army jawan
-
భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడికించి..
సాక్షి, హైదరాబాద్/మీర్పేట: ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్హోల్లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. హత్య చేసి.. ఇంట్లోంచి వెళ్లిపోయిందని... స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్బాగ్లోని డీఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అదుపులోకి తీసుకుని విచారించడంతో.. ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతోపాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ సీఐ నాగరాజు తెలిపారు. యూట్యూబ్లో చూసి.. ముందుగా కుక్కపై ప్రయోగం చేసి.. భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. ఆధారాల కోసం పోలీసుల ప్రయత్నాలు.. మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. దీనితో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి పిల్లలు మేడ్చల్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. -
జవాన్ కార్తీక్ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఆర్మీ జవాన్ కార్తీక్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సంతాపం తెలిపారు. కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అని ప్రశంసించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్(Jawan Karthik) కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పారు.ఉత్తర జమ్మూలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్తీక్ మృతిపై వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్. అలాగే, కార్తీక్ చూపిన ధైర్యసాహసాలు, త్యాగానికి సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ కష్ట సమయంలో కార్తీక్ కుటుంబానికి అందరం అండగా నిలుద్దాం అని వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లా, ఎగువరాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కార్తిక్ కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని… pic.twitter.com/9P1axvHTi9— YS Jagan Mohan Reddy (@ysjagan) January 21, 2025 -
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
కూతురు పెళ్లికి ముందు జవాను మృతి..దేవుడిలా వచ్చిన స్నేహితులు
లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు. -
నాన్న.. అనిపించుకోకుండానే..
తండ్రిని కాబోతున్నాననే ఆనందంతో ఆర్మీ జవాన్ సెలవుపై వచ్చాడు. సోమవారం భార్య ప్రసవానికి వైద్యులు సమయం ఇచ్చారు. కానీ ఒక్క రోజు ముందే ఆదివారం రాత్రి మృత్యువు వెంటాడింది. నాన్న అనిపించుకోకుండానే ఆ ఆర్మీ జవాన్ను రోడ్డు ప్రమాదం కబళించింది. ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అతడితోపాటు మరొకరు చనిపోయారు. నస్పూర్: తెల్లవారితే తనకు పుట్టబోయే బిడ్డను ఎత్తుకుని మురిసిపోదామనుకున్న ఒకరు నాన్న అనే పిలుపునకు నోచుకోకుండానే, తన సోదరుని అత్త మరణ వార్త తెలుసుకుని అతన్ని ఓదార్చుదామనుకున్న మరోవ్యక్తిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలోని దొరగారిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లెకు చెందిన ముల్క ఉదయ్ ఆదివారం రాత్రి పని నిమిత్తం బైక్పై మంచిర్యాలకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన పత్తి నర్సింహ తన భార్య రమాదేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గద్దెరాగడికి బయలుదేరాడు. దొరగారిపల్లె గ్రామ సమీపంలో 200 పీట్ల సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే ఇరువురి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఉదయ్, నర్సింహ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు.భార్య డెలివరీకి వచ్చి...ముల్క ఉదయ్ భోపాల్ రాష్ట్రంలో ఆర్మీ జవానుగా ఉద్యోగం చేస్తున్నాడు. మంచిర్యాలకు చెందిన పావనితో 2022లో వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఆమె డెలివరీ కోసం పదిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు. వైద్యులు ఆమెకు సోమవారం డెలివరీ సమయం ఇచ్చినట్లు సమాచారం. తెల్లవారితే తనకు ముద్దులొలికే చిన్నారి జన్మిస్తుందని అతను కన్న కలలు నెరవేరకుండానే ఇలా మృత్యువు కబలించడం కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. సోదరుని పరామర్శించేందుకు వెళ్తూ...నస్పూర్కాలనీలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న పత్తి నర్సింహకు 2014లో రమాదేవితో వివాహమైంది. గద్దెరాగడిలో నివాసం ఉండే తన సోదరుని అత్త మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సింహా ఆదివారం రాత్రి రమాదేవిని బైక్పై ఎక్కించుకుని గద్దెరాగడికి బయలుదేరాడు. నర్సింహను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం, అతని భార్య గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.గ్రామంలో విషాదం..ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో దొరగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్ల కిడ్నాప్, ఒకరు మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఇద్దరు ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అనంత్నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్కు గురయ్యారు. కాకర్నాగ్ ప్రాంతం టెరిటోరియల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల చెర నుంచి ఒక జవాన్ తప్పించుకుని బయటపడగా.. ఇంకో జవాన్ వారి చేతులో చిక్కుకుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న భారత సైన్యం.. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గాయపడిన జవాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిస్ అయిన మరో జవాన్.. కొన్ని గంటలకే కోకెర్నాగ్లోని అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన సైనికుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.మృతుడిని అనంత్నాగ్లోని ముక్ధంపోరా నౌగామ్కు చెందిన హిలాల్ అహ్మద్ భట్గా అధికారులు గుర్తించారు. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. ఇటీవలె జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా.. ఆ ఫలితాలు వెల్లడైన ఒక రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం -
పొగరుబోతుకు ఆర్మీ జవాన్ జవాబు!
ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఇందులో స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్ కలిగిన ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.Satisfying video 🤌🏻Indian Army 😍 pic.twitter.com/H6nnlehIaD— Shilpa (@shilpa_cn) August 25, 2024 -
కూటమి అరాచకాలు.. దన్నానపేటలో ఆర్మీ జవాన్ ఇంటి కూల్చివేత
-
విషాదం: అసోంలో తెలంగాణ జవాన్ మృతి
సాక్షి, నల్లగొండ: తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్ అసోంలో మృతిచెందాడు. నేడు అతడి భౌతికకాయం స్వగ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. రేపు అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం మాదరిగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఈరేటి మహేష్(24) అసోంలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మహేష్కు ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు. దీంతో, నేడు అతడి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. రేపు స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
కథువా ఉగ్రదాడిని ఖండించిన భారత్.. ప్రతీకారం తీర్చుకుంటాం!
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు.ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. -
రిటైర్డ్ ఆర్మీ జవానుకు 20 ఏళ్ల జైలు
రాంగోపాల్పేట్: ఓ మైనర్ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ జవానుకు పోక్సో స్పెషల్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన 2017 సంవత్సరంలో జరిగింది. మార్కెట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఓ మైనర్ బాలిక రెజిమెంటల్బజార్లోని హోంలో ఉంటూ 31బస్టాప్ ప్రాంతంలోని పాలికాబజార్లో ఉండే ఓ టైలరింగ్ సెంటర్లో టైలరింగ్ నేర్చుకుంటోంది. 2017 జూలై 24వ తేదీన ఉదయం 11గంటలకు టైలరింగ్ సెంటర్కు వెళ్తుండగా ఆర్మీలో పదవి విరమణ పొందిన యాప్రాల్లో నివాసం ఉండే పెరియాటి శ్రీధరన్(59) బాలికను ఆపి భోజనం చేశావా అంటూ ప్రశ్నించాడు. భోజనం పెట్టిస్తానని ముత్యాలమ్మ దేవాలయం ప్రాంతంలోని ఓ హోటల్కు తీసుకుని వెళ్లి భోజనం పెట్టించాడు. అక్కడి నుంచి ఆ బాలికను హోటల్కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత మనోహర్ థియేటర్ ప్రాంతంలోని ఓ లైన్లో ఆ బాలికను విడిచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. బాలిక హోంకు వెళ్లి రెండు రోజుల పాటు ఏడుస్తూ విచారంగా ఉంది. హోంలోని ఓ ఆరోగ్య కార్యకర్త గమనించి ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే 27వ తేదీన హోం నిర్వాహకులు మంజుల, పద్మ బాలికను తీసుకుని వెళ్లి మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించి చార్జిïÙట్ను కోర్టుకు సమరి్పంచారు. పోక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి పుష్పలత కేసును విచారించి పోలీసులు సమరి్పంచిన సాక్ష్యాధారాలతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. మరో రూ.20వేల జరిమానా కూడా విధించారు. ఈ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి బాలిక తరఫున వాదనలు వినిపించి శిక్ష పడేలా చూశారు. -
18 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో..
నిజామాబాద్: ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మహ్మద్ షాదుల్ ఎత్తైన మంచు పర్వతంపై తన స్వగ్రామం పేరును ప్రదర్శించి మమకారం చాటుకున్నారు. షాదుల్ రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్లోని లదాఖ్లో గల 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతంపై మైనస్ 38 డిగ్రీల టెంపరేచర్లో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామం అన్నాసాగర్ పేరుతో ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. గ్రామస్తులు షాదుల్ను అభినందించారు. ఇవి చదవండి: ఎట్టకేలకు ‘రూట్’ క్లియర్! -
ఆర్మీ ఉద్యోగి అదృశ్యం
ప్రకాశం: ఓ ఆర్మీ జవాన్ విధులకు హాజరయ్యేందుకు పశ్చిమ బెంగాల్కు వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. 10 రోజులు దాటినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొమరోలు మండలలోని ఎర్రపల్లె గ్రామానికి చెందిన మారంరెడ్డి వీరబ్రహ్మానందరెడ్డి పదేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని న్యూజల్పాయ్గురి క్యాంప్లో ఉంటున్నాడు. కాగా, డిసెంబరు 8వ తేదీన వీరబ్రహ్మానందరెడ్డి సెలవుపై స్వగ్రామానికి వచ్చి నెల రోజుల తర్వాత తిరిగి జనవరి 8వ తేదీన విధుల్లో చేరేందుకు స్వగ్రామం నుంచి బయలుదేరి వెళ్లాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో దిగిన వీరబ్రహ్మానందరెడ్డి అక్కడే అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీరబ్రహ్మానందరెడ్డి ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో అదృశ్యం కావడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంధుమిత్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి వీరబ్రహ్మానందరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరబ్రహ్మానందరెడ్డికి సంబంధించిన మొబైల్ ఫోన్, లగేజీ ఎల్జీపీటీ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరబ్రహ్మానందరెడ్డికి ఏడాది క్రితమే ఒంగోలుకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహమైంది. -
మాంజా దారానికి బలైన ఆర్మీ జవాన్
-
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
అనకాపల్లి: గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి చెందారు. మండలంలోని గిడుతూరుకు చెందిన మట్ల సహదేవుడు(45) ఆర్మీలో హవాల్దార్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలో పనిచేస్తున్న ఈయన గురువారం విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలు ముగించి భౌతిక కాయాన్ని స్వగ్రామం తరలించారు. ఈ మేరకు శుక్రవారం గిడుతూరులో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
హైదరాబాద్లో జవాన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చదవండి: రమేష్ కుమార్ జైస్వాల్ ఎక్కడ? -
సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, నిజాబాద్: సిక్కింలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఆర్మీ జవాన్లలో నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. గురువారం మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం కోసం పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గిరి జిల్లా ఆస్పత్రికి ఆర్మీ అధికారులు తరలించారు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశాలున్నా యి. ఎమ్మెల్యే షకీల్ సమకూర్చిన విమానంలో మృతుడి తమ్ముడు సుధాకర్, మరో బంధువు దిలీప్ బయలుదేరి వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పశ్చి మబెంగాల్లోని బినాగుడి ఆర్మీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్ శిక్షణలో భాగంగా 20 రోజుల క్రితం సిక్కింలోని జులుక్ ప్రాంతానికి వెళ్లి తీస్తా నది వరదల్లో గల్లంతయ్యారు. గంగాప్రసాద్ది నిరు పేద దళిత కుటుంబం. గంగాప్రసాద్కు భార్య శిరీష, ఇద్దరు కుమారులు హర్ష(6), ఆదిత్య(3) ఉన్నారు. -
వరదలో కొట్టుకుపోయిన 23 మంది ఆర్మీ సిబ్బంది..
-
ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశి్చమ జిల్లా తరుంగ్ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్థంగ్ కొమ్.. కంగ్పొక్పి జిల్లా లీమఖోంగ్లోని ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన ప్లటూన్లో విధులు నిర్వర్తిస్తన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం ఖునింగ్థెక్ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. -
నా భార్యపై దారుణంగా దాడి చేశారు.. ఆర్మీజవాన్ వీడియో కలకలం
కొంతమంది వ్యక్తులు నా భార్యపై దారుణంగా దాడి చేశారంటూ ఓ ఆర్మీ జవాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కడవాసల్ గ్రామంలో కొందరు వ్యక్తులు నా భార్యను అర్థనగ్నంగా చేసి దాడి చేశారంటూ ఆమె భర్త ఆర్మీ జవాన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఆరోపణలు చేస్తున్న ఆర్మీ జవాన్ హవల్దార్ ప్రభాకరన్ తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన వ్యక్తి. అతను ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తన భార్యకు జరిగిన అవమానం గురించి వివరించాడు. తన భార్య ఒక స్థలంలో లీజుకు ఓ దుకాణం నుడుపుతోందని వీడియోలో తెలిపాడు. ఆమెను 120 మంది వ్యక్తలు కొట్టి షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరించారని, తన భార్యను అర్ధ నగ్నం చేసి దారుణంగా కొట్టారని ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కంధవాసల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని ప్రభాకరన్ మామగారైన సెల్వమూర్తి కుమార్ నుంచి ఐదేళ్ల కాలానికి రూ. 9.5 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్ మరణించిన తర్వాత అతని కుమారుడు రాము దుకాణాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు డబ్బు తిరిగి ఇవ్వడాన్ని కూడా అంగీకరించడమే గాక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఐతే సెల్వమూర్తి డబ్బు తీసుకునేందుకు తిరస్కరించడమే గాక దుకాణం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడని రాము పేర్కొన్నాడు. ఈ క్రమంలో జూన్ 10వ తేదిన సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలకు డబ్బు ఇచ్చేందుకు రాము దుకాణానికి వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ గొడవను గమనించి స్థానికులు రాముకు పెద్ద ఎత్తున మద్దతుగా రావడంతో అది కాస్త పెద్దదై, అక్కడ దుకాణంలో వస్తువులు బయటకు విసిరేసేంత వరకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో దుకాణంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని, కానీ వారిపై ఆ గుంపు దాడి చేయలేదని ప్రకటనలో వెల్లడించారు పోలీసులు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై ఆర్మీ జవాన్తో మాట్లాడి తమ పార్టీ అతని భార్యకు న్యాయం చేయడమే గాక కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ ఆ ట్వీట్లో..కాశ్మీర్లో మన దేశానికి ధైర్యంగా సేవ చేస్తున్న హవల్దార్, అతని భార్యతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆమె కథ విని నిజంగా బాధనిపించింది. తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు సిగ్గుపడ్డాను. వెల్లూరులో ఓ ఆస్పత్రిలో చేరినా ఆమెను తమ పార్టీ పరామర్శించినట్లు ట్వీట్ చేశారు. @ThanthiTV @News18TamilNadu @PTTVOnlineNews @ChanakyaaTv @Def_PRO_Chennai @narendramodi @annamalai_k @rajnathsingh — Lt Col N Thiagarajan Veteran (@NTR_NationFirst) June 10, 2023 (చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!) -
రాజన్న సిరిసిల్లలో ముగిసిన జవాన్ అనిల్ అంత్యక్రియలు
-
రాజన్న సిరిసిల్లలో ఆర్మీ జవాన్ పీ.అనిల్ అంత్యక్రియలు
-
ఆ ఊరే ఓ సైన్యం!
సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా ఇప్పటికే 25 మంది సైన్యంలో అడుగుపెట్టారు. మరికొందరు అదే బాటలో సిద్ధమవుతున్నారు. ఆటల్లో ముందుండే తాడ్వాయి యువత దేశ సేవలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో యువతకు దేశభక్తి ఎక్కువ. దేశ సేవ కోసం వారు త్రివిధ దళాల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఆర్మీలో చాలా మంది చేరారు. సెలవుల్లో వచ్చినపుడల్లా గ్రామానికి చెందిన యువతకు సైన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యువత సైన్యంలో చేరడానికి మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన రవీందర్రెడ్డి అనే సైనికుడు రెండేళ్ల నాడు చనిపోయాడు. ఆర్మీలో చేరేందుకు ఆసక్తి చూపే యువతను గ్రామానికి చెందిన సైనికులు ప్రోత్సహిస్తున్నారు. త్రివిధ దళాల్లో.. తాడ్వాయి గ్రామానికి చెందిన యువకులు త్రివిధ దళాల్లో వివిధ స్థాయిల్లో పలు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రక్షణలో తమవంతు పాత్ర పోశిస్తున్నారు. వివిధ స్థాయిల్లో వారు పనిచేస్తున్నారు. అంతేగాక గ్రామానికి చెందిన పలువురు పోలీసు శాఖలోనూ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామం నడిబొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం తాడ్వాయికి చెందిన సైనికులంతా కలిసి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ స్ఫూర్తిని నింపారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. యువతను ప్రోత్సహించేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాడ్వాయికి చెందిన విద్యార్థులు, యువకులు ఆటల్లో ఎంతో పేరు గడించారు. వారిలో చాలా మంది ఆర్మీలో, పోలీసు శాఖలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. గర్వంగా ఉంది.. నా కొడుకు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తుండడం గర్వంగా అనిపిస్తుంది. మా గ్రామంలో యువకులు ఒకరిని నుంచి ఒకరు దేశ సేవకు అంకితమవుతున్నారు. నా కొడుకు సైన్యంలో చేరాలనుకున్నపుడు ప్రోత్సహించి పంపించాను. –తానయ్యోల బాపురావు, సైనికుడి తండ్రి, తాడ్వాయి నేను పోలీసు కావాలనుకున్నా.. నాకు పోలీసు అవ్వాలని ఉండే. నేను కాలేకపోయా ను. నా కొడుకు సైన్యంలో చేరాడు. నా కోరిక నా కొడుకు రూపంలో తీరింది. దేశ సేవ కోసం సై న్యంలో చేరడాన్ని గొప్పగా ఫీలవుతాను. చాలా మంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. – ఆకిటి రాజిరెడ్డి, సైనికుడి తండ్రి, తాడ్వాయి మా గ్రామానికే గర్వకారణం మా గ్రామం నుంచి 25 మంది సైన్యంలో పనిచేస్తుండడం మాకెంతో గర్వంగా ఉంది. సై న్యంలో పనిచేస్తూనే గ్రామంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వారిని చూసి గ్రామం గర్వంగా ఫీలవుతుంది. వాళ్ల దారిలో చాలా మంది నడవడానికి ముందుకు వస్తున్నారు. –సంజీవులు, సర్పంచ్, తాడ్వాయి -
ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ అటవీప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ పోలీసులు, డీఆర్జీ బలగాలు జేగురుగొండ నుంచి దండకారణ్య అటవీ ప్రాంతంలో రోజువారీ గాలింపుల్లో ఉండగా కందేడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయపడిన వారిని వెంటనే క్యాంప్కు తరలించి వైద్యమందించారు. రెండు ఏకే 47 తుపాకులు, 51 ఎంఎం మోరా్టర్ను మావోయిస్టులు అపహరించారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులంటున్నారు. వారి కోసం భారీగా కూంబింగ్ చేపట్టినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఆర్మీ జవాన్ను హతమార్చిన మావోయిస్టులు చర్ల: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఓ ఆర్మీ జవాన్ను మావోయిస్టులు హతమార్చారు. జిల్లాలోని బడెతెవాడకు చెందిన జవాన్ మోతీరామ్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సమీపంలోని ఉసేలీ వారపు సంతలో కోడి పందేలు చూస్తుండగా ముగ్గురు మావోయిస్టులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. -
జవాన్ల శౌర్యాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు : కేంద్రమంత్రి జై శంకర్
-
అమర జవాన్ జశ్వంత్ రెడ్డి ఫ్యామిలీకి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
బిహార్లో తుపాకీతో కాల్చుకుని తెలంగాణ జవాన్ ఆత్మహత్య!
పాట్నా: భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్, సుపాల్ జిల్లాలోని వీర్పుర్లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్బీ 45వ బెటాలియన్కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. Bihar | A jawan of SSB (Sashastra Seema Bal) 45 battalion, Chimala Vishnu shot himself dead at Veerpur, Supaul today. He hailed from Telangana. Details awaited. — ANI (@ANI) August 19, 2022 ఇదీ చదవండి: బిహార్లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం -
38 ఏళ్ల తర్వాత ఆర్మీ జవాన్ మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: మంచు తుపాను కారణంగా గల్లంతైన జవాను ఆచూకీ 38 ఏళ్ల తర్వాత లభ్యమైంది. సియాచిన్ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్గా గుర్తించింది రాణిఖేట్లోని సైనిక్ గ్రూప్ సెంటర్. 19 కుమావోన్ రెజిమెంట్లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేశారు. 1984లో 'ఆపరేషన్ మేఘ్దూత్'లో భాగంగా పాకిస్థాన్తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా మొత్తం 20 మంది జవాన్ల బృందాన్ని రంగంలోకి దింపింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్లో వారిని మోహరించింది. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. సైన్యం 15 మంది మృతదేహాల్ని వెలికితీసింది. ఎంత ప్రయత్నించినా మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అందులో చంద్రశేఖర్ ఒకరు. చంద్రశేఖర్ గల్లంతు కావడానికి 9 ఏళ్ల ముందు.. అల్మోరాకు చెందిన శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు(వయసు 4 ఏళ్లు, ఏడాదిన్నర). అప్పుడు శాంతి దేవి వయసు 28 సంవత్సరాలు. అప్పటినుంచి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండానే గడుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ హల్ద్వానీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ మృతదేహం సోమవారం రాత్రికి స్వగ్రామం చేరుకోనుంది. హల్ద్వానీ సబ్ కలెక్టర్ మనీశ్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్.. జవాను ఇంటికి వెళ్లారు. పూర్తిస్థాయి మిలిటరీ గౌరవంతో అత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో అట్టహాసంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు -
పాక్ మహిళల మాయలో ఆర్మీ జవాన్.. కీలక సమాచారం లీక్!
జైపూర్: పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల(హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలతో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ ఆరోపణలతో భారత ఆర్మీ జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని బగుండా జిల్లా కంచన్పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారు.’ అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ఇలా ట్రాప్ చేశారు.. 2018, మార్చిలో ఆర్మీ చేరారు జవాన్ శాంతిమే రాణా. ప్రస్తుతం జైపూర్లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు ఇద్దరు పాకిస్థానీ మహిళా ఏజెంట్లు. చాలా కాలంగా ఆ ఏజెంట్లతో వాట్సాప్ చాట్, వీడియా, ఆడియో సందేశాలతో మాట్లాడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్లో పని చేస్తున్నట్లు తెలిపింది. మరో మహిళ నిషాగా పరిచయమైంది. ఆమె మిలిటరీ నర్సింగ్లో ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు.. పాకిస్థాన్ మహిళలతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు!
ఆదిలాబాద్ అర్బన్: దేశం కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న ఓ సైనికుడి ఇంటినే కబ్జాదారులు ఆక్రమించారు. దీంతో ఆ సైనికుడు న్యా యం కావాలంటూ జాతీయ జెండా చేతపట్టుకుని కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన మహమ్మద్ అక్రమ్ అర్మీ జవాన్. ఇచ్చోడలోని ఇస్లాంపూర్ కాలనీలో ఆయనకు ఓ ఇల్లు ఉంది. ప్రస్తుతం అతని కుటుంబం బోథ్లో ఉంటోంది. కశ్మీర్లోని పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న అక్రమ్ చాలా రోజులుగా ఇచ్చోడకు రాలేదు. దీనిని గమనించిన యాకూబ్ ఖురేషీ అనే వ్యక్తి ఖాళీగా ఉన్న అక్రమ్ ఇంటిని కబ్జా చేశాడు. విషయం తెలుసుకున్న అక్రమ్ సోమవారం జాతీయ జెండా పట్టుకుని కలెక్టరేట్కు వచ్చారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ను కలసి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సహకారంతో ఖురేషీ తన ఇంటిని కబ్జా చేశాడని, తనవద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఖురేషీతోపాటు ఆయనకు సహకరించిన వారిపై చర్య తీసుకోవాలని అక్రమ్ డిమాండ్ చేశారు. -
HYD: ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. భర్త బయటకు వెళ్లగానే..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న ఓ మహిళ వ్యవహారం హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. నగరంలోని రహమత్నగర్లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది. ఇదిలా కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం షాక్ నుంచి తేరుకొని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారిద్దరినీ ఇంట్లోనే ఉంచి తాళం వేసి.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా, జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తన భార్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నానని జవాన్ చెప్పాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడమేంటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి -
పది రోజుల్లో పెళ్లి.. మెసేజ్లు, వాయిస్ రికార్డులు చూపించి..
సంతబొమ్మాళి (శ్రీకాకుళం): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. ఆర్మీ జవాన్ ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల కుమార్తె మీనాకు గాజువాకకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం కావాల్సి ఉంది. పది రోజుల క్రితం కుమార్తె తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడానికి గాజువాక వెళ్లగా వరుడు పెళ్లికి నిరాకరించడంతో నిర్ఘాంతపోయారు. ఎందుకని ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పరపటి జగదీష్.. మీనాతో అతనికి ఉన్న స్నేహాన్ని తనకు చెప్పాడని, సెల్ఫోన్ మెసేజ్లు, వాయిస్ రికార్డులను చూపించాడని అన్నాడు. అందుకనే తనకు ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆర్మీ జవాన్ జగదీష్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలతో పంచాయతీ పెట్టారు. మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్ను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో గురువారం జగదీష్ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో యువకుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న నౌపడ ఏఎస్ఐ నర్సింగరావు సిబ్బందితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. మీనా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) -
మూడు నెలలు దాటినా దొరకని జవాన్ నవీన్ ఆచూకీ
-
విమానం ఎక్కాక ఫోన్.. తర్వాత చేస్తే స్విచ్ ఆఫ్.. జాడ లేని ఆర్మీ జవాన్
చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోతిరెడ్డిపల్లికి చెందిన బోకూరి సాయికిరణ్రెడ్డి పంజాబ్లో ఆర్మీ జవాన్ (గన్నర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు వారాల క్రితం సెలవుపై వచ్చిన ఆయన తిరిగి విధుల్లో చేరేందుకు ఈ నెల 5న ఇంటి నుంచి బయలుదేరాడు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఢిల్లీ విమానం ఎక్కిన తర్వాత అతను కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా వారు సాయికిరణ్ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై పంజాబ్లోని ఆర్మీ అధికారులకు ఫోన్ చేయగా అతను విధుల్లో చేరలేదని చెప్పినట్లు కిరణ్ తల్లిదండ్రులు తెలిపారు. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం సహకరించాలని వారు పలువురు ప్రజాప్రతినిధులను కలిశారు. సాయికిరణ్ కనిపించకుండా పోవడంపై గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి, మంత్రి కేటీఆర్కి ట్విట్టర్లో సమాచారం ఇచ్చాడు. దీంతో పాటు సాయికిరణ్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై నరేందర్రెడ్డి మాట్లాడుతూ సాయికిరణ్ కనిపించకుండా పోయిన సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్కడే కేసు నమోదైనట్లు వివరించారు. -
అశ్రునయనాలతో ఆర్మీ జవాన్ కార్తీక్కు వీడ్కోలు....
Army Jawan Karthik Kumar Reddy Funeral: చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని బంగారువాండ్లపల్లెకు చెందిన ఆర్మీ జవాన్ పి.కార్తీక్కుమార్ రెడ్డి (29) విధి నిర్వహణలో ఉండగా మంచు కొండచరియలు విరిగిపడి దీపావళి నాడు మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం సాయంత్రం బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి జవాను భౌతికకాయాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు. మృతదేహం ఆదివారం వస్తుందని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఉదయం 10 గంటలకే బంగారువాండ్లపల్లెకు చేరుకున్నారు. భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు జవాన్ నివాసానికి తీసుకువెళ్తుండగా అంగళ్లు, కనికలతోపు, బురకాయలకోట, వేపూరికోటలో అంబులెన్స్ను నిలిపి స్థానిక ప్రజలు పూలను చల్లి ఘనంగా నివాళులరి్పంచారు. యువకులు బైక్ ర్యాలీ నడుమ భౌతికకాయాన్ని బంగారువాండ్లపల్లెకు తీసుకెళ్లారు. ఆర్మీ అధికారులు, జవానులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జాతీయ జెండాను భౌతికకాయంపై కప్పి సంతాప సూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. మదనపల్లి సబ్కలెక్టర్ జాహ్నవి, డీఎస్పీ రవిమనోహరాచారి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి విజయశంకర్రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో జవాను తల్లి సరోజమ్మ సొమ్మసిల్లి పడిపోయారు. కాగా, ఎమ్మెల్యే ద్వారకనాథ్రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. జవాను కుటుంభసభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
నా భర్తకు ఈ గుర్తింపు లభించడం సంతోషం
-
కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం
-
సెలవుపై వచ్చాడు.. బస్లో హైదరాబాద్ వెళ్తుండగా జవాన్ మిస్సింగ్!
సాక్షి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం అయ్యాడు. రాజస్థాన్లోని జోధ్పూర్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్న కెంగర్ల నవీన్ కనిపించకుండా పోయాడు. కామారెడ్డి మండలం తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన జవాను కెంగర్ల నవీన్ ఆగస్టు 4వ తేదీన సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి ఆగస్టు 29న కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి జోధ్పూర్ వెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరాడు. నవీన్కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆర్మీ అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. డ్యూటీకి రాలేదని ఆర్మీ అధికారులు తెలియజేశారు. అనంతరం నవీన్ కుటుంబసభ్యులు బంధువుల వద్ద ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే! -
గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి
జనగామ రూరల్: జనగామ మండలం పెద్దతండా శివారు బాచ్యా తండాకు చెందిన ఆర్మీ జవాన్ గుగులోతు లక్పతి(38) మృతి చెందారు. జమ్ము కశ్మీర్లో ఉదయం విధులకు వెళ్తుండగా లక్పతికి గుండెపోటు వచ్చినట్లు ఆర్మీ అధికారులు ఫోన్లో తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుగులోతు ఈర్యా–నేజమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. నాలుగో కుమారుడు లక్పతి ఇంటర్ తర్వాత ఆర్మీ ఉద్యోగంలో చేరారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు. కాగా, లక్పతి పార్థివ దేహాన్ని సైనిక అధికారులు తీసుకువస్తున్నారని, శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
మాస్క్ పెట్టుకోలేదని జవాన్ను కొట్టి.. కాలుతో తన్నిన పోలీసులు
పట్నా: మాస్క్ పెట్టుకోలేదని భారత జవాన్ని జార్ఖండ్ పోలీసులు దారుణంగా చితకబాదారు. ఈ ఘటన ఛాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఛాత్రా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. ముగ్గురు పోలీసు సిబ్బందిని, మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. పోలీసులు చితకబాదిన జవాన్ను పవన్ కుమార్ యాదవ్గా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఓ ప్రాంతంలో పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో ఆరా-భూసాహి గ్రామానికి చెందిన యాదవ్ తన బైక్పై ఆ రూట్లో వెళ్తున్నాడు. మాస్క్ లేకపోవడంతో పోలీసులు యాదవ్ని అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఓ పోలీసు దురుసుగా బైక్ తాళాలు లాక్కోగా యాదవ్ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, జవాన్ మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో అక్కడున్న పోలీసులు అతడిని రౌండప్ చేసి కొట్టడమే కాకుండా కాలుతో కడుపులో తన్నారు. ఆశ్చర్యమేమంటే జవాన్ని కొడుతున్న పోలీసులకు కూడా మాస్క్ లేదు. చివరికి గ్రామస్థులు జోక్యం చేసుకోవడంతో జవాన్ను మయూర్హండ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులు తీరుపై మండిపడుతున్నారు. Army jawan beaten up by police personnel in Jharkhand#Jharkhand #ViralVideo pic.twitter.com/VCPHNeyx3R — VR (@vijayrampatrika) September 2, 2021 చదవండి: పబ్లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాచర్ల మండలం రాయవరంలో మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొంతకాలంగా మట్టా శివ, మట్టా బాలకృష్ణ, మట్టా సాంబశివరావు మధ్య పొలం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వీరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన మాజీ జవాన్ సాంబశివరావు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్లు శరీరంలో దూసుకుపోవడంతో తీవ్ర గాయాలపాలైన శివ, బాలకృష్ణ మృతి చెందారు. ఆంజనేయులు అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇవీ చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! -
Viral: అత్తను గెంటేసిన కోడలు.. కొడుక్కి బుద్ధి చెప్పిన జవాను
-
అత్తను గెంటేసిన కోడలు.. కొడుకును జవాను చాచి కొట్టడంతో..
న్యూఢిల్లీ: నవమాసాలు మోసిన తల్లిని నడవలేని స్థితిలో వదిలేయాలనుకున్నాడు ఓ కొడుకు. కన్నతల్లి అనే కనికరం లేకుండా కట్టుకున్న భార్యతో ఇంటి నుంచి గెంటించాలనుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆర్మీ జవాను.. ఆ కొడుకుకు బుద్ధిచెప్పి అవ్వను ఇంటికి చేర్చాడు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను ఇంటి నుంచి పంపించవద్దంటూ ఆ మాతృమూర్తి కోడలి కాళ్లపై పడుతున్నా ఆమె వినిపించుకోలేదు. కొడుకేమో తీరిగ్గా ఓ చోట కూర్చుని జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ సైనికుడు.. విషయమేంటని వారిని అడిగారు. అయితే, అప్పటిదాకా చోద్యం చూస్తున్న కొడుకు.. ‘‘మా గురించి నీకెందుకు’’ అన్నట్లుగా జవానును తోసెయ్యబోయాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో అతడి చెంప పగుళగొట్టాడు జవాను. అయితే, ఆ తల్లి మాత్రం తన కొడుకును కొట్టవద్దంటూ బతిమిలాడింది. సైనికుడు గట్టిగా బుద్ధి చెప్పడంతో దిగొచ్చిన ఆమె కొడుకు తల్లిని తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘మీరందరూ మేం కాపాడుకునే ప్రాణాలురా.. ఇలా అయితే ఎలా’’ అంటూ జవాను అతడికి బాగానే బుద్ధి చెప్పాడని కామెంట్లు చేస్తున్నారు. సరిలేవరు మీకెవ్వరు అంటూ ఇటు తల్లి ప్రేమకు, అటు సైనికుడి గొప్పతనానికి జై కొడుతున్నారు. చదవండి: పెళ్లి దుస్తుల్లోనే వధూవరుల పుష్ అప్స్.. వారెవ్వా! Dancing Dadi: అదిరిపోయే స్టెప్పులతో మాధురి దీక్షిత్ను దించేసిన బామ్మ -
కేంద్ర మంత్రి నిర్వాకం.. బతికున్న సైనికుడికి సంతాపం
బెంగళూరు: మరణించిన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించాల్సిన కేంద్ర మంత్రి.. విధులు నిర్వర్తిస్తున్న సైనికుడి ఇంటికి వెళ్లి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికో ఉద్యోగం, భూమి ఇప్పిస్తామంటూ వాగ్దానం చేశారు. దీంతో ఆ కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. తీవ్ర ఆందోళనకు గురై అప్పటికప్పుడు ఆ సైనికుడితో మాట్లాడి ఊరట చెందారు. ఈ ఘటన గురువారం కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. బీజేపీ చేపట్టిన జన్–ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మూలగుంద్లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి గత ఏడాది మృతి చెందిన బసవరాజ్ హిరేమఠ్ అనే సైనికుడి ఇంటికి వెళ్లి, పరామర్శించాల్సి ఉంది. కానీ, స్థానిక నేతలు ఆయన్ను ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ కట్టిమణి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న మంత్రి ఆ సైనికుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒకరికి ఉద్యోగంతోపాటు, భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో రవికుమార్ కుటుంబసభ్యులు నోరెళ్లబెట్టారు. తమ కుమారుడు డ్యూటీలోనే ఉన్నారని వారు చెప్పారు. స్థానిక నాయకుడొకరు అప్పటికప్పుడు రవికుమార్కు వీడియో కాల్ చేశారు. పొరపాటు గ్రహించిన మంత్రి నారాయణ స్వామి రవికుమార్తో మాట్లాడి, ఆయన సేవలను కొనియాడారు. కుటుంబసభ్యులకు సర్ది చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చిన బీజేపీ నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘మాకు పెళ్లయి రెండు నెలలే అయింది. నా భర్త కశ్మీర్లో పనిచేస్తున్నారు. మంత్రి వచ్చి మా యోగక్షేమాలు అడిగే సరికి మాకేమీ అర్థం కాలేదు. సరిహద్దుల్లో పనిచేసే సైనికుల కుటుంబాలను ఇలా కూడా గౌరవిస్తారు కాబోలని భావించాం. కానీ, ఆయన మా కుటుంబానికి ఉద్యోగం, భూమి ఇస్తామనే సరికి అనుమానం వచ్చింది. వెంటనే నా భర్తతో మాట్లాడాకే మనస్సు కుదుటపడింది’అని రవికుమార్ భార్య మీడియాతో అన్నారు. మంత్రి రాకతో తమతోపాటు, తన భర్త కూడా అనవసరంగా కంగారు పడాల్సి వచ్చిందని చెప్పారు. కాగా, షెడ్యూల్ ప్రకారం హిరేమఠ్ ఇంటికి వెళ్లకుండానే మంత్రి అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయారు. ‘మా ఇంటికి ఎవరూ రాలేదు. బతికున్న సైనికుడి ఇంటికి మంత్రి వెళ్లినట్లు తెలిసింది. మా కుమారుడిని మాకు తెచ్చివ్వండి’అని హిరేమఠ్ తల్లి ఉద్వేగంతో అన్నారు. -
అతడి కోసం హిజ్రాగా మారిన యువకుడు!
సాక్షి, గిద్దలూరు(ఒంగోలు): ఆర్మీ జవాన్ వివాహాన్ని హిజ్రాలు అడ్డుకున్న సంఘటన గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్ క్లాస్మేట్స్ కాకుండా మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరూ కలిసి ఆర్మీ సెలక్షన్స్కు వెళ్లేవారు. ఇద్దరూ నిత్యం మాట్లాడుకువారు. వారిలో మగ్బూల్ ఆర్మీకి ఎంపికవగా, వినీత్ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరి స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు. మగ్బూల్ ఆర్మీలో ఉన్నప్పటికీ వినీతతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్ వివాహాన్ని అడ్డుకుంది. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్ నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. మగ్బూల్ కోసమే వినీత్ హిజ్రాగా మారినట్లు తెలుస్తోంది. -
జవాన్ ఉమా మహేశ్వరరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, శ్రీకాకుళం: సరిహద్దులో విధి నిర్వహణలో మృతి చెందిన వీర జవాన్ లావేటి ఉమా మహేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.50లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లడూతూ ఆర్మీ జవాన్ ఉమా మహేశ్వరరావు మృతి తీరని లోటుని అన్నారు. ఆయన ప్రాణాలను ఫణంగా పెట్టి దెశాన్ని కాపాడారాని.. ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రూ.50 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ద్వారా వారి కుటుంబానికి అందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్మీ జవాన్ మృతి.. సైనిక దుస్తుల్లో నాన్నకు సెల్యూట్
సాక్షి, బెంగళూరు: సైన్యంలో పనిచేసే కన్నతండ్రికి సైనిక దుస్తుల్లో నివాళులర్పించిన చిన్నారి తనయుడు అందరినీ కంటతడి పెట్టించాడు. నాగాల్యాండ్లో ఆర్మీ జీపు బోల్తా పడి కర్ణాటకలో బెళగావి జిల్లా శివపురకు చెందిన ఆర్మీ జవాన్ (డ్రైవర్) మంజునాథ గౌడన్నవర మరణించారు. ఆయన భౌతికకాయానికి మంగళవారం స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఆర్మీ యూనిఫాంలో ఆయన తనయుడు స్వరూప్ (5) సెల్యూట్ చేస్తుండగా ఓదారుస్తున్న బెళగావి ఎంపీ మంగళా అంగడి. బాలున్ని ఆ పరిస్థితిలో చూసిన గ్రామస్తుల మనసులు చలించాయి. -
అమరవీరుడి కుమార్తెకు అండగా మోహన్బాబు
సాక్షి, హైదరాబాద్: భారతసైన్యంలో వీరమరణం పొందిన ఓ హవల్దార్ కుమార్తెకు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ డా.మోహన్బాబు ఉచిత విద్య అందించనున్నారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ (36) గతేడాది నవంబరు 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ప్రవీణ్కుమార్ కుమార్తె సీహెచ్ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్బాబు తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణుకు ప్రవీణ్కుమార్ భార్య కృతజ్ఞతలు తెలిపారు. -
జవాన్ జశ్వంత్రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ జస్వంత్రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందించారు. తర్వాత హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. జస్వంత్రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకమని, అతి చిన్న వయసులోనే అతను మరణించటం బాధాకరమన్నారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదని కొనియాడారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన అతని తల్లిదండ్రుల జన్మ చరితార్థమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని, ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటించిన రూ. 50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, దానిపై సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన జస్వంత్ రెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశం కోసం జస్వంత్ రెడ్డి ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందదని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. -
జవాన్ జశ్వంత్రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం
-
గుంటూరు: నేడు వీరజవాన్ జశ్వంత్కుమార్రెడ్డి అంత్యక్రియలు
-
ముగిసిన వీర జవాన్ జశ్వంత్ అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జశ్వంత్రెడ్డిని కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య జశ్వంత్కు వీడ్కోలు పలికారు. నేడు ఆయన భౌతికకాయం సొంత గ్రామానికి చేరుకుంది. జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు దరివాడ కొత్తపాలెంలో అధికారిక సైనిక లాంఛనాలతో నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జశ్వంత్రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. కాగా జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బాని సెక్టార్లో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన జవాన్ జశ్వంత్రెడ్డి (23) అమరుడైన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్రెడ్డి ఒకరు. ఆయనకు తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మతోపాటు యశ్వంత్రెడ్డి, విశ్వంత్రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అమర జవాన్ జశ్వంత్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండంగా నిలించింది. వీరజవాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 2015లో ఆర్మీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్లో ఇన్ఫ్రాంటీ విభాగంలో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఆదిలాబాద్లో విషాదం: అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, తాంసి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ (26) అనారోగ్యంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ఆర్మీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన నవీన్ ఉత్తరప్రదేశ్లో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెల క్రితం సెలవులపై స్వగ్రామమైన పొన్నారికి వచ్చి, తిరిగి ఈనెల 2న లక్నో వెళ్లిపోయాడు. స్వగ్రామం నుంచి బయల్దేరే సమయంలోనే నవీన్ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విధుల్లో చేరిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆర్మీ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. 15 రోజులుగా చికిత్స పొందుతున్న నవీన్ పరిస్థితి విషమించి, ఆదివారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు దాసరి స్వామి–సువర్ణ కన్నీరు మున్నీరవుతున్నారు. ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తూ అందరితో కలివిడిగా ఉండే నవీన్ ఆకస్మిక మరణంతో పొన్నారి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య -
లైంగిక దాడికి యత్నించిన జవాన్.. 8 ఏళ్ల బాలిక సాహసం
పుణె: ఎనిమిదేళ్ల ఓ బాలిక అసాధారణ తెగువ ప్రదర్శించింది. లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్(33)ను ప్రతిఘటించింది. కదులుతున్న రైలు నుంచి జవాను కిందికి తోసేయడంతో గాయపడినా వెరవక, నిందితుడిని పోలీసులకు పట్టించింది. గోవా–నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని సతారా జిల్లా లొనంద్–సల్పా రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ సైనికుడి కుమార్తె అయిన ఈ బాలిక, తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి ఢిల్లీ నుంచి వస్తోందని పుణె డివిజన్ రైల్వే ఎస్పీ సదానంద్ పాటిల్ తెలిపారు. ‘ప్రభు మలప్ప ఉపహార్ అనే ఆర్మీ జవాను కూడా అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఉపహార్ ఆ బాలికను టాయిలెట్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక మేల్కొని తీవ్రంగా ప్రతిఘటించడంతోపాటు గట్టిగా కేకలు వేసింది. దీంతో అతడు, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తానంటూ ఆమెను బయటకు తీసుకువచ్చి, రైలు కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తూ, రైలు ఆ సమయంలో తక్కువ వేగంతో వెళ్తుండటంతో పట్టాలపై పడిపోయిన బాలిక స్వల్పంగా గాయాలయ్యాయి. ఉదయం వేళ సమీప గ్రామస్తులు పట్టాల పక్కన పడి ఉండగా బాలికను గమనించి, ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కోలుకున్న బాలిక జరిగిన ఘటనను, ముఖ్యంగా ఆర్మీ జవాను పోలికలను పోలీసులకు వివరించింది. దీంతో, 400 మంది పోలీసులు, రైల్వే కానిస్టేబుళ్లు వేర్వేరు స్టేషన్లలో ఆ రైలులోకి ప్రవేశించి, ఆ రైలు నుంచి ప్రయాణికులెవరూ కిందికి దిగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలిక చెప్పిన ప్రకారం పోలికలున్న 30 మందిని వేరుచేసి, అందులో నిందితుడైన ఉపహార్ను గుర్తించారు. అతడిని దగ్గర్లోని భుసావల్కు తీసుకెళ్లారు’ అని ఆయన వెల్లడించారు. ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పనిచేసే నాయిక్ హోదా జవానుగా గుర్తించామన్నారు. -
నాన్నా.. అని పిలిచినా రాలేడు కన్నా!
నెల కిందటే బిడ్డను ఎత్తుకుని ఆ తండ్రి మురిసిపోయాడు. గుండెలపై ఎక్కించుకుని ఆడించాడు. సెలవులు ముగిసిపోవడంతో దేశ రక్షణ విధుల్లో పాల్గొనడానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రీ కొడుకుల మధ్య దూరం శాశ్వతమైపోయింది. నాన్నా.. అని పిలిచినా రాలేని లోకాలకు తండ్రి తరలివెళ్లాడు. అసోంలో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న వాసుదేవరావు చనిపోయాడని వార్త తెలియడంతో గొల్లపేట ఘొల్లుమంది. ఆమదాలవలస రూరల్: మండలంలోని గొల్లపేటకు చెందిన ఆర్మీ జవాన్ కొల్లి వాసుదేవరావు (31) అసోంలో శనివారం మృతి చెందారు. జవా న్ మృతి వార్త కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలిసింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాసుదేవరావు 2010లో ఆర్మీలో జవాన్ గా ఉద్యోగం సంపాదించాడు. అందరితో కలిసి మెలసి ఉండే వాసుదేవరావు గత ఏడాదే వివాహం చేసుకున్నాడు. వీరికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. వాసుదేవరావు భార్య వసంత ప్రస్తుతం ఎల్ఎన్పేట మండలం గ్రామ సచివాలయంలో ఏఎన్ఏంగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, బాబు పుట్టినప్పుడు వాసుదేవరావు ఇంటికి వచ్చి వారసుడిని చూసుకున్నాడు. ఎలక్షన్ల సమయంలో కూడా ఇంటి వద్దనే ఉన్నాడు. మళ్లీ సెలవులపై వచ్చి కొడుకును చూసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. శనివారం రాత్రి ఈ సమాచారం అందడంతో ఆ కుటుంబం తేరుకోలేకపోతోంది. మృతికి గల కారణాలను మాత్రం వివరించలేదు. జవాన్ తల్లిదండ్రులు అప్పన్న, లక్ష్మీ కన్నీరుమున్నీరవుతుండగా వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆర్మీ జవాన్ పార్థివ దేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చునని సమాచారం. చదవండి: తల్లీకొడుకుల కన్నీటి చితి -
అతడే ఒక సైన్యంలా..!
భువనేశ్వర్: ఓ జవాన్ తెగువ.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడగలిగింది. ఒడిశాలోని కియోంజర్ 2వ ప్రత్యేక భద్రతా దళానికి చెందిన జవాన్ హిమాంశు శేఖర పాత్రో కటక్ నుంచి భువనేశ్వర్కి బస్సులో ఆదివారం ఉదయం బయలుదేరాడు. డెంకనాల్ జిల్లా సమీపంలోకి రాగానే కొంతమంది దుండగులు బస్సుని ఆపారు. డ్రైవర్ తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ప్రయాణికులు భయపడుతుండగా బస్సులో ఉన్న జవాన్ సాహసించి ఒక్కసారిగా దుండగుల వైపు దూకాడు. వారి చేతిలోని తుపాకీని స్వాధీనం చేసుకుని వారికే గురిపెట్టాడు. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారనే దానిపై విచారిస్తున్నట్లు డెంకనాల్ జిల్లా ఇన్చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చదవండి: (ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు) ఘటనాస్థలంలో నిలిచిపోయిన బస్సు జవాన్కు డీజీపీ సత్కారం.. దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడిన జవాన్ పాత్రోని ఒడిశా డీజీపీ అభయ్ విందుకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్కు డీజీపీ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. హిమాంశు చాలా ధైర్యవంతుడని, సాదాసీదా వ్యక్తిత్వంతో విధి నిర్వహణలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని డీజీపీ ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో స్పందించి, బస్సు ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో జవాన్ అంకితభావం స్ఫూర్తిదాయకమని డీజీపీ అన్నారు. దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ -
సైనిక వీరులకు వందనం
-
వీర జవాన్లుకు ఘన వీడ్కోలు
సాక్షి, చిత్తూరు/నిజామాబాద్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాను ర్యాడ మహేశ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి వైకుంఠ ధామంలో మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ పార్థివ దేహంపై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. జవాన్కు తుది వీడ్కోలు పలకడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమన్పల్లి కన్నీటిసంద్రమైంది. కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన మరో జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబసభ్యులు కన్నీటితో ప్రవీణ్కు తుది వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం ప్రవీణ్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జవాన్ ప్రవీణ్ కుమార్రెడ్డికి ఘన నివాళి
-
నేడు మిలటరీ లాంఛనాలతో ప్రవీణ్కుమార్రెడ్డి అంత్యక్రియలు
-
శోకసంద్రమైన రెడ్డివారిపల్లె..
సాక్షి, చిత్తూరు(యాదమరి) : ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను ప్రవీణ్కుమార్ రెడ్డి భౌతికకాయం మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చేరింది. ఆదివారం జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న ప్రవీణ్కుమార్రెడ్డి అమరుడైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరజవాను భౌతికకా యం కోసం బంధువులు, గ్రామస్తులు, అధికారులు నిరీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి అనంతరం భౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న గ్రామం ఒక్కసారిగా దుఃఖ సాగరమైంది. ప్రవీణ్ మృతదేహాన్ని చూడగానే భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, బంధువులే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల వారు సైతం తీవ్రభావోద్వేగంతో కదలిపోయారు. మిలటరీ అధికారులు వారి ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చదవండి: (ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) వాతావరణం సరిగా లేక.. ఉగ్రదాడిలో పాట్నాకు చెందిన కెప్టెన్ ఆశుతోష్, తెలంగాణకు చెందిన రెడ్యా మహేష్, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి అమరులైన విషయం తెలిసిందే. వీరి భౌతికకాయాలను జమ్ముకాశ్మీర్ నుంచి ఢిల్లీలోని మిలటరీ కార్యాలయానికి తరలించారు. భౌతిక కాయాలపై కల్నల్ సుధీరా, లెఫ్టినెంట్ కల్నల్ అశ్విన్ పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రవీణ్కుమార్రెడ్డి మృతదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి మిలిటరీ వాహనంలో రెడ్డివారిపల్లెకు తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రికి పైగా దాటింది. మృతదేహంతో పాటు నాసిక్ యూనిట్ నుంచి 31 మంది ఆర్మీ సిబ్బంది ప్రత్యేక విమానంలో వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహం తరలింపులో ఆలస్యం చోటు చేసుకుందని, విమానం సాయంత్రం ఆరు గంటల తర్వాత బయలుదేరిందని మిలటరీ అధికారులు తెలిపారు. చదవండి: (ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు) నేడు దహనక్రియలు వీరజవాను ప్రవీణ్కుమార్రెడ్డి భౌతికకాయానికి బుధవారం దహనక్రియలు జరుగనున్నాయి. మిలటరీ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించనున్నారు. బెంగళూరు నుంచి వచ్చే జెపీఎఫ్–9 మేజర్ నిర్బయ్ బండాకర్, మిలటరీ అధికారులు పకృద్ధీన్, హేమాద్రి గౌరవ వందనం అనంతరం దహనక్రియలు చేయనున్నట్లు మిలటరీ అధికారులు చెప్పారు. -
మరికాసేపట్లో బేగంపేటకు మహేష్ పార్థివ దేహం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన షహీద్ మహేష్ పార్థివ దేహం మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొనుంది. మహేష్ పార్థివ దేహాన్ని స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లికి తరలిచించేందుకు మంగళవారం ఆర్మీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మహేష్ సోదరుడు మల్లేష్, మామయ్య జీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. మహేష్ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) ఏడాది క్రితమే మహేష్ వివాహం జరిగిందని అంతలోనే మహేష్ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్లో మచిల్ సెక్టార్లో ఆదివారం రోజున ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లోవీరమరణం పొందిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష మృతి వార్త తెలియగానే మహేష్ కటుంబ సభ్యులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వీరుడొకడు అమరుడయ్యాడు
‘అమరుడు’ అనిపించుకునే అదృష్టం అందరి నుదుటునా రాసి ఉండదు. కోట్ల జనులు శాల్యూట్ చేసే ఘనత అందరికీ దొరకదు. చరిత్ర పుటల్లో సగర్వంగా తలుచుకునే పేరుగా నిలవడం అందరి వశం కాదు. ప్రవీణ్ కుమార్ వంటి సైనికుడికే ఆ గౌరవం సాధ్యం. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల పోరులో చిత్తూరు జిల్లా పరాక్రమవంతుడు ప్రవీణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. వారితో సీమ పులిలా పోరాడి ప్రాణాలర్పించాడు. తెలుగుజాతితో పాటు దేశ ప్రజలూ అతణ్ణి గుర్తు పెట్టుకుంటారు. ప్రవీణ్ కుటుంబ నేపథ్యం.... చిత్తూరు జిల్లా ఐరాలమండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్కుమార్రెడ్డి (37). మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి (రిటైర్ట్ఆర్మీ) కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. వీరికి రోహిత, లీలేష్లు కుమార్తె కుమారుడు. కుమార్తె రోహిత రెండవ తరగతి. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు...’’ దుఃఖంతో పూడుకుపోయింది ఆ తండ్రి గొంతు. జమ్ము కాశ్మీర్లోని కుష్వారా సెక్టార్లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి. తన కుమారుడి గురించి ఆయన మాటల్లో... ‘నా కొడుకు ప్రవీణ్కుమార్ రెడ్డికి చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ. రెడ్డివారిపల్లెలో బడికి పోయేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు. ఐరాలలో ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత నాకు చేదోడు వాదోడుగా సేద్యం పనులు చేసేవాడు. మిలటరీలో పనిచేస్తున్న బంధువులను చూసి దేశానికి సేవచేయాలని పట్టుబట్టాడు. ఆర్మీలో చేరేందుకు కబురొచ్చింది. 2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్లో పాల్గొన్నాడు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్లోని కప్పూర్తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్గామ్లో ఆరు నెలలపాటు కమాండెంట్గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎన్ఎస్ఎఫ్)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్ సాహెబ్ ప్రదేశంలో పనిచేశాడు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్లోని కుష్వారా సెక్టార్లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందటంతో ముందు మాకు నోటమాట రాలేదు. ఎంత దిగమింగుదామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. అమర సైనికుడికి కడసారి వీడ్కోలు పలకటం కోసం కుటుంబ సభ్యులమైన మేము, గ్రామస్తులు, అతడి స్నేహితులు కన్నీటితో ఎదురు చూస్తున్నాం’ అన్నాడాయన. – బాలసుందరం, సాక్షి చిత్తూరు రూరల్ -
చైనా సరిహద్దులో ఆర్మీ జవాను మృతి
కొమురం భీం, ఆసిఫాబాద్ : చైనా సరిహద్దులో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మరణించారు. వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ పట్టణం అహ్మద్ రజా కాలనీకి చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో చనిపోయాడు.. ఆరుగురు బృందంతో విధులు నిర్వర్తిస్తుండగా కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. 17 ఏళ్లుగా షాకీర్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. షాకీర్ మృతితో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి -
పెళ్లి చేసుకోను.. దిక్కున్న చోట చెప్పుకో..
సాక్షి, జయశంకర్ : ప్రేమ, పెళ్లి పేరుతో ఓ ఆర్మీ జవాను యువతిని మోసం చేశాడు. నమ్మి వచ్చిన అమ్మాయిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఘటన టేకుమట్ల మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. టేకుమట్లకు చెందిన ఆర్మీ జవాన్ కొలుగూరి కార్తీక్ తన బంధువైన రేగొండ మండలం జగ్గయ్య పేట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. శారీరకంగా కూడా లొంగదీసుకున్నాడు. దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా పెళ్లి ఊసెత్తలేదు. చివరకు ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేశాడు. ( తండ్రిని చంపి, పొలంలో పాతిపెట్టి..) ‘‘పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అని బెదిరించాడు. అంతేకాకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో సదరు యువతి ప్రియుడి ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కార్తీక్తో పెళ్లి జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని టేకుమట్ల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఆర్మీ జవాన్ తల్లిపై దాడి
కౌటాల(సిర్పూర్): సీఆర్ఎఫ్ ఆర్మీ జవాన్ తల్లిపై ఒకరు దాడికి పాల్పడిన ఘటన కౌటాల మండలం ముత్తంపేటలో చోటు చేసుకుంది. ముత్తంపేట గ్రామానికి చెందిన గాదిరెడ్డి శ్రీనివాస్ ఆర్మీ జవాన్గా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి గాదిరెడ్డి నాగులు గతంలోనే మృతిచెందగా నాగమ్మ కోడలితో కలిసి ముత్తంపేటలో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం నాగమ్మ తన ఇంటి వద్ద పెరట్లో కూరగాయల విత్తనాలు వేస్తుండగా అదే గ్రామానికి చెందిన కమలకర్ ప్రకాశ్రావు అనే వ్యక్తి మీరు నివాసం ఉంటున్న భూమి తనదని, విత్తనాలు వేయవద్దని నాగమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. నాగమ్మ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు
-
ఆర్మీ జవాన్ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
సాక్షి, హైదరాబాద్ : లోన్ పేరుతో ఆర్మీ జవాన్కు సైబర్ కేటుగాళ్ళు టోపీ పెట్టారు. రుణం ఇస్తామంటూ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మోసగాళ్లు ఫోన్ చేసి డబ్బులు దోచుకున్నారు. నేరగాళ్ల మాయమాటులు నమ్మిన ఆశ్విన్ అనే ఆర్మీ జవాన్.. లోన్ ఓకే ప్రాసెసింగ్ ఛార్జి, డాక్యుమెంట్ ఛార్జ్ , జీఎస్టీ పలు పేర్లతో 4.31 లక్షల రూపాయల నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లో జమ చేశాడు. లోన్ ఎప్పటి వరకు వస్తుందని పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. మోసపోయానని తెలుసుకున్న జవాన్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
అమ్మ అంత్యక్రియలు కూడా వీడియో కాల్లో..
సాక్షి, చెన్నై : ‘అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ గురించి ఎంత చేసినా స్వల్ప మే...అమ్మను ఎంత తలచినా మధురమే’ అయితే, ఈ ఆధునిక యుగంలో తల్లిని వృద్ధాశ్రమాల్లోకి నెట్టే తనయలు ఎందర్నో చూశాం. అలాగే, దేవుడితో సమానంగా పూజించే వారిని చూశాం.’ ఆ దిశగా ఇక్కడ రెండో కోవకు చెందిన తనయులు లాక్డౌన్ వేళ అమ్మ కోసమే జీవితం అనిపించుకున్నారు. (నాన్నా.. అమ్మ ఏది?) అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్య చికిత్స అందించడం కోసం ఓ తనయుడు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుంచి మోటార్ సైకిల్ పయనం చేశాడు. విరుదు నగర్ జిల్లా వైద్య్రా ఇరుప్పుకు చెందిన చంద్రమోహన్ అహ్మదాబాద్లో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా చంద్ర మోహన్ అక్కడే ఉన్నా, తల్లి కస్తూర్తి మాత్రం వైద్య్రా ఇరుప్పులో నివాసం ఉంటున్న ఆమె గత వారం అనారోగ్యం బారిన పడ్డారు. ఆప్తులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా, తనయుడిని చూడాలన్న వేదనతో ఆ తల్లి పరితపించింది. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది) సమాచారం అందుకున్న చంద్రమోహన్ తల్లి అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అహ్మదాబాద్ కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లి తమిళనాడుకు వెళ్లేందుకు అనుమతి పత్రం పొందాడు. రవాణా వ్యవస్థ లేని దృష్ట్యా, తన మోటారు సైకిల్లో 2,350 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. మహారాష్ట్రలో.. కర్ణాటకలో వైద్య పరీక్షలు చేసుకుని సోమవారం తమిళనాడులోని స్వగ్రామానికి చేరుకున్నాడు. తనయుడి చూసిన ఆనందంలో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. చంద్ర మోహన్కు విరుదునగర్ పోలీసు యంత్రాంగం, వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటుగా ఇంట్లోనే ఉండాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. కడసారి చూపు కరువు.. సేలం జిల్లా మేచ్చేరి సమీపంలోని ఉక్కం పట్టికి చెందిన తంగవేలు, మాధు దంపతుల కుమారుడు శక్తి వేల్ (42) భారత ఆర్మీలో జవానుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్లో విధుల్ని నిర్వరిస్తున్నాడు. శక్తి వేల్ తల్లి మాధు అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు రాజస్థాన్లో ఉన్న ఆర్మీ క్యాంప్కు అందజేశారు. రవాణా సౌకర్యం లేని దృష్ట్యా, కడసారిగా తల్లిని చూసుకుని, ఆమెకు అంత్యక్రియులు జరిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబీకులు తల్లి పార్తీవదేహాన్ని వీడియో కాల్ ద్వారా శక్తివేల్కు చూపించారు. అంత్యక్రియులు కూడా వీడియో కాల్ ద్వారా చూసిన ఆ సైనికుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తల్లి మృతదేహాన్ని వీడియో కాల్లో చూస్తూ అతడు బోరున విలపిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. (కరోనా: అంత్యక్రియలు అడ్డుకుంటే కటకటాలే!) -
సమయం అడిగాడు.. పారిపోయాడు
సంతబొమ్మాళి: చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సమయం అడిగాడు.. తీరా సమయం వచ్చే నాటికి ఇంటికి తాళం వేసి పారిపోయిన వైనం మండల కేంద్రం సంతబొమ్మాళిలో చోటుచేసుకుంది. బాధితరాలు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి గ్రామానికి చెందిన వివాహిత అట్టాడ యమునను ఆదే గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కుసుమకారి సిద్ధార్థ 2017 ఆగష్టు 18న అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. విశాఖట్నంలో రెండేళ్లపాటు కాపురం పెట్టిన తర్వాత వదిలించుకోవడానికి ఎత్తుగడ వేశాడు. అదనపు కట్నం తేవాలని వేధించాడు. 2019 నవంబర్ 6న సింహాచలంలో వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలియడంతో యమున విశాఖపట్నం ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో 2019 నవంబర్ 14న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న యమున గతేడాది డిసెంబర్ 23న సంతబొమ్మాళిలోని అత్తవారింటికి వచ్చింది. సిద్ధార్థ తల్లి ఇందిర, బంధువులు కలిసి ఆమెను బయటికి నెట్టేశారు. ఆదేరోజు సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన విషయాన్ని ఎస్ఐ కామేశ్వరరావుకు చెప్పింది. వారిని పిలిచి ఎస్ఐ మాట్లాడారు. తన కుమారుడు ఆర్మీ విధుల్లో భాగంగా ఢిల్లీలో పని చేస్తున్నాడని, జనవరి 28న (2020) సెలవుపై వస్తాడని, అప్పటివరకు సమయం ఇవ్వాలని తల్లి కోరగా.. పెద్ద మనుషుల సమక్షంలో అంగీకారం కుదిరింది. ఆ సమయం రానే వచ్చింది. తల్లి ఇందిర, కుమారుడు సిద్ధార్థ, కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఈ విషయం తెలియక బాధితరాలు యమున కుటుంబ సభ్యులు, వారి తరఫు పెద్ద మనుషులు సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. దీనిపై ఎస్ఐ కామేశ్వరరావును వివరణ అడడగా గతంలో ఒకసారి బాధితరాలు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పిందన్నారు. గ్రామస్తుల సమక్షంలో సమస్య పరిష్కరించుకుంటామని ఆర్మీ జవాన్ తల్లి సమయం అడిగితే ఇరు వర్గాల వారు అంగీకారానికి వచ్చారన్నారు. దీనిపై విశాఖపట్నం ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందన్నారు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? రెండున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. విశాఖపట్నంలో కేసు నమోదు అయింది. సోమవారం స్పందనలో ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశాను. ఇక్కడికి వస్తే భర్త, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఉద్యోగానికి సెలవులు పెట్టి వచ్చాను. న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. – కె.యమున, బాధితురాలు -
ఉల్లిపాయలు పట్టుకెళ్తానన్న ఆర్మీ హీరో
న్యూ ఢిల్లీ: గతేడాది ఉల్లిపాయ ధరలు ఆకాశన్నంటగా ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాయి. అయితే కొన్నిప్రాంతాల్లో ఉల్లి సమస్య ఇంకా వెంటాడుతూనే ఉందడానికి ఇక్కడ చెప్పుకునే ఘటనే నిదర్శనం. జమ్ముకశ్మీర్లో లేహ్ జిల్లాలో లడక్ స్కౌట్లో నయూబ్ సుబేదార్గా మ్యుటప్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1985లో దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన అశోక్ చక్ర గ్రహీతను అందుకున్నారు. ఈ ఆర్మీ హీరో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ఢిల్లీ నుంచి లేహ్కు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు తనవెంట ఉల్లిని తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కేవలం రూ.60కే ఉల్లి దొరుకుతోంది. కానీ లేహ్లో కిలో ఉల్లి ధర రూ.200ను దాటిపోయింది. అందుకే ఈ నెల 31న నేను తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు ఏడెనిమిది కిలోల ఉల్లిని తీసుకెళ్తాను. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లాలని ఉన్నా పరిమిత బరువుల నిబంధన మేరకు ఆ ఆలోచన విరమించుకున్నా’నని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లి రేట్లు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆయన ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవళ్లు కూడా ఆర్మీలోనే చేరటం విశేషం. వర్షాలతో ఉల్లికి దెబ్బ.. గతేడాది ఆగస్టు- సెప్టెంబర్లో ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో భారీ వర్షాలతో పంట చేతికిరాలేదు. దీంతోపాటు ఉల్లిని పండించే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉల్లి దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లికొరత ఏర్పడింది. సాధారణంగా రూ.20 లేదా రూ.30కి లభించే ఉల్లిపాయలు ఒక్కసారిగా కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పలికాయి. ఈ క్రమంలో జమ్ము, కశ్మీర్లోని లేహ్ ప్రాంతంలోనూ ఉల్లి ధరలు చుక్కలను తాకాయి. ఇక ఈమధ్యే ఉల్లిధరలు దిగివచ్చినప్పటికీ లేహ్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతుండటం గమనార్హం. చదవండి: జామా మసీదు ముందు చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యక్షం ‘షి’పబ్లిక్డే -
కదులుతున్న కారులోనే భార్య, మరదలిని చంపి..
పట్నా : బీహార్ రాజధాని పట్నా సమీపంలోని సైదాబాద్ ప్రాంతంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఒక ఆర్మీ జవాన్ తన పిల్లల కళ్ల ముందే కదులుతున్న కారులోనే తుపాకీతో కట్టుకున్న భార్యను, మరదలును కాల్చి చంపాడు. ఆపై తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాలిగంజ్ డీఎస్పీ మనోజ్ కుమార్ పాండే వివరాల ప్రకారం.. 33 ఏళ్ల విష్ణు కుమార్ గుజరాత్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య దామిని శర్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం విష్ణుకుమార్కు డెంగ్యూ సోకింది. అప్పటి నుంచి విష్ణు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మానసిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విష్ణుకు పట్నాలో చికిత్స చేయించడానికి తమ సొంత ఊరైన అరా నుంచి కారులో బయలుదేరారు. కారులో విష్ణుతో పాటు అతని భార్య, మరదలు డింపుల్ శర్మ, ఇద్దరు పిల్లలతో పాటు విష్ణు తండ్రి కూడా ఉన్నారు. డైవర్ పక్క సీటులో ఇద్దరు పిల్లలు వారి తాతయ్యతో కలిసి కూర్చోగా, వెనుక సీటులో విష్ణు, అతని భార్య, మరదలు కూర్చున్నారు. ఈ సందర్భంగా విష్ణు, దామినిల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోవంతో విచక్షణ కోల్పోయిన విష్ణు తన దగ్గర ఉన్న తుపాకీతో భార్య దామిని, మరదలు డింపుల్ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయాడని మనోజ్ వెల్లడించారు. విష్ణు తండ్రి అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. విష్ణు కాల్చిన తుపాకీతో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విష్ణు వాడిన తుపాకీ లైసెన్స్ కలిగి ఉందని నిర్థారించారు. -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్పూర్లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
సెలవులపై వచ్చి చోరీలు
కామారెడ్డి క్రైం: ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేయ డం మొదలుపెట్టి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి మారలేదు. సెలవుపై ఇంటికి వచి్చన అతను మళ్లీ చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఎస్పీ శ్వేత సోమవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటు పడి.. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన షేక్ సోహైల్ 2015 నుంచి ఆర్మీలో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నా డు. దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రాఘవేం ద్రకాలనీ, భిక్కనూరు పరిధిలోని జంగంపల్లి, మాచారెడ్డి పరిధిలోని ఇళ్లలో చోరీలు చేశాడు. జిల్లా లో జరిగిన 3 చోరీ కేసుల్లో 3.50 తులాల బంగా రం, 130 తులాల వెండి ఆభరణాలు, రూ.21 వేల నగదు అపహరించాడు. అనుమానా స్పదంగా తిరుగుతున్న సోహెల్ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల వ్యవహారం బయటపడింది. నిందితుడిపై గతంలో ఓ దోపిడీ కేసు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఆర్మీకి సమాచారం ఉందా, లేదా అనే దానిపై స్పష్టత లేదని వెల్లడించారు. -
ఫ్రెండ్స్ పార్టీ: నర్సంపేటలో దారుణం..
సాక్షి, వరంగల్: నర్సంపేటలో దారుణం జరిగింది .. స్నేహితుల మధ్య ఏర్పడిన చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. రాత్రి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లిన ప్రేమ్ కుమార్ను స్నేహితుడు దిలీప్ కత్తితో పొడిచి చంపాడు. దిలీప్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ప్రేమ్ కుమార్ ఆర్మీలో సేవలందిస్తున్నాడు .. సెలవుల్లో నర్సంపేటకు వచ్చిన ప్రేమ్ను తోటి స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడు. స్నేహితుల మధ్య వచ్చిన గొడవలే మృతికి కారణంగా తెలుస్తోంది. -
భార్యతో మాట్లాడుతుండగానే..
సాక్షి, ఇచ్ఛాపురం రూరల్: పది రోజుల కిందట కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ తండ్రి ఇక ఆ బిడ్డకు లేడు. భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపిన మనిషి మరి లేరు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి తోటూరు గ్రామానికి చెందిన దుంప అప్పారావు, లక్ష్మమ్మల మూడో సంతానం దుంప బైరాగి(28) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ పిడుగుపాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. బైరాగి ఎనిమిదేళ్ల క్రితం ఆర్మీ జవాన్గా రాజస్థాన్లో విధుల్లో చేరి రెండున్నరేళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే తండ్రి మృతి చెందడంతో కుటుంబ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. 25 రోజుల కిందటే స్వగ్రామానికి సెలవుపై వచ్చిన బైరాగి 18 నెలల కుమారుడు యశ్వంత్ను క్షణం కూడా వదలకుండా గడిపాడు. పది రోజుల పాటు పిల్లా పాపలతో ఉండి పదిహేను రోజుల క్రితమే రాజస్థాన్ వెళ్లిపోయాడు. శుక్రవారం విధుల్లో ఉండగానే సాయంత్రం నాలుగు గంటల సమయంలో భార్య దివ్యతో వాట్సాప్లో మాట్లాడుతుండగా పెద్ద శబ్దం వినిపించి ఫోన్ కట్ అయిపోయింది. ఆ సమయంలోనే పిడుగు పడి బైరాగి మృతి చెందారు. ఈ విషయాన్ని శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఆదివారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని బంధువులు తెలిపారు. -
జవాను వాట్సాప్ వీడియో; ట్విస్ట్ అదిరింది!
హైదరాబాద్ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చాలా మంది సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ల సహాయంతో తమ గోడును అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. అయితే వీటిలో నిజానిజాలు తెలుసుకోవడం అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో నిజమైన బాధితులు ఎవరో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు బ్లాకుకు చెందిన అధికారులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వివరాలు... చిత్తూరు జిల్లాకు చెందిన టి. చంద్రబాబు భారత ఆర్మీలో హవల్దార్గా పనిచేస్తున్నారు. స్వస్థలం ఎల్లపల్లిలో ఆయనకు భూమి ఉంది. ఈ క్రమంలో తన భూమిని పక్కింటి వాళ్లు ఆక్రమించారంటూ వాట్సాప్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా..‘ నేను, నా సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాం. మా ఊరిలో మాకు 3.60 ఎకరాల భూమి ఉంది. శోభన్బాబు, సాంబశివ నాయుడు అనే వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా వృద్ధురాలైన మా అమ్మను చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేదాకా ఈ వీడియోను షేర్ చేయండి’ అని తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో వీడియో వైరల్గా మారడంతో గంగాధర నెల్లూరు బ్లాక్ రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఎల్లపల్లికి చేరుకున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏమాత్రం సంబంధంలేదనే నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం గురించి తహసీల్దార్ భవాని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘ ఎల్లపల్లిలో వారిద్దరి పేరిట ఆరు ఎకరాలకు పట్టా ఉంది. అయితే కొలిచి చూడగా 3.60 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లుగా తేలింది. నిజానికి ఇంటిస్థలం విషయంలో పొరుగువారితో వారికి విభేదాలు ఉన్నాయి. వాటిని మేము పరిష్కరించాము’ అని తెలిపారు. ఇక ఈ విషయం గురించి చంద్రబాబును సంప్రదించగా భూవివాదం పరిష్కారమైందని.. అయితే దాని గురించి మాట్లాడదలచుకోలేదని చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. -
జవాన్ స్వామి తండ్రి అదృశ్యం
సాక్షి, కామారెడ్డి: తన తండ్రి సాయిరెడ్డి మూడు రోజులుగా కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్ చేసుంటారని ఆర్మీ జవాన్ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేశారని ఇటీవల సోషల్ మీడియాలో స్వామి వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రి కనపడటం లేదన్న సమాచారంతో స్వామి ఈ రోజు హుటాహుటిన తన సొంతూరు కామారెడ్డిలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియాకువెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలో లేక దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండాలో తోచడం లేదని జవాన్ స్వామి ఆందోళన చెందుతున్నారు. -
లాన్స్ నాయక్కు రెవెన్యూ తిప్పలు!
ఆర్మీలో ఆయనో లాన్స్నాయక్ ... అయితేనేం ఆయనకు కూడా తన భూములను రక్షించుకునేందుకు ముప్పుతిప్పలు పడాల్సిన దుస్థితి. దేశం కోసం ఆర్మీలో పని చేస్తున్నారన్న సానుభూతి కూడా లేకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. కోర్టులు ఆదేశించినా ఆక్రమణల చెరలో ఉన్న అతని భూములను పరిరక్షించాల్సింది పోయి 22ఏను అడ్డం పెట్టుకుని అతని జీవితంతో ఆటలాడు కుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటకు చెందిన పోలిరెడ్డి శ్రీనివాసరావు ఆర్మీలో లాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన ప్రస్తుతం డెప్యుటేషన్పై ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో ట్రాన్స్మిషన్ యూనిట్లో సేవలందిస్తున్నారు. తన తండ్రి రాజుబాబు, పెదనాన్న అప్పలనాయుడు 1979లో గ్రామంలోని సర్వే నంబర్ 133లో మూడెకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో 2.10 ఎకరాలను బీసీ కాలనీ నిమిత్తం ప్రభుత్వం సేకరించింది. ఆ మేరకు పరిహారం కూడా మంజూరు చేశారు. ఇక మిగిలిన 90 సెంట్లకు శ్రీనివాసరావు తండ్రి, పెదనాన్నల పేరిట ఇవ్వాల్సిన పట్టాదారు పాస్పుస్తకాలను వారు కొనుగోలు చేసిన వారి పేరిట జారీ చేశారు. ఆ పట్టాదారు పుస్తకాలను అడ్డంపెట్టుకుని వారు కోర్టుకెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన భూమి కోసం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించారు. దాదాపు పదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత చివరకు పట్టాదారు పాస్పుస్తకాలు రద్దు చేశారు. వాటిని ఆధారం చేసుకుని మరో ఐదేళ్ల పాటు సాగిన వాదోపవాదాలనంతరం సివిల్ కోర్టు కూడా శ్రీనివాసరావు కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మరొక వైపు ఈ భూముల్లోకి సదరు దొంగపట్టాలు పుట్టించిన వారు చొరబడి దాదాపు 12 సెంట్ల భూమిని కబ్జా చేశారు. మిగిలిన భూమి ప్రస్తుతం వీరి అధీనంలోనే ఉంది. కబ్జాకు గురైన భూములను కూడా పరిరక్షించుకునేందుకు ఆర్మీలో పనిచేస్తున్న లాన్స్నాయక్ శ్రీనివాసరావు చేయని ప్రయత్నం లేదు. చివరకు 2017లో మిగిలి ఉన్న భూమినైనా పరిరక్షించుకుందామన్న ఉద్దేశంతో తన సోదరికి గిఫ్ట్డీడ్ రూపంలో రాసిచ్చేందుకు నర్సీపట్నం సబ్ రిజిస్ట్రే షన్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఆసలు విషయం తెలిసి విస్తుపోవడం లాన్స్నాయక్ వంతు వచ్చింది. పోరాటం ఫలించిందనుకున్న సమయంలో తమ భూములు కాస్తా 22 ఏలో (నిషేధిత భూముల జాబితా) ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. దీంతో పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. అప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా 22ఏ జాబితా నుంచి మోక్షం లభించలేదు. దీంతో చివరకు తమ ఆర్మీ కమాండెంట్కు ఫిర్యాదు చేశారు. కమాండెంట్ కూడా సీరియస్గా తీసుకుని తొలుత జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయ్..అప్పటికీ న్యాయం జరగకపోతే కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని అభయమిచ్చారు. ఆ మేరకు అనుమతినివ్వడమే కాదు సుబేదార్ గిరిదారిలాల్, సిపాయి బీడీ మహేష్కుమార్లతో శ్రీనివాసరావును కలెక్టరేట్కు పంపించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్సెల్లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భాస్కర్ సమగ్ర విచారణ జరపాల్సిందిగా పక్కనే ఉన్న జాయింట్ కలెక్టర్ జి.సృజనను ఆదేశించారు.