-
పెద్ద పొరపాటు చేశాం.. అలా ఇంగ్లండ్ వరల్డ్కప్ గెలిచింది!
వన్డే వరల్డ్కప్-2019 ఫైనల్లో తమ తప్పిదం వల్లే న్యూజిలాండ్ మూల్యం చెల్లించిందన్న విషయాన్ని దిగ్గజ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంగీకరించాడు. ఆరోజు ఇంగ్లండ్కు ఆరు పరుగులకు బదులు ఐదు పరుగులు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.సహచర అంపైర్ కుమార్ ధర్మసేన చెప్పే వరకు తమ తప్పిదాన్ని గుర్తించలేకపోయానని ఎరాస్మస్ తెలిపాడు. కాగా లండన్లోని లార్డ్స్ వేదికగా 2019 వరల్డ్కప్ ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ పోటీపడిన విషయం తెలిసిందే.ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ చాంపియన్గా అవతరించి తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడింది. అయితే, ఫైనల్కు సంబంధించి నాటి అంపైర్లు ఎరాస్మస్, ధర్మసేన తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ ఆఖరిదాకా అద్బుతంగా పోరాడింది. తొలి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ కూడా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో నాలుగో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడాడు.మరో ఎండ్లో ఉన్న ఆదిల్ రషీద్ పరుగుకు వచ్చాడు. ఒక రన్ పూర్తి చేసి రెండో రన్ కోసం పరుగు తీశారు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ మార్టిన్ గఫ్టిల్ దానిని స్ట్రైకర్ ఎండ్కు త్రో చేశాడు. అయితే, అది స్టోక్స్ బ్యాట్ను తాకుతూ బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్కు ఆరు పరుగులు(2+4) వచ్చినట్లు అంపైర్లు ప్రకటించారు.నిజానికి పరుగు పూర్తి చేసే క్రమంలో స్టోక్స్ పూర్తిగా క్రీజులోకి రాకముందే బంతి ఓవర్ త్రో అయింది. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులే(1+4) ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని సరిగ్గా గమనించలేకపోయిన అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం.. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో రెండు పరుగులు సాధించడంతో మ్యాచ్ టై(241 రన్స్) అయింది.అనంతరం సూపర్ ఓవర్లో గెలిచిన ఇంగ్లండ్ టైటిల్ గెలిచింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించిన ఎరాస్మస్.. ‘‘ఫైనల్ జరిగిన మరుసటి రోజు.. నా హోటల్ గది తలుపు తెరిచి బ్రేక్ఫాస్ట్కు వెళ్తున్నా.అంతలోనే కుమార్ కూడా తన రూం నుంచి బయటకు వచ్చాడు. ‘మనం ఒక పెద్ద పొరపాటు చేశాం చూశావా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు గానీ మా నిర్ణయం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను.ఇద్దరం అప్పుడు సిక్స్.. సిక్స్.. సిక్స్ అనే అనుకున్నాం. కానీ వాళ్లు లైన్ క్రాస్ చేయని విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాం’’ అని టెలిగ్రాఫ్ క్రికెట్తో వ్యాఖ్యానించాడు. కాగా గతంలో కుమార్ ధర్మసేన కూడా ఈవిషయం గురించి మాట్లాడుతూ తమ పొరపాటును అంగీకరించాడు. అయితే, అప్పట్లో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేని పేర్కొన్నాడు. కానీ.. తన నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడటం లేదని తెలిపాడు. -
టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సేవలందించడం కోసం వరల్డ్కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఏడాది మొత్తం 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ టెస్ట్ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సేవలందించడం కోసం స్టోక్స్ ఐపీఎల్, టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకున్నాడు. జులైలో వెస్టిండీస్తో సిరీస్ నుంచి ఇంగ్లండ్ టెస్ట్ ప్రయాణం మొదలవుతుంది. అనంతరం ఈ జట్టు స్వదేశంలో భారత్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ఆసీస్లో యాషెస్ సిరీస్.. ఇలా ఈ వార్షిక సంవత్సరంలో ఇంగ్లండ్ 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మోకాలి శస్త్ర చికిత్స కారణంగా స్టోక్స్ బ్యాటింగ్కు మాత్రమే పరిమితమయ్యాడు. భారత్తో తాజాగా జరిగిన సిరీస్లో స్టోక్స్ చాలాకాలం తర్వాత బంతి పట్టాడు. ఇదిలా ఉంటే యుఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ జూన్ 4న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. బార్బడోస్లో జరిగే ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ను స్కాట్లాండ్ ఢీకొంటుంది. -
‘బజ్బాల్’ బెడిసికొట్టి.. అవమానభారంతో ఇలా!..
భారత గడ్డపై టెస్టు సిరీస్ను గెలిచి తమ 12 ఏళ్ల నీరిక్షణకు తెరదించాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్ విజయమే లక్ష్యంగా భారత గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లండ్ కనీస పోటీ ఇవ్వకుండా టీమిండియా ముందు మోకారిళ్లింది. బజ్బాల్ అంటూ వరల్డ్ క్లాస్ జట్లను గడగడలాంచిన ఇంగ్లండ్.. భారత్ దెబ్బకు పసికూనలా వణకిపోయింది. అసలైన టెస్టు క్రికెట్ మజా ఎలా ఉంటుందో ఇంగ్లండ్ జట్టుకు రోహిత్ సేన చూపించింది. ఘన విజయంతో భారత్ టూర్ను ముగించాలని భావించిన స్టోక్స్ సేన.. ఆఖరికి ఘోర పరాభావంతో తమ దేశానికి తిరుగు పయనమైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఘోర ఓటమికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం. బెడిసి కొట్టిన బజ్ బాల్.. ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణం వారి బ్యాటింగ్ వైఫల్యమే. వారు అవలంభిస్తున్న బజ్బాల్ విధానమే వారి కొంపముంచింది. సాధరణంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాటరైనా ఆచతూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దాలని ప్రయత్నిస్తాడు. కానీ ఇంగ్లండ్ జట్టుది మాత్రం వేరే లెక్క. వచ్చామా ఫోరో, సిక్స్ కొట్టి ఔటయ్యామా అన్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్ల ఆట కొనసాగింది. ఆఖరి వరల్డ్ క్లాస్ బ్యాటర్ జో రూట్ సైతం అదే తీరును కనబరిచాడు. పరుగులు వేగంగా సాధించాలనే ఉద్దేశ్యంతో తనకు రాని షాట్లను ఆడి పెవిలియన్కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థి బౌలర్లపై దాడికి ప్రయత్నించి వికెట్లను కోల్పవడం సంప్రదాయ క్రికెట్ ఉద్దేశ్యం కాదు కద. ఈ సిరీస్లో భారత 9వ నెంబర్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతులు కూడా ఏ ఇంగ్లండ్ ఆటగాడు ఎదుర్కోలేకపోయాడు. టెస్టు క్రికెట్ అంటే కనీస ఓపికతో బ్యాటింగ్ చేయాలనే కామన్ సెన్స్ ఇంగ్లండ్ బ్యాటర్లలో కొరవడింది. బజ్బాల్ అంటూ టెస్టు క్రికెట్ రూపు రేఖలను మార్చేసిన ఇంగ్లండ్కు భారత్ మాత్రం సరైన గుణపాఠం చెప్పిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంగ్లండ్ ఘోర పరభావానికి మరో కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇక తమకు తిరుగులేదని, ఏకంగా సిరీస్ వైట్ వాష్ చేసినట్లు బిల్డప్ ఇచ్చింది. కానీ అక్కడ ప్రత్యర్ధి భారత్ అన్న విషయం బహుశా ఇంగ్లండ్ మార్చిపోయిందేమో. ఆ తర్వాత వైజాగ్ టెస్టులో దెబ్బతిన్న సింహంలా భారత్ పంజా విసిరింది. ఇంగ్లండ్ను చిత్తు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి కదా చూసుకోవచ్చులా అన్నట్లు ఇంగ్లండ్ థీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వైజాగ్ టెస్టు అనంతరం భారత్ నుంచి దుబాయ్ వేకేషన్కు ఇంగ్లండ్ జట్టు వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన ఇంగ్లండ్ ఆటను మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ దాదాపు వారం రోజులు గడిపింది. ఆ తర్వాత రాజ్కోట్కు చేరుకున్న ఇంగ్లండ్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మూడో టెస్టులో బరిలోకి దిగింది. రాజ్కోట్లో కూడా ఇంగ్లండ్ తీరు ఏ మాత్రం మారలేదు. మరోసారి ఇంగ్లండ్ను టీమిండియా చిత్తు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే అప్పటికి ఇంగ్లండ్ మాత్రం సిరీస్ తామే గెలుస్తామన్న థీమాగా కన్పించింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్సీ, కోచ్ మెకల్లమ్ ఆఖరి రెండు టెస్టుల్లో భారత్ను చిత్తు చేస్తామని గొప్పలు పలికారు. కానీ భారత్ ముందు ఇంగ్లండ్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ విజయ భేరి మ్రోగించింది. బౌలింగ్ వైఫల్యం. స్పిన్నర్లు కాస్తో కూస్త అకట్టుకున్నప్పటికి ఫాస్ట్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. జేమ్స్ ఆండర్సన్, వుడ్ వంటి వరల్డ్ క్లాస్ పేసర్లు సైతం భారత బ్యాటర్లు ముందు దాసోహం అయ్యారు. ఆండర్సన్ను అయితే భారత యువ ఓపెనర్ జైశ్వాల్ ఊచకోత కోశాడు. స్పిన్నర్ల ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఇంగ్లండ్ బౌలింగ్లో ఎటాక్లో స్పష్టంగా అనుభవం లేమి కన్పించింది. జాక్ లీచ్ వంటి స్టార్ స్పిన్నర్ తొలి టెస్టు తర్వాత జట్టు నుంచి తప్పుకోవడం ఇంగ్లండ్ను బాగా దెబ్బతీసింది. టామ్ హార్లీ, బషీర్ వంటి యువ స్పిన్నర్లు ఆడపదడప వికెట్లు తీసినప్పటికి పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నారు. స్టోక్సీ మిస్ ఫైర్.. తన కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న బెన్ స్టోక్స్.. భారత్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. ఈ సిరీస్లో బెన్ స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. అస్సలు ఈ సిరీస్లో అతడి వ్యూహం ఎవరికీ అర్ధం కాలేదు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లో కూడా నిరాశపరిచాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో కూడా స్టోక్సీ ఫెయిల్ అయ్యాడు. సిరీస్ మొత్తంగా 5 టెస్టుల్లో 199 పరుగులు స్టోక్స్ చేశాడు. ఇది కూడా ఇంగ్లండ్ ఓటమికి ఓ కారణం. కుర్రాళ్లు కొట్టిపాడేశారు..? కోహ్లి, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు దూరం కావడంతో జట్టులోకి వచ్చిన యువ క్రికెటర్లను ఇంగ్లండ్ తక్కువగా అంచనా వేసింది. వారికి పెద్దగా అనుభవం లేనందన తమ బౌలర్లు పై చేయి సాధిస్తారని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ భావించింది. కోహ్లిని ఎలా ఔట్ చేయాలి? రాహుల్ను ఎలా ఔట్ చేయాలని ప్రణాళికలు రచించిన ఇంగ్లండ్.. యువ ఆటగాళ్లు విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచన చేయలేదు. అదే వారి కొంపముంచింది. జైశ్వాల్, సర్ఫరాజ్, ధ్రవ్ జురల్ యువ సంచలనాలు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. జైశ్వాల్ అయితే ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. 𝐑𝐨𝐡𝐢𝐭 & 𝐂𝐨. conquered the series with ease💪#IDFCFirstBankTestSeries #INDvENG #JioCinemaSports #BazBowled pic.twitter.com/a6HsT0Ikbe — JioCinema (@JioCinema) March 9, 2024 -
టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ సొంతం
India vs England 5th Test Day 3: ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉపఖండ పిచ్లపై ‘బజ్బాల్’ ఆటలు చెల్లవంటూ మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్తో పాటు.. బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ విజయం సాధ్యమైంది. ఫలితంగా సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్లు లేకుండానే యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుని తమ స్థాయిని చాటుకుంది టీమిండియా. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 స్పిన్నర్ల ఆధిపత్యం ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ కెరీర్లో వందో టెస్టు. ఇందులో అశూ మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. ఓవరాల్గా కుల్దీప్ యాదవ్ 7, రవీంద్ర జడేజా రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డబుల్ సెంచరీల వీరుడు యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ధర్మశాలలో మ్యాచ్ సాగిందిలా గురువారం మొదలైన ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు వీరుడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లతో దుమ్ములేపాడు. రవీంద్ర జడేజా తాను సైతం అంటూ ఒక వికెట్(1/17) దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ సెంచరీ(103) పూర్తి చేసుకోగా.. వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(110) సైతం శతక్కొట్టాడు. వీరిద్దరికి తోడు అరంగేట్ర బ్యాటర్ దేవ్దవ్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోరు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో.. 473/8 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. కేవలం నాలుగు పరుగులు జతచేసి భారత్ ఆలౌట్ అయింది. 477 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి.. 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. టీమిండియా స్పిన్నర్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఐదుగురి అరంగేట్రం ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్.. మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్దత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. వీరిలో రజత్ పాటిదార్ మినహా మిగిలిన నలుగురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) సాధించగా.. అరంగేట్రంలోనే పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీ(65)తో మెరిశాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం ►హైదరాబాద్లో తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్కోట్, రాంచి.. తాజాగా ధర్మశాలలో టీమిండియా వరుస విజయాలు. పూర్తి అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
Ind vs Eng: టీమిండియా ఘన విజయం.. సిరీస్ 4-1తో సొంతం
India vs England 5th Test Day 3 Updates: టీమిండియా ఘన విజయం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(84) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ధర్మశాలలో 473/8 ఓవర్నైట్ స్కోరుతో భారత్ శనివారం నాటి ఆట మొదలుపెట్టింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. భారత తొలి ఇన్నింగ్స్లో 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 45.5: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జడేజా బౌలింగ్లో షోయబ్ బషీర్(13) బౌల్డ్. స్కోరు: 189/9 (45.5). ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. రూట్ 78 పరుగులతో ఆడుతున్నాడు. రూట్ అర్ధ శతకం 36.2: బుమ్రా బౌలింగ్లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జో రూట్ ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.4: బుమ్రా బౌలింగ్లో మార్క్ వుడ్(0) ఎల్బీడబ్ల్యూ. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 34.2: టామ్ హార్లే(20) రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్క్రీజులోకి వచ్చాడు. రూట్ 44 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 141/7 (34.3) ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 26.4: అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయిన బెన్ ఫోక్స్(8). ఫలితంగా ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 113/6 (26.4). టామ్ హార్లే క్రీజులోకి వచ్చాడు. రూట్ 36 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ 26 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 113/5 భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 103/5 (22.5) జో రూట్ 34 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. అశ్విన్ తిప్పేస్తున్నాడు.. ఐదో వికెట్ డౌన్ 22.5: అశ్విన్ బౌలింగ్ స్టోక్స్(2) బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 17.4: నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టోకు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకుని పెవిలియన్కు సాగనంపాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెయిర్ స్టో రివ్యూకు వెళ్లగా.. ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. స్కోరు: 94-4(18). బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. నిలకడగా బెయిర్ స్టో, రూట్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 90/3. బెయిర్ స్టో, రూట్ నిలకడగా ఆడుతుండటంతో ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. బెయిర్ స్టో 28 బంతుల్లో 38 పరుగులతో ‘బజ్బాల్’ క్రికెట్ ఆడుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న బెయిర్ స్టో వందో టెస్టు వీరుడు బెయిర్ స్టో దూకుడుగా ఆడుతున్నాడు. 15వ ఓవర్ ముగిసే సరికి 21 బంతుల్లో 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జో రూట్ 25 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 9.2: మూడో వికెట్ డౌన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే బెన్ డకెట్(2)ను అవుట్ చేసిన అశూ.. అనంతరం మరో ఓపెనర్ క్రాలే(1)ను కూడా వెనక్కి పంపాడు. తాజాగా.. వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(19) రూపంలో మూడో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. స్కోరు: 41-3(10) . రూట్ 12, బెయిర్ స్టో ఒక పరుగుతో ఆడుతున్నారు. 5.3: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో సర్ఫరాజ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన క్రాలే(1). జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 23-2(6). పోప్ 17 పరుగులతో ఆడుతున్నాడు. 1.5: తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(2) బౌల్డ్. స్కోరు: 2-1. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ క్రాలే సున్నా పరుగులతో ఉన్నాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) టీమిండియా ఆలౌట్ మూడో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ కుల్దీప్ యాదవ్(30)ని వెనక్కి పంపగా.. షోయబ్ బషీర్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(20) స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆటలో.. ఓవర్నైట్ స్కోరుకు కేవలం నాలుగు పరుగులు మాత్రమే జత చేసి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 124.1 ఓవర్లలో 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. టామ్ హార్లే రెండు వికెట్లు తీశాడు. ఇక పేసర్లు జేమ్స్ ఆండర్సన్ రెండు, కెప్టెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక గురువారం నాటి తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. 124.1: టీమిండియా ఆలౌట్ జస్ప్రీత్ బుమ్రా రూపంలో భారత్ ఆఖరి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో బుమ్రా స్టంపౌట్ అయ్యాడు. ఫలితంగా 477 (124.1) స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ మీద 259 పరుగలు ఆధిక్యం సంపాదించింది. 123.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా మూడో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టీమిండియాకు షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో నైట్ వాచ్మన్ కుల్దీప్ యాదవ్(30) వికెట్ కీపర్క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 477/9 (124). బుమ్రా 20, సిరాజ్ సున్నా పరుగులతో ఉన్నారు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ►ఇదిలా ఉంటే.. జేమ్స్ ఆండర్సన్కు ఇది 700వ టెస్టు వికెట్ కావడం విశేషం. రెండో రోజు ఆటలో హైలైట్స్ ►తొలి ఇన్నింగ్స్లో భారత్ 473/8(120 ఓవర్లలో) ►రోహిత్ శర్మ(103), శుబ్మన్ గిల్(110) సెంచరీలు ►రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ ఆధిక్యం 255 పరుగులు ►అరంగేట్రంలో రాణించిన దేవ్దత్ పడిక్కల్(65) ►సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం(56) ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు- ధర్మశాల- తుదిజట్లు ఇండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, దేవ్దత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్లే, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. -
రోహిత్ అవుటా? నిజమేనా..? ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డౌన్ బ్యాటర్, శతక వీరుడు శుబ్మన్ గిల్తో కలిసి రెండో వికెట్కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో.. 135/1 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. రోహిత్ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్రౌండర్ స్టోక్స్.. ‘మ్యాజిక్’ బాల్తో హిట్మ్యాన్ను పెవిలియన్కు పంపాడు. స్టోక్స్ సంధించిన గుడ్లెంగ్త్ బాల్ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. బ్యాట్ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ అవాక్కు కాగా.. ఇంగ్లండ్ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐపాడ్లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్లో ఉన్న పేసర్ మార్క్ వుడ్ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రోహిత్ శర్మ అవుటైన మరుసటి ఓవర్(63)లోనే శుబ్మన్ గిల్(110) కూడా పెవిలియన్ చేరాడు. జేమ్ ఆండర్సన్ వికెట్ల ఖాతాలో 699వ వికెట్గా వెనుదిరిగాడు. 𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl — JioCinema (@JioCinema) March 8, 2024 -
హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్మ్యాన్.. తాజాగా బ్యాటింగ్లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా.. ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్మ్యాన్ 32 ఇన్నింగ్స్ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
‘చీటింగ్కు కూడా వెనుకాడరు.. కళ్లు కనిపించడం లేదా బాబూ’
రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస క్రీడా స్ఫూర్తి కూడా ప్రదర్శించడం చేతకాదా అని మండిపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 353 పరుగుల వద్ద ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(38)తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో 20వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్.. షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడ్డట్లుగా అనిపించింది. దీంతో జైస్వాల్ అవుటైనట్లేనంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, రివ్యూలో భాగంగా తొలి రీప్లేలో ఫలితం సరిగ్గా తేలకపోయినా అలాగే సంబరాలు చేసుకున్నారు. అయితే, ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్ అంపైర్ ఒకటికి రెండుసార్లు బాల్ ట్రాకింగ్ చేశాడు. ఈ క్రమంలో బాల్ తొలుత నేలను తాకి.. ఆ తర్వాత వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జైస్వాల్ నాటౌట్గా తేలగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్ను అవుట్గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా ‘చీటింగ్’కు పాల్పడేందుకు కూడా వెనుకాడలేదని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. England thought they had Yashasvi Jaiswal dismissed caught behind, but replays showed the ball hit the ground, putting a halt to the celebrations.#INDvENG pic.twitter.com/RgDhy7qOF5 — CricBlog ✍ (@cric_blog) February 24, 2024 England players are so rattled by Yashasvi Jaiswal that they sacrificed all their principles regarding Spirit Of Cricket and started appealing for a grounded catch. Next, they may finally try to run someone out at the non striker's end. — Sameer Allana (@HitmanCricket) February 24, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఘటన సమయానికి జైస్వాల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టీమిండియా స్కోరు 68-1. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్(73) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 -
జడేజా సూపర్ డెలివరీ.. స్టోక్స్కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ ఔటయ్యాడు. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యి స్టోక్స్ ఫ్రంట్ప్యాడ్ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ సైతం అంతే వేగంగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్ కనీసం రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్లో 40 ఓవర్లకు ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. pic.twitter.com/nNAMrv788e — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England, 4th Test Ranchi Day 1 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ తరఫున బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్కు ఆదిలోనే చుక్కలు చూపించాడు. ఓపెనర్లు జాక్ క్రాలే(42), బెన్ డకెట్(11), ఒలీ పోప్(0)లను పెవిలియన్కు పంపి టాపార్డర్ను కుదేలు చేశాడు. ఆకాశ్ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ను జో రూట్ తన అద్భుత ఇన్నింగ్స్తో గట్టెక్కించాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి అజేయ సెంచరీతో మెరిశాడు. మిగతా వాళ్లలో జానీ బెయిర్స్టో(38), బెన్ ఫోక్స్(47) మాత్రమే రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూ రూట్ 106(226 బంతుల్లో), ఓలీ రాబిన్సన్ 31(60 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, మహ్మద్ సిరాజ్ రెండు, అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తానికి.. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలో తడబడ్డా రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. 83.6: సెంచరీ కొట్టిన జో రూట్ బజ్బాల్ అంటూ దూకుడుగా ఆడకుండా తనదైన సహజ శైలిలో ఆడిన జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రూట్.. ఆచితూచి నిలకడగా ఆడుతూ 219 బంతుల్లో 103 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 279-7(84) ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 245 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీని (13) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రూట్తో (82) పాటు రాబిన్సన్ క్రీజ్లో ఉన్నాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి బెన్ ఫోక్స్ (47) ఔటయ్యాడు. జో రూట్ (75), టామ్ హార్ట్లీ క్రీజ్లో ఉన్నారు. 62.2: 200 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 198/5 (61) జో రూట్ 67, ఫోక్స్ 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 184/5 (54) ఎట్టకేలకు రూట్ ఫిఫ్టీ 48.5: టీమిండియాతో తాజా టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. నిలకడగా రూట్ ఇన్నింగ్స్ రూట్ 86 బంతుల్లో 40, ఫోక్స్ 56 బంతుల్లో 14 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 150-5(41) ఇంగ్లండ్ స్కోరు: 137/5 (36) రూట్ 32, ఫోక్స్ 9 పరుగులతో ఆడుతున్నారు. లంచ్ తర్వాత ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. స్కోరు: 129-5. రూట్ 27, ఫోక్స్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ విరామానికి స్కోర్: 112/5 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. అశ్విన్ బౌలింగ్లలో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 111/4 19 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 89/3 తొలి ఇన్నింగ్స్లో 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(23), జో రూట్(11) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 11.5: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన ఈ బెంగాల్ బౌలర్.. జాక్ క్రాలే(42) రూపంలో మూడో వికెట్ దక్కించుకున్నాడు. తొలుత నో బాల్ కారణంగా మిస్సయిన క్రాలేను ఈసారి బౌల్డ్ చేయడంలో ఆకాశ్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంగ్లండ్ స్కోరు: 57-3. బెయిర్ స్టో, జో రూట్ క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో ఆకాశ్ దీప్నకు రెండు వికెట్లు 9.4: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఇంగ్లండ్ వన్డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ డకౌట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 47/2 (9.4) తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(11) వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ స్కోరు: 47/1 (9.2). జాక్ క్రాలే 35 పరుగులతో ఆడుతున్నాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 31/0 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(32), బెన్ డకెట్(4) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ రాంచి వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో పేసర్ ఆకాష్ దీప్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్ధానంలో పేసర్ ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి రాగా.. రెహాన్ ఆహ్మద్ స్ధానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
ముందెన్నడూ చూడలేదు: రాంచి పిచ్పై స్టోక్స్ కీలక వ్యాఖ్యలు
Ind vs Eng Test series 2024: భారత గడ్డపై కూడా ‘బజ్బాల్’ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లండ్కు రెండో టెస్టులోనే తత్వం బోధపడింది. హైదరాబాద్ టెస్టులో విజయం తర్వాత అదే జోరును కొనసాగిద్దామని భావించిన స్టోక్స్ బృందానికి దిమ్మతిరిగే షాకిచ్చింది రోహిత్ సేన. విశాఖపట్నం, రాజ్కోట్ టెస్టుల్లో ఇంగ్లండ్ను చిత్తు చేసి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకున్నా ఆ లోటు కనబడనివ్వకుండా వరుస విజయాలతో జోష్లో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి జార్ఖండ్ వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాంచి పిచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తానెన్నడూ ఇలాంటి పిచ్ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాలుగో టెస్టు కోసం ఎలాంటి ట్రాక్ రూపొందించారో అర్థం చేసుకోలేకపోతున్నానని.. ఆ పిచ్ను అంచనా వేయడం కష్టంగా ఉందని స్టోక్స్ పేర్కొన్నాడు. బీబీసీ స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పిచ్ ముందెన్నడూ చూడలేదు. అసలు అక్కడ మ్యాచ్ ఎలా సాగనుందో అంచనా వేయలేకపోతున్నా. ఒకవైపు నుంచి పచ్చగా.. గ్రాసీగా కనిపిస్తోంది. మరోవైపు ఎండ్ నుంచి చూస్తే.. అదీ నిశితంగా గమనిస్తే.. చిన్న చిన్న పగుళ్లు కనిపిస్తున్నాయి. ఆ పిచ్పై ఎలా ఆడాలో నాకైతే అర్థం కావడం లేదు’’ అని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్లో కాస్త స్పిన్కు అనుకూలించిన పిచ్.. విశాఖ, రాజ్కోట్లో జరిగిన తదుపరి రెండు మ్యాచ్లలో స్పిన్నర్లతో పాటు పేసర్లకూ మేలు చేకూర్చింది. తొలి టెస్టులో ఇరు జట్ల స్పిన్నర్లు కలిపి 32 వికెట్లు తీస్తే.. పేసర్లకు ఆరు వికెట్లు మాత్రమే దక్కాయి. ఇక రెండో టెస్టులో స్పిన్ బౌలర్లకు 21 వికెట్లు దక్కితే.. ఫాస్ట్బౌలర్లు 15 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో మ్యాచ్లో స్పిన్నర్లు 24, పేసర్లు 11 వికెట్లు పడగొట్టారు. చదవండి: వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది: బాబర్పై మండిపడ్డ హఫీజ్ -
ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్కు అదిరిపోయే న్యూస్.. అదే జరిగితే?
టీమిండియాతో తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆ తర్వాత మ్యాచ్ల్లో తమ జోరును కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్ల్లో భారత చేతిలో దారుణ ఓటమి పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అయితే ఏకంగా 434 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. టీమిండియా దెబ్బకు గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమిని ఇంగ్లండ్ చవిచూసింది. అయితే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు, అభిమానులకు ఓ గుడ్ న్యూస్. వెన్ను గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బౌలింగ్కు దూరంగా ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బంతి పట్టేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. మూడో టెస్టు అనంతరం స్టోక్సీ ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మీరు బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నారా అన్న ప్రశ్న ఇంగ్లీష్ కెప్టెన్కు ఎదురైంది. అందుకు బదులుగా.. "నేను కచ్చితంగా బౌలింగ్ చేస్తానని చెప్పలేను. అలా అని చేయని కూడా చెప్పలేను. నేను బౌలింగ్ చేయాలా వద్దా అన్న విషయం కోసం మా వైద్య బృందంతో ఇంకా చర్చిస్తున్నాను. కానీ ప్రాక్టీస్ సెషన్స్లో అయితే నేను 100కు 100 శాతం బౌలింగ్ చేయగల్గుతున్నాను. ఆ సమయంలో నాకు ఎటువంటి సమస్యలేదు. త్వరలో తిరిగి మళ్లీ బౌలింగ్ చేయగలనని" ఆశిస్తున్నానని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. చదవండి: Ranchi Test: టీమిండియాకు బిగ్ షాక్.. డబుల్ సెంచరీల వీరుడు దూరం!? -
Ind vs Eng: అతడి ఇన్నింగ్స్ అద్భుతం.. సిరీస్ గెలిచి తీరతాం!
India vs England, 3rd Test: ఇంగ్లండ్ ‘బజ్బాల్’ను టీమిండియా చితక్కొట్టింది. ఏకంగా 434 పరుగుల తేడాతో స్టోక్స్ బృందాన్ని ఓడించి రాజ్కోట్లో రాజసం చిందించింది. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లిష్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. తద్వారా.. తమ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా రెండో అతిపెద్ద పరాజయం మూటగట్టుకుంది స్టోక్స్ బృందం. అదే విధంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో వెనుకబడింది. ఈ విషయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అతడి ఇన్నింగ్స్ అద్భుతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘బెన్ డకెట్ అద్భుత, అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆసాంతం ఇలాంటి జోరే కొనసాగించాలని మేము భావించాం. టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాం. భారత రెండో ఇన్నింగ్స్లో మేము ఎక్కువ సేపు బౌలింగ్ చేయాలని భావించాం. కానీ అలా జరుగలేదు. అనుకున్న దాని కంటే ముందుగానే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా మా ఆటగాళ్లకు అండగా నిలవడం ముఖ్యం. ప్రస్తుతం మేము 1-2తో వెనుకబడి ఉన్నాం. అయితే, ఈ మ్యాచ్ నుంచి నేర్చుకున్న పాఠాలతో తిరిగి పుంజుకుంటాం. సిరీస్ గెలుస్తాం ఈ ఓటమి నుంచి తేరుకుని తదుపరి రెండు మ్యాచ్లపై దృష్టి సారిస్తాం. కచ్చితంగా సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ధనాధన్ సెంచరీ(153)తో అలరించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 4 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసిపోగా.. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. పరుగుల పరంగా ఇంగ్లండ్కు అతిపెద్ద టెస్టు ఓటములు ►562- వర్సెస్ ఆసీస్- ది ఓవల్ 1934 ►434- వర్సెస్ భారత్- రాజ్ కోట్- 2024 ►425- వర్సెస్ వెస్టిండీస్- మాంచెస్టర్ 1976 ►409- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 1948 ►405- వర్సెస్ ఆసీస్- లార్డ్స్ 2015 చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాలో ఊహించని మార్పు! స్టార్ ప్లేయర్ దూరం -
ఇంగ్లండ్కు ఘోర అవమానం.. 90 ఏళ్ల తర్వాత!?
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్కు ఘోర పరాభావం ఎదురైంది. భారత్ చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలమైంది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్ జట్టు చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పింది. టెస్టులలో ఇంగ్లండ్ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. అయితే 21వ శతాబ్దంలో మాత్రం ఇంగ్లండ్ ఇదే అతి పెద్ద ఓటమి. మరోవైపు భారత్ మాత్రం టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు 2021లో న్యూజిలాండ్పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఇక ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్ శర్మ -
IND VS ENG 3rd Test Day 4: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం..
IND VS ENG 3rd Test Day 4 Updates And Highlights: రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం.. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల దాటికి.. కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు. ఒక్క వికెట్ దూరంలో.. రాజ్కోట్ టెస్టులో విజయానికి భారత్ కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. వరుస క్రమంలో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. జడేజా బౌలింగ్లో ఫోక్స్ ఔట్ కాగా.. అశ్విన్ బౌలింగ్లో హార్ట్లీ పెవిలియన్కు చేరాడు. ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. రెహాన్ అహ్మద్ రూపంలో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి సిరాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 28 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/7 విజయం దిశగా భారత్.. రాజ్కోట్ టెస్టులో టీమిండియా విజయం వైపు అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో వికెట్గా వెనుదిరిగాడు. భారత్ విజయానికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదో వికెట్ డౌన్.. జో రూట్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్లో రూట్ ఎల్బీగా వెనుదిరిగాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 50/5. క్రీజులో బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జడేజా బౌలింగ్లో జానీ బెయిర్ స్టో.. నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 519 పరుగులు కావాలి. మూడో వికెట్ డౌన్.. 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఓలీ పోప్.. జడేజా బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 24/3 రెండో వికెట్ డౌన్.. జాక్ క్రాలే రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ బెన్ డకెట్(4) రనౌటయ్యాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు.7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/1 ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన భారత్ భారత్ సెకెండ్ ఇన్నింగ్స్ను 430/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. టీమిండియా.. ఇంగ్లండ్కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్ 214, సర్ఫరాజ్ ఖాన్ 68 పరుగులతో అజేయంగా నిలిచారు. మరో డబుల్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ రెండో టెస్ట్లో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. మూడో టెస్ట్లో మరో డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ డబుల్ను యశస్వి 231 బంతుల్లో పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 14 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 411/3గా ఉంది. లీడ్ 537 పరుగులుగా ఉంది. మరో హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల వద్ద పొరపాటున రనౌటైన సర్ఫరాజ్ ఖాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 66 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో డబుల్ దిశగా దూసుకుపోతున్న యశస్వి భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో డబుల్ సెంచరీ దిశగా దూసకుపోతున్నాడు. నిన్న రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి.. ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం యశస్వి 182 పరుగుల వద్ద ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ ఖాన్ (33) క్రీజ్లో ఉన్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా స్కోర్ 359/4గా ఉంది. 440 పరుగుల ఆధిక్యంలో టీమిండియా నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా ఆధిక్యం 440 పరగులుగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (149), సర్ఫరాజ్ ఖాన్ (22) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 258 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో జో రూట్కు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (27) ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ (115), సర్ఫరాజ్ ఖాన్ క్రీజ్లో ఉన్నారు. 91 పరుగుల వద్ద ఔటైన శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ సెంచరీకి చేరువలో (91) రనౌటాయ్యడు. కుల్దీప్ తప్పిదం కారణంగా గిల్ ఔటయ్యాడు. నిన్న రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి (107) క్రీజ్లోకి వచ్చాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ సెకెండ్ ఇన్నింగ్స్లో 192/2గా ఉంది. శుభ్మన్ గిల్ (65), కుల్దీప్ యాదవ్ (3) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 322 పరుగుల లీడ్లో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ అద్బుతమైన సెంచరీతో (107) ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (19), రజత్ పాటిదార్ (0) నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ సెంచరీ అనంతరం రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జో రూట్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153) -
Ind vs Eng 3rd Test: ముగిసిన మూడో రోజు ఆట.. 322 పరుగుల ఆధిక్యంలో భారత్
Ind vs Eng 3rd Test Day 3 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఆట ఆరంభమైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది ఇంగ్లండ్. ఈ మ్యాచ్లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ 319 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. మూడో రోజు ముగిసిన ఆట.. మూడో రోజు ఆటలో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(65), కుల్దీప్ యాదవ్(3) పరుగులతో ఉన్నారు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(104) సెంచరీతో మెరిశాడు. అయితే వెన్ను నొప్పి కారణంగా ఆట మధ్యలోనే రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 322 పరుగుల భారీ అధిక్యంలో భారత్ కొనసాగుతోంది. కాగా అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆలౌటైంది. జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. వెన్ను నొప్పి కారణంగా జైశ్వాల్ మూడో రోజు ఆట ఆఖరి సెషన్లో మైదానాన్ని వీడాడు. జైశ్వాల్(104) పరుగులు చేశాడు. 47 ఓవర్లకు భారత్ స్కోర్: 190/1. టీమిండియా ప్రస్తుతం 321 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ.. జైశ్వాల్తో పాటు క్రీజులో ఉన్న మరో టీమిండియా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. రెండో వికెట్కు వీరిద్దరూ ఇప్పటివరకు 153 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్లో భారత్ స్కోర్: 184/1. భారత్ ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైశ్వాల్ సూపర్ సెంచరీ.. ఇంగ్లండ్తో మూడో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. జైశ్వాల్కు ఇది మూడో టెస్టు సెంచరీ. జైశ్వాల్ ప్రస్తుతం 102 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు గిల్(45) పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. 41 ఓవర్లకు టీమిండియా స్కోర్: 171/1. భారత్ ప్రస్తుతం 297 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. హాఫ్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్లో యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 80 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్లతో జైశ్వాల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. యశస్వీ తనదైన స్టైల్లో సిక్స్ కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 116/1, క్రీజులో జైశ్వాల్(65)తో పాటు శుబ్మన్ గిల్(26) ఉన్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, జైశ్వాల్.. టీమిండియా యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(8), యశస్వీ జైశ్వాల్(23) నిలకడగా ఆడుతున్నారు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 50/1 టీ విరామానికి భారత్ స్కోర్: 44/1 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(19), శుబ్మన్ గిల్(5) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 170 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 11.3: జో రూట్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా రోహిత్ శర్మ(19) వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గిల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 34-1(12). జైస్వాల్ 10 పరుగులతో ఆడుతున్నాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత రెండో ఇన్నింగ్స్ ఆరంభించారు. స్కోరు: 13/0 (4) ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా తమ స్కోరుకు 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 319 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 445 ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్- 319 పదో వికెట్ డౌన్ 71.1: సిరాజ్ బౌలింగ్ ఆండర్సన్ బౌల్డ్. పదో వికెట్గా ఆండర్సన్ వెనుదిరగడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెర పడింది. 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. మరో షాక్.. తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 70.2: జడేజా బౌలింగ్లో టామ్ హార్లే(9)ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 314/9 (70.2) ఎనిమిదో వికెట్ డౌన్ 69.5: సిరాజ్ బౌలింగ్లో రెహాన్ అహ్మద్ బౌల్డ్(6). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. హార్లే తొమ్మిది పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 314-8(70) వరుస షాకులు.. ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ స్టోక్స్ అవుటైన మరుసటి బంతికే బెన్ ఫోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. సిరాజ్ బౌలింగ్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ , టామ్ హార్లే క్రీజులో ఉన్నారు. స్కోరు: 299/7 (65.3).టీమిండియా కంటే 146 పరుగులు వెనుకబడి ఉంది. భోజన విరామం తర్వాత వికెట్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి స్టోక్స్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. నిలకడగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 61వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టోక్స్ 39, ఫోక్స్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద నిలిచింది. 56వ ఓవర్ ముగిసే సరికి ఇలా ఆచితూచి ఆడుతున్న స్టోక్స్, ఫోక్స్. ఇంగ్లండ్ స్కోరు: 275/5 (56). స్టోక్స్ 28, ఫోక్స్ రెండు పరుగులతో ఆడుతున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 50.1: ఎట్టకేలకు సెంచరీ వీరుడు బెన్ డకెట్ అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. 151 బంతుల్లోనే 23 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 153 పరుగులు చేసిన డకెట్.. శతకాన్ని ద్విశతకంగా మార్చాలని భావించగా.. కుల్దీప్ అతడి జోరుకు బ్రేక్ వేశాడు. బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్టోక్స్ 20 పరుగులతో ఉన్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 260-5(51) నిలకడగా ఆడుతున్న డకెట్, స్టోక్స్ 48 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 247/4 . డకెట్ 153, స్టోక్స్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 198 పరుగులు వెనుబడి ఉంది. నాలుగో వికెట్ డౌన్ ఆట మొదలెట్టిన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. బుమ్రా రూట్ను అవుట్ చేయగా.. కుల్దీప్ యాదవ్ దెబ్బకు బెయిర్ స్టో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బెన్ స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. డకెట్ 142 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 225-4(41) మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 207/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో జో రూట్(18) జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. బెన్ డకెట్ 141 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 224-3. అశ్విన్ లేకుండానే ఇక కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే భారత్ శనివారం బరిలో దిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. కన్కషన్ సబ్స్టిట్యూట్(ఆటగాడి తలకు దెబ్బతగిలినపుడు), కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే మ్యాచ్ మధ్యలో వైదొలిగిన ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి. అది కూడా సదరు సబ్స్టిట్యూట్ ఫీల్డింగ్ వరకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే, అశ్విన్ తన తల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా వైదొలిగినందున అతడి స్థానంలో వేరే ప్లేయర్ను తీసుకునే అవకాశం లేదు. ఫలితంగా మూడో రోజు ఆటలో టీమిండియా పది మంది యాక్టివ్ ప్లేయర్లతో మైదానంలో దిగింది. రెండో రోజు హైలైట్స్ ►ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ ►తొలి ఇన్నింగ్స్లో 207/2 ►భారత్ 445 ఆలౌట్ ►అశ్విన్కు 500వ వికెట్ తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
Day 2: జురెల్ హిట్.. బుమ్రా మెరుపులు! డకెట్ సెంచరీ.. హైలైట్స్
India vs England 3rd Test Day 2 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్కోట్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. టీమిండియా కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్, సెంచరీ వీరుడు బెన్ డకెట్ 133, నాలుగో నంబర్ బ్యాటర్ జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత ఆటగాళ్లలో ధ్రువ్ జురెల్(46), జస్ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 26 పరుగులు) బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు, రెహాన్ అహ్మద్ రెండు.. అదే విధంగా జేమ్స్ ఆండర్సన్ , టామ్ హార్లే, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు. రెండు వందల పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 34: డకెట్ 131, జో రూట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 29.6: సిరాజ్ బౌలింగ్లో ఒలీ పోప్(39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 182-2(30). బెన్ డకెట్ సెంచరీ 25.5: సిరాజ్ బౌలింగ్లో ఫోర్ బాది ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 148-1(26). డకెట్ 106, పోప్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20వ ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు:115/1 (20) డకెట్ 78, పోప్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 500 వికెట్ల క్లబ్లో అశ్విన్ 89 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో రజత్ పాటిదార్కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలే (15) ఔటయ్యాడు. అశ్విన్కు ఇది 500వ టెస్ట్ వికెట్. బెన్ డకెట్కు (68) జతగా ఓలీ పోప్ క్రీజ్లోకి వచ్చాడు. Etched in history🎯5⃣0⃣0⃣*#INDvENGpic.twitter.com/vKKoMxlPDM — Chennai Super Kings (@ChennaiIPL) February 16, 2024 టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 31/0 (6) డకెట్ 19, క్రాలే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 25-0 డకెట్ 14, క్రాలే ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 326/5 ఓవర్నైట్ స్కోరుతో భారత జట్టు శుక్రవారం నాటి ఆట మొదలుపెట్టింది. ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్(4), రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్(46), రవిచంద్రన్ అశ్విన్(37) ఇన్నింగ్స్ను మళ్లీ గాడిన పడేశారు. చివర్లో బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మార్క్ వుడ్ బౌలింగ్లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. 130.5 ఓవర్లలో 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్లు మార్క్ వుడ్ 4, ఆండర్సన్ ఒకటి.. స్పిన్నర్లు రెహాన్ అహ్మద్ రెండు, టామ్ హార్లే ఒకటి, జో రూట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 💥 goes Bumrah, this time with the BAT 🤩#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSerie pic.twitter.com/zq1VB1vmZw — JioCinema (@JioCinema) February 16, 2024 తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 123.5: హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ అవుటయ్యాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 415/9 (124) ఎనిమిదో వికెట్ డౌన్ 119.6: అశ్విర్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో ఆండర్సన్కు క్యాచ్ ఇచ్చి అశూ(37) నిష్క్రమించాడు. జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. జురెల్ 39 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 408-89(120). నాలుగు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా అశ్విన్ 36, జురెల్ 32 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. భారత్ స్కోరు 400-7(117) లంచ్ బ్రేక్ ఇంగ్లండ్తో మూడో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద నిలిచింది. ఆల్రౌండర్ అశ్విన్ 25, అరంగేట్ర వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 133 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 109 ఓవర్లలో టీమిండియా స్కోరు: 375-7 అశ్విన్ 24, జురుల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 110 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నిలకడగా ముందుకు సాగుతున్నారు. ఆచితూచి ఆడుతున్న అశ్విన్, జురెల్ రెండోరోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండర్ అశ్విన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. అశూ 18, జురెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 359/7 (103) ఏడో వికెట్ డౌన్ సెంచరీ వీరుడు రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్లో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ బౌల్డ్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331-7(91) ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే టీమిండియాకు షాకిచ్చాడు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్. అతడి బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331/6 (90) మొదటిరోజు హైలైట్స్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110- నాటౌట్) సెంచరీలు అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్(62) వీలుకాని పరుగుకు పిలుపునిచ్చిన జడేజా కారణంగా సర్ఫరాజ్ రనౌట్ ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్వుడ్కు మూడు, స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ 1, రవీంద్ర జడేజా 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
Ind vs Eng 3rd Test: తొలిరోజు టీమిండియాదే.. కానీ ఆ ఒక్కటే!
India vs England 3rd Test 2024- 3rd Test Day 1 Updates: ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. గురువారం నాటి ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 326 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(131), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(110- నాటౌట్) శతకాలతో మెరిశారు. అయితే, అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీతో మ్యాచ్కే హైలైట్గా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తూ జడేజాతో సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యాడు. 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(10), శుబ్మన్ గిల్(0), రజత్ పాటిదార్(5) పూర్తిగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ దక్కింది. మొత్తానికి మూడో టెస్టు తొలి రోజు ఆటలో ఆరంభంలో టీమిండియా తడబడినా.. రోహిత్, జడ్డూ, సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కారణంగా పుంజుకుని ఆధిపత్యం కనబరిచిందని చెప్పవచ్చు. జడ్డూ 110, కుల్దీప్ యాదవ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 𝑹𝒂𝒋𝒌𝒐𝒕 𝒌𝒂 𝑹𝒂𝑱𝒂 👑 Jadeja slams his fourth Test 💯 to keep #TeamIndia on the front foot ⚡#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/RSHDu8MMAD — JioCinema (@JioCinema) February 15, 2024 జడేజా సెంచరీ రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోరు: 315-5(82). కుల్దీప్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నాడు. సర్ఫరాజ్ రనౌట్.. ఐదో వికెట్ డౌన్ 81.5: జడ్డూతో సమన్వయ లోపం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. 66 బంతుల్లోనే 62 పరుగులు చేసి జోష్లో ఉన్న అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రంలో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 45 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు సాధించి అర్ధ శతకానికి చేరువయ్యాడు. మరోవైపు.. జడ్డూ 95 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 291/4 (76) 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 242-4 జడేజా 86, సర్ఫరాజ్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అవుట్ 63.3: సెంచరీ వీరుడు రోహిత్ శర్మ(131) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ బౌలింగ్లో హిట్మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్కు తెరపడింది. అరంగేట్ర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత టెస్ట్ల్లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో హిట్మ్యాన్ 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. హిట్మ్యాన్తో పాటు జడేజా (68) క్రీజ్లో ఉన్నాడు. భారత్ స్కోర్ 190/3గా ఉంది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 185/3 (52) రోహిత్ శర్మ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉండగా.. జడేజా 68 పరుగులతో ఆడుతున్నాడు. జడ్డూ హాఫ్ సెంచరీ గాయం కారణంగా జట్టుకు దూరమై మూడో టెస్టుతో తిరిగి వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అర్ధ శతకంతో మెరిశాడు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే క్రమంలో విలువైన యాభై పరుగులు జత చేశాడు. టెస్టుల్లో అతడికి 21వ ఫిఫ్టీ. ఈ క్రమంలో తనదైన శైలిలో కత్తిసాము చేస్తున్నట్లుగా సెలబ్రేడ్ చేసుకున్నాడు జడ్డూ. రోహిత్ 79 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 150/3 (44) వందకు పైగా పరుగుల భాగస్వామ్యం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆదుకుంటున్నారు. తొలి రోజు 41 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 77, జడ్డూ 47 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, జడ్డూ రోహిత్ శర్మ 53, రవీంద్ర జడేజా 39 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. స్కోరు: 111/3 (32) సెంచరీ కొట్టిన టీమిండియా రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 31 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరి మెరుగైన భాగస్వామ్యం కారణంగా టీమిండియా వంద పరుగుల మార్కును అందుకుంది. స్కోరు: 100-3(26) లంచ్ బ్రేక్ రోహిత్ శర్మ 52, రవీంద్ర జడేజా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: : 93/3 (25) రోహిత్ శర్మ అర్ధ శతకం 22.5: టామ్ హార్లే బౌలింగ్లో రెండు పరుగులు తీసి భారత సారథి రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 51, జడ్డూ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 81-3(23). టీమిండియా హాఫ్ సెంచరీ 13.2: ఆండర్సన్ బౌలింగ్ రవీంద్ర జడేజా ఒక పరుగు తీయడంతో.. టీమిండియా 50 పరుగుల మార్కు అందుకుంది. జడ్డూ 4, రోహిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 8.5: రజత్ పాటిదార్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్లో.. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజత్ అవుటయ్యాడు. రోహిత్ శర్మ 17, రవీంద్ర జడేజా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 33-3(9) రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.4: ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ టీమిండియాను మరోసారి దెబ్బకొట్టాడు. భారత వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్ను అవుట్ చేశాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 24/2 (6) తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 3.5: యశస్వి జైస్వాల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మార్క్వుడ్ బౌలింగ్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ జో రూట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10 బంతులు ఎదుర్కొన్న యశస్వి 10 పరుగులు చేసి మైదానం వీడాడు. శుబ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 4 ఓవర్లలో భారత్ స్కోరు: 22-1 మొదటి ఓవర్లో భారత్ స్కోరు: 6-0 రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించారు. వాళ్లిద్దరి అరంగేట్రం టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలైంది. రాజ్కోట్ వేదికగా గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ టెస్టు ద్వారా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. తుదిజట్లు: టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
IND VS ENG 3rd Test: ఆ ముగ్గురు సహా మరో ఇద్దరికి చాలా ప్రత్యేకం..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ మ్యాచ్ ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారింది. రేపటి మ్యాచ్లో భారత వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే టెస్ట్ల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండగా.. ఇదే మ్యాచ్లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో ఐదు వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 700 వికెట్ల అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. రేపటి మ్యాచ్ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు 100వ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్ అతనికి చిరకాలం గుర్తిండిపోతుంది. ఈ మూడు ప్రత్యేకతలే కాకుండా రేపటి మ్యాచ్ ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చిరస్మరణీయంగా మారే అవకాశం ఉంది. రాజ్కోట్ టెస్ట్తో యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ అహ్మద్, దృవ్ జురెల్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప ఈ ఇద్దరి టెస్ట్ అరంగేట్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇలా రేపటి నుంచి ప్రారంభంకాబోయే రాజ్కోట్ టెస్ట్ మ్యాచ్ ఐదుగురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకంగా మారనుంది. ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలువగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్లో ఇరు జట్లు సమంగా ఉండటంతో రాజ్కోట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. టీమిండియాను సీనియర్ల గైర్హాజరీ సమస్య కలవరపెడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు ఉత్సాహంగా కనిపిస్తూ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచారు. మరోపక్క ఇంగ్లండ్ టీమ్.. భారత్ను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తూ ప్రణాళికలు రచిస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. -
అతడిపై వేటు.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
India vs England, 3rd Test: టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్కోట్ మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్పై వేటు పడగా.. రైటార్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో.. ఒకే ఒక్క ఫాస్ట్బౌలర్ మార్క వుడ్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తర్వాతి మ్యాచ్లో దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్కు పిలుపునిచ్చింది. మార్క్వుడ్ స్థానాన్ని ఆండర్సన్తో భర్తీ చేయడంతో పాటు.. గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్తో అరంగేట్రం చేయించింది. ఈసారి ఇద్దరు పేసర్లతో ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. బషీర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో.. రాజ్కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్బౌలర్లతో బరిలో దిగాలని భావించిన ఇంగ్లండ్.. బషీర్పై వేటు వేసి మార్క్ వుడ్ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్స్టో- 97 టెస్ట్ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్ల మార్కును తాకారు. -
IND VS ENG 2nd Test: బెన్ స్టోక్స్ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!
విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలిపోయిన వేల బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై చెలరేగి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. Technology got it wrong on this occasion: England skipper Ben Stokes on Zak Crawley's lbw dismissal in second innings of second Test #INDvsENGTest — Press Trust of India (@PTI_News) February 5, 2024 మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే అంపైర్ కాల్ అనే ఆప్షన్ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. Review.....successful! ✅☝️ Kuldeep Yadav picks up the big wicket of Crawley to keep #TeamIndia in the driving seat 👊⚡️#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/c4hMunPVSP — JioCinema (@JioCinema) February 5, 2024 ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్ఎస్ అప్పీల్ను థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్తో వెళ్తారు. కానీ ఈ సందర్భంలో థర్డ్ అంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్ స్టంప్కు తగులుతున్నట్లు డీఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. -
Ind vs Eng: దెబ్బకు దెబ్బ.. మాతో పెట్టుకుంటే..!
Ind vs Eng 2nd Test: పటిష్ట జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్ అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తే! ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర జట్లతో స్వదేశంలో అయినా.. విదేశంలో అయినా ఫార్మాట్తో సంబంధం లేకుండా టీమిండియా మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు వీరాభిమానులు. ప్రేక్షకుల పరిస్థితి ఇలా ఉంటే.. మైదానంలో ఆటగాళ్లు కూడా పోటీ తీవ్రమవుతున్న కొద్దీ ఒత్తిడికి లోనవడం ఎంత సహజమో.. కీలక సమయంలో ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీస్తే సంబరాలు చేసుకోవడం కూడా అంతే సహజం. ముఖ్యంగా తమను ట్రోల్ చేసేలా వ్యవహరించిన ప్రత్యర్థి ప్లేయర్కు కౌంటర్ ఇచ్చే అవకాశం వస్తే అస్సలు చేజార్చుకోరు. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విషయంలో అదే పని చేశాడు. వైజాగ్లో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా రెండో ఇన్నింగ్స్లో.. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. టామ్ హార్లీ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్ను స్టోక్స్ పట్టుకున్నాడు. దీంతో మూడో రోజు ఆట(ఆదివారం)లో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అయ్యర్ పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో స్టోక్స్ అయ్యర్కు సెండాఫ్ ఇస్తూ ఓవర్గా సెలబ్రేట్ చేసుకున్న తీరు అతడికి కోపం తెప్పించింది. అయితే, అందుకు బదులు తీర్చుకునే అవకాశం అయ్యర్కు నాలుగో రోజు ఆట సందర్భంగా వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 52.4వ ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్లో బెన్ ఫోక్స్ సింగిల్ తీశాడు. అయితే, మరో ఎండ్లో ఉన్న బెన్ స్టోక్స్ పరుగు తీయడంలో బద్దకం ప్రదర్శించాడు. ఈ క్రమంలో బంతిని అందుకున్న అయ్యర్ వికెట్లకు డైరెక్ట్గా త్రో చేయగా.. స్టోక్స్ రనౌట్ అయ్యాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ సైతం.. స్టోక్స్ తన క్యాచ్ అందుకున్నపుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో అదే తరహాలో వేలు చూపిస్తూ.. ‘‘తిరిగి చెల్లించేశాను’’ అన్నట్లు సైగ చేశాడు. వీరిద్దరి ఫొటోలను కలిపి షేర్ చేస్తున్న టీమిండియా అభిమానులు.. ‘‘మా వాళ్లతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏదీ దాచుకోరు. తిరిగి ఇచ్చేస్తారు’’ అంటూ ఇంగ్లండ్ ప్లేయర్లపై సెటైర్లు వేస్తున్నారు. చదవండి: IND VS ENG 2nd Test: అతనో ఛాంపియన్ ప్లేయర్.. కుర్రాళ్లు అద్భుతం: రోహిత్ Ben Stokes after taking Shreyas Iyer's catch. Shreyas Iyer after running out Ben Stokes. pic.twitter.com/xpp8lF6N62 — Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024 ఇక వైజాగ్ టెస్టులో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా హైదరాబాద్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. ఇంగ్లండ్పై ఘన విజయం
Ind vs Eng 2nd Test- India won by 106 runs: ఇంగ్లండ్తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం మ్యాచ్లో పర్యాటక జట్టును ఏకంగా 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హైదరాబాద్ టెస్టు పరాభవానికి బదులు తీర్చుకుని... ఐదు మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. యశస్వి ‘డబుల్’ కారణంగా విశాఖ వేదికగా శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులు స్కోరు చేయగలిగింది. ‘ఆరే’సిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 55.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. గిల్ సెంచరీ ఈ నేపథ్యంలో రెండో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అయితే, మూడో రోజు టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదు. ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13) వికెట్లు కోల్పోయింది. శుబ్మన్ గిల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్(45), అశ్విన్(29) అతడికి అండగా నిలబడ్డారు. ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన ఈ క్రమంలో 255 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. ఇంగ్లండ్కు 399 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే చెలరేగిన భారత బౌలర్లు 292 పరుగులకే ఇంగ్లండ్ను కట్టడి చేశారు. దీంతో నాలుగో రోజు ఆట కూడా పూర్తికాకుండానే.. టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక బుమ్రా, అశ్విన్లకు తలా మూడు వికెట్లు దక్కగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ ఒక్కో వికెట్ తీశారు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ను రనౌట్ చేయడంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టేడియం, విశాఖపట్నం ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►టీమిండియా స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 253-10 (55.5 ఓవర్లలో) ►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్): 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. ►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌట్ ►విజేత: టీమిండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(తొమ్మిది వికెట్లు)- కెరీర్లో రెండో అత్యుత్తమ గణాంకాలు(9/91). చదవండి: ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
వారెవ్వా శ్రేయస్.. డైరెక్ట్ త్రో! స్టోక్స్ రనౌట్.. వీడియో
India vs England, 2nd Test Day 4 Vizag: ఇంగ్లండ్తో రెండో టెస్టులో బ్యాటింగ్లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. వైజాగ్ మ్యాచ్లో ఈ మిడిలార్డర్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 56 (27, 29) పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. అక్షర్ పటేల్ బౌలింగ్లో కాలే షాట్ ఆడేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికి బంతి గాల్లోకి లేవగానే బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇలా రెండో రోజు ఆటలో... కీలక వికెట్ పడగొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. తాజాగా సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోగా.. టీమిండియా విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ►టాస్: టీమిండియా... బ్యాటింగ్ ►మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు: 396-10 (112 ఓవర్లలో) ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 253-10 (55.5 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు: 255-10 (78.3 ఓవర్లలో) ►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్. చదవండి: Ind vs Eng: 0.45 సెకన్లలో మెరుపు వేగంతో రోహిత్.. రెప్పపాటులో క్యాచ్!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా! సానియా మరో పెళ్లి చేసుకోవాలి!
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్ ఓపెన్ ఛాలెంజ్
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
రాయ్బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
మెట్రో ట్రైన్లో నిర్మలా సీతారామన్ .. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
Afghanistan Floods: అఫ్ఘాన్ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
'నరేంద్ర మోదీ' బయోపిక్లో స్టార్ యాక్టర్
తప్పక చదవండి
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement