతి: పెను తుపాను ఉంపన్ బంగ్లాదేశ్లోనూ విలయం సృష్టించింది. తీర ప్రాంతాల పల్లెలన్నీ ధ్వంసమయ్యాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 10 మంది వరకు మరణించారని బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. గోడలు, చెట్లు కూలి మీద పడడం వల్లే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. కరోనా కంటే భయంకరమైనది : మమత కోల్కతాతో పాటు పశ్చిమబెంగాల్ను వణికించిన ఉంపన్ తుపాను కోవిడ్–19 కంటే భయంకరమైనదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇలాంటి తుపాను బీభత్సాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ‘ఉత్తర దక్షిణ పరగణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకోవాలి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సాయం చెయ్యాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంపన్ ప్రభావంతో అల్లాడిన ప్రాంతాలను సందర్శించాలి’ అని మమత అన్నారు. అండగా ఉంటాం: మోదీ పశ్చిమ బెంగాల్ తుపాను తీవ్రతపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో బెంగాల్ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుపాను బీభత్స దృశ్యాలు చూశానని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అన్ని విధాల సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసంప్రా«ర్థిస్తున్నామని, జాతియావత్తూ బెంగాల్కు అండగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా బెంగాల్, ఒడిశాలకు కేంద్రం నుంచి పూర్తి సాయం అందుతుందని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. నేడు ప్రధాని మోదీ ఏరియల్ సర్వే ఉంపన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను శక్తివంతమైన ఉంపన్ తుపాను వణికిస్తోంది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతాల్లో విద్యుత్, టెలికం, మౌలిక వసతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన వరద (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉంపన్ విధ్వంసం : బెంగాల్కు ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : ఉంపన్ తుపాను బీభత్సంతో దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్లో తుపాన్ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటిస్తారు. బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో తుపాను నష్టాన్ని ఏరియల్ సర్వేలో పర్యవేక్షిస్తారు. కాగా తుపాన్ ప్రభావిత బెంగాల్ను సందర్శించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతకుముందు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.తుపాన్ ధాటికి పశ్చిమబెంగాల్లో 72 మంది మరణించిన సంగతి తెలిసిందే. పెను తుపాన్పై ప్రధాని స్పందిస్తూ దేశమంతా పశ్చిమబెంగాల్కు అండగా నిలుస్తుందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఉంపన్తో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు. చదవండి : ఉంపన్ విధ్వంసం : 72 మంది మృతి -
పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన సీఎం జగన్
-
పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలిస్తున్న సీఎం
-
పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్ట్ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్ను ఏరియల్ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. అంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్కుమార్ యాదవ్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, ముదునూరి ప్రసాదరాజు, పుప్పాల వాసుబాబు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, కలెక్టర్ ముత్యాల రాజు స్వాగతం పలికారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రాజెక్టుల బాట పట్టారు. -
కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
-
ఉదారంగా సాయం..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘వరదలతో కుందూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు నష్టపోయారు. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పశు సంపదకు నష్టం వాటిల్లింది. బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలను, రైతులను ఆదుకునే విషయంలో నిబంధనలను చూడొద్దు. మానవతా దృక్పథంతో ఆలోచించి కాస్త ఉదారంగా పరిహారం అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్తో పాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులెవ్వరూ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, అందరి ముఖంలో చిరునవ్వులు చూడాలని చెప్పారు. కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేసి.. ప్రజల ఇబ్బందులను విని, తక్షణమే పరిష్కరించాలని సూచించారు. నంద్యాల డివిజన్లో ఇటీవల సంభవించిన వరదలతో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ఆకస్మికంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే (హెలికాఫ్టర్ ద్వారా) ద్వారా పరిశీలించారు. అనంతరం నంద్యాల మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని వరద ప్రభావంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత వరద ప్రభావం గురించి నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో డ్యాములన్నీ నిండాయి. పొలాలు కూడా తడవాలని దేవుడు దయతలిచాడు. అందుకే వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఒక్క అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో సాధారణం కంటే 66 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. ఇవన్నీ మంచి పరిణామాలు. అయితే ఎక్కువ వర్షపాతంతో 17 మండలాల్లో కాస్త నష్టం వాటిల్లింది. ఇందులో ఆర్అండ్బీ రోడ్లకు రూ.421 కోట్ల నష్టం జరిగింది. పంచాయతీరాజ్లో రూ.103 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా వరదల వల్ల రూ.724 కోట్ల నష్టం వాటిల్లితే.. ఇందులో రోడ్లకు మాత్రమే రూ.524 కోట్ల నష్టం సంభవించింద’ని చెప్పారు. మానవతా దృక్పథంతో వ్యవహరించండి వరదలతో నష్టపోయిన రైతులు, సాధారణ ప్రజలకు సాయం చేసే విషయంలో గిరిగీసుకుని ఇంతే ఇస్తామనే ఆలోచన వద్దని ముఖ్యమంత్రి అన్నారు. ఆదుకోవడమే ధ్యేయంగా వ్యవహరించాలని చెప్పారు. ‘వరదల వల్ల ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 33 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రైతులందరికీ న్యాయం చేస్తామని చెబుతున్నా. బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవ్వండి. దెబ్బతిన్న ఇళ్లు, పశువులకు గాను రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో గతంతో పోలిస్తే 15 శాతం పెంచి ఇవ్వాలి. గతంలో లాగా వరద వచ్చినపుడు పట్టించుకోరనే మాట వినపడకూడదు. వైఖరి మారాలి. గతంలో 10 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు 25 కేజీలు ఇవ్వండని చెబుతున్నా. అలాగే గతంలో జరగని విధంగా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అదనంగా ఇవ్వాలని చెబుతున్నా. ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉండి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తారు. అందరికీ అవసరమయ్యే సహాయ సహకారాలు అందిస్తారు. ఆయనతో పాటు మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఇక్కడే ఉంటారు. వర్షాలతో కాస్త కష్టం, నష్టం ఎదురైనా మంచి వర్షాలు కురిపించినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కుందూ నదికి వరద వస్తే పరివాహక గ్రామాలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళిక రూపొందిస్తాం. నంద్యాల నియోజకవర్గంలోని చామకాలవ గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించి రక్షణగోడ నిర్మించేందుకు రూ.వంద కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే శిల్పా రవి చెప్పారు. కొన్ని పనులు కూడా చేశారని చెప్పారు. ఈ పనులకు కూడా తిరిగి అంచనాలు రూపొందించి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘సీమ’ ఎడారి కాకూడదనేదే లక్ష్యం రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను నింపేందుకు ప్రస్తుతం 90 నుంచి 120 రోజుల పాటు నీళ్లు తీసుకోవాలంటే కష్టమవుతోందని సీఎం అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉండటం లేదని, లభ్యత చాలా తక్కువగా (ఈ ఏడాది కాదు) ఉందని చెప్పారు. ‘గత 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కలు పరిశీలిస్తే ఏడాదికి 1,200 టీఎంసీలు వస్తున్నాయని తెలిసింది. కానీ గత పదేళ్ల లెక్కలు తీస్తే అవి కాస్తా 600 టీఎంసీలకే పడిపోయాయి. గత ఐదేళ్లలో చూస్తే 400 టీఎంసీలకే పడిపోయాయని తేలింది. దేవుడి దయతో ఈ ఏడాది ఇబ్బంది లేదు. మామూలుగా రాయలసీమలోని డ్యామ్లు, రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపుకోవాలంటే గతంలో లాగా 90 నుంచి 120 రోజుల పాటు నీటిని తెచ్చుకోవాలంటే కుదరదు. కేవలం 40 – 45 రోజుల్లోనే నింపుకునే పరిస్థితి రావాలి. అందుకే రిజర్వాయర్లకు వెళ్లే ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే ‘సీమ’లోని అన్ని డ్యామ్లు, రిజర్వాయర్లు నిండుతాయి. ఆ విధంగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ►కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా.. ఏ అధికారైనా పట్టించుకోకపోయినా ఈ సెల్ దృష్టికి తీసుకెళ్లండి. వెంటనే స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తారు. అధికారులంతా కాస్త ఉదారంగా వ్యవహరించండి. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. అందరి ముఖంలో చిరునవ్వు చూడాలి. ►శ్రీశైలం డ్యామ్కు 40 ఏళ్ల కిందట 1,200 టీఎంసీలు వస్తే.. గత ఐదేళ్లలో 400 టీఎంసీలకు తగ్గిపోయిన పరిస్థితి. మరోవైపు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు. అది పూర్తయితే మరో వంద టీఎంసీలు తగ్గిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కృష్ణా ఆయకట్టును బతికించుకోవడానికి, రాయలసీమ ఎడారి కాకుండా రక్షించుకోవడానికి చాలా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రితోనూ చర్చించాం. -
నంద్యాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కర్నూలు జిల్లా ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో పర్యటించి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదు రోజులుగా నంద్యాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూకు చేరుకుంది. దీంతో నంద్యాల పట్టణాన్ని వరదనీరు చుట్టుముట్టింది. పట్టణంలోని శ్యామకాల్వ, మద్దిలేరువాగు, కుందూనది ఉప్పొంగి ప్రవహించడంతో పీవీనగర్, హరిజనపేట, అరుం«ధతినగర్, బైటిపేట, ఘట్టాల్నగర్, గాంధీనగర్, బొగ్గులైన్, గుడిపాటిగడ్డ, సలీంనగర్, శ్యాంనగర్, టీచర్స్కాలనీ, విశ్వనగర్, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, హౌసింగ్బోర్డు, తదితర కాలనీలు జలమయమయ్యాయి. పైనుంచి వస్తున్న వరదనీరు అంతా నంద్యాలలోని కుందూనదిలో కలుస్తుండటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. మద్దిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పీవీనగర్, హరిజనపేటను నీళ్లు చుట్టు ముట్టాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన ముంపు ప్రాంతాల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరాం పర్యటించారు. మహానంది మండలం గాజులపల్లెలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స అన్నారు. మంత్రుల వెంట ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. -
బాధితులకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, దేవిపట్నం : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు (లాంచీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సీఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
చక్కెర్లు కొట్టిన ‘యురేనియం అలజడి’
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (నల్గొండ) : యురేనియం అలజడితో మండలంలోని పెద్దగట్టు, నంబాపురం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యురేనియం తవ్వకాలు జరుగుతాయా.. ఇందుకోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారా అని ఇంతకాలం అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయా గ్రామాల ప్రజలకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడంలేదు. తాజాగా పెద్దగట్టు, నంబాపురం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం 11గంటల సమయంలో హెలికాప్టర్ విహరించడంతో యురేనియం కోసమే ఆకాశమార్గాన సర్వే నిర్వహించినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని, యురేనియం కోసం అన్వేషించే ప్రయత్నాలు చేయడం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. యురేనియం ప్లాంట్ ఏర్పాటు వల్ల జరిగే అనార్థాలతో ప్రజలు యురేనియం అంటేనే మండిపడుతున్నారు. వీరికి ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలుపుతుండడంతో ప్రజలు యురేనియం ప్లాంట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హెలికాప్టర్ ఏరియల్ సర్వే కోసం వచ్చినట్లు భావించి యురేనియం ప్లాంట్ను, యురేనియం కోసం అన్వేషించడం, ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దగట్టు, నంబాపురం గ్రామాల ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమద్కు వినతిపత్రం అందించారు. హెలికాప్టర్ యురేనియం సర్వేకు వచ్చిందా లేదా అని చెప్పాల్సిందిగా ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరారు. వినతిపత్రం అందించిన వారిలో పెద్దగట్టు సర్పంచ్ నరేందర్నాయక్, గ్రామస్తులు నాగయ్య, దూద్య తదితరులున్నారు. -
ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే
సాక్షి, విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్ ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. -
‘బాధిత కుటుంబాలకు రూ. 5వేల అదనపు సహాయం’
సాక్షి, రాజమండ్రి : గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయంతోపాటు అదనంగా రూ. 5వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ సహాయం కూడా అందనుంది. గురువారం ముంపు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ బిల్డింగ్లో సీఎం వైఎస్ జగన్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్లు, పంటలు నష్టపోయినా వారికి నిబంధనల ప్రకారం అందే సాయం కాకుండా ప్రత్యేకంగా రూ. 5 వేల సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నట్టు తెలిపారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. అందుకోసమే రూ. 5వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ముంపుకు గురైన గ్రామాల్లోనే కాకుండా.. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు దెబ్బతింటే.. వారికి పరిహారంతో పాటు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు అందజేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కండపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరిలో 10, 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని.. కానీ ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు పెరిగిందని వారు సీఎం జగన్కు వివరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకోని.. అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలోకి వచ్చే వరద, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. త్వరగా ముంపుకు గురయ్యే ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా, సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్ను నియమిస్తున్నట్టు తెలిపారు. చదవండి : పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే -
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. వరద ముంపుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత తాడేపల్లి బయల్దేరి వెళతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటారు. వెంటనే ఆయన పోలవరం ఏరియల్ సర్వేకు బయల్దేరతారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు భారీగా వస్తోంది. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన పొగిడింపు కారణంగా గురువారం పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు ముఖ్యమంత్రికి బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. -
ఒడిశాకు రూ.1,000 కోట్లు
భువనేశ్వర్: ప్రధాని మోదీ సోమవారం ఒడిశాలోని ‘ఫొని’ తుపాను బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ఇప్పటికే అందజేసిన రూ.381 కోట్లకు అదనంగా తక్షణం రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రకటించారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన 34 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందిస్తామని ప్రధాని తెలిపారు. ఏటా ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మారిన ఒడిశా, మిగతా తీరప్రాంత రాష్ట్రాల కోసం దీర్ఘకాలిక పరిష్కారం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రాణనష్టాన్ని కనిష్టానికి తగ్గించిన సీఎం నవీన్ పట్నాయక్ను ఆయన అభినందించారు. అనంతరం భువనేశ్వర్లో సీఎం అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.ఫొని కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన నీట్ను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. ఫోన్ చేస్తే మమత మాట్లాడలేదు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఫోన్కాల్ను స్వీకరించలేదని, ఆమె తిరిగి తనకు ఫోన్ చేయలేదని మోదీ చెప్పారు. రాష్ట్రంలో ఫొని తుపానుతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు రెండు సార్లు ఫోన్ చేసినా ఆమె మాట్లాడలేదని, తుపాను నష్టంపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా ఆమె స్పందించలేదని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో, జార్ఖండ్లోని చైబాసాలో సోమవారం ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం తెల్సుకునేందుకు బెంగాల్ సీఎం మమతకు రెండుసార్లు ఫోన్ చేశా. అయినా, ఆమె నాతో మాట్లాడటానికి నిరాకరించారు. ఆమెకు ప్రజల బాగోగులు పట్టవు’ అని అన్నారు. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ మిగతా విడత ఎన్నికల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుతో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ సవాల్ విసిరారు. బోఫోర్స్ కుంభకోణం తదితర అంశాలపైనా చర్చకు రావాలన్నారు. ‘కోల్కతాలోని నా కార్యాలయానికి మోదీ ఫోన్ చేసినపుడులో ఖరగ్పూర్లో తుపాను సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా. అందుకే ఫోన్ మాట్లాడలేదు’ అని మమత వివరణ ఇచ్చారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే
సాక్షి, రాజమండ్రి: ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. 2006 తర్వాత అతిపెద్ద వరదలు వచ్చాయన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 19 మండల్లాలో 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని తెలిపారు. 16 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయని వెల్లడించారు. 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ మూలంగా ఎక్కువ నష్టం జరిగింది. ఎర్ర కాలువ ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లకు 35 కోట్లు కేటాయిస్తాం. రాయలసీమలో కరువు ఉంది. కోస్తాలో వరదలు వచ్చాయి. కవల పిల్లల మాదిరిగా రెండు సమస్యలు ఉన్నాయి. గోదావరి నుంచి ఇప్పటికే 1500 టీఎంసీల జలాలు సముద్రం పాలయ్యాయి. ఆరు జిల్లాలో కరువు ఉంది. పోలవరం కోసం కేంద్రం నుంచి 2600 కోట్లు రావాల్సి ఉంది. వరదల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో 600 కోట్ల నష్టం జరిగింద’ని తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. -
ఏరియల్ సర్వేలో పత్రికా వీక్షణం
యశవంతపుర: ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వరద బాధిత జిల్లాల్లో హెలికాప్టర్లో ఏరియల్ సర్వే సమయంలో దినపత్రిక చదవడం విమర్శలకు తావిస్తోంది. విహంగ వీక్షణంలో పేపర్ను చూస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో సీఎం వైఖరిపై విమర్శలు తప్పడం లేదు. మైసూరు నుంచి హిరియాపట్టణ వరకు సీఎం ఏరియల్ సర్వే చేశారు. వందలాది గ్రామాలు నీటమునిగాయి, రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి, ఆ సమయంలో పేపర్లో తలదూర్చడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలు బీజేపీ పనేనని, తనపై ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని కుమారస్వామి దుయ్యబట్టారు. -
కేరళలో ప్రధాని ఏరియల్ సర్వే
-
తక్షణ సాయం100 కోట్లు
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్నాథ్ తెలిపారు. అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్నాథ్కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజ్నాథ్ పర్యటన
తిరువనంతపురం : కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏరియల్ సర్వే చేశారు. రాజ్నాథ్ సింగ్ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ ఇతర ఉన్నతాధికారులున్నారు. కేరళలో పోటెత్తిన వరదలతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారని, వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నష్టాన్ని మదింపు వేశారని సీఎంఓ కేరళ ట్వీట్ చేసింది. భారీ వర్షాలు ముంచెత్తడంతో కేరళ వరద తాకిడికి గురైంది. ఇడుక్కి, ఇదమలయార్ రిజర్వాయర్లలో వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వరద తీవ్రతతో కేరళలో ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో 31 మంది మరణించారని అధికారులు తెలిపారు. -
గడ్డు పరిస్థితి.. 24 జిల్లాలు వరదల్లో..
లకీంపూర్: అసోంలో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు పలు జిల్లాలను జలమయం చేశాయి. వందల సంఖ్యలో ఊర్లు నీళ్లలో నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల వారిని పల్లపు ప్రాంతాలవైపునకు తరలిస్తున్నారు. దాదాపు 24 జిల్లాలకు చెందిన 15 లక్షలమంది ఈ వరదల ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్న నేపథ్యంలో గురువారం కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు ఏరియల్ సర్వే నిర్వహించారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ పోర్స్, నీతి ఆయోగ్, నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటికీ చెందిన అధికారులతో కలిసి ఆయన ఈ సర్వే నిర్వహించారు. అంతకంటే ముందు ఆయన లకీంపూర్లోని జిల్లా అధికారులతో భేటీ అయ్యి ప్రస్తుత పరిస్థితిపై వాకబు చేశారు. అలాగే, బాగా దెబ్బతిన్న పస్నోయి బాలిడాన్ అనే గ్రామాన్ని సందర్శించారు. ఒక్క లకీంపూర్ జిల్లాలోనే మూడు లక్షలమంది వరదల భారీన పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లోని నదులన్నీ కూడా నీటి మట్లాలు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. -
కరీంనగర్లో కేసీఆర్ ఏరియల్ సర్వే
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు కేసీఆర్ వెంట చీఫ్ సెక్రటరీ, మంత్రి హరీష్ రావు, ఎంపీలు వినోద్, సుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. గండిపడ్డ మిడ్ మానేర్ను పరిశీలించిన అనంతరం సీఎం... అధికారులతో సమీక్షించనున్నారు. కాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్కు హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రికి వాతావరణం సరిగ్గా లేదని సూచించడంతో.. రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మరోవైపు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. మానేరు, మోయతుమ్మద వాగులతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, బిక్కవాగు ఉప్పొంగాయి. సిరిసిల్ల డివిజన్లో అధిక వర్షాలు కురవడంతోపాటు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతూ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
హరితహారం కోసం సీఎం ఏరియల్ సర్వే
హైదరాబాద్: ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన భూమికి చేరువగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. జాతీయ రహదారిపై ఒక్క నిమిషంలో లక్ష మొక్కలను నాటే బృహత్తర యజ్ఞాన్ని కేసీఆర్ వీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే ప్రజలకు హెలికాప్టర్ నుంచే అభివాదం చేస్తారని అధికారులు వెల్లడించారు. -
ఏరియల్ సర్వే
► హెలికాప్టర్ నుంచి పుష్కరఘాట్లను ► పరిశీలించిన అదనపు డీజీపీ, ఉన్నతాధికారులు ► జూరాల నుంచి నాగార్జున్సాగర్ వరకు పర్యటన ► సర్వేలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ► పుష్కరాల ఏర్పాట్లు చకచకా ► పూర్తిచేయాలని కోరిన డీజీపీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న ఘాట్లను రాష్ట్ర అదనపు డీజీపీ(లాఅండ్ ఆర్డర్) అంజన్కుమార్, హైదరాబాద్ రీజియన్ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారంకృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన డీజీపీ నేరుగా జూరాల ప్రాజెక్టు మీదుగా బీచుపల్లి, అలంపూర్, సోమశిల తదితర ఘాట్లను పరిశీలించుకుంటూ నాగార్జున్సాగర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన 32 ఘాట్లమ్యాప్ను అదనపు డీజీపీ స్వయంగా పరిశీలిస్తూ.. హెలిక్యాప్టర్ నుంచి ఆయా ఘాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఘాట్ల వివరాలు తీసుకుని త్వరగా పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్ను కోరినట్లు సమాచారం. జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ వద్ద చర్చించినట్లు తెలిసింది. కేవలం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కోసం అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ఉన్న బీచుపల్లి పుష్కరఘాట్కు కిలోమీటర్ దూరంలో వాహనాలు మొత్తం నిలిపివేయాలని కేవలం వీఐపీ తప్ప ఇతర వాహనాలకు లోపలికి అనుమతి లేకుండా అవసరమైన ప్రణాళిక ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బందోబస్తుపరంగా జిల్లా పోలీసుశాఖ నుంచి పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేయాలని అదనపు డీజీపీ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని కోరినట్లు సమాచారం. వారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. -
విహంగ వీక్షణం
♦ నల్లవాగు, గట్టులింగంపల్లి పరిసరాలపై మంత్రి హరీశ్రావు ఏరియల్ వ్యూ ♦ తాగు,సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులతో చర్చలు నారాయణఖేడ్/కల్హేర్/మనూరు: గట్టులింగంపల్లి, నల్లవాగు ప్రాజెక్టులను రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉదయం 10 గంటల కు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుం చి నారాయణఖేడ్ వచ్చారు. తొలుత సింగూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మనూరు మండలంలోని గట్టులింగంపల్లి చెరువును, కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి నీళ్ల మళ్లింపు, గట్టులింగంపల్లి ప్రాజెక్టులోకి సింగూరు నీరు మళ్లించే విషయమై సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. నల్లవాగు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరఫరా చేసే విషయమై ఈ సర్వే చేపట్టారు. నల్లవాగు ప్రాజెక్టు పరిసరాలను ఆయన సుల్తానాబాద్, గోసాయిపల్లి, అంతర్గాం, కంగ్టి మండలం నాగన్పల్లి, పోట్పల్లి, నిజామాబాద్ జిల్లా తిమ్మనగర్ వరకు పర్యటించి విహంగ వీక్షణం చేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి అధికారుల సలహా సూచనలు స్వీకరించారు. అనంతరం మంత్రి గంగాపూ ర్లో మిషన్ కాకతీయ 2వ ఫేజ్ పనులను ప్రారంభించారు. సాయంత్రం 4కి తిరిగి హెలికాప్టర్ ద్వారా మంత్రి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లారు. చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనాలు గట్టులింగంపల్లి చెరువు గురించి మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమై న ‘గట్టు కదిలిక’, మంత్రి ఏరియల్ సర్వే కు రానున్నారనే విషయాలను మండల ప్రజలు ఆసక్తిగా చదివారు. ఈ చెరువు ప్రాజెక్టు రూపుదాలిస్తే మనూరు మండలానికి మంచి రోజులు వస్తాయని ప్రజ లు చర్చించుకోవడం కనిపించింది. మం త్రి పర్యటను ఆసక్తిగా తిలకించారు. ‘ఖేడ్’ దుఃఖం తీరుస్తా.. నీటి సమస్యను పరిష్కరిస్తా.. జిల్లాకు రూ.10 కోట్లు వస్తే.. ఖేడ్కే రూ.1.80 కోట్లు చిమ్నీమాయి కొడుకు పెళ్లికి వెళ్దాం మంత్రి హరీశ్రావు నారాయణఖేడ్: ‘నారాయణఖేడ్ ని యోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి, హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా.. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను.. నా శక్తినంతా ఉపయోగించి ఖేడ్ నియోజకవర్గ ప్రజల దుఃఖం దూరం చేస్తా.. ఖేడ్ను దత్తత తీసుకుంటానని చెప్పాను.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా..’ అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్వేగంతో అన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్రెడ్డి ఎన్నికైన సందర్భంగా స్థానిక రహమాన్ ఫంక్షన్హాలులో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రేమాభిమానాలతో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను పొందుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారను. నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాల్సి ఉందన్నారు. నీళ్ల కోసం గోస పడుతున్న సర్దార్ తండాలోని చిమ్నీమాయి వంటి వారి సమస్యలను పరిష్కరిద్దామని, చిమ్నీమాయి కొడుకు పెళ్లికి కూడా వెళ్దామని మంత్రి అన్నారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. జిల్లాకు తాగునీటి కోసం రూ.10.80 కోట్లు రాగా తన సిద్దిపేకు కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకొని నారాయణఖేడ్కు రూ.1.80 కోట్లు ఇచ్చినట్లు తెలి పారు. ప్రాంతంలో గురుకులాలను ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులు ఇక్కడే ఉండి చదువుకునేలా చూస్తానని మంత్రి హరీష్రావు అన్నారు. ఖేడ్లో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ షురూ ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణఖేడ్లోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం. బెడ్రూం, డైనింగ్ హాల్ ఇతర ఆధునిక సాంకేతిక హంగులతో దీన్ని రూపొందించారు. మంగళవారం మంత్రి హరీశ్రావు దీన్ని ప్రారంభించారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ ఈ క్యాంపు ఆఫీస్లోనే బస చేస్తారు. రోజంతా ఇక్కడే గడిపి ఖేడ్ అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. మరోపక్క మంత్రి హరీశ్రావు సైతం వీలైతే 15 రోజులకు లేదా నెలకోసారి వస్తానని ప్రకటించారు. ఏళ్లకేళ్లుగా అభివృద్ధి జాడలేక నెర్రెలు బాసిన నారాయణఖేడ్ ఇప్పుడిప్పుడే కొత్తరూపు దాల్చుతోంది. నీళ్లు.. బళ్లు.. రోడ్లు.. భవనాలు ఇలా ప్రతి పనికి లెక్కగట్టి అధికారులు నిధులిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ఇలా చేయడం పీఐబీకి అలవాటే....
న్యూఢిల్లీ : చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ సర్వేకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ ఇలా అభాసుపాలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేసిన సమయంలో.. ఆయన ఫొటోలను కూడా ఇదే విధంగా ఫొటోషాప్ చేసి విడుదల చేసిందట. ఈ మేరకు తమ సర్వేలో వెల్లడైందని ఎన్డీటీవీ మంగళవారం వెల్లడించింది. అయితే అందుకు సంబంధించిన చిత్రాలు మాత్రం ప్రస్తుతం పీఐబీ వద్ద లేవని తెలిపింది. చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెన్నై మహానగరంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అందులోభాగంగా ఆయన కిటికిలో నుంచి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఆ దృశ్యాలను పీఐబీ ఫొటోషాప్ చేసి విడుదల చేసింది. ప్రధాని చూస్తున్న ఏరియల్ వ్యూలో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తు భవనాలు అత్యంత సమీపంలో ఉన్నట్లు మార్చిన ఫొటోలను ఉంచారు. సహజంగా ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేస్తున్న వారికి భూ భాగం పైన అంతా పచ్చగా కనిపిస్తుంది తప్ప, ఇళ్లు, అపార్టుమెంట్ల వంటి భవనాలు స్పష్టంగా కనిపించవు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నాలుక కరుచుకున్న పీఐబీలను వెబ్సైట్ నుంచి తొలగించి తిరిగి మామూలు ఫోటోలు పెట్టి వివరణ ఇచ్చుకుంది. అయితే మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి నెట్జనులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వ్యంగోక్తులు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ సర్వే నిర్వహించింది. -
రూ. 5 వేల కోట్లివ్వండి: జయలలిత
చెన్నై: కేంద్రం తమకు వరద సహాయంగా రూ.5000 కోట్లను ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానికి విన్నవించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆమె ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె మంత్రులు, అధికారులతో సమావేశమై వరద బీభత్సానికి గురైన చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పన్నీర్ సెల్వంతో పాటు ఇతర మంత్రులకు వివిధ జిల్లాల్లో సహాయక చర్యల బాధ్యతలను అప్పగించారు. చెన్నైతో పాటు వరద ప్రభావానికి గురైన తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 460 పునరావాస కేంద్రాల్లో మొత్తం 1.64 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నట్లు జయలలిత ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే బాధితులకు 41 లక్షల ఆహార ప్యాకెట్లను అందించినట్లు తెలిపారు. అపార్టుమెంట్ల నుంచి బయటకు రాలేకపోతున్న వారికి బోట్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టగానే విద్యుత్ పునరుద్ధరిస్తామని తెలిపారు. -
తమిళనాడుకు 1,000 కోట్ల సాయం
అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. వర్షాలకు ఛిన్నాభిన్నమైన చెన్నైతో పాటు పలు జిల్లాల్లో ఆయన గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడులో వర్ష బీభత్సాన్ని, ప్రజల ఇక్కట్లను ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. కేంద్ర మంత్రి రాధాకృష్ణన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఐఎన్ఎస్ అడయార్ నావెల్ బేస్లో ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. ముందుగా తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ‘‘మీకు మద్దతుగా ఉంటాను’’ అంటూ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు చెప్పారు. ఇంతకు ముందు కేంద్రం తమిళనాడుకు రూ. 940 కోట్ల సాయం ప్రకటించిందని, ఇప్పుడు ప్రకటించిన మొత్తం దానికి అదనమని ఆయన తెలిపారు. తమిళనాడులోని దుర్భర పరిస్థితులను, జరిగిన నష్టాన్ని స్వయంగా చూశానని, ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ రోశయ్యతో సమావేశమైన ప్రధాని మోదీ రాష్ట్రంలో వరద బీభత్సంపై వారిని అడిగి తెలుసుకున్నారు. వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం వరద సాయంపై మోదీ ప్రకటన చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నైకి సమీపంలోని అరక్కోణంలోని ఐఎన్ఎస్ రాజాలి నావల్ వర్కింగ్ స్టేషన్కు చేరుకున్నారు. వరద సహాయ చర్యలు, తమిళనాడులో పరిస్థితులకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. అనంతరం ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్లో వరద ప్రభావిత ప్రాంతాలైన చెన్నైతో పాటు కాంచీపురం, తిరువల్లురు జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళానాడు ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. -
సీఎం ఏరియల్ సర్వే
తిరువళ్లూరు: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జయలలిత అధికారులతో కలిసి హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ 28 నుంచి భారీ వర్షాలు మెదలైన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, చెన్నై తదితర జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై నగరాన్ని వ రదలు నిలువునా ముంచెత్తడంతో భారీగా ఏర్పడిన నష్టం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. వాస్తవానికి బుధవారమే ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. చెన్నై నుంచి ఉదయం 9.30 గంటలకు కొరట్టూరు పురం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఈకాడుతాంగెల్, కొలత్తూరు, అడయార్, వేళచ్చేరీ, తిరువొత్తియూర్, ఊరపాక్కం, తాంబరం, ముడిచ్చూర్, మడిపాక్కం, పాపాన్సత్రం, సోలింగనల్లూరు, వ్యాసార్పాడి తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లాలోనీ సడయన్పాక్కం, మడత్తుకుప్పం, రేట్టేరీ, పుళల్, పూండీ, చెమరంబాక్కం, మనలిపుదునగర్ తదితర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు గంటల పాటు పర్యటించి సర్వే నిర్వహించారు. అధికారులతో అత్యవసర సమావేశం : చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అధికారులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద భాదితులకు అందుతున్న సహయక చర్యలను అధికారుల నుండి అడి గి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, నష్టనివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను అదేశించారు. సహయక చర్యల్లో విమర్శలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు. ఇప్పటి వరకు ఏర్పాటు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వుంటున్న నిరాశ్రయులకు చాప, బెడ్షీట్లను అంద జేయాలని ఆదేశాలు జారీ చేసారు. సహయక చర్యల్లో పాల్గొనండి : వరద బాధితులకు అండగా పార్టీ నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారపదార్థాలను అందజేయాలని సూచించారు. చెరువులు, వాగులు వంకలు కొట్టుకు పోతే వాటిని సరిచేయడానికి పార్టీ నేతలు తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఆయన సూచించారు. -
తమిళనాడులో మోదీ ఏరియల్ సర్వే
-
చెన్నైలో మోదీ ఏరియల్ సర్వే.. జయతో భేటీ
చెన్నై: భారీ వరదలతో అతలాకుతలమైన చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో వేలూర్, రాజాలి ఎయిర్బేస్కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 269మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఫొటోల కోసం క్లిక్ చేయండి -
చెన్నైలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
-
వీడని వాన
పొంగుతున్న వాగులు, వంకలు కలవరపడుతున్న జిల్లావాసులు పంటలకు భారీ నష్టం బిక్కుబిక్కుమంటున్న ముంపు బాధితులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే తిరుపతి: ఇప్పుడిప్పుడే వర్షం తగ్గిందనుకుంటున్న తరుణంలో బుధవారం మళ్లీ వర్షం మొదలవ్వడం జిల్లావాసులను బెంబేలెత్తిస్తోంది. మధ్యాహ్నం కాస్త తెరపిచ్చినా సాయంత్రం నుంచి తిరిగి వాన జోరందుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశ మార్చుకోవడంతో వర్షం మొదలైందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీంతో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా అన్ని పనులు మానుకుని ఇంటిపట్టునే ఉండిపోవడంతో పలువురికి ఉపాధికి దెబ్బపడింది. వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. నిత్యావసర వస్తువులు మినహా ఇతరాత్ర అన్ని దుకాణాలు వెలవెలపోతున్నాయి. రోడ్డు, రైల్వే మార్గాలను పునరుద్ధరిస్తున్న తరుణంలో వర్షం ఊపందుకోవడంతో అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమార్గంలో రాకపోకలు నిలిపివేస్తారోనన్న భయం ప్రయాణికులను వెంటాడుతోంది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. శ్రీకాళహస్తి ప ట్టణంలో ముంపు బాధితప్రాంతాలను ఎంపీ వరప్రసాద్ సందర్శిం చారు. తాజావానలతో ముంపు బాధితులు కలవరపడుతున్నారు. నగరి నియోజక వర్గంలో వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలలో ఎమ్యేల్యే రోజా పర్యటించారు. అధికారుల కాకిలెక్కలు... తుఫాన్ వల్ల భారీనష్టం జరిగినా క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా అధికారు లు కాకిలెక్కలతో మభ్యపెడుతున్నారు. కేవలం 770 హెక్టార్లలో ఉద్యాన పంట లు, 2637 హెక్టార్లలో అన్ని రకాల పం టలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నివేదికలకు వాస్తవానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని రైతులు, రైతుసంఘాల నాయకులంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నా అధికారులు మాత్రం వాటి సంఖ్యను స్వల్పంగానే చూపిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలో దాదాపు 90 శా తంకు పైగా చెరువులు నిండినట్లు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొట్టంబేడు మండలం పెద్ద కనపర్తి వద్ద తెలుగుగంగ కాలువకు గండ్లు పడటంతో లోతట్టు గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. కనపర్తి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకొంది..46 చెరువులకు గండ్లు పడ్డాయి. మంత్రుల సమీక్ష... తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై మంత్రులు చినరాజప్ప, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. భాధిత కుటుంబాలకు 25 కిలో బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్,కేజీ కందిప్పు,చక్కెర,పామాయిల్ ఇస్తున్నట్లు తెలిపారు హుద్ తుఫాను మాదిరే నష్ట పరిహారం ఇస్తామన్నారు. హోమంత్రి చిన్న రాజప్ప మాట్లాడుతూ ఈ వర్షాలు సీమ జిల్లాలకు మేలు కలిగేలా ఉన్నాయని తెలిపారు.37 పునరావాస కేంద్రాలు ఏర్పాట చేసి 5000ల మందిని తరలించినట్లు వివరించారు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. చనిపోయిన పశువుకు రూ 20,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. నేడు విద్యాసంస్థలకు సెలవు చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యాసంస్థలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొండెక్కిన కూరగాయలు... తుఫాన్ కారణంగా కూరగాయల దిగుమతికి అంతరాయం కల్గడంతో ధరలు చుక్కలన్నంటాయి. టమోటా మాత్రమే కొండెక్కిందంటే కిలో వంకాయలు సైతం రూ 50 ధర పలికాయి. ఏ కాయగూర కొందామన్నా కిలో రూ.40- 60 మధ్య ధర పలికింది. ఆకు కూర సైతం కట్ట రూ. 15 రూపాయలకు అమ్మడం గమనార్హం.. సీఎం ఏరియల్ సర్వే... తుఫాను ప్రభావిత ప్రాంతా ల్లో మఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 20 నిమిషాల పాటు ఏరియల్ సర్వే చేశారు. కాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, నెల్లూరు జిల్లాలోని నాయుడు పేట ప్రాంతాల్లో పర్యటించి అంచనా వేశారు. -
మన్యం మంటలు
* బాక్సైట్ తవ్వకాలపై ప్రజాగ్రహం * విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు.. నేడు మన్యం బంద్ సాక్షి, విశాఖపట్నం: బాక్సైట్ తవ్వకాలకు రాష్ర్టప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం మండి పడుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని పాడేరులో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. శనివారం మన్యం బంద్కు పిలుపు నిచ్చింది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక నుంచి ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని తీర్మానించింది. సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన సర్కార్.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేందుకు పోలీసుల నిర్బంధాలు, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముగ్గురు ఆదివాసీలను మావోలు కిడ్నాప్ చేసినప్పుడు తవ్వకాలు జరపబోమని అర్ధరాత్రి ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన చుట్టూ ఉండే పారిశ్రామిక కోటరీ కోసం అనుమతులిచ్చారని ఆమె విమర్శించారు. తొలుత అఖిల పక్షం ఆధ్వర్యంలో పాడేరులో బైక్ ర్యాలీ చేశారు. ఉన్నతాధికారుల ఏరియల్సర్వే బాక్సైట్ తవ్వకాలకై జీవో జారీ చేసిన మర్నాడే సీఆర్పీఎఫ్ ఏడీజీ(అడిషనల్ డెరైక్టర్ జనరల్) పి.వి.కె.రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీ నుంచి చేరుకున్న ఈ బృందం ముంచంగిపుట్టు, మల్కన్గిరిలలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను తనిఖీ చేసింది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
హోం మంత్రి నాయిని ఏరియల్ సర్వే
-
శాటిలైట్ సాయంతో తుడా మాస్టర్ ప్లాన్
తిరుపతి తుడా: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్కు శాటిలైట్ సహాయం తీసుకోనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులతో ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం అధికారులతో చర్చించి ప్లాన్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) మాస్టర్ ప్లాన్కు కసరత్తు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఆరు నెలలుగా మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసేందుకు తుడా కృషి చేస్తోంది. ఎట్టకేలకు ఢిల్లీకి చెందిన లీ కన్సల్టెన్సీ బృందం తుడా మాస్టర్ ప్లాన్కు ముందుకొచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో తొమ్మిది నెలల కాల వ్యవధికి తుడాకు మాస్టర్ ప్లాన్ పూర్తి చేసిచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధుల బృందం సమావేశమై చర్చించింది. శనివారం రోజున మరోసారి లీ బృందం తుడా అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో శాటిలైట్, ఏరియల్ సర్వేపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. తుడా పరిధిలోకి తొమ్మిది మండలాలు (తిరుపతి అర్బన్,రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, వడమాలపేట, రామచంద్రాపురం, పుత్తూరు మండలాలు) వస్తాయి. ఈ తొమ్మిది మండలాలను కలుపుతూ తుడా మాస్టర్ ప్లాన్ కోసం లీ బృందం శాటిలైట్ సహాయం తీసుకోనుంది. అదేవిధంగా ఆగస్టు మూడో వారంలోపు ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందుకు లీ బృందం తుడా సహకారం కోరినట్టు అధికారులు తెలిసింది. ఆగస్టులో పర్యటన తుడా మాస్టర్ ప్లాన్కు సంబంధించి లీ కన్సల్టెన్సీ బృందం ఆగస్టు మూడోవారంలో పూర్తి స్థాయిలో పర్యటించనునంది. ఆ సంస్థకు చెందిన ప్రధాన బృందం ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి తుడా పరిధిని పర్యవేక్షిస్తారు. తుడా పరిధిలోని గ్రామాలు, ప్రధాన రోడ్లు, ైరె ల్వే మార్గాలు, చెరువులు, కాలువలు, భూముల వివరాలతో పక్కా మాస్టర్ ప్రింట్ను సిద్ధం చేయనున్నారు. మూడు నెలల్లో ముందుగా బ్లూప్రింట్ సిద్ధం చేయాలి తుడా వీసీ లీ కన్సల్టెన్సీని ఆదేశించారు. -
కొల్లేరు పై ఏరియల్ సర్వే చేసిన కేంద్ర మంత్రులు
కైకలూరు (పశ్చిమ గోదావరి) : కొల్లేరు సమస్యలపై 15 రోజుల్లో అధ్యయనం చేసి పూర్తి వివరాలు అవగాహన చేసుకుంటానని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి శుక్రవారం ఆయన హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోటలో సభావేదికపై జవదేకర్ మాట్లాడుతూ.. కొల్లేరు అంశం సుప్రీంకోర్టు ఎంపవర్ట్ కమిటీ అధీనంలో ఉందన్నారు. మరో 15 రోజుల్లో కొల్లేరులో ప్రజలు, పక్షులు అనే రెండు కోణాలను పరిశీలిస్తానన్నారు. బీజేపీకి 12 ఏళ్లుగా గొంతుకగా పనిచేశానని, కొల్లేరు ప్రజల తరఫున సుప్రీంకోర్టులో అదే విధంగా పనిచేస్తానన్నారు. విదేశాల నుంచి పక్షుల వలసలు వస్తాయి కానీ, ఇక్కడి ప్రజలు అక్కడికి వలసలు పోలేరన్నారు. మరో మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కొల్లేరు అంశం చట్టపరిధి దాటి సుప్రీం కోర్టు పరిధిలోకి చేరిందన్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అయ్యే పనికాదన్నారు. న్యాయపరంగా, శాస్త్రీయంగా అధ్యయనం అవసరమన్నారు. భూసేకరణను అడ్డుకోవడమంటే దేశాభివృద్ధిని అడ్డుకోవడమేనన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య స్పందించారు. కాంగ్రెస్ పాలనలో భూసేకరణ విధానాన్ని మార్పు చేయాలని ప్రధానిని పలు రాష్ట్రాలు కోరాయన్నారు. దీంతో 2014 జూన్ 27న మొత్తం 32 రాష్ట్ర ప్రతినిధులు హాజరు కాగా వారిలో 28 మంది మార్పు చేయాలని కోరారన్నారు. భూసేకరణ చట్టంలో 9 సవరణలు చేసి కమిటీ ముందు నిర్ణయం కాకముందే అంగుళం భూమి తీసుకోనివ్వం అనడం తగదన్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో కొల్లేరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. చేపల ఉత్పత్తులలో కొల్లేరు ప్రాంతం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వివరించారు. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలు.. ఇళ్లు కూలి 38 మంది మృతి
అహ్మద్నగర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్లో ఇళ్లు కూలిపోయి దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా ఆమ్రేయిల్ జిల్లాలో 28 మంది మృత్యువాత పడగా రాజ్కోట్లో నలుగురు, భవన్గర్లో ముగ్గురు, సూరత్లో ఇద్దరు బారుచ్, వల్సాద్ జిల్లాల నుంచి ఒక్కోక్కరూ ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవడంతో ముఖ్యమంత్రి ఆనంది బెన్ గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఘటనపై రాష్ట్ర పునరావాస శాఖ నుంచి ఓ అధికారి మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా గ్రామాల్లో పలు ఇండ్లు నేల మట్టమయ్యాయని చెప్పారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని, ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అయితే, ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే గతంలో ఇచ్చినదానికంటే ఎక్కువ నష్టపరిహారం ఇప్పించాలనుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని, రవాణా స్థంబించిందని, పరిస్థితులు అస్తవ్యవస్థంగా మారాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం కొంత మెరుగైన స్థితికి వచ్చినట్లు వివరించారు. -
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
* 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం * విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు * మొక్కల సంరక్షణకు గ్రామ హరిత రక్షణ క మిటీలు * జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఎఫ్వోలతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: హరిత హారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులకు పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అట వీ, హౌసింగ్ విభాగాల అధికారులతో సీఎం సమీక్షించారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. హరిత హారం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికోసం స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. హరిత హారంపై పోస్టర్లు, కరపత్రాలు, ఆడియో, వీడియో ప్రచారం, కవి సమ్మేళనాలు, అవధానాలు నిర్వహించాలన్నా రు. జూలై 3 నుంచి 10 వరకు హరిత వారో త్సవాలు నిర్వహించాలని అధికారుల్ని ఆదే శించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థుల్ని భాగస్వాములుగా చేయాలన్నారు. పోలీసులూ పాల్గొనాలి హరిత ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసులూ భారీగా పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయలో పాల్గొనడం ద్వారా పోలీసులు మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. నర్సరీల నుంచి గ్రామాలకు మొక్కలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల తహసీల్దార్లు, వీఆర్వో లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో గ్రామ హరిత రక్షణ కమిటీల్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎంతో సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ బస్సులోనే అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యక్రమాల్ని రూపొం దించాలని కలెక్టర్లను ఆదేశించారు. వారంలోగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలన్నారు. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాల నిమిత్తం సాంస్కృతిక సారథి బృందాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. నదీ పరివాహక ప్రాంతా లు, ప్రార్థనా స్థలాలు, రైల్వే భూములు, ఇతర ఖాళీ జాగాల్లోనూ మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పట్టణ ప్రాంత మొక్కలకు నీరు పోసేందుకు అగ్నిమాపక వాహనాలను వినియోగించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలు, ప్రార్థనా మందిరాల మైక్సెట్ల ద్వారా, ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రచారం కొనసాగించాలన్నారు. అర్చకులు, ఇమామ్లు, గురుద్వారాల నిర్వాహకులతోనూ సమావేశం నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షించాయని, ముఖ్యంగా వాటర్గ్రిడ్, టీఎస్ ఐపాస్లకు మంచి ఆదరణ లభించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ దేశంలో మొదటి 3 స్థానాల్లో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ కేశవరావు, సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకొచ్చినట్టో!
పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం మండలంలో పర్యటించారు. ఆయన హఠాత్తుగా జిల్లా పర్యటనకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశం కాగా.. ఓటుకు నోటు కేసునుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆకస్మిక పర్యటనకు వచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన చంద్రబాబు పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులను మాత్రం కేవలం ఏరియల్ సర్వే ద్వారా చూసి వెళ్లారు. ఓటుకు నోటు కేసు వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు హఠాత్తుగా ఇక్కడకు ఎందుకొచ్చారు.. పర్యటన మధ్యలో పోలవరం స్టేట్బ్యాంక్ వద్ద సుమారు పావుగంటసేపు కాన్వాయ్ని నిలిపివేసి ఫోన్లో ఎవరితో మంతనాలు సాగించారనే దానిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. పట్టిసీమ పనులు చూశారు.. పరిహారం మాట మరిచారు పట్టిసీమ హెడ్వర్క్స్, పైప్లైన్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులతో మాట్లాడలేదు. కనీసం ఆ రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఎత్తిపోతల పథకం హెడ్వర్క్స్ వద్ద మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను పరిశీలించిన సీఎం వాటికి సంబంధించిన వివరాలను మెగా ఇంజినీరింగ్ సంస్థ డెరైక్టర్ సీఎస్ సుబ్బయ్య, ఎస్ఈ ఈఎస్ రమేష్బాబును అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్, మ్యాప్లను పరిశీలించారు. అక్కడి నుంచి కాన్వాయ్లో ఎత్తిపోతల పథకం పోలవరం కుడి కాలువలో కలిసే ప్రాంతానికి వెళ్లిన సీఎం పైప్లైన్ నిర్మాణం, కాంక్రీట్ పనులను పరిశీలించారు. అవసరమైన పైప్లు సిద్ధంగా ఉన్నాయా.. పనులు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటనే విషయాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం పనుల తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకం పనులను దాదాపు గంటపాటు ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సీఎం దాదాపు 2.45 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. అప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన కోసం వేచివున్నారు. హెలిప్యాడ్ కాన్వాయ్లో నేరుగా హెడ్వర్క్స్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో పైప్లైన్ పనులు జరగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఖరారు కావడంతో పలు శాఖల అధికారులు రాత్రంతా మేలుకొని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ పి.శ్రీమన్నారాయణ రాత్రిరాత్రికి ఏలూరు నుంచి సిబ్బందిని రప్పించి హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించారు. సీఎం పర్యటనలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ భాస్కర్భూషణ్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, పులపర్తి అంజిబాబు, బడేటి బుజ్జి, కలపూడి శివ, ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఐటీడీఏ పీవో ఆర్వీ సూర్యనారాయణ, భూసేకరణ కలెక్టర్ డి.సుదర్శన్, పార్టీ నాయకులు బొరగం శ్రీనివాస్, కుంచె దొరబాబు పాల్గొన్నారు. -
15న ముఖ్యమంత్రి జిల్లాకు రాక
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 15న జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువ ప్రాంతాన్ని ఏరియల్ సర్వేలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సామర్లకోటలోని జిల్లాపరిషత్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో సామర్లకోట మండలం వేట్లపాలెం చేరుకుని నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేట్లపాలెంలో కొద్దిసేపు విరామం తరువాత మూడు గంటలకు సామర్లకోట చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 3.30 గంటలకు ధవళేశ్వరం చేరుకుంటారు. అక్కడ జరిగే డెల్టా రూపశిల్పి, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమవుతారు. సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. రెండు వారాల వ్యవధిలోనే సీఎం జిల్లాకు రెండోసారి రానున్నారు. -
ఈసారీ నిరాశే!
- హడావిడిగా ముఖ్యమంత్రి పర్యటన - పెంటావాలెంట్ టీకా ప్రారంభించిన సీఎం - కేవీ పల్లెలో అడవిపల్లె రిజర్వాయర్ సందర్శన - 25 నిమిషాల్లోనే ముగిసిన పర్యటన - హంద్రీ-నీవా కాలువ పనులపై ఏరియల్ సర్వే - రైతులు, కార్మికులకు ఒరిగిందేమీ లేదు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి గురువారం జిల్లాలో బిజీబిజీగా గడిపారు. జిల్లాలో నెలకొన్న కరువు, తాగు, సాగునీటి సమస్యలపై పరిష్కార మార్గం చూపుతారని భా వించిన ప్రజలకు ఈసారి నిరాశే ఎదురైంది. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై ముందే అవగాహనతో వచ్చిన ఆయన ఎక్కడా తొందర పాటుతో హామీలు గుప్పించకపోవడం గమనార్హం. సీఎం పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతు, కార్మిక, పేద వర్గాల ఆశలపై మరోసారి ఆయన నీళ్లు చల్లారు. పర్యటన ఆసాంతం మొక్కుబడిగానే సాగింది. ఎక్కడికక్కడ సమస్యలపై విన్నవించాలని జనం పెద్ద సంఖ్యలో వేచి ఉన్నప్పటికీ అవకాశం మాత్రం లభించలేదు. తొలుత సీఎం విశాఖపట్నం నుంచి ప్రత్యే క విమానంలో వచ్చిన 11.30 గంటల ప్రాంతంలో పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో నీటి సమస్యపైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి నిలదీశారు. అనంతరం యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్న సీఎం పెంటావాలెంట్ టీకాను లాంఛనంగా ప్రారంభిం చారు. ఇద్దరు చిన్నారులకు ఆయన టీకాలు మంత్రితో వేయించారు. శిశు, గర్భిణుల మరణాలను తగ్గిం చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైద్యం కోసం అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి నుంచి యాదిమరి మండలంలోని అమరరాజా కర్మాగారానికి చేరుకున్నారు. అక్కడ గ్రోత్ కారిడార్ పైలాన్ను ఆవిష్కరించారు. తాగు, సాగు నీటి పరిష్కారానికి హంద్రీ-నీవా ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. అది తప్ప జిల్లాలో కరువు రైతులను ఆదుకోవడం, తాగునీటి సమస్య పరిష్కార మార్గాలను మాత్రం చూపలేదు. మొక్కుబడిగా ప్రతిసారీ చెప్పే మాటలనే ఈ మారు చెప్పి తంతు ముగించారు. మధ్యాహ్నం 2.30కి యాదమరి మండలం నుంచి కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ను సం దర్శించారు. అక్కడ ప్రాజెక్ట్కు సంబంధించి నీటి నిల్వ పెంచే విషయమై అటవీ, నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు. అయితే సీఎం రైతులతో ముఖాము ఖి సమావేశం జరుపుతారని అధికారులు హెలిప్యాడ్ వద్ద చర్చా వేదికను ఏర్పాటు చేశారు. సమయం లేదంటూ 25 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించి కురబలకోట మండలం అంగళ్లుకు ప్రయాణమయ్యారు. రైతులను అక్కడికే రావాలని సూచించారు. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. కురబలకోట మండలం అంగళ్లులో ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ప్రసంగించారు. మరోసారి పట్టిసీమ జపాన్ని జపించారు. ఇక్కడ రైతులతో సమావేశాన్ని జరుపుతామని చెప్పినప్పటికీ మొక్కుబడిగా ఏదో నలుగురు రైతులతో మాట్లాడి పంపించేవారు. అన్నదాతల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించింది ఏమీ లేదు. హంద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఏరియల్ సర్వే చేయడంతోపాటు పనుల పురోభివృద్ధిపై అధికారులతో చర్చించారు. మొత్తం మీద జిల్లాలో సీఎం పర్యటన అధికారుల హడావిడిగా సాగడం తప్ప, ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. -
నల్లగొండ జిల్లాలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఏరియల్ సర్వే చేశారు. నక్కలగండి, ఇతర ప్రాజెక్టులను కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు కేసీఆర్ నాగార్జున సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం కేసీఆర్ ఖమ్మం వెళ్లనున్నారు. నాగార్జున సాగర్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ పాల్గొన్నారు. -
పరి‘శ్రమే’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మూడు హెలికాప్టర్లు.. పలువురు ఫార్మారంగ దిగ్గజాలతో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ముచ్చర్లలో 11వేల ఎకరాల్లో ఔషధనగరి నిర్మించనున్నట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో భూమిని సర్వే చేసి టీఐఐసీకి బదలాయించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దాదాపు నాలుగు నెలలైనా ఈ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ల్యాండ్ బ్యాంక్ : 69,669 ఎకరాలు ఐటీ కంపెనీలు, ఫార్మాసిటీ, ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర క్లస్టర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇబ్బడిముబ్బడిగా భూములను సమీకరించింది. జిల్లావ్యాప్తంగా 69,669 ఎకరాలను గుర్తించిన అధికారులు.. వీటిని మూడు భాగాలుగా విభజించారు. వీటిని ఇతర అవసరాలకు కాకుండా పూర్తిగా పారిశ్రామిక అవసరాలకే నిర్దేశించారు. ఖాళీ భూముల లెక్కలు తీయాలని, వివిధ సంస్థలకు బదలాయించినా.. అట్టిపెట్టుకున్న స్థలాల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద భూమల వివరాలను తయారు చేశారు. ఖాళీ స్థలాలు లేవట! కొత్తగా ఇండస్ట్రీలు స్థాపించాలనుకున్న ఔత్సాహికులకు పరిశ్రమలశాఖ షాక్ ఇచ్చింది. పరిశ్రమలు పెడతాం.. స్థలం చూపమని అభ్యర్థించిన 800- 1000 మంది ఔత్సాహికులకు రిక్తహస్తం చూపింది. పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు (ఐడీఏ), పారిశ్రామిక పార్కులు (ఐపీ)లలో ఖాళీ స్థలాల్లేవని తేల్చిచెప్పింది. టీఐఐసీ, రెవెన్యూ అధికారులు కొత్తగా స్థలాలు కేటాయిస్తే తప్ప ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. ఒకవైపు సమృద్ధిగా ల్యాండ్బ్యాంక్ను సిద్ధం చేసిన ప్రభుత్వం.. పారిశ్రామికవేత్తలకు కేటాయించకుండా అట్టిపెట్టుకోవడం గమనార్హం. -
ఏరియల్ సర్వేలోనూ దొరకని మస్తాన్ జాడ
సంగం: పర్వతారోహకుడు మస్తాన్బాబు జాడ ఇంకా తెలియరాలేదు. రెండు రోజులుగా ఏరియల్ సర్వే చేసినా ఫలితం దక్కలేదు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంగంకు చెందిన బాబు ఆచూకీ కోసం దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా, చిలీ రెండు దేశాల వైపు కూడా రెస్క్యూ బృందం ఏరియల్ సర్వే చేసిందని, అయినా జాడ తెలియరాలేదని భారతీయ రాయబార కార్యాలయ అధికారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీటర్లో తెలిపారు. కొందరు బాబు స్నేహితులు పర్వతాలెక్కి అతని జాడ కోసం వెతుకుతున్నారు. బాబు అదృశ్యమై శుక్రవారానికి పదిరోజులైంది. కుమారుడి జాడ తెలియకపోవడంతో తల్లి సుబ్బమ్మ మంచం పట్టింది. -
ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
నేడు కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులపై విహంగ వీక్షణం సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్టుల సత్వర పూర్తికి తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం కోసం సీఎం కేసీఆర్ ఆదివారం స్వయంగా గోదావరి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేయనున్నారు. కంతనపల్లి, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించనున్నా రు. కంతనపల్లి ప్రాజెక్టుకింద ముంపు ప్రాం తాల సమస్య తీవ్రంగా ఉండగా, దేవాదుల లో రెండో దశ పూర్తయినా మొదటి దశ ప నులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీకి బదులుగా కాళేళ్వరం వద్ద గోదావరి నీటిని వాడుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు సీఎం అధికారులు, నిపుణులతో చర్చించనున్నారు. -
అణువణువూ పరిశీలన
చినజీయర్ స్వామితో కలిసి గుట్టను సందర్శించిన కేసీఆర్ ముందుగా ఏరియల్ సర్వే, ఆలయంలో పూజల నిర్వహణ దేవస్థానం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష భువనగిరి/యాదగిరికొండ యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా సీఎం కేసీఆర్, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామితో కలిసి కొండపై గురువారం అణువణువూ పరిశీలించారు. ఏరియల్ సర్వే, ఆలయంలో పూజలు, సమీక్ష అనంతరం వారు ఆలయ పరిసరాలను తిరిగి చూశారు. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ప్లాన్ ప్రకారం కొండపై ఉన్న పరిసరాలను నమూనాలో జీయర్స్వామికి సీఎం చూపించారు. దక్షిణ ప్రాకారం నృసింహ కాంప్లెక్స్ మీదుగా గుట్ట పరిసర ప్రాంతాలను కలియదిరిగారు. విష్ణు పుష్కరిణి, శ్రీచక్ర కాంప్లెక్సు ప్రాంతాలను సీఎంతో కలిసి స్వామీజీ పరిశీలించారు. కొండ పరిసరాల్లో 2 వేల ఎకరాల్లో చేపడుతున్న అభివృద్ధిని వివరించారు. ఈసందర్భంగా ఆలయం చుట్టూ నాలుగు మండపాలు, కల్యాణ మండపాలు, తిరుమాడ వీధులు, రాజగోపురాలు, ఆలయంలోనే శాలలు ఇతరత్రా ఆలయాలు వస్తాయని ఆయనకు మాస్టర్ప్లాన్ను చూపించారు. సీఎం కేసీఆర్, స్థపతి సుందరరాజన్, ఆర్కిటెక్టు అధికారులు జగన్, రాజ్ , ఆనంద సాయిలు కలిసి ఆయనను ఆలయ పరిసరాలను, ఆలయం చుట్టూ సుమారు పద్నాలుగున్నర ఎకరాల స్థలం ఉందని ఆయనకు వివరించారు. ఆలయ పరిసరాలను ఆయన సుమారు 2గంటల పాటు గర్భాలయం, ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.యాదగిరిగుట్ట చుట్టు పక్కల ఉన్న పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండ , వెంకటాపురంగుట్ట , దాతారుపల్లి గుట్టలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఈ తొమ్మిది గుట్టలను 9 కొండలుగా చేసి వాటికి 9 పేర్లు పెట్టాలని సీఎం కోరారు. దీంతో ముందుగా యాదగిరిగుట్టకు యాదాద్రిగుట్టగా మారుస్తున్నట్లు జీయర్స్వామి ప్రకటించారు. 180 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నలుదిక్కులా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ విగ్రహం అంతా ఒకే రాయితో నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే నిండు పౌర్ణమి రోజున అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభించడం చాలా సంతోషయ దాయకమన్నారు. అనంతరం జీయర్ స్వామీజీతో పాటు సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ స్థపతి సుందరరాజన్, ఆనంద సాయి, లతో సుమారు గంట పాటు ఆండాళు నిలయంలో సమీక్ష జరిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీత, ఎంపీ బూరనర్సయ్యగౌడ్,ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, వీరేశం, జేసీ సత్యనారాయణ, యాదగిరిగుట్ట దేవస్థానం డెవలప్మెంట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కిషన్రావు, ఈఓ గీత, దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి ఆలయ ఆర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గుట్టలో కేసీఆర్, జియర్ స్వామి ఏరియల్ సర్వే
-
గుట్టలో కేసీఆర్, జియర్ స్వామి ఏరియల్ సర్వే
యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం చిన్నజియర్ స్వామితో కలిసి యాదగిరిగుట్టలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు జియర్స్వామితో కలిసి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కేసీఆర్ 11.30 యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట ఆలయ ప్రణాళికను చిన్నజియర్ స్వామికి వివరించారు. అనంతరం అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఒంటి గంటవరకు అక్కడ ఆలయ పరిసరాలను, ప్రధాన గర్భాలయంలో ఆయన జియర్స్వామితో కలిసి చర్చిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రాన్ని.. వాటికన్ సిటీ తరహాలో తెలంగాణలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం నాలుగుసార్లు యాదగిరిగుట్టకు వచ్చి అభివృద్ధికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే సేకరించిన భూమిని యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిసంస్థకు అప్పగించారు. మరో వెయ్యి ఎకరాలు సేకరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేసింది. -
రాజధాని ప్రాంతంలో జపాన్ బృందం ఏరియల్ సర్వే
విజయవాడ : గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో జపాన్ బృందం బుధవారం ఏరియల్ సర్వే చేసింది. తొలుత కృష్ణా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జపాన్ పారిశ్రామిక వేత్తల బృంద సభ్యులు మూడు దశల్లో పర్యటించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టిన అంశాలను సమగ్రంగా వివరించామన్నారు. ఈ పర్యటనపై జపాన్ ఆర్థిక మంత్రి ఆకియో ఇసోమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారని కలెక్టర్ తెలిపారు. ఏరియల్ పరిశీలనలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతోపాటు జపాన్ ఎంబసీలు ఏకియో ఇసోమోటా, టోమో పూమి, పుకామియా, ప్యూజి ఎలక్ట్రానిక్స్కు చెందిన టోమో యూకి కవాగోయి, హిటాచి మపాయోఫి తముర, జె.ఆర్.ఐ కిమిహికో, టకా మల్సూ, శంకర్ నారాయణ, హిటాచి జోసిన్, హిచిరో ఎబిఐ జెట్రో, హిరోషి హషి మోటో, కజిమా పర్యటించారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఢిల్లీలోని ఎ.పి.భవన్ రెసిడెంట్ కమిషనర్ వీణా ఈష్, సీఆర్డీఏ అదనపు కమిషనర్ గంధం చంద్రుడు,సబ్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఎల్. శివశంకర్ తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులుగన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లారు. -
కాలినడకన..కలియదిరిగి
యాదగిరికొండపైన క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి పరిశీలన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష స్వామివారికి ప్రత్యేక పూజలు.. భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం వచ్చిన సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆలయ పరిసరాలను కలియతిరిగారు. ముందుగా హెలికాప్టర్లో రెండుసార్లు గుట్టపరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వడాయిగూడెం శివారులో హెలిపాడ్ దిగిన కేసీఆర్ తన వాహనంలో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డిలతోపాటు అధికారులతో కలిసి ముందుగా గుట్టకింద స్వామి వారి పాదాల వద్ద తన వాహనంలోనుంచి పరిశీలించారు. తులసీ కాటేజ్, ఘాట్ రోడ్డులోని జియర్ కుటీరం, టూరిజం హోటల్ వెనకభాగంలో నిర్మిస్తున్న రెండవ ఘాట్రోడ్డును పరిశీలించారు. పున్నమి గెస్ట్హౌస్ వెనక ఉన్న అపరిశుభ్రతపట్ల అసహనం వ్యక్తం చేశారు. అక్కడినుంచి నేరుగా ఆలయంలోకి చేరుకుని సామివారిని దర్శించుకున్నారు. అనంతరం వాహన పూజల ప్రాంతం, నృసింహ కాంప్లెక్స్లో కల్యాణ మండపంనుంచి కొండకింద స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఇక్కడికి వచ్చినపుడు పందుల స్వైర విహారం ఉండేదని, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈఓను ప్రశ్నించారు. గుట్ట చుట్టూ కందకాలను తవ్వుతున్నామని ఆమె సీఎంకు వివరణ ఇచ్చారు. అలాగే ఆలయ మాడవీధుల నుంచి రిసెప్షన్ హాల్ పక్కన, ఏసీ గెస్ట్ హౌజ్ ముందునుంచి విష్ణుపుష్కరిణి సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం.. అక్కడున్న పాత కాలం నాటి కల్యాణ మంటపాన్ని సందర్వించారు. ఆ తర్వాత కొండచివరి వరకు వెళ్లారు. అక్కడినుంచి కొండకింది పరిసరాలను పరిశీలించారు. పార్కుమార్గం.. పాత సంగీత పాఠశాల, శివాలయం ముందునుంచి అండాళ్ నిలయానికి చేరుకుని అక్కడ అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఆయన వెంట జేసీ సత్యనారాయణ, దేవాదాయ శాఖ స్థపతి సుందరరాజన్, ఆర్కిటెక్టు అధికారి ఆనంద సాయి, దేవస్థానం రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఈఓ గీతారెడ్డి, అధికారులు ఉన్నారు. -
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఏరియల్ సర్వే
-
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి ఆయన ఈ సర్వే చేస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలో ఏరియల్ సర్వే జరుపుతారు. కాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. -
‘రాజధాని’లో సింగపూర్ బృందం
రెండురోజుల పాటు గ్రామాల్లో పర్యటన సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు: రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు చేపట్టిన సింగపూర్ అధికారుల బృందం ఆ ప్రాంతంలో రెండురోజులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలపై దృష్టి సారించింది. శనివారం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. మధ్యాహ్నం బృందం సభ్యులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్తో సమావేశమయ్యారు.వీరి పర్యటనను గోప్యంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నించారు. సీఆర్డీఏ కార్యాలయంతో పాటు గుంటూరు కలెక్టర్ నుంచి బేస్ మ్యాప్లు తీసుకున్న నలుగురు సభ్యుల సింగపూర్ బృందం.. ఆ మ్యాప్ల ఆధారంగా పర్యటన కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో అమరావతి, ఉండవల్లి, తుళ్లూరు గుంటూరు పరిసర ప్రాం తాల్లో పర్యటించి అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూములను పరిశీలించింది. శని వారం గుంటూరులో ఆర్డీవో భాస్కర్ నాయు డు వీరిని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం విజయవాడ వెళ్లిన ఈ బృందం మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్తో సమావేశమయ్యింది. ఈ నెల 12, 13 తేదీల్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో పాటు ఉన్నతాధికారు లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్న నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. కాగా 13న చంద్రబాబుతో కలసి ఈశ్వరన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. -
4.35 గంటలు సీఎం ఉండే సమయం
⇒ రింగు రోడ్డు కోసం ఏరియల్ సర్వే ⇒ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సాక్షి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముచ్చటగా మూడో సారి జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకు రెండు సార్లు జిల్లాకు వచ్చినప్పటికీ... సాంస్కృతిక కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించేందుకు మరోసారి రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి ఉదయం 11:30 గంటలకు సీఎం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4:05 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. మొత్తం మీద నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలపాటు జిల్లాలో సీఎం పర్యటన ఉంది. ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వేతో ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం కానుంది. వరంగల్ నగరం చుట్టూ రింగురోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాలను అరగంట పాటు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్న భోజనం ముగించుకున్న తర్వాత 3:10 గంటలకు చింతగట్టు సమీపంలో జయగిరి వద్ద టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం కోసం ప్రతిపాదిస్తున్న స్థలాన్ని పరిశీలించనున్నారు. సాయంత్రం 4.05 గంటలకు ఆర్ట్స్ కాలేజీ చేరుకుని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. నగరాభివృద్ధిపై గంపెడాశలు వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గతంలో అనేక సార్లు హామీలు ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఇటీవలే నగర రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సీఎం పర్యటనలో నగరాభివృద్ధిలో భాగమైన పలు కీలక ప్రాజెక్టుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. నగరాభివృద్ధికి సంబంధించి వివిధ పనులకు రూ. 2,500 కోట్ల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు గతంలోనే రూ. 1,600 కోట్లతో అధికారులు డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటర్గ్రిడ్ పథకానికి అంకురార్పణ జరగకముందే నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగు పరిచేందుకు రూ.411 కోట్లతో ప్రణాళికలు, మిగిలిన నిధులతో కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, జంక్షన్లు తదితర మౌలిక సదుపాయల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇటీవల నగరంలో విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయలను మెరుగుపరిచేందుకు రూ.150 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధుల లేమి కారణంగా ఈ పనులు ప్రారంభం కాలేదు. వరంగల్ నగరంలో ఉన్న ప్లానెటోరియంలో ప్రొజెక్టర్ పాడైపోవడంతో నాలుగేళ్లుగా మూతపడి ఉంది. ఈ మేరకు ప్లానెటోరియం పునః ప్రారంభానికి సీఎం కేసీఆర్ చొరవ చూపించాల్సిందిగా జిల్లా ప్రజలు కోరుతున్నారు. వీటితోపాటు హాంటర్ రోడ్డులో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సైన్స్ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ఏడాది కాలంగా ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నాయి. అస్తవ్యస్తంగా నగర పాలన నగరపాలక సంస్థలో అస్తవ్యస్తంగా మారిన పాలన, వేళ్లూనుకున్న అవినీతిపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. అన్ని కార్పోరేషన్లలో ఈ- టెండర్ల విధానం కొనసాగుతుండగా... ఇక్కడ బాక్స్ టెండర్లు పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన కార్పొరేషన్-మన ప్రణాళికను అధికారులు సిద్ధం చేసిన తీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని డిప్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ... వారిలో ఎటువంటి మార్పు రాలేదు. సమగ్ర కుటుంబ సర్వేను సైతం పూర్తి స్థాయిలో చేపట్టలేక నగర ప్రజలను కార్పొరేషన్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారు. గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్సిటీ కార్యక్రమం నిర్వహణలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. సేకరించిన పొడి చెత్త గుట్టలుగుట్టలుగా పేరుకుపోయినా... పట్టించుకునేవారు కరువయ్యారు. కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకుంటున్న సిబ్బంది ఇతర పనుల్లో నిమగ్నమైన పట్టించుకునేవారు కరువయ్యారు. ఆఖరికి డివిజన్ల పునర్విభజన సైతం సకాలంలో చేయలేక బల్దియా విమర్శలపాలైంది. సీఎం ఇక్కడకు రానున్న నేపథ్యంలో నగరంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తారని ప్రజలు గంపెడాశతో ఉన్నారు. -
వచ్చారు.. వెళ్లారు..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. శివార్లలోని కూడళ్లు, రహదారులు, అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. వాస్తవానికి శనివారమే ఈ పర్యటన ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా ఈ కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఏరియల్ సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ నేలపైకి దిగలేదు. దీంతో ఏరియల్ సర్వే మాత్రం పూర్తి చేసుకుని తిరుగుపయనమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. అటవీ భూములను పరిశీలించి.. ఏరియల్ సర్వేలో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ జిల్లాలోని అటవీ భూములను పరిశీలించారు. ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో సర్వే చేసి క్షేత్ర పరిశీలన చేయాల్సి ఉంది. ఇందుకోసం హయత్నగర్లోని డీఆర్ పార్క్, ఘట్కేసర్ మండలం నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్, మేడ్చల్ మండలం కండ్లకోయ ఫారెస్ట్లలో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేసింది. అయితే సాంకేతిక సమస్యతో ఈ మూడుచోట్ల హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. కేవలం అటవీ భూములను పరిశీలించి సీఎం నగరానికి వెళ్లిపోయారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి స్పష్టమైన సమాచారం జిల్లా యంత్రాంగానికి సైతం తెలియదని జిల్లా రెవెన్యూ శాఖలోని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘థర్మల్’ సర్వే బృందానికి చుక్కెదురు
మొదటిరోజే అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో మహిళల ధర్నా దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ శివారులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 7,500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ పవర్ప్లాంట్ భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులకు మొదటిరోజే చుక్కెదురైంది. శుక్రవారం మండలానికి వచ్చిన అధికారుల బృందాన్ని తాళ్లవీరప్పగూడెం, మోదుగులకుంట తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మహిళలు పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం మండలంలోని ఏడు గ్రామాల పరిధిలో 9 వేల ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణం చేపడుతామని, అందుకు త్వరలో భూసేకరణ జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాళ్లవీరప్పగూడెం గ్రామ రైతులకు కంటి మీద కునుకులేదు. గ్రామానికి చెందిన పేద రైతులు తుంగపాడు బందం వెంట ఫారెస్ట్, ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల మేర సేద్యం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ఈ భూములు పోనున్నాయి. మోదుగుకుంటతండా గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆయా గ్రామాలవాసులు సీఎం ప్రకటన నాటినుంచి కొంత ఆందోళనగా ఉన్నారు. అధికారుల బృందం భూమిని సర్వే చేసేందుకు మొదట తాళ్లవీరప్పగూడానికి చేరుకున్నారు. వారిని గ్రామరైతులు, స్థానికులు అడ్డుకున్నారు. థర్మల్ పవర్ప్లాంట్ పేరుతో జీవనాధారమైన భూములను లాక్కుంటే తమ బతుకుదెరువు ఏమిటని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు బజారున పడతాయని వాపోయారు. తమ భూములు తీసుకుంటే చావేగతని పురుగుమందు డబ్బాలు ఎత్తారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ప్రతి రైతుకు పరిహారం సర్వేలో ఉన్న మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్రావు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. కేవలం భూమి సర్వే చేసినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ ఉండదని నచ్చజెప్పారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. -
ఆగమేఘాలపై..
మిర్యాలగూడ/దామరచర్ల :జిల్లాలోని కృష్ణపట్టెలో నిర్మించతలపెట్టిన భారీ థర్మల్ విద్యుదుత్పాదన కేంద్రం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూముల సర్వేను ఆగమేఘాల మీద ప్రారంభించి పదిరోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులుకు సూచించారు. మంగళవారం మంత్రులు జగదీష్రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్శర్మ, తన ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కె.జోషిలతో కలిసి ఆయన దామరచర్ల మండలం వీర్లపాలెం వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలిపాడ్లపై రెండు హెలికాప్టర్లలో వచ్చిన సీఎం కేసీఆర్ బృందం దాదాపు నాలుగు గంటలపాటు పర్యటించింది. ఓ అరగంటపాటు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్తో కలిసి విహంగ వీక్షణం ద్వారా దామరచర్ల మండలంలోని భూములను పరిశీలించారు. అధికారులు కూడామరో హెలికాప్టర్లో భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించిన కేసీఆర్ పైవిధంగా ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్లాంటు నిర్మించి తీరుతామని, అవసరమయితే వారం రోజులపాటు తాను ఢిల్లీలో కూర్చుని ఈ ఫైలుకు క్లియరెన్స్ తెప్పిస్తానని ఆయన అధికారులతో చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు తన ఏరియల్ సర్వే జరిగనప్పుడే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా, కలవలేదు. వచ్చే నెల రెండో తేదీన తాను ఢిల్లీకి వెళుతున్నానని, అప్పటికల్లా ప్రతిపాదనలన్నీ సిద్ధమయితే అనుమతి తీసుకుని వస్తానని, వెంటనే శంకుస్థాపన కూడా చేద్దామని ఆయన అధికారులతో చెప్పారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు దామరచర్ల అటవీ భూములు అనుకూలంగా ఉన్నాయని, 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ వపర్ ప్లాంట్ను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పవర్ ప్లాంట్కు అవసరమైన నిరంతరం నీరు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు బొగ్గు రవాణాకు సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మూడు వారాల్లోనే పవర్ ప్లాంట్కు సంబంధించిన అన్ని రకాల అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రప్రభుత్వంతో చర్చించి అనుమతి వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. 55 వేల కోట్ల రూపాయలతో నిర్మించే థర్మల్ పవర్ ప్లాంట్లో 600 ఎకరాల్లో భారీ టౌన్షిప్ను నిర్మించనున్నట్లు తెలిపారు. టౌన్షిప్లో పాఠశాల, ఆస్పత్రి, నివాసాలతోపాటు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా నిర్మించనున్నట్లు తెలిపారు. పవర్ ప్లాంట్కు అవసరమైన బొగ్గును కృష్ణపట్నం, బందరు నౌకాశ్రమం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపారు. దామరచర్ల మండలంలో ఇంటికో ఉద్యోగం.. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యాక దామరచర్ల మండలంలో ఇంటికో ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వివరించారు. పవర్ప్లాంట్లో 10 వేల మంది ఉద్యోగులు, మరో 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములుంటే పరిహారం చెల్లించడానికి అధికారులు రికార్డులు కూడా సిద్ధం చేయాలని సూచించారు. 10000 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణందామరచర్ల మండలంలో థర్మల్ పవర్ప్లాంట్ నిర్మాణానికి గాను 10000 ఎకరాల భూమిని సేకరించనున్నారు. వాటిలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి సేకరించాలనే విషయాన్ని అధికారులు వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ అదేశించారు. సర్వే పనులు కూడా వెంటనే ప్రారంభించడంతో పాటు మట్టి నమూనాలు కూడా సేకరించాలని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ కూడా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ముఖ్య అధికారులు, సర్వేయర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి 500 ఎకరాలకు ఓ డిప్యూటీ తహసీల్దార్ సారథ్యంలో సర్వేయర్, వీఆర్వోను కేటాయించి ప్రత్యేక పద్ధతిలో సర్వే జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకోసం 20బ్లాకులుగా ఆ భూమిని విభజించేందుకు ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈనెల 26న సర్వేను ప్రారంభించి ఐదు రోజుల్లో పూర్తిచేసి జనవరి 1కల్లా సీఎంకు పంపాలని, ఆయన వచ్చే నెల రెండోతేదీన ఢిల్లీకి వెళ్లే నాటికి అన్ని ప్రతిపాదనలు పంపాలని ఆయన యోచిస్తున్నారు. సీఎం పర్యటనలో ఉన్నది వీరే... ఆయన వెంట రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిషోర్, వీరేశం, పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ జెడ్పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, నేతలు నోముల నర్సింహయ్య, అల్గుబెల్లి అమరేందర్రెడ్డి, సాముల శివారెడ్డి, వేనేపల్లి చందర్రావు తదితరులున్నారు. -
కృష్ణమ్మ చెంతన.. విద్యుత్ కాంతులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రానున్న మూడేళ్లలో 2వేల మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని కృష్ణా నదిపరీవాహక ప్రాంతాలైన దామరచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువులలో అవసరమయ్యే భూములను పరిశీలించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములను ఎంపిక చేయనున్నారు. ఆయనతో పాటు జెన్కో అధికారులు, విద్యుత్ నిపుణులు వస్తుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణా, నీటి సదుపాయాలే కారణం.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో వడివడిగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1700 మెగావాట్లు, 850 మెగావాట్ల ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది కూడా. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం జిల్లాను ఎంచుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు నీరు, బొగ్గుతో పాటు రవాణా సదుపాయం అవసరం. జిల్లాలో పవర్ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసినా బొగ్గు నిల్వలను మాత్రం దిగుమతి చేసుకోవాల్సిందే. అటు ఖమ్మం జిల్లాలోని సింగరేణి గనుల నుంచి లేదా విదేశాల నుంచి బొగ్గును తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలా తెచ్చుకునే దానిని ప్లాంటు వరకు తీసుకెళ్లేలా రవాణా సదుపాయం ఉండాలి. అదే విధంగా నీరు చాలా అవసరం. సంవత్సరం పొడవునా నీటి కొరత లేని ప్రాంతాలను మాత్రమే ఇందుకు ఎంపిక చేసుకోవాలి. ఈ కోణంలో జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ అందుబాటులో ఉండడం, నీళ్లు అపారంగా ఉండడంతో అక్కడ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తయారవుతున్నాయి. భూసేకరణే కీలకం.. ముఖ్యంగా విద్యుత్ప్లాంటు ఏర్పాటుకు భూసేకరణ చాలా కీలకం కానుంది. జిల్లాలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మించాలంటే దాదాపు మూడువేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా. ప్రాజెక్టులో కీలకమైన టర్బైన్ల ఏర్పాటుకే 850 ఎకరాల వరకు అవసరం అవుతుంది. ఇందుకు తగిన భూమిని వెతుకులాడి, ప్రణాళికలు సిద్ధం చేసి, సవ్యంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు పురోగతి సాధించనుంది. ఇందుకోసం దామరచర్ల మండలంలో వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, ముదిమాణిక్యం,కొత్తపల్లి పరిసర గ్రామాల్లో సుమారు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 3000 ఎకరాల ఫారెస్టు భూమి కలిగి ఉంది. మఠంపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండలాల్లోని ప్రభుత్వ భూమి, ఫారెస్టు, డీఫారెస్టు, పోరంబోకు భూములు కలిపి 30వేల ఎకరాలకు పైగా ఉంది. అయితే, ఇక్కడ ఉన్న పరిశ్రమల చేతిలో చాలా భూములుండడం, ప్రభుత్వ పరిధిలో ఏ భూమి ఉంది, ఏ భూమిని పరిశ్రమలకు కేటాయించారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఏదేమైనా మూడువేల ఎకరాల భూమి ఎక్కడ లభిస్తే అక్కడ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎక్కువగా దామరచర్లలోనే ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, ప్రత్యామ్నాయంగా మఠంపల్లి, మేళ్లచెరువు మండలాలను ఎంచుకుంటామని వారు చెబుతున్నారు. అయితే, భూసేకరణ జరిగి జెన్కోకు భూములను అప్పగిస్తే రెండేళ్లలో ప్లాంటు నిర్మాణం పూర్తవుతుందని విద్యుత్ నిపుణులు చెపుతున్నారు. విద్యుత్ లెక్క ఇదీ.... విద్యుదుత్పత్తి, వినియోగం లెక్కలను ఒకసారి చూస్తే...500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తే 12 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ఈ లెక్కన 500 మెగావాట్ల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 4,380 మిలియన్ యూనిట్ల కరెంటు వస్తుంది. కాగా జిల్లాలో ఏర్పాటు కాబోతున్న 2,000 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ల ద్వారా 17,520 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అయితే..యూనిట్ సామర్థ్యంలో 100 శాతం విద్యుత్ ఉత్పత్తి కాదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ( కేటీపీఎస్) 1,700 మెగావాట్ల స్టేషన్ ఉత్పత్తి లక్ష్యం ఏడాదికి దాదాపు 15 వేల మిలియన్ యూనిట్లు.. కానీ, గత ఏడాది అక్కడ అయిన విద్యుదుత్పత్తి 12 వేల మిలియన్ యూనిట్లే. అంటే 80 శాతం మేర లక్ష్యం పూర్తయింది. అదే లెక్కన జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్టులను కలిపి మొత్తం ఉత్పత్తి కావాల్సిన 17,520 మిలియన్ యూనిట్లలో 80 శాతం లెక్క వేసినా 14వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినియోగం ప్రస్తుతం చూస్తే గరిష్టంగా రోజుకు 160 మిలియన్ యూనిట్లు ఉంటుంది. అయితే, ప్రతియేటా ఈ వినియోగం 15 శాతం పెరుగుతుందని అంచనా. మన జిల్లాలో ప్రాజెక్టు పూర్తయి విద్యుత్పత్తి అందుబాటులోకి వచ్చే సమయానికి ఈ డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లపైగానే ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి 92 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి అవసరమవుతుంది. అందులో దాదాపు 14 వేల మిలియన్ యూనిట్లు మన జిల్లా నుంచే ఉత్పత్తి కానుందన్నమాట. అంటే మొత్తం తెలంగాణ అవసరాల్లో ఇది ఏడో వంతు. -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
దామరచర్ల :ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఏరియల్ సర్వే కోసం ముఖ్యమంత్రి మంగళవారం మండలానికి వస్తుండడంతో అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీ లించారు. మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో వీర్లపాలెం గ్రామ శివారులో, మండల కేంద్రం నుంచి అడవిదేవులపల్లి వెళ్లే దారిలో రెండు హెలీపాడ్లను సిద్ధం చేశారు. అలాగే అక్కడే అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యేందుకు వీలుగా శామీయాలు ఏర్పా టు చేశారు. రోడ్డు వెంట వాహనాలు పార్కింగ్ చేసేందుకు చదును చేశారు. తహసీల్దార్ రమాదేవి దగ్గరుండి పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం , విద్యుద్దీకరణ పనులను పూర్తి చేశారు. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ స్వ్కాడ్ సీఎం పర్యటించి ప్రాంతాల్లో విసృ్తత తనిఖీలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ సందీప్ గోనె, సీఐలు పాండు రంగారెడ్డి, నరసింహారెడ్డి , దామరచర్ల ఎస్ఐ జానయ్య తదితరులు పాల్గొన్నారు. హెలీపాడ్ పరిశీలన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటన సందర్భంగా సోమవా రం జిల్లా కలెక్టర్ చిరంజీవులు హెలీ పాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మం డల పరిధిలోని వీర్లపాలెం, ముదిమాణిక్యం, కొత్తపల్లి, తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం గ్రామాల పరిదిలో మంగళవారం సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తరువాత మండల కేంద్రానికి 9కిలో మీటర్ల దూరంలో వీర్లపాలెం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో సీఎం దిగనున్నారు. ఇందు కోసం రెండు హెలీపాడ్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సమావేశానికి కావాల్సిన టెంట్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఏజేసీ ఎస్.వెంకట్రావు, ఏఎస్పీ, ఓఎస్డీ పి.రాధా కృష్ణారావు, ఆర్అండ్బీ ఎస్సీ లింగయ్య, ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ నిరంజన్, ఏఈ సైదులు, సూర్యాపేట, దేవరకొండ ఆర్డీవోలు శ్రీనివాస్రెడ్డి, గుగులోతు రవినాయక్ తదితరులు ఉన్నారు. సీఎం టూర్ షెడ్యూల్.. 11.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.35 గంటలకు హెలికాప్టర్ ఎక్కుతారు. 12.00 గంటలకు దామరచర్ల మండలం వీర్లపాలెంలోని హెలిపాడ్ వద్ద ల్యాండింగ్ 12.00-12.15 గంటల వరకు సీఎంకు అధికారుల భూ వివరాల బ్రీఫింగ్ 12.15-12.45 వరకు ఏరియల్ సర్వే 12.45 గంటలకు మఠంపల్లి మండలం పెద్దవీడులోని హెలిపాడ్ వద్ద ల్యాండింగ్ 12.45-1.00 వరకు సీఎంకు అధికారుల భూ వివరాల బ్రీఫింగ్ 1.00 -1.10 వరకు భూ వివరాలపై సమీక్ష 1.15-2.00 గంటల వరకు లంచ్ బ్రేక్ 2.00 గంటలకు హెలిపాడ్కు చేరుకుని తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష మఠంపల్లి : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం మఠంపల్లి మండలంలో పర్యటించనున్నందున సోమవారం కలెక్టర్ పర్యటన ఏర్పాట్లను అధికారులతోకలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్టపట్టె ప్రాంతంలో పవర్ ప్లాంట్ల నిర్మాణానికి స్థల అనుకూలతపై సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఎస్పీ రాధాకృష్ణ, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శంకరమ్మ, ఐడీసీ డెరైక్టర్ శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
హరితహారంతోనే భవిత
సీఎం కేసీఆర్ మెదక్: పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్ పచ్చగా ఉంటుందని, అందుకోసమే హరితహారం అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలోని ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుకోసం ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, అనంతరం మెదక్ పట్టణంలో జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారుల అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. హరితహారం ద్వారా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ప్రతి సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 40 వేల మొక్కలు నాటాలన్నారు. టేకు, పండ్ల జాతి మొక్కలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. పెరుగుతున్న చెట్లను చూసి కనుమరుగైన వర్షాలు తిరిగి రావాలన్నారు. తెలంగాణ మెరిసిపోవాలి మిగులు భూముల్లోంచి మూడు మూరల జాగ అమ్మితే రూ.25 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, అందువల్ల అభివృద్ధి నిధులకు ఎలాంటి లోటులేదని కేసీఆర్ వెల్లడించారు. ఐదేళ్లలో తెలంగాణ తళుకులు చూసి దేశమే నివ్వెరపోవాలన్నారు. రాష్ట్రంలో మిగులుగా ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. విలువైన భూములు అమ్మితే వేలకోట్ల ఆదాయం వస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న మట్టిరోడ్ల స్థానంలో నాణ్యమైన రోడ్లు వేస్తామన్నారు. ఇక మండల కేంద్రాల వద్ద డబుల్లైన్ రోడ్లు, నియోజకవర్గ కేంద్రాల చుట్టూ రింగ్రోడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే గుంత ల్లేని రోడ్లు గల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. ఇంటింటికీ తాగునీరు వాటర్ గ్రిడ్ల ఏర్పాటుతో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ నీరందించకుంటే తాము ఓట్లడగబోమని ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే గ్రామాల్లో ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారులో కనిపిస్తే సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీలు నైతిక బాధ్యత వహించి తమ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఉద్యోగులకు పెద్దపీట తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు పెద్దపీట వేస్తుందని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా 40 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసిన ఘనత ఉద్యోగులదేనన్నారు. అందుకే ఉద్యోగులందరికీ ఉచిత వైద్యం కోసం హెల్త్కార్డులు అందజేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల ఆధునీకరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. గుంట భూమి మునగకుండానే ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఘనపురం చుట్టూ కరకట్టలు కడతామన్నారు. చిన్నశంకరంపేట మండలానికి 132 కేవి సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, మండల కేంద్రానికి రూ.25 లక్షలు, మెదక్ పట్టణానికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
ఘనపురం ప్రాజెక్ట్ కు గత వైభవం
మెదక్: నిజాం కాలంలో నిర్మించిన శతాధిక చరిత్రగల ఘనపురం ప్రాజెక్ట్ గత వైభవం సంతరించుకోనుంది. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యమే లక్ష్యంగా ఆనకట్ట ఎత్తు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్ చివ రి ఆయకట్టు వరకు సాగునీరు అందే అవకాశం ఉంది. మంజీరకు నిలకడ నేర్పిన ఘనపురం పరుగులు తీసే మంజీరమ్మకు ఘనపురం ప్రాజెక్ట్ నిలకడ నేర్పింది. పాపన్నపేట...కొల్చారం మండలాల మధ్య ఏడుపాయల తీరంలో 1905లో నిజాం ప్రభువు ఘనపురం ఆనకట్ట నిర్మించారు. 18,130 చ.కి.మీ. విస్తీర్ణంలో 0.25 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ప్రాజెక్ట్ కింద 42.80 కిలో మీటర్ల పొడవున మహబూబ్ నహర్ కెనాల్ ఉండగా, 11,425 ఎకరాలు ఆయకట్టు ఉంది. 12.80 కిలోమీటర్ల పొడవున ఫతేనహర్ కెనాల్ ఉండగా 10,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రెండు కెనాళ్ల ద్వారా మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అప్పట్లో ఘనపురం నీటితో ఆయకట్టు అంతా సస్యశ్యామలంగా ఉండేది. రానురాను ఆనకట్ట పూడికకు గురికావడంతో నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలకు పడిపోయింది. దీనికితోడు మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలు శిథిలమయ్యాయి. చివరి ఆయకట్టుకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. కాల్వల ఆధునికీకరణ కోసం రూ.23.85 కోట్ల జైకా నిధులు మంజూరు కాగా పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆనకట్ట ఎత్తు పెంచితే..చివరి ఆయకట్టుకు నీరు పూడికకు గురైన ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచాలని స్థానిక రైతులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 1988 ప్రాంతంలో అప్పటి మంత్రి రాంచందర్రావు కృషితో ఆనకట్ట ఎత్తును అదనంగా ఒక మీటరు పెంచారు. దీంతో ఆయక ట్టు విస్తీర్ణం సుమారు 30 వేలకు పెరిగింది. కా నీ పూడిక నిల్వనీటి సామర్థ్యానికి అడ్డుగా మారింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్ప టి మంత్రి సునీతాలకా్ష్మరెడ్డి ప్రతిపాదన మేరకు సర్వే నిర్వహించారు. అనంతరం ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిల కృషి మేరకు డిసెంబర్ మొదటి వారంలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ ఆనకట్టను సందర్శించి ఎత్తు పెంపు విషయమై పరిశీలన చేశారు. ఒక మీటర్ ఎత్తు..1.8 టీఎంసీల నిల్వ నీటి సామర్థ్యం : ఘనపురం ఆనకట్ట ప్రాజెక్ట్ను ఒక మీట ర్ ఎత్తు పెంచితే నిల్వ నీటి సామర్థ్యం 1.8 టీ ఎంసీలకు పెరుగుతుందని అధికారులు భావి స్తున్నారు. ఇందుకు సుమారు రూ.56 లక్షలు అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎత్తు పెంచడం వల్ల ఆనకట్ట వెంట ఉన్న నాగ్సాన్పల్లి, శేరిపల్లి, కొడుపాకల శివారులోని నదీతీర ప్రాంతాలు కొంత వరకు మునిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్టపై ఒక మీటర్ ఎత్తున జెండాలు పాతి ఏరియల్ సర్వేలో సీఎం కేసీఆర్కు వివరించనున్నట్లు అధికారులు తెలిపా రు. ఎత్తు పెంచడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాపన్నపేట వరకు ఫతే నహర్ కాల్వలు పొడిగించాలని, ప్రాజెక్ట్లో పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు. -
బంగారుకొండ..భలే భలే గుట్టలు
చౌటుప్పల్ / సంస్థాన్ నారాయణపురం :‘‘ఎంతో అద్భుతమైన గుట్టలు.. వేలఎకరాల భూములు.. బేగంపేట నుంచి ఇక్కడకు 11 నిమిషాల్లో వచ్చా.. ఈ భూములను చూస్తే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లు గుర్తుకొస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి సమీపంలోని ఇంత విలువైన భూములను వినియోగించుకోకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది’’... ఇదీ రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. మన జిల్లాతో పాటు రంగారెడ్డి సరిహద్దుల్లో ఉన్న భూములను పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించుకుందామని, ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండ గుట్టల్లో ఉన్న భూములను ఆయన గాలి మోటార్లో 22 నిమిషాలపాటు పర్యటించి పరిశీలించారు. మంత్రులు గుంటకండ్ల జగదీష్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్శర్మలతో కలిసి ఉదయం 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. పక్కనే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతం గురించి రెండు జిల్లాల అధికారులు ఆయనకు వివరించారు. రాచకొండ సరిహద్దు మండలాల గురించి కేసీఆర్ ఆరా తీశారు. అనంత రం కేసీఆర్ సూచన మేరకు మంత్రులు జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్లు మొదట హెలికాప్టర్ ఏరియల్ సర్వేకు వెళ్లారు. వారు తిరిగొచ్చాక సీఎం కేసీఆర్, ప్రభుత్వ సీఎస్ రాజీవ్శర్మలు ఇద్దరు కలెక్టర్లతో కలిసి, హెలికాప్టర్లో రాచకొండను చుట్టివచ్చారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ గంటసేపు సమావేశమయ్యారు. అక్కడే భోజనం చేసి, 2.10గంటలకు హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. కేసీఆర్ మొత్తంగా రెండున్నర గంటలపాటు రాచకొండలోనే గడిపారు. నోవాటెల్ జొన్నరొట్టె మస్తు..మస్తు రాచకొండలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. అనంతరం అక్కడే లంచ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కోసం అధికారులు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించారు. ఆయన జొన్నరొట్టె, చికెన్, చేపలతో తన భోజనాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జొన్నరొట్టెతో కూడిన మెనూ మస్తుందని అన్నట్టు తెలిసింది. అదేవిధంగా తన పర్యటన సందర్భంగా తక్కువ సమయంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన జిల్లా ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రాచకొండకు కేసీఆర్ ఏరియల్ సర్వేకు వస్తున్నారని పరిసర గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా దగ్గరివరకు అనుమతించలేదు. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కే సమయంలో అభివాదం చేయడంతో, ఒక్కసారిగా ఉత్సాహంతో కే రింతలు కొట్టారు. కట్టుదిట్టమైన బందోబస్తు రాచకొండలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్జోన్. దాదాపు 20సంవత్సరాల పాటు రాచకొండ కేంద్రంగా ఉద్యమం నడిచింది. మావోయిస్టుల ప్రాబల్యం కార ణంగా ఇంతవరకు ఎవరూ ఇక్కడ పర్యటించలేదు. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేకు నిర్ణయించడంతో పోలీసులు కొంత ఉత్కంఠకు గురయ్యారు. తొలుత ఈ నెల3నే ఏరియల్ సర్వే చేయాలని తలపెట్టినప్పటికీ, మావోల కదలికల నేపథ్యంలో వాయిదాపడ్డట్టు వార్తలొచ్చాయి. దీంతో పోలీసులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల కాలంగా రాచకొండలో పోలీసుల కూంబింగ్ నడుస్తూనే ఉంది. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో మరో 10 స్పెషల్పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు మూడు రోజులుగా రాచకొండను జల్లెడ పట్టాయి. ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 500మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సీఎం ల్యాండ్ అయిన గుట్టల చుట్టూ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. భద్రతా కారణాల దృష్టా పలు చోట్ల అక్కడికి వచ్చిన వారిని తనిఖీలు చేశాకే పంపారు. జనాన్ని కూడా అర కిలోమీటర్ దూరంలో ఆపేశారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం పర్యటనను డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్ రావులు పర్యవేక్షించారు. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి ఆర్డీఓలు, దేవ రకొండ, భువనగిరి డీఎస్పీలు అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ‘టైం’టేబుల్ ఇదీ.... సీఎం కేసీఆర్ మంత్రులు గుంటకడ్ల జగ దీష్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, సీఎస్ రాజీవ్శర్మలతో కలిసి, రాచకొండలో 11.35గంటలకు హెలికాప్టర్ దిగారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్లు టి.చిరంజీవులు, శ్రీధర్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం 11:40 నిమిషాల నుంచి 11:52 నిమిషాల వరకు రాచకొండ గుట్టల్లోని భూములను నల్లగొండ, రంగారెడ్డి కలెక్టర్లు సీఎంకు మ్యాపుల ద్వారా వివరించారు. మంత్రులు జగదీష్రెడ్డి, మహేందర్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్లు మొదటి విడతలో హెలికాప్టర్లో 12 గంటలకు ఏరియల్ సర్వేకు వెళ్లారు.12.15 గంటలకు కిందకు దిగారు. రెండో విడతలో సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు 12.25గంటలకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. 12.47గంటలకు కిందికి దిగారు. అనంతరం సీఎం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అనంతరం అక్కడే భోజనం చేశారు. తిరిగి 2.10గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. ఇండస్ట్రీయల్ కారిడార్గా అభివృద్ధి : బూర నర్సయ్యగౌడ్, ఎంపీ, భువనగిరి తెలంగాణ రాష్ర్టంలో పెట్టబడులు పెట్టేందుకు 60విదేశీ సంస్థలు సీఎం కేసీఆర్ను కలిశాయి. సోలార్ పరిశ్రమ, ఫార్మాసిటి, ఫిలింసిటీ, ఎకోటూరిజం, అమెరికాకు చెందిన డిస్నీలాండ్, రోస్కంపెనీ లాంటి ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దులో 42వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. వీటన్నింటినీ కలిపి అతిపెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్లో భాగంగానే ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారు. సర్వే పూర్తయితే, ఈ భూమిని క్లస్టర్లుగా విభజించి, ఎడ్యుకేషన్ హబ్, ఫిలింసిటీ, డిఫెన్స్సిటీ, ఇలా అనేక రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించనుంది. మొత్తంగా మరుగునపడ్డ రాచకొండ చరిత్ర ప్రాచుర్యంలోకి రానుంది. రాచకొండకు నాలుగులేన్ల రోడ్లు: కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మునుగోడు వెనుకబడిన నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ వ ద్ద అనేక ఆలోచనలున్నాయి. హైదరాబాద్కు చేరువలో ఉన్న రాచకొండకు మహర్దశ పట్టనుంది. కేసీఆర్ ఏరియల్ సర్వేతో ఈ ప్రాంతాన్ని క్షణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ముశ్చర్ల మీదుగా రాచకొండ వరకు, 65వ నంబరు హైవే నుంచి రాచకొండకు నాలుగులేన్ల రోడ్డు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేసి, స్వాధీనం చేసుకున్నాక, క్లస్టర్లుగా విభజించనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు. ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తోంది. -
రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే
-
రాచకొండలో నేడు సీఎం ఏరియల్ సర్వే
చౌటుప్పల్ : రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 3వ తేదీన రాచకొండతోపాటు మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు, రంగారెడ్డి జిల్లా కంద కూరు మండలం ముశ్చర్లలో ఏరియల్ సర్వే చేయాలనుకున్నారు. అదేరోజు ముశ్చర్లలో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఏరియల్ సర్వే చేసినప్పటికీ, అనివార్యకారణాలతో రాచకొండ, ఆమనగల్లు పర్యటన వాయిదా పడింది. మళ్లీ సోమవారం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసేందుకు నిర్ణయించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నే రుగా హెలికాప్టర్లో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మంత్రులు గుంటకండ్ల జగదీష్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలతో కలిసి రాచకొండకు రానున్నారు. మూడు రౌండ్లలో రాచకొండను చుట్టివస్తారు. అనంతరం రామాలయం వద్ద సిద్ధం చేసిన హెలిపాడ్ వద్ద కిందికి దిగనున్నారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తా రు. అక్కడే ఏర్పాటు చేసిన రాచకొండ చరిత్రను, ప్రకృతి అందాలను కళ్లకు కట్టే చిత్రాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించనున్నారు. రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాల ప్రభుత్వ భూములు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రెండు జిల్లాల పరిధిలో 35వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయి. వీటిని సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలన చేసి, భవిష్యత్ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే ఆలోచనతో పర్యటిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పక్క రాష్ట్రానికి తరలిపోకుండా కాపాడుకునేందుకు 2వేల ఎకరాలలో, అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రపం చం దృష్టిని ఆకర్షించేలా ఫిలింసిటీని నిర్మిస్తామని కేసీఆర్ పలుమార్లు స్వయంగా ప్రకటించా రు. అయితే రాచకొండ ఫిలింసిటీ ఏర్పాటుకు అనువైన ప్రాంతమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములను కే టాయించాలనే ఆలోచనలో కూడా ఉంది. -
రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
-
రేపు రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రంగారెడ్డి జిల్లా రాచకొండ గుట్టల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం సోమవారం కేసీఆర్ రాచకొండ గుట్టలను పరిశీలించనున్నారు. కేసీఆర్ వెంట రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. కేసీఆర్ ఇటీవల ఇదే ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులను వెంటతీసుకుని ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. -
భవానీ ద్వీపం చూసి ఆశ్చర్యపోయారు
* సింగపూర్ ప్రతినిధుల ఏరియల్ సర్వే అద్భుతంగా సాగింది: మంత్రి నారాయణ * అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇస్తామన్నారు * రేపు సాయంత్రానికి కార్యాచరణ ప్రణాళిక ఇస్తారు * హెలికాప్టర్ నుంచి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించిన సింగపూర్ బృందం * గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సింగపూర్ ప్రతినిధులతో కలిసి చేసిన ఏరియల్ సర్వే అద్భుతంగా సాగిందని రాజధాని నిర్మాణ సలహా కమిటీ చైర్మన్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, రూపురేఖలను చూసి అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని సింగపూర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే అనంతరం నారాయణ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 200 కిలోమీటర్ల ఏరియల్ సర్వే జరిగిందని తెలిపారు. కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని చూసి సింగపూర్ బృందం ఆశ్చర్యపోయిందని చెప్పారు. తాము ఇటువంటి ద్వీపాలను కృత్రిమంగా నిర్మించామని, ఇక్కడ సహజసిద్ధమైనవి ఉన్నాయని అన్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహకం, కొండ ప్రాంతాలను చూసి అచ్చెరువొందారన్నారు. గొప్ప మాస్టర్ప్లాన్ ఇస్తామని వారు చెప్పారన్నారు. గురువారం ఉదయం మున్సిపల్, పట్టణాభివృద్ధి, రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సింగపూర్ ప్రతినిధులతో కలిసి సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం రాత్రికే మాస్టర్ ప్లాన్ డిజైన్కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారన్నారు. పంట పొలాలు, గ్రామాల పరిశీలన బుధవారం రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధులు జరిపిన ఏరియల్ సర్వేలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సింగపూర్ ప్రతినిధులు టన్ సూన్ కిం, జులియన్ గో, లిమ్స్వీ కెంగ్, ఫ్రాన్సిస్ చోంగ్, లిక్సియా ఒంగ్, కూ తెంగ్ చెయ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు. అమరావతి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు, సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లారు. ముందుగా రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏరియల్ సర్వేతో సరిపెట్టారు. సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటామని రైతులు హెచ్చరించడంతో ఆ గ్రామాల్లో రెండు రోజులుగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. డిజైనింగ్ వరకే ఈ ఎంఓయూ రాజధాని మాస్టర్ప్లాన్పై సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై వచ్చిన విమర్శలకు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ఈ అవగాహన ఒప్పందం రాజధాని డిజైన్కే పరిమితమని చెప్పారు. భవిష్యత్లో జరిగే నిర్మాణ లేదా ఇతరత్రా పనుల నిర్వహణకు ఈ సంస్థలే కొనసాగవచ్చు లేదా వేరే సంస్థలు రావచ్చునని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న రెండు సంస్థలూ అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక్కడి ఇన్కాప్ చైర్మన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, అక్కడి సంస్థ సీఈవో ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. ఒప్పందంపై అనుమానాలు అక్కర్లేదని అన్నారు. -
గగనాన చంద్ర వంచన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో బుధవారం సింగపూర్ సాంకేతికసభ్యుల బృందం ఏరియల్ సర్వే కూడా చంద్రబాబు చీకటి ఒప్పందాల తరహాలోనే సాగింది. ఉదయం 11 గంటలలోపు రాజధాని ప్రతిపాదిత గ్రామాలపై ఆకాశంలో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇదే సమయంలో రైతులను మోసం చేసే విధంగా మీడియాలో ప్రకటనలు వెలువడ్డాయి. ఏరియల్ సర్వే రద్దయిందని తొలి ప్రకటన వచ్చిన అరగంటలోపే సర్వే పూర్తయిందని మరో ప్రకటన వెలువడడం రైతులను వంచనకు గురి చేయడం మినహా మరొకటి కాదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి. రాజధాని భూముల సమీకరణతోపాటు, సింగపూర్ బృందం ఏరియల్ సర్వే కూడా గోప్యంగా జరగడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని రైతులతోపాటు, ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు రైతులతో దొంగాట ఆడుతున్నారని విమర్శించారు. సింగపూర్ బృందం ఏరియల్ సర్వేను వ్యతిరేకిస్తూ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతులంతా నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు, నల్ల జెండాలతో డాబాలు ఎక్కి నిరస న తెలిపారు. అనంతరం సమావేశమైన రైతులనుద్దేశించి ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్ర బాబు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ప్రతిపక్షంతో పాటు, తెలుగుదేశం అభిమానులు సైతం వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సింగపూర్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు, ర హస్య మంతనాలు జరుపుతున్న చంద్రబాబు భూములు ఇవ్వబోమని చెపుతున్న రైతులు, గ్రామాల జోలికి రాకుంటే మంచిదని హెచ్చరించారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కా దని, అసెంబ్లీలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పారని ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగపూర్ కంపెనీలకు చెప్పిన మాయ మాటలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఏరియల్ సర్వేకు మొగ్గు చూపినట్టు అర్థమవుతుందన్నారు. సింగ పూర్ బృందం ఎప్పుడు వచ్చినా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ైరె తులంటే అంత అలుసా...? రైతులంటే చంద్రబాబుకు ఎంత అలుసో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని ఆర్కే అన్నారు. ఒకసారి ‘మట్టి పిసుక్కునే రైతులు’ అని, మరోసారి ‘ఎర్ర చందనం దొంగలు’ అంటూ పోల్చడం దారుణమన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలనే ప్రభుత్వాన్ని చూస్తుంటే, ఎవరిని ఎర్ర చందనం దొంగలతో పోల్చవచ్చో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశాన్ని తాకట్టు పెట్టినట్టు నేడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని సింగపూర్, జపాన్లకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్కే తీవ్రంగా ధ్వజమెత్తారు. -
ఒకవైపు ఏరియల్ సర్వే-మరోవైపు నిరసన
-
ఒకవైపు ఏరియల్ సర్వే-మరోవైపు నిరసన
గుంటూరు: ఏపి కొత్త రాజధాని కోసం ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ బృందం రంగంలోకి దిగింది. ఏపీ నూతన రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించింది. తుళ్లూరు, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, ఐనవోలు, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో ఈ బృందం పర్యటించింది. రెండో విడతలో కృష్ణానది తీరంలోని లంక గ్రామాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. నివాసిత ప్రాంతాలతో పాటు వ్యవసాయ భూములను పరిశీలించారు. మరో వైపు ఈ ప్రాంత రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కోవద్దని ఆందోళనకు దిగారు. నల్లజెండాలతో రైతులు నిరసన తెలిపారు. ** -
భయంతోనే ఏరియల్ సర్వే
గుంటూరు: రాజధాని భూముల సర్వేపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం గుంటూరులో రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని భూములపై ప్రభుత్వం దొడ్డిదారిన ఏరియల్ సర్వే జరుపుతుందని ఆరోపించారు. రోడ్డు మార్గం ద్వారా సర్వే చేస్తే రైతుల ఆగ్రహం చూడాలన్న భయంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎప్పటికైనా రోడ్డు మార్గంలో సర్వే చేయాల్సి వస్తుంది... అప్పుడు రైతులు వారిని అడ్డుకుంటారని హెచ్చరించారు. సింగపూర్ ప్రతినిధులతో పలువురు కేబినెట్ మంత్రులు హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన అమరావతి, కృష్ణా పరివాహక గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉండవల్లిలో రైతులు నల్ల జెండాలు, నల్ల కాగితాలు చేత పట్టి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాజధాని ఏర్పాటుకు తాము అనుకూలంగానే ఉన్నామన్నారు. కానీ రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు మాత్రం తాము సిద్దంగా లేమని తెలిపారు. -
6నెలల్లో క్యాపిటల్ మాస్టర్ ప్లాన్
-
ఏరియల్ సర్వేతో సరి!
రైతుల నిరసనల భయంతో సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటన రద్దు నేడు విజయవాడకు బృందం రాక.. రెండు జిల్లాల అధికారులతో భేటీ సాక్షి, విజయవాడ: భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతుల ఆగ్రహాన్ని సింగపూర్ ప్రతినిధులు చవిచూస్తే ఆ ప్రభావం రాజధాని నిర్మాణంపై ఉండొచ్చనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాటి సింగపూర్ బృందం క్షేత్రస్థాయి పర్యటనను రద్దు చేసింది. ఉదయం విజయవాడలోని గేట్వే హోటల్లో అధికారులతో కాసేపే మా ట్లాడి, సింగపూర్ ప్రతినిధి బృందం ‘ఏరియల్ సర్వే ’ జరిపేలా ఏర్పాట్లు చేసింది. మంగళవారం రాత్రి చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ మేరకు కార్యక్రమాన్ని మా ర్చింది. వాస్తవానికి సింగపూర్ నిపుణుల బృందం బుధవారం ఉదయం రాజధాని ప్రతిపాదిత మండలాలైన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో పర్యటిం చేలా కార్యక్రమం ఖరారు చేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన రైతులు సోమవారం రాత్రి సమావేశమై సింగపూర్ బృందం వస్తే ప్రతిఘటించాలని తీర్మానించుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఎలాగైనా బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకుని వెళ్లాలనుకున్న ప్రభుత్వ వర్గాలు ఆ గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నమే పోలీసు బలగాలను మోహరింప చేశాయి. అయితే రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే విషయాన్ని ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు చేరవేశాయి. దీంతో సింగపూర్ బృందాన్ని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయించి వెనక్కు పంపేలా ప్రభుత్వం మార్పులు చేసింది. -
సీఎం పర్యటన సాగిందిలా..
* రెవెన్యూ భూములను హెలీకాప్టర్లలో ఏరియల్ సర్వే చేసిన సీఎం * కట్టుదిట్టమైన భద్రత కందుకూరు: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ ఫార్మారంగ సంస్థల అధినేతలతో కలిసి నాలుగు హెలీకాప్టర్లలో బుధవారం మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను సందర్శించారు. దీంతో నాలుగు రోజులుగా ఆ ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన అధికారులు ఏర్పాట్లను చేశారు. కాగా ఉదయం 11.30 గంటలకు మొదటి హెలీకాప్టర్ రాగా, 11.58 గంటలకు రెండో హెలీకాప్టర్ దిగింది. 12.20 గంటలకు మూడో హెలీకాప్టర్, 12.23 గంటలకు సీఎం కేసీఆర్ ఉన్న హెలీకాప్టర్ ల్యాండయింది. వారంతా క్షేత్రస్థాయిలో అక్కడి భూములతోపాటు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 1.10 గంటల ప్రాంతంలో మూడు హెలీకాప్టర్లలో సీఎం బృందం ఏరియల్ సర్వే నిర్వహించి 1.30 గంటలకు తిరిగి ల్యాండయ్యాయి. అనంతరం 2.25 గంటల ప్రాంతంలో హెలీకాప్టర్లలో హైదరాబాద్కు తరలివెళ్లారు. కేసీఆర్తోపాటు రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత.. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ నుంచి హన్మాస్పల్లి, జమ్ములబావి తండా మీదుగా మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 288లో ఏర్పాటు చేసిన ప్రాంతం వరకు ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. పాస్లు ఉన్నవారినే అనుమతించడంతో ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులు, వివిధ పార్టీల నేతలు నిరుత్సాహంతో వెనుదిరగాల్సి వచ్చింది. మీడియా నిరసన.. కాగా ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి మీడియాను అనుమతించకపోవడం, ఇతర నేతల్ని అనుమతించడంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు ఆందోళన చేశారు. స్థానిక సీఐ సంతకంతో జారీచేసిన పాస్లతో వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలను అనుమతించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో పోలీస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉత్సాహంతో వచ్చి నిరుత్సాహంగా.. ఎంతో ఉత్సాహంతో సీఎంను చూద్దామని వచ్చిన సమీప గ్రామాల ప్రజలకు నిరుత్సాహమే మిగిలింది. జమ్ములబావి తండా వరకు చేరుకున్న వారికి అక్కడి నుంచి ముందుకు అనుమతించకపోవడంతో చాలాసేపు నిరీక్షించి నిరుత్సాహంతో వెనుదిరిగారు. కొందరు కొండలు, గుట్టలపై కూర్చొని మరీ చూసే ప్రయత్నం చేశారు. స్థానికులకు అవస్థలు.. సీఎం పర్యటన కారణంగా ఆ ప్రాంతంలోని భూములతోపాటు సమీప భూముల్లో పశువులను మేపుకోవడానికి వె ళ్లే వారు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలకు అవస్థలు తప్పలేదు. పోలీసులు అటువైపు ఎవరినీ వెళ్లనీయకపోవడంతో రోజు వారీ పనులు చేసుకునే వారికి ఇబ్బంది తప్పలేదు. -
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం రంగారెడ్డి జిల్లా రాచకొండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫిల్మ్సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అంతకుముందు ముచ్చర్ల అటవీ భూములను పరిశీలించారు. ఔషధ పరిశ్రమల కోసం భూములను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ వెంట పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో కలసి రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వేకు వెళ్లారు. -
‘ఫార్మా సిటీ’ కోసం నేడు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: ఫార్మా సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాల అన్వేషణ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కలసి బుధవారం ముచ్చెర్ల ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. వీరంతా మొత్తం నాలుగు హెలికాప్టర్లలో ఉదయం 11.45 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 12.15 గంటలకు ముచ్చెర్లకు చేరుకుంటారు. అక్కడ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం నేతృత్వంలో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. తొలుత రాచకొండ ప్రాంతాన్ని కూడా ఏరియల్ సర్వే చేయాలని అధికారులు భావించినా.. ఏదో కారణంతో దానిని విరమించుకున్నారు. -
ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో కొత్తగా ఫిలిం సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జల్లాల్లో ఆయన ఈ సర్వే చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడినుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిపోకుండా ఉండేందుకు ఇక్కడే సమస్త సదుపాయాలతో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీ నిర్మించాలని కేసీఆర్ పలు సందర్భాలలో తెలిపారు. అలాగే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా తరలిపోయే అవకాశం ఉన్నందున.. వాటికోసం కూడా సదుపాయాలు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో భూములను పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ చూస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం నిర్వహిస్తారు. -
సీఎం రాచకొండ పర్యటన రద్దు
⇒ ముచ్చర్ల పర్యటనకే పరిమితం ⇒ దేశంలోని 20మంది ఫార్మా దిగ్గజాలతో కలిసి ఏరియల్ సర్వే ⇒ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్న యంత్రాంగం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాచకొండ భూముల్లో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయ్యింది. ముచ్చర్ల పర్యటనకు ఆయన గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఫిల్మ్సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే కోసం రాచకొండ గుట్టల్లో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్తోపాటు ఇతర అధికార యంత్రాంగం కొన్ని రోజులుగా సీఎం పర్యటన ఏర్పాట్లలో తలమునలైంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సీఎం పర్యటన రద్దు కావడంతో అధికార యంత్రాంగం నిరాశకు లోనయింది. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం కోసం బుధవారం కందుకూరు మండలంలోని ముచ్చర్లలో కేసీఆర్ పర్యటించనున్నారు. దాంతో రాచకొండ పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కార్యాలయం జిల్లా కలెక్టర్కు తెలియజేసింది. దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలు 20మందికిపైగా ముచ్చర్లకు రానున్నారు. ఈ క్రమంలో సీఎం ఎక్కువ సమయంలో ముచ్చర్లలో ఫార్మా కంపెనీల దిగ్గజాలతో గడపనున్నారు. ఆమనగల్లులో ఫార్మాసిటీ కోసం సుమారు 2వేల ఎకరాలను ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా అధికారులు అంతా ఇప్పుడు ముచ్చర్లలో ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఫార్మాసిటీ కోసం ఇక్కడ సీఎం ఫార్మా అధినేతలతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ యంత్రాంగం ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శనను తిలకించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ హించనున్నారు. -
రాచకొండలో కేసీఆర్ ఏరియల్ సర్వే
3న ఫార్మా దిగ్గజాలతో కలసి భూముల పరిశీలన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా సరిహద్దులోని కందుకూరు మండలం ముచ్చర్లలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. డిసెంబర్ 3న బల్క్ డ్రగ్, ఫార్మారంగంలో దిగ్గజాలైన కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఈ ప్రాంతంలోని భూములను హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. మరోవైపు రాచకొండ గుట్టల్లోని 25 వేల ఎకరాల్లో ఫిల్మ్సిటీ, ఐటీ తదితర పారిశ్రామిక హబ్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచేందుకు బడా ప్రణాళికలు రూపొందించిన సర్కారు... బహుళ జాతి సంస్థలను ఆకట్టుకునేందుకు రాజధాని శివార్లపై కన్నేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్రింగ్రోడ్డుకు చేరువలోని రాచకొండ, ముచ్చర్లలో సమృద్ధిగా భూ లభ్యత ఉండడంతో ఈ ప్రాంతాలను వివిధ రంగాల హబ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఏరియల్ సర్వేకు ముందుగా ఆదివారం పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్రంజన్లతోపాటు రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. రాచకొండలో ఫిల్మ్సిటీ: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్సిటీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముచ్చర్లలో ఫార్మాసిటీ: రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దులోని కందుకూరు, ఆమన్గల్ మండలాల శివార్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముచ్చర్ల మండలం సర్వే నంబర్ 288లోని 2500 ఎకరాలు, పక్కన ఉన్న మరో వేయి ఎకరాల(ఆమన్గల్ మండల పరిధి)ను ఫార్మాసిటీ కోసం సేకరించనున్నారు. డిసెంబర్ 3న రెడ్డీస్, అరవిందో, హెటెరో సంస్థల అధినేతలతో కలసి సీఎం విహంగ వీక్షణం చేయనున్నారు. -
యాదగిరిగుట్టకు కేసీఆర్ వరాల జల్లు
-
తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధి: కేసీఆర్
యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని, రెండేళ్లలో దీన్ని పూర్తిగా టీటీడీ తరహాలో టెంపుల్ సిటీగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో శుక్రవారం నాడు ఏరియల్ సర్వే చేసిన కేసీఆర్.. యాదగిరిగుట్టపై వరాలజల్లు కురిపించారు. రెండువేల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, కళ్యాణమండపాలు, కాటేజిలు ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట కింద చెరువులు, గుట్టలు కలిపి 400 ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని, ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేలా ఆనవాయితీ ఇకమీదట ఉంటుందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్లోని కార్పొరేట్ సంస్థలన్నీ యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలని పిలుపునిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు. -
యాదగిరిగుట్టలో కేసీఆర్ ఏరియల్ సర్వే
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్న ఆయన యదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఈ ఏరియల్ సర్వే చేశారు. తిరుపతికి దీటుగా సుమారు రూ.700కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఏరియల్ సర్వేలో ఎంపీ డాక్టర్ బుర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడ సునీత, కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు. ఏరియల్ సర్వే అనంతరం యాదగిరిగుట్టలోని హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్లొంటారు. కాగా యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి కేసీఆర్కు అత్యంత ఇష్టదైవం. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోవటానికి ఆయన ప్రయత్నించినప్పటికీ పలు కారణాలతో రాలేకపోయారు. -
నేడు యాదగిరిగుట్టకు సీఎం రాక
భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి హెలికాప్టర్లో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి రూపొందిం చిన మాస్టర్ప్లాన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి అయన ఈ ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తిరుపతి క్షేత్రానికి దీటుగా సుమారు రూ.700కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధికి అవసరమైన అంశాలను అయన ప్రస్తావిస్తారు. ఏరియల్ సర్వే అనంతరం యాదగిరిగుట్టలోని హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కాగా, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి కేసీఆర్కు అత్యంత ఇష్టదైవం. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పలు కారణాలతో రాలేకపోయారు. హెలిపాడ్కు స్థల పరిశీలన హెలిపాడ్ కోసం అధికారులు గురువారం రాత్రి గుట్ట పరిధిలోని సైదాపురం, మల్లాపురంలలో రెండు స్థలాలను పరిశీలించారు. పరిశీలించినవారిలో కలెక్టర్ టి.చిరంజీవులు, ఆర్డీఓ మధుసూదన్, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. -
అండగా ఉంటాం
* ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ భరోసా * రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు * ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే * పంటల బీమా చెల్లింపులోసానుభూతి చూపాలని కంపెనీలకు చెబుతా * టెక్నాలజీ సహాయంతోప్రాణ నష్టం బాగా తగ్గించారు * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయి * విశాఖను చూస్తే బాధేస్తోంది * మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వే ల కేంద్ర సహాయం విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ 50 వేలు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. నష్టంపై సమగ్ర సర్వేలు చేయించి ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దక్షిణ ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాం తాల్లో మంగళవారం ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావానికి కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుపాను ఫొటోల ప్రదర్శనను తిలకించారు. తుపాను సమీక్ష అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయనీ, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భీకరమైన తుపాను ప్రభావాన్ని స్వయంగా అనుభవించిన విశాఖ ప్రజలు నిబ్బరంగా ఉన్నారనీ, సహాయక చర్యల్లో పాల్గొం టున్న ప్రజలు, అధికారులను ఆయన అభినందించారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఇటీవల వచ్చిన హుదూద్ పెనుతుపాను ఆంధ్రాతో సహా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో విలయం సృష్టించింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై సానుభూతి ప్రకటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకారాన్ని అందిస్తుంది. ఈ తుపానును ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించారు. పొంచి ఉన్న తుపాను ముప్పును వాతావరణశాఖ ముందుగానే గుర్తించి ఈనెల 6వ తేదీ నుంచే సమాచారాన్ని అందించింది. ఊహించిన దిశ, సమయంలోనే తుపాను తీరం దాటింది. ఫలితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సఫలమయ్యాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భుజం భుజం కలిసి పనిచేస్తే, సరైన మార్గంలో వెళితే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. ఏపీ ప్రభుత్వం, కేంద్రం ఐదు రోజులపాటు నిరంతరం.. మినిట్ టు మినిట్.. పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేశాయి. స్థానిక సంస్థలు కూడా పూర్తిస్థాయిలో కలిసి నడిచాయి. విపత్తు సమయంలో ప్రభుత్వ సూచనలను పాటించిన వైజాగ్ ప్రజలను అభినందిస్తున్నా. క్రమశిక్షణతో సూచనలు పాటించడంవల్లే ప్రజల ప్రాణాలను కాపాడటంలో మేం సఫలమయ్యాం. విపత్తులో ధైర్యం కోల్పోకుండా భయంకరమైన తుపానును మీరు(ప్రజలు) ఎదుర్కోగలిగారు. నేను చాలా దూరం వెళ్లాను. ఏరియల్ సర్వే చేశాను. ఒడిశా ప్రాంతాలను కూడా చూశాను. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. కోస్ట్గార్డు, నేవీ, రైల్వే, ఎయిర్లైన్స్, జాతీయ రహదారులు.. అన్నిటికీ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంకోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చి సర్వే చేస్తారు. రైతులకు పంట చేతికొచ్చే సమయం ఇది. తుపానువల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా, నష్టపరిహారం చెల్లింపు విషయంలో సానుభూతితో వ్యవహరించాలని బీమా కంపెనీలతో మాట్లాడతాను. ఇక ప్రైవేటు బీమా కంపెనీల ప్రతినిధులు బాధితులతో సమావేశమై వారి క్లెయిములను త్వరగా చెల్లించే దిశగా పనిచేయాలని బీమా కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థను చూస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. ఇప్పటికే చాలా పనులు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చింది. మరోవైపు వైజాగ్ను స్మార్ట్ సిటీ చేయాలన్న కలతో నేను చాలా ఆనందపడ్డాను. ఊహించని విధంగా కష్టాలు వచ్చాయి. ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం నాకుంది. అతి త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. నష్టాలను సరిచేసుకోడంలో సఫలం అవుతాం. విద్యుత్, తాగునీరు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ ప్రాధాన్యత ఇచ్చాం. కొన్ని గంటల్లోనే పరిస్థితులు మెరుగవుతాయి. దీని కోసం కేంద్రం నుంచి ప్రతినిధులను ప్రత్యేకంగా విపత్తు సర్వే పనుల కోసం డిప్యూట్ చేశాను. ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నమైంది. ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. భారీ విపత్తు నుంచి కోలుకోవడానికి కేంద్రం తరపున మధ్యంతర సహాయం కింద రూ. 1000 కోట్లు సహాయం ప్రకటిస్తున్నా. ఇక ముందు కూడా ఏపీ, వైజాగ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సహాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందిస్తాం. తుపాను నష్టంపై ప్రధాని సమీక్ష హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. తుపాను నష్టంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రధాని సమీక్ష జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రధాని సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను విధ్వంసం కారణంగా జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు. విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేపట్టడానికి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి అధికారులు, ఉద్యోగులను రంగంలోకి దించామని తెలిపారు. తనతోపాటు మంత్రులు సైతం ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంగళవారం రాత్రికి విశాఖలో అత్యవసర సర్వీసులకైనా విద్యుత్ సరఫరా జరపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు. విశాఖ విషాదం అందరిదీ! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోదీ రాష్ట్రంలో తుపాను నష్టం పరిశీలనకు ఏరియల్ సర్వే కోసం మంగళవారం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం లో ప్రయాణించి విశాఖపట్నంలో సంభవించి న తుపాను విధ్వంసాన్ని స్వయం గా చూశా రు. ఈ సందర్భంగా విశాఖ విషాదం అందరిదీనని, నగరం త్వరగా కోలుకునేందుకు చేయూతనందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఒకే వాహనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రధాని విశాఖ రోడ్లపై కుప్ప కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, తీగలను చూసి నష్టం పెద్దదని వ్యాఖ్యానించారు. తుపాను బాధిత ప్రజలను కూడా సమీకరించి త్వరితగతిన కోలుకునేలా చేద్దామని చంద్రబాబుకు చెప్పారు. ‘విశాఖనగరాన్ని వీలైనంత త్వరగా పూర్వ స్థితికి తెచ్చేందుకు బ్లూప్రింట్ తయారు చేయాలని ప్రధాని సూచించారు. అదేవిధంగా తగిన ప్రతిపాదనలతో వస్తే విశాఖ పునరుద్ధరణకు సహకరిస్తానని మోదీ చెప్పారు. కాగా, ప్రధాన మంత్రి తొలిసారి కలెక్టరేట్కు వచ్చి తుపానుపై సమీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. మరోపక్క ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ మమకారాన్ని నిలుపుకుందాం: మోదీ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ప్రజలు కేంద్రంపై, తనపై చూపిన మమకారాన్ని నిలుపుకోవాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం విశాఖలో పలు ప్రాంతాలను రోడ్డు మార్గంలో సందర్శించినప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతూ మోదీకి జయజయధ్వానాలు పలికారు. పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రధాని ఈ విషయం ప్రస్తావించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తమ గోడు వినిపిస్తూ ఆందోళన చేస్తుంటారని గుర్తుచేశారు. కానీ విశాఖ ప్రజలు అందుకు భిన్నంగా స్వాగతం పలకడంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తుపానుకు ముందు, అనంతరం కేంద్రం, రాష్ట్రం అప్రమత్తంగా ఉండడంతో ప్రజల్లో విశ్వాసం కలిగిందని వెంకయ్య చెప్పారు. ప్రధాని మీద ఉన్న నమ్మకం కూడా వారి మమకారానికి కారణమన్నారు. దీంతో ప్రధాని తిరిగి ‘ఆ విశ్వాసాన్ని, వారి మమకారాన్ని మనం నిలుపుకోవాలి..’ అని వెంకయ్యనాయుడితో చెప్పారు. -
విశాఖకు మోడీ... 1.20 నుంచి ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్ సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించేందకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 1.20 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా విశాఖపట్నంతోపాటు దక్షిణ ఒడిశాలోని ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించానున్నారు. సర్వే అనంతరం విశాఖ కలెక్టరేట్కు చేరుకుంటారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.20కి మళ్లీ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకుని న్యూఢిల్లీ పయనమవుతారు. -
సోషల్ మీడియాను వాడుకుంటున్నాం
రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయల్దేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి ఆహారపు పొట్లాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా అందచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒకవేళ నేరుగా అందచేయటానికి వీలుకాకుంటే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ చేస్తే గూగుల్, ఫేస్బుక్లు ప్రమోట్ చేశాయన్నారు. పునరావాస కార్యాక్రమాల బాధ్యతను ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్కు అప్పగించినట్లు తెలిపారు. విద్యుత్ పునరుద్దరణపై పియూష్ గోయల్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నష్టాన్ని ఏ,బీ,సీ కేటగిరిల కింద విభజిస్తామన్నారు. ఒడిశా, తెలంగాణ పవర్ గ్రిడ్ల నుంచి విద్యుత్ను వాడుకుంటామన్నారు. -
హుదూద్ తుఫానుకు ఐదుగురు మృతి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను ప్రభావంతో అయిదుగురు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2.48లక్షల మంది తుఫాను బాధితులుగా వెల్లడించింది. 223 సహాయక శిబిరాల్లోని 1.35లక్షల మందిని పునరావస కేంద్రాలకు తరలించినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాల్లో 320 గ్రామాలు తుఫాన్ ప్రభావానికి గురయినట్లు తెలిపింది. తుఫాను ప్రభావంతో అయిదుగురు చనిపోగా, 34 పశువులు మృత్యువాత పడ్డాయని, అలాగే 70 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది. కాగా సహాయక చర్యలకు గానూ 691మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే 6 హెలికాప్టర్లతో నిరంతర పర్యవేక్షణ చేయడంతోపాటు 155 వైద్య బృందాలు, 56 పడవలు, 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. -
ప్రధాని, సోనియా ఏరియల్ సర్వే రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నవంబర్ 2న రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో తలపెట్టిన ఏరియల్ సర్వే రద్దయింది. తొలుత అక్టోబర్ 31న రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించాలని వారు భావించారు. అనివార్య కారణాల వల్ల అది ఈనెల రెండో తేదీకి వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఏరియల్ సర్వే నిర్వహించడం వల్ల వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశం లేదని, క్షేత్రస్థాయి పర్యటనకు వెళితేనే జరిగిన నష్టం అంచనా వేసేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. క్షేత్రస్థాయి పర్యటన చేస్తే రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో తీవ్రస్థాయిలో నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉందనే నివేదికలు అందడంతో.. ప్రధాని, సోనియాలు ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. -
2న ప్రధాని, సోనియాల ఏరియల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీలు నవంబర్ 2వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. పై లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను వారు పరిశీలిస్తారు. వీరు గురువారం ఈ ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల రెండో తేదీకి వాయిదా పడింది. 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తరువాత ఒడిశాలోని గంజాం జిల్లాలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలో కూడా నష్టాన్ని పరిశీలిస్తారు. -
రేపు ప్రధాని, సోనియా ఏరియల్ సర్వే
సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీలు ఈ నెల 31న ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి వరకు ఖరారైన సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గురువారం ఉదయం 11 గంటలకు వారు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి, పంట నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఆ తరువాత ఒడిశాలోని గంజాం జిల్లాలో తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో కూడా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. తుపాను, వరద నష్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను వీక్షించనున్నారు. బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళుతున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయంలో మన్మోహన్, సోనియాలకు స్వాగతం పలుకనున్నారు. ఇలావుండగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి ంచనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో బయల్దేరి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు. లావేరు మండలం అడపాక జంక్షన్లో పత్తి పంట నష్టాన్ని పరిశీలిస్తారు. శ్రీకాకుళం పట్టణంతోపాటు మండలంలోని నొప్పంగిలో వరద నష్టాలను పరిశీలించిన అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వరద నష్టాలపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం విశాఖపట్నం చేరుకుని అనకాపల్లి మండలం కొప్పాడ గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలిస్తారు. రాంబిల్లి మండలంలో పర్యటించాక విశాఖపట్నం చేరుకుని సర్క్యూట్ హౌస్లో అధికారులతో సమీక్షిస్తారు.