bird
-
ఎకో టూరిజం: వీకెండ్లో నేచర్ని చుట్టొద్దామిలా..!
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్లో ట్రెక్కింగ్, నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘దక్కన్వుడ్స్, ట్రయల్ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు.. ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ ఫిబ్రవరి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 2న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్ వాక్, ట్రెక్కింగ్ మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 30న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. (చదవండి: దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్) -
చిన్నారుల బర్డ్ వాక్: పక్షులతో గడిపే ఛాన్స్..!
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఏటా గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది. వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్లను నిర్వహించారు. (చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
Bird Flu : చికెన్ తినకండి
-
ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్లైన్స్కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతూ రన్వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.అప్పటికే ఒక ఇంజిన్ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కజకిస్తాన్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు. ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం -
అడవంతా తిరిగి.. పక్షులను తిలకించి..
జన్నారం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో ఆదివారం బర్డ్వాక్ ఉల్లాసంగా సాగింది. బిహార్, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి 15 మంది బర్డ్ వాచర్లు వచ్చారు. శనివారం జన్నారం చేరుకున్న బర్డ్ వాచర్లకు రేంజ్ పరిధిలోని బైసన్కుంటలో రాత్రి బస కలి్పంచారు. ఆదివారం ఉదయమే సమీపంలోని అడవంతా తిరుగుతూ పక్షులను తిలకించారు. అరుదైన వివిధ రకాల పక్షులను కెమెరాలో బంధించారు. కొందరు బైనాక్యులర్తో పక్షులను తిలకించి మురిసిపోయారు. సఫారి ద్వారా మల్యాల వాచ్ టవర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా పక్షులను ఫొటోలు తీశారు. ఉన్నతాధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ఆశి‹Ùసింగ్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ రేంజ్ అధికారి సుష్మారావు అధ్వర్యంలో బర్డ్వాక్ జరిగింది. ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ బర్డ్వాక్ను పరిశీలించారు. డీఆర్వో తిరుపతి, సిబ్బంది సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బర్డ్వాక్లో 60 రకాల పక్షులను గుర్తించినట్లు పలువురు తెలిపారు. -
ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం
జైసల్మేర్: రాజస్థాన్లోని జైసల్మేర్లో గల సుదాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్లకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్ను సేవ్ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త ఆశిష్ వ్యాస్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్హెచ్సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్ తెలిపారు. ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు -
నార్కోండం - మాయమైన మేకలు ఆసక్తికర కథనం
దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం. 1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి. మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.రచయిత్రి: జానకి లెనిన్ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్ -
కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది!
తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ కాకి సూపర్ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK— Shilpa (@shilpa_cn) August 16, 2024దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్ను తలపించిన ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ పోస్టు చేయగా వైరల్గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్ఓన్ కంట్రీ కదా అలాగే జరుగుతుందని ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు కామెంట్ చేశారు. Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్యాంగిల్లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్ అయ్యింది.Is that the bird unfurling the flag? No.It's the camera angle. pic.twitter.com/on3BlxJs6U— Mohammed Zubair (@zoo_bear) August 17, 2024 -
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్ నిలిపివేత
పనాజి: గోవా డబోలిమ్ ఎయిర్పోర్టులో టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. సౌత్గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!
ఇటీవల గ్లామరస్గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు. ఎలా తయారు చేస్తారంటే..ఇది స్విఫ్ట్లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రయోజనాలు..పోషకాలు సమృద్ధిగా ఉంటాయిఅమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయికణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిదిరోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందికొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. View this post on Instagram A post shared by Golden Nest Inc (@goldennestusa) (చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!) -
పక్షి ఈక 23.66 లక్షలు
ఒక పక్షి ఈక విలువెంత? సున్నా అనుకుంటున్నారా? మీరు పొరపాటు పడినట్లే. న్యూజిలాండ్లో నిర్వహించిన ఓ వేలంపాటలో పక్షి ఈక అక్షరాలా రూ.23,66,007(28,417డాలర్లు) పలికింది. ఇది పవిత్రమైన హుయియా పక్షి ఈక కావడమే ఇందుకు కారణం. దశాబ్దాల క్రితం నాటి అరుదైన ఈ ఈకను న్యూజిలాండ్లోని వెబ్స్ వేలం కేంద్రంలో తాజాగా వేలం వేశారు. ఔత్సాహికుడొకరు సొంతం చేసుకున్నారు. ఇదొక ప్రపంచ రికార్డు. పిట్ట ఈకకు ఈ స్థాయిలో ధర పలకడం చరిత్రలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్లోని మవోరీ ప్రజలకు హయియా పక్షిని దైవంగా భావిస్తారు. వారి తెగ పెద్దలు తలపై ఈ పక్షి ఈకలను తలపై కిరీటంగా అలంకరించుకొనేవారు. ప్రజలు బహుమతులుగా ఇచి్చపుచ్చుకొనేవారు. ఈకల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. హుయిమా పక్షలు దాదాపు అంతరించిపోయాయి. చివరిసారిగా 1907లో కనిపించినట్లు నిర్ధారణ అయ్యింది. -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్గఢ్కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్గఢ్లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
శివరాత్రి పూజలో పాల్గొన్న పిచుక్క
-
నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్ట.. అందుకే అంత స్పెషల్
పాల పిట్ట చుట్టూ ఎన్ని కథలో.. పసిడి పంటల్లే పచ్చని రంగునలుముకుంది, ఆకాశమళ్లే నీలి రంగు పులుముకుంది,అశ్వినీ మాసంలో అడుగులెడుతుంది,శుక్ల పక్షంలోశోభనిస్తుంది..పంటచేనుల్లో పరుగులెడుతుందివిజయ దశమికి విజయాలనిస్తుంది! ప్రపంచానితో పోటీ పడనంటుంది,నాగరికతతో నగరాలకు దూరమవుతుంది. అందాల హరివిల్లై విశ్వమంతా విస్తరించింది.పసిడి పరువాల విహంగం అద్భుతాల పాల పిట్ట !! దసరా రోజు.. పాలపిట్టను చూడకుంటే ఆ పండగకు అర్థమే లేదని చిన్న వెలతి ఉంటుంది. దాని ప్రత్యేకత అలాంటిది మరి! ఓటమి మీద గెలుపుకు నిదర్శనంగా చేసుకునే దసరా పండగ రోజు పాల పిట్టను చూస్తే ఎన్నో విజయాలతో పాటు సుఖ సంతోషాలు వరిస్తాయని అంటారు. అంటే పక్షులు కేవలం ప్రకృతిలో ఉండే ఒక జీవ రాశి మాత్రమే కాదు అవి మనుషుల జీవన విధానాలతో సంప్రదాయాలతో మమేకమై ఉంటాయి అన్నదానికి పాల పిట్ట ఒక ఉదాహరణ.అలాగని ఇది ఒక్క భారత దేశంలోనే కనిపించే పక్షి కాదు. కెనడా, అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన పసిడి, నీలం లాంటి రంగుల కలయికతో కనిపిస్తుంది. భారత దేశంలో పాల పిట్టకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిచుట్టూ ఎన్నో వింతలు, విశేషాలు కూడా ముడిపడి ఉన్నాయి. పాలపిట్టతో మనిషికి యుగయుగాల సంబంధం ఉందంటే విడ్డూరమే కదా? కానీ ప్రతి యుగంలోనూ, పురాణ, ఇతిహాసాల్లో పాల పిట్ట ప్రస్తావన ఎదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది.దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాల పిట్టను నీల కంఠ పక్షి అని పిలుస్తారు(నీల కంఠ అంటే శివుడికి ఉన్న మరో పేరు) దాని గొంతు విషం తాగిన తర్వాత మారిన శివుడి గొంతు (నీలం) రంగులో ఉండటమే కారణం. అలాగే త్రేతా యుగంలో రాముడు రావణాసురుని మీద యుద్దానికి వెళ్లే ముందు పాల పిట్ట ఎదురు వచ్చిందట. అందుకే రాముడు రావణాసురుడిని చంపిన రోజు చెడు మీద మంచి విజయం సాధించిన రోజుకి ఆదర్శంగా దసరాగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అయ్యింది. అదే రోజు పాల పిట్టలు ఎక్కడ ఉన్నా గ్రామాల్లోని పంట చేన్లలో, ఊరి పొలిమేరల్లో తిరగడం జరుగుతుంది. అశ్విని మాసంలో (అక్టోబర్ నెల) లో పంటలు చేతికి వచ్చే కాలం, అదే సమయంలో నవరాత్రులు, దసరా పండగలు జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఈ పాల పిట్టలు ఆహారం కోసం ఆ సమయాల్లో ఊర్లలో పంట పొలాల్లో కనిపిస్తాయి. పండగలు వాటి ప్రత్యేకతలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే.ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు వారి ఆయుధాలన్నీ జమ్మీ చెట్టు మీద దాచి ఉంచుతారు. అప్పుడు ఇంద్రుడు పాల పిట్టలా మారి ఆ చెట్టు మీద పాండవుల ఆయుధాలకు రక్షణగా ఉన్నాడు అని కూడా చెప్పుకుంటారు. అందుకే దసరా రోజు ఆయుధ పూజ అంటే అన్ని కుల వృత్తుల వారు వారి వారి జీవన ఆధారాలకు సంబందించిన వాటికి పూజలు చెయ్యడం కూడా జరుగుతుంది. ఇలా ఒక్కో యుగంలో ఒక్కో ప్రాంతానికి చెందిన సంప్రదాయాలతో ఒకే నెలలో జరిగే పండుగలకు పాల పిట్టకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే పాల పిట్ట అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు అది మనుషుల సాంఘిక సమైక్యతను ప్రతిబింబిస్తుంది. ఒక భావోద్వేగం. పాల పిట్ట జీవన విధానం మనకు ఒక చిన్నపాటి పాఠం లాంటింది దాన్ని నిశితంగా పరీక్షిస్తే అది ఉదయం లేవగానే దాని చుట్టూ ఉన్న పరిస్థితులపైన నిఘా వేస్తుంది. ఎలాంటి అపాయాలు పొంచి ఉన్నాయి, అది నివసించే ప్రాంతం సురక్షితంగా ఉంటుందా? ఉండదా? అని విశ్లేషించుకుంటుంది. దాని పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది కానీ అవసరానికి అది దాని పరిమాణం రెండింతలు రెట్టింపు చేస్తుంది. పాల పిట్టలు ఎప్పుడు కూడా ఒక సమూహంలో ప్రయాణం చేస్తాయి అందువల్ల మిగతా బలవంతమైన పక్షులు దాడి చేసినప్పుడు కలిసి కట్టుగా పోరాడుతాయి. మనుషులు కూడా సామాజిక సాంఘిక జీవితంలో సంఘటితమై జీవించాలని అప్పుడే ఎలాంటి కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా నిబడొచ్చు అని మనకు చూపిస్తాయి. పాల పిట్టల గొంతు దూకుడుగా ఉన్నా ఒకదానితో ఒకటి ఎంతో మృదు స్వభావంతో పలకరించుకుంటాయి. అందుకే పాల పిట్టలు నమ్మకానికి ఐక్యమత్యానికి ప్రతీకలు. ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా నెల మీద వాటి ఆహారం మీద దృష్టిని మాత్రం పోగొట్టుకోవు. వాటి కంటి చూపు చాలా సూక్షమైన క్రిమి కీటకాలను కూడా గుర్తిస్తాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న వాన పాములు వీటి ఆహారం. చెట్లు వీటి ప్రాథమిక నివాస స్థలాలు అందుకే ఇవి ఎక్కువగా అడవుల్లో ఉద్యానవనాల్లో నివసిస్తాయి ఆహారం కోసం నీటి పరివాహక ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. పక్షులు మన చుట్టూ కనిపించకపోవడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఒక్కటే గుర్తొస్తుంది. కానీ అవి అంతరించిపోతున్నప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని మనుషుల జీవన ప్రమాణాలు కూడా మెల్లి మెల్లిగా అంతరించి పోతున్నాయనే విషయం చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో విరివిగా విచ్చల విడిగా, చిన్న చిన్న నగరాలలోని ఉద్యానవనాల్లో చెట్ల మీద కనిపించిన పాల పిట్ట ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో కనిపిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతున్నాం. మరికొంత మంది వీటిని పంజరాల్లొ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అంటే దానికున్న ప్రత్యేకతలు అలాంటివి. అలాగే మనం నాగరిత ముసుగులో అడవులను, చెట్లను దూరం చేస్తూ వాటి మీద ఆధారపడుతున్న పక్షులను జంతువులను కూడా దూరం చేసుకుంటున్నాము. రచయిత : ప్రదీప్ మాడురి ఫోటో : అల్బిన్ జాకబ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
పురిటి కోసం విదేశాల నుంచి వస్తున్న పక్షులు.. ఎక్కడో తెలుసా?
తేలినీలాపురం.. సైబీరియా పక్షుల విడిది కేంద్రం. పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం. అల్లంత దూరం నుంచి పక్షులను చూడడం, చెట్టుపై వాలిన వాటి అందాలు గమనించడం సహజం. అవే పక్షులను దగ్గరగా చూస్తే..? వాటి ఆహారం, ఆహార్యం, అలవాట్లను తెలుసుకోగలిగితే..? చింత, రావి, తుమ్మ, గండ్ర, వెదురుపై వాలే అతిథి విహంగాల జీవన క్రమాన్ని అర్థం చేసుకోగలిగితే..? ఎంత బాగుంటుందో కదా. ఆ సరదాను తీర్చడానికి తేలినీలాపురంలో పక్షుల మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆహార అన్వేషణ, ఆవాసాలపై జీవించే క్రమంలో ఆయా పక్షుల ప్రత్యేకతలను వివరంగా తెలియజేస్తూ పక్షుల బొమ్మలను ఏర్పాటు చేశారు. పెలికాన్ పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు సుమారు 14 సెంటీమీటర్లు. దీని రెక్కల పొడవు సుమారు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకే సారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాశంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు. ప్రతీ సీజన్కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి. రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. పెయింటెడ్ స్టార్క్ పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు. ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 సంవత్సరాలు కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 సంవత్సరాలు. 120 రకాల పక్షుల్లో కొన్నింటి ప్రత్యేకతలు.. పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది. పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాశంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది. నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. మ్యూజియం చూసొద్దామా... టెక్కలి సమీపంలోని తేలినీలాపురంలొ ఈ మ్యూజియం ఉంది. ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఎంత దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది. రవాణా: టెక్కలి వరకు రైలు సదుపాయం ఉంది. బస్సు సదు పాయం కూడా ఉంది. టెక్కలి నుంచి పూండి మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి బస్సులు, ఆటోలు కూడా ఉన్నాయి. సందర్శనీయ వేళలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
అత్యంత పోషక విలువలు కలిగిన కౌజు పిట్టలు..!
-
జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
అత్యంత ఖరీదైన కాఫీ..తయారీ విధానం తెలిస్తే..షాకవ్వడం ఖాయం!
కాఫీ గుమగుమలు ముక్కు పుటలకు తాకగానే అబ్బా అనేస్తాం. పొద్దున్నే ఓ కప్పు కాఫీ పొట్టలో పడితే గానీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించదు. అలాంటి కాఫీ ప్రియులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ ఉందని తెలుసా!. ఐతే దాన్ని ఎలా తయారచేస్తారో వింటే మాత్రం..ఛీ యాక్ అంటారు. కానీ ఆ కాఫీ చాలా రుచిగా ఉండటానికి కారణం వాటివల్లనేట. ఆ కాఫీ తయారయ్యే విధానం తెలిస్తే మాత్రం..అమ్మబాబోయ్! అంటూ జోలికి వెళ్లే సాహసం చేయలేం. విచిత్రం ఏంటంటే ఆ కాఫీకి ఉన్న డిమాండ్ చూస్తే వామ్మో! అంటారు. కోపి లువాక్ లేదా సివెట్ కాఫీ ప్రంపచంలోనే అత్యంత ఖరిదైన కాఫీగా ప్రసిద్ధిచెందింది. దీన్ని ఎలా తయారు చేస్తారో వింటే మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం నిశబ్దంగా ఉండిపోతాం. దీని ధర ట్యాగ్ వెనుకు ఉన్న రహస్యం తెలుసుకుంటే షాకవ్వడం గ్యారంటీ. ఎలా తయారు చేస్తారంటే.. కోపి లువాక్ అనే కాఫీ ఇండోనేషియా, సుమత్రా, జావా, బాలి నుంచి ఉద్భవించింది. ఇది కాఫీ చెర్రీస్ అనే పండ్ల నుంచి తయారవ్వుతుంది. అయితే ఆ పండ్లను సేకరించి నేరుగా తయారు చేసేయ్యరు. ఆ కాఫీ చెర్రీలను పునుగు పిల్లి(ఆంగ్లంలో (సివెట్) అనే పిల్లి జాతి క్షీరదం తింటుందట. ఆ తర్వాత వాటి గింజలను విసర్జిస్తుతుంది. కాఫీ ఉత్పత్తిదారులు అది విసర్జించిన గింజలను సేకరించి ఈ కాఫీని తయారు చేస్తారు. నిజానికి ఈ కాఫీ చెర్రీలు చాలా చేదుగా ఉంటాయి. వాటిని ఈ పునుగు పిల్లులు తినడంతో వాటి కడుపులోని ఎంజైమ్లు బీన్స్ నేచర్ని మారుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే వాటి చేదు గుణాన్ని తగ్గించి వాటిని రుచిగా మారుస్తాయి. ఈ సహజ కిణ్వనప్రక్రియే కోలి లువాక్ అనే కాఫీ రుచికి ప్రధాన కారణమట. సేకరించిన పునుగు పిల్లి విసర్జకాలు ఎందుకింత ఖరీదంటే.. ఈ కాఫీ ఎందుకింత ఖరీదైందిగా పేరుగాంచిందంటే ఈ కాఫీ బీన్స్ సంప్రదాయంగా పండించడానికి బుదులుగా ఈ సివెట్(పునుగు పిల్లుల) రెట్లను సేకరించడం ద్వారానే తయారవ్వుతుంది కాబట్టి. ఉత్పత్తిదారులకు ఇది అధిక ఖర్చులకు దోహదం చేసే అంశం. ఇక సివెట్ తక్కువ మొత్తంలో ఈ కాఫీ చెర్రీలనే విసర్జిస్తాయి. దీంతో పరిమిత స్థాయిలోనే సరఫరా ఉండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. పునుగు పిల్లి విసర్జక పదార్థాలతో తయారవుతుందనే దృష్ట్యా ఈ కాఫీపై పలు విమర్శలు కూడాఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ తాగాలనుకునేవారికి ఈ కాఫీ ఒక స్టేటస్ ఆఫ్ సింబల్గా ఉంటుంది. ఈ కాపీ తయారీ కోసమనే ఈ పునుగు పిల్లలను బంధిస్తున్నారని జంతుప్రేమికుల నుంచి విమర్మలు కూడా ఉన్నాయి. ఈ కోపీ లువాక్ కాఫీ ఖరీదు, విలక్షణమైన తయారీ విధానం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుందట. (చదవండి: మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..) -
Twitter Blue Bird Auction: ట్విటర్ వేలానికి ఉంచిన వస్తువులు ఇవే.. (ఫొటోలు)
-
ట్విటర్ పిట్టను కొంటారా?
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ఎక్స్ (ట్విటర్)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్ మస్క్. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్ లోగోతోపాటు పేరునూ మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్ అక్షరం ‘ఎక్స్’ వచ్చేసింది. తాజాగా ట్విటర్లోని పాత విలువైన జ్ఞాపకాలను మస్క్ వేలానికి పెట్టనున్నారు. వీటిలో ట్విటర్ ప్రధాన కార్యాలయంపై పిట్ట బొమ్మతో ఉన్న సైన్బోర్డ్ కూడా ఉండనుంది. ట్విటర్ను ఎక్స్ పేరిట రీబ్రాండ్ చేసిన కొన్ని రోజుల్లోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం 584 లాట్లను వేలానికి తీసుకురానుండగా వీటిలో ట్విటర్ బర్డ్ కాఫీ టేబుల్, భారీ పంజరం, స్టూళ్లు, టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఉపకరణాలు, సంగీత పరికరాలు, నియాన్ ట్విటర్ లోగో, హ్యాష్ట్యాగ్ గుర్తు వంటివి ఉన్నాయి. కాగా ఈ వేలానికి ‘ట్విటర్ రీబ్రాండింగ్ : ఆన్లైన్ ఆక్షన్ ఫీచరింగ్ మెమోరాబిలియా, ఆర్ట్, ఆఫీస్ అసెట్స్ అండ్ మోర్’ అని పేరుపెట్టారు. ఉపకరణాలు, వస్తువులతోపాటు ప్రముఖుల నుంచి వైరల్ అయిన వారి ఆయిల్ పెయింటింగ్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. ఈ కళాకృతులలో చిరస్మరణీయమైన 2014 ఆస్కార్స్ ఎల్లెన్ డిజెనెరెస్ సెల్, సెలబ్రిటీ ట్రిబ్యూట్ ట్వీట్ల ఆకర్షణీయమైన ఫోటో మొజాయిక్ ఉన్నాయి. 2012 నవంబర్లో తిరిగి ఎన్నికైన తర్వాత అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన ట్వీట్కు సంబంధించిన చిత్రం కూడా ఇందులో ఉంది. ఈ ప్రత్యేక ట్వీట్ అప్పట్లో అత్యధిక లైక్లు పొందిన ట్వీట్గా గుర్తింపు పొందింది. ఇదీ చదవండి: ట్వీట్లతో రెచ్చిపోండి.. యూజర్లకు మస్క్ బంపరాఫర్ వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రకారం, ప్రతి లాట్కు ప్రారంభ బిడ్ 25 డాలర్లు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన బిడ్డింగ్ సెప్టెంబర్ 12న ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ట్విటర్ బర్డ్ లోగో శాన్ఫ్రాన్సిస్కోలోని స్ట్రీట్-10లో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయ భవనానికి ఇంకా అలాగే ఉంది. దీనిని గతంలో తొలగించాలని ప్రయత్నించినా.. శాన్ఫ్రాన్సిస్కో అధికారులు అడ్డుకొన్నారు. దీంతో ట్విటర్ హెడ్క్వార్టర్స్పై ఉన్న పిట్ట బొమ్మను వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తే అధికారుల అనుమతి పొంది తరలించుకోవాలని వేలం వివరాల్లో పేర్కొన్నారు. 🔊 Did you miss the first #Twitter #auction? Here is your chance to participate! 👉 https://t.co/rtN7izBGPI#DontMissOut 👀 #X #TwitteRebrand #TwitterRebranding #TwitterAuction #HGP #HGPAuction $HGBL #AssetManagement #Reuse #OnlineAuction #ShoppingOnline pic.twitter.com/m5lvJjfToF — HGP Auction (@HGP_Auction) August 7, 2023 -
బుజ్జి పిట్ట జీవితంలో ఇంజినీరింగ్ + ఎమోషన్
-
మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!
బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తికి తన పొరుగింటిలో నుంచి ఒక మహిళ కేకలు వినిపించడంతో అతను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఎస్ఎక్స్ పోలీసులు కాన్వే ద్వీపంలోని స్టీవ్వుడ్ ఇంటికి మూడు పోలీసు వాహనాలను పంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కాన్వే ద్వీపంలో ఉంటున్న స్టీవ్వుడ్స్ గత 21 ఏళ్లుగా పక్షులను పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర పలు రకాల పక్షులు ఉన్నాయి. వుడ్ బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం తన వద్ద ఉన్న పక్షులు సాధారణంగా ఉదయం వేళ అరుస్తుంటాయన్నారు. అయితే తన దగ్గర ఫ్రెడీ అనే రామచిలుక ఉన్నదని, దానిలో అత్యధికంగా హార్మోనులు విడుదలవుతాయని, అప్పుడు అది గట్టిగా అరుస్తుందని తెలిపారు. పోలీసులు రాగానే తాను కంగారు పడిపోయాయని, తాను ఏమి తప్పు చేశానని వారిని అడిగానని అన్నారు. అప్పుడు వారు ఈ ఇంటిలో నుంచి ఒక మహిళ అరుపులు వినిపించాయని తమకు ఫిర్యాదు అందిందని, అందుకే వచ్చామని, ఇంటిని తనిఖీ చేస్తామని తెలిపారు. వారు తనిఖీ చేసి, అంతా సవ్యంగానే ఉందన్నారు. అప్పుడు తాను అసలు విషయం చెప్పానని, అది రామ చిలుక అరుపు అని వివరించానన్నారు. తన పొరుగింటిలోని వ్యక్తి పోలీసులకు ఫోను చేయడం మంచిదే అయ్యిందని, పోలీసుల తనిఖీతో తన తప్పేమీ లేదని అందరికీ అర్థం అయ్యిందని వుడ్స్ తెలిపారు. ఇది కూడా చదవండి: టూత్పేస్ట్ ట్యూబ్తో నీళ్లు పడుతున్న మహిళ.. మెచ్చుకుంటున్న జనం! -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!
ఎలాన్ మస్క్ ట్విటర్లో మరో మార్పు చేశాడు. ఈ సారి లోగోపై పడ్డాడు. ఇప్పటి వరకూ ఉన్న పక్షి (బ్లూబర్డ్) లోగోను పీకేసి దాని స్థానంలో కుక్క (డాగీ) లోగోను పెట్టాడు. అయితే ఇది మొబైల్ యాప్లో కాదులెండి.. డెస్క్టాప్ వెర్షన్లో మాత్రమే ఇలా చేశాడు. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) pic.twitter.com/wmN5WxUhfQ — Elon Musk (@elonmusk) April 3, 2023 ట్విటర్ వెబ్సైట్లో హోం బటన్గా ఉన్న ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో స్థానంలో డాగీ కాయిన్ (Dogecoin) క్రిప్టోకరెన్సీ లోగోకు చెందిన డాగ్ మీమ్ ప్రత్యక్షమైంది. ఏప్రిల్ 3న దాన్ని గమనించిన యూజర్లు అవాక్కయ్యారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ డాగీ కాయిన్ లోగోలో ఉపయోగించిన డాగీ (షిబా ఇను డాగ్) చిత్రం చాలా కాలంగా అనేక వైరల్ మీమ్స్లో కనిపిస్తోంది. (జొమాటో డెలివరీ పార్ట్నర్స్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు!) ట్విటర్ లోగో మార్పుపై ఎలాన్ మస్క్ తనదైన శైలిలో ఓ హాస్యభరితమైన మీమ్ను జోడిస్తూ ట్విటర్లో షేర్ చేశారు. అలాగే 2022 మార్చి 26 నాటి తన ట్విటర్ చాట్ స్క్రీన్షాట్ను కూడా పంచుకున్నారు. అందులో ఓ అజ్ఞాత యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను ‘డాగ్’గా మార్చమని అడగ్గా దానికి మస్క్ సరే అని బదులిచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్లు ఆ స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) క్రిప్టోకరెన్సీ డాగీకాయిన్కు మద్దతుగా పిరమిడ్ స్కీమ్ను నిర్వహిస్తున్నారని ఎలాన్ మస్క్పై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు వ్యాజ్యాలు సైతం దాఖలయ్యాయి. మస్క్ ట్విటర్ లోగోను డాగీ లోగోగా మార్చిన తర్వాత డాగీకాయిన్ విలువ 20 శాతం వరకు పెరిగింది. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 -
వెరీ ఇంట్రెస్టింగ్.. తేనెను మాత్రమే తిని జీవించే పక్షి.. ప్రత్యేకతలివే..
పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): విమాన వేగంతో ఆకాశంలో నిరంతరం సంచరిస్తూ నల్లమల అభయారణ్యంలోని పక్షి జాతులకు మకుటం లేని మహారాజులు ఈ గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై నిరంతర నిఘాతో ఆకాశం నుండే ఆహారాన్ని గుర్తించి, క్షణంలోనే దానిపై వాలి సేకరించటం ఈ పక్షుల ప్రత్యేకత. గద్ద జాతిలో అరుదైన గద్ద హనీ బజార్డ్. తేనెను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించే ఇటువంటి ప్రత్యేక ఆహారపు అలవాట్లు కలిగిన హనీ బజార్డ్ గద్దపై ప్రత్యేక కథనం.. అభయారణ్యంలోని క్రిమి కీటకాలు, వన్యప్రాణుల కళేబరాలు, పెరుగుతున్న పాముల సంతతి తదితర వాటిని నియంత్రిస్తూ ఎప్పటికప్పుడు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతున్న గద్దలు ప్రకృతిలో ఎంతో ముఖ్యమైనవి. నల్లమల అభయారణ్యంలో నైతిక ధైర్యంతో మిగతా జీవులకు ఆదర్శంగా నిలిచే గద్దల జీవనశైలి ఎంతో ముఖ్యమైనది. నల్లమలలో క్రెస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్, క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్, శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ లాంటి గద్ద జాతులు సంచరిస్తుంటాయి. పర్యావరణాన్ని సంరక్షించే గద్ద జాతులు: నల్లమల అభయారణ్యంలో ఎన్నో రకాల వన్యప్రాణులతో పాటు, ఆకాశంలో సంచరించే పక్షి జాతులు కూడా ఎక్కువే. పక్షి సంతతిలో అత్యంత ముఖ్యమైనవిగా ప్రాచుర్యం పొందిన గద్దలు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి వాతావరణాన్ని సమతుల్యంగా ఉండేందుకు దోహద పడుతున్నాయి. ప్రకృతిలో ఎక్కువవుతున్న పాములు, క్రిమి కీటకాలు, మిడతలు, కుందేళ్లు తదితర వాటిని ఆహారంగా తీసుకోవటంతో పాటు నల్లమలలో జంతువులు వేటాడిన మృతకళేబరాలను భక్షిస్తూ ఎప్పటికప్పుడు నల్లమలను స్వచ్ఛంగా ఉంచేందుకు దోహద పడుతున్నాయి. సహజంగా మాంసాహార జాతులైన గద్దలు కొనతేలిన ముక్కు, పొడవైన రెక్కలతో, ఎంత బరువున్న ఆహారాన్నైనా సునాయాసంగా తీసుకెళ్లే నైపుణ్యం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా క్రిస్టడ్ సర్పెంటీగల్, షార్ట్టౌడ్ స్నేక్ ఈగల్లు దట్టమైన అభయారణ్యంలోని గడ్డి మైదానాలను, ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పాములను గుర్తించి వాటిని గురి చూసి వేటాడటం వీటి ప్రత్యేకత. క్రెస్టడ్హార్డ్ ఈగల్, బోనెల్లీస్ ఈగల్లు అభయారణ్యంలోని కుందేళ్లను ఎక్కువగా వేటాడి చంపుతుంది. ఒక్కో సారి గొర్రెలు, మేకల పిల్లలనుసైతం అవలీలగా ముక్కున కరుచుకుని పోయేటంత బలం వీటికి ఉంటుంది. శిఖర, బ్లాక్ షోల్డర్ కైట్, బ్లాక్ ఈగల్ తదితర రకాల గద్దలు మాత్రం మిడతలు, తొండలు, కీటకాలను ఆహారంగా తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తాయి. నల్లమలలో సంచరించే గద్దలపై శ్రీశైలం ప్రాజెక్టు బయోడైవర్సిటీలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. నైతిక ధైర్యానికి నిదర్శనం: సహజంగా 70 ఏళ్ల పాటు జీవించే గద్దలకు 40 ఏళ్లు వచ్చే సరికి ఎన్నో జీవన్మరణ సమస్యలు ఎదురవుతాయి. ఆ సమయంలోనే అవి ఎంతో మానసిక స్దైర్యంతో తమ సమస్యను ఎదుర్కొని పునర్జన్మ ఎత్తి మరో ముప్పై ఏళ్ల పాటు జీవిస్తాయి. సాధారణంగా పొడవుగా, వాడిగా, పదునుగా ఉండే దాని ముక్కు నిరంతర రాపిడి వల్ల అరిగిపోతుంది. వాడిగా, పొడువుగా ఉండి సులభంగా ఒంగి ఆహారాన్ని తీసుకు పోయేందుకు ఉపకరించే కాలిగోళ్లు సైతం తమ సామరాధ్యన్ని కోల్పోతాయి. దీంతో పాటు పెరిగిన వయసు వల్ల బరువైన రెక్కలు, దట్టమైన ఈకలు దాని గుండెకు హత్తుకు పోయి ఎగరటంలో కష్టాన్ని కలిగిస్తాయి. దీంతో నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్న గద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని శరీర పునర్నిర్మాణాన్ని చేపడతాయి. ఆ క్రమంలో అవి ఎత్తైన పర్వతాల మీదకు చేరుకుని అక్కడ కొండ రాళ్లకు తన ముక్కును ఢీకొడుతూ దాన్ని రాల్చి కొత్త ముక్కు వచ్చేంత వరకు వేచి ఉంటాయి. కొత్త ముక్కు రాగానే దాని సహాయంతో దాని పాత రెక్కలను పీకేసి కొత్త రెక్కలు వచ్చే వరకు వేచి ఉంటాయి. ఇలా ఐదు నెలల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని నైతిక ధైర్యంతో దాని జీవిత కాలాన్ని మరో 30 ఏళ్లు వరకు పొడిగించుకుంటాయి. తేనె మాత్రమే తినే హనీ బజార్డ్ నల్లమల అభయారణ్యంలో మిగతా గద్దలకు విభిన్నంగా తేనెను మాత్రమే సేవించి తమ జీవనాన్ని గడిపే గద్దలు ఉన్నాయంటే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది. అలా జీవించే గద్దలే హనీ బజార్డ్. వీటి జీవనశైలి ఎంతో విచిత్రమైంది. ఇవి నల్లమల అభయారణ్యం యావత్తూ ఆకాశంలో సంచరిస్తుంటాయి. వీటి ప్రయాణంలో ఎక్కడైనా తేనె తుట్టెలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అవి అక్కడ వాలి తేనెను సేకరిస్తుంటాయి. ఈ క్రమంలో అవి వాటి భారీ రెక్కలను విసురుతూ తేనెటీగలను తరిమి వేస్తాయి. ఆకాశం గుండా సంచరిస్తూ ఎంత దూరంలోని తేనె తుట్టలనైనా గుర్తించటం హనీ బజార్డ్ల ప్రత్యేకత. ఇవి తేనె తప్ప మిగతా ఎటువంటి ఆహారాన్ని ఇష్టపడవు. చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్లో.. ఆ గద్దకు తేనే ఆహారం హనీ బజార్డ్లు తేనెను మాత్రమే తాగి జీవించే గద్దజాతి పక్షులు. అభయారణ్యంపై సంచరిస్తూ ఎక్కడ తేనె నిల్వలు ఉన్నా అక్కడ వాలి తేనెను సేకరించటం వీటి ప్రత్యేకత. కొన్ని గద్ద జాతులు పాములు, సరీసృపాలు, కీటకాలను భక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంటాయి. గద్దలు నైతిక ధైర్యానికి ప్రతీకలు. ఇవి జీవితంలో కఠినమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాయి. – షేక్ మహమ్మద్ హయాత్, ఫారెస్టు రేంజి అధికారి, శ్రీశైలం బయోడైవర్సిటీ. -
బుల్లిపిట్ట.. ప్రపంచ రికార్డు.. నాన్స్టాప్గా 13,560 కిలోమీటర్ల ప్రయాణం
ఒక బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్స్టాప్గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్ టెయిల్డ్ గాడ్విట్ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్ తీరం నుంచి గతేడాది అక్టోబర్ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్సాన్స్ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది. – సాక్షి, అమరావతి బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా.. అలాస్కాలో బార్ టెయిల్డ్ గాడ్విట్ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్లో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్ శాటిలైట్ ట్రాన్స్మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉంది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు. కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు తమ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అనవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించుకున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలులు వీచే వరకు ఎదురు చూశాయి. అన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఎగరడం ప్రారంభించాయి. ఆడ పక్షులే పెద్దవి.. ► బార్ టెయిల్డ్ గాడ్విట్ల రెక్కలు పెద్దగా విప్పి ఎగురుతాయి. ► నీటిపై తేలేందుకు వీలుగా వీటి శరీర అమరిక ఉండదు కాబట్టి సముద్రంలో విశ్రాంతి కోసం ఆగలేవు. ► ఈ పక్షులు 37 నుంచి 41 సెంటీమీటర్ల పొడవుంటాయి. ► మగ పక్షుల కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. మగవి 190 నుంచి 400 గ్రాములు, ఆడవి 260 నుంచి 630 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ► ఇవి సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి ప్రాంతాల్లో వేట సాగిస్తూ.. నీటి పురుగులు, నత్తల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. బీ6 ప్రయాణమిలా.. ► ఇది తొలుత హవాయికి పశ్చిమ దిశగా ఎగరడం ప్రారంభించింది. ► అక్టోబర్ 19న పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటి మీదుగా ప్రయాణించింది. ► దాదాపు రెండు రోజుల తర్వాత సిడ్నీకి దగ్గరగా ఎగిరింది. ► న్యూజిలాండ్ మీదుగా అక్టోబర్ 25న టాస్మానియా తీరానికి చేరింది. ► గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. ► అంతదూరం ఈ చిన్న పక్షి ఒంటరిగా ప్రయాణించిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ► అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఒక వయసుకు రాగానే సాధారణంగా ఈ జాతి పక్షులు గుంపుగా బయలుదేరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వైపుకు వలస వెళుతుంటాయి. ► కానీ ఇప్పుడు తక్కువ వయసున్న పక్షులు పెద్ద పక్షుల నుంచి విడిపోయి దక్షిణ దిశగా సుదూరంగా ప్రయాణించాయి. ► 2020లో ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు 12,200 కి.మీ. ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. -
Alexander Zverev: టెన్నిస్ స్టార్కు వింత అనుభవం..
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్కు వింత అనుభవం ఎదురైంది. సీరియస్గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకాశంలో ఒక పిట్ట.. పోతూ పోతూ అతని తలపై రెట్ట వేసింది. ఒక్కక్షణం ఆగిన జ్వెరెవ్ ఏంటా అని తల నిమురుకుంటే పిట్ట రెట్ట అతని చేతులకు అంటింది. దీంతో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పక్కకు వెళ్లి తలను టవల్తో తుడుచుకొని మ్యాచ్ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు గొల్లుమని నవ్వారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలి సెట్లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ను టైబ్రేక్లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో ఖంగుతిన్నాడు. A perfect shot from the Australian Open bird 💩🤣 Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q — Eurosport (@eurosport) January 19, 2023 చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!? -
అన్స్టాపబుల్ జర్నీ.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది!
హోబార్ట్(టాస్మానియా): రాత్రిపగలు తేడా లేకుండా ఏకధాటిగా పదకొండు రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆకలి దప్పిక తీర్చుకోలేదు. పదకొండు వేల కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఓ గాడ్విట్ పక్షి. గాట్విట్(లిమోసా లప్పినోకా).. నెమలి తరహాలో ఉండే ఓ పక్షి. దానికి 234684 అనే నెంబర్తో 5జీ శాటిలైట్ ట్యాగ్ను పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగలేదు. ఆహారం, నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డులు బద్ధలు కొట్టింది. అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులపాటు ఎక్కడా వాలకుండా ముందుకెళ్లింది అది. ఈ పక్షి ప్రయాణించిన దూరం.. ఈ భూమి పూర్తి చుట్టుకొలతలో మూడో వంతు!. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత!. గతంలో 217 మైళ్ల దూరం ఇదే గాడ్విట్ సంతతికి చెందిన పక్షి విరామం లేకుండా ప్రయాణించింది. ఈ రాత్రిపగలు సుదీర్ఘ ప్రయాణంలో.. ఆ పక్షి బరువు సగం తగ్గిందని టాస్మానియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎరిక్ వోఎహ్లెర్ చెప్తున్నారు. చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్లతో ఉండే గాడ్విట్ పక్షి.. 90 డిగ్రీల యూటర్న్ తీసుకుని నేల మీద వాలే ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే.. రిస్క్తో కూడుకున్న జీవితం వీటిది. లోతైన నీటిపై గనుక అవి వాలితే.. ప్రాణాలు కోల్పోతాయి. వాటి కాళ్ల కింద భాగం నీటి తేలేందుకు అనుగణంగా ఉండదు. తద్వారా అవి నీళ్లలో పడితే మళ్లీ పైకి ఎగరలేవు. సుదీర్ఘ దూరం ప్రయాణించిన 234684 గాడ్విట్ పక్షి సముద్రాలు దాటుకుంటూ రిస్క్తో కూడిన ప్రయాణమే చేసిందని ఎరిక్ వివరిస్తున్నారు. -
బంగారు ‘బట్టమేక’ గుట్టు చిక్కింది..
క్రూర జంతువుల దృష్టిని మరల్చటంలో బట్టమేక పక్షులు బహుతెలివైనవి. గుడ్లను, పిల్లలను కాపాడుకోవటానికి ఆడ పక్షులు వంకర టింకరగా.. ఒక రకమైన నాట్యం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బట్టమేక పక్షుల్లో 22 రకాల జాతులు ఉండగా.. భారత్లోని బంగారు బట్టమేక పక్షులు అత్యంత అరుదైనవి. వీటిలోనూ నాలుగు జాతులు ఉండగా.. ఏపీలో సంచరించే బంగారు బట్టమేక పక్షులే అతి పెద్దవి.. బలిష్టమైనవి. ఈ పక్షులు అవకాశవాద భక్షులు. అంటే తాము నివసించే ప్రాంతంలో ఏవి దొరికితే వాటిని తిని బతికేస్తాయి. అయినా.. వీటి మనుగడకు అనువైన పరిస్థితులు లేక అతి త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేరాయి. సాక్షి, అమరావతి: పొడవాటి తెల్లటి మెడ, బంగారు లేదా గోధుమ వర్ణంలో వీపు, మెడలో తెలుపు–నలుపు ఈకల హారం, తలపై నల్లని టోపీతో బట్టమేక పక్షులు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రపంచంలోనే అరుదైన బట్టమేక (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షులు మన రాష్ట్రంలో 180 వరకూ ఉన్నట్టు గుర్తించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇవి సంచరిస్తుంటాయి. బట్టమేక పక్షులు ఏపీతోపాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇవి సంచరిస్తుంటాయి. సుమారు మీటరు పొడవు, 14 నుంచి 15 కేజీల బరువు ఉంటాయి. ఏపీలో సంచరించే బట్టమేక జాతి పక్షులే వీటన్నింటిలోనూ పెద్దవి, బలిష్టమైనవి కూడా. ఎగిరే పక్షుల్లో దేశంలో మొదటి, ప్రపంచంలో రెండవ అతి భారీ పక్షులివి. గడ్డి భూముల్లో సంచరించే ఈ పక్షులు 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి గుడ్లుపెట్టి.. 25–30 రోజులపాటు పొదుగుతాయి. తమకు సమీపంలో ఎలాంటి ఆహారం లభ్యమైనా తిని జీర్ణించుకోగలవు. సాధారణంగా ఇవి కీటకాలు, తొండలు, బల్లులు, చిన్నపాటి పాములు, పండ్లను తిని జీవిస్తాయి. మగ పక్షుల కంటే ఆడ పక్షులు చిన్నవిగా ఉంటాయి. ఇవి సుమారు 75 సెంటీమీటర్ల పొడవు, 4–6 కేజీల బరువు ఉంటాయి. ఆడ పక్షులు ఊదా రంగు తల, మెడతో ఉంటాయి. వీటి రొమ్ముపై పట్టీ ప్రస్ఫుటంగా కనిపించదు. అంతరించిపోతున్న జీవులుగా.. అంతరించిపోతున్న బంగారు బట్టమేక (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) పక్షుల పరిరక్షణ కోసం 1988లో నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షుల సంరక్షణ కోసం 600 హెక్టార్ల భూమిని అభయారణ్యంగా ప్రకటించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా సుంకేçశుల జలాశయం సమీపంలోనూ మరో 800 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడే బట్ట మేక పక్షులు సంచరిస్తుంటాయి. ఇవి తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. మన రాష్ట్రంలో కేవలం 180 పక్షులు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఇవి కీలకం అభయారణ్యానికి సమీపంలోని గడ్డి భూములు పంట పొలాలుగా మారడంతో ఈ పక్షుల ఆవాస ప్రాంతాలు తగ్గిపోయాయి. పురుగు మందుల వాడకంతో బట్టమేక పక్షుల ఆహారమైన కీటకాలు విషతుల్యమవడం, నక్కలు ఇతర జంతువులు వాటి గుడ్లు, పిల్లలను తినడం వంటి కారణాలు ఈ పక్షుల ఉనికికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయి. పర్యావరణంలో ముఖ్య భూమిక పోషించే గడ్డి భూముల పరిస్థితిని బట్టమేక పక్షుల ఉనికి తెలుపుతోంది. ఈ పక్షుల సంచారం బాగుందంటే గడ్డి భూముల పర్యావరణం బాగున్నట్టు లెక్క. అందుకే పర్యావరణ వ్యవస్థలో కీలకమైన వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అరుదైన పక్షులను అంతరించిపోకుండా కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రకృతిని కబళిస్తున్న పురుగు మందులు, ఎరువులను తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. తద్వారా మన పరిసరాలు, ప్రకృతిని కాపాడుకుని భావితరాలకి బంగారు బట్టమేకని బహుమతిగా అందిద్దాం. – డాక్టర్ సీఎం సంతోష్కుమార్, స్కూల్ ఆఫ్ బయో సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూకే (నేటివ్ ఆఫ్ నంద్యాల) -
ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు
సాక్షి, విశాఖపట్నం(తగరపువలస): సైజులో పిడికిడంత అయినా రుచిలో కముజు(కౌజు) పిట్టకు నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు అంటారు మాంసప్రియులు. నెలరోజుల వ్యవధిలోనే కోతకు వచ్చే కముజు పిట్టల పెంపకానికి పెట్టుబడి, ఖర్చూ తక్కువే. రెండింతలు ఆదాయాన్ని ఇచ్చే కముజుల పెంపకాన్ని భీమిలి మండలం పరిధిలో ఔత్సాహికులు చేపడుతున్నారు. జపాన్ బ్రీడ్ పక్షిగా పేరుపొందిన కముజుకు బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చే ఫీడ్తో పెంచవచ్చు. కొవ్వు తక్కువ, మినరల్స్, విటమిన్లు ఎక్కువగా లభించే ఈ పిట్టలో ఐరన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల మాంసానికి రుచి వస్తుంది. వీటి మాంసం మధుమేహం, రక్తపోటు అదుపులో ఉంచడానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని గుడ్డు కూడా నాటుకోడి గుడ్డు కంటే ఎన్నో రెట్లు మేలు చేస్తుందంటారు. కముజు గుడ్డు ధర రూ.2. సాధారణ, నాటుకోడి గుడ్లతో పోలిస్తే వీటి సైజు అయిదు రెట్లు తక్కువగా ఉంటాయి. పిల్ల రూ.13.. పక్షి రూ.55 ఆంధ్ర– ఒడిశా సరిహద్దులోని ఇచ్ఛాపురం ప్రాంతం నుంచి కముజు పక్షులను పెంపకందారులు తెస్తుంటారు. పిల్లగా ఉన్నప్పుడు రూ.13 వంతున కొనుగోలు చేసి తెచ్చి వీటి పెంపకాన్ని చేపడతారు. రాగులు, సజ్జలు కాకుండా బ్రాయిలర్ ఫీడ్ లేదా లేయర్ ఫీడ్ స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన తాగునీరు అందిస్తే 30 రోజుల్లోనే 200–250 గ్రాములు వచ్చి కోతకు వస్తుంది. నెల రోజుల వ్యవధిలో వీటి పెంపకానికి అయ్యే ఖర్చు రూ.20 వ్యర్థాలు పోగా ఆహారంలోకి 180–200 గ్రాములు అందుతుంది. వీటిని డిమాండ్ను బట్టి రూ.50 నుంచి 60కు విక్రయిస్తుంటారు. హోటళ్లలో జత పక్షులను రూ.250 వరకు విక్రయిస్తుంటారు. చికెన్ వెరైటీల మాదిరిగానే కముజును కూడా మసాలు లేకుండా.. మసాలాలు చేర్చుకుని కర్రీ, ఫ్రై, తండూరి, పకోడి తదితర వంటకాలు చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఎనిమిది వారాల్లోనే గుడ్లు పెట్టి 15–18 రోజుల్లోనే పిల్లలను పొదుగుతాయి. ఇంక్యుబేటర్ల ద్వారా కూడా గుడ్లను పొదిగించవచ్చు. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత చలికాలంలో బ్రూడర్ వద్ద 10 నుంచి 12 రోజులు, వేసవిలో 2 నుంచి ఆరు రోజులు ఉంచాలి. దీని వలన పక్షి ముడుచుకుపోకుండా ఎదగడానికి దోహదపడుతుంది. వీటిని మాంసం లేదా సంతతి వృద్ధి చేసినా రెట్టింపు నుంచి 10 రెట్ల లాభాలు ఆర్జించవచ్చు. కముజుల జీవితకాలం రెండేళ్లు. నాణ్యమైన మాంసం, గుడ్ల కోసం ఒక మగ పక్షికి మూడు ఆడ పక్షులు జతగా వేయాలి. వ్యాధులు తక్కువ.. మార్కెటింగ్ ఎక్కువ కముజులకు నేలమీద తేమ కారణంగా బోరకాలు వ్యాధి సోకుతుంది. వీటిని వేరుచేస్తే ఎలాంటి మందులు వాడకుండానే తగ్గుముఖం పడుతుంది. ఇంకా వీటికి ఎలాంటి వ్యాధులు సోకవు. ప్రస్తుతం ఫంక్షన్లు, హోటళ్లు, డాబాల్లో ఉండే మెనూలలో కముజుకు ప్రాధాన్యం పెరిగింది. హోటళ్లలో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పక్షుల వలన రుచి తగ్గవచ్చు కాని ఫారాల దగ్గర ఆర్డర్లు ఇచ్చి కొనుక్కుంటే పెంపకందారులకు ఆదాయం పెరగడంతో పాటు మాంసప్రియుల జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచవచ్చు. కొందరు పెంపకందారులు కోళ్లకు ఇచ్చినట్టే హార్మోన్ ఇంజక్షన్లు వీటికి కూడా ఇచ్చి త్వరగా దిగుబడి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటి రుచి కాస్త తగ్గవచ్చు. వ్యాధులు, జ్వరాలు వంటి పత్యాలు లేకుండా అందరూ అన్ని వేళల్లో తినగలిగే పక్షి ఇది. అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైనది కముజు గతంలో అంత తేలికగా దొరికేది కాదు. ఇది అన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైన మాంసాహారం. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. వీటిపై ఎలాంటి నిషేధం లేదు. బ్యాచ్ల వారీగా తరచూ ఆర్డర్లు వస్తే విక్రయదారులకు చేతినిండా ఆదాయమే. రెండేళ్ల వరకు వీటిపై లాభాలు పొందవచ్చు. మార్కెటింగ్ నైపుణ్యాలు అత్యంత అవసరం. – కోన గణేష్, తాళ్లవలస, భీమిలి మండలం -
వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు
చైనాలో అత్యంత ఘోరంగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీ ఆంక్షలను సడలించాకే అత్యంత దారుణంగా కేసులు పెరగడం అందర్నీ విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఒక పక్క ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతుంటే మరోవైపు వైద్యులు వారికి చికిత్స అందించలేక సొమ్మసిల్లి కుప్పకూలిపోతున్నారు. చైనాలో విస్తృతంగా పెరుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి కూడా. చైనా ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల ప్రకారం... ప్రస్తుతం సుమారు 37 మిలియన్ల మంది కరోన బారిన పడి ఉండవచ్చునని అంచనా వేసింది. టీకాలు సత్వరమే వేయడంలో వైఫల్యం తోపాటు ప్రజలకు వాటిపై సరైన అవగాహన కల్పించకపోవడం తదితర కారణాల రీత్యా ఈ దుస్థితిని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఒక వ్యక్తి ఒక వెరైటీ ఆకృతిలోని మాస్కోని ధరించి అందర్నీ ఆకర్షించాడు. సదరు వ్యక్తి పెద్ద ముక్కు ఆకృతిలోని పేపర్ మాస్క్ని ధరించాడు. పైగా దానికి ఓపెనింగ్ కూడా ఉంది. ఎంచక్కా మాస్క్ తీయకుండానే అలానే తినేయవచ్చు. అతను ఒక రెస్టారెంట్లో ఆ మాస్క్ ధరించి చక్కగా పదార్థాలను లాగించేస్తున్నాడు. చూస్తుంటే అచ్చం పక్షుల మాదిరిగి తింటున్నట్లు చూడముచ్చటగా ఉంది. అందుకు సంబంధించిన వీడియోను సఫీర్ అనే వినియోగదారుడు ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc — Safir (@safiranand) December 23, 2022 (చదవండి: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్) -
Viral Video: కాటు వేయబోతున్న పాముని తొక్కిపడేసిన పక్షి..!
-
Viral Video: ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న పక్షి
-
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్నాడో కవి.. ఆమె ఓర చూపే మోక్ష మార్గం అని కూడా వర్ణించాడు. ప్రేయసి కోసం మనుషులు ఇలా కవిత్వాన్ని ఆశ్రయిస్తే.. ఓ పక్షి మాత్రం గూడుకట్టి తన గుండె స్పందనను తెలుపుతోంది. ప్రేమ కోసం తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదరిస్తున్న అందరికీ తెలిసిన ‘పిట్ట’ కథ ఇదీ.. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త ఏటి ఒడ్డునో, చెరువు గట్టునో ఈత, తుమ్మ వంటి చెట్ల చిటారు కొమ్మలకు వేలాడుతూ గిజిగాళ్లు నిర్మించిన గూళ్లు కనపడుతుంటాయి. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. ఈతనారను జాగ్రత్తగా సేకరించే మగ పక్షులు అద్భుతమైన నైపుణ్యంతో గూళ్లు నిర్మిస్తాయి. తమకు ప్రమాదకరమైన పాములు, కాకులు వంటి వాటి నుంచి రక్షించుకునేందుకు ఏటినీళ్ల పైన వేలాడే విధంగా, గట్టుపైన ఉండే చెట్ల కొమ్మలు నీటిపై వేలాడే చోట గూళ్లు కడతాయి. తిరగవేసిన కిరోసిన్ దీపం చిమ్నిలా ఈ గూళ్లలో ప్రత్యేకమైన గదులు, మెత్తటి పాన్పులాంటి నిర్మాణాలుంటాయి. నల్లమల అటవీ సమీప గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో గిజిగాడి గూళ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ప్రేమకోసం.. ఆంగ్లంలో వీవర్ బర్డ్గా ఈ పక్షిని పిలుస్తారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని పిట్టలుగానే గుర్తిస్తారు. మగపక్షి గూడును నిర్మించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. గూడు చూపి ఆడపక్షితో జతకట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇల్లును చూసి ఇల్లాలి నైజం గ్రహించ వచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే గిజిగాడి పక్షుల్లో మాత్రం ఇల్లాలి కోసం మగ పక్షి ఇల్లు(గూడు) కడుతుంది. సగం గూడు నిర్మించే మగ పక్షి అటు వెళ్లే ఆడపక్షులకు తన గూడును చూడరమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా గూటిపై వాలి రెక్కలల్లారుస్తూ కువకువలాడుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. గూడు నచ్చితే ఆడపక్షి మగపక్షితో జతకట్టేందుకు అంగీకరిస్తుంది. గూడు నచ్చక ఆడపక్షి ‘నో ’ చెబితే అసంపూర్ణ నిర్మాణాన్ని (గూడు) వదలి మరోచోట మరో గూడు కట్టేందుకు మగ పక్షి సిద్ధమవుతుంది. ఆడపక్షి గూడు నచ్చి అంగీకారం వ్యక్తపరచగానే మగపక్షి మిగిలిన గూడు నిర్మాణం పూర్తి చేస్తుంది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెడితే వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంది. పిల్లలు గుడ్లనుంచి బయటికి రాగానే వాటి పోషణ భారం మాత్రం ఆడపక్షే మోస్తుంది. ఒక్కో ప్రదేశంలో గిజిగాళ్లు రెండు వందల వరకు సామూహికంగా గూళ్లు నిర్మించుకుని సామాజిక జీవనం గడుపుతాయి. శత్రువులు దాడి చేసినపుడు మూకుమ్మడిగా పెద్దగా అరుస్తూ తమ పిల్లలను, గూళ్లలోని గుడ్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. గిజిగాడిపై ఖండకావ్యం గిజిగాళ్లు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి కీటకాలు, వివిధ రకాల విత్తనాలను తిని బతుకుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచినా గూడు చెదరకుండా, తడవకుండా బలంగా నిర్మించుకుంటాయి. గిజిగాడి నైపుణ్యానికి మెచ్చి మహాకవి గుర్రం జాషువా ఖండ కావ్యాన్ని రచించారు. ‘‘తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు య్యేల గృహంబు’’ అంటూ తన పద్యంలో ‘‘బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?’’ అంటూ ఆ గిజిగాని వైభవాన్ని కీర్తించారు. -
Dussehra: కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!
భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణవాసులు దసరా ఉత్సవాలు జరుపుకొనే రైటన్ బస్తీ వేదిక దగ్గర ఉన్న చిన్న జమ్మి మొక్క ఇది. ప్రజలంతా పూజ చేసేందుకు ఇదే దిక్కు. పక్కనే ఉన్న పాల్వంచ కనకదుర్గ ఆలయం వద్ద పూజలందుకునే జమ్మి చెట్టు కూడా రేపోమాపో కనుమరుగయ్యేలా ఉంది. ఈ రెండు చోట్ల అనే కాదు. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జమ్మి చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే ప్రాశస్త్యమున్న పాలపిట్టల దర్శనమూ అరుదైపోయింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి, రోడ్ల పక్కన విరివిగా కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరాకపోవడం, జమ్మి చెట్ల జాడ లేకుండా పోతుండటమే దీనికి కారణం. రకరకాల కారణాలతో.. కాకులు, పిచ్చుకలు, గద్దల తరహాలో మనుషులు సంచరించే చోటే ఎక్కువగా పాలపిట్టలు మనగలుతాయి. అవి పంటలను ఆశించే క్రిమికీటకాలను తిని బతకడమే దీనికి కారణం. సాగులో పురుగుల మందుల వాడకం పెరగడం, పంటల సాగు తీరు మారిపోవడంతో పాలపిట్టలపై ప్రభావం పడింది. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. వీటిలో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటం, లద్దె పురుగు, గులాబీ పురుగు వంటివి రాత్రివేళ పంటలపై దాడి చేస్తుండటంతో పాలపిట్టలకు ఆహారం కరువైంది. పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. ఒక సీజన్లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండుకే పరిమితమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పొలాల వెంట ఉండే చెట్లు, చెరువు గట్ల వెంట ఉండే నల్లతుమ్మ వంటి చెట్లను నరికివేయడం వల్ల పాలపిట్టలకు ఆవాసం కరువైపోతోంది. ఈ కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొమ్మల నరికివేతతో పాల్వంచ పెద్దమ్మ ఆలయం వద్ద జమ్మిచెట్టు పరిస్థితి ఇలా... జమ్మి చెట్టుకు చోటేదీ? దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు కనుమరుగవడంతో.. అడవుల్లో వెతికి జమ్మిచెట్టు కొమ్మలను తెచ్చి తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా ఎక్కడా జమ్మిచెట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాలపిట్టలు తగ్గిపోతున్నాయి వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఊళ్లలో పాలపిట్టలు కనిపించడం లేదు. అడవుల్లో మాత్రమే ఉంటున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. – కట్టా దామోదర్రెడ్డి, వైల్డ్ లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ డివిజన్ -
ఈ పక్షి ఎంత డేంజరో తెలుసా?.. నిలువెల్లా విషమే..
జంతు ప్రపంచంలో విషపూరితమైనవి అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు పాములు, తేళ్లే. అలాగే కొన్ని జాతుల కప్పలు, సాలీళ్లు, కీటకాలు, చివరకు కొన్ని రకాల చేపల్లోనూ విషం ఉంటుందని మనకు తెలుసు. కానీ నిలువెల్లా విషం నింపుకున్న ఓ పక్షిజాతి గురించి ఎప్పుడైనా విన్నారా?! ఆ పక్షి పేరే హుడెడ్ పిటోహుయ్. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి అట. చదవండి: జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.. ఎందుకో తెలుసా? హుడెడ్ పిటోహుయ్ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! ముద్దొస్తున్నాయి కదా అని దాని ఈకలను సరదాగా నోట్లో పెట్టుకుంటే నోరంతా మొద్దుబారిపోతుందట! కొన్ని గంటలపాటు భరించలేనంత నొప్పి వస్తుందట! అది గోళ్లతో రక్కినా ఇదే సీన్ రిపీట్ అవుతుందట. పక్షవాతం కూడా వచ్చే చాన్స్ ఉంటుందట. ఇక విషం డోసు ఎక్కువగా శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!! అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! ఎవరైనా తెగించి దాని మాంసాన్ని వండుతుంటే విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు దాని రుచి సైతం అత్యంత చేదుగా ఉంటుందట!! అందుకే స్థానికులు దీన్ని గార్బేజ్ బర్డ్ (చెత్త పిట్ట)గా పిలుస్తుంటారు. నాడీమండల వ్యవస్థను దెబ్బతీసే బట్రచోటాక్సిన్ అనే రసాయనం ఈ పక్షిలో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ విషాన్ని పిటోహుయ్ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో దీని ఆహారమైన పురుగుల వల్ల ఈ విష రసాయనం పక్షిలోకి చేరుతోందని చెబుతున్నారు. ఇంకొందరేమో పేలు, ఇతర కీటకాలను దరిచేరనీయకుండా ఉండేందుకే హుడెడ్ పిటోహుయ్ ఇలా విషాన్ని ఉత్పత్తి చేస్తుందని విశ్లేషిస్తున్నారు. -
వైరల్ వీడియో: రంగులు మార్చే పక్షిని చూశారా!
పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్ హమ్మింగ్ బర్డ్ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ పిట్టల ఈకల్లో ప్యాన్ కేక్ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్ బర్డ్ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు. The stunning colors of the Anna's hummingbird are iridescence caused by light scattering from nanoscale structures within their feathers.pic.twitter.com/BZzXuFnHag — Wonder of Science (@wonderofscience) July 21, 2022 -
అరుదైన పక్షి ‘కలివికోడి’
కడప కల్చరల్: ‘కలివి కోడి’.. పిల్లలూ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. నిజానికి ఇది కోడి కాదు కానీ అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. కానీ ఆ మధ్య మన జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించింది. మన జిల్లాకు మరో ప్రత్యేకతను చేకూర్చి పెట్టింది. మరీ ఆ విషయాలు తెలుసుకుందామా! మన జిల్లాలో అటు శేషాచలం.. ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే కలివి పొదల్లో ఉండడంతో దీన్ని కలివి కోడి అంటున్నారు. 1948 నాటికే ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు సైతం నిర్ణయించారు. 1985 జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతన్నకు ఈ పక్షి కనిపించగా, దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ వెంటనే వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది. అప్పటి నుంచి మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందేమోనని నేటివరకు వెతుకుతూనే ఉన్నారు. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్ని వివరాలు కలివికోడికి ‘జోర్డాన్ కొర్సర్’ అని శాస్త్రీయమైన పేరుంది. ఇది పెద్ద సైజు కంజు పక్షిలా పొడవాటి కళ్లతో ఉంటుంది. ముదురు గోధుమరంగు ఈకలతో మెడలో దండలు ధరించినట్లు ముదురు రంగు చారలు ఉంటాయి. ఇది ముళ్ల పొదలతో కూడిన పచ్చిక మైదానాలలో నివసిస్తుంది. రాత్రి వేళ మాత్రమే తిరుగుతుంది. దీని కూత దాదాపు 200 మీటర్ల దాక వినిపిస్తుంది. నేషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలివికోడి కూతను రికార్డు చేయించి దాని గురించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయించారు. -
దురదృష్టకరమైన ఘటన...పక్షిని రక్షించడమే శాపమైంది: వీడియో వైరల్
రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిర్లక్షపూరితమైన డ్రైవింగ్, పక్కవారికి ఏమైన అవుతుందనే భయం లేని స్పీడ్ డ్రైవింగ్ తదితరాలే ఈ ప్రమాదాలకు కారణం. కనీసం ముందున్న కారు ఎందుకు ఆగిందో అని కూడా లేకుండా తమదారి తమదే అన్నట్లుగా ఢీ కొట్టి వెళ్లిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్ చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆగకుండా వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక ఒక ప్రబుద్ధుడు వేగంగా ట్యాక్సీ నడుపుతూ.. రోడ్డు పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలపిన కథనం ప్రకారం...ముంబై నేపీన్సీ రోడ్లో వాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా తన డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్తో కలసి ముంబై బీచ్ హైవైపై మలాడ్ వైపుగా వెళ్తున్నారు. ఐతే ఇంతలో ఒక పక్షి వారి కారుని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాపారవేత్త, అతని డ్రైవర్ గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులోంచి దిగారు. ఇంతలో వేగంగా వస్తున్న ఒక ట్యాక్సీ వారిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాపరవేత్త అక్కడికక్కడే చనిపోయాడు, డ్రైవర్ కామత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్ కుమార్ జైశ్వర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఈ ఘటన హైవే పై ఉన్న సీసీఫుటేజ్లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY — Singh Varun (@singhvarun) June 10, 2022 (చదవండి: కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...) -
చిక్కడపల్లిలో అరుదైన పక్షి.. పతంగి మాంజాకు చిక్కుకుని..
సాక్షి, హైదరాబాద్: ఓ అరుదైన నార్త్ అమెరికా దేశానికి చెందిన ఓవల్ పక్షినీ నగర వాసులు కాపాడారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో ఓ అరుదైన పక్షి ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షానికి ఉన్న పతంగి మంజాకి చిక్కుకొని విలవిల్లాడింది. అటుగా వెళ్తున్న స్థానికులు దానిని గమనించి సురక్షితంగా కాపాడారు. చెట్టుకు వేలాడుతున్న పక్షిని కాపాడి దాహాన్ని తీర్చారు. చదవండి: వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే? వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. స్థానికులు రక్షించిన ఆ పక్షి నార్త్ అమెరికాకి చెందిన ఓ అరుదైన ఓవెల్గా గుర్తించారు. ఈ అరుదైన ఓవల్ పక్షిని చూసేందుకు స్థానికులు గుమిగూడారు. -
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
కవ్వాల్ జంగిల్ లో సందడిగా సాగిన పక్షుల పండుగ
-
పక్షిలా ఎగిరే విమానం!... ఎలాగో తెలుసా!!:
ఫొటోలు చూశారుగా.. ఆకారంతోపాటు ఎగిరే క్రమంలోనూ పక్షిని పోలిన వినూత్నమైన ఎగిరే కారు ఇది. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్ అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. నిట్టనిలువుగా పైకి ఎగిరే ఇలాంటి కార్ల కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అలాంటివి వాస్తవ రూపం దాల్చింది తక్కువే. వీటిని వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీఓఎల్) వాహనాలంటారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అయితే వీటీఓఎల్ను ఫ్రాక్టిల్ కాస్త మార్చి నియర్ వీటీఓఎల్గా కొత్త విమానాలకు పేరు పెట్టింది. పక్షి తన కాళ్లతో ఎలా చెట్టుకొమ్మను పట్టుకుంటుందో ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. పక్షి మాదిరిగానే కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. పూర్తిగా విద్యుత్తో నడిచే ఈ వాహనంతో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్వే, హెలిపాడ్ వంటివేవీ అవసరం లేకపోగా పైలట్ మోడ్తోపాటు రిమోట్ కంట్రోల్ ద్వారానూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లవచ్చని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
వావ్! అద్భుతహ! ఇది కదా ల్యాండింగ్ అంటే
సాక్షి, హైదరాబాద్: గాల్లోకి ఎగిరే పక్షిని చూసే రైట్ బ్రదర్స్కి మనం కూడా గాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కదా అనంత దూరాలకు సైతం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా చేసింది. ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ సోదరులు అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. రైట్ బ్రదర్స్ కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించుకుంటాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ నెలలోనే రానున్న రైట్బ్రదర్స్ డే తరుణంలో యాదృచ్చికంగా ఎరిక్ సోలేం అనే యూజర్ షేర్ చేసిన వీడియో అద్భుతంగా నిలుస్తోంది. విమాన ప్రయాణానికి బాటలు వేసిన పక్షి అత్యంత సురక్షితంగా, అద్భుతంగా నీటిలోకి ల్యాండ్ అయిన తీరు విశేషం. దీంతో అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి. విమానం నుంచి ల్యాండ్ అయిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి. Awesome! Look at this elegance and flight control! 🥰 pic.twitter.com/X9WsrrulUZ — Erik Solheim (@ErikSolheim) December 4, 2021 -
వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలోని ఓ పక్షి చేస్తున్న శబ్ధాలు వింతగా ఉన్నాయి. ఆ పక్షి అచ్చం పసిపిల్లల ఏడుపులా శబ్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ పక్షి ఇలా ఎందుకు అరుస్తుందంటే.. వీటిని లైర్ బర్డ్ అంటారు. ఇవి తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను మిమిక్రీ చెయ్యగలవు. వీటి ప్రత్యేకత అదే. ఇక కోవిడ్ లాక్డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు పెద్దగా అరుస్తున్న శబ్దాన్ని వింటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: స్నేక్గారూ.. స్మైల్ ప్లీజ్.. Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls - including a baby's cry! 📽️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos — Taronga Zoo (@tarongazoo) August 30, 2021 -
ఊహించని పరిణామం: ఇలాంటి వేటను అస్సలు చూసి ఉండరు!
Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం. సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్బయాలజీ జర్నల్లో ప్రచురితమైంది. కరోనా ప్రభావం! తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు. చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం! -
గుడ్డు నుంచి పిల్ల వరకు..
పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్ హంటర్ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ పక్షికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పాలమూరు యూనివర్సిటీ జువాలజీ అధ్యాపకుడు రాజశేఖర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ పక్షి సైంటిఫిక్ పేరు ఆర్చినొతిరా లాంగిరోస్ట్రా. ఇంగ్లిష్ పేరు సన్బర్డు. సాధారణంగా స్పైడర్ హంటర్ అని పిలుస్తారని, ఈ పక్షి చిన్నపాటి చెట్లపై గూడు పెట్టి వర్షాకాలం ప్రారంభంలో కేవలం 15 నుంచి 16 రోజుల్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయని వెల్లడించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
Travel: గిన్నిస్ రికార్డు.. జటాయు పార్కు
రెండు వందల అడుగుల పొడవు. నూట యాభై అడుగుల వెడల్పు. డెబ్బై అడుగుల ఎత్తు... ఇది ఇక్కడ కనిపిస్తున్న పక్షి పరిమాణం. ఆ పరిమాణమే దీనిని గిన్నిస్ బుక్లో చేర్చింది. జటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న జటాయు నేచర్ పార్కులో ఉన్న జటాయు పక్షిని శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. అతడు ఫిల్మ్ మేకర్ కూడా. రామాయణంలో జటాయు ప్రధానమైన పాత్ర. సీతాపహరణ సమయంలో తనను అడ్డగించిన జటాయును రావణాసురుడు సంహరించాడని రామాయణంలో ఉంది. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. జటాయు తుదిశ్వాస వదిలిన ప్రదేశంలో పార్కు నిర్మించినట్లు చెబుతారు. మన రాష్ట్రంలో అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా మనం చెప్పుకుంటాం. వాస్తవాల అన్వేషణ, అధ్యయనంలోకి వెళ్లకుండా కేరళలోని ఈ పార్కుకు వెళ్తే టూర్ మధురానుభూతికి మినిమమ్ గ్యారంటీ. పక్షిలోపల మ్యూజియం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో డిజిటల్ మ్యూజియం ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మణం లోపల జటాయు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. జటాయు పార్కు సందర్శనలో పర్యాటకులు జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి అయితే పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
Gijigadu : టాలెంట్ ఉంటేనే ఆడ పక్షుల ప్రేమ..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సృష్టిలో పశుపక్ష్యాదులు తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుతాయి. పక్షిజాతుల్లో విభిన్నమైన, వైవిధ్యతను చాటే పక్షి గిజిగాడు. ఈ పక్షులు పాలమూరు యూనివర్సిటీలోని అడ్మిన్ భవనం వద్ద ఉన్న ఓ బావిలో ఇటీవల గూడు కట్టుకుంటున్నాయి. మగ, ఆడ పక్షుల మధ్య ఉండే సంబంధాల్లో కొన్ని ఆసక్తికర విషయాలను యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. లేత పసుపు రంగులో ఉండే మగపక్షి నాణ్యతగా గూడు కట్టి ఆడపక్షిని మెప్పించగలిగితే.. ఆ ఆడ పక్షి గూడు కట్టిన మగపక్షితో జత కడుతుంది. గాలి, వాన, చలి, వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనట. ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. చదవండి: పాముకే విషమిచ్చి చంపేస్తే!! -
పక్షికి తల్లిగా మారిన కుక్క.. తల్లి కాకుండానే పాలివ్వాలని..
లండన్: ఓ కుక్క పక్షిని తన బిడ్డలా అనుకుంటోంది. తల్లికాకపోయినా ఆ పక్షి బిడ్డకు పాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. ఇక పక్షి పరిస్థితి కూడా అంతే.. అది అచ్చం కుక్కలాగే ప్రవర్తిస్తోంది. అంతేకాదు కుక్కలాగా మొరగటం మొదలుపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన జూలియట్, రీస్లు గత సెప్టెంబర్ నెలలో చావుకు దగ్గరగా ఉన్న ఓ అనాథ మ్యాగ్పీ(ఓ పక్షి)ని చేరదీశారు. దానికి మోలీ అని పేరుపెట్టారు. అనారోగ్యంతో ఉన్న మోలీ.. జూలియట్, రీస్ల పెంపుడు కుక్క పెగ్గీ సహకారంతో త్వరగానే కోలుకుంది. పెగ్గీ చూపిన ప్రేమ.. 24 గంటలు ఒకదానితో ఒకటి కలిసి ఉండటంతో మోలీ పూర్తిగా మారిపోయింది. కుక్కలా ప్రవర్తించటం.. మొరగటం చేస్తోంది. మొదట్లో అది పెగ్గీ అరుపులని భావించారు. కానీ, మోలీ ఆ అరుపులు చేస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అది అచ్చం పెగ్గీలాగా అరుస్తుండటంతో పడిపడి నవ్వుకునేవారు. ఇంటి ఆవరణలో వేరే కుక్కల అరుపులు వినిపిస్తే చాలు.. మోలీ కూడా అరవటం చేస్తోంది. కేవలం మోలీలోనే కాదు.. పెగ్గీలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. మోలీ పరిచయానికి ముందు పెగ్గీకి పక్షులంటే భయం. కానీ, మోలీ పరిచయం తర్వాత అంతా మారిపోయింది. దీనిపై జూలియట్ మాట్లాడుతూ.. ‘‘ మోలీ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అది ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుందేమో అనుకున్నాం. ఇంటి కిటికీలు, డోర్లు అన్నీ తెరిచిపెట్టేవాళ్లం. కానీ, మోలీ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవటం తనకు ఏమాత్రం ఇష్టంలేనట్లు ఇంట్లోనే పెగ్గీతో చక్కర్లు కొట్టేది. ఆ రెండు జంతువులకు ఓ ప్రత్యేకమైన భాష ఉంది. ఆ భాషలోనే అవి మాట్లాడుకుంటాయి. నేను ఇలాంటి జంతువుల జంటను ఇది వరకు ఎప్పుడూ చూడలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. పెగ్గీ.. మోలీని తన బిడ్డలా భావిస్తోంది. అందుకే.. తల్లి కాకపోయినా పిల్లలకు పాలు ఇచ్చినట్లు మోలీకి కూడా పాలు ఇవ్వటానికి చూస్తోంది. ఈ కారణంతో పెగ్గీ శరీరంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లినపుడు తెలిసింది. మోలీ కూడా కుక్క పిల్లలు పాలు తాగుతున్నట్లు ప్రవర్తించేది. అందుకే పెగ్గీకి బట్టలు వేయటం మొదలుపెట్టాం. ఈ రెండు జంతువులు మా జీవితంలోకి ఎంతో ఆనందాన్ని తెచ్చాయి’’ అని పేర్కొంది. -
ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
మనలో చాలా మంది జంతువులు, పక్షులను పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటికి కావాల్సిన ఆహారాన్ని, దానా పెట్టి సంబరపడుతూ ఉంటారు. మరికొందరైతే.. తమ ఇళ్లలోని బాల్కనీలలో పక్షుల కోసం ప్రత్యేకంగా.. ఇళ్లను తయారు చేస్తారు. అంతటితో ఆగకుండా, వాటి కోసం దానా, నీళ్లు పెట్టడం మనకు తెలిసిన విషయమే. అయితే, ఈ వీడియోలో ఒక వ్యక్తి భోజనం చేస్తున్న క్రమంలో ఒక పక్షి వచ్చింది. అది, అతనితో కలిసి అదే ప్లేట్లో ఆహారం తింటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు.. ఈ వీడియోలోని సదరు వ్యక్తికి బాగా ఆకలేసినట్టుంది. దీంతో ఒక డాబా చేరుకుని తీరిగ్గా తింటున్నాడు. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చింది. పాపం.. దానికి బాగా ఆకలేసినట్టుంది. సరిగ్గా ఆ వ్యక్తి భోజనం చేస్తున్న టేబుల్పై వాలిపోయింది. అంతటితో ఆగకుండా అతని.. ప్లేట్లోని ఆహారం తినడం మొదలు పెట్టింది. ఆ వ్యక్తి దాన్ని ఏమాత్రం అదిలించలేదు. మొదట్లో దానికి కావాల్సిన ఆహారాన్ని కొద్దిగా కింద వేశాడు.. ఆ పక్షి ఏమాత్రం భయలేకుండా ఆ పదార్థాన్ని తినేసింది. కాసేపయ్యాక.. అది అతని ప్లేట్లోని పదార్థాన్ని ఇష్టంగా తింటుంది. ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో భోజనాన్ని తినేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. అయితే , ఈ వీడియోను మేఘరాజ్ దేశాలే అనే వ్యక్తి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. పక్షికి బాగా ఆకలేసినట్టుంది..’, ‘ నీ మానవత్వానికి హ్యట్సాఫ్..’, ‘ ఆకలితో వచ్చిన అతిథి కడుపు నింపావ్..’ ‘ఆ పక్షి.. మంచి వ్యక్తి దగ్గర వెళ్లి వాలింది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్ వీడియో: రియల్ హీరోస్.. అగ్నిప్రమాదం నుంచి ముగ్గురు చిన్న పిల్లలని.. -
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!!
-
హమ్మా! కాకికే షాకిచ్చిందిగా..!! వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: అనగనగా ఒక కాకి.. ఆ కాకికి దాహం వేసింది. చుట్టూ వెదికింది. ఎక్కడా నీళ్లు కనిపించలేదు.. దాహంతో గొంతు తడారిపోతుండగా. ఎక్కడో అడుగున కాసిన్ని నీళ్లతో ఒక కూజా కనిపించింది. ఆ నీళ్లు అందకపోవడంతో తెలివిగా కొన్ని గులకరాళ్లను తెచ్చి అందులో వేసి.. నీళ్లు పైకి వచ్చాక తన దాహాన్ని తీర్చుకుంది.. హాయిగా ఎగిరిపోయింది..ఈ కథ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. అంతేనా కాకమ్మ తెలివితేటల గురించి చాలా స్టోరీలు ఇప్పటిదాకా వైరల్ అయ్యాయి. మనుషులు అతి నిర్లక్ష్యంగా పారవేసిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లతో సహా ఏరి చెత్త కుండీలో పారవేసిన స్వచ్ఛ్ భారత్ కాకి కథను కూడా విన్నాం. కానీ తాజాగా అలనాటి పాత కథను తలపించేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న నీళ్ల కోసం ఒక పిట్ట కష్టపడుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. కాకికే షాకిచ్చిందిగా బుల్లి పిట్ట. ఔరా అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలోకనిపించిన మాగ్పై పక్షలు కూడా కాకుల్లాగే చాలా తెలివైనవట. గత ఏడాది స్టీవ్ స్టీవార్డ్ విలియమ్స్ అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. అది తిరిగి తిరిగి మళ్లీ ఇపుడు వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! -
ఫోన్ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్
సాధారణంగా ఫోన్ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫోన్ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్ఫోన్ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్కు గురైన ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్ నాదీ.. నాదీ నాకిచ్చేయ్ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి, తన సహచరి ఫోన్ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్గా ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
పాపం.. కక్కలేక మింగేసింది
మింగలేక..కక్కలేక అంటారు కదా.. ఇదిగో ఈ కామరంట్ పక్షిని చూస్తే.. అలాగే అనిపిస్తుంది.. ఈ పక్షులు చేపలు పట్టడంలో స్పెషలిస్టులు.. డుబుక్కున నీటిలో మునిగి.. తాము టార్గెట్ చేసిన చేపను పట్టేసుకుని.. పైకి తేలుతుం టాయి. దీనికి కొంచెం ఆశ ఎక్కువలాగుంది. అందుకే ఏకంగా రెండ్రోజులకు సరిపోయే సైజున్న చేప మీదే కన్నేసింది.. పట్టేయడం పట్టే సింది.. కానీ గొంతులో పట్టాలిగా.. దాంతో ఇలా అవస్థలు పడింది.. మొత్తానికి ఓ 5 నిమి షాల పాటు కిందామీదా పడి.. చేపను గుటుక్కుమనిపించేసిందని ఈ ఫొటోను క్లిక్మనిపించిన ఫొటోగ్రాఫర్ రతిక తెలిపారు. -
ఈ మగ పిట్ట పాడటం మర్చిపోయిందట..అందుకే
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడైనా మీరు పాడుకునే పాటలు మర్చిపోయారా? ఆ అవును.. మర్చిపోతాం.. అయినా అందులో పెద్ద సమస్య ఏముంటది అనే కదా మీ ప్రశ్న. అవును మనకు ఏ సమస్యా ఉండదు. ఒకటి కాకపోతే ఇంకో పాట పాడుకుంటాం. అయితే ఇలాంటి ఓ సమస్యే ఈ పక్షికి వచ్చిపడింది. అదేంటంటే తాను పాడుకునే పాట మర్చిపోయిందట. ఇలా పాట పాడటం మర్చిపోవడం వల్ల ఈ పక్షి జాతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఏకంగా ఆ జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఆడ పక్షిని ఆకర్షించేందుకు మగ పక్షులు మధురంగా ఓ పాట అందుకుంటాయట. అయితే మగ పక్షులు సరైన శ్రుతిలో పాడటం మర్చిపోయాయట. దీంతో ఆడపక్షులు మగ పక్షుల దగ్గరకు రావట్లేదట. దీంతో వాటి సంతతి అభివృద్ధి చెందక.. చివరికి అంతరించిపోయే దాకా పరిస్థితి వచ్చింది. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా.. ‘రీజెంట్ హనీఈటర్’ అని పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఒకప్పుడు చాలా ఉండేవట. ఇప్పు డు ప్రపంచం మొత్తం కూడా 300 పక్షులు మాత్రమే ఉన్నాయట. దీంతో పక్షి శాస్త్రవేత్తలు ఇందుకు కారణాలు వెతకగా.. మగ పక్షులు పాట పాడటం మర్చి పోయిన విషయం గుర్తించారు. గత ఐదేళ్లుగా పర్యావరణ శాస్త్రవేత్త రాస్ క్రేట్స్ దీనిపై పరిశోధన నిర్వహించగా రీజెంట్ హనీయేటర్స్ పాటల సామర్థ్యం సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ విలక్షణమైన నలుపు ,పసుపు రంగులమిశ్రమంతో ఆకర్షణీయంగా కనిపించే పక్షులు ఒకప్పుడు ఆస్ట్రేలియా అంతటా సాధారణం, కానీ 1950 ల నుండి వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పక్షులకు మా త్రమే సొంతమైన పాటను పాడకుండా.. అనుకోకుండా వేరే పక్షుల శబ్దాలను, పాటలను అనుకరించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కొంతకాలానికి అవి చేయాల్సిన శబ్దాలను గుర్తు చేసుకోలేకపోయాయని పేర్కొన్నారు. పుట్టిన పిల్ల పక్షులు కూడా వేరే శబ్దాలను నేర్చుకుంటున్నాయని, దీంతో ఆడ పక్షులు ఈ పాటలకు ఆకర్షితం కావడం లేదని విశ్లేషించారు. -
వెర్రిబాగుల పిట్ట.. చావుతో ముద్దులాట
ఈ పిట్ట మరీ వెర్రిబాగులు టైపులాగుంది.. ముద్దెట్టుకోవాలంటే.. ఇంకో పిట్టను పెట్టుకోవాలి గానీ.. ఇలా మృత్యువుతో ముద్దులాటేమిటి.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇదో సన్బర్డ్. ఇవి పువ్వుల నుంచి మకరందాన్ని తాగుతుంటాయి.. పచ్చగా కనిపిస్తే.. పువ్వు అనుకుందేమో ఏమోగానీ.. ఇలా పాముకు దగ్గరగా వెళ్లింది. అయితే, ఈ పిట్ట సర్పానికి అతి సమీపానికి వెళ్లినా.. ముద్దాడలేదట. తాను తీసిన ఫొటో యాంగిల్ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందని ఇండోనేసియాకు చెందిన బుడీ గునావాన్ చెప్పారు. ఈ చిత్రాన్ని క్లిక్మనిపించింది ఈయనే. -
కరోనా.. జంతువులతోనా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సంక్రమణ భవిష్యత్తులో పెను ప్రమాదంగా పరిణమించకుండా నియంత్రించే చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పూనుకుంటోంది. గత 10 నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తికి మానవాళి ద్వారా కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్న పరిస్థితుల్లో జంతువుల ద్వారా భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకారి కాకుండా ఉండేందుకు అధ్యయనాలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జంతుజాతులు కరోనా సంక్రమణకు కారణమవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 500 రకాల జంతుజాతులపై పరిశీలన జరపాలని నిర్ణయించిన డబ్ల్యూహెచ్వో.. ఇందుకోసం రెండు దశల ప్రణాళికలను తయారుచేసింది. ఈ పరిశోధనల్లో 194 సభ్య దేశా లు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. చదవండి:(కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు) మానవులకు ఎంత ముప్పు? ఇప్పటికే గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు, సింహాలు, పులులు, ప్యాంగోలిన్ (అలుగు)లలో కరోనా సారూప్య వైరస్లను అనేక పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా గబ్బిలాల్లో మార్చిలో గుర్తించిన ఆర్ ఏటీజీ13, ఆర్ ఎంవై?ఎన్02 జీనోమ్లలో సార్స్ కరోనా వైరస్తో 96.2, 93.3 శాతం సారూప్యత ఉందని నిర్ధారించారు. చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాల్లో కుక్కలు, పిల్లుల్లో, అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. అలాగే నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్ దేశాల్లోని ముంగీస జాతిలో కూడా గుర్తించారు. దీంతో మానవులతో నిత్య సంబంధాలుండే అన్ని రకాల జంతుజాతులపై అధ్యయనానికి రెండు దశల ప్రణాళికను డబ్ల్యూహెచ్వో సిద్ధం చేసింది. ఇప్పటికే వైరస్ను గుర్తించిన వాటితో పాటు చిట్టెలుకలు, పందులు, ముంగీస, చుంచు తదితర జాతులకు చెందిన 500 రకాల జంతువులపై పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా జంతుజాతులపై సీరో ప్రివలెన్స్ అధ్యయనాలకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. భవిష్యత్ కోసమే.. ఈ జంతువుల ద్వారా ఇతర జంతువులకు సోకడంతో పాటు వైరస్ రిజర్వ్లుగా మారే ప్రమాదముందనే అంచనాతో పాటు, వీటి ద్వారా మనుషులకు వైరస్ సోకే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి.. ఏ జంతువు ఏ స్థాయిలో వైరస్ వ్యాప్తి చేయగలదు.. మానవుల విషయంలో ఈ జంతువుల ద్వారా, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే కోణంలో స్వల్ప, దీర్ఘకాలిక పరిశోధనలు, సమగ్ర పరిశీలన జరపనుంది. అయితే కోడి, సీమకోడి, బాతుల ద్వారా కరోనా వైరస్ సంక్రమించబోదని మరోసారి డబ్ల్యూహెచ్వో స్పష్టం చేయడం గమనార్హం. -
గాల్లోనే పొట్ట చీల్చుకుని బయటకొచ్చింది!
న్యూయార్క్ : అమెరికాకు చెందిన సామ్ డేవిస్ అనే ఫొటోగ్రాఫర్ కొద్దిరోజుల క్రితం మేరీల్యాండ్లోని అటవీ ప్రాంతంలో వన్య మృగాలను ఫొటోలు తీసేపనిలో బిజీగా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత గాల్లో ఎగురుతున్న హెరాన్( నారాయణ పక్షి) కనిపించింది. అందులో వింతేమీ లేదు కానీ, దాని పొట్టబాగంలో ఓ స్నేక్ ఈల్ వేలాడుతూ ఉంది. అది హెరాన్ పొట్టకు అతుక్కుందని భావించాడు మొదట. కానీ, అది దగ్గరకు వచ్చిన తర్వాత విషయం అర్థమై షాక్ తిన్నాడు. హెరాన్ మింగిన స్నేక్ ఈల్ దాని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చింది. అలా గాల్లో పక్షితో పాటు ఎగురుతూ ఉండిపోయింది. ( పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు ) దీనిపై సామ్ మాట్లాడుతూ.. ‘‘ స్నేక్ ఈల్స్ అనేవి ఈల్ జాతికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఏదైనా జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు అవి తమ పదునైన తోకను ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నిస్తాయి. పొట్టలో జీర్ణం అవకుండా ఉండటానికి అలా చేస్తాయి. ఈల్ పొట్టను చీల్చినా హెరాన్ బ్రతికి ఉండటం అశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే అంత పెద్ద గాయం అయిన తర్వాత ఏ జీవైనా వెంటనే చనిపోతుంది’’ అని తెలిపాడు. ( ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు! ) -
సముద్రంలో మునిగిపోతున్న పక్షిని కాపాడి..
న్యూఢిల్లీ: సముద్రంలో మునిగిపోకుండా చిన్న పక్షిని ఓ వ్యక్తి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంగ్లాండ్కు చెందిన సైమన్ బీఆర్ఎఫ్సీ హాప్కిన్స్ అనే సంస్థ తన ట్విటర్ పేజీలో ‘ప్రపంచానికి ఇంకా ఇలాంటి వ్యక్తులు కావాలి’ అనే క్యాప్షన్కు రెండ్ హార్ట్ ఎమోజీని జత చేసి ట్వీట్ చేసింది. సముద్రం మధ్యలో నీటిపై కొట్టుకుంటున్న ఆ పక్షిని కాపాడటమే కాకుండా దానికి ఆహారం పెట్టిన అతడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 5 వేలకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (చదవండి: ఊహల్లోనే ఇవి సాధ్యం.. కానీ చేసి చూపించారు) ‘ఇది నన్ను ఎంతో ఆకట్టుకుంది’, ‘అందమై వ్యక్తి, పక్షి’, ‘అవును.. ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు అవసరం’ అంటూ నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బోటులో సుముద్ర పర్యటనకు వెళ్లిన వ్యక్తి సాగరం మధ్యలో ఆ పక్షి నీటిపై కొట్టుకోవడం గమనించాడు. వెంటనే ఆ వ్యక్తి పక్షిని తన చేతుల్లోకి తీసుకుని పడవలో దించాడు. నీటి తేమ లేకుండా ఆరబెట్టి, దానికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత నీటిని తాగించి ఆ పక్షితో కాసేపు సరదాగా ఆడుకున్నాడు. ఇక ఒడ్డు దగ్గరికి చేరుకోగానే ఆ పక్షిని ఆకాశంలోకి వదిలాడు. (చదవండి: అనుకోని అతిథి.. ఎక్కడివారక్కడే గప్చుప్) -
అమీన్పూర్ చెరువులో పక్షుల అందాలు.. ఓ లుక్కేయండి
-
ప్రకృతి అందాలు
-
సారీ.. ఈ కుర్చీ నాది
ఒక్కోసారి కొన్ని ఫోటోలు వెంటనే చూడగానే అర్థం కావు. ఆ ఫొటోను మరోసారి అంతర్లీనంగా చూస్తేనే కానీ అసలు విషయం అంతుచిక్కదు. తాజాగా అలాంటి ఫోటోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో ఎక్కడ తీశారో తెలియదుగాని నెట్టింట్లో మాత్రం తెగ వైరల్గా మారింది. అంతలా ఆకట్టుకోవడానికి ఆ ఫోటోలో ఏముందనేగా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. వలెస్కా అనే వ్యక్తి తన ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేశాడు. సాధారణంగా చూస్తే ఒక పెద్ద కుర్చీలో చిన్న పురుగులాగా కనిపిస్తుంది. అయితే ఫోటోను నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. ఆ కుర్చీ మీద ఉన్నది పురుగు కాదు.. చిన్న పక్షి అని. గ్రే, బ్లాక్, రెడ్ కలర్ కలగలసిన ఒక చిన్న పక్షి కుర్చీపై ఉంది. పక్షితో పోలిస్తే కుర్చీ నాలుగింతలు పెద్దదిగా కనిపించింది.' సారీ.. ఈ కుర్చీని ఆల్రెడీ ఒకరు బర్తీ చేశారు' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇప్పటికే ఈ ఫోటోను దాదాపు 2.6 మిలియన్ మంది వీక్షించారు. చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. sorry, the seat is occupied pic.twitter.com/IQqz0yawsT — valeska (@iatemuggles) May 29, 2020 -
జగజ్జంత్రీపై విజిలెన్స్
తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ (బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్)లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. మునుపటి డైరెక్టర్ దాదాపు 20 ఏళ్లపాటు నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ఇష్టారాజ్యంగా నిధులు, విధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్స్ కొనుగోళ్లలో కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలున్నాయి. ఆయనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన అవినీతి అక్రమాలను వెలుగులోకి తేవడంపై విజిలెన్స్ దృష్టిసారించింది. గడిచిన రెండు నెలలుగా ప్రత్యేక బృందం అంతర్గత విచారణను చేపట్టింది. ఆశాఖ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ మల్లేశ్వర్రెడ్డి సహా నలుగురితో కూడిన బృందంతో శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిసంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇష్టారాజ్యం బర్డ్ హాస్పిటల్లో ఏళ్ల తరబడి నియంతృత్వ పాలనను గుర్తించిన టీటీడీ యంత్రాంగం దీనిపై దృష్టి సారింది. మరో సారి డైరెక్టర్గా అందలమెక్కాలనే విశ్వ ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఆయన లేకపోవడం వల్ల సేవలు పడిపోయాయని అనుకూల మీడియాలో కథనాలు కూడా రాయించారు. మళ్లీ ఆయన వస్తేనే పూర్వవైభవం అంటూ విస్తృతంగా ప్రచారం చేయించారు. దీనిపై టీటీడీ కన్నెర్రజేసింది. బర్డ్లో అసలేం జరుగుతుందో అనే దానిపై దృష్టి సారించింది. దీంతో డాక్టర్ జగదీష్ పాలనంతా స్వలాభం, ఒక సామాజికాపేక్ష కోసమే పనిచేశారని వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విజి లెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. ఆ తర్వాత ప్రభుత్వం టీటీడీ విజిలెన్స్ను పక్కనపెట్టి ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్కు విచారణ బాధ్యతలను అప్పగించింది. నమ్మలేని నిజాలు బర్డ్ నిర్వహణ కోసం టీటీడీ ఏటా 50కోట్ల నిధులను కేటాయిస్తోంది. ఈ నిధులను మునుపటి డైరెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఖర్చు చేశారని తెలిసింది. ఏపీఎంఐడీసీ చైర్మన్ భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బర్డ్లో పర్యటించి ప్రాథమిక విచారణ చేపట్టారు. మందులు, పరికరాల కొనుగోళ్లలో కోట్లాది రూపాయలు మారాయనే ఆరోపణలపై ఆయనపై వచ్చిన అవినీతి అక్రమాల నివేదికను రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంట్ను అందజేశారు. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం గడిచిన రెండునెలలుగా అవినీతి అక్రమాల కూపీ లాగుతోంది. గడిచిన ఐదారేళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. అంతకు ముందు 15 ఏళ్లకు సంబంధించిన కొనుగోళ్ల లావాదేవీల దస్త్రాలను ఆయన మాయం చేసినట్లు గుర్తించారు. వీటి ఆధారంగానే విచారణ చేపట్టి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలానే ద్వారకా తిరుమలలో విడ్ ఆస్పత్రికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న డాక్టర్ జగదీష్ మెడికల్ క్యాంపుల పేరుతో ఏటా 6 కోట్లు శ్రీవారి నిధులను దారి మళ్లించారని తెలిసింది. టీటీడీకి ఎలాంటి సమాచారమూ లేకుండానే మెడికల్ క్యాంప్ల పేరుతో ఏకంగా అక్కడే ఆపరేషన్లు చేయించారని తేలడంతో విచారణాధికారులు విస్తుపోయారు. టీటీడీ గత చైర్మన్ మెప్పుకోసం బర్డ్ మందుల షాపును నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు విచారణలో తేలిందని సమాచారం. క్యాంటీన్ను బినామీ పేరుతో నిర్వహిస్తూ లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారని సమాచారం. -
బాతుకు స్వయంవరం; ఆదివారం ముహూర్తం
పలానా చదువుకున్న అమ్మాయికి తగిన వరుడు కావలెను అన్న ప్రకటనలు మనం రోజూ పేపర్లో చూస్తూనే ఉంటాం. కానీ ఓ చోట మాత్రం మరీ విడ్డూరంగా ఓ బాతుకు తోడు కావలెను అని ప్రకటించారు. దీనికి సంబంధించి బాతు యజమాని మారిస్ పోస్టర్లు అతికించాడు. తాను ఓ బాతును పెంచుకుంటుండగా దానితో కలిసి ఉండే సహచర బాతులు కొద్ది వారాల క్రితం మరణించాయి. దీంతో ఆ బాతు ఒంటరిగా మిగిలిపోయింది. దాని బాధను చూడలేని మారిస్ ఓ పథకం ఆలోచించాడు. ఒంటరిగా ఉంటున్న ఆడ బాతుకు వెంటనే ఓ తోడు అవసరమని భావించాడు. అందుకోసం బాతు బొమ్మ గీసి దానికి ఈడూజోడు సరిపోయే మగబాతు కావాలంటూ ఓ దుకాణంలో పోస్టర్ అతికించాడు. మీ దగ్గర మగబాతు ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించండి అంటూ తన అడ్రస్ కూడా అందులో పొందుపరిచాడు. ఈ స్వయంవరాన్ని ఆదివారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపాడు. పైగా బాతులు చక్కగా కలిసిపోడానికి, కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ప్రకటన తెలిసిన కొందరు వ్యక్తులు మా దగ్గరున్న బాతుల్లో ఒక్కటైనా నచ్చకపోతుందా అని ఆయన ఇంటి మెట్లు ఎక్కుతున్నారు. -
రక్షించు భగవాన్!
అదొక సుందర సువిశాలమైన ఒక పెద్ద మైదానం. ప్రశాంతతకు మారుపేరైన ఆ ప్రదేశంలో, ఒక చెట్టుమీద ఒక పిచ్చుక నివసిస్తూ ఉండేది. కొద్దిరోజుల క్రితమే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి. ఆ చిన్నారి పిచ్చుకలకు ఇంకా రెక్కలు రాకపోవడంతో అవి ఎగురలేని స్థితిలో ఉన్నాయి. స్వయంగా తామే ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి వాటిది. తల్లే వాటికి ఆహారం సమకూర్చేది. ఇంతలో పరిస్థితి ఉన్నట్లుండి మారిపోయింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశంలో యుద్ధానికి తగిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇరుపక్షాల సైన్యాలూ బారులు తీరి నిలబడ్డాయి. దాంతో సైనికుల కోలాహలం, ఏనుగుల ఘీంకారావాలు, గుర్రాల సకిలింపులు, వీరులు తమ కత్తులను సానబట్టే శబ్దం, యుద్ధభేరీల శబ్దం, వీరుల శంఖ నాదాలతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. దాంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక గడగడ వణికిపోయింది. తన పిల్లలను అక్కున చేర్చుకుని దేవుణ్ణి తలచుకుని, ‘‘దేవా! మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించు!’’ అని ప్రార్థించింది. దాని మొరను దేవుడు ఆలకించాడు. వెంటనే ఆయన పిచ్చుక గూడు కట్టుకుని ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. పిచ్చుకను చూసి ఆయన, ‘‘ఓ పిచ్చుకా భయపడకు! ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ, దానివల్ల నీకూ, నీ పిల్లలకూ ఎటువంటి ఆపదా రాకుండా చూస్తాను!’’ అని అభయమిచ్చాడు. ఆ తరువాత యుద్ధం ప్రారంభమయింది. ఆ యుద్ధం జరిగినంతకాలం పిచ్చుకకు, దాని సంతానానికి ఏ ఆపదా వాటిల్లలేదుభగవంతుడు మనుషులకే కాదు, పక్షులు, మృగాలు తదితర సకల జీవజాలాన్ని రక్షించి కాపాడుతూ ఉంటాడు. అందుకే దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నారు. భగవంతుణ్ణి చిత్తశుద్ధితో ప్రార్థించిన వారి మొరను తప్పక వింటాడు. అనుగ్రహిస్తాడు. మనకు ఉండవలసిందల్లా విశ్వాసమొక్కటే! – డి.వి.ఆర్. -
‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!
సాక్షి, సీతానగరం(విజయనగరం) : వేల మైళ్లు దాటుకుని జిల్లాకు వచ్చిన విదేశీ అతిథి (పక్షి) అనుకోని చిక్కుల్లో ‘పడింది’. ఓ గ్రామస్తుడు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. దశాబ్దాలుగా సైబీరియా నుంచి సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాలకు కొన్ని పక్షులు వచ్చివెళ్తుంటాయి. మండలంలోని లచ్చయ్యపేట గ్రామానికి చెందిన సీతయ్యతో పాటు మరికొంత మంది రోజు మాదిరిగానే చేపలు పట్టేందుకు చెరువులోకి దిగారు. అంతలో ఓ పక్షి నీటిలో గిలాగిలా కొట్టుకుంటూ వారికి కనిపిం చింది. వెంటనే స్పందించిన సీతయ్య ఆ పక్షిని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. భారీ సైజులో ఉన్న ఆ పక్షిని చూసేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ విధంగా వర్షాకాల విడిదికి వచ్చిన విదేశీ అతిథి (పక్షి)కి జిల్లావాసి పునర్జన్మ ప్రసాదించాడు. -
వామ్మో.. ఇది చాలా డేంజర్ పక్షి!
చూడ్డానికి కలర్ఫుల్గా.. కాసింత కామెడీగా కనిపిస్తోంది కానీ.. ఇది ఖతర్నాక్ టైపు.. మన సినిమాల్లో కామెడీ విలన్లుంటారే.. పక్షుల్లో ఇది ఆ టైపన్నమాట.. పేరు కాసొవెరీ.. ఇంతకీ విలన్ అని ఎందుకు అన్నామంటే.. ఈమధ్యే ఓ మనిషిని ఇది ఫసాక్ చేసేసింది.. నమ్మడం లేదా.. దాని కాళ్ల వైపు ఓ లుక్కేసుకోండి.. చూశారుగా.. పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో.. ఆ గోర్లు మినీ కత్తుల్లాగే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తిని గాడిదలాగ కాళ్లతో ఎగిరెగిరి తన్నడంతో అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడు.. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షుల్లో ఒకటిగా పిలుస్తారు. వీటిని పెంపుడు జంతువులుగా ఉంచుకోవాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని యజమానులు కొన్ని పరీక్షలు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అధికారులు అనుమతిస్తారు. ఎగిరెగిరి తన్నింది కానీ.. నిజానికి ఇది ఎగరలేదు.. ఈమూ పక్షి టైపు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు వరకూ పెరుగుతుంది. 60 కిలోల బరువుంటుంది. ఇండోనేసియా, నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియాతోపాటు ఆసియాలోని పలు దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తనకేదైనా ముప్పు ఉందని భావిస్తేనే.. అది దాడి చేస్తుందట. అంటే.. దానికి భయం మొదలైందంటే.. మనకి బ్యాడ్టైమ్ మొదలైనట్లే! -
హంతక పక్షి.. ఎంత పని చేసింది!
గైయినెస్విల్లే: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పక్షిగా గుర్తింపుగా పొందిన ‘కాసోవారీ’ తన యజమాని ప్రాణం తీసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న గైయినెస్విల్లే నగరంలో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక మీడియా కథనం ప్రకారం... కాసోవారీ శుక్రవారం తన యజమానిపై దాడి చేసి చంపేసింది. మృతుడి పేరును పోలీసులు వెల్లడించలేదు. ‘ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టుగా కనబడుతోంది. తనకు సమీపంలో జారిపడిన యజమానిపై కాసోవారీ దాడి చేసివుండొచ్చ’ని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూడటానికి ఈము పక్షిలా కనబడే కాసోవారీ దాదాపు 6 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు పెరుగుతుంది. ఎగరలేని ఈ భారీ పక్షి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో కనిపిస్తుంది. శాన్డియాగో జూ వెబ్సైట్ ప్రకారం... ఇవి చాలా ప్రమాదకరమైన పక్షి. దీని కాళ్లకు దాదాపు 10 సెంటీమీటర్లు పొడవుండే కత్తుల్లాంటి గోళ్లుంటాయి. ముప్పు వాటిల్లినప్పుడు వేగంగా స్పందించి ఒక్క దెబ్బతో సత్తా చూపగలదు. దట్టమైన అడవుల్లోనూ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అమెరికాలో వీటిని మంసాహారం కోసం పెంచరు. అరుదైన జాతికి చెందిన కాసోవారీని కాపాడాలన్న ఉద్దేశంలో పక్షి ప్రేమికులు వీటిని సంరక్షిస్తున్నారు. -
ఈ ఫోటో చూస్తే మరో పక్షిరాజు వస్తాడేమో..!
న్యూఢిల్లీ : సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు, గాలిపటాలు. ఎక్కెడెక్కడో ఉన్న వారంతా పల్లేలకు చేరుకుని సంతోషంగా గడుపుతారు. కానీ మన సంతోషం పక్షుల పాలిట యమపాశమవుతోంది. గాలిపటాల పేరుతో పక్షులకు ఉరితాళ్లు బిగిస్తున్నాం. గాలిపటం మంజా తగిలి మృతి చెందిన ఓ రామచిలుక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బిదితా బాగ్ అనే ట్విటర్ యూజర్ ఒకరు.. మంజా తగిలి చనిపోయిన రామ చిలుక ఫోటోను ట్వీట్ చేశారు. ‘కాయ్పో చీ’ అనే క్యాప్షన్తో ఫోటోను పోస్ట్ చేయడమే కాక.. ‘వందలాది పక్షులు ఈ కైట్ ఫెస్టివల్ మూలంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. దయచేసి చైనీస్ మంజా వాడకాన్ని నిలిపివేయండి’ అంటూ ట్వీట్ చేశారు. చైనీస్ మంజా దారానికి చిక్కి ప్రాణాలు కోల్పోయిన రామచిలుక ఎంత విలవిలలాడి ఉంటుందోనని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ‘ఫోటోకు తగ్గ క్యాప్షనే పెట్టారు నిజంగానే రామ చిలుక కాయ్పో చీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. We hang our head in shame. This hard hitting image has been shared by Bhavik Thaker, titled "kaypo che?". Thanks for aptly showcasing the plight of these beautiful creatures. Unfortunately, hundreds of birds loose their life during kite festival. stop using chinese/manja threads. pic.twitter.com/TcJlTVJXAw — Bidita Bag (@biditabag) January 15, 2019 ‘కాయ్పో చీ’ అనేది గుజరాతి పదం. గాలిపటాల ఎగరేసేటప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడతారు. అవతలి వారి గాలిపటాన్ని కట్ చేస్తే కాయ్పో చీ అంటారు. నిషేధిత చైనా మంజా వల్ల పక్షులే కాక మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. మంజా వల్ల గొంతు తెగి ఓ ఎనిమిదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. -
వైరల్ వీడియో : అదృష్టం అంటే ఈ పక్షిదే..!
ఈ వార్త చదివాక ‘అరే ఈ పక్షికున్న పాటి అదృష్టం మనకు లేకుండా పోయిందే’ అనుకుంటారు. ఎందుకంటే మనలో చాలా మందికి విమానంలో ప్రయాణించడం ఓ కల. అది బిజినేస్ క్లాస్ ప్రయాణం అంటే అబ్బో ఇంకేముంది. ఎందుకంటే బిజినేస్ క్లాస్ టూర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కానీ ఈ పక్షి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిజినేస్ క్లాస్లో దర్జాగా సింగపూర్ నుంచి లండన్ ప్రయాణించింది. ప్రస్తుతం ఈ పక్షి బిజినెస్ క్లాస్ టూర్ నెట్టింట్లో హాట్టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్మీడియాలో తెగ వైరలవుతోంది. సామాన్య వ్యక్తికి దక్కని అదృష్టం పక్షికి దక్కిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాలు.. సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం సింగపూర్ నుంచి లండన్ బయలుదేరింది. అయితే ఎలా జరిగిందో తెలీదు కానీ విమానంలోని బిజినెస్ క్లాస్లోని ఓ సీటుపై పక్షి ప్రత్యక్షమైంది. అలా అది దాదాపు 12 గంటలపాటు విమానంలో ప్రయాణించి లండన్ చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని కొందరు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. దాంతో సిబ్బంది ఈ సంఘటన గురించి వివరణ ఇచ్చింది. జనవరి 7న విమానంలో ఈ పక్షి కనిపించిందని పేర్కొంది. ‘ప్రయాణీకులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది పక్షిని పట్టుకున్నారు’ అని తెలిపింది. పాపం పక్షిని పట్టుకోవడానికి సిబ్బంది చాలా కష్టపడ్డట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలా అయితేనేం చివరకూ ఆ పక్షిని పట్టుకున్న సిబ్బంది తర్వాత దాన్ని లండన్లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పంగిచారు. ‘వావ్.. సింగపూర్ ఎయిర్లైన్స్ను ఎంచుకోవాలని పక్షికి కూడా తెలుసు’, ‘ఈ పక్షికి ఏ క్లాస్లో ప్రయాణించాలో బాగా తెలిసినట్లు ఉంది’, ‘ఈ పక్షి ఇమిగ్రేషన్ను ఎలా క్లియర్ చేసుకుందో?.. ఆశ్చర్యంగా ఉంది’, ‘పక్షుల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయంలో సింగపూర్ ఎయిర్లైన్స్ తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భలేభలే పిట్ట
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: ఓ వింత పక్షి ఆదివారం దొమ్మేరు శివాలయం వద్ద హల్చల్ చేసింది. రెండురంగుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ పిట్ట గ్రామంలోని శివాలయం వద్ద మేడూరి సతీష్కుమార్ ఇంటి పెరట్లో స్థానికులకు తారసపడింది. మెడ వరకూ ముదురు గోధుమ రంగులోనూ, దిగువన ఊదా రంగులోనూ పావురా న్ని పోలి ఉంది. దీంతో స్థానికులు భలేభలే పిట్ట అంటూ ఆసక్తిగా తిలకించారు. -
నేనే బాగున్నాను
అదొక రంగురంగుల పక్షి. అందమైన దాని రూపాన్ని చూసి, తియ్యనైన దాని గొంతును విని ముచ్చటపడి దాన్ని ఒక పంజరంలో పెట్టారు. ఒక గిన్నెలో నీరు, మరో గిన్నెలో ధాన్యపు గింజలు వేసి ఉంచారు. పంజరం లోపలే అది కూర్చునేందుకు చిన్న పీట వేశారు. అయితే, ఆ పక్షి ఇవేమీ గమనించే స్థితిలో లేదు. బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న మరో పక్షి మీదనే దాని దృష్టంతా. దాన్ని చూస్తూ, ‘నాకు ఈ పంజరమే ప్రపంచం, ఇక్కడ నాకు ఊపిరి సలపడం లేదు’ అన్న బాధ! దాంతో ఆ పక్షిపై ఈరా‡్ష్య భావాన్ని పెంచుకుంది. ఇంకొక వైపు బయట ఉన్న పక్షి.. ‘ఈ పంజరంలో బంధించి ఉన్న పక్షి ఎంత సుఖంగా ఉంది! దీనికి తిండీ నీరు సంపాదించుకునే కష్టం లేదు. గాలివానల భయం లేదు. వేటాడే పక్షుల నుంచి తప్పించుకునే శ్రమ లేనే లేదు. నాకు మాత్రం ఎప్పుడూ ఆహారం సంపాదించుకోవడం, నీరు తాగడం గురించిన ఆలోచనే. గాలి వానల్లో ఎంతో కష్టంగా ఉంటుంది. చాలాసార్లు గద్దల్లాంటి పక్షుల నుండి రక్షించుకోవటం కష్టమైపోతుంది..’ అని ఆలోచించి తనకు తాను బాధపడుతూ పంజరంలోని పక్షిపైన ఈర‡్ష్య పడసాగింది. విషయమేంటంటే అవి రెండూ తనకన్నా మరో పక్షే ఎక్కువ సుఖంగా ఉన్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ రెండింటి ఆలోచనలు మార్పు చెందితే.. పంజరంలో ఉన్న పక్షి ‘నేను ఎంత సుఖంగా ఉన్నాను. నాకైతే అన్నీ పంజరంలోనే దొరుకుతున్నాయి. కాని పాపం తిండి, నీరు వెదుక్కునే అవస్థ, ప్రతికూల వాతావరణ బాధ, వేటగాళ్ల నుంచి పొంచి ఉండే ప్రమాదం బయట తిరిగే పక్షికి ఎప్పుడూ తప్పవు కదా!’ అని ఆలోచిస్తే బయటి పక్షి మీద అసూయ చెందదు. బయటి పక్షి.. ‘నేనెంత సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నాను! ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎపుడంటే అప్పుడు వినువీధిలో హాయిగా ఎగరగలను. కానీ, పాపం! ఆ పంజరంలోని పక్షికి ఈ సుఖం ఎప్పటికీ ఉండదు. అస్తమానం దీని ప్రపంచం ఆ పంజరమే కదా!’ అని ఆలోచిస్తే పంజరంలోని పక్షిపై దానికి ఈర్ష్య బదులు సానుభూతి కలుగుతుంది. వాటి ఆలోచనలలో ఈ విధమైన మార్పు వస్తే రెండింటి దృక్పథమూ మారిపోతుంది. మన ఆలోచనలు కూడా ఇక్కడి ఆ పక్షులకన్నా విభిన్నం ఏమీ కాదు. అందరూ తమ తమ పరిస్థితులను అనుకూలంగా, అదృష్టంగా భావిస్తూ, ఇతరుల గురించి సానుభూతిగా ఆలోచిస్తూ, వారి మంచి కోరుకోవడంలోనే తృప్తి, సంతృప్తి ఉన్నాయి. – డి.వి.ఆర్. -
పిట్ట కొంచెం.. చేసింది ఘనం
బెర్లిన్ : ‘పిట్ట కొంచెం కూత ఘనం’ సామెత వినే ఉంటాము. జర్మనిలో ఓ చిన్న పిట్టను చూసిన వారు కూడా ఇదే మాట అంటున్నారు. జాలీ కూడా పడుతున్నారు. కారణం కరెంట్ షాక్ తగిలిన ఆ చిన్న పిట్ట తను కాలిపోవడమే కాక దాదాపు 17 ఏకరాల విస్తీర్ణంలో కార్చిచ్చు రగిల్చింది. ఈ సంఘటన జర్మన్ తీర ప్రాంతం రోస్టాక్లో జరిగింది. వివరాల ప్రకారం.. ఒక చిన్న పక్షి అనుకోకుండా కరెంటు తీగలకు తాకడంతో మంటలు అలముకున్నాయి. దాంతో ఆ పక్షి అక్కడే ఉన్న పొలాల్లో పడిపోయింది. అసలే అవన్ని ఎండు గడ్డి పోలాలు. ఇంకేముంది దాంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు.. సరిగ్గా ఇదే సమయానికి ఈదురు గాలులు కూడా తోడవడంతో ఆ మంటలు కాస్తా అలా అలా దాదాపు 17 ఎకరాల మేర వ్యాపించాయి. అయితే సమయానికి చుట్టు పక్కల జనాలు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు. మంటలు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఇలాంటి సంఘటనే ఒకటి ఈ ఏడాది మార్చిలో జరిగింది. కొందరు అమెరికన్ విద్యార్ధులు పాస్తాలో నీళ్లు పోయకుండా వండుదామని ప్రయత్నించారు. ఆ ప్రయోగం కాస్తా ఫెయిల్ అయ్యి అపార్ట్మెంట్ మొత్తం మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. -
ముక్కుకు మరో పేరేమిటి?
పెద్ద పెద్ద యుద్ధాలు టీవీ డిబేట్లలోనే కాదు... మా ఇంట్లో కూడా జరుగుతుంటాయ్. ఉదాహరణకు టూ డేస్ బ్యాక్ నాకూ మా బుజ్జిగాడికీ మధ్య ఒక డిబేట్ మొదలయ్యింది. ‘‘పిట్టకు ఉండేది ముక్కా... నోరా? అప్పుడు పిట్టకు జలుబు చేస్తే అది తుడుచుకునేదేమిటి?’’ అని. ఆ కథ ఏమిటో తెలియాలంటే మీరీ కమామిషులో అడుగుపెట్టాల్సిందే.మా ఇంటి ముంగిట్లోకి తరచూ ఒక పిట్ట వస్తోంది. రోజూ వస్తుండటంతో మా బుజ్జిగాడు దానికి ధాన్యం గట్రా వేయడం మొదలుపెట్టాడు. వాకిలిలో వాలి అదీ ఇన్ని గింజలు హాయిగా తినేసి వెళ్తోంది. మావాడు గింజల్ని విసురుతున్నప్పుడు అదేమీ బెదరడం లేదు. కాస్తంత వెనక్కు వెళ్లినట్టే వెళ్తోంది... గింజలు పడగానే ముందుకొచ్చి ముక్కుతో పొడిచి పొడిచి తింటోంది. గుప్పెట్లో గింజలు పట్టి చేయి విసురుతున్నా భయపడటం లేదు. దాని ధోరణి మావాణ్ణి ఇంకాస్త ఎంకరేజ్ చేసింది.మొన్నోరోజు పిట్ట రాగానే గింజలు వేయాలని చూశాడు. ఇంట్లో మామూలుగా బియ్యం, పప్పులే ఉన్నాయి తప్ప అది తినగల గింజలేమీ లేవు. అంటే పుట్నాలు, సజ్జలు, జొన్నల్లాంటివన్నమాట. కానీ మావాడి ఉత్సాహాన్ని కాదనలేక వాడికి కాసిన్ని వేరుశెనక్కాయలను ఇచ్చింది మా ఆవిడ. అవన్నీ మేం తినడం కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు. సదరు డీప్ ఫ్రైడ్ పల్లీలను ఆ పిట్ట లొట్టలేసుకు తినడం చూసి మావాడు మరింత ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొన్ని పల్లీలు పెట్టాడు. పిట్టకొంచెం మేత ఘనం అని ఆరోజే తెలిసింది. ఆరోజు చెట్నీ ముడిసరుకునంతా ఆ పిట్ట ఇట్టే స్వాహా చేసేసింది. అదలా గుప్పిళ్లకొద్దీ పల్లీలు లాగించేయడంతో ఆరోజు మా ఇంటిల్లిపాదీ ఇడ్లీల్ని కేవలం కారప్పొడితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకంతే... ఆరోజు నుంచి అదే ధోరణి. ‘‘తినే పిట్టదే గింజ. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా... పిట్టా తేరా గింజ రహేగా. వేయించిన వేరుశెనక్కాయలు మనుషులకేనా? ఇంకెంతకాలం ఈ వివక్ష? పిట్టా మనిషీ భాయ్ భాయ్. పిట్టల హక్కులు వర్ధిల్లాలి. మా నాన్న నైజం నశించాలి’’ అనే టైపులో ఉంది వాడి వ్యవహారం. దాంతో ‘ఎందుకైనా మంచిది’ పాలసీ కింద నేను సైలెంటైపోయాను. నా ధోరణిని అలుసుగా తీసుకున్నాడు మావాడు. ‘‘పిట్ట ఎలాగూ వేయించిన వేరుశెనక్కాయలు ఇష్టంగా తింటోంది కదా. ఇక మనం దానికి ఫ్రిజ్జులోని ఐస్వాటర్ కూడా పోద్దాం నాన్నా. ఏమో... దానికి విపరీతంగా దాహం వేస్తోందేమో? నీళ్లు కూల్గా ఉంటే అదీ హ్యాపీగా తాగుతుంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్ అది ఐస్వాటర్ తాగదురా. నేచురల్ వాటర్ తప్ప వేరేదేదీ దానికి ఇష్టం ఉండదు’’ అన్నాన్నేను. ‘‘ఎందుకుండదు. గత జన్మలో నువ్వేమన్నా పిట్టవా? అది వేయించిన పల్లీలు తినదన్నావు. కానీ తిన్నది కదా. ఇప్పుడు ఐస్వాటర్ తాగదంటున్నావ్. కానీ తాగుతుందేమో? అన్నీ నీకు తెలుసా? అసలు నీకేం తెలుసు? అయినా తన రెక్కల కష్టానికి తగినట్టుగా ప్రిజ్జువాటర్ రూపంలో దానికి ‘గిట్టుబాటునీరు’ దక్కితే నీకేంటి కష్టం’’ అంటూ నిలదీశాడు. దాంతో నేను వాడిని కన్వీన్స్ చేయడానికి కాస్త వేరే దారి తొక్కాల్సి వచ్చింది. ‘‘ఒరేయ్ నాన్నా. మొన్న నువ్వు బోల్డంత ఐస్వాటర్ తాగేశావ్. అప్పుడేమైందీ? నీకు జలుబు చేసింది. నీకు గొంతు నొప్పి వచ్చింది. డాక్టర్ నీకు సిరప్పూ, మందులూ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఫ్రిజ్జువాటర్ తాగాక పిట్టకూ నీలాగే జలుబు చేసిందనుకో. పాపం దానికి మందులివ్వడానికి డాక్టరూ లేడు. ముక్కు తుడుచుకునే రుమాలివ్వడానికి తల్లీ లేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్తో గొంతులో ఖిచ్ఖిచ్ వస్తే దానికెవ్వడూ ఇంత విక్స్ ఇచ్చే దిక్కులేదు. అసలు ఇవన్నీ ఎందుకు?... కూల్నీళ్ల కారణంగా లోపల పేరుకుపోయేదాన్ని చీదడానికి... అసలు దానికి ముక్కే లేదు. అందుకే ఐస్వాటర్ వద్దురా‘‘ వివరంగా చెప్పిచూశాను. ‘‘ముక్కు లేదంటావేమిటి? అది గింజల్ని పొడుచుకునేది ముక్కుతోనే కదా. దాని మౌత్ను నేనెప్పుడో నోరు అంటే... నువ్వే కదా ఇంత పెద్ద క్లాసు తీసుకొని దాన్ని ముక్కు అనాలన్నావ్’’ నిలదీశాడు వాడు. ‘‘ముక్కులా ముందుకు పొడుచుకొచ్చింది కాబట్టి తెలుగులో దాన్ని మనం ముక్కు అంటాం గానీ వాస్తవంగా అది నోరు రా’’ ‘‘ఇప్పుడూ... పిట్టకు ముక్కే లేదన్నప్పుడు దానికి జలుబు ఎలా చేస్తుంది చెప్పు? అయినా... ఏమో నాన్నా... నాకు నువ్వూ అర్థం కావు... నీ భాషా అర్థం కాదు. పిట్టకు రెక్కలుంటాయి. నీకు ఉండవు. అయినా నీ చేతుల్ని నువ్వు రెక్కలంటావ్. రెక్కాడితేగానీ డొక్కాడదనీ, రెక్కల కష్టమనీ ఏదేదో మాట్లాడతావ్. దానికి ఉండీ నీకు లేని వాటిని నీకున్నాయంటావ్. దానికి నోరున్నా సరే ఇగ్నోర్ చేసి, దాన్ని నువ్వు ముక్కంటావ్. దానిది టియ్యూ టియ్యూ భాష అనీ... మన తెలుగు దానికెలాగూ దానికి అర్థం కాదని... దాని బాడీ పార్ట్స్ను నీ ఇష్టం వచ్చినట్టు పిలుస్తావ్. అందుకే ఐ హేట్ యూ’’ అలిగాడు వాడు. వాడంటున్నదీ నిజమే కదా. ఇప్పుడనిపిస్తోంది నాకు... పిట్ట ముక్కును ముక్కు అని కాకుండా పేరు మార్చాల్సిన అవసరం ఉందని!! అలా మారిస్తే అది పిట్ట ముక్కు కాదూ... నోరు అని తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా... తెలుగుభాషలో మాటలు కొరవడి నోటికీ, ముక్కుకూ ఒకే మాట వాడతారనే అపప్రథ తప్పిపోవడంతో పాటు వాడి పిచ్చి లాజిక్కుల చిక్కులూ తప్పిపోతాయని!! – యాసీన్ -
సచిన్ చేసిన మంచి పనిపై కూడా విమర్శలు
ముంబై : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మానవత్వంతో చేసిన ఓ మంచి పనిని కూడా కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు. గాయాలతో, తీవ్ర దప్పికతో ఎగరలేని స్థితిలో ఉన్న ఓ పక్షి సచిన్ ఇంటి బాల్కనీలోకి వచ్చింది. ఈ పక్షిని చూసి చలించిపోయిన ఈ దిగ్గజ క్రికెటర్ దానికి నీరు, ఆహారం అందించారు. అయితే అది చికెన్ తింటుందా, బ్రెడ్ తింటుందా అని ఒకింత అయోమయానికి కూడా గురయ్యారు. చివరకు దానికి ఆహారం, నీరు ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా ఆ పక్షి ఎగురలేకపోయింది. అది తీవ్రంగా గాయపడిందని గ్రహించిన సచిన్.. జంతువులను సంరక్షించే ఓ ఎన్జీవోకు సమాచారమిచ్చాడు. దానికి సరైన వైద్యం అందించి ఎగురేలా చేశాడు. దీన్నంతా స్వయంగా వీడియోతీసిన సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఫిదా అయినా అభిమానులు కొందరు సచిన్పై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం పనిగట్టుకోని విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు చేసిన పనికి అభిమానిగా గర్విస్తున్నామని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలానే అన్ని జీవులపై ప్రేమ చూపించండి. చేపలు, చికెన్, మటన్ తినడం మానేసి శాకహారిగా ఉండండి. అలాగే మీ హోటళ్లో కూడా శాకహారమే పెట్టండి’ అని ఇంకోకరు సెటైర్ వేసారు. -
సీఎంకు తప్పిన ప్రమాదం..ఎయిర్ ఇండియాకు చురకలు
గువహటి: మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో అకస్మాత్తుగా పక్షి అడ్డం రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా సీఎం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు జరిగిన ప్రమాదంపై బీరేన్ సింగ్ ట్విటర్లో వెల్లడించడంతో పాటు.. ప్రయాణీకులకు సరైన సౌకర్యాలుకల్పించలేకపోయిందంటూ ఎయిర్ ఎండియా యాజమాన్యంపై స్వయంగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. గువహటి ఎయిరిండియా విమారం ఇంపాల్ వెడుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 160 మందితో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, కానీ గువహటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని శుక్రవారం బీరేన్ ట్వీట్ చేశారు. పక్షి తాకి వుంటే.. రంధ్రం పడేదనీ.. కానీ అప్పటికే విమానం ల్యాండ్ అవుతూ వుండడంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అక్కడి మేనేజ్మెంట్ తీరు అస్సలు బాగోలేదంటూ, వసతులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బీరేన్ ట్విటర్లో ఆరోపించారు. ఇంకా చాలామంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం, వసతి లాంటివేవీ లేదన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం అందుబాటులో లేదని కూడా అధికారులు తెలిపినట్లు బీరేన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ఎ యిరిండియాకూడా స్పందించింది. ప్రమాద విషయాన్ని ధ్రువీకరించిన సంస్థ అధికార ప్రతినిధి.. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోలకతానుంచి తమ ఇంజనీర్ల బృందం పరిశీలనకు వెళ్లినట్టు చెప్పారు. అలాగే మరో విమానం ద్వారా ఈ మధ్యాహ్నానికి సంబంధిత ప్రయాణీకులను ఇంపాల్ చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.