CBSE
-
ఏప్రిల్ ఒకటి నుంచే ఇంటర్ తరగతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ను, సీబీ ఎస్ఈ విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ బోధన మొదలవుతుంది. ఏప్రిల్ 5 నుంచి మొదటి సంవత్సరం ప్రవేశాలు చేపడతారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. జాతీయ విద్యా విధానం–2020కి అనుగుణంగా ఇప్పటికే పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానంలో ఎన్సీఈఆర్టీ పాఠాలను బోధిస్తున్నారు. ప్రస్తు త (2024–25) విద్యా సంవత్సరంలో పదో తరగతి బోధన సైతం ఇదే విధానంలోకి మారింది. వచ్చే నెలలో (మార్చిలో) పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అనుగుణంగా 2025–26 వి ద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎన్సీఈఆర్టీ సిలబస్, సీబీఎస్ఈ విధానాలు అమలుచేస్తారు. ఇంటర్ విద్యలో జాతీయ స్థాయి సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలు, చేపట్టాల్సిన మార్పులపై నియమించిన కమిటీలు 12 రాష్ట్రాల్లో పర్యటించి ఇచ్చిన నివేదిక మేరకు ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం, 2026–27లో రెండో సంవత్సరంలో కొత్త సిలబస్ ప్రవేశపెడతారు. అలాగే, వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఎంబైపీసీ కోర్సును సైతం ప్రవేశపెడుతున్నారు. సీబీఎస్ఈ తరహాలో మార్పులుఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు, ఆ తర్వాత జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. 223 రోజులు పనిదినాలు ఉండేవి. అయితే, సీబీఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి, ఇంటర్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. జూన్ ఒకటిన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. తొలి 23 రోజుల్లో కనీసం 15 శాతం సిలబస్ పూర్తిచేసి వేసవి సెలవులు ఇస్తారు. పని దినాలు సైతం నెల రోజులు పెరిగాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏప్రిల్ 5 నుంచే మొదటి సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి. అందువల్ల పదో తరగతి పరీక్షలు (రెగ్యులర్/ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) రాసిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. పాసైన వారిని కొనసాగించి, ఫెయిలైనవారిని తొలగిస్తారు.ప్రభుత్వ కాలేజీల్లో జేఈఈ, ఎంసెట్ శిక్షణ రాష్ట్రంలోని సైన్స్ విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాస్తున్నందున ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా వీటిలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతోనే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అకడమిక్ తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకురెండు గంటలు జేఈఈ, ఎంసెట్ శిక్షణ ఇస్తారు. -
1000 CBSE ప్రభుత్వ స్కూళ్లు రద్దు.. అవి ధనవంతులకు మాత్రమే..
-
29 సీబీఎస్ఈ స్కూళ్లలో డమ్మీ విద్యార్థులు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ‘డమ్మీ’ విద్యార్థుల బాగోతం బయటపడింది. ఆయా సీబీఎస్ఈ అఫిలియేటెడ్ పాఠశాలల్లో వాస్తవ విద్యార్థుల సంఖ్యకు మించి ఎన్రోల్మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్గఢ్లలోని మొత్తం 29 పాఠశాలల్లో ఇలాంటి దందా జరుగుతున్నట్లు తేల్చారు. బాధిత పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మౌలిక సదుపాయాల లేమి వంటి ఇతర నిబంధనల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన ఈ పాఠశాలల యాజమాన్యాలపై న్యాయపరంగానూ చర్యలు తీసుకోనున్నారు.బుధ, గురువారాల్లో 29 బృందాలు ఈ మేరకు తనిఖీలు చేపట్టాయని సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా చెప్పారు. అవకతవకలను గుర్తించిన స్కూళ్లలో దేశ రాజధాని ఢిల్లీలోనివే 18 కాగా, వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్లలో రెండేసి చొప్పున ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో కొందరు డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు పొంది, పరీక్షలకు సిద్ధమయ్యేందుకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.తరగతులకు హాజరు కాకుండా వీరు నేరుగా బోర్డ్ పరీక్షలు రాసేలా ఆయా స్కూళ్లు వీరికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో మెడికల్ లేదా ఇంజినీరింగ్ సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందో చూసుకుని మరీ సంబంధిత ప్రాంతాల్లోని డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకుంటున్నారు. చదవండి: కొబ్బరినూనెపై ‘పన్ను’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు -
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన
-
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
సీబీఎస్ఈకీ మంగళం!
సాక్షి, అమరావతి: మొన్న టోఫెల్.. నిన్న ఐబీ.. నేడు సీబీఎస్ఈ.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ఉన్నతాశయంతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు వీటి ద్వారా బంగారు బాటలు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలుచేస్తే.. ఆయన మీద అక్కసుతో చంద్రబాబు సర్కారు పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తూ పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా.. జగన్ అమలుచేసిన ఒక్కో అంశానికీ స్వస్తి చెబుతోంది. టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఊసెత్తడంలేదు. తాజాగా.. సీబీఎస్ఈ బోధనకూ తూచ్ అంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది.విద్యా సంవత్సరంలో మధ్యలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోను, విద్యార్థుల్లోను వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే.. చంద్రబాబు సర్కారు ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దుచేసేసింది. అధికారంలోకి రాగానే ఇంగ్లిష్ మీడియం రద్దుచేస్తామని మొన్నటి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు బహిరంగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఆయనిప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే, విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘టోఫెల్’ శిక్షణను అధికారంలోకి వచ్చీరాగానే జూన్లో రద్దుచేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సీబీఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సీబీఎస్ఈ బోధనను రద్దుచేశారు. అలాగే, విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుళ విధానాల కారణంగా.. ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది.జగన్పై కోపంతోనే విద్యపై అక్కసు..‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు, మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’.. అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా అన్నారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా.. పేదల పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ మాటలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ముకాస్తూ రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఉదా.. గతంలో తక్కువ మంది విద్యార్థులున్నారని 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలికొదిలేశారు. అలాగే, 4,300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కోపంతో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు.విద్యా సంస్కరణలకు జగన్ శ్రీకారం..పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది నాణ్యమైన విద్య మాత్రమేనని, పేదరికం పోవాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన వైఎస్ జగన్ తన పాలనలో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే వారికి ఇంగ్లిష్ మీడియం బోధన ఉండాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతూ ఇంగ్లిష్ మీడియం అమలుచేశారు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. మరోపక్క.. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘టోఫెల్’ను సిలబస్లో అంతర్భాగం చేశారు. మరోపక్క.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా రాష్ట్రంలోని ఎక్కువమంది విద్యార్థులకు సీబీఎస్ఈ విద్యను అందించేందుకు 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో 2023–34 విద్యా సంవత్సరంలో 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తెచ్చారు. దీంతో దాదాపు 84 లక్షల మంది విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఒక యూనిట్ పరీక్షలు కూడా ముగిసిన తర్వాత ఉన్నపళంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షా విధానం రద్దుచేసి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసింది.అంధకారంలోకి 84 వేల సీబీఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తు..నిజానికి.. గత విద్యా సంవత్సరంలో పదో తరగతికి ఇంగ్లిష్ మీడియం అమలుచేయకున్నా దాదాపు 1.94 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2023–24 విద్యా సంవత్సరం నుంచి 1,000 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడీ స్కూళ్లల్లో దాదాపు 84 వేల మంది టెన్త్ విద్యార్థులు, 82 వేల మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే, ఇటీవల పదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పేపర్–పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దుచేసింది.‘ప్రైవేటు’కు 2 లక్షల మంది విద్యార్థులు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లిష్ మీడియంను సైతం రద్దుచేస్తామనడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు నాలుగేళ్లు ఇంగ్లిష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారమవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లిష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ‘రేషనలైజేషన్’ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దుచేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.తల్లికి వందనం ఎగనామం!మరోవైపు.. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రకటించింది. దీంతో.. తల్లికి వందనం కింద వచ్చే రూ.15 వేలకు అదనంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందని ప్రైవేటు స్కూళ్లు ఆకర్షిస్తుండడంతో తల్లిదండ్రులు అటువైపు వెళ్లారు. కానీ, అధికార పగ్గాలు చేపట్టాక మాటమార్చి వచ్చే విద్యా సంవత్సరంలో చూద్దామని శాసనసభ సాక్షిగా ఆ శాఖా మంత్రి లోకేశ్ ప్రకటించి తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు జల్లారు.నిర్దాక్షిణ్యంగా ‘టోఫెల్’ రద్దు..ఇక పదో తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో మన విద్యార్థులు ఇబ్బందులు పడకుండా, అంతర్జాతయ విద్యా ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్లో ప్రావీణ్యం సంపాదించేందుకు వీలుగా గత విద్యా సంవత్సరం జగన్ సర్కారు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. 3–5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6–9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. నాడు–నేడు పథకంలో భాగంగా స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు అందుబాటులోకి తెచ్చిన స్కూళ్లల్లో ఈ శిక్షణ అందించారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది (70 శాతం) విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికిగాను 4,17,879 మంది (92 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా, ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.ఐబీ శిక్షణకూ అదే గతి..‘టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమేగాని, స్కూలు పిల్లలకు ఎందుకు? ఈ విధానం సరైంది కాదు’.. అని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జూలైలో టాటా చెప్పేసింది. అలాగే, అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ‘ఐబీ’ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి.. ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లుచేశారు. కానీ, ఇప్పుడా కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. -
కూటమి రాజకీయ కక్ష.. అటకెక్కనున్న CBSE
-
కూటమి సర్కార్ కుట్ర.. విద్యారంగ సంస్కరణలపై వేటు!
సాక్షి, విజయవాడ: ఏపీ విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలకు కూటమి సర్కార్ తిలోదకాలు పలికింది. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలను ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్కు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సంస్కరణలపై వేటు వేస్తోంది...ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో సీబీఎస్ఈ సిలబస్ను కూడా ఎత్తేస్తామని ఆయన తెలిపారు. ఇక, బైజూస్ ట్యాబ్లు దండగ అంటూ టీడీపీ ముద్ర వేసింది. పిల్లలకు ఇచ్చే ట్యాబ్ల పంపిణీకి కూడా మంగళం పాడేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది.మరోవైపు.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టు అశోక్ బాబు తెలిపారు. ఇక, ఇప్పటికే టోఫెల్ శిక్షణను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలు తేవాలని వైఎస్ జగన్ ఎంతగానో ప్రయత్నించారు. కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడేందుకు ఆధునిక పద్ధతులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే టోఫెల్, ఐబీ సిలబస్, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ వంటి వాటిని వైఎస్ జగన్ అమలుచేశారు. దీంతో, వైఎస్ జగన్కు పేరు రావొద్దని భావించిన చంద్రబాబు.. సంస్కరణలు అన్నింటినీ ఎత్తేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు తన పార్టీ ఎమ్మెల్సీలు, ఎల్లో పత్రికలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. క్రమంగా ఒక్కో సంస్కరణపై చంద్రబాబు వేటు వేసుకుంటూ వస్తున్నారు. -
విద్యలో సరికొత్త విప్లవం
» ఇదీ జగన్ బ్రాండ్ గవర్నెన్స్ » పేద విద్యార్థుల చెంతకు ఇంగ్లిష్ చదువులు » ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లలు రాణించేలా నైపుణ్య శిక్షణ » అన్ని స్థాయిల్లోను యాక్టివిటీ బేస్డ్ పాఠ్యపుస్తకాల రూపకల్పన » ఐటీ కోర్సుల్లో శిక్షణకు స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం » నిత్య జీవిత సమస్యలను అధిగమించేందుకు ‘సంకల్పం’ శిక్షణ » డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ » ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు సోమవారంహాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారంఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారంవెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారంఅన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారంఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్–సాక్షి, అమరావతిమన ఇంగ్లిష్ విద్యపై ప్రశంసల జల్లు » ‘‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ » ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ » ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు అమలుకు సిద్ధం’’ » ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే గాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు మొత్తం రూ.25,809.5 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు. నాడు– నేడులో చేసిన ఖర్చు విడత పాఠశాలలు ఖర్చు (రూ.కోట్లలో) మొదటి 15,715 3,669 రెండో 22,344 8,000 -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లల్లో తొలిసారి పరీక్షలు
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి 8, 9 తరగతుల విద్యార్థులు పీరియాడిక్ రాత పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ పరీక్షలు రాయనున్నారు. గతేడాది 1,000 ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే దాదాపు విద్యా సంవత్సరం పూర్తవడంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు స్టేట్ బోర్డు పరీక్షలైన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లకే హాజరయ్యారు. కాగా, ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి సీబీఎస్ఈ బోర్డు నిర్వహించే పీడబ్ల్యూటీ, టర్మ్ పరీక్షలు రాయనున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠశాలల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ బోధనకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు 2023–24 నుంచి సీబీఎస్ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ బోర్డు పరీక్షలు రాస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల తరహాలో పీరియాడిక్ పరీక్షలు (పీడబ్ల్యూటీ), టర్మ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు పీడబ్ల్యూటీ జరగనున్నాయి. విషయ పరిజ్ఞానం పెంచేలా.. విద్యా సంవత్సరంలో పీడబ్ల్యూటీలు నాలుగు, టర్మ్ పరీక్షలు రెండు ఉంటాయి. టర్మ్–1 నవంబర్లో, టర్మ్–2 (వార్షిక) పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, రెండు భాషా పేపర్లు (మొదటి భాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు) రాయాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు 50 మార్కులకు నిర్వహించే పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాత, 10 మార్కులకు ఇంటర్నల్ థియరీ పరీక్ష ఉంటుంది. 100 మార్కుల టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాత, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్ థియరీ) ఉంటాయి. విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలంటే ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో ప్రాజెక్టులు, ల్యాబ్ టెస్టులు కూడా ఉంటాయి. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా విద్యార్థులతో పోటీపడేలా పరీక్షల్లో విషయ పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఇందులో పెన్ పేపర్ టెస్ట్ (5 మార్కులు), మల్టిపుల్ అసెస్మెంట్ (5), ఫోర్ట్పోలియో (5), సబ్జెక్టుపై విద్యార్థికున్న అవగాహనకు 5 మార్కులు మొత్తం 20 మార్కులు కేటాయించారు. భాషా పరీక్షలో వ్యూహాత్మకంగా పరిష్కరించే పజిల్స్, క్లాస్వర్క్, ఇంగ్లిష్ మాట్లాడడం, విని అర్థం చేసుకునే సామర్థ్యంపైన ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న 85,353 మంది విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీరికి వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి సిలబస్ను బోధించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 10వ తరగతిలో ‘స్కిల్’ సబ్జెక్టు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం(2024–25)లో 10వ తరగతిలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయనున్నారు. ఈ క్రమంలో వీరికి ఆరో సబ్జెక్టుగా ‘స్కిల్ టెస్ట్’ను ప్రవేశపెట్టారు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ పరీక్షలో తప్పిన విద్యార్థులు స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుని పాస్ చేస్తారు. ఆరో సబ్జెక్టుగా విద్యార్థుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. పదో తరగతి విద్యార్థులు ఈ రెండింటిలో ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. జాగ్రత్త పాటించండి సీబీఎస్ఈ బోర్డు క్యాలెండర్ ప్రకారం.. వచ్చే మార్చి 31 నాటికి 9వ తరగతి పరీక్షలు పూర్తిచేసి, ఏప్రిల్ 1 నుంచి 10వ తరగతి బోధన చేపట్టాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం 9వ తరగతి విద్యార్థుల బోర్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల వివరాల నమోదులో పాఠశాలల ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థి పేరు, ఆధార్, తల్లిదండ్రుల వివరాలు పుట్టిన తేదీ ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్త వహించాలి. – ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, సీబీఎస్ఈ స్కూల్స్. -
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్గా అప్గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
CBSE 10th Class Result 2023: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలను విడదుల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://cbseresults.nic.in/ వెబ్సైట్తో పాటు డిజిలాకర్, ఇతర వెబ్సైట్లలో చెక్చేసుకోవచ్చు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు జరిగాయి. మొత్తం 21, 86,940 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. చదవండి: మోదీ 'మన్ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్.. -
2025 నుంచి సీబీఎస్ఈ ప్యాట్రన్లో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్ఈ ప్యాట్రన్లో నిర్వహించనున్నారు. ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్ల విద్యార్థులు సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022–23, 2023–24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్ – సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి. అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది. సీబీఎస్ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022–23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్ఈ గుర్తింపు రాష్ట్రంలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి. నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్ఈ ప్యాట్రన్లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యానికి ముకుతాడు వేయాలని విద్యాశాఖ భావిస్తోంది. డీఏవీ స్కూల్ ఉదంతం నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో డొనేషన్లు, ఫీజులు కనీస వసతులతో పాటు నిర్వహణ తీరుతెన్నులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమైంది. సీసీ కెమెరాల నిఘా నడుమ పాఠశాల నిర్వహణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. మండలం యూనిట్గా ఆయా పాఠశాల వ్యవహారంపై సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని ఆధారంగా రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాల అనుమతి పునరుద్ధరించే సమయంలో చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది. పాఠశాలకు అనుమతి రెన్యువల్ చేయడమో.. లేక తిరస్కరించడమో చేయనుంది. నిబంధనలు తూచ తప్పకుండా పాటించే విధంగా షరతులను అనుమతికి కొర్రీగా పెట్టనుంది. నిబంధనలు అమలు చేసే అవకాశం లేకపోలేదని విద్యాశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర స్కూళ్లపై కూడా.. ►స్టేట్ సిలబస్తో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూల్స్పై కూడా పర్యవేక్షణ కొనసాగే విధంగా చర్యలు చేపట్టనుంది. స్టేట్ సిలబస్ పాఠశాలపై పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులది ఉండగా, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ గుర్తింపునకు మాత్రం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) మాత్రమే జారీ చేస్తోంది. ►ఈ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎన్ఓసీ సైతం ఉపసంహరించే విధంగా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం ఫీజులపై దృష్టి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు దండుకునే విషయంలో చూపే శ్రద్ధ.. మౌలిక వసతులను కల్పించడంలో లేకపోవడం సర్వసాధారణంగా తయారైంది. ►ప్రైవేటు యాజమాన్యాలు విద్యకు మినహా ఆటలకు, భద్రతకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అపార్టుమెంట్లు, ఇరుకు గదుల్లో తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భద్రతను గాలిలో దీపంలా ఉంచుతున్నారు. ఏదైనా సమస్య రానంత వరకూ బాగానే ఉంటుంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విద్యావేత్తలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి.. ►ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాల ఏర్పాటుకు ముందు అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సర్టిఫికెట్ పొందాలి. సంబంధితశాఖ అధికారులు భవనం అనుకూలతను పరిశీలించి అనువుగా ఉంటేనే ధ్రువీకరించాలి. ►కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా ఒత్తిళ్లు, పలుకుబడితో అనుమతులు లభించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రెన్యువల్ సమయంలో కూడా కేవలం పేపర్ల ఆధారంగానే సర్టిఫై చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇక విద్యాశాఖ అధికారులది కూడా అదే పరిస్థితి అని పలువురు పెదవి విరుస్తున్నారు. పాఠశాలలను పరిశీలించకుండానే అనుమతుల జారీ అనుమానాలకు తావిస్తోది. -
CBSE 10th Result 2022: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు. బాలికల్లో దియా నామ్దేవ్, బాలురలో మయాంక్ యాదవ్ నేషనల్ టాపర్స్గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్కు చెందినవారే కావడం విశేషం. కాన్సెప్ట్లను అర్థం చేసుకుని చదివా షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్గా నిలిచానని దియా నామ్దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్గా నిలిచాన’ని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన మయాంక్ యాదవ్ కూడా 100 శాతం మార్కులతో టాపర్గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్గా నిలవడం పట్ల మయాంక్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్రివేండ్రం టాప్.. గువాహటి లాస్ట్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ( కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు) -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
-
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
సీబీఎస్ఈ సిలబస్లో భారీ మార్పులు
న్యూఢిల్లీ: 2022–23 విద్యా సంవత్సరానికి 11, 12వ తరగతుల సిలబస్లో సీబీఎస్ఈ పలు మార్పులు ప్రకటించింది. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అలీనోద్యమం, ప్రచ్ఛన్నయుద్ధ కాలం, ఆసియా–ఆఫ్రికా దేశాల్లో ముస్లిం సామ్రాజ్యాల అవతరణ, మొగలుల పాలన, పారిశ్రామిక విప్లవం పాఠ్యాంశాలను తొలగించింది. 10వ తరగతిలో ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్లోని ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్ను తీసేసింది. ఉర్దూ కవి ఫయీజ్ అహ్మద్ ఫయిజ్ అనువాద కవితలను, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్లను తీసేసింది. సిలబస్లో హేతుబద్ధత కోసమే ఈ మార్పులు చేసినట్టు చెప్పింది. గత విద్యా సంవత్సరంలో రెండు దఫాలుగా నిర్వహించిన ఫైనల్ పరీక్షను ఈసారి ఒకే దఫా నిర్వహించాలని నిర్ణయించింది. 2020లోనూ 11వ తరగతి రాజనీతి శాస్త్రంలో పలు చాప్టర్లు తొలగించిన సీబీఎస్ఈ, నిరసనలతో మరుసటి ఏడాది నుంచి వాటిని పునరుద్ధరించింది. -
జేఈఈ మెయిన్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ను ఎన్టీఏ వాయిదా వేసింది. ఈమేరకు బుధవారం రాత్రి పబ్లిక్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తోన్న విన్నపాలను పరిశీలించిన ఎన్టీఏ జేఈఈ 2 విడతల పరీక్షలను వాయిదా వేసింది. తొలి విడత పరీక్షలను జూన్లో, రెండో విడత జులైలో నిర్వహించనుంది. ఇంతకు ముందు ఫస్ట్, సెకండ్ సెషన్లను 6 రోజుల చొప్పున నిర్వహించాలని నిర్ణయించగా సవరించిన షెడ్యూల్లో పదేసి రోజులకు పెంచారు. తొలివిడత పరీక్షల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇచ్చారు. రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇంతకుముందు పేర్కొన్న ప్రకారం రెండో విడత దరఖాస్తు ప్రక్రియ 8వ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉంది. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకొనే తేదీని కూడా తరువాత వెల్లడిస్తామని ఎన్టీఏ తెలిపింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు, హయ్యర్ సెకండరీ బోర్డుల పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరుగుతున్నాయి. అదే సమయంలో జేఈఈ మెయిన్ కూడా జరుగుతుండడంతో విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. 2 పరీక్షలూ కీలకమైనవి కావడంతో దేనిపై దృష్టి పెట్టాలో తెలియక ఒత్తిడికి లోనవుతున్నారు. జేఈఈ షెడ్యూల్ దృష్ట్యా బోర్డు పరీక్షలు ఇప్పటికే 2 సార్లు మారాయి. ఇంటర్ పరీక్షలు నెల పాటు ఆలస్యమయ్యాయి. ఏపీలో ఏప్రిల్ 8 నుంచి 28 వ తేదీవరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉండగా జేఈఈ తొలి షెడ్యూల్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు ప్రకటించడంతో బోర్డు పరీక్షల తేదీలను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ తేదీలను మళ్లీ ఏప్రిల్ 21 నుంచి మే 4వరకు మార్చడంతో ఇంటర్ పరీక్షల తేదీలను కూడా మార్చి మే 6 నుంచి మే 24 వరకు పెట్టారు. ఇప్పుడు జేఈఈ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అడ్వాన్స్డ్ పైనా ప్రభావం జేఈఈ మెయిన్ వాయిదా ప్రభావం జేఈఈ అడ్వాన్స్డ్పైనా పడుతోంది. జూలై 3 న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలని ముంబై ఐఐటీ ఇంతకు ముందే షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 21 నుంచి 30వ తేదీవరకు జరుగనున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అడ్వాన్స్డ్ నిర్వహించేందుకు వీలుంటుంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. -
మేలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్షను మేలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించినట్లు తెలిసింది.ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్లోనే పరీక్ష నిర్వహించాలను కున్నా సీబీఎస్ఈ టర్మ్–2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నిబంధనలు సడలించాలని డిమాండ్లు జేఈఈ మెయిన్స్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్, ప్లస్–2లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారీ సడలించాలని పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గత రెండేళ్లుగా పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ప్రమోట్ అవుతున్నారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్కు పంపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలుత నిర్వహించకుండా సెకెండియర్కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షల నిర్వహించినా కేవలం 49 శాతమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వీళ్ళే జేఈఈ మెయిన్స్ రాయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చాలామందికి 75 మార్కులు ఇంటర్లో వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఈ కారణంగా ఈ నిబంధన సడలింపు కోరుతున్నారు. రెండుసార్లు చాలు! జేఈఈ మెయిన్స్ను రెండుసార్లు నిర్వహిస్తే చాలన్న అభిప్రాయంతో అన్ని రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి. తమిళనాడు, ఢిల్లీ విద్యార్థులు 4 సార్లూ మెయిన్స్ నిర్వహించాలని, ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఏ మాత్రం ఈ అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడట్లేదు. గతేడాది కూడా 4 అవకాశాలు ఇచ్చినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరవలేదు. ఆఖరి రెండు దఫాలకు హాజరు బాగా తగ్గిందని ఎన్టీఏ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా పరీక్షను రెండుసార్లే నిర్వహించడంపై ఎన్టీఏ దృష్టి పెట్టింది. -
ఇదేం ‘పరీక్ష’?
సాక్షి, అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానం అమలవుతున్న స్కూళ్లలో 10, 12 తరగతుల పరీక్షలకు ఒకే ఏడాది వేర్వేరు విధానాలను అనుసరిస్తుండడంపై విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏడాది వేర్వేరు రకాలుగా పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని, పాఠ్యబోధనలో తమకూ ఇబ్బందులు తప్పవని టీచర్లు చెబుతున్నారు. సీబీఎస్ఈ ఈ ఏడాది 10, 12 తరగతుల విద్యార్థులకు రెండు టర్మ్ల పరీక్షల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఒకే ఏడాదిలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ టర్మ్ పరీక్షలు గతేడాది నవంబర్–డిసెంబర్ల్లో జరిగాయి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఈ పరీక్షలను నిర్వహించారు. రెండో టర్మ్ పరీక్షలను వచ్చే మార్చిలో నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను బోర్డు ఇంకా విడుదల చేయలేదు. రెండో టర్మ్ పరీక్షలను వ్యాసరూప (డిస్క్రిప్టివ్) ప్రశ్నల విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళానికి కారణమవుతోంది. ఒకే విధానంలో పరీక్షలు ఉండాలి.. సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షలు రెండింటికీ ఒకే విధానాన్ని కాకుండా వేర్వేరు విధానాలను అనుసరించడం సరికాదన్నది పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్ల అభిప్రాయం. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో విద్యార్థుల్లో సృజనాత్మకత, అవగాహన శక్తి, ఇతర నైపుణ్యాలను లోతుగా అంచనా వేసే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. వ్యాసరూప ప్రశ్నలతో అయితే విద్యార్థి సమాధానాల తీరును పరిశీలించడం ద్వారా ఆ నైపుణ్యాలను తెలుసుకోగలుగుతామని కొందరు అంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల ద్వారానే విద్యార్థిని లోతుగా, సంపూర్ణంగా అన్ని అంశాల్లో పరిశీలించవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. పైగా వివిధ పోటీపరీక్షల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంతో విద్యార్థులకు వాటిని ఎదుర్కొనేలా ముందుగానే తర్ఫీదునిచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఒక ఏడాదిలో ఈ రెండింటిలో ఏదో ఒక విధానంలోనే పరీక్షలు నిర్వహించడం సరైనదని అంటున్నారు. ఒకే విద్యా సంవత్సరంలో సగం రోజులు ఒక తరహా పరీక్షలకు బోధించి, ఆ వెంటనే మరో తరహాలో బోధించడం కష్టమని వివరిస్తున్నారు. విద్యార్థుల విముఖత విద్యార్థులు కూడా కొన్ని రోజులు ఆబ్జెక్టివ్కు అలవాటు పడి.. ఆ వెంటనే డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు రాయడం కష్టమేనని చెబుతున్నారు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. రెండు విధానాల్లో పరీక్షలపై విద్యార్థులు కూడా విముఖంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు విద్యార్థులు సన్నద్ధం కావడం కష్టమని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల ద్వారా గణితం, అర్థశాస్త్రం వంటి సబ్జెక్టులను నేర్చుకున్న విద్యార్థులు.. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఒక ఏడాదికి ఒకే తరహా పరీక్షలు పెడితే ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు, తాము సీబీఎస్ఈకి ఈ విషయంలో విజ్ఞప్తి చేశామని టీచర్లు చెబుతున్నారు. -
రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్షిప్.. ఆన్లైన్లో అప్లై చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్(ఎస్జీసీఎస్) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్షిప్ను సీబీఎస్ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ► విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్ గర్ల్చైల్డ్) అయి ఉండాలి. ► ఈ స్కాలర్షిప్కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. ► విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి. ► పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు. ► 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు. ► 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్షిప్నకు అర్హులు. ► సీబీఎస్ఈ బోర్డుకు సంబంధించి ఎన్ఆర్ఐ విద్యార్థిని అయితే ట్యూషన్ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్షిప్కు అర్హురాలే. ► విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్ఈ వెబ్సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజనల్ అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వ్యవధి ► స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ► స్కాలర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి. ► ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్షిప్ కొనసాగుతుంది. ► స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు. స్కాలర్షిప్ మొత్తం ► విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 ► సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022 ► వెబ్సైట్: cbse.nic.in -
సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!
ఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల పరీక్షా పత్రంలో వచ్చిన ఒక వివాదాస్పద వ్యాసం తీవ్ర దుమారం రేపింది. దాంతో దీన్ని ఉపసంహరిస్తున్నామని సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. విద్యార్థులందరికీ ఈ ప్రశ్నకు సంబంధించి ఫుల్ మార్కులు ఇస్తామని పేర్కొంది. వ్యాసంలో అంశాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బోర్డు, ఇది ఒక దురదృష్ట ఘటనగా అభివర్ణించింది. విద్యాభ్యాసనలో సమానత్వానికి, శ్రేష్టతకు సీబీఎస్ఈ కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. సీబీఎస్ఈ 10వ తరగతి ఇంగ్లిషు టర్మ్ 1 ప్రశ్నాపత్రంలోని ఒక వ్యాసంలో లైంగిక వివక్ష, తిరోగామి విశ్వాసాలను ప్రతిబింబించే అభిప్రాయాలున్నాయని శనివారం తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే సీబీఎస్ఈ అప్రమత్తమైంది. ఈ వ్యాసంలో ‘‘ పిల్లలపై తల్లిదండ్రుల అధికారాన్ని స్త్రీ విముక్తి నాశనం చేసింది’’, ‘‘భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే పిల్లల విధేయతను తల్లి పొందగలదు’’ అనే వాక్యాలున్నాయి. ‘‘స్త్రీ స్వాతంత్య్రం అనేక సామాజికార్థిక సమస్యలకు కారణమైంది, భర్తకు భార్య విధేయత చూపకపోవడంతో పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగింది’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో సీబీఎస్పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో సీబీఎస్ఈ ‘ఇన్సల్ట్స్ ఉమెన్’ పేరిట హ్యాష్ట్యాగ్లు దర్శనమిచ్చాయి. బోర్డు స్త్రీద్వేష, తిరోగామి భావనలకు మద్దతినిస్తోందని పలువురు దుయ్యబట్టారు. దీంతో స్పందించిన బోర్డు సదరు వ్యాసం తమ ప్రశ్నాపత్రాల రూపకల్పనా నిబంధనలకు అనుగుణంగా లేదని, విద్యార్ధులకు పూర్తి మార్కులు కేటాయిస్తామని బోర్డు పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరధ్వాజ్ ప్రకటించారు. లోక్సభలో ప్రస్తావించిన కాంగ్రెస్ సీబీఎస్ఈ పరీక్షా పత్రంలోని వ్యాసం అసంబద్ధం, స్త్రీ ద్వేషపూర్వకమని కాంగెస్ర్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. చదువు, పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలు నాసిరకంగా మారాయని ఈ వ్యాసం నిరూపిస్తోందన్నారు. సోమవారం లోక్సభ జీరో అవర్లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించి పభ్రుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షలో స్త్రీద్వేష పూర్వక వ్యాసం ప్రత్యక్షమవడమై తీసుకున్న చర్యలకు సంబంధించి ఈనెల 17లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్ఈకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
సీబీఎస్ఈకి 1,092 స్కూళ్లు ఎంపిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు తెస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మూల్యాంకన విధానంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతో సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ముందుగా సీబీఎస్ఈకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా సుముఖత వ్యక్తపరిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 1,092 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి దశ కింద వీటిలో సీబీఎస్ఈ అమలుకు నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రాసేలా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడో తరగతి నుంచి అమలు చేయాలని ముందు నిర్ణయించారు. అయితే సీబీఎస్ఈ అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిపోతుండడంతో వచ్చే ఏడాది నుంచి అంటే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేజీబీవీలకు అగ్రస్థానం తొలి విడతగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంలోని 10 విభాగాల యాజమాన్యాల పరిధిలో ఉన్న వివిధ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో నిరుపేద, అనాధ బాలికలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఏపీ మోడల్ స్కూళ్లు, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకుల స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, జెడ్పీ, ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో.. సీబీఎస్ఈ విధానం తొలి విడత అమలుకు సంబంధించి ఎంపిక చేసిన స్కూళ్లలో అత్యధికం అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 137 స్కూళ్లను ఎంపిక చేయగా రెండో స్థానంలో కర్నూలు (128) మూడో స్థానంలో ప్రకాశం (94) ఉన్నాయి. -
AP: ఇంటి దగ్గరే ‘ప్రాక్టికల్స్’
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్ ప్రయోగాల (ప్రాక్టికల్స్)లోనూ మార్పులు చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది. ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటినుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్లో లాక్డౌన్ కారణంగా ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్లైన్ ప్లాట్ఫాం ‘ఓల్యాబ్స్టో’ ద్వారా సీబీఎస్ఈ కరిక్యులమ్ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మాన్యువల్ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అందుబాటులో ఉండే వనరులతోనే ప్రయోగాలు విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్ దీక్షా పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్ఈలో ప్లస్ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది. -
పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకునేందుకు ఓకే: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభంకానున్న 10, 12 తరగతుల మొదటి టర్మ్ బోర్డు పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చుకొనేందుకు సీబీఎస్ఈ అనుమతించింది. అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా విద్యార్థి వేరే నగరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ నగరంలో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ సీబీఎస్ఈ బుధవారం ప్రకటన జారీ చేసింది. కొందరు విద్యార్థులు వారు అడ్మిషన్ తీసుకున్న నగరంలో కాకుండా ఇప్పటికీ ఇతర నగరాల్లో నివసిస్తున్నారని సీబీఎస్ఈ దృష్టికి వచ్చిందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పరీక్షా కేంద్రం నగరాన్ని మార్చడానికి విద్యార్థుల సంబంధిత పాఠశాలలకు ఒక అభ్యర్థన చేసేందుకు నిర్ధిష్ట సమయాన్ని ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న విద్యార్థులు, ఆ సమయంలో దరఖాస్తు చేసుకుంటేనే బోర్డు అంగీకరిస్తుందని భరద్వాజ్ తెలిపారు. కాగా 10వ తరగతి ఫస్ట్ టర్మ్ పరీక్షలు నవంబర్ 30 నుంచి, 12 తరగతి పరీక్షలు డిసెంబర్ 1 నుంచి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైన విషయం తెలిసిందే. (ఈ కోర్సులు చదవితే జాబ్ ఆఫర్లు అపారం!) -
చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఎంత పనిచేసింది..
సాక్షి, మియాపూర్(హైదరాబాద్): చక్కగా చదువుకోలేకపోతున్నాననే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవికుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దయాళ్పూర్నకు చెందిన వీరేంద్రసింగ్ నేగి, సోనియా నేగి దంపతులకు కుమార్తె జాహ్నవి నేగి (17), కుమారుడు ఉన్నారు. వీరు మియాపూర్ మైహోమ్స్లో టార్క్ ఐఎస్ బ్లాక్లో 9వ అంతస్తులో జీవనం కొనసాగిస్తున్నారు. జాహ్నవి ప్రస్తుతం సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు వాకింగ్కు వెళ్లారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 9వ అంతస్తు నుంచి కిందకి దూకింది. గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు జాహ్నవి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. చదువులో మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డేటింగ్ యాప్లో పరిచయం.. చాటింగ్లో మునిగితేలారు.. చివరకు -
8వ తరగతికి కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తరగతి సిలబస్ను మార్పు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 21న విద్యావేత్తలు, నిపుణులతో సదస్సు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆ దిశగా 8వ తరగతి సిలబస్ను రూపొందించనున్నారు. ఇప్పటికే 7వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాల సిలబస్ను మార్పు చేసి.. దాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేసినందున విద్యార్థులకు బైలింగ్యువల్ (ద్విభాష) పాఠ్యపుస్తకాలను రూపొందించి పంపిణీ చేశారు. ఇప్పుడు 8వ తరగతి సిలబస్ను కూడా సీబీఎస్ఈ విధానానికి అనుగుణంగా మార్పులు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఈ నెల 21న జరిగే సదస్సులో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సీబీఎస్ఈకి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి.. వాటిలో ముందుగా ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే 1,092 స్కూళ్లను అధికారులు గుర్తించారు. వీటిలో మోడల్ స్కూళ్లు 164, ఏపీఆర్ఐఈ సొసైటీ స్కూళ్లు 50, బీసీ వెల్ఫేర్ స్కూళ్లు 78, కేజీబీవీలు 352, ఎంపీపీ, జడ్పీ స్కూళ్లు 126, మున్సిపల్ స్కూళ్లు 5, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 180, ప్రభుత్వ స్కూళ్లు 4, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు 126, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూళ్లు 7 ఉన్నాయి. -
ఆఫ్లైన్లోనే సీబీఎస్ఈ టర్మ్–1 పరీక్షలు
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల టర్మ్–1 బోర్డు పరీక్షలను ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గురువారం ప్రకటించింది. నవంబర్–డిసెంబర్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్ను ఈ నెల 18న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుందని, ఒక్కో టెస్టు వ్యవధి 90 నిమిషాలని పేర్కొంది. చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10.30 గంటలకు కాకుండా 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. టర్మ్–1, టర్మ్–2 పరీక్షల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ తెలిపారు. టర్మ్–2 పరీక్షలను వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. -
NEET Exam: ఈనెల 12న షెడ్యూల్ ప్రకారం యథాతథం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంర్ 12న ఆదివారమే ఈ పరీక్షను నిర్వహించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్గా నిలిచింది
-
DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్కు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాల వెల్లడిలో థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్కు వర్తింపజేయొద్దని సీబీఎస్ఈకి ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) సూచించింది. ఆ విధంగా చేయడం సీబీఎస్ఈ సొంత పాలసీకి విరుద్ధమని పేర్కొంది. 12వ తరగతి విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై డీసీపీసీఆర్ ఈ మేరకు స్పందించింది. పరీక్ష కేంద్రం పొరపాటు వల్ల తన కుమారుడు 2019–20లో గణితం ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానట్లు నమోదయిందని, అసెస్మెంట్లో 20కుగానూ 17 మార్కులు వచ్చాయని విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. అయితే ప్రొ–రాటా (నిష్పత్తి) ప్రకారం 20కు నాలుగు మార్కులు మాత్రమే ఇస్తున్నట్లు సీబీఎస్ఈ రీజినల్ డైరెక్టర్ చెప్పారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడం సీబీఎస్ఈ పాత్ర. పరిధికి మించి అధికారాలు ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం’’అని డీసీపీసీఆర్ ఛైర్పర్సన్ అనురాగ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. డీసీపీసీఆర్–2005 చట్టం ప్రకారం.. విద్యార్థి పరీక్షకు హాజరైనప్పటికీ అబ్సెంట్గా నమోదు చేయడం వల్ల విద్యార్థి నష్టపోవడమే కాదు అతడి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ గ్రేడ్లు ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మార్చడం కుదరదని, విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం పడకుండా హాజరు సరిదిద్దే క్రమంలోనే ప్రొ–రాటా విధానం ప్రకారం ప్రాక్టికల్ మార్కులు లెక్కించి 20కు నాలుగు మార్కులు ఇచ్చినట్లు కమిషన్కు సీబీఎస్ఈ వివరించింది. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడో అన్ని మార్కులు ఇవ్వాలని, ప్రొ–రాటా విధానం ప్రకారం ఇవ్వరాదని డీసీపీసీఆర్ స్పష్టం చేసింది. మార్కులు తగిన విధంగా ఇవ్వడానికి సీబీఎస్ఈ పాలసీని సవరించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని సూచించింది. సర్వీసు రూల్స్ ప్రకారం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని విద్యార్థికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. చదవండి: కోవిడ్తో 77 మంది లాయర్ల మృతి.. సుప్రీంకోర్టు నివాళి -
CBSE: ఆగస్ట్ 15– సెప్టెంబర్ 15 మధ్య ఐచ్ఛిక పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: 12వ తరగతి ఐచ్ఛిక పరీక్షలు ఆగస్టు 15– సెప్టెంబరు 15 మధ్య నిర్వహిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. అదీ పరిస్థితులు అనుకూలిస్తేనే అని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఫలితాల వెల్లడికి కాలపరిమితి నిర్ణయిస్తామని తెలిపింది. ఫలితాల అనంతరం విద్యార్థుల కోసం వివాద పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. అసెస్మెంట్ పాలసీ ప్రకారం జూలై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని, తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఐచ్ఛిక పరీక్షలకు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. వీరికి పరీక్షల్లో వచ్చి న మార్కులనే తుది ఫలితంగా ఖరారు చేస్తామని వివరించింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మూడేళ్ల ప్రతిభను ఆధారంగా మూల్యాంకనం చేస్తామని, 30:30:40 ఫార్ములాను అనుసరిస్తామని సీబీఎస్ఈ ప్రతిపాదించగా సుప్రీంకోర్టు ఆమోదించడం తెలిసిందే. పదో తరగతి మార్కులను 30 శాతానికి, 11వ తరగతి మార్కులకు 30 శాతానికి, 12వ తరగతిలో యూనిట్ టెస్టులు, మిడ్టర్మ్ పరీక్షలు, ప్రీ ఫైనల్స్ను కలిపి 40 శాతానికి పరిగణనలోకి తీసుకొని మార్కులకు కేటాయిస్తామని సీబీఎస్ఈ వివరించింది. సెప్టెంబర్ ఒకటిలోపు పరీక్షలు నిర్వహిస్తామని సీఐఎస్సీఈ తెలిపింది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..? -
సీబీఎస్ఈ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ
-
CBSE: మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మూల్యాంకనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020–21 విద్యా సంవత్సరంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ)లు ప్రతిపాదించిన అసెస్మెంట్ స్కీమ్కు సుప్రీంకోర్టు గురువారం ఆమోదముద్ర వేసింది. దేశంలో 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దు నిర్ణయంపై ఇక పునరాలోచన లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. 10, 11, 12వ తరగతుల ఫలితాల ఆధారంగా విద్యార్థులకు తుది మార్కులు కేటాయించేందుకు 30:30:40 ఫార్ములాను సీబీఎస్ఈ తెరపైకి తీసుకొచ్చింది. తుది ఫలితాలను ప్రకటించే విషయంలో గత ఆరేళ్లలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటామని సీఐఎస్సీఈ వెల్లడించింది. జూలై 31వ తేదీలోగా ఫలితాలను ప్రకటిస్తామని రెండు బోర్డులు తెలియజేశాయి. అసెస్మెంట్ స్కీమ్ పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించే పరీక్షలకు హాజరు కావొచ్చని సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ సూచించాయి. విద్యార్థులు 10, 11, 12వ తరగతుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి, 30:30:40 ఫార్ములా ప్రకారం తుది ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. 10వ తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపింది. 12వ తరగతిలో ప్రాక్టికల్, ఇంటర్నల్ అసెస్మెంట్లో విద్యార్థులు సాధించిన మార్కులను సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, తుది ఫలితాలను ప్రకటించే విషయంలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. పదో తరగతిలో ప్రధాన ఐదు సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులపై వివక్ష చూపే ప్రశ్నే లేదు 12వ తరగతి బోర్డు పరీక్షల రద్దును సవాలు చేస్తూ సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎ.ఎం.ఖన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. పిటిషన్ను తిరస్కరించింది. పరీక్షల రద్దు నిర్ణయంపై పునరాలోచన ప్రసక్తే లేదని ఉద్ఘాటించింది. ‘‘పరీక్షల విషయంలో సీఐఎస్సీఈ, సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఆమోదించాం. పరీక్షలు రాయాలని, మార్కులు మెరుగుపర్చుకోవాలని కోరుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు పరీక్షలు రాసుకోవచ్చు. పరీక్షలకు హాజరు కావాలని ఆశించే వారిపై వివక్ష చూపే ప్రశ్నే లేదు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఎస్ఈ ప్రతిపాదించిన అసెస్మెంట్ స్కీమ్ను స్వీకరించేందుకు తమకు అభ్యంతరాలు లేవని వెల్లడించింది. దీనిపై బోర్డు ముందుకెళ్లవచ్చని సూచించింది. అసెస్మెంట్ స్కీమ్ను ఖరారు చేసి, నోటిఫై చేసుకోవడానికి సీఐఎస్సీఈ, సీబీఎస్ఈకి స్వేచ్ఛ ఉందని వివరించింది. ఇంకా ఏవైనా ప్రతిపాదనలు చేస్తే పరిశీలిస్తామని తెలియజేసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. సీబీఎస్ఈ తరపున అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ వాదనలు వినిపించారు. వివాదాల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి అసెస్మెంట్ స్కీమ్పై ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఐఎస్సీఈ, సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. వివాదాల పరిష్కారంపై ప్రొవిజన్స్ను ఈ స్కీమ్లో చేర్చాలని స్పష్టం చేసింది. తుది మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు కోర్టు తలుపులు తట్టే అవకాశం ఉందని గుర్తుచేసింది. సీబీఎస్ఈ చరిత్రలో ఇదే తొలిసారి ‘‘సీబీఎస్ఈ 1929 నుంచి మనుగడలో ఉంది. పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి సీబీఎస్ఈ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఈసారి మాత్రం తప్పడం లేదు. అసెస్మెంట్ స్కీమ్ను నిపుణుల కమిటీ రూపొందించింది. తుది ఫలితాల విషయంలో 10, 11, 12వ తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. 10వ తరగతిలో ప్రధానమైన ఐదు సబ్జెక్టులు ఉండగా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించిన మూడు సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకుంటాం. ఈ మూడు సబ్జెక్టుల్లో పొందిన మార్కులకు 30% వెయిటేజీ లభిస్తుంది. 11వ తరగతిలో థియరీ పేపర్లో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ ఉంటుంది. ఇక 12వ తరగతిలో యూనిట్ టెస్టు, మిడ్–టర్మ్, ప్రి–బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులకు మరో 40% వెయిటేజీ ఉంటుంది. ఈ మూడు రకాల వెయిటేజీల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటిస్తాం’’అని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల ప్రణాళిక
-
30:30:40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
న్యూఢిల్లీ: 12వ తరగతి మార్కుల నిర్థారణ విధానాన్ని సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. 10,11వ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కుల ప్రణాళికను సీబీఎస్ఈ బోర్డు గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది. కాగా జూలై 31లోపు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. చదవండి: 12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ -
12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ
న్యూఢిల్లీ: 12వ తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఆ తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్ధారించే విధానాన్ని రూపొందించడానికి 13 మంది సభ్యులతో ఒక కమిటీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఏర్పాటు చేసిం ది. ఆ కమిటీ 10 రోజుల్లోగా నివేదిక సమర్పించనుందని శుక్రవారం సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. కమిటీలో తనతో పాటు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విపిన్ కుమార్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కమిషనర్ నిధి పాండే, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్ గార్గ్, సీబీఎస్ఈ డైరెక్టర్(ఐటీ) అంత్రిక్ష జోహ్రి, సీబీఎస్ఈ డైరెక్టర్(అకడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యా ర్థుల పరీక్ష రాయాలనుకుంటే వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహించాల ని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే రద్దు చేసి, విద్యార్థుల మార్కుల నిర్ధారణకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. -
పరీక్ష రాద్దామా, వద్దా..?: వాట్సాప్లో అభిప్రాయాల సేకరణ
సాక్షి, చెన్నై: పరీక్ష రాద్దామా, వద్దా..? అని తేల్చుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా గురువారం తమిళనాడు విద్యాశాఖ సేకరించింది. మెజారిటీ శాతం తల్లిదండ్రులు కరోనా పరిస్థితులు సద్దుమనిగిన అనంతరం పరీక్షలు నిర్వహించాలని సూచించడం గమనార్హం. కేంద్రం పరిధిలోని ప్లస్టూ సీబీఎస్ఈ పరీక్షల రద్దు చేసిన నేపథ్యంలో అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యార్థుల ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి తల్లిదండ్రుల అభిప్రాయాల్ని వాట్సాప్ ద్వారా సేకరించారు. మెజారిటీ శాతం తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమనిగిన తర్వాత పాఠశాలల్లో లేదా ఆన్లైన్ ద్వారా పరీక్షల నిర్వహించాలని సూచించడం గమనార్హం. అలాగే విద్యా వేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు ఈ ప్రక్రియను ముగించి సీఎం స్టాలిన్కు సమర్పించనున్నారు. దీనిని సమీక్షించిన అనంతరం శనివారం సీఎం ప్రకటన విడుదల చేస్తారని విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు. తమకు విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు రెండు ముఖ్యమని ఆయన మీడియాకు వివరించారు. టెట్ ద్వారా ఎంపికైన టీచర్ల నియామకం గురించి పాఠశాలల రీ ఓపెనింగ్ సమయంలో పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 6న టీఐఎంఈ ప్రతిభా పరీక్ష.. క్యాట్ 2021–22కు సిద్ధం అవుతున్న విద్యార్థులకు టైమ్స్ ఇన్స్టిట్యూట్ (టీఐఎంఈ) టాలెంట్ సెర్చ్ పేరిట జూన్ 6న పరీక్ష ఆన్లైన్లో నిర్వహించనుంది. ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు రెండు స్లాట్లుగా పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, వివరాలకు తమ వెబ్ సైట్ను సంప్రదించాలని సంస్థ సూచించింది. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా? -
Narendra Modi: పరీక్షల రద్దుతో హ్యాపీనా?
న్యూఢిల్లీ: పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీబీఎస్ఈ 12వ విద్యార్థులకు ఉద్బోధించారు. ‘పరీక్షలు రద్దు అయినందుకు చాలా సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ వారితో చమత్కరించారు. పరీక్షల గురించి ఎప్పుడూ టెన్షన్ పడవద్దని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గురువారం కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన ఒక ఆన్లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ప్రధాని అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానందాలకు గురి చేశారు. ‘పరీక్షలను రద్దు చేయడంతో మీ ఆనందానికి హద్దులు లేనట్లు కనిపిస్తోంది’ అన్నారు. పరీక్షలు జరుగుతాయేమోనని ఆందోళన పడ్డారా? అన్న ప్రధాని ప్రశ్నకు విద్యార్థులు అవునని సమాధానమివ్వడంతో.. ‘అయితే పరీక్షలంటే ఆందోళన వద్దు అంటూ నేను రాసిన ఎగ్జామ్ వారియర్ పుస్తకం సత్ఫలితాలను ఇవ్వలేదన్నమాట’ అని వ్యాఖ్యానించారు. పరీక్షలు రద్దవడంతో ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. ‘ఐపీ ఎల్, చాంపియన్స్ లీగ్ చూస్తారా? ఒలింపిక్స్ కోసం ఎదురు చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మం త్రాన్ని సదా గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షల రద్దు నిర్ణయంతో ఊరట పొందామని పలువురు విద్యార్థులు ప్రధానికి తెలిపారు. ‘రద్దు నిర్ణయం వెలువడే వరకు ప్రిపరేషన్తో బిజీబిజీగా ఉండి ఉంటారు కదా!’ అన్న ప్రధాని మాటకు.. గువాహటికి చెందిన ఒక విద్యార్థి స్పందిస్తూ.. ‘పరీక్షలను పండుగలా భావించాలని గతంలో మీరు చెప్పిన విషయం గుర్తుంది’ అని చెప్పాడు. టాపర్గా ఉండాలనుకుని కష్టపడి చదివానని మరో విద్యార్థి తెలిపాడు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్రంపై ఒక వ్యాసం రాయమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. పలువురు తల్లిదండ్రులు ప్రధానితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘పిల్లలు చాలా ఒత్తిడితో ఉన్నారు. పరీక్షల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణ యం’ అని ఒక పేరెంట్ వ్యాఖ్యానించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏ ప్రక్రియను అనుసరిస్తారు..? రెండు వారాల్లో తెలపండి: సుప్రీంకోర్టు 12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏవిధమైన ప్రక్రియను అవలంబిస్తారో రెండు వారాల్లో తెలపాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలను సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయవాది మమత శర్మ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం విచారించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
కొత్త కొలమానాలేవి?
సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు కూడా రద్దయ్యాయి. పిల్లలు ఇంతటి విషమ పరిస్థితుల్లో తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సిందేనా లేక రద్దవుతాయా అని అనేకులు మథనపడుతున్న సమ యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం వాటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఐఎస్సీఈ కూడా ఈ పనే చేసింది. సీబీఎస్ఈ, ఇతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను ఇప్పటికే రద్దుచేశాయి. ఇంటర్మీడియెట్ పరీక్షల విషయంలోనూ చాలా ప్రభుత్వాలు ఇలాగే నిర్ణయించాయి. బిహార్ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించింది. కేరళ పన్నెండో తరగతి పరీక్షలను ఏప్రిల్లో పూర్తిచేసుకుంది. ఛత్తీస్గఢ్ ఓపెన్ బుక్ విధానం ద్వారా ఈ నెల 1నుంచి పన్నెండో తరగతి పరీక్షలు మొదలుపెట్టింది. మరికొన్ని రాష్ట్రాలు దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. పరీక్షల ద్వారానే తాము ఉత్తీర్ణత సాధిస్తామని ఎవరైనా విద్యార్థులు ముందుకొచ్చిన పక్షంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాక ఆ విషయాన్ని పరి శీలించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కరోనా మూడో దశ అంచనాలున్న నేపథ్యంలో ఈ అనిశ్చితి ఎన్నాళ్లుంటుందో ఎవరూ చెప్పలేరు. విద్యార్థుల ప్రతిభను నిర్ణయించటానికి దీర్ఘకాలంగా అమలు చేస్తున్న ప్రామాణిక వ్యవస్థ పరీక్షలే. ఉన్న ఆ ఒక్క విధానమూ రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడటం, వేరేవిధమైన కొలమానాలు లేకపోవటం దురదృష్టకరం. అలాగే ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలు పల్లెసీమల్లో అరకొరగా వుండటం... అట్టడుగు వర్గాల పిల్లలకు ల్యాప్టాప్లు లేక పోవటం ఆన్లైన్ విధానంపై నమ్మకం పెట్టుకోవటాన్ని అసాధ్యం చేసింది. ఆ పేరుతో నిరుడు, ఈ ఏడాది తరగతులు నిర్వహించినా చాలామందికి ఉపయోగపడింది లేదు. అలాగని మున్ముందు పరిస్థితులెలావుంటాయోనన్న అవగాహన లేకుండా, పరీక్షలు లేవని చాలాముందుగా ప్రకటించటం కూడా అవాంఛనీయమవుతుంది. ఎంతో కొంత శ్రద్ధ చూపించే పిల్లల్లో సైతం అది నిరాసక్తతకు దారి తీస్తుంది. తగిన సమయంలో అప్పటికున్న పరిస్థితులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవటమే సముచితం. పిల్లల ప్రాణాలు ముఖ్యమా, పరీక్షలు ముఖ్యమా అని కొందరు వాదించారు. ఆ రకంగా పిల్లల ప్రాణాలపై తమకు ఆదుర్దా వున్నదని చెప్పుకోవటానికి ప్రయత్నించారు. కానీ పిల్లలు ఎటూ చదువుకోవటం తప్పనిసరిగనుక పరీక్షలు వుంటాయన్న అభిప్రాయం కలగజేయటం వల్ల నష్టం లేదని, కరోనా వైరస్ తీవ్రతను బట్టి పరీక్షల రద్దు అంశాన్ని ప్రభుత్వాలు చివరిక్షణంలో నిర్ణయిస్తేనే సముచితమని మరికొందరు భావించారు. దేశంలో ప్రభుత్వాలు, నాయకులు ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటే కరోనా మహ మ్మారి రెండో దశ ఇంతగా స్వైర విహారం చేసేది కాదు. ఎన్నికల కోసం వెంపర్లాడటం, ఎప్పటిలాగే భారీగా జనసమీకరణలు, కుంభమేళా నిర్వహణ వగైరాలు బాగా దెబ్బతీశాయి. తొలి దశలో కరోనా కాటు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఉపాధి కరువై లక్షలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని తెలిసి కూడా ఎన్నికలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని, అందరికీ టీకాలు పూర్తయ్యాక నిర్వహిం చుకోవచ్చని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. న్యాయస్థానాలు సైతం నిబంధనల పేరు చెప్పి ఎన్నికల సంఘాన్నే సమర్థించాయి. కరోనా తీవ్రతను గమనించి తిరుపతి ఉప ఎన్నిక సమయంలో జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. భారీ జనసమీకరణల కారణంగా దేశంలో కరోనా రెండో దశ ఉగ్రరూపం దాల్చింది. చివరకిప్పుడు విద్యార్థుల పరీక్షలు కూడా రద్దు చేయకతప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. పదో తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు మార్కుల షీట్లో కేవలం ఉత్తీర్ణతను మాత్రమే ప్రక టించాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించాయి. సీబీఎస్ఈ విభిన్నమైన విధానం ప్రకటించింది. పాఠశాలల వారీగా ఫలితాల కమిటీలను నియమించాలని, అందులో ఆ పాఠశాల సభ్యులతోపాటు బయటి విద్యాసంస్థల ప్రతినిధులుండాలని నిర్దేశించింది. యూనిట్ టెస్ట్లు, అర్థ సంవత్సర పరీ క్షలు, చివరగా నిర్వహించే పరీక్షలు, అంతర్గత మదింపు వగైరాలకు వంద మార్కులు నిర్ణయించి, దాని ప్రాతిపదికన విద్యార్థి ప్రతిభను లెక్కేయాలని తెలిపింది. అలాగే గత మూడేళ్లలో ఒక విద్యా సంస్థ పదో తరగతి పరీక్షల్లో ప్రదర్శించిన పనితీరును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఆ పాఠశాలనుంచి ఉత్తీర్ణులైనవారికి నిర్దిష్టమైన పాఠ్యాంశాల్లో వచ్చిన సగటు మార్కుల ఆధారంగా వాటి పనితీరు కొలుస్తారు. ఇప్పుడు పన్నెండో తరగతికి ఏం చేస్తారన్నది అయోమయంగానే వుంది. డిగ్రీ చదువులకెళ్లాల్సిన విద్యార్థులకు వారి ప్రతిభతోపాటు, వారు చదువుకున్న పాఠశాలల పనితీరు కూడా లెక్కేయటం అన్యాయమని వారు చెబుతున్నారు. కొన్ని విద్యాసంస్థలు పరీక్షలకు కఠినమైన విధానాన్ని అనుసరిస్తాయి. మరికొన్ని ఉదారంగా వుంటాయి. ప్రశ్నపత్రాల తయారీలో అందరికీ ఒకే విధానం లేనప్పుడు పాఠశాల పనితీరును పరిగణించటం వల్ల విద్యార్థికి అన్యాయం జరగదా అన్న ప్రశ్న వస్తోంది. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు వెళ్లదల్చుకున్నవారికి ఎటూ ఎంట్రెన్స్ పరీక్షలుం టాయి. కానీ ఆర్ట్స్ కోర్సులకు ఎంపిక కేవలం పన్నెండో తరగతి పరీక్షల మార్కులే గీటురాయి. కనుక విద్యార్థి ప్రతిభను కొలిచేందుకు తీసుకొచ్చే ఏ విధానమైనా హేతుబద్ధంగా, ప్రామాణికంగా వుండేలా చూడాలి. అప్పుడు మాత్రమే ఉన్నంతలో అందరికీ న్యాయం జరుగుతుంది. -
ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని రకాల పరీక్షలు వాయిదా, రద్దు అవుతున్నాయి. ఈ ఏడాది సెకండ్ వేవ్తో అనూహ్యంగా కరోనా కేసులు పెరగడం, ప్రాణనష్టం ఉండడంతో సీబీఎస్ఈ బోర్డు పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, దీనిపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులు రిస్క్లో పడేందుకు ఈ పరీక్షలు కారణం కాకూడదని సూచించారు. పరీక్షలు రద్దవడంతో విద్యార్థులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ప్రధాని నిర్ణయంతో ఏకీభవించని ఓ విద్యార్థికి వింత కోరిక కలిగింది. 12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు ఫేర్ వెల్ పార్టీ లేదని బాధతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కే ట్వీట్ చేశాడు. ‘"సర్ ఫేర్వెల్ పార్టీ అయినా చేసుకోనివ్వండి. 12వ తరగతి బి సెక్షన్ నేహాను నేను చీరలో చూడాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరలవుతోంది. దీనిపై స్పందించిన అనేకమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు Government of India has decided to cancel the Class XII CBSE Board Exams. After extensive consultations, we have taken a decision that is student-friendly, one that safeguards the health as well as future of our youth. https://t.co/vzl6ahY1O2 — Narendra Modi (@narendramodi) June 1, 2021 Sir farewell to kraa do....wo 12th B wali neha ko साड़ी me dekhna tha. — Kuki Aggarwal (@kukiaggarwal) June 1, 2021 -
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యున్నత ప్రమాణాలను అనుసరించి నిర్దిష్ట కాలవ్యవధిలో 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్ఈ తగిన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం సూచించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో వెల్లడించారు. ప్రధాని అధ్యక్షతన మంగళవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది పరీక్షలు ప్రారంభమైన కొద్దిరోజులకు కోవిడ్–19తో లాక్డౌన్ విధింపు, కేసుల పెరుగుదల కారణంగా పరీక్షల రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెకండ్ వేవ్లో అనూహ్యంగా కరోనా కేసులు పెరగడం, ప్రాణనష్టం ఉండడంతో సీబీఎస్ఈ బోర్డు పదో తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా, గత ఏడాది తీసుకున్న నిర్ణయం కంటే భిన్నమైన నిర్ణయం తీసుకుంటే అందుకు సహేతుక కారణాలు ఉండాలని సోమవారం నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియపరిచింది. జూన్ మూడో తేదీన తదుపరి విచారణ ఉండగా మంగళవారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముందే కేంద్ర విద్యా శాఖ సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించింది. మెజారిటీ రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపాయి. అయితే విద్యార్థులకు వ్యాక్సిన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలని మరికొన్ని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకే బోర్డు మొగ్గు చూపింది. కానీ సుప్రీంకోర్టు తాజా విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం పరీక్షల రద్దుకు నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు, స్పందనలను వివరిస్తూ ఉన్నతాధికారులు ప్రధానికి ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆందోళనకు తెరపడాలి: ప్రధాని కోవిడ్ మహమ్మారి కారణంగా అకడమిక్ క్యాలెండర్ దెబ్బతిన్నదని, బోర్డు పరీక్షల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి... విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన పెంచిందని ప్రధాన మంత్రి విచారం వ్యక్తంచేశారు. ఈ ఆందోళనకు వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు సూక్ష్మస్థాయిలో కట్టడి చర్యలు చేపడుతూ కరోనాను నియంత్రిస్తున్నాయని, మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ఎంచుకున్నాయని వివరించారు. ఈ దశలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన చెందారని తెలిపారు. ఈ ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా బలవంతపెట్టరాదని వివరించారు. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, దీనిపై రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. విద్యార్థులు రిస్క్లో పడేందుకు ఈ పరీక్షలు కారణం కాకూడదని సూచించారు. ఈ ప్రక్రియలో భాగస్వాములందరితో చర్చించి విద్యార్థి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రశంసించారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత ఏడాదిలాగే ఎవరైనా విద్యార్థులు పరీక్ష రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తరువాత సీబీఎస్ఈ అందుకు అవకాశాన్ని ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ఇదివరకు మే 21న జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన మరోసారి మే 25న సమావేశం జరిగింది. ఈసమావేశంలో వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని చర్చించారు. తాజా సమావేశంలో కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ, వాణిజ్య శాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖ, స్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ -
CBSE Exams 2021: జులైలో సీబీఎస్ఈ పరీక్షలు?
న్యూఢిల్లీ: బోర్డు పరీక్షలు జరిపేందుకే మొగ్గు చూపుతోంది సీబీఎస్ఈ. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీఈఎస్ఈ తెలియజేసింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. సెకండ్వేవ్ విజృంభణతో ఈ పరీక్షలు వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే పరీక్షల నిర్వాహణకే సీబీఎస్ఈ మొగ్గు చూపింది. మూడు నెలల్లో 12 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రెండు పద్దతులను కేంద్రం ముందు ఉంచింది సీబీఎస్ఈ. ఇందులో మొదటి పద్దతి ప్రకారం పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ ఎగ్జామ్స్ యాక్టివిటీస్, రెండో నెలలో పరీక్షల నిర్వహించడం, మూడో నెలలో ఫలితాలు వెల్లడి వంటివి ఉంటాయి. అయితే పరీక్షలు ప్రధాన సబ్జెక్టులకే నిర్వహిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్లో పరీక్షా తేదీలను ప్రకటించి జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నాలుగు సబ్జెక్టులే ఇక రెండో ఆప్షన్ ప్రకారం పరీక్షా సమయాన్ని కేవలం 90 నిమిషాలకు కుదించి 4 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించి అయి ఉండాలి. మిగిలిన మూడు సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా విద్యార్థులు నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన రెండు సబ్జెక్టులకు మార్కులు కేటాయిస్తారు. -
CBSE: ‘అలా చేస్తే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే’
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయడం సరికాదంటూ టోనీ జోసెఫ్ అనే ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయడం వల్ల కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అవుతుందని టోనీ తరఫు న్యాయవాది జోస్ అబ్రహం ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది మమతా శర్మ దాఖలు చేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ‘‘12వ తరగతి పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఉన్నత విద్యలో చేరడానికి ఈ పరీక్షా ఫలితాలు ఎంతో ముఖ్యం. ఈ పరీక్షలను రద్దు చేస్తే కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే. ఇంటర్నల్ అసెస్ మెంట్, విద్యా సంస్థలు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు ఆధారంగా ఉత్తీర్ణత చేయడం అన్యాయం. ఇంటర్నల్ పరీక్షలు అన్నీ కూడా ఇంట్లో కూర్చొనే విద్యార్థులు రాశారు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశారని, జూన్ 1న పరిస్థితిని సమీక్షిస్తామని సీబీఎస్ఈ పేర్కొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? కొవిడ్తో అనాథలైన పిల్లలకు ప్రతి నెల రూ.2500 -
వీడని సస్సెన్స్..! ఇంటర్ పరీక్షలు జరిగేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కేసుల వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా ఇంటర్ పరీక్షలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇక పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోనూ పరీక్షల నిర్వహణపై నేడో, రేపో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్వహణ ఇబ్బందికరమే... కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరమేనన్న భావనలో అధికారులు ఉన్నారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన అంతంతగానే కొనసాగుతోంది. విద్యార్థులందరికి ఆన్లైన్ పాఠాలు అందడం లేదు. టీశాట్ వీడియో పాఠాల ప్రసారాన్ని విద్యార్థులంతా చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లోనూ పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ ఇబ్బందికరమేనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. షెడ్యూలు ప్రకారం మే 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 2వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు విడిచి రోజు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రతిరోజు 5 లక్షల మంది విద్యార్థులు వస్తారని, భౌతికదూరం పాటించడం కష్టమేనన్న భావన నెలకొంది. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించేప్పుడు, పరీక్ష కేంద్రాల్లోనూ ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ సమయంలో ఏర్పాటు చేసే 1,350 కేంద్రాలకు బదులు రెట్టింపు కేంద్రాలను ఏర్పాటు చేసినా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. కేంద్రమే వద్దనుకున్నపుడు రాష్ట్రంలో ఎలా? కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పుడే పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావన విద్యాశాఖ వర్గాల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వమే జూన్లో పరిస్థితి సమీక్షించి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అన్న భావన అధికారుల్లో నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేడో రేపో తేలనుంది. ఇక రాష్ట్రంలో 260 సీబీఎస్ఈ స్కూళ్లు ఉండగా అందులో 15 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారందరికి పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి చదివే మరో 10 వేల మంది విద్యార్థులు జూన్ వరకు వేచి చూడాల్సిందే. టెన్త్ పరీక్షలపై వేచి చూద్దామా? సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం మే 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంటే మరో నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంటుందా? కొన్ని రోజుల తరువాత కరోనా కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం పదో తరగతి పరీక్షలు అవసరమే లేదని, విద్యార్థులందరిని పాస్ చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగేనా? ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ మూడో దఫా పరీక్షలపైనా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తారా? లేదా? అన్నది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఆదమరిస్తే అంతే! -
సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్ వాయిదా
-
CBSE పదో తరగతి పరీక్షలు రద్దు
ఢిల్లీ: సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. "దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జూన్ 7 వరకు జరగాల్సిన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాం. బోర్డు తయారు చేసే ఆబ్జెక్టివ్, క్రైటీరియా ఆధారంగా విద్యార్థుల పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ప్రస్తుతానికి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నాం. జూన్ 1న పరిస్థితిని సమీక్షించిన తర్వాత 12వ తరగతి ఎగ్జామ్స్పై నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ పరీక్షలు పెట్టాలనుకుంటే 15 రోజుల ముందుగానే వాటి వివరాలు ప్రకటిస్తాం" అని తెలిపారు. కోరలు చాస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోదీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. చదవండి: ఈ ఏడాదే సీబీఎస్ఈ సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల -
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో 'సీబీఎస్ఈ'
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ రానుందని, 2024–25లో రాష్ట్ర విద్యార్థులు సీబీఎస్ఈ విధానంలో టెన్త్ బోర్డు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, సీబీఎస్ఈ అఫిలియేషన్పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సీబీఎస్ఈపై టీచర్లకు అవగాహన కోసం శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. ఒక దార్శనికతతో విద్యా రంగంలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ఇంత ఖర్చు, ఇంత శ్రద్ధ ఎప్పుడూ పెట్టలేదని అన్నారు. మంచి విద్య అందరికీ అందాలి.. పేద పిల్లలు గొప్పగా చదువుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్స్పెక్షన్, మానిటరింగ్ పటిష్టంగా ఉండాలని, ఇందు కోసం ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు అధికారులు పరిష్కారాలు కనుక్కోవాలని, ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిషన్ మరింత సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. ఏపీలో ప్రత్యేకంగా సీబీఎస్ఈ ఒక కార్యాలయాన్ని తెరవనుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇంగ్లిష్ , తెలుగులో పాఠ్య పుస్తకాలు ► పాఠ్య పుస్తకాలను ఇప్పుడు ఇంగ్లిష్, తెలుగులో ఇస్తున్నాం. ఇంగ్లిష్ లో బోధించడం, ఇంగ్లిష్ లో మాట్లాడడం అలవాటు చేయాలి. ప్రారంభంలో తడబాట్లు, తప్పులు ఉంటాయి. కానీ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మెరుగు పడుతుంది. ► ఈ అంశాలను టీచర్లకు అర్థమయ్యేలా చేరవేసి వారిలో స్ఫూర్తిని నింపాలి. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ –1 (పీపీ–1లో) కింద అంగన్వాడీల్లో కూడా ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నాం. ఎక్కడ తిన్నా ఒకేలా జగనన్న గోరుముద్ద రుచి ► జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. తిరిగి అలాంటివి పునరావృతం కాకూడదు. ఎక్కడ తిన్నా కూడా జగనన్న గోరుముద్ద రుచి ఒకేలా ఉండాలి. గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ఆహార పదార్థాల నాణ్యత ఎక్కడ చూసినా ఒకేలా ఉండాలి. ► ఆహార పదార్థాలను తయారు చేయడంపై ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) అందుబాటులోకి తీసుకు రావాలి. గోరుముద్ద, టాయిలెట్ల నిర్వహణపై ప్రతి రోజూ స్కూళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ కచ్చితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. చిన్న రిపేరు వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దాలి. సమస్య తెలిసిన దగ్గర నుంచీ అది పరిష్కారమయ్యే వరకు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై ఒక ఎస్వోపీ ఉండాలి. దీనికి సంబంధించి అధికారులకు అలర్ట్స్ రావాలి. ఇక పాఠశాలల నిర్వహణపై దృష్టి పెట్టాలి ► మొదటి దశలో మన బడి నాడు– నేడు కింద పనులు పూర్తయిన పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలి. వీరికి సులువుగా అర్థమయ్యేలా నాడు– నేడు పనుల పరిశీలనపై విద్యా శాఖ అధికారులు ప్రశ్నావళి పంపాలి. ► మన బడి నాడు–నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేసినందున, ఇప్పుడు స్కూళ్ల నిర్వహణపై దృష్టి పెట్టాలి. నిర్వహణ సరిగ్గా లేకపోతే ఉపయోగం ఉండదు. ఏప్రిల్ 30న తొలి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తాం. ► అధికారులు ఎవరైనా పాఠశాలలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నిర్వహణ ఎలా ఉందన్న దానిపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. టాయిలెట్ల నిర్వహణ బాగుందా? లేదా? అన్న విషయాన్ని తప్పనిసరిగా చూడాలి. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి జగనన్న విద్యా కానుక ► మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి కచ్చితంగా పిల్లలకు విద్యా కానుక అందాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు. (ఈ సందర్భంగా డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులను సీఎం పరిశీలించారు.) ► విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తాయి. ప్రతి ఒక్కరూ నైపుణ్యాన్ని, సమర్థతను పెంచుకుంటారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు, జీతాలు పెరిగి జీవన ప్రమాణాలు మారుతాయి. ► హాస్టళ్లలో నాడు–నేడు కింద చేపట్టనున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో ఉన్న మౌలిక సదుపాయాలు, నాడు –నేడు కింద ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల మధ్య తేడాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ► మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన పనులు, కార్యక్రమాలపై విద్యా సంస్థల అభివృద్ధి కమిటీలు, అధికారుల శిక్షణా కరదీపికను సీఎం జగన్ ఆవిష్కరించారు. ► జగనన్న గోరుముద్దలో మధ్యాహ్నం నాణ్యమైన భోజనం తయారీ, టాయిలెట్ల నిర్వహణపై ఎస్వోపీతో కూడిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ► ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెలి్వ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఈ ఏడాదే సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యుత్తమంగా రాణించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 2021 – 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ దీన్ని వర్తింప చేస్తామన్నారు. 12వ తరగతి వరకు సీబీఎస్ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి ఎఫిలియేషన్ కోసం సీబీఎస్ఈ బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్ సిలబస్ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆంగ్లంపై మరింత పట్టు సాధించి మన విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఉపకరిస్తుందన్నారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు.. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, ఇళ్ల పట్టాలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో నాడు –నేడు, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, ఆర్ అండ్ బీ, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరాతోపాటు ఏప్రిల్లో అందించనున్న జగనన్న విద్యా దీవెన, రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, జగనన్న వసతి దీవెన, వలంటీర్లకు సత్కార కార్యక్రమాలపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలు, పథకాలపై సీఎం జగన్ ఏమన్నారంటే.. ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం.. ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం. కలెక్టర్లకు అభినందనలు. మార్చి 15 నాటికి 24.27 కోట్ల పనిదినాలు కల్పించాం. 2020–21 ఆర్ధిక సంవత్సరంలో 25.25 కోట్ల పనిదినాలను చేరుకోబోతున్నాం. దాదాపు రూ.6 వేల కోట్లు ఉపాధిహామీ కింద కూలీలకు ఇవ్వగలిగాం. యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తి చేయాలి. 2021 మే నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి. ఆర్బీకేలను పూర్తి చేయడంపైనా దృష్టి పెట్టాలి. ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ను పూర్తి చేయడంపైనా దృష్టి సారించాలి. వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అమూల్తో కలిసి గ్రామాల్లో విప్లవాత్మక చర్యలు అమూల్తో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. పాడి రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల గ్రామీణఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బీఎంసీ (బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు), ఏంఎంసీ (ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు)ల నిర్మాణాలపై దృష్టిపెట్టాలి. నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణం మొదలుపెట్టి ఆగస్టు కల్లా పూర్తిచేయాలి. ఉపాధిహామీ కింద ప్రారంభించిన సీసీ రోడ్లు, డ్రైన్స్ వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా 11,334 మందికి వెంటనే ఇళ్ల పట్టాలు అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీని వెంటనే పూర్తి చేయాలి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు 90 రోజుల్లోగా ఇళ్ల స్థలాల పట్టాలివ్వాలి. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా ఇంటి స్థలం పట్టా అందాల్సిందే. కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను వెంటనే అందించాలి. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఏప్రిల్ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టి పెట్టాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం తొలివిడతలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలి. సన్నాహక పనులను ముమ్మరం చేయాలి. ఏప్రిల్ 15 కల్లా లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ప్రతి కాలనీలో ఒక మోడల్హౌస్ కట్టాలి. తామే ఇల్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి. పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నందున లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, మెటల్ లభిస్తుంది. దీంతో వారికి మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి. స్కూళ్లలో మార్చి 31కి నాడు – నేడు తొలివిడత పనులు పూర్తి నాడు – నేడు కింద స్కూళ్లలో మొదటి విడతలో చేపట్టిన పనులు మార్చి 31 నాటికి పూర్తి కావాలి. పది రకాల సదుపాయాలు స్కూళ్లకు సమకూరుతున్నాయి. పెయింట్ పనులపై దృష్టి పెట్టాలి. అంగన్ వాడీల్లో నాడు–నేడు.. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కింద అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నాం. చిన్నారుల్లో 6 ఏళ్ల లోపు వయసులోనే మెదడు 80 శాతం వరకూ అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈ వయసులో ఉన్న చిన్నారులపై దృష్టిపెట్టాం. ప్రీ ప్రైమరీ స్కూళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. భవనాల నిర్మాణం కోసం స్థలాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు శ్రద్ధ చూపాలి. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు.. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్ సెంటర్ల కోసం 50 సెంట్ల నుంచి ఎకరం వరకూ స్థలం అవసరం. వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబం«ధిత శాఖకు అప్పగించాలి. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్ ఫ్లాట్ఫాం లాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలంటే ఈ సదుపాయాలు ఉండాలి. మెడికల్ కాలేజీల నిర్మాణం.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని తెస్తున్నాం. బోధనాసుపత్రితోపాటు నర్సింగ్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీలకు భూములను గుర్తించి సేకరణ పనులు పూర్తి చేయాలి. పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆదోని, మచిలీపట్నంలలో నిర్మాణాలు ఏప్రిల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారులు జాతీయ రహదారుల నిర్మాణానికి భూములను త్వరగా సేకరించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 6న వైఎస్సార్ బీమాతో 12,039 మందికి పరిహారం బ్యాంకులు ఎన్రోల్ చేయని కుటుంబాల్లో సహజ మరణాలు, ప్రమాదాల కారణంగా మరణించిన 12,039 మంది నామినీలకు వైఎస్ఆర్ బీమా కింద ఏప్రిల్ 6న పరిహారం చెల్లింపులు చేస్తాం. జగనన్న తోడు అర్హులందరికీ పథకం వర్తించేలా డీసీసీల సమావేశం నిర్వహించాలి. వైఎస్ఆర్ చేయూత, ఆసరాపై దృష్టి పెట్టండి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాలపై దృష్టి పెట్టండి. 98 శాతం మంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన 2 శాతం మందితో కూడా దుకాణాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. చేయూత, ఆసరా కింద సుస్థిర ఉపాధి మార్గాల కోసం చేపట్టిన ఇతర కార్యక్రమాల్లో బ్యాంకు లింకేజీ ప్రక్రియను ముమ్మరం చేయాలి. ఏప్రిల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఇవీ ► ఈ ఏడాది ఏప్రిల్కు సంబంధించి పలు కార్యక్రమాల తేదీలను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఏవైనా దరఖాస్తులు ఉంటే పరిశీలన చేసి జాబితాలను సచివాలయాల్లో ఉంచాలని సూచించారు. అర్హులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ► ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన ► ఏప్రిల్ 13న ఉగాదిరోజు వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం. ప్రతి రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి. వలంటీర్లను సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులతో సత్కరించాలి. వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి. అది వారికి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ► ఏప్రిల్ 16న రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు ► ఏప్రిల్ 20న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులు ► ఏప్రిల్ 27న జగనన్న వసతి దీవెన సమీక్షలో పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బీ ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గృహనిర్మాణశాఖ అజయ్ జైన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ జి.అనంతరాము, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ.ఆర్.అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి ఉషారాణి, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి ఉదయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హెచ్.అరుణకుమార్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ కోన శశిధర్, సెర్ప్ సీఈఓ రాజబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 6 రోజుల్లో ముగిసే ఎన్నికల ప్రక్రియ సాగదీతతో అభివృద్ధికి ఆటంకాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతేడాది అర్థాంతరంగా మధ్యలో నిలిపివేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇక కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, అది ముగిస్తే వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ► దీన్ని పూర్తి చేయకుండా సాగదీయడంతో అభివృద్ధి పనులకు అవరోధాలు ఎదురవుతు న్నాయని సీఎం జగన్ చెప్పారు. ఆరు రోజుల్లో పూర్తయ్యే ఆ ప్రక్రియను ముగిస్తే మిగతా పనులు సజావుగా సాగుతాయన్నారు. ఆ ఎన్నికలను మధ్యలో నిలిపివేసి దీర్ఘకాలం సాగదీయడం, కోడ్ కారణంగా అభివృద్ధి, వ్యాక్సినేషన్ మందగించాయన్నారు. ► అధికార యంత్రాంగం అంతా ఇతర కార్యక్రమాల్లో ఎక్కువ రోజులు నిమగ్నం కావడంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా చాలా రోజులుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించలేకపోయామన్నారు. -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ నేడు ట్విటర్లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్లైన్) షెడ్యూల్: మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మే 4 నుంచి జూన్ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జులై 15 తేదీలోగా సీబీఎస్ఈ ఫలితాలు విడుదల పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం వరకు కొనసాగనున్నాయి. అలాగే, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.inను వీక్షించండి. -
సీబీఎస్ఈ అఫిలియేషన్లో మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో ఏర్పాటు కానున్న విద్యాసంస్థలకు గుర్తింపు (అఫిలియేషన్) మంజూరు ప్రక్రియలో పలు మార్పులు చేసినట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అఫిలియేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. జాతీయ నూతన విద్యా విధానం–2020 ప్రకారం సీబీఎస్ఈ బైలాలో పలు మార్పులు చేసింది. ఈ విషయాలతో తన అధికారిక వెబ్సైట్లో తాజాగా ఒక నోటిఫికేషన్ పొందుపరిచింది. 2021 మార్చి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వివిధ కమిటీల సిఫార్సుల మేరకు నూతన విద్యా విధానంలో చేసిన సూచనల ప్రకారం ఈ మార్పులు చేస్తున్నట్టు సీబీఎస్ఈ పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ లక్ష్యం ఇలా.. సీబీఎస్ఈ గుర్తింపు మంజూరుకు 2006 నుంచి ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తిగా డిజిటలైజేషన్, డేటా అనలటిక్స్ ఆధారంగా తక్కువ మానవ వనరుల వినియోగంతో గుర్తింపు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఎస్ఈ వివరించింది. త్వరితగతిన గుర్తింపు పొందడం, ఆటోమేటెడ్, డేటా డ్రైవన్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శకత పెంచడం, మొత్తం అఫిలియేషన్ విధానంలో అకౌంట్బిలిటీని పెంచడం, త్వరితంగా, కాల పరిమితిలోగా దరఖాస్తులను పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని చేపడుతున్నట్టు పేర్కొంది. ఇందుకు పూర్తి నిర్దేశిత సమయాలను పాటించనుంది. ఆయా విద్యాసంస్థలు అవసరమైన డాక్యుమెంట్లను సీబీఎస్ఈ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. చదవండి: వివాదాస్పద తీర్పుపై సుప్రీంకోర్టు స్టే -
ఇంటర్ సిలబస్ తగ్గింపు; ఈ ఏడాదికే
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యా సంవత్సరానికి (2020-21) గాను 30 శాతం తగ్గించారు. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలిగించిన పాఠ్యాంశాల వివరాలను ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలిగించామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు నెల క్రితమే 30 శాతం సిలబస్లో కోత విధిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం సహా ఇతర సబ్జెక్టుల సిలబస్పై నిపుణుల కమిటీలతో చర్చించి వాటి సిఫారసు ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఇక సిలబస్ తగ్గింపు అంశం ఈ సంవత్సరానికే వర్తిస్తుందని తెలిపారు. -
సీబీఎస్ఈ పరీక్షలపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వతరగతి కంపార్ట్మెంట్ పరీక్షలపై విచారణను సుప్రీంకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితులు కంపార్ట్మెంట్ పరీక్షల నిర్వహణకు అనుకూలంగా లేవని, పైగా ఈ పరీక్షలు పూర్తయ్యేనాటికి పైతరగతుల్లోకి అడ్మీషన్లు పూర్తయిపోతాయని, దీంతో విద్యాసంవత్సరాన్ని విద్యార్ధులు నష్టపోతారని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. డిగ్రీ క్లాసుల్లోకి అడ్మీషన్లు వాయిదా వేయాలని కాలేజీలను ఆదేశించాలని పిటీషనర్లు కోరారు. ఈ విషయంపై విచారణ జరిపిన కోర్టు పైతరగతుల్లో అడ్మీషన్ల ప్రక్రియకు సీబీఎస్ఈ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పిటీషనర్లు తమ అభ్యర్ధనను కేంద్రానికి పంపవచ్చని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. (తల్లిదండ్రులుఅనుమతిస్తేనే..!) అంతకుముందు పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ ప్రధాన పరీక్షలనే కోవిడ్ కారణంతో నిలిపివేయకుండా నిర్వహించారని, ఆ పరీక్షల మూల్యాంకనాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులతో పూర్తి చేశారని, దీనివల్ల ఎంతో మంది విద్యార్ధులు కంపార్ట్మెంట్ను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ దఫా దాదాపు 87వేల మంది విద్యార్ధులు ఫెయిలయ్యారని, ఇందుకు సీబీఎస్ఈ ఏమీ చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22– 29 మధ్య కంపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ సన్నాహాలు చేస్తోంది. అసలు పరీక్షలనే రద్దు చేయాలన్న పిటీషన్ సుప్రీం ముందుకు ఈ నెల 4న రాగా, దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ డిమాండ్ను తోసి పుచ్చింది. (ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు) -
‘సిలబస్’ పై వెనక్కి తగ్గిన కర్ణాటక సర్కార్
బెంగళూర్ : ఈ ఏడాది విద్యాసంవత్సరంలో సిలబస్లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కర్ణాటక సర్కార్ వెనక్కి తగ్గింది.18వ శతాబ్ధపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ ,హైదర్ అలీకి సంబంధించి పాఠ్యాంశాలను తొలగిస్తూ చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని, త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. లాక్డౌన్ కారణంగా పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రానుందున విద్యా సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియదని, ఈ నేపథ్యంలో సిలబస్లో మార్పుల అంశంపై తుది వివరాలను వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. (పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్ చాప్టర్ తొలగింపు) తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా కర్ణాటక సైతం సిలబస్ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్లను తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. మొఘల్, రాజ్పుత్ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం తలెత్తడంతో సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, త్వరలోనే ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న సిలబస్ కుదింపు నిర్ణయం ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది మాత్రం 120-140 ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే సిలబస్ను కుదిస్తూ మార్పులు చేపట్టారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) -
సిలబస్ కుదింపుపై రాజకీయ రగడ
బెంగళూర్ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ సిలబస్ను సీబీఎస్ఈ తగ్గించిన అనంతరం కర్ణాటక సైతం ఈ దిశగా అడుగులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో సిలబస్ను 30 శాతం తగ్గించే ఉద్దేశంతో పాఠ్య పుస్తకాల నుంచి మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చాప్టర్లను తొలగించింది. విద్యార్ధుల సౌలభ్యం కోసం కర్ణాటక టెక్స్ట్బుక్స్ సొసైటీ పలు పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగించింది. మొఘల్, రాజ్పుత్ల చరిత్రకు సంబంధించిన అథ్యాయాలు, జీసస్, మహ్మద్ ప్రవక్త బోధనల అథ్యాయాలు రద్దుల పద్దులో చేరాయి. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరానికే సిలబస్ కుదింపు వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకూ సాధారణ విద్యాసంవత్సరంలో 210-220 పనిదినాలు కాగా, ఈ ఏడాది 120-140 పనిదినాలే లక్ష్యంగా సిలబస్ను కుదించారు. కాగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి సిలబస్ను కుదించే క్రమంలో లౌకికవాదం, పౌరసత్వం, సమాఖ్య వ్యవస్థల వంటి అంశాలను తొలగించాలన్న సీబీఎస్ఈ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాలను సిలబస్ క్రమబద్ధీకరణతో లేదా ఎన్సీఈఆర్టీ ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్ ద్వారా కవర్ అవుతాయని సీబీఎస్ఈ ఆ తర్వాత వివరణ ఇచ్చింది. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చాప్టర్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చదవండి : ‘లాక్డౌన్ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గలేదు’ -
ఒకేలా ఉండటమే కాదు ఫలితాలు కూడా ఒకటే!
నోయిడా: ఆ కవలలిద్దరూ ఒకేలా ఉండటమే కాదు సీబీఎస్ఈ ఫలితాల్లోనూ ఒకే విధమైన మార్కులు సాధించారు. ఢిల్లీ నోయిడాకు చెందిన కవలలు మాన్సి, మాన్య చూడటానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా కనిపిస్తారు. ఒకే పాఠశాలలో చదవడమే కాదు అన్ని సబ్జెక్టుల్లోనూ సమాన మార్కులు సంపాదించి ఔరా అనిపించారు. జూలై13న విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఇద్దరూ 95.8 శాతం స్కోరు సాధించారు. ఇంజనీరింగ్ చదవాలన్నది తమ కల అని కవలలు పేర్కొన్నారు. సెప్టెంబర్లో జరగనున్న జేఈఈ మొయిన్స్కు సమాయత్తమవుతున్నామని వివరించారు. (సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల ) 'మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతేకాకుండా మా ఇష్టాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే ఇష్టం కాగా మాన్సికి భౌతికశాస్ర్తం మీద మక్కువ. పరీక్షలకు ఇద్దరం కలిసే ప్రిపేర్ అయ్యాం. యాదృచ్చికంగా జరిగింది కానీ ఇద్దరికీ సమానంగా మార్కులు వస్తాయని అయితే ఊహించలేదు' అని మాన్య పేర్కొంది. ఈ ఏడాది విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 88.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5.38 శాతం పెరిగింది. ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందజలో ఉన్నారు. ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. (సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి ) -
సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత 5.38 శాతం పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మెరిట్ లిస్టు ప్రకటించకూడదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉత్తీర్ణత సాధించని వారి మార్కుల లిస్టులో ఫెయిల్ బదులు ఎసెన్షియల్ రిపీట్ అనే పదం చేర్చనున్నారు. 12వ తరగతి ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. 2019లో మొత్తం 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 88.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11.92 లక్షల మంది 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా, దాదాపు 1.57 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మార్కులు సాధించారు. 38,000 మంది 95 శాతానికిపైగా మార్కులు పొందారు. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 98.70 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. కేరళలోని త్రివేండ్రం రీజియన్లో అత్యధికంగా 97.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను సోమవారం అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది 88.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గతేడాది కన్నా 5.38 శాతం ఎక్కువగా కావడం విశేషం. ఫలితాల్లో త్రివేండ్రమ్ 97.67 శాతంతో ప్రభంజనం సాగించగా పట్నా 74.57 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో ఉంది. విద్యార్థులు cbse.nic.in సైట్లో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చు. (సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు) కరోనా వైరస్ వ్యాప్తి భయంతో సీబీఎస్ఈ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 10,12వ తరగతి విద్యార్ధి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి.. ఢిల్లీ అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు నేడు సెకండియర్ ఫలితాలను వెల్లడించింది. (సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్) Central Board of Secondary Education (CBSE) Class 12 exam results announced. Overall Pass Percentage is 88.78%. pic.twitter.com/MKswRe5NpA — ANI (@ANI) July 13, 2020 -
‘కుదింపు’ రాజకీయం
విద్యార్థులపై ప్రభుత్వాలు కరుణ చూపే సందర్భాలు గతంలో చాలా తక్కువుండేవి. ఏవో కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రభుత్వాలుగానీ, కేంద్రంగానీ వారి గోడు పట్టించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దేశంలో విద్యను ప్రైవేటుకు విడిచిపెట్టి, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు దశాబ్దా లుగా భారీ ఫీజులతో పీల్చిపిప్పిచేస్తున్నా నామమాత్రం చర్యలతో పాలకులు పొద్దుపుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని పరోక్షంగా తూట్లుపొడిచారు. ఈ విధానం ఇప్పట్లో మారుతుందో లేదోగానీ... కరోనా మహమ్మారి పుణ్యమా అని సిలబస్లో మాత్రం మూడో వంతు తగ్గిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. 2020–21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకూ వున్న సిలబస్లో 30 శాతాన్ని తగ్గిస్తూ బుధవారం ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ తరగతుల విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లోని స్పందనలు చెబుతున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలకు ప్రశ్న పత్రాలు రూపొందించేటపుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నదే వారి ఏకైక డిమాండు. ఇతర తరగతులవారు సైతం మా సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ వయసు పిల్లల్లో అత్యధికులు సిలబస్ భారం తగ్గిందంటే వేరే విధంగా స్పందిస్తారని అనుకోనవసరం లేదు. కానీ విపక్షాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి. ఈ నిర్ణయంలో దురుద్దేశాలున్నాయని ఆరోపిస్తు న్నాయి. సిలబస్ తొలగింపులో కాదు... విపక్షాల పాక్షిక దృక్పథంలోనే దురుద్దేశం వుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వాదన. అందుకాయన కొన్ని కారణాలు చెబుతున్నారు. ఒక్క సామాజిక శాస్త్రాల్లో మాత్రమే కాక సైన్స్, గణితం, ఇంగ్లిష్, హిందీ, హోంసైన్స్, జామెట్రీ వంటి వేర్వేరు సబ్జెక్టుల్లో కూడా సిలబస్ తొలగించారని ఆయన వివరణ. సిలబస్ తగ్గింపుపై రాజకీయం వద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల పర్యవసానంగా 190 సబ్జెక్టుల్లో సిలబస్ కుదించామని, ఇది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని అటు సీబీఎస్ఈ చెబుతోంది. ఈసారికి సిలబస్ తగ్గించాలన్న డిమాండు తొలిసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్ సిసోడియా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తొలగించిన అంశాలు చూశాక ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అన్నింటి మూలాలు రాజకీయాలతో ముడిపడిన వర్తమానంలో సిలబస్ కుదింపు అంశం వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటా సిలబస్ కుదించాం కదా అన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్ వాదన సరైందే కావొచ్చు. కానీ ఇతర సబ్జెక్టులకూ, సామాజిక శాస్త్రాలకూ చాలా వ్యత్యాసం వుంది. పరస్పరం సంఘ ర్షిస్తున్న సిద్ధాంతాలు, భావనలు సమాజంలో అనేకం వుంటాయి. ఏకీభావం కుదిరే అంశాల్లో సైతం భిన్న దృక్పథాలుంటాయి. వాటిని గురించి చర్చించేవి, వివరించేవి, విద్యార్థికి అవగాహన కలిగించేవి సామాజిక శాస్త్రాలు. కనుక సహజంగానే ఆ శాస్త్రాల్లో తొలగించిన సిలబస్పై ప్రశ్నలు తలెత్తుతాయి. ఫలానా అంశం కాకుండా ఇదే ఎందుకు తొలగించవలసివచ్చిందన్న సంశయం వస్తుంది. ఆ తొల గింపు వెనకున్న ప్రయోజనాలేమిటన్న ఆరా ఉంటుంది. విపక్షాలను సంతృప్తిపర్చడానికో, మరెవ రికో తలెత్తే అనుమానాలు తీర్చడానికో కాదు... విద్యారంగ నిపుణులనుంచి ఎలాంటి అభ్యంతరం రాకుండా వుండాలంటే సీబీఎస్ఈ అయినా, మరెవరైనా సిలబస్ తొలగింపు విషయంలో పారదర్శ కంగా వుండాలి. అసలు ఫలానా అంశం లేకపోయినా ఫర్వాలేదనో... తొలగించి తీరాలనో ఏ ప్రాతి పదికన నిర్ణయానికొచ్చారో, అందుకు అనుసరించిన విధానంలోని హేతుబద్ధత ఏమిటో చెప్పాల్సిన బాధ్యత సీబీఎస్ఈకి వుంటుంది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజం. ఉదాహరణకు పద కొండో తరగతిలో ప్రజాస్వామిక హక్కులు, పౌరసత్వం, ఫెడరలిజం, జెండర్, మతం, జాతీయ వాదం, లౌకికవాదం వంటి అంశాలు సిలబస్ కుదించాక ఎగిరిపోయాయి. ఇవన్నీ ఏ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకైనా అత్యంత ప్రాథమికమైనవి. మరోవిధంగా చెప్పాలంటే అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ అంశాల్లో సమాజం వైఖరి ఎలావుందన్నదాన్ని బట్టే ఆ సమాజం ప్రజాస్వామికమైనదా, కాదా అన్నది తేలుతుంది. సామాజిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఆ అంశాల జోలికిపోకుండా ప్రజాస్వామ్యం గురించి ఏం అవగాహన చేసుకుంటారు? పన్నెండో తరగతి సిల బస్లో ‘ఇరుగు పొరుగుతో భారత్ సంబంధాలు’, సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, సామాజిక ఉద్య మాలు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. మాయమైన ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు అనువుగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా విషయక క్యాలెండర్లో పొందుపరిచారు గనుక ఆందోళన పడొద్దని సీబీఎస్ఈ వివరిస్తోంది. కానీ ఈ అంశా లను లోతుగా అధ్యయనం చేయడం, చర్చించడం ఎలా సాధ్యం? ఈ కరోనా కాలం కొత్త అనుభవా లను కలిగిస్తోంది. ఎన్నడూ ఊహించడానికి శక్యంకానివి కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక ప్పుడు మోడరేషన్ కింద ఒకటి రెండు మార్కులు కలపాలంటే ఉద్యమాలు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు బడికి వెళ్లాల్సిన భారం లేకపోవడం, చదవకుండానే, పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, ఇప్పటికే ఫెయిలై సప్లిమెంటరీ రాయవలసినవారు కూడా పైతరగతులకు అర్హులు కావడం వంటివన్నీ జరిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గనుక, తొలగించిన అంశాలకు సంబంధించి బీజేపీకున్న దృక్పథమేమిటో తెలుసు గనుక సహజం గానే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిరుడు ఏప్రిల్లో కూడా సీబీఎస్ఈ కుల ఘర్షణలు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే సవాళ్లు, భిన్నత్వంవంటి అంశాలు తొలగించింది. విద్యార్థులకు సిల బస్ భారాన్ని తొలగించాలనుకోవడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆ పేరుతో అసలు ఆలోచించే భారాన్నే కుదించాలనుకోవడం మంచిది కాదు. ఈ కుదింపు తరచుగా వివాదాస్పదమవుతున్నది గనుక అందులో పారదర్శకతకు చోటీయడం ఉత్తమం. -
సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక్కసారి మాత్రమే.. 9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు. -
సిలబస్ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు. ప్రతి సబ్జెక్టులో 30 శాతం కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లోనూ పాఠశాలలు కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది. -
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదైన కొన్ని రోజులకే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఈ క్రమంలోనే అన్ని తరగతుల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది పాఠశాలలు తెరవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. (ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ) ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే కుదించిన సిలబస్ను కూడా టీచర్లు విద్యార్థులు చెప్పాలని, అయితే వాటిని పరీక్షలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్ కుదింపు విషయంలో కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. సిలబస్ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విద్యార్ధుల సిలబస్ 30 శాతం తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. (సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు) -
ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు ‘డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ’ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఆదివారం వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన పేపర్లకు మార్కులు వేసే సీబీఎస్ఈ నాలుగు అంశాల ఫార్ములాకు కూడా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున జూలై 1నుంచి 15వ తేదీల మధ్యన జరగాల్సిన సీబీఎస్ఈ పెండింగ్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజయ్ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సీబీఎస్ఈ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున 10, 12వ తరగతి పెండింగ్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ నిర్ణయించాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బోర్డు పరీక్షలు నిర్వహించలేమంటూ అశక్తత వ్యక్తం చేశాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. 10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మిగిలి ఉన్న పరీక్షలకు హాజరు కావడమా లేక ఇప్పటికే హాజరైన పరీక్షల్లో చూపిన ప్రతిభను బట్టి వేసే మార్కులకు అంగీకరించడమా అనే ఆప్షన్ను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామన్నారు. సీబీఎస్ఈ విధానాన్నే అటూఇటుగా తామూ అనుసరిస్తామని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ధర్మాసనానికి నివేదించింది. 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీకల్లా ప్రకటిస్తామని ఐసీఎస్ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు గత పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని ఐసీఎస్ఈ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సీబీఎస్ఈ పరీక్షలు అర్థంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యుత్తమ సరాసరి మార్కులే ఆధారం 10, 12వ తరగతి విద్యార్థి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన వారికి, మూడు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికైతే రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి మార్కులు వేస్తాయనుంది. ఢిల్లీలో అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు. -
జులై 15 కల్లా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో పది, 12వ తరగతులకు చెందిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఫలితాలను వెల్లడిస్తామని సీబీఎస్ఈ పేర్కొన్నవిషయం తెలిసిందే. తాజాగా సీబీఎస్ఈ సమర్పించిన అసెస్మెంట్ మార్క్ల స్కీమ్కు శుక్రవారం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇవాళ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజివ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. సీబీఎస్ఈ కోర్టుకు సమర్పించిన అసెస్మెంట్ స్కీమ్ను అంగీకరించింది. పెండింగ్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్క్లు వేసి ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయనున్నది. ఇప్పటికే పూర్తయిన బోర్డు పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి సబ్జెక్టులకు మార్కులను కేటాయించనుంది. కాగా ఏ పరీక్షలు రాయని విద్యార్థులకు మాత్రం అసెస్మెంట్, గత ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టుల మూల్యాంకనం ద్వారా మార్కులను కేటాయించనున్నారు. మళ్లీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు కూడా పరీక్షలు రాసే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది. ఆప్షనల్ పరీక్షలు రాయాలా వద్దా అనేది విద్యార్థులకే వదిలివేసినట్లు సీబీఎస్ పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు సెప్టెంబర్లో నిర్వహించే అవకాశముందని సీబీఎస్ఈ తెలిపింది. (సీబీఎస్ఈ పరీక్షలు రద్దు) సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు గత ఫిబ్రవరి 15న ప్రారంభం కాగా లాక్డౌన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయాయి. 10వ తరగతి పరీక్షలు కూడా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు నిర్వహించాల్సి ఉండగా సగంలోనే నిలిచిపోయాయి. దీంతో జూలైలో మిగిలిపోయిన పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ భావించింది. కానీ ప్రస్తుత కరోనా దృష్యా అది సాధ్యం కాదని తెలిసి రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్స్ ఆధారంగా ఫలితాలు ప్రకటించేలా బోర్డులను ఆదేశించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. కాగా ఐసీఎస్ఈ బోర్డు తరపున సుప్రీంలో న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. అసెస్మెంట్ మార్కుల విధానం సీబీఎస్ఈతో పోలిస్తే ఐసీఎస్ఈలో తేడా ఉంటుందని, అయితే పదవ తరగతి విద్యార్థులకు అన్నీ అనుకూలించినప్పుడు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని ఐసీఎస్ఈ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు సీబీఎస్ఈ సమర్పించిన అఫిడవిట్ తరహాలోనే తమది కూడా ఉందని, కానీ సగటు మార్కుల విధానం ఒక్కటే తేడా ఉందని జయదీప్ తెలిపారు. -
సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతితో పాటు డిగ్రీ, పీజీ అన్ని రకాల పరీక్షలు రద్దు చేశాయి. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కూడా పరీక్షలను రద్దు చేసింది. 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి గురువారం తెలిపారు. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు చేసినట్టు వెల్లడించారు. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చినట్టు కోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. పరీక్షకు హాజరవుతారా? ఇంటర్నర్ మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకుంటారా అనేది విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టినట్టు వెల్లడించింది. సీబీఎస్ఈ తీసుకున్న తాజా నిర్ణయాలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు(శుక్రవారం) వెలువడనుంది. -
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు?
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలోని పరీక్షల నిర్వహణపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1-15 మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను రద్దుచేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 10, 12వ తరగతి పరీక్షల రద్దు అవకాశాలను పరిశీలించాలని సీబీఎస్ఈ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. (ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!) ‘కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అలా అని ఆలస్యంగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 19 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు నిర్వహించాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాలు పలితాలు కూడా విడుదల చేశాయి. దీంతో కొన్ని యూనివర్సిటీలు కొత్త అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అప్పుడు సీబీఎస్ఈ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేసి గ్రేడ్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే మార్కులు/గ్రేడ్స్ విషయంలో ఎవరికైన అభ్యంతరాలు ఉంటే వారికి తర్వాత పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నాం. రెండు మూడు రోజుల్లో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం ఆలస్యం అవుతుంది కావచ్చు. కానీ ఆ పరీక్షలు రద్దు చేయడం అసాధ్యం’ అని ఓ ప్రభుత్వాధికారి అనధికారికంగా తెలిపారు. (కరోనా సోకిన వ్యక్తి ఫోన్ చోరీ చేశాడు..) -
ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పది, పన్నెండో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ భారత్లో బయట పడిన తర్వాతనే ఈ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పరీక్షలు పూర్తికాగా, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలే జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు మొదలే కాలేదు. మొత్తానికి చూస్తే ఎక్కువ పరీక్షలేమిగిలిపోయాయి. జూన్ 14వ తేదీ నాటికి దేశంలో రోజుకు నమోదవుతున్న కరోనా కేసులు 12 వేలకు చేరుకోగా, దేశంలో మొత్తం కేసులు మూడు లక్షల ముప్పై వేలకు చేరుకుంది. జూలై చివరి నాటికి ఒక్క ఢిల్లీలోనే కరోనా కేసులు ఐదున్నర లక్షలకు చేరుకుంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇప్పట్లో విద్యార్థులకు పది, పన్నెండవ తరగతులకు పరీక్షలే నిర్వహించరాదని, నిర్వహించకుండా పాస్ చేసినప్పటికీ విద్యాలయాలను ఇప్పట్లో ప్రారంభించరాదని విద్యావేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరెంట్స్ కమిటీలు హైకోర్టులను ఆశ్రయించాయి. థర్మో అనలైజర్లు, శానిటైజర్లు, సామాజిక దూరం నిబంధనలు విద్యార్థినీ విద్యార్థుల విషయంలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేవని వారంటున్నారు. ఓ తరగతి గదిలో ఒక్కరికి వైరస్ సోకినా దాని ప్రభావం ఊహించలేనంతా ప్రమాదకరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. -
సీబీఎస్ఈ పరీక్షలకు 15 వేల కేంద్రాలు
న్యూఢిల్లీ: పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. కోవిడ్–19 కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు జరగనున్నాయి. గతంలో నిర్ణయించినట్టు మూడువేల కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. హోంశాఖ నిబంధనల ప్రకారం కోవిడ్–19 కంటైన్మెంట్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించరు. అలాగే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్తంగాను, ఈశాన్య ఢిల్లీలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు జరుగుతాయి. -
చదివిన స్కూల్లోనే సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పెండింగ్ పరీక్షల విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థులు బయటి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్లోనే ఈ పరీక్షలు రాయొచ్చని సూచించింది. లాక్డౌన్ కంటే ముందు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే మొదలైంది. బోర్డు పరీక్షల ఫలితాలను జూలై మాసాంతం నాటికి వెళ్లడించేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. -
జూలై 1 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్, ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కారణంగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించింది. నిలిచిపోయిన 10, 12వ తరగతి పరీక్షలను జూలై ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డ్ సోమవారం తెలిపింది. 10వ తరగతి పరీక్షలు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లతో నిలిచిపోగా, 12వ తరగతి పరీక్షలు దేశవ్యాప్త లాక్డౌన్ అమలు కారణంగా వాయిదా పడ్డాయి. 12వ తరగతి విద్యార్థులకు జూలై 1న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్ సైన్స్, 9న బిజినెస్ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి. -
సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్తో రావాలని సీబీఎస్ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్డౌన్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే. -
రేపు సీబీఎస్ఈ పరీక్షల తేదీల వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : పెండింగ్లో ఉన్న పది, పన్నెండో తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను మానవవనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ సోమవారం ప్రకటిస్తారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను సోమవారం వెల్లడిస్తామని మంత్రి ట్వీట్ చేశారు. పెండింగ్లో ఉన్న సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరుగుతాయని, ఇప్పటికే ముగిసిన పరీక్షలను తిరిగి నిర్వహించబోమని మంత్రి వివరణ ఇచ్చారు. హెచ్ఆర్డీ మంత్రి పరీక్షల తేదీలను ప్రకటించనుండగా, సీబీఎస్ఈ వెబ్సైట్లో పరీక్షలకు సంబందించి పూర్తి వివరాలను పొందుపరుస్తారు. కాగా సీబీఎస్ఈ పెండింగ్ పరీక్షలు జులై 1 నుంచి జులై 15 మధ్య జరుగుతాయని గతంలో హెచ్ఆర్డీ మంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్ధులకు తగినంత సమయం ఇచ్చేలా షెడ్యూల్ను ప్రకటిస్తామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. చదవండి : ఫెయిలైన వారికి సీబీఎస్ఈ మరో చాన్స్ -
ఫెయిలైన వారికి సీబీఎస్ఈ మరో చాన్స్
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయి 9, 11వ తరగతుల పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. ‘విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ప్రస్తుత సంవత్సరానికి మాత్రమే వర్తించేలా, విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను మెరుగు పరుచుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం.’ అని గురువారం సీబీఎస్ఈ ప్రకటించింది. ఇప్పటికే పరీక్షలు రాసిన, ఫలితాలు వెలువడిన, ఇప్పటి వరకు పరీక్షలు రాయని, అన్ని సబ్జెక్టుల వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. ఈ పరీక్షలో ఫలితాల ప్రాతిపదికన విద్యార్థులను పై తరగతులకు పంపవచ్చని పాఠశాలల యాజమాన్యాలకు తెలిపారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా విద్యార్థులకు తగిన విధంగా సమయం ఇవ్వాలన్నారు. వాయిదాపడిన సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే బోర్డు ప్రకటించింది. ప్రతిభతో సంబంధం లేకుండా 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు గత నెలలో సీబీఎస్ఈ ప్రకటించడం తెల్సిందే. ‘పరీక్షలు సరిగా రాయలేకపోయిన విద్యార్థులు మరింత నిరుత్సాహానికి గురవడం సహజం. అందుకే, వారి ఆందోళనను పోగొట్టి, మానసిక స్థైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని భరద్వాజ్ తెలిపారు. -
టీచర్ల ఇళ్ల వద్దే మూల్యాంకనం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో తమ పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన విధానంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్పులు చేసింది. ఒకేచోట ఎగ్జామినర్లందరినీ కూర్చోబెట్టి మూల్యాంకనాన్ని చేయించే బదులు, వాటిని టీచర్లకిచ్చి వారి ఇళ్ల వద్దే మూల్యాంకనం చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ పరిధిలోని కేంద్రీయ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (సీబీఎస్ఈ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే 2020 పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని టీచర్ల ఇళ్ల వద్దే చేయించనుంది. – సీబీఎస్ఈ పదో తరగతిలో మిగిలి ఉన్న పేపర్లకు, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి ఇటీవలే సీబీఎస్ఈ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. జూలై ఒకటో తేదీ నుంచి 12 వరకు ఇవి జరుగుతాయి. – ఈ పరీక్షల కోసం బోర్డు గతంలో టెన్త్కు 5,376 సెంటర్లు, 12వ తరగతికి 4,983 సెంటర్లను ఏర్పాటుచేసింది. – ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది హాజరవుతున్నారు. – పరీక్షలు రాసేటప్పుడు భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్ష కేంద్రాల సంఖ్యలో మార్పులు జరగనున్నాయి. – వీటి సమాధాన పత్రాలను టీచర్లతో వారి ఇళ్ల వద్దే మూల్యాంకనం చేయించేలా చర్యలు చేపట్టినట్టు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్పోఖ్రియాల్ నిశాంక్ ఆదివారం మీడియాతో చెప్పారు. – ఆయా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులను అనుసరించి మొత్తం 1.50 కోట్ల పరీక్ష పత్రాలను ఎగ్జామినర్ల ద్వారా ఇళ్ల వద్దే దిద్దించాల్సి ఉంటుంది. -
టీచర్ల ఇళ్లలోనే జవాబు పత్రాల మూల్యాంకనం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి.