cobra
-
నిను వీడని ‘నాగు’ను నేను!
పలమనేరు/బైరెడ్డిపల్లె: పిచ్చుగుంట్ల సుబ్రహ్మణ్యం.. ఊరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరకుంట. పదేళ్ల వయసులో ఐదో తరగతి చదువుతున్న అతడిని పశువులు కాస్తున్న సందర్బంలో ఓ నాగుపాము కాటేసింది. ప్రస్తుతం అతడి వయసు 48. ఇప్పటివరకు నాగుపాములు అయన్ని 103సార్లు కాటేశాయి. అయినా.. ఎప్పటికప్పుడు చికిత్స పొందుతూ మృత్యుంజయుడిగా మారాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ‘ఇదో మిరాకిల్’ అంటూ వైద్యులే షాకవుతున్న ఈ విచిత్రమైన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. సుబ్రహ్మణ్యేశ్వరుడి కృపతో పుట్టారట బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన పిచ్చుగుంట్ల కుప్పయ్య దంపతులకు పెళ్లయిన చాలాకాలం వరకు సంతానం లేదు. దీంతో ఆ దంపతులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం మొక్కుకున్నారట. మొక్కు సాకారమై కొడుకు పుట్టడంతో అతడికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. సుబ్రహ్మణ్యం ఐదో తరగతి చదువుతూ పొలంలో పశువులను కాస్తుండగా మొదటిసారి నాగుపాము అతన్ని కాటేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడికెళ్లినా పాములు అతడిని వదలడం లేదు. తొలినాళ్లలో పెద్దగా ఆస్పత్రులు లేకపోవడంతో సుబ్రహ్మణ్యం పాము కాటేసినప్పుడల్లా బైరెడ్డిపల్లిలోనే నాటువైద్యుడు దైవకటాక్షం వద్ద చికిత్సలు పొందేవాడు. ఆ తరువాత బైరెడ్డిపల్లి పీహెచ్సీ, కోలార్ మెడికల్ కాలేజీ, పీఈఎస్ కుప్పం, పెద్దపంజాణిలోని క్రిస్టియన్ ఆస్పత్రి, జేఎంజే గుట్టూరులో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడుతున్నాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇంటిముందు మంచంపై కూర్చుని ఉండగా.. వెనుకనుంచి వచి్చన పాము కాలిపై కాటేసింది. గుట్టూరులో చికిత్స పొంది మంగళవారం అతడు డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు. చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చు 103సార్లు పాముకాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాల పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు. కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యులమవుతామనే భయమే దీనికి కారణం. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందోననే ఆందోళనతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీనిపై వైద్యులు సైతం ఇదో మిరాకిల్ అంటున్నారు. ఇలా ఎవరికీ జరగదని.. ఇతడినే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. తిరగని గుడుల్లేవుచిన్నప్పటి నుంచి పాము కలలో కనిపించేది. పాముకాట్లు మొదలయ్యాక నాగదోషం ఉందని కాళహస్తి వెళ్లా. తరువాత తిరుత్తణికి జీవిత కావడి మోస్తున్నా. వీరనాగమ్మ మా ఇలవేల్పు కాబట్టి.. ఇంటివద్ద నాగులు రాళ్లకు పూజలు చేస్తున్నా. కొక్కే సుబ్రహ్మణ్యస్వామి, తిరువణ్ణామలై, కురుడమళై కులదేవీ తదితర ఆలయాలకు తిరిగినా పాము కసి వదలిపెట్టలేదు. – సుబ్రహ్మణ్యం, నాగుపాము కాటు బాధితుడు నాగుపాములు పగబట్టవు నాగుపాములు పగబడతాయనేది నిజం కాదు. పాములకు ఉండేది చిన్నపాటి మెదడు. దీనివల్ల వాటికి జ్ఞాపకశక్తి తక్కువ. ఏవేవో పాములు అతన్ని యాధృచ్చికంగా కాటేస్తుండవచ్చు. పగబట్టి మాత్రం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలతో తనకు నాగదోషం ఉందని, పాము పగబట్టిందని భావించడం వట్టి ట్రాష్ మాత్రమే. మేం అతడింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం. – యుగంధర్, జన విజ్ఞాన వేదిక నాయకుడు, పలమనేరు -
10 రోజులుగా ఆటబొమ్మలో నాగుపాము
భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. -
అమెజాన్లో ఆర్డర్.. పార్శిల్ నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము
బెంగళూరు : ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని సర్జాపూర్కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్బాక్స్ను అమెజాన్ కంపెనీ యాప్లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్కి గురి చేస్తూ పార్శిల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు. అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు. స్పందించిన అమెజాన్కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. -
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
హిందూ సాంప్రదాయంలో పాములను నాగ దేవతగా భావించి పూజలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ప్రతి నెలలలో వచ్చే పంచమి, చవితి తిథులకు పుట్టలో పాలు పోయడం, పూజలు చేయడం వంటివి కూడా చేస్తారు. కానీ కొందరు మూఢ భక్తితో చేసే పనులు చాలా భయానకంగా ఉంటాయి. అది భక్తో లేక మూర్ఖత్వం అనాలో తెలియదు. అలాంటి షాకింగ్ ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. నిజానికి నాగుపాముని విష్ణవు, శివ స్వరూపాలుగా భావిస్తారు. ఎందుకంటే విష్ణువుకి పాన్పుగా ఆదిశేషుడు, శివుని మెడలో వాసుకిగా నాగులు ఉండటంతో వాటికి పురాణల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ముఖ్యమైన పర్వదినాల్లో నాగులను పూజించి వేడుకోవడం జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఏకంగా విషసర్పాలను నేరుగా తెచ్చి పూజించడం అంటే..వామ్మో అనిపిస్తుంది కదా!. మహా అయితే పుట్టకో లేదా దేవాలయాల్లో నాగుల జంట ఉండే ప్రతిమకు పూజలు చేస్తే చాలు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ కుటుంబం ఏకంగా మూఢ భక్తితో నల్ల నాగుపాముని తెచ్చి ఓ ప్లేటులో ఉంచి పూజలు చేసేస్తున్నారు. అదేమో ఒక పక్క బుసలు కొడుతూ కాటేసే యత్నం చేస్తున్నా..వీళ్లు మాత్రం భక్తిపారవశ్యంతో పూజలు చేసేస్తున్నారు. మరోవూపు అది కాటేస్తుందేమోనన్న భయంతో ఒక పక్క మనుసులో ఉన్నా సరే పూజల తంతు మాత్రం ఆపడం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థిత ఏంటీ..?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వాళ్లు నాగుపాముకి నేరుగా పూజలు చేస్తున్న విధానం చూస్తే..బాబోయ్! అనిపిస్తుంది. View this post on Instagram A post shared by हिंदू धर्म रक्षक (@omkar_sanatanii) (చదవండి: టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..! వీడియో వైరల్) -
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్ఖండ్లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
పాము పాలు తాగదు మరీ పుట్టలో పోయడం ఎందుకు ?
నాగుల చవితి ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది. నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి? ఆ 12 నాగులనే ఎందుకు పూజిస్తారు..? ఇక చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. ని పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా - సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. శ్రావణ మాసంలో ఎందుకు చేస్తాం అంటే.. వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. కార్తీకంలో ఎందుకంటే..? పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !. పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం.. అందువల్ల నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం* పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం. ”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. ఆ 12 నాగులనే ఆరాధిస్తారు.. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. నాగుల చవితి మంత్రం పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అనంత వాసుకి శేష పద్మ కంబాల కర్కోటకం ఆశ్వతార ధృతరాష్ట్ర శంఖపాల కలియా తక్షక పింగళ ఈ ప్రపంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి . నడుము తొక్కితే నావాడు అనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటి వాడు అనుకో నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుంmr మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. (చదవండి: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్ ఘటన..చనిపోయిన ఆ మొసలి స్థానంలో..) -
హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... రోమాలు నిక్కబొడిచే వీడియో!
ఎటువంటి కర్మకు అటువంటి ఫలితమే వస్తుందని అంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక వీడియో దీనికి రుజువుగా మారింది. వీడియోలోని దృశ్యం ప్రకారం.. కారులో కూర్చున్న ఒక వ్యక్తి వినోదం కోసం రివాల్వర్తో నాగుపాముకు గురిపెట్టి కాల్పులు జరుపుతాడు. అయితే గురి తప్పి, ఆ నాగుపాము తృటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మరుసటి క్షణంలో కారులో కూర్చున్న వ్యక్తికి ప్రాణాలు పోయినంత పని అవుతుంది. వీడియో ప్రారంభంలో ఒక కింగ్ కోబ్రా(నాగు పాము) మట్టి రహదారిపై ఉండటాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఒక కారు ఆ కోబ్రా ముందు ఆగి ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న వ్యక్తి తన రివాల్వర్ని తీసి, కోబ్రాపై కాల్పులు జరుపుతాడు. ఆ వ్యక్తి పలుమార్లు నాగుపాముపై కాల్పులు జరుపుతాడు. అయితే ప్రతిసారీ గురి తప్పుతుంది. ఆ నాగుపాము కోపంతో తన పడగ విప్పి, ఆ వ్యక్తిపై దాడికి ఉపక్రమిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గట్టిగా అరవడం వీడియోలో వినిపిస్తుంది. దీంతో వీడియో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్లో @Instantregretss అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లెక్కకు మించిన వీక్షణలు దక్కాయి. ఈ వీడియోను ఐదు వేల మందికి పైగా లైక్ చేశారు. ఇది కూడా చదవండి: చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా? Don't bring a gun to a cobra fight! 🐍 pic.twitter.com/qGshAWdjHu — Klip Entertainment (@klip_ent) December 16, 2022 -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
నిద్రిస్తున్న బాలికను కాటు వేసిన నాగుపాము
దుర్గి/చిలకలూరిపేట టౌన్: పాముకాటులో బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అడిగొప్పల యానాది కాలనీకి చెందిన కొమరగిరి అనిల్ బాబు, పూజ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మౌనిక స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో కూలీ పనులు కోసం వెళ్లారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో శనివారం బంధువులతో తల్లిదండ్రుల వద్దకు పోతవరం వెళ్లింది. తల్లిదండ్రులతో ఆటపాటలతో సంతోషంగా గడిపి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో తల్లిదండ్రులు పాము కాటు అని గుర్తించి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వైద్యులు చికిత్స కొనసాగిస్తున్న క్రమంలో బాలిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న సర్పంచి నలబోతు చిన్నబ్బాయి మృతి చెందిన బాలిక కుటుంబానికి మట్టి ఖర్చులు కోసం రూ.5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను వైస్ ఎంపీపీ చల్లా శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్ హుసేన్ పరామర్శించారు. -
టమాటాలకు కాపలాగా ఎవరున్నారో చూశారా.. పెద్ద ప్లానే..
ప్రస్తుతం అత్యంత ఖరీదైన వస్తువుల్లో టమాటా కూడా చేరిపోయింది. కొనుగోలు చేయడానికి ఆలోచిస్తే పరవాలేదు, కొన్నది వండుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ కొనగలమో లేదో అని. టమాట రేటు ఆకాశానికి చేరిన వార్త తెలుసుకుందో ఏమో వంటింట్లో ఉంచిన టమాటాల వద్ద ప్రత్యక్షమైంది ఒక కోడె నాగు. అక్కడే ఉండి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాసింది. పాములు సాధారణంగా ఇళ్లల్లోకి వచ్చినా మనుషుల కంట పడకుండా ఎక్కడో మూల వెలుతురు పడని చోట నక్కి ఉంటాయి లేదా ఏదైనా కలుగులోకి దూరి దాక్కుంటాయి. కానీ ఒక తాచు పామును టమాటాలు ఆకర్షించాయో లేక వాటి ధర ఆకట్టుకుందో గాని ఇంట్లోకి చొరబడి అవి ఉన్న ప్లేటును చుట్టుకుని కాపలాగా కూర్చుంది. ఎవరైనా వాటి జోలికి వస్తే చాలు కాటేసేందుకు పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విశేష స్పందన వచ్చింది. View this post on Instagram A post shared by Mirza Md Arif (@mirzamdarif1) టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. రెండు నెలల క్రితం రూ.20 ఉండే కిలో టమాటా చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపుగా పరుగులు తీస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటి ధర ఇప్పటికే రూ.200 మార్కు అందుకుని రూ. 250 చేరుకునే క్రమంలో ఉంది. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండి
Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు! -
‘కోబ్రా’తో బుడతడి ఆటలు..!
కింగ్ కోబ్రా (రాచ నాగు) అంటేనే అందరికీ హడల్. ఆ పామును చూస్తే పరుగులు తీస్తారు. కానీ ఓ ఐదేళ్ల బుడతడు ఏ మాత్రం భయం లేకుండా దానిని ఆడిస్తున్నాడు. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా కేహెచ్బీ కాలనీవాసి పాములు పట్టే నిపుణుడు ప్రశాంత్ హులేకర్ కుమారుడు విరాజ్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బాలుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. గత రెండేళ్లుగా తండ్రితో కలిపి పాములు పట్టడం నేర్చుకున్నాడు. సోమవారం కేహెచ్బీ కాలనీలో కింగ్ కోబ్రా చొరబడిందని తెలిసి తండ్రీకొడుకులు దానిని బంధించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా విరాజ్ స్వేచ్ఛగా సర్పాన్ని ఆడిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత దానిని దూరంగా విడిచిపెట్టారు. – బనశంకరి -
కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్ మింగిన నాగుపాము..
మైసూరు: ప్లాస్టిక్ కవర్ల వల్ల జంతుజాలం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. నాగుపాము ఒకటి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్ను మింగి అవస్థ పడుతుండగా పాముల నిపుణుడు సపర్యలు చేసి కాపాడాడు. ఈ సంఘటన కొడగు జిల్లా కుశాలనగ దగ్గర గొంది బసవనహళ్ళి గ్రామంలో జరిగింది. చెందిన శశి అనే వ్యక్తి ఇంటిలోకి వచ్చిన నాగుపాము ఇంటిలో దాక్కున్న కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్ను పొరపాటును మింగేసింది. కవర్ గొంతులో అడ్డం పడి పాము విలవిలలాడసాగింది. అది చూసి పాములు నిపుణుడు అయిన గఫూర్కు కొందరు సమాచారమిచ్చారు. ఆయన దానికి నీటిని తాగించి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్ను బయటకు తీసి పామును దూరంగా విడిచిపెట్టాడు. -
కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..
ఓ ఇంటిలోని కారుకింద భారీ కింగ్ కోబ్రా దాగి ఉంది. భయంతో పాములు పట్టుకునే వారికి సమాచరం అందిచడంతో..వారు రంగంలోకి దిగి వెతకగా.. ఏకంగా 15 ఏడుగుల భారీ కింగ్ కోబ్రా బయటపడింది. పాములు పట్టే నిపుణుడిని సైతం ముచ్చమటలు పట్టేలా జరజర పాకి వెళ్లిపోయేందుకు యత్నించింది. పాపం అతను చివరికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. దాని చాలా జాగ్రత్తగా దారి మళ్లించి ముందుగా ఏర్పాటు చేసుకున్న సంచిలోకి వెళ్లేలా చేశాడు. అందుకుసంబంధించిన వీడియోని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఆ పాముని అడవిలో ఒదిలేసినట్లు పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి అత్యంత విషపూరిత పాములను అతను మాదిరి పట్టుకునే యత్నం ఎవరూ చేయొద్దని సుశాంత్ హెచ్చరించారు కూడా. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా.. ఇళ్లలోకి విషపూరిత పాములు చొరబడుతున్నట్లు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి పాములే భారత్కి గర్వకారణమని, అతను చాలా స్కిల్ఫుల్గా పట్టుకున్నాడంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్స్టర్ టిల్లుపై కత్తితో..వీడియో వైరల్) -
గాల్లో విమానం.. పైలట్ సీట్లోకి నాగు పాము.. తర్వాత ఏం జరిగిందంటే!
జోహన్నెస్బర్గ్: గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన దర్శనమిచ్చింది. పామును గమనించిన పైలట్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో సోమవారం చోటు చేసుకుంది. విమానంలో పామును చూసిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం నలుగురు ప్రయాణికుతో చిన్న విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్కు తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద కదులుతూ కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అయితే పాముని చూసి బెంబేలెత్తకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఈ విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశాడు. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్బర్గ్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రాయణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానంలోని వారిని దింపేసి తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పాము చుట్టుకొని ఉండటాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రయాణానికి ముందు రోజు ఆదివారం మధ్యాహ్నం వార్సెస్టర్ ఎయిర్పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు వారు ప్రయత్నించినా దాని ఆచూకీ లభించకపోవడంతో బయటకు వెళ్లిపోయిందని భావించారు. అనూహ్యంగా మర్నాడు కాక్పిట్లో ప్రత్యక్షమైంది. మరోవైపు సంయమనం పాటించి, విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేసిన పైలెట్ను అభినందిస్తూ అతని ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చెయ్యికి పాము చుట్టినా.. భక్తిపారవశ్యంతో చిందులు
వైరల్: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ బార్డర్లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చిన్ద్వారా జిల్లా జామ్ సవాలీ హనుమాన్ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది. అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు. महाराष्ट्र, मध्य प्रदेश के बॉर्डर पर स्थित सौंसर के जामसवली मंदिर में कोबरा प्रजाति का सांप हाथो मे लेकर महाआरती करती महीला, pic.twitter.com/5wNBiHAvPX — Yogendraindiatv (@indiatvyogendra) March 9, 2023 -
నాగుపామును ముద్దాడి మృత్యువు ఒడిలోకి..
పాట్నా: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేజేతులారా ప్రాణం తీసుకున్నాడు. అది చాలా విచిత్రంగా ప్రవర్తించి. ఓ నాగుపామును దొరకబుచ్చుకుని మెడలో వేసుకుని వీరంగం సృస్టించాడు. దానిని ముద్దాడి.. ఆటాడి.. పూజించి.. చివరకు కాటేయించుకుని ప్రాణం పొగొట్టుకున్నాడు. నాగుపాముతో ఆటాడి ప్రాణం పొగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును మెడలో వేసుకుని.. దాని ముద్దాడాడు ఆ వ్యక్తి. ఆపై అక్కడే ఉన్న ఓ గుడి ముందుకు చేరి పాము మెడలో ఉండగానే వంగి వంగి దండాలు పెట్టాడు. మళ్లీ రోడ్డు మీదకు చేరి డ్యాన్స్ చేస్తూ పామును ముద్దాడాడు. ఈ క్రమంలో అది అతన్ని కాటు వేసింది. వద్దని చుట్టుపక్కల వాళ్లు ఎంత వారించినా వినకుండా పాముతో ఆటలాడాడతను. ఆపై పామును వదిలేశాడతను. అయితే కాసేపటికే అతను కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాము విషం ఎక్కి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ నవాడాలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడ్ని దిలీప్ యాదవ్గా గుర్తించారు. తప్పతాగి అతను గ్రామస్తులు చెప్పినా వినకుండా.. అలా పాముతో ఆటలాడాడని తెలుస్తోంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు చెబుతున్నారు. शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब के नशे में सांप के साथ खेल रहा है. कभी गले में लपेटकर तो कभी हाथों में पकड़कर नचा रहा. नतीजा सांप ने डंसा और शख्स की मौत हो गई. वीडियो-अमन राज. Edited By-@Sinhamegha8 pic.twitter.com/IhD1G3Jo8a — Prakash Kumar (@kumarprakash4u) March 4, 2023 -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
Viral Video: సబ్బు పెట్టి మరీ పాముకు స్నానం చేయించాడు
-
షాకింగ్ ఘటన: కాటేసిన నాగును కొరికి చంపాడు
ఒక బాలుడు పాము కాటేసిందని కోపంతో కసిగా కొరికి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్గఢ్లో రాయ్పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చత్తీస్గఢ్లో రాయ్పూర్లో జష్పూర్ జిల్లాలోని పండర్పాండ్ గ్రామంలో దీపక్ అనే బాలుడు ఇంటి పెరటిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము అతని చేతిని చుట్టుకుని కాటేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిల లాడాడు. కానీ పాము బాలుడి చేతిని చుట్టుకుని వదలకపోవడంతో దులుపుకని వదిలించుకునేందుకు యత్నించాడు. కానీ ఆ పాము బాలుడి చేతిని వదలలేదు. దీంతో కోపంతో ఆ పాముని కసితీరా రెండుసార్లు గట్టిగా కొరికి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడు కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంటీ స్నేక్ విషాన్ని అందించి ఒక రోజు అంతా అబ్జర్వేషన్లో ఉంచారు. తదనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. ఈ మేరకు పాములకు సంబంధించిన నిపుణుడు ఖైజర్ హుస్సేన్ మాట్లాడుతూ.. దీపక్ త్వరగా కోలుకున్నాడని చెప్పారు. ఇది పొడి కాటు అని అందువల్ల విషపూరితమైన పాము కాటు వేసినప్పటకి విషం విడుదల కాదని చెప్పారు. ఇటువంటి పాము కాట్లు చాలా నొప్పిగా అనిపిస్తాయని, అలాగే కాటు వేసిన చోట సాధారణ కాటు వేసిన లక్షణాలే కనిపిస్తాయని అన్నారు. ఐతే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేగాదు ఆ ప్రాంతాన్ని గిరిజనుల నాగ్లోక్ గ్రామం అని అంటారు. దీన్ని పాముల నివాసంగా చెబుతారు గ్రామస్తులు. (చదవండి: సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్) -
ఓటీటీలో విక్రమ్ కోబ్రా మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం 'కోబ్రా'. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించింది. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్31న విడుదలై మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్లో ఈనెల 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది. దీంతో థియేటర్స్లో మిస్ అయినవారు ఓటీటీలో హ్యాపీగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి. -
విక్రమ్ ‘కోబ్రా’ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించించింది. మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రల్లో కనిపించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 31న థియేటర్లో విడుదలైంది. విక్రమ్ విభిన్న పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎప్పటిలాగే విక్రమ్ నటన మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా! ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్పై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం తమిళం, తెలుగులో సెప్టెంబర్ 23 లేదా 30న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ -
ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘కోబ్రా’ డైరెక్టర్
చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి హిట్టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ ఉందని, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై డైరెక్టర్ స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్చాట్లో నెటిజన్లతో ముచ్చటించాడు డైరెక్టర్ జ్ఞానముత్తు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఈ సందర్భంగా ఓ నెటిజన్ కథ, కథనం బాగున్నప్పటికీ క్లైమాక్స్ నిరాశ పరిచిందన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసుల నుంచి హీరో తప్పించుని విదేశాల్లో స్వేచ్చగా బతుకున్నట్లు క్లైమాక్స్ రాయొచ్చు. కానీ, అలాంటి నేరస్థుడికి ఎలాంటి శిక్ష పడకపోవడం న్యాయం కాదు కదా!’ అని వివరించాడు. కోబ్రా సినిమా నిడివిపై మరో నెటిజన్ ప్రశ్నించగా.. ఈ చిత్రంలోని ప్రతి కీలక విషయాన్ని ప్రేక్షకుడికి చూపించాలనుకున్నామన్నారు. అందుకే నిడివి గురించి ఆలోచించలేదని చెప్పిన జ్ఞానముత్తు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మేరకు సినిమా నిడివిని 20 నిమిషాలు తగ్గించామని చెప్పాడు. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! ఇక స్క్రీన్ప్లే గందరగోళంగా ఉందని మరో నెటిజన్ అనగా.. ‘మిమ్మల్ని గందరగోళానికి గురి చేసినందుకు క్షమించండి. ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసే సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడిగా నేను ఇష్టపడతాను. అందుకే కోబ్రాను తెరకెక్కించాను. సాధ్యమైతే మరోసారి మా సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో విక్రమ్ సరసన ‘కేజీయఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి సందడి చేసింది. -
Cobra Review: ‘కోబ్రా’మూవీ రివ్యూ
టైటిల్ : కోబ్రా నటీనటులు : చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్ దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు సంగీతం : ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ:హరీష్ కణ్ణన్ విడుదల తేది: ఆగస్ట్ 31, 2022 ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు తమిళస్టార్ చియాన్ విక్రమ్. ఫలితాన్ని పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే విక్రమ్ ప్రయోగానికి ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి కానీ..సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. అందుకే ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విక్రమ్ పది పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాలిడ్ హిట్ కోసం 17 ఏళ్లు ఎదురుచూస్తున్న విక్రమ్కు ‘కోబ్రా’తో ఆ కొరత తీరిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. స్కాట్లాండ్ ప్రిన్స్ బహిరంగ హత్యకు గురవుతారు. ఈ కేసును విచారిస్తున్న ఇంటర్పోల్ ఆఫీసర్ అస్లామ్(ఇర్ఫాన్ ఫఠాన్).. ఒడిశా ముఖ్యమంత్రి, రష్యా మంత్రి కూడా అదే రీతిలో హత్యకు గురయ్యారని గుర్తిస్తాడు. ఈ హత్యలకు కోల్కతాలో ఉన్న లెక్కల మాస్టర్ మది(చియాన్ విక్రమ్)కి సంబంధం ఉందని అనుమానిస్తాడు. అలాగే వేరు వేరు దేశాల్లో జరిగిన ఈ హత్యలతో యువ వ్యాపారవేత్త రిషి(రోషన్ మాథ్యూ)కి కూడా సంబంధం ఉంటుంది. మరి వీరిలో ఎవరు ఆ హత్యలు చేశారు? ఈ కేసు విచారణలో అస్లామ్కు ఓ లెక్కల స్టూడెంట్ జూడీ(మీనాక్షీ గోవింద్ రాజన్) ఏ రకమైన సహాయం చేసింది? సాధారణ లెక్కల మాస్టర్కు ఈ హత్యలకు ఎలాంటి లింక్ ఉంది? కధీర్కు మదికి ఉన్న సంబంధం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? అనేదే కోబ్రా కథ. ఎలా ఉందంటే.. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ పది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్కే సమయం కేటాయించేవాడని మూవీ ప్రమోషన్స్లో మేకర్స్ తెలిపారు. అతని కష్టం తెరపై కనిపించింది కానీ..అజయ్ జ్ణానముత్తు కథనే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. గతంలో డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అజయ్.. విక్రమ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. విక్రమ్కు సెట్ అయ్యే కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయాడు. వరుస హత్యలతో కథ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రారంభమవుతుంది. మాథ్యమెటిక్స్లో ఉన్న అనుభవంతో ఆ హత్యలను ఎలా చేశారో వివరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే సమయంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత మాత్ర కథ పూర్తిగా తేలిపోతుంది. సుదీర్ఘంగా సాగే మది, కధీర్ల ప్లాష్బ్యాక్ స్టోరీ సినిమాకు పెద్ద మైనస్. సెకండాఫ్ మొత్తం ప్రేక్షకుడి ఊహకందేలా సాగడమే కాకుండా.. నిడివి మరింత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సినిమా చివరి భాగంలో కొన్ని యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. గెటప్పుల స్పెషలిస్ట్ విక్రమ్ నటనకు వంక పెట్టలేం. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ఆయనకు అలావాటు. మది, కధీర్ పాత్రల్లో విక్రమ్ ఒదిగిపోయాడు. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో 10 రకాల పాత్రల్లో విక్రమ్ కనిపిస్తాడు. అందుకోసం ఈ విలక్షణ నటుడు పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఇక మదిని ప్రాణంగా ప్రేమించే టీచరమ్మ భావన పాత్రలో శ్రీనిధి శెట్టి జీవించేసింది. జెన్నిఫర్గా మృణాళిని మెప్పించింది. ఫ్లాష్బ్యాక్లో వచ్చే పాత్ర ఆమెది. ఇక లెక్కల స్టూడెంట్గా జూడీ మీనాక్షీ గోవింద్ రాజన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంటర్పోల్ ఆఫీసర్ అస్లామ్గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పర్వాలేదనిపించాడు. అతనికిది తొలి సినిమా. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. రోషన్ మాథ్యూ విలనిజం బాగుంది. కానీ అతని క్యారెక్టర్కు ఓ గోల్ అనేది లేకుండా ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ
విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని భారీ అంచనాల మధ్య వినాయక చవితి రోజు బుధవారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. సస్పెన్ థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ఏడు విభిన్న రూపాల్లో కనిపించడం విశేషం. ఆయన నటించిన చిత్రం థియేటర్లో విడుదలై మూడేళ్లు అయ్యింది. వెరసి కోబ్రా చిత్రంపై ఇటు చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ అంచనాలను పూర్తి చేయడానికి చిత్ర బృందంతో సిద్ధమయ్యారు. అందులో భాగంగా తమిళనాడులోని చెన్నై, మదురై, తిరుచ్చి, కోవై వంటి ప్రధాన నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. సినీ ప్రేక్షకులు ఆయన బృందానికి బ్రహ్మరథం పట్టారనే చెప్పవచ్చు. తమిళనాడులోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విడుదలైంది. విక్రం హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు నగరాల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇంతకుముందు ఎప్పుడూ విక్రమ్ ఈ విధంగా తన చిత్రాల కోసం శ్రమించిన దాఖలాలు లేవు. మొత్తం మీద కోబ్రా చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. ఎంతగా అంటే కోబ్రా చిత్రాన్ని చూడడానికి కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని సెలవు అడిగేంతగా. తిరుచ్చిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపాల్కు ఒక లేఖను రాశారు. అందులో కోబ్రా చిత్రాన్ని విడుదల అయిన తొలి రోజు చూడటానికి టిక్కెట్లు లభించలేదని, దీంతో ఒకటో తేదీ సినిమా చూసేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ రోజు తాము కళాశాలకు రాకపోతే తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయరాదని విజ్ఞప్తి చేశారు. -
విక్రమ్ 'కోబ్రా’ మూవీ స్టిల్స్
-
‘కోబ్రా’మూవీ ట్విటర్ రివ్యూ
తమిళస్టార్ చియాన్ విక్రమ్ హీరోగా, వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా’. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మీనాక్షి , మృణాళిని హీరోయిన్లుగా నటించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా నేడు(ఆగస్ట్ 31) విడుదలైంది. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. ఇందులో పది రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు విక్రమ్. ఒక్కో పాత్ర కోసం ఐదారు గంటల పాటు మేకప్కే సమయం కేటాయించే వాడట. నటించడం మాత్రమే కాదు, డబ్బింగ్లోనూ ఆరు రకాల వేరియేషన్స్ చూపించాడట.సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘కోబ్రా’పై హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కోబ్రా’ కథేంటి? పది రకాల పాత్రల్లో కనిపించిన విక్రమ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు?తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #CobraFDFS : 1st half Vera level 👏🏻👏🏻 Gripping engaging @chiyaan Is Back 🤞🏻🥁😉#ARRahman bgm 🎶😳 Hollywood level 🤩@SrinidhiShetty7 Gorgeous ❤️@mirnaliniravi@AjayGnanamuthu Master of screenplay 🔥🔥You killed it 👍🏻#cobrareview #ChiyaanVikram #CobraFromAugust31 #Cobra pic.twitter.com/izuoxF9onN — 🎞️ Kollywood ⭐️ (@KollywoodStar_) August 31, 2022 ‘కోబ్రా’ ఫస్టాఫ్ అదిరిపోయిందని, విక్రమ్కు కమ్బ్యాక్ మూవీ అని కామెంట్ పెడుతున్నారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అజయ్ జ్ఞానముత్తు స్క్రీప్ప్లై బాగుందని పోస్ట్లు పెడుతున్నారు. కచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన సినిమా అని కామెంట్ చేస్తున్నారు. #cobrareview : #Cobra 1st Half well written script by Ajay very tight screenplay unpredictable #ChiyaanVikram Performance Next Level 2022 Best Actor Awards Parcel to #Vikram 🙏🙏🙏🙏🙏 — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 అజయ్ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని, విక్రమ్ తనదైన నటనతో అదరగొట్టేశాడని అంటున్నారు. 2022లో ఉత్తమ నటుడు అవార్డు విక్రమ్కే దక్కుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #COBRA Interval Marana Masss Thakali Soru #ChiyaanVikram Vera Level 🔥🔥🔥🔥🔥#Cobra Daaa Dual King Cobra#Vikram #CobraFDFS #CobraFromAugust31 #cobrareview — Cobra 🐍 (@24amSherlock) August 31, 2022 #ChiyaanVikram#cobrareview First Half 🔥🔥 With some lags... Waiting for Second half.. As usual @chiyaan sir Peaked 🔥🔥. — John Wick (@JohnWickTN82) August 31, 2022 #Cobra : 1st Half LA Irukura Questions elam 2nd Half LA Poga Poga theriya Varudhu 💥👌@Chiyaan #ChiyaanVikram #CobraReview — ᴅᴀᴠɪᴅ ᴀᴅᴀᴍ ᴄᵒᵇʳᵃ ғʳᵒᵐ ᴀᵘᵍᵘˢᵗ31 (@David_AdamCVF) August 31, 2022 #Cobra - first half Romba naal kachichi shankar Padam patha feel Super intelligient screenplay Interval twist verithanam Avoid spoilers to enjoy the thrill — Pravin (@pravin8984) August 31, 2022 #Cobra Interval 🔥🔥🔥🔥🔥 Wathaaa fireyyyyy 👌👌#ChiyanVikram is back 👌👌 Acting tharumaaru 👌@arrahman music 👌👌 So far best 👌 4/5#CobraFDFS #CobraReview pic.twitter.com/I1M7I4KyfR — Prof. H A B I L E (@almuyhi2) August 31, 2022 After long we came for movie for mind relax with a good feel... But no good feel expected at theatre..... Whether first day need more sound or second day !!! #Cobra @AjayGnanamuthu @chiyaan @7screenstudio @arrahman — Pradeep Kumar🔥NGK 🔥 (@_pradeep_91_) August 31, 2022 #COBRA Review FIRST HALF: Good 👌#ChiyaanVikram Shines & His Different Looks Are Good 👍#ARRahman's BGM & Song Elevates The Film 😇 Casting 👌 Screenplay is decent 👍 Some Lags 🙂 But, Interval Raises Expectations 🔥 Second Half Waiting 😁#CobraReview #CobraFDFS pic.twitter.com/yVMPoLK7W7 — Kumar Swayam (@KumarSwayam3) August 31, 2022 -
‘కోబ్రా’ కోసం విక్రమ్ అన్ని కోట్లు తీసుకున్నాడా?
ప్రయోగాత్మకమైన చిత్రాలకు పెట్టింది పేరు విక్రమ్ చియాన్. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటాడు. అందుకే తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ ఆయనకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా’. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘కోబ్రా’లో నటించడానికి విక్రమ్ భారీ మొత్తంలో పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు 25కోట్ల వరకు రెమ్యునరేషన్ను తీసుకున్నాడట. ఈ రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్లో దాదాపుగా 22 శాతమట. (చదవండి: రూ.9 కోట్ల భారీ ఆఫర్.. అయినా ఆ యాడ్కు నో చెప్పిన హీరో) ఈ చిత్రంలో విక్రమ్ 10 గెటప్స్లో కనిపించబోతున్నాడు. అందుకోసం విక్రమ్ చలా శ్రమించాల్సి వచ్చిందట. అందుకే నిర్మాత అంతమొత్తంలో చెల్లించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్ట్ నెల మిశ్రమ ఫలితాన్ని అందించింది. గత కొన్ని రోజులుగా వరుస డిజాస్టర్స్తో సతమతమవుతున్న ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ని అందించి కొత్త ఆశలు రేకెత్తించాయి. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. ఇక ఈ వారం.. అంటె సెప్టెంబర్ నెలారంభంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీలో అలరించడానికి పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. కోబ్రా తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’. వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న థియేటర్స్లో విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. రంగరంగ వైభవంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన లెటెస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించారు.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఫస్ట్డే ఫస్ట్ షో జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుజ్జీ..ఇలారా.. సునీల్, ధన్రాజ్ హీరోలుగా ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. చాందినీ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రూపా జగదీశ్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెస్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ ద లార్డ్ ఆఫ్ రింగ్స్(వెబ్ సిరీస్ తెలుగు), సెప్టెంబర్ 2 విడుదల ఆహా పంచతంత్ర కథలు (తెలుగు), ఆగస్ట్ 31 పెళ్లి కూతురు పార్టీ (తెలుగు), ఆగస్ట్ 31 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కఠ్పుత్లీ(హిందీ), సెప్టెంబర్ 2 ఖుదా హఫీజ్ 2(హిందీ), సెప్టెంబర్ 2 సోనీలీవ్ సుందరి గార్డెన్స్(మలయాళం), సెప్టెంబర్ 03 జీ5 విక్రాంత్ రోణ(తెలుగు), సెప్టెంబర్ 2 నెట్ఫ్లిక్స్ ఐ కేమ్ బై (ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 ఫ్యామిలీ సీక్రెట్స్(వెబ్ సిరీస్), ఆగస్ట్ 31 అండర్ హర్ కంట్రోల్(ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 -
పైరసీలో సినిమాలు చూస్తున్నారా? ఇకపై ఆ సైట్లు పనిచేయవు!
తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
నా ఫొటోకి పూల దండ వేసి నేను లేనట్టు ప్రచారం చేశారు: విక్రమ్
‘‘నా ‘శివపుత్రుడు, అపరిచితుడు’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించారు. నేను నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేసిన ప్రతిసారీ గొప్పగా ఆదరిస్తున్నారు. అలా తెలుగువారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ‘కోబ్రా’ చిత్రంలోనూ అద్భుతమైన నటన ఉంటుంది’’ అని హీరో విక్రమ్ అన్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కోబ్రా’ ప్రెస్మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న హెడ్మాస్టర్. ఆయన నటుడు కావాలని చెన్నై వచ్చారు. నేను మూడేళ్లకే ఓ సినిమాలో పాపగా యాక్ట్ చేశా. నాకు నటన అంటే పిచ్చి. ‘కోబ్రా’ కథ వినగానే వెంటనే సినిమా చేసేయాలనిపించింది. కోవిడ్ వల్ల సినిమా బాగా ఆలస్యం అయింది. రష్యాలో మైనస్ 40 డిగ్రీల చలిలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. ఈ చిత్రంలో దాదాపు పది పాత్రలు చేశాను. ఒక్కో పాత్ర మేకప్కి సుమారు ఐదు గంటలు పట్టేది. ‘కోబ్రా’ సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా చేయడం చాలెంజింగ్గా అనిపించింది. నాకు తెలిసింది నటనే. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలని భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ఇప్పటికీ తమిళ్లో టాప్ హీరోల్లో నేనూ ఒకణ్ణి. హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తుండటం గర్వంగా ఉంది. యూనివర్సల్ సబ్జెక్ట్తో రూపొందిన ‘కోబ్రా’ ని తిరుపతి ప్రసాద్గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కమల్ హాసన్గారి తర్వాత నట విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్. ఆయన సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ‘కోబ్రా’ చిత్రాన్ని కూడా బాగా ఆదరించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి తమిళ చిత్రం ‘కోబ్రా’. తొలి సినిమాకే విక్రమ్గారితో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీనిధీ శెట్టి. ‘‘కోబ్రా’ లో ఇంటెన్స్, ఎమోషనల్ రోల్లో కనిపిస్తాను’’ అన్నారు నటి మృణాళినీ రవి. ‘‘కోబ్రా’ సినిమా నాకు చాలా స్పెషల్’’ అన్నారు నటి మీనాక్షి. ‘ఇటీవల నా ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వచ్చాయి. మరికొందరు నా ఫొటోకి పూల దండ వేసిన ఫ్రేమ్స్ పెట్టి నేను లేనంటూ ప్రచారం చేశారు. ఆ వార్తలు చూసిన తర్వాత బాధపడి ఐదు రోజులు ఐసీయూలో ఉన్నాను’ అన్నారు విక్రమ్. -
'కోబ్రా' ప్రెస్మీట్ (ఫోటోలు)
-
విక్రమ్, యశ్లలో ఉన్న సేమ్ క్వాలిటీ అదే: శ్రీనిధి
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31 విడుదల కానుంది. తాజాగా 'కోబ్రా' చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్, శ్రీ నిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ.. సినిమా మొదలుపెట్టిన తర్వాత కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుంటూ సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. రష్యాలో మైనస్ డిగ్రీలలో చిత్రీకరించినప్పుడు సహాయ దర్శకులకు రక్తం కూడా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. ఇర్ఫాన్ పఠాన్ మొదటి సినిమా ఇది. ఆయన సెట్స్కు వచ్చినపుడు నటన గురించి పెద్దగా తెలీదు. కానీ దర్శకుడు అజయ్ ట్రైన్ చేసి ఒక ప్రొఫెషనల్ నటుడిగా తీర్చిదిద్దారు. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా'' అన్నారు. అనంతరం మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు కోబ్రా చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది . కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా? విక్రమ్: కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే వుంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ వుంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ వున్నాయి. నా కెరీర్లో చాలా సవాల్గా అనిపించిన సినిమా కోబ్రా. అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా? విక్రమ్: కోబ్రాలో సందేశం వుండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా వుంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు. ఇంత కష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది? విక్రమ్: నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం. విక్రమ్, యశ్లలో మీరు గమనించిన గొప్ప క్యాలిటీ? శ్రీనిధి: ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో వుంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా. సెట్స్ లో చాలా హంబుల్ గా వుంటారు. విక్రమ్ సెట్స్ లో ఎలా వుంటారు ? శ్రీనిధి : చాలా సరదాగా వుంటారు. చాలా ప్రాంక్లు చేస్తారు. మృణాళిని: విక్రమ్ గారితో షూటింగ్ అంటే సెట్లో చాలా సీరియస్గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది. మీనాక్షి : విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో వుంటే గొప్ప ఎనర్జీ వుంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం. చదవండి: తనను నానామాటలు అన్న థియేటర్ యజమానిని నేరుగా కలిసిన రౌడీ హీరో బాయ్కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్ -
బాయ్కాట్ బాలీవుడ్ వివాదంపై ఫన్నీగా స్పందించిన హీరో విక్రమ్
బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండింగ్ నడుస్తోంది.బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్కాట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఆమిర్ ఖాన్ ‘లాల్సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్కాట్ సెగ తగిలింది. గత గురువారం(ఆగస్ట్ 25) విడుదలైన ‘లైగర్’ని బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే హ్యాష్ట్యాగ్ను ట్వీటర్లో ట్రెండ్ చేశారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నింటికీ ఏదో ఒక రకంగా బాయ్కాట్ సెగ తగిలింది. ఈ బాయ్ కాట్ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోలు స్పందించారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఈ బాయ్కాట్ వివాదంపై కాస్త వ్యంగంగా స్పందించారు. విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా చిత్రం ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్ మీడియాతో ముచ్చటించారు. (చదవండి: కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్) ఈ మధ్య కాలంలో బాయ్కాట్ మూవీస్ అంటూ పలు బాలీవుడ్ చిత్రాలను బహిష్కరించాలని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. విక్రమ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘అసల్ బాయ్కాట్ అంటే ఏంటి? బాయ్ అంటే తెలుసు..గర్ల్ బాగా అంటే తెలుసు.. చివరకు కాట్ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్కాట్ అనే పదమే నాకు తెలియదు’అని విక్రమ్ చెప్పుకొచ్చాడు. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. -
కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది: విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. 'తెలుగు ఆడియన్స్కి నా ఫెర్ఫర్మెన్స్ తో ఒక బంధం ఉంది.చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది. కొవిడ్ తో షూట్ లేట్ అయ్యింది. ఒక్కొక్క మేనరిజమ్స్ చాలా ఇష్టపడి చేశాను.టెక్నికల్ సైడ్ వెరీ గుడ్ ఫిలిం.శ్రీనిధికి నాకు ఇందులో మంచి రిలేషన్ వుంటుంది. ఇది ఇంగ్లీష్ సినిమాలాగా ఉంటూ లోపల ఒక ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ట్రైలర్ చూసి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇది యూనివర్సల్ సినిమా ..అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి' అని తెలిపారు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ..విక్రమ్తో సినిమా చేసే ఛాన్స్ దక్కడం అదృష్టమని, మూడేళ్ల కష్టమే ఈ సినిమా అని చెప్పింది. థియేటర్స్లోనే సినిమాను చూడాలని కోరింది. -
నా సినిమా థియేటర్స్లో విడుదలై మూడేళ్లు అయ్యింది : విక్రమ్
తమిళసినిమా: పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు విక్రమ్. వైవిధ్యభరిత కథా చిత్రాల కోసం తపించే ఈయన తాజాగా నటించిన చిత్రం కోబ్రా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలోని వీఆర్ మాల్లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు విక్రమ్ వారసుడు, నటుడు ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తన తండ్రి విక్రమ్ నుంచి చాలా విషయాలు గ్రహించినట్లు చెప్పారు. కోబ్రా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం విక్రమ్ మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, ఇమైకా నొడిగళ్ చిత్రాలను ఒక్కో జానర్లో తెరకెక్కించారన్నారు. ఈ కోబ్రా చిత్రాన్ని తనదైన శైలిలో వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించారని తెలిపారు. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతుండటంతో ఆయన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారన్నారు. ఈయన కల్పన కథకు తామంతా సహకరించామని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు థియేటర్లలో విడుదలై మూడేళ్లు అయ్యిందన్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్ తిరిగొచ్చామని తెలిపారు. అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి తూత్తుక్కుడి, తిరునెల్వెల్లి ప్రాంతాల్లో చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోబ్రా చిత్రం కోసం చాలా శ్రమించామని, ఈ నెల 31వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించాలని విక్రమ్ కోరారు. -
విక్రమ్ కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందంతే!
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. గణిత శాస్త్రవేత్తగా విక్రమ్ కనిపించనున్నారు. ట్రైలర్ను బట్టి మొత్తం ఐదు ఢిపరెంట్ క్యారెక్టర్స్లో విక్రమ్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్ ,మృణాలిని రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెమమాన్ ఈ సినిమాను సంగీతం అందించారు. -
విభిన్న పాత్రల్లో విక్రమ్.. ఆసక్తిగా ‘కోబ్రా’ టీజర్
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 31న థియేటర్లోకి రాబోతోంది. ఇక ప్రమోషన్స్ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ను రిలీజ్ చేసంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఈ ఇందులో చియాన్ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్ ఫిదా చేయబోతున్నాడు. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కేఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలెకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ -
Cobra Movie: కోబ్రా వచ్చేది అప్పుడే
ఈ నెలాఖర్లో థియేటర్స్కు వస్తున్నాడు ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. మంగళవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది. తెలుగులో ‘కోబ్రా’ చిత్రం హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ‘‘ఈ చిత్రంలో గణిత మేథావి పాత్రలో విక్రమ్ కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్ర పోషించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
కోబ్రా: అదీరా లిరికల్ సాంగ్ విడుదల
విక్రమ్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఇందులో గణితశాస్త్ర మేధావి పాత్రలో కనిపిస్తారు విక్రమ్. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ‘అదీరా...’ అనే పాట లిరికల్ వీడియాను విడుదల చేశారు. హీరో పాత్ర లక్షణాలను వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఆలపించారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటింన ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. ఆగస్ట్ 11న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!
కేజీఎఫ్ 1, 2 సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాల్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బోలెడంత గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ గుర్తింపును క్యాష్ చేసుకోవాలనుకుందీ కన్నడ కుట్టి. అందులో భాగంగా తన రెమ్యునరేషన్ను రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కోబ్రా సినిమాతో తమిళంలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే కదా! కోలీవుడ్లో తొలి సినిమాకే ఆమె భారీ రేంజ్లో డిమాండ్ చేస్తోందట. కేజీఎఫ్ చాప్టర్ 2కు ఆమె మూడు కోట్లు తీసుకుంటే కోబ్రాకు ఏకంగా రూ.6-7 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో ఇది తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఆ రేంజ్లో తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీవిశ్లేషకులు. కాగా కోబ్రా సినిమాను అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేయగా సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. చదవండి: ఓటీటీ రిలీజ్కు సిద్ధమైన ఎఫ్3 మూవీ, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అతియా, రాహుల్ పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి -
విక్రమ్ ‘కోబ్రా’ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
విడుదలకు సిద్ధమైన విక్రమ్ ‘కోబ్రా’.. ఆ రోజే రిలీజ్
నటుడు విక్రమ్ కోబ్రాగా బుసలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పాత్ర కోసం ఎంతకైనా సిద్ధమయ్యే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్.. పితామగన్, ఐ, అపరిచితుడు, మహాన్ వంటి చిత్రాల్లో తన పాత్ర కోసం ఎంతో శ్రమించారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఈయన నైజం. అలా మరోసారి కోబ్రా చిత్రంలో కొత్త గెటప్లతో తనదైన నటనతో అబ్బురపరచడానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. చదవండి: Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎంఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. కేజీయఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఇందులో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో నటించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ తమిళనాడులో విడుదల చేయనుంది. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
చిరంజీవితో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న తమిళ స్టార్!
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వారిని ఎంటర్ టైన్ చేసేందుకు గాడ్ ఫాదర్ మూవీతో తిరిగి రావాలని చిరు కోరుకుంటున్నాడు. ఆగస్ట్ 15.. హాలీడే వీకెండ్ను టార్గెట్గా చేసుకుంటూ తన కొత్త సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అయితే ఆగస్ట్ రెండో వారంలో గాడ్ఫాదర్ రిలీజ్ ఉంటుందని కేవలం ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే చెప్పుకొస్తున్నాయి. అంతేకానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగస్ట్ సెకండ్ వీక్పై ఖర్చీఫ్ వేశాడు తమిళ స్టార్ హీరో విక్రమ్. ఆయన హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ చిత్రం ఆగస్ట్ 11న సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద చిరు, విక్రమ్ల మధ్య యుద్దం తప్పనిసరి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆగస్ట్ రెండో వారంలో కేవలం చిరు, విక్రమ్లు మాత్రమే పోటీ పడడం లేదు.. బోనస్గా అఖిల్, సమంత కూడా వచ్చేస్తున్నారు. అఖిల్ ఏజెంట్, సామ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద కూడా అదే వారంలో విడుదల కాబోతున్నాయి. యూత్స్టార్ నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’కూడా బరిలో నిలవబోతున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ వార్లో గెలిదేవరో చూడాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాత్రూమ్లో ప్రత్యక్షమయిన నాగుపాము.. పరుగో పరుగు
కర్ణాటక: ఓ ఇంట్లోని మరుగుదొడ్లో నాగుపాము ప్రత్యక్షమయింది. ఈ ఘటన శివమొగ్గ నగరానికి సమీపంలో ఉన్న శివప్పనాయక లే ఔట్లో చోటుచేసుకుంది. ఇంట్లోని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లగా.. అక్కడ పాము కనిపించడంతో బయటకు పరుగులు పెట్టాడు. అయితే బయట నుంచి మరుగుదొడ్లోకి వచ్చిన నాగుపాముకు అక్కడ నుంచి బయటకు వెళ్లడానికి వీలుకాలేదు. దాంతో అందులోనే ఉండిపోయింది. అనంతరం ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెంటనే అక్కడకు చేరుకుని నాగుపామును బంధించి సురక్షితంగా అడవిలో వదిలాడు. చదవండి: (MK Stalin: కరోనా ఉగ్రరూపం.. సీఎం స్టాలిన్ నడిరోడ్డుపై కారు ఆపి..) -
బీర్ క్యాన్లో నాగుపాము.. బయటపడలేక విలవిల
భువనేశ్వర్/పూరీ: ఖాళీ బీర్ క్యాన్లో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలోని జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బయటపడలేక పాము విలవిలలాడటాన్ని గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్లైన్ సభ్యులకు తెలియజేశారు. హెల్ప్లైన్ సభ్యుడు సుశాంత కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, పాము గాయపడకుండా జాగ్రత్తగా బయటకు తీసి.. జనసంచారం లేని ప్రాంతంలో విడిచి పెట్టారు. చదవండి: (Omicron: భారత్లో ఒమిక్రాన్ బయటపడింది ఇలా..!) -
Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..
బీమా సొమ్ము కోసం ఓ నిరుపేదను పాముకాటుతో చంపించిన ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. నిందితుడు వేసిన ప్లాన్ సస్పెన్స్ థ్రిల్లర్కు ఏమాత్రం తక్కువ కాదు! ఏం చేశాడంటే.. ప్రభాకర్ భీమాజీ వాఘ్చౌరే (54) గత 20 యేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చి, మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో రజుర్ అనే గ్రామంలో ఉంటున్నాడు. ఐతే ఏమైందో ఏమో.. హఠాత్తుగా 3 నెల్లతర్వాత ఏప్రిల్ 22న రజుర్ పోలీస్ స్టేషన్కు అక్కడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాఘ్చౌరే అనే వ్యక్తి మరణించినట్లు నివేదిక వచ్చింది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! దీంతో పోలీసులు సదరు ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టగా.. ప్రవీణ్, హర్షద్ లహంజె అనే ఇద్దరు వ్యక్తులు మృతుడు వాఘ్చౌరేగా గుర్తించారు. వారిలో ప్రవీణ్ అనే వ్యక్తి మృతుడికి మేనల్లుడినని చెప్పుకొన్నాడు. మృతుడు పాముకాటుతో మరణించినట్లు ప్రాథమిక మెడికల్ రిపోర్టులు వెల్లడించాయి. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని మేనల్లుడికి అప్పగించారు కూడా. దీంతో కథముగిసిపోయిందిలే అని అనుకున్నారు. కానీ.. వాఘ్చౌరే జీవిత బీమా క్లెయిమ్పై దర్యాప్తు చేస్తున్న బీమా సంస్థ అధికారులు అతని మరణ వివరాలను కోరుతూ అహ్మద్నగర్ అధికారులను సంప్రదించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. బీమా సంస్థ అధికారులు తొలుత మృతుడిగా చెప్పబడుతున్న వాఘ్చౌరే ఇంటి పక్కవారిని అడిగితే.. పాముకాటు సంఘటన ఏదీ ఇక్కడ చోటుచేసుకోలేదని, ఐతే అంబులెన్స్ మాత్రం ఆ ఇంటి ఆవరణలో కనిపించినట్లు తెలిపారు. తర్వాత వాఘ్చౌరే మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అతను బతికిఉండటమేకాకుండా హాస్పిటల్లో తనను తాను మేనల్లుడు ప్రవీణ్గా పరిచయం చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గతవారం వాఘ్చౌరేను, అతనికి సహకరించిన 4 అనుచరులను నిర్భందంలోకి తీసుకున్నాట్టు అహ్మద్నగర్ ఎస్పీ మనోజ్ పటేల్ మీడియాకు తెలిపారు. ఈ దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన నవ్నాథ్ యశ్వంత్ ఆనప్ (50)గా గుర్తించారు. ఏప్రిల్ 22న ఆనప్ను బలవంతంగా ముందుగానే నిర్ణయించిన ప్రాంతానికి తరలించి కాలి వేలిపై పాముతో కరిపించారు. అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని వాఘ్చౌరే ఇంటికి తరలించి, అంబులెన్స్ను పిలిపించినట్లు తెలిసింది. అసలు బీమా కంపెనీకి వాఘ్చౌరేపై అనుమానం ఎందుకొచ్చిందంటే.. గతంలో అతని భార్య బతికి ఉండగానే 2017లో సదరు బీమా కంపెనీ నుంచి బీమా క్లెయిమ్ చేయడంతో, మోసపోయిన బీమా సంస్థ అతని మృతి గురించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ దర్యాప్తే అతని బండారాన్ని వీధి కీడ్చింది. ఏదిఏమైనా ఒక నిండు ప్రాణం అతని స్వార్థానికి బలైపోయింది. చదవండి: ఎంత క్యూట్గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
భయానకం: పామును మరో పాము తినడం చూశారా?
సాధారణంగా పాముకు ఆకలేస్తే.. ఏ కప్పనో, ఎలుకనో తినడం మనం చూస్తూనే ఉంటాం. . కానీ ఓ పాము మరో పాముని తినడం ఎప్పుడైనా చూశారా? వినడానికి కొంచెం విచిత్రంగానే ఉన్న.. నిజంగానే ఓ పాము మరో పాముని గబుక్కున తినేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశాడు. పర్వీన్ పోస్టు చేసిన ఈ ఫోటోలో అడవుల్లోని ఓ కోబ్రా ఇంకో కోబ్రాను అమాంతం నోటిలో కరుచుకొని మింగుతోంది. ఇది చూడటానికి తీవ్ర భయంకరంగా కనిపిస్తోంది. ‘ అద్భుతమైన కోబ్రా ఓఫియోఫాగస్ హన్నా.. మరో కింగ్ కోబ్రాను తింటోంది’. అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా మరో పోస్టులో పర్వీన్ కశ్వాన్ ఒఫియోఫాగస్ హన్నా అర్థాన్ని వివరించారు. ఈ కింగ్ కోబ్రా యొక్క శాస్త్రీయ నామం; ఓఫియోఫాగస్ హన్నా. ఓఫియోఫాగస్ గ్రీకు భాషా పదం ఉద్భవించింది, దీని అర్థం ‘పాము తినడం’. అలాగే గ్రీకు పురాణాలలో చెట్టు, నివాస వనదేవతల పేరు నుంచి హన్నా ఉద్భవించింది. కాబట్టి కింగ్ దాని పేరుకు తగట్టు ఉంటుంది. ఇది గూళ్ళు నిర్మించే ఏకైక పాము.’ అని పేర్కొన్నారు. పాము ఇంకో పామును మింగటాన్ని చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. The scientific name of this king cobra is; Ophiophagus hannah. “Ophiophagus” is derived from Greek, meaning “snake-eating” and hannah is derived from the name of tree-dwelling nymphs in Greek mythology. So king living true to its name. The only snake which build nests. — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 Ophiophagus hannah. A king cobra eating a spectacled cobra. They feed on lesser mortals. pic.twitter.com/LL8xzQoIww — Parveen Kaswan (@ParveenKaswan) July 19, 2021 -
అమ్మో.. పే..ద్ద పాము.. ఎలాగైతేనేం బుడ్డోడు సేఫ్!
హనోయి: వరండాలో బొమ్మలతో ఆడుకుంటున్న ఓ బుడ్డోడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ పిల్లాడి తండ్రి వేగంగా స్పందించడంతో పాము కాటు నుంచి తప్పించుకోగలిగాడు. వియత్నాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు.... ఓ పిల్లాడు ఇంటి ముందర కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తాత అతడికి రక్షణగా అక్కడే నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ పాము వేగంగా ఇంట్లోకి దూసుకురావడం గమనించాడు. కానీ, అనారోగ్య కారణాల దృష్ట్యా బాబును చేతుల్లోకి తీసుకోలేకపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమై, ఇంట్లో ఉన్న పిల్లాడి తండ్రిని పిలిచాడు. దీంతో అతడు క్షణాల వ్యవధిలో అక్కడికి చిన్నారిని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ముగ్గురూ లోపలికి వెళ్లిన తర్వాత వెంటనే తలుపు మూసేశాడు. ఇక ఇంటి లోపలికి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన పాము.. ఎంతకీ వీలుకాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో... ‘‘వామ్మో.. ఎంత పెద్ద పాము.. క్షణాల్లో ఎలా దూసుకువచ్చింది... కాస్త ఆలస్యమైతే బాబుకు ఏమయ్యేదో.. ఎలాగైతేనేం బుడ్డోడు సేఫ్ అయ్యాడు. చిన్నారులను ఎల్లప్పుడూ ఓ కంట కనిపెట్టుకునే ఉండాలి’’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. -
తిరుమలలో 7 అడుగుల నాగుపాము హల్చల్..
సాక్షి, తిరుపతి: తిరుమలలో పాము హల్చల్ చేసింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. వివరాలు.. గరుడాద్రి అతిథి గృహాల సమీపంలో 546 గది వద్దకు పాము వచ్చింది. అక్కడున్న వాళ్లు విషయం గమనించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో... పాములు పట్టే భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఏడు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతున్నప్పటికీ ఎంతో చాకచక్యంగా భాస్కర్ దానిని పట్టుకున్నాడు. అనంతరం సురక్షిత ప్రాంతంలో పామును వదిలేశారు. -
Cobra: విక్రమ్ మరో ప్రయోగం.. ‘కోబ్రా’ నయా లుక్ వైరల్
Vikram: పాత్రకు తగ్గట్టు ఆ పాత్రధారిగా పరకాయప్రవేశం చేస్తారు హీరో విక్రమ్. ఇందుకు విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ పలు సినిమాల్లో రెండు మూడు గెటప్స్లో కనిపించిన విక్రమ్ తన తాజా చిత్రం ‘కోబ్రా’లో దాదాపు ఇరవైకి పైగా గెటప్స్లో కనిపించనున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమాలోని విక్రమ్ కొత్త గెటప్ను షేర్ చేశారు దర్శకుడు అజయ్. అద్దం ముందు కూర్చుని, మేకప్ చేయించుకుంటున్న ఈ ఫొటోలో విక్రమ్ గుర్తుపట్టలేని విధంగా కొత్తగా కనిపిస్తున్నారు. ‘‘కోబ్రా’ షూటింగ్ను తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వీలైనంత తొందరగా నార్మల్ డేస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అజయ్. View this post on Instagram A post shared by R Ajay Gnanamuthu (@aj_gnanamuthu) చదవండి: మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! రష్మిక షాకింగ్ నిర్ణయం, సోషల్ మీడియాకు గుడ్బై చెప్పాలనుకుందట! -
ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి...
స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ 20 డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విక్రమ్ లుక్ను డైరెక్టర్ అజయ్ షేర్ చేశారు. నల్ల గడ్డం, తెల్లని మీసాలతో వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్న విక్రమ్ కనిపించారు. గతేడాది మార్చి నెలలో రష్యాలో కోబ్రా షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు విజృంభించడంతో షూటింగ్కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం. ఇక ఈ మూవీలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ప్రతీ సినిమాలో ఢిపరెంట్ లుక్తో మెస్మరైజ్ చేసే విక్రమ్ ఈ సినిమాలో ఏకంగా 20 గెటప్స్లో కనిపించనుండటం విశేషం. ఇక క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్పోల్ అధికారి పాత్ర పోషిస్తున్న ఇర్ఫాన్ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఇర్ఫాన్తో పాటు దర్శకుడు కేయస్ రవికుమార్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా వరకూ రష్యాలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by R Ajay Gnanamuthu (@aj_gnanamuthu) చదవండి : హీరోయిన్ కడుపులో ట్రైనర్ పిడిగుద్దులు.. వీడియో వైరల్ ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్ -
ఓటీటీలో కాదు థియేటర్స్లోనే ‘కోబ్రా’
కోవిడ్ సెకండ్ వేవ్తో అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాల షూటింగ్లు, రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు, షూటింగ్ చివరిదశలో ఉన్న సినిమాల నిర్మాతల్లో కొందరు ఓటీటీ ప్లాట్ఫామ్ల వైపు చూస్తున్నారు. కోలీవుడ్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో విక్రమ్ హీరోగా నటించిన ‘కోబ్రా’ సినిమా థియేటర్స్లో విడుదల కాదని, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే టాక్ వినిపించింది. ఈ సినిమా విడుదలపై చిత్రయూనిట్ స్పందిస్తూ– ‘‘కోబ్రా’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు నిజం కాదు. థియేటర్స్లోనే విడుదల చేస్తాం’’ అని పేర్కొంది. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ‘కోబ్రా’ విడుదల కానుందనే వార్తలు కోలీవుడ్లో వినిపించాయి. కానీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. -
తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి!
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్న తొలి సినిమా ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్పోల్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ‘కోబ్రా’ సినిమాలోని ఓ కీలక షెడ్యూల్ కోసం ఇర్ఫాన్ రష్యా వెళ్లి వచ్చారు. ఈ షెడ్యూల్ గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ– ‘‘మైనస్ 20 డిగ్రీల చలిలో వర్క్ చేయడం నాకు కొత్తగా అనిపించింది. ఓ సందర్భంలో నా హెడ్క్రాఫ్ తీశాను. అంతే.. వెంటనే నా చెవులు ఎర్రగా మారిపోయాయి. చలితో వణికిపోయాను. కశ్మీర్ వాతావరణం నాకు తెలుసు. కానీ రష్యాలో వాతావరణం ఎలా ఉంటుందనేది ‘కోబ్రా’ సినిమా వల్ల నాకు తెలిసింది. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా రష్యా వచ్చారు. షూటింగ్ లేని సమయంలో ఆ లొకేషన్స్ను బాగా ఆస్వాదించాం. నాకు తెలుగు, మలయాళం ఇండస్ట్రీల నుంచి కూడా యాక్టర్గా ఆఫర్లు వచ్చాయి. కానీ ‘కోబ్రా’ సినిమా విడుదలయిన తర్వాత నా నటనకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి, నా క్రికెట్ కమిట్మెంట్స్ లేకపోతే అప్పుడు కొత్త సినిమాలు కమిట్ అవుదామని అనుకుంటున్నాను’’ అన్నారు ఇర్ఫాన్ పఠాన్. -
పాముల ఫైటింగ్
-
వైరల్: పాముల ఫైటింగ్!
భువనేశ్వర్: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతారందరూ. అలాంటిది రెండు పాములు ఒక్కచోట చేరి, ఒకదానిని మరొకటి చుట్టుకొని భీకరంగా ఫైటింగ్ చేసుకొంటే. ఇంకెంత భయంకరంగా ఉంటుందో కదా. ఇలాంటి సంఘటన ఒడిషాలోని జాజ్పూర్లో చోటు చేసుకుంది. దీనిలో ఒకవైపు ఒక అడుగు విషం లేని కామన్ సాండ్ బొవా పాము, మరొవైపు నాలుగు అడుగుల స్పెక్టకాల్డ్ కోబ్రా నువ్వా-నేనా అన్నరీతిలో తలపడ్డాయి. రెండు పాములు కూడా ఒకదాన్నిమరొకటి చుట్టుకొని కాటు వేసుకొంటున్నాయి. అయితే దీన్ని చూసిన సదరు గ్రామస్తులు వెంటనే స్నేక్ సోసైటీ వారికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్వాలంటీర్ ఆ పాములను ఒక స్టిక్ సహయంతో వేరుచేసి వాటిని జాగ్రత్తగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాటిని విడదీయండి..స్నేక్ సోసైటివారికి ధన్యవాదాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: పాముతో ఎలుక ముద్దులాట.. ఇంకేముంది.. -
ఇర్ఫాన్ కొత్త లుక్.. మంచులో ‘కోబ్రా’ షూటింగ్
చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రానికి సంబంధించిన విదేశీ షెడ్యూల్ చిత్రీకరణలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాల్గొన్నారు. ఇర్ఫాన్ ‘కోబ్రా’ చిత్రంలో అస్లాన్ యిల్మాజ్ అనే ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫారిన్ షూటింగ్ ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను ఇర్ఫాన్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ‘షూటింగ్లో ఓ అందమైన ప్రాంతం’అని ఆయన కామెంట్ జతచేశారు. చిత్రం బృందం మంచులో చిత్రీకరణ జరుపుతుండగా ఇర్ఫాన్ వింటర్ దుస్తుల్లో నిలబడి కనిపిస్తున్నారు. అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, మియా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్లో పాల్గొనవచ్చని ప్రభుత్వం అనుతించడంతో వారం రోజుల కిత్రం ‘కోబ్రా’ టీం రష్యాలో పయనమైంది. మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్కు ఇది తొలి చిత్రం కావటం విశేషం. View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) చదవండి: సోనూసూద్ మరో మంచి కార్యక్రమం -
అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు!
మీరు రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ అవసరమేమో.. కానీ నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లాలంటే ట్రాఫిక్ మొత్తం ఎక్కడిక్కడ నిలిచిపోవాల్సిందే. ఎవరైనా సరే నాకు దారి ఇవ్వాల్సిందే. అదీ నా లెవల్... అన్నట్లుగా ఉంది కదా దర్జాగా రోడ్డు మీద వెళ్తున్న ఈ పామును చూస్తుంటే! అవును.. నిజంగానే ఈ ప్రత్యేక అతిథి రోడ్డు దాటేందుకు సుమారు 30 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపేశారు. కర్ణాటకలోని ఉడిపిలో గల కల్సాంకా జంక్షన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనాల రద్దీ ఉన్న సమయంలో 10 అడుగులకు పైగా పొడవున్న పాము అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు వెంటనే బండ్లను ఆపేశారు. పాము రోడ్డుకు ఆవలి వైపు వెళ్లేంతవరకు వేచి చూశారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. గురువారం నాటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వన్యప్రాణి పట్ల ట్రాఫిక్ పోలీసు వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదవండి: వైరల్: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది! చదవండి: వాలెంటైన్స్ డే: ఏనుగులపై ఊరేగుతూ పెళ్లిళ్లు.. -
పెట్రోల్ పైపులో నాగరాజు బుస్బుస్ .. వైరల్
భువనేశ్వర్: పెట్రోల్ పైపులో దూరి ఓ నాగుపాము హల్చల్ చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు దాన్ని అడవిలోకి వదిలిపెట్టడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం..ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ పైపులో నాగుపాము దూరింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. ఏంటా అని చూస్తే ఏకంగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చి పామును అడవుల్లో వదిలిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పిదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (భయానకం: గోడ దూకి హోటల్లోకి వచ్చిన సింహం..) -
భయంగొలిపే దృశ్యాలు.. క్షణం ఆలస్యమైతే చచ్చేవాడే..
బెంగళూరు: భయంకరమైన దృశ్యం.. కొద్దిపాటిలో కోబ్రా కాటు నుంచి తప్పించుకున్న స్నేక్ క్యాచర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును కాపాడబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఈ వీడియోను న్యూస్ ఎజెన్సీ ఏఎన్ఐ బుధవారం షేర్ చేసింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షకుపైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఆ కోబ్రా బుస్సు మంటు వారి మీదకు లేచిన దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరికి గుండె ఆగిపోయినంత పనైంది. ఇక విషపూరితమైన కోబ్రాతో ధైర్యంగా పోరాడి ప్రాణాలతో బయటపడిని స్నేక్ క్యాచర్, మరో వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘నిజంగా వీరిద్దరి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ ఆ సమయంలో వారిద్దరు బయపడి ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రకారం... కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని ఓ అడవిలో పెద్ద చెట్టు బెరడులో కోబ్రా ఇరుక్కుపోయింది. అది చూసిన ఓ స్నేక్ క్యాచర్ దానిని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో మరో వ్యక్తి వెనక నుంచి వచ్చి పాము తోక పట్టుకున్నాడు. దీంతో వెంటనే కోబ్రా కోపంతో స్నేక్ క్యాచర్ మీదకు లేచింది. చెట్టు బెరడుపై నిలుచున్నఅతడిపైకి లేచి బుస్సుమంటు మోకాలుపై కాటు వేయబోయింది. అయితే స్నేక్ క్యాచర్ దానిని వెంటనే చేతితో నీళ్లలోకి దూరంగా కొట్టాడు. ఆ ప్రయత్నంలో తూలి కిందపడిపోగా పాము అతడి మీదకు మరోసారి వెళ్లి కాటు వేయబోయింది. అతని పక్కనే ఉన్న మరో వ్యక్తి వెంటనే దాని తలను పట్టుకునే ప్రయత్నం చేయగా మళ్లీ తప్పించుకుంది. అప్రమత్తమైన స్నేక్ క్యాచర్ వెంటనే పాము తలను గట్టిగా చేతితో పట్టుకున్నాడు. దానిని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. -
విక్రమ్కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్ పఠాన్
ప్రతీ సమస్యకు లెక్కలతో పరిష్కారాన్ని కనుగొంటాడు కోబ్రా అలియాస్ హీరో చియాన్ విక్రమ్. అయితే నంబర్లతో ఆడుకునే కోబ్రాకు ఈ సారి ఎక్కువ నంబర్లిస్తానని, దాన్ని పరిష్కరించమంటూ టీజర్లో సవాలు విసురుతున్నాడు అస్లాన్ యిల్మాజ్ అలియాస్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఇందుకోసం విక్రమ్ రకరకాల వేషాలు మార్చుతున్నట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. కాగా తమిళ హీరో చియాన్ విక్రమ్ హీరోగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్న "కోబ్రా" టీజర్ శనివారం రిలీజైంది (చదవండి: రామ్ న్యూలుక్.. ఆపిల్ పండులా..) ఇంటర్పోల్ అధికారి పాత్ర పోషిస్తున్న ఇర్ఫాన్ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. థ్రిల్లర్ అంశాలు గట్టిగా దట్టించినట్లు కనిపిస్తోన్న ఈ టీజర్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇర్ఫాన్ను తొలిసారి నటుడిగా చూడటంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ దాదాపు 20 గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇర్ఫాన్తో పాటు దర్శకుడు కేయస్ రవికుమార్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చాలా వరకూ రష్యాలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా వ్యవహరిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. (చదవండి: ఇర్ఫాన్ పఠాన్ బర్త్ డే సర్ప్రైజ్: కోబ్రా ఫ్టస్లుక్ విడుదల) -
డిసెంబర్లో షురూ
విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పలు గెటప్స్లో కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. అయితే డిసెంబర్ నుంచి చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తారట. సుమారు 25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిసింది. ‘కోబ్రా’ చిత్రాన్ని చాలా వరకూ రష్యాలో షూట్ చేశారు. మిగిలి ఉన్న కొంత భాగాన్ని చెన్నైలో రష్య సెట్స్ను వేసి షూట్ చేస్తారన్నది తాజా సమాచారం. థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
‘కోబ్రా’ ఫస్ట్లుక్ : ఇర్ఫాన్ పాత్ర ఇదే!
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు అజయ్ జ్ఞానముతు సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న(అక్టోబర్ 27)న ఇర్ఫాన్ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్ మంగళవారం ట్వీట్ చేస్తూ ఇర్ఫాన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్ ఫస్ట్ లుక్ను విడుదల చేస్తూ.. ‘డియర్ ఇర్ఫాన్ సార్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న. మీలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే అస్లాన్ యిల్మాజ్’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్లో ఇర్ఫాన్ బ్లాక్ సూట్ ధరించి స్టైలిష్గా కనిపించాడు. ఇందులో ఆయన ఫ్రెంచ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ యిల్మాజ్గా కనిపించనున్నట్లు దర్శకుడు అజయ్ వెల్లడించాడు. Wish you many more happy returns of the day dear @IrfanPathan sir ❤️❤️ Super happy to have met and worked with such a warm and a caring person like you.. Wishing you only the besttt in the year ahead 🤗🤗🤗 #Cobra 🐍🐍 #HBDIrfanpathan #AslanYilmaz pic.twitter.com/JBwIlbzGJM — Ajay Gnanamuthu (@AjayGnanamuthu) October 27, 2020 అయితే క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇర్ఫాన్ తనకు నటన అంటే ఇష్టమని పలు ఇంటర్య్వులో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో నటించి కోలీవుడ్తో తన యాక్టింగ్ కేరీర్ను ప్రారంభిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సియాన్ విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు చిత్ర బృందం మార్చిలో రష్యాకు వెళ్లిన విషయం తెలిందే. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చిత్ర బృందం ఇండియాకు తిరిగి వచ్చింది. భారత్తో కూడా షూటింగ్లపై నిషేధం విధించిన కేంద్రం ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాలో చిత్రికరించాల్సిన కీలక సన్నివేశాలను చెన్నైలోనే రష్యాను పోలిన సెట్టింగ్లతోనే దర్శకుడు షూటింగ్ను పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ‘కోబ్రా’ షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది. విక్రమ్ హరోగా, ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. -
చెన్నైలో రష్యా
చెన్నై నగరంలో రష్యా దేశాన్ని సృష్టిస్తున్నారు ‘కోబ్రా’ టీమ్. తమిళ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పదికి పైగా గెటప్స్లో కనిపించనున్నారు. శ్రీనిథీ శెట్టి కథానాయిక. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడింది. లాక్డౌన్ ముందు వరకూ రష్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రబృందం. తాజాగా విదేశీ షూటింగ్స్ కష్టంగా ఉన్నాయి. దాంతో చెన్నైలోనే రష్యాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే రష్యాను తలపించే సెట్స్ వేస్తున్నారు. భారీ ఖర్చుతో చెన్నైలోనే రష్యాను తయారుచేస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు కేయస్ రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. -
పెళ్లికి చీర కట్టుకుంటోంది.. అంతలోనే పాము!
పామును కంటబడగానే ‘వామ్మో’ అంటూ పరుగులు తీసే వాళ్లను చాలా మందిని చూసే ఉంటాం. దాదాపుగా ప్రతీ ఒక్కరికి ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే కర్ణాటకు చెందిన నిజారా చిట్టీ అనే మహిళ మాత్రం ఇందుకు మినహాయింపు. పాములను పట్టడమే కాదు, విష సర్పాలను కూడా లొంగదీసి వాటిని సురక్షితంగా జనావాసాల నుంచి పంపించేయగల నేర్పు, ధైర్యసాహసాలు ఆమె సొంతం. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే చిట్టీ నాగుపామును పట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (చదవండి: పులి బలమేంటో మరోసారి నిరూపించింది!) (చదవండి: పులి బలమేంటో మరోసారి నిరూపించింది!) కర్ణాటకకు చెందిన నజారా చిట్టీ ఓరోజు పెళ్లికి వెళ్లేందుకు చీర కట్టుకుని ముస్తాబయ్యారు. అయితే అంతలోనే తమ ఇంట్లో నాగు పాము చొరబడిందని వచ్చి దాన్ని పట్టుకోవాలని ఓ వ్యక్తి ఫోన్ చేశారు. దీంతో అప్పటికప్పుడు అక్కడికి బయల్దేరిన చిట్టీ.. నాగుపామును ఎంతో ఒడుపుగా పట్టుకున్నారు. తోకను పట్టి ఆడిస్తూ ఇంట్లో నుంచి బయటకు తెచ్చి ఓ కవర్లో వేశారు. సురక్షితంగా సమీపలోని అడవిలో వదిలిపెట్టారు. ఈ ఘటన గతేడాది జరిగినప్పటికీ.. ఆ దృశ్యాలు మరోసారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీంతో చిట్టీ ధైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ అంటూనే, మరోసారి పామును పట్టుకునేపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
పెళ్లికి సిద్ధమైంది; ఇంతలో పాము రావడంతో
-
భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!
నైనిటాల్: పాములను చూస్తే మీరు భయంతో వణికిపోతారా? అయితే ఉత్తరాఖండ్లోని ఒక ఇంటిలో పామును బంధిస్తున్న ఈ వీడియో కచ్చితంగా మిమ్మలి భయానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో నైనిటాల్లోని ఓ ఇంటి నుంచి అటవీ శాఖ రాపిడ్ రెస్పాన్స్ టీం విషపూరిత పామును ఎలా బంధించిందో ఉంది. ఒక భారీ పాము ఇంటిలోని టేబుల్ కింద దాక్కుంది. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు దానిని బంధించారు. ఈ క్లిప్ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు. పామును బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఒకరు టేబుల్ కిందకు వెళ్లాల్సి వస్తుంది. పామును పట్టుకొని దానిని ఇంటి టెర్రస్ పైకి తీసుకువచ్చి ఒక సంచిలో వుంచుతారు. ఒకానొక సమయంలో ఆ పాము అతడి మెడ చుట్టూ కూడా చుట్టుకుంటుంది. ఇది చాలా భయంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూస్తే ఒళ్లు జలదరిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, చాలా మంచి పని చేశారని మరో నెటిజన్ అటవీ శాఖ అధికారులను అభినందించాడు. పామును సంచిలో నుంచి బయటకు వదిలినప్పుడు అది అడవిలోకి వెళ్లడం కూడా చూపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని పాముల కంటే కింగ్ కోబ్రా చాలా విషపూరితమైనది. చదవండి: డేంజర్ గేమ్: 23వ అంతస్తు చివరి నుంచి.. A #King Cobra rescued by Forest Department's Rapid Response Team from a house at Nainital! 🎥DFO Nainital. @moefcc @ndtv @CentralIfs @AnimalsWorId @Uttkhand_Forest @nature @Discovery @MadrasCrocBank @REPTILESMag @mygovindia @MygovU @uttarakhandpost @ndtvindia @ZeeNews @dodo @IUCN pic.twitter.com/kXWameDNzf — Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020 Release of the #King #Cobra in it's natural habitat. @moefcc @UttarakhandIFS @uttarakhandpost @CentralIfs @dodo @UNBiodiversity @MadrasCrocBank @REPTILESMag pic.twitter.com/kfmECfLLFT — Akash Kumar Verma, IFS. (@verma_akash) August 11, 2020 -
కోబ్రాలో విక్రమ్ గెటప్స్ ఎన్నో తెలుసా?
తమిళ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కోబ్రా. ఇంతకు ముందు డిమాండ్ కాలనీ, ఇమైకా నొడిగల్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం కోబ్రా. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా, లాక్డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలిశాయి. ముఖ్యంగా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్రల్లో నటుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆయన్ని పరిచయం చేయడం గురించి దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలుపుతూ.. ఈ చిత్రంలో ఇంటర్పోల్ అధికారి పాత్ర ఉందన్నారు. దాన్ని ప్రజలకు చాలా పరిచయమైన వ్యక్తితో నటింపజేయాలని భావించినట్లు తెలిపారు. అప్పుడే ఆ పాత్ర స్ట్రాంగ్ గా ఉంటుందని అని భావించినట్లు చెప్పారు. ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఐర్ఫాన్ పఠాన్ టిక్టాక్ వీడియోను చూశానని చెప్పారు. ఐర్ఫాన్ పఠాన్ను కోబ్రా చిత్రంలో నటింపచేస్తే బాగుంటుందన్న ఆలోచన చిత్ర యూనిట్కు వచ్చిందని జ్ఞానముత్తు అన్నారు. దీంతో ఇర్ఫాన్ను కలవగా ముందు నటించడానికి సంకోచించినా ఆ తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో నటుడు విక్రమ్ కనిపించనున్న గెటప్ల గురించి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కోబ్రా చిత్రంలో విక్రమ్ 20 గెటప్పుల్లో కనిపించనట్లు చిత్రవర్గాలు పేర్కొన్నారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న కథా చిత్రం కావడంతో హీరోకు ఇన్ని గెటప్లు అవసరం అయ్యాయి అంటున్నారు. దీంతో కోబ్రా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రంలోని విక్రమ్ గెటప్లు ఒక్కొక్కటీ వరుసగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెప్పారు. అందులో భాగంగా ఇటీవల ఒక గెటప్ను విడుదల విషయం తెలిసిందే. -
పైకప్పులో నాగుపాము: రక్షించిన అధికారి
-
ఇంటి పై కప్పు మీద నాగుపాము
పనాజీ: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ, ఓ నాగుపాము ఇంట్లోకి దూరింది. తన ఉనికిని చాటుకుంతూ బుస్ అని పడగ కొట్టింది. దీంతో ఆ సర్పాన్ని చూసి భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు క్షణం ఆలస్యం చేయకుండా అటవీశాఖ అధికారులకు ఫోన్ కొట్టారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారి హుటాహుటిన సదరు ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టినట్లుగా ఆ పాము అప్పటికే పైకప్పులోకి దూరి దాక్కుంది. దీంతో అతను కూడా ఇంటి మీదకు ఎక్కి దాని కోసం వెతుకులాడాడు. అనంతరం దాని ఆచూకీ కనుగొన్న వెంటనే పామును నెమ్మదిగా కర్ర సాయంతో పట్టుకుని సంచిలోకి పంపించాడు. ('షర్ట్ విప్పితేనే విమానం ఎక్కనిస్తాం') ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. ఈ అరుదైన ఘటన గోవాలోని కొటిగావో వన్యప్రాణుల అభయారణ్యానికి సమీపంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను అటవీ అధికారి శైలేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్లు పామును రక్షించిన అధికారిని కొనియాడుతూనే.. 'వాటిని కాపాడే సమయంలో వాటి బారి నుంచి మిమ్మల్ని కాపాడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోండ'ని సూచిస్తున్నారు. 'ఇలాంటి పనుల కోసం ప్రభుత్వం అటవీ శాఖ అధికారులకు టూల్ కిట్ ఇస్తే బాగుంటుంద'ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. (ఏకంగా 47 నాగు పాములు ...) -
వార్తా సంస్థపై కేంద్రమంత్రి ఫైర్.. ఏమైందంటే..
ఢిల్లీ : ఇటీవలి అరుణాచల్ప్రదేశ్లో తినడానికి అన్నంలేక పామును చంపి తిన్నారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఓ ప్రముఖ వార్తాసంస్థ ప్రచురించిన ఈ వార్తలో నిజం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశంలోనే పేరున్న వార్తాసంస్థ అయి ఉండి తప్పుడు వార్తను ఎలా ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. దేశంలో అన్నం లేకపోతే పాములను తినడం ఎక్కడైనా జరిగిందా అంటూ ప్రశ్నించారు. అరుణాచల్ప్రదేశ్ అరుదైన పాములకి నిలయం అని, అక్కడ ఎవరూ పాములని చంపి తినరని స్పష్టం చేశారు. సదరు వార్తాసంస్థ కథనాన్ని జోడిస్తూ వాస్తవాలు ధ్రువీకరించకుండా ఏది పడితే అది రాస్తే ఎలా అంటూ ట్విటర్లో వేదికగా ఫైర్ అయ్యారు. Dear @ndtv please don't make stories without verification! I'm dead against hunting and killing of animals so is the State Govt. But to say that there's no rice left for the people leading to killing of cobra is rubbish! No one hunts snakes for consumption in Arunachal Pradesh. https://t.co/s07bX1rbEq — Kiren Rijiju (@KirenRijiju) April 20, 2020 ఇక అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వార్తను తప్పుపట్టింది. తమ రాష్ట్రంలో వచ్చే 3 నెలలకు సరిపడా బియ్యం ఉందనీ, పేదలందరికీ తాము ఉచిత రేషన్ కింద బియ్యం ఇస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం 20వేల మంది ఈ ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు 492 మందిని అరెస్టు చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన 750 వాహనాదారులపై కేసు నమోదుచేసి వాహనాలు సీజ్ చేసినట్లు డీజీపీ ఆర్పి ఉపాధ్యాయ తెలిపారు. -
బియ్యం అయిపోవడంతో నాగుపామును చంపి..
ఇటానగర్ : ఇంట్లో బియ్యం అయిపోవడంతో అడవికి వెళ్లి 12 అడుగుల పొడవైన నాగుపామును చంపి తిన్నారు ముగ్గురు వేటగాళ్లు. ఈ ఘటన అరుణాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది. నాగుపామును చంపి..తమ భుజాలపై వేసుకొని ఫోటోకి ఫోజిచ్చారు. అంతేకాకుండా మాంసాన్ని శుభ్రం చేసుకునేందుకు అరిటాకులతో చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కారణంగా బయటికెళ్లి పనులు చేసుకునే పరిస్థితి లేనందు వల్ల ఇంట్లో బియ్యం అయిపోయిందని తెలిపారు. కాబట్టి అడవిలో ఏదో ఒకటి దొరుకుతుందని వెతుకుతూ వచ్చామని..ఈ క్రమంలో తమకు నాగుపాము కనిపించడంతో దాన్ని చంపి తిన్నామని వీడియోలో పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం..వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగుపామును సంహరించడమే కాకుండా, దాన్ని చంపి తిన్నందుకు నమోదైన కేసులో వీరికి బెయిల్ కూడా మంజూరు అవ్వదు. అంతరించిపోతున్న పాము జాతులకు అరుణాచల్ప్రదేశ్ నిలయం. ఇటీవలే ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ అరుదైన పామును శాస్ర్తవేత్తలు గుర్తించారు. దీనికి సలజర్స్ పిట్ వైపర్ అని పేరు పెట్టారు. హ్యారీపోటర్ సినిమాలోని సలజర్ క్యారెక్టర్ను పోలి ఉన్నందున దానికి ఆ పేరు పెట్టినట్లు తెలిపారు. -
విద్యుత్శాఖ కార్యాలయంలో పాము హల్చల్
సాక్షి, నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా విద్యుత్శాఖ కార్యాలయం ఆవరణలో నాగుపాము హల్చల్ చేసింది. పాత ఎస్ఈ కార్యాలయం ఎదుట ఓ ఉద్యోగి తన కారును పార్కింగ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లుదామని కారు దగ్గరకు వెళ్లగానే పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, స్థానికులు పాము అంటూ అరవడంతో భయపడి అక్కడే పార్కింగ్ చేసిన కారులోకి చొచ్చుకెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఉద్యోగులు పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకొని ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు. -
తేదీలు తారుమారు
ఎటు చూసినా మాస్కులు తొడుక్కున్న ముఖాలే. ఏ నలుగురి సంభాషణ విన్నా సారాంశం అదే. దీనంతటికీ కారణం.. ‘కరోనా వైరస్’. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రశాంతంగా బయట తిరగనివ్వడం లేదు. రాకపోకలు తగ్గిపోయాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. కరోనా ప్రభావం అన్ని పరిశ్రమల మీదా పడింది. చిత్రపరిశ్రమ మీద కూడా పడింది. షూటింగులు, రిలీజ్లు, ప్రమోషన్లను కరోనా చిత్రవిచిత్రంగా ఇబ్బంది పెడుతోంది. రిలీజ్కు రెడీ అయిన సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యేలా చేస్తోంది. రెవెన్యూ దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకుల భద్రత, సినిమా భద్రతను (కలెక్షన్లు) ఆలోచించి నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ తలకిందులయ్యాయి. కోవిడ్ 19 ఎఫెక్ట్ ఇది. ‘క్యా కరోనా?’ అనుకోవడం మినహా ఏమీ చేయలేం. ఇక తారుమారైన సినిమాల పరిస్థితి తెలుసుకుందాం. పోలీస్ నహీ ఆ రహా హై సూపర్ పోలీస్ల పాత్రలతో బాక్సాఫీస్ను కొల్లగొడుతుంటారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. అజయ్ దేవగన్తో ‘సింగం’, రణ్వీర్ సింగ్తో ‘సింబా’ సినిమాలు తీశాక అక్షయ్ కుమార్ను ‘సూర్యవన్షీ’గా మార్చారు రోహిత్. ‘పోలీస్ ఆ రహా హై’ అన్నది క్యాప్షన్ (పోలీస్ వస్తున్నాడని అర్థం). కానీ టైమ్కి రావడంలేదు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణ్వీర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 24న ఈ సినిమా విడుదలవ్వాలి. ‘‘ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘సూర్యవన్షీ’ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. సరైన టైమ్ వచ్చినప్పుడు ‘సూర్యవన్షీ’ వస్తాడు’’ అని చిత్రబృందం పేర్కొంది. సింహం వాయిదా? మోహన్ లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన భారీ పీరియాడికల్ చిత్రం ‘మరక్కార్: అరబికడలింటె సింహం’. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 26న ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో మార్చి 31 వరకూ థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ సినిమా ఏప్రిల్ నెలకు వాయిదా పడుతుందని టాక్. హాలీవుడ్లో... అటు హాలీవుడ్కి వెళితే నాలుగైదు సినిమాల విడుదల ప్రస్తుతానికి ఆగింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో 9వ సినిమా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ని ఈ ఏడాది మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మా కొత్త చిత్రం కోసం మీ అందరూ (ఫ్యాన్స్) ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుసు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలను వాయిదా వేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. అలాగే డిస్నీ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించిన ‘ములాన్’ చిత్రం మార్చి 27న థియేటర్స్లోకి రావాలి. 2018లో సూపర్ హిట్గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘ఎ క్వయిట్ ప్లేస్’కి సీక్వెల్గా వస్తున్న ‘ఎ క్వయిట్ ప్లేస్ 2’ చిత్రం మార్చి 18న విడుదల కావాలి. అయితే ఈ రెండు చిత్రాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త విడుదల తేదీలను ఇంకా ప్రకటించలేదు. పోయిన వారమే జేమ్స్ బాండ్ కొత్త చిత్రం ‘నో టైమ్ టు డై’ విడుదల తేదీని నవంబర్కి మార్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కరోనా ప్రభావం ఇంకా చాలా సినిమాల రిలీజ్పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న టైమ్కి సినిమాని రిలీజ్ చేయకపోతే సినిమా నిర్మాణానికి తీసుకున్న డబ్బుకి ఇంట్రస్ట్ పెరుగుతుంది.. ఆడియన్స్లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదా పడితే.. ఆ తర్వాతి నెలల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న చిత్రాల రిలీజ్కు క్లాష్ ఏర్పడు తుంది. మొత్తం మీద కరోనా ఇండస్ట్రీని బాగానే కలవరపెడుతోంది. కోబ్రాకు బ్రేక్ 7 విభిన్న పాత్రల్లో విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ను రష్యాలో ప్లాన్ చేసి, కొన్ని రోజులుగా అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. అయితే విదేశీ రాకపోకలను తగ్గించేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాకముందే ‘కోబ్రా’ టీమ్ ఇండియా వచ్చేయాల్సి వస్తోందని దర్శకుడు ట్వీట్ చేశారు. థియేటర్లు క్లోజ్ కరోనా తీవ్రత పెరుగుతున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో థియేటర్స్ను స్వచ్ఛందంగా మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆల్రెడీ కేరళలో కొన్ని రోజులుగా థియేటర్స్లో ప్రదర్శనను ఆపేశారు. తాజాగా కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, ఒడిస్సాలో థియేటర్స్ను ఈ నెల 31 వరకూ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. టాలీవుడ్ పై ప్రభావం? పలు తెలుగు చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్పై కరోనా ప్రభావం పడినప్పటికీ ప్రస్తుతానికి రిలీజ్ తేదీల్లో ఇప్ప టివరకూ ఏ సినిమా వాయిదా పడలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేస్తున్నట్టు ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. – గౌతమ్ మల్లాది -
కోబ్రాతో సంబంధం ఏంటి?
కోబ్రాతో నటుడు విక్రమ్కు సంబంధం ఉంటుందంటున్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. పాత్రలకు జీవం పోయడానికి ఎంతవరకైనా వెళ్లే నటుడు చియాన్ విక్రమ్. ఇంతకు ముందు గడికారం కొండాన్ చిత్రం కోసం సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్కు మారిన ఈయన తాజాగా బుసలు కొట్టే కోబ్రానే మెడలో వేసుకుంటున్నా రు. అవును విక్రమ్ నటిస్తున్న 58వ చిత్రానికి అజయ్జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు డిమాంటీ కాలనీ, నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా విక్రమ్ కథా నాయకుడిగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన పలు గెటప్లలో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్కు జంటగా నటి శ్రీనిధిశెట్టి నటిస్తోంది. దర్శకుడు కేఎస్.రవికుమార్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కోబ్రా అనే టైటిల్ను నిర్ణయించారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ సగం వరకు పూర్తయింది. ఈ సందర్భంగా విక్రమ్ చిత్రానికి కోబ్రా అనే టైటిల్ను నిర్ణయించడం గురించి దర్శకుడు వివరిస్తూ ఇందులోని విక్రమ్ పాత్రకు కోబ్రా అనే పాముకు మధ్య చాలా సంబంధం ఉంటుందన్నారు. ఈ విషయం చిత్రం చూసిన తరువాత ప్రేక్షకులు గ్రహిస్తారని అన్నారు. అందుకే చిత్రానికి కోబ్రా అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిపారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అన్ని భాషలకు టైటిల్ కామన్గా ఉంటుందని కోబ్రాను నిర్ణయించినట్లు తెలిపారు. 50 శాతం చిత్ర పని పూర్తి అయిందని, తదుపరి షూటింగ్ను జనవరి చివరి నుంచి రష్యా, ఐరోపా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర షస్ట్లుక్ పోస్టర్ను జనవరి 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాటలను ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చిత్రంలోని మూడు పాటలు పూర్తయ్యాయని, మరో రెండు పాటల రికార్డింగ్ జరగాల్సి ఉందన్నారు. -
‘కోబ్రా’తో భయపెడుతున్న విక్రమ్
కథలతో ప్రయోగాలు చేసే తమిళ ప్రముఖ హీరో విక్రమ్ తెలుగువాళ్లకూ సుపరిచితుడే. ‘అపరిచితుడు’ చిత్రంతో తెలుగులో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ రిలీజయ్యాయి. కానీ కొన్ని మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా మిగతావి పత్తా లేకుండా పోయాయి. ఈ క్రమంలో మరో డిఫరెంట్ చిత్రంతో విక్రమ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న విక్రమ్ 58వ సినిమాకు ‘కోబ్రా’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఒకవైపు ఆసక్తిని రేకెత్తిస్తూనే మరోవైపు భయాన్ని కలగజేస్తున్న ఈ వీడియోలో పాములు భయంకరంగా బుసలు కొడుతున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరో విక్రమ్తో జోడీ కడుతోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించగా లలిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. -
స్కూటీపై వెళ్తుండగా చేతిని ‘ముద్దాడిన’ నాగుపాము..
సాక్షి, హైదరాబాద్ : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హల్చల్ చేసింది. స్కూటీలో దూరి ఓ వ్యక్తికి చెమటలు పట్టించింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూమాదిరిగానే మంగళవారం ఉదయం స్కూటీ తీసుకుని ఉద్యోగానికి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. దాంతో స్కూటీని ఆపి చూడగా హెడ్లైట్లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. ఒక్కసారిగా షాక్కు గురైన రాములు స్కూటీని పక్కనపడేసి.. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోగ్గౌడ్కు విషయం చెప్పాడు. వినోగ్గౌడ్ పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్లైట్లో దాగున్న పామును బయటకు తీయించి అడవిలో వదిలేశారు. రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
షాకింగ్ : పార్సిల్లో పాము ప్రత్యక్షం
భువనేశ్వర్ : గృహోపకరణాలతో కూడిన పార్సిల్ను ఓపెన్ చేస్తుండగా అందులోంచి పాము ప్రత్యక్షమైన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ ప్రస్తుతం ఒడిషాలోని మయూర్భంజ్లోని రైరంగాపూర్లో ఉంటున్న తన నివాసంలో కొరియర్ నుంచి వచ్చిన పార్సిల్ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్లో పాము బయటపడ్డ విషయాన్ని ముత్తుకుమరన్ అటవీ అధికారులకు తెలపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పదిహేను రోజుల కిందట తాను ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ నుంచి పార్సిల్ను బుక్ చేశానని ముత్తుకుమరన్ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్ను విప్పిచూస్తుండగా అందులో పాము కనిపించడంతో షాక్కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు. -
ఇంట్లోకి వచ్చిన నాగుపాముకు పూజలు
సాక్షి, బెంగళూరు : నాగపంచమి రోజున ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగు పాముకు స్థానికులు పూజలు నిర్వహించారు. వివరాలు.. శ్రీనివాసపురం పట్టణంలో వీరేంద్రకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం నాగుపాము ఇంట్లోకి ప్రవేశించగా పాములు పట్టే నిపుణుడు అమీర్ చాంద్ను పిలిపించారు. దానిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా బచ్చలిపైప్లోకి వెళ్లిపోయింది. దీంతో మరో వైపు నుంచి నీరుపోయడంతో పాము బయటకు రాగా స్నేక్రాజ్ ఒడిసి పట్టుకున్నాడు. అయితే నాగపంచమి రోజున ఇంటికి వచ్చిన నాగుపాముకు మహిళలు భక్తితో పూజలు చేశారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో వదలిపెట్టారు. నేడు గరుడ పంచమి తిరుమలలో సోమవారం గరుడ పంచమి ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితంలో ఆనందాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఇందులో భాగంగా రాత్రి 7నుంచి 9గంటల వరకు మలయప్ప స్వామి తనకు ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అలాగే ఈ నెల 15న గురువారం శ్రావణ పౌర్ణమినాడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9గంటలక వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. -
సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు..
సాక్షి, శ్రీకాకుళం : తొలకరి పలకరించింది. రైతు పొలం బాట పడుతున్నాడు. సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు కూడా అన్నదాతను వెంటాడుతుంటాయి. పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం ఉంటే సరి.. పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. ఆస్పత్రుల్లో పాముకాటు మందులు ఉన్నా చాలా మంది నాటు వైద్యానికి, ఆర్ఎంపీల వద్ద వైద్యానికే వెళ్తుండడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. అందుకే సాగు సమయంలో పాములతో కాసింత జాగ్రత్తగా ఉండాలని, కాటు వేశాక తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వానల్లో.. జూన్, జూలై మాసాలు రైతులకు చాలా కీలకం. పొలం పనులు మొదలుపెట్టి రాత్రీ పగలు ఆ గట్ల మీదుగానే తిరగాల్సి ఉంటుంది. ఇలా వెళ్లినప్పుడు, తన పని తాను చేసుకంటున్న సమయాల్లోను పాము కాటుకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు కూడా ఈ కాలంలో బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. రహదారులు, నివాసాల మధ్య కూడా ఈ మధ్య కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సొంతవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రా మాల్లో తిరిగే కొందరు సంచి (ఆర్ఎంపీ) వైద్యులను నమ్మి మోసపోవడం కంటే ముందే మేలుకుని పాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నాలుగు జాతులే విషపూరితం మన దేశంలో నాలుగు వందలకు పైగా సర్ప జాతులుండగా వాటిలో కేవలం నాలుగు జాతులు మాత్రమే విషపూరితమైనవిగా జీవావరణ వేత్తలు చెబుతున్నారు. నాగు పాము, పొడ పాము(రక్తపింజరి), కట్లపాము(తుట్ట), సముద్రసర్పాలు. ఇవి కరిస్తే ప్రాణానికి ప్రమాదం ఉంది. మిగిలిన జాతుల మాపులు కరిస్తే ఏమీ కాదంటున్నారు. విష సర్పాల్లో నాగుపాముకు పడగ ఉండగా, కర్త పింజరికి ని లువు చారలు ఉం టాయి. కట్ల పాములో రెండు రకాలుండగా ఇండియన్ క్రైట్ రాత్రి వేళల్లోనే సంచరిస్తుంటాయి. ఈ రకం పా ము అడవులు, కొండ కోనల్లోనే కనిపిస్తాయి. ఇక నలుపు, పసుపు చారలతో ఉంటే గౌరీబెత్తు సైతం విషపూరితమైనదే. కొండల్లోను, పంట పొలాల్లోను కనిపించే కింగ్ కోబ్రా జాతికి చెందిన రాచనాగు, వైరానాగులు అరుదైనవి. రాచనాగుకు రంగులు మార్చే స్వభావం ఉంటుంది. అది నివశించే ప్రాంతాన్ని బట్టి గోధుమ, చింత, మొగలి నాగులని పిలుస్తారు. తెలుపు, పచ్చ రంగుల్లో కనిపించే కొన్ని రకాల పాములు జన్యులోపాలతో పుట్టినట్లుగా చెబుతారు. సూచనలుపాటించాలి ⇔పాము కరవగానే మంత్రాలు, పచ్చిమిరపకాయలు తినిపిస్తారు. ఇవి అసలు చేయకూడదు. ⇔పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం మంచిది కాదు. మోసుకుని లేదా ఆటో, ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లాలి. ⇔ఆర్ఎంపీ, సంచి వైద్యుల సలహాలు పాటించి ఇంటి వద్దనే ఉంచవద్దు. జాప్యం చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. వీలైనంత తొందరగా నిపుణులైన డాక్టర్ వద్దకు చేర్చాలి. ⇔మూఢనమ్మకాలను అసలు నమ్మవద్దు. మంత్రాలు, పసర మందులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అవగాహనే కీలకం ⇔ఏ పాము కరవగానే భయపడే కంటే ధైర్యంగా ఉండి నాకేమీ కాదన్న నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఏ జాతి, ఏ రకం పాము కరచిందో గమనించాలి. ⇔ఏ పాము కాటు వేసిన చోట శుభ్రంగా కడగాలి, విషం శరీరం అంతా ప్రసరణ జరగకుండా చేయాలి. ⇔ఏ పాము కాటేసిన వెంటనే కాటుకు కొంచెం దూరంలో ఏదైనా తాడు వంటి దానితో గట్టిగా కట్టాలి. దీంతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తంలో కలిసిన విషం శరీర భాగాల్లోకి వెళ్లకుండా నిరోధించవచ్చు. ⇔ఏ రక్తపింజరి జాతికి చెందిన పాము కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్ర పిండాలు, మూత్రం, మలం నుంచి రక్త స్రావం జరుగుతుంది. ⇔ఏ నాగుపాము, కట్ల పాములు కరిస్తే కళ్లు మూత పడటం, వాపులు రావటం, నోటి నుంచి నురగలు రావడం, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి. ⇔ఏ రాత్రులు పొలాలకు వెళ్లే రైతులు విధిగా టార్చిలైట్, చేతికర్ర వెంట తీసుకుని వెళ్లాలి, కాలిమొత్తం వరకు లుంగీ విడిచిపెట్టాలి, వీలైతే ప్యాంట్ వేసుకుంటే మంచిదే. ⇔ఏ పొలం గట్లపైన నడిచే సందర్భాల్లో చేతికర్రతో ముందు శబ్ధం చేసుకుంటూ అడుగులు వేయాలి. ⇔ఏ ఇంటి పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని లేకుండా చూడాలి. నాటు వైద్యం హానికరం పాము కాటుకు గురైన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. విషం విరుగుడుకు అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లోను అందుబాటులో ఉంచుతున్నారు. ఏ సమయంలో పాము కాటుకు గురైనా వెంటనే గ్రామాల్లోని ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వారే ఆస్పత్రికి సిఫార్స్ చేస్తారు. ఆస్పత్రిలో అన్ని పరిశీలనలు చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం, సొంత వైద్యం చేయడం, మంత్రాలు, పసర మందుల వల్ల పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. పాముకాటు విషం విరుగుడు మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచడం జరిగింది. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి. – రెడ్డి హేమలత, ప్రభుత్వ డాక్టర్, లక్ష్మీనర్సుపేట పీహెచ్సీ, ఎల్.ఎన్.పేట పాముల్ని చంపడం నేరమే కొండ చిలువలు, ఇతర పాముల్ని చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంఘణ కిందకు వ స్తుంది. ఇది పెద్ద నేరమే. ఇలాం టి చర్యలకు పాల్పడేవారికి వైల్డ్లైఫ్ చట్టం 1972లో సెక్షన్ 61(1), (2) ప్రకారం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేవలం జరిమానాతో విడిచిపెట్టే అవకాశం లేదు. – జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజర్, పాలకొండ సెక్షన్ -
అందుకే పుట్టినరోజు చేసుకున్నా – రామ్గోపాల్ వర్మ
‘‘పుట్టినరోజంటే నాకు చాలా చిరాకు. చావుకు ఒక సంవత్సరం దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందని నా అభిప్రాయం’’ అన్నారు రామ్గోపాల్ వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రం ద్వారా రామ్గోపాల్ వర్మ నటుడిగా మారారు. ‘ఆర్జీవీ గన్ షాట్ ప్రొడక్షన్స్’ పతాకంపై డి.పి.ఆర్. నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆదివారం వర్మ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఈ సంవత్సరం ఎందుకు పుట్టినరోజు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. ‘కోబ్రా’ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఇంటెలిజిన్స్ ఆఫీసర్ పాత్ర లో నేనే నటిస్తే బాగుంటుందనుకున్నాను. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ‘కోబ్రా’ సినిమాతో ఆర్జీవీ గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. 29 ఏళ్ల తర్వాత మళ్లీ నేను, కీరవాణిగారు ‘కోబ్రా’ సినిమా కోసం కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ – ‘‘వర్మగారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం అనూహ్యం. ఇలాంటి మార్పులు ఈ ‘కోబ్రా’లో ఇంకా చూడొచ్చు. నటుడిగా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. మనం నిజ జీవితంలో నటిస్తుంటాం. కానీ, ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది’’ అన్నారు. ‘‘కోబ్రా’ చిత్రాన్ని నిర్మించే అవకాశమిచ్చిన వర్మగారికి థ్యాంక్స్. ఏడాదిలో 8 నుంచి 10 సినిమాలు, వెబ్ సిరీస్లు మా బ్యానర్లో వర్మగారితో తీస్తాం. మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్ని తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్నాం’’ అన్నారు డి.పి.ఆర్. -
‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు’
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్రిన సంగతి తెలిసిందే. మొట్టమొదటి సారిగా ‘కోబ్రా’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బర్త్ డే అంటే నాకు చాలా చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది నాకు. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంత చెబుతున్న నేను.. ఈ సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. కోబ్రా మూవీ స్క్రిప్ట్ రాస్తుంటే.. కొత్త రకమైన ఇంటెలిజిన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను.. ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీతో ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమాకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే. నా కెరీర్ లో ‘క్షణక్షణం’ మ్యూజిక్ పరంగా ఓ మైలురాయి. 29 ఏళ్లకు మళ్లీ నేను, కీరవాణి గారు ఓ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నాం. చాలా హ్యపీ గా ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘రామ్ గోపాల్ వర్మ గారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన ఫస్ట్ టైమ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవటం మనం ఊహించనిది. ఇలాంటి మార్పులు ఈ కోబ్రా లో మనం ఇంకా చూడొచ్చు. నాలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా రాము గారు బయటకు తీస్తారనుకుంటున్నాను. నటుడిగా కూడా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. ఎందుకంటే మనం నిజ జీవితంలో నటిస్తూ ఉంటాం. కానీ ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది. 29 ఏళ్ల క్షణక్షణం తర్వాత మళ్లీ రాముగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చినందుకు ఆయనకు చాలా థాంక్స్’ అన్నారు. ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.పి.ఆర్ మాట్లాడుతూ.. ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ మీద ఈ కోబ్రా చిత్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఇచ్చినందుకు వర్మగారికి ధన్యవాదాలు. సంవత్సరంలో 8 నుంచి 10 సినిమాలు మరియు వెబ్ సిరీస్లు మా బ్యానర్ మీద వర్మ గారితో తీస్తాం. ఆ ఐడియా ఇచ్చింది ఆయనే. దానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అన్నారు. -
వర్మ యాక్టింగ్ డెబ్యూ పై బిగ్బీ కామెంట్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటికే దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా తనలోని వివిధ కోణాలను చూపించిన వర్మ త్వరలో కోబ్రా సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఆదివారం వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. వర్మ యాక్టింగ్ డెబ్యూపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికరం స్పందించారు. ‘రామ్ గోపాల్ వర్మ ద సర్కార్ చివరకు తన అసలైన వృత్తిని ఎంచుకున్నాడు. నటుడిగా మారుతున్న మీకు ఆల్ ద బెస్ట్ సర్కార్.. డామ్.. నాకు మరొకరు పోటి’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఆర్జీవీ గన్షాట్ ఫిలింస్ నిర్మిస్తున్న కోబ్రా సినిమాను రామ్ గోపాల్ వర్మ అగస్త్య మంజులు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వర్మ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమాలో వర్మ లుక్కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది. T 3136 - FINALLY .. !! Ram Gopal Varma .. the 'SARKAR' finds his true vocation .. ACTING !! All the best Sircaarrrrr .. 👍👍👍 DAMN .. another competition !!😟😟 pic.twitter.com/5sFDCB8NnD — Amitabh Bachchan (@SrBachchan) 8 April 2019 -
రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా.. నిర్మాతగా.. కథా రచయితగా.. గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. ఈ రోజు వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గన్ షాట్ ఫిలింస్ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బందుల్లో ఉన్న వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్తో మరోసారి సక్సెస్ ట్రాక్లో వచ్చాడు. -
ఏకంగా 11 ఉల్లిపాయలను మింగేసింది!
-
అతని ఇంట్లో 111 పాము పిల్లలు
భువనేశ్వర్ : కొన్ని ఘటనలు మన చుట్టే జరుగుతున్న అవి బయటపడే వరకు కూడా మనకు తెలియదు. తాజాగా ఒరిస్సాలోని శ్యాంపూర్ గ్రామంలో జరిగిన సంఘటన ఇలాంటిదే. భుయాన్ అనే వ్యవసాయ కూలీ ఇంట్లో 111 పాము పిల్లలు శనివారం వెలుగుచూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు భయాందోళనకు గరైనారు. అయినప్పటికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని ఆ వింతను చూడసాగారు. అటవీ అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు అక్కడికి చేరుకుని 111 పాము పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అక్కడ 26 పగిలిన పాము గుడ్లు మాత్రమే కన్పించడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి పాముల గురించి వెతకడం ప్రారంభించారు. భుయాన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భుయాన్ ఇంట్లో నాలుగు అడుగుల ఎత్తు, రెండగుల వెడల్పుతో ఒక పాము పుట్ట ఉన్నప్పటికీ వారు దానికి పూజలు చేస్తుండేవారని తెలిసింది. అప్పుడప్పుడు పాములు కన్పించినప్పటికీ అవి తమకు హాని చేయలేదని భుయాన్ చెప్పాడు. అందులో ఎన్ని పాములున్నాయో తమకు తెలియదని ఆయన తెలిపాడు. పాముల సంరక్షకులు షేక్ మీర్జా మాట్లాడుతూ.. ‘శనివారం ఉదయం తనకు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లాను. నేను వెళ్లాకా అక్కడ రెండు పాము పిల్లల్ని నెలపై ఉండటం చూశాను. ఆ తర్వాత పుట్టను త్రవ్వగా పెద్ద మొత్తంలో పాము పిల్లలు బయటికొచ్చాయి. సాయంత్రం కూడా మరో రెండు నాగుపాము పిల్లలు బయటికొచ్చాయి. కానీ తల్లి పాముల అచూకీ మాత్రం కన్పించలేదు’ అని తెలిపారు. ఈ ఘటనపై మల్లిక్ అనే జంతు ప్రేమికుడు మాట్లాడుతూ.. ‘ఒక పాము సాధారణంగా 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది. దానిని పొదగడానికి 60 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. అలా చూస్తే.. ఇక్కడ ఎన్ని పాములు ఉన్నాయి.. ఉంటే అన్ని పాములు ఒకే సారి గుడ్లు పెట్టాయా.. అన్ని ఒకే సారి పొదిగాయా.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అక్కడ 26 పాము గుడ్ల అనవాళ్లు మాత్రమే లభించాయి. మిగిలిన పాము పిల్లలు ఏలా వచ్చాయి. అటవీ శాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు. అధికారులు మాత్రం అక్కడ దొరికిన పాము పిల్లల్ని జనవాసాలకు దూరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వెల్లడించారు. -
ఇంట్లోకొచ్చి, ఎన్ని గుడ్లు పెట్టిందో.. వైరల్
భువనేశ్వర్: పాము గుడ్లు పెడుతుందని అందరికీ తెలిసిందే. కానీ అది గుడ్లు పెట్టడాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగా గానీ చూసిన వారు చాలా తక్కువ. ఇలాంటి అరుదు సంఘటలను చూడాలని ఉంటుంది. అలాంటి ఔత్సాహికుల కోసం పాము గుడ్లు పెట్టడాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చయడంతో వీడియో వైరల్ అవుతోంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన ఇండియన్ కోబ్రా.. ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ ఇంట్లోకి వచ్చింది. స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తి ఈ కోబ్రాను ఆ ఇంటి నుంచి తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేయడానికి ప్రయత్నించగా.. అది అప్పటికే కొన్ని గుడ్లు పెట్టడం గమనించాడు. దీంతో ఆయన స్నేక్ హెల్ప్లైన్కు ఫోన్ చేశాడు. అధికారులు ఆ పామును తమ వద్దకు తీసుకురావాలన్నారు. అక్కడ ఆ పాము గుడ్లు పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఆ పాము మొత్తం 23 గుడ్లు పెట్టింది. ఇదంతా అక్కడి జనరల్ సెక్రటరీ బుభేందు మాలిక్ వీడియో తీశాడు. సాధారణంగా పాము గుడ్లు పెట్టే సమయంలో చూడటం చాలా అరుదు. అందుకే తాను ఈ వీడియో తీశానని స్నేక్ హెల్ప్లైన్ జనరల్ సెక్రటరీ చెప్పారు. గుడ్లన్నీ పెట్టిన తర్వాత ఆ పామును అడవిలో వదిలేశారు. గుడ్లను కృత్రిమంగా పొదుగిస్తారట. 60 రోజుల తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చే ఈ పాములను అడవుల్లో వదిలేయనున్నట్లు తెలిపారు. -
గుడ్లు పెట్టిన పాము...వైరల్!
-
కోళ్ల గూటిలోకి దూరిన ఏడు గుడ్లు మింగిన పాము
-
ఏడు గుడ్లు మింగిన పాము
తిరువనంతపురం : కోళ్ల గూటిలోకి దూరిన ఓ త్రాచుపాము ఏడు కోడిగుడ్లను మింగింది. కోళ్లలో గందరగోళాన్ని గుర్తించిన యజమాని పరీక్షించి చూడగా లోపల పాము కనిపించడంతో అతను షాక్కు గురయ్యాడు. ఈ ఘటన కేరళలోని వేనాడ్లో చోటు చేసుకుంది. వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని త్రాచుపామును కోళ్ల గూటి నుంచి బయటకు తీశాడు. అనంతరం పాము నోటి నుంచి ఏడు గుడ్లను బయటకు వదలడాన్ని వీడియో తీశాడు. మొత్తం ఎనిమిది గుడ్లను పాము మింగినట్లు స్నేక్ క్యాచర్ సుదీప్ తెలిపాడు. గూటి నుంచి పామును బయటకు తీశాక జనం గుమిగూడటంతో అది భయపడిందని చెప్పాడు. అందుకే వెంటనే పొట్టలోని గుడ్లను బయటకు వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయిందని వివరించాడు. పాముకు సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది. -
ఇండో పాక్ బోర్డర్ మధ్యలో కోబ్రా తీగలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దుల్లో కంటి మీద కునుకు లేకుండా పహారా కాసే సైనికులకు తోడ్పాటుగా భారత్ పాక్ సరిహద్దులోని హిందూమల్కోట్ ప్రాంతంలో గల బీఎస్ఎఫ్ పోస్టులో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రక్షణ శాఖ ప్రవేశపెట్టింది. రాజస్థాన్లో ఉన్న హిందూమల్కోట్ ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతం. శత్రువులు దేశంలోకి చొరబడకుండా బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ కాస్తుంటారు. డాగ్ స్వ్కాడ్ కూడా గస్తీలో పాల్గొంటుంది. తాజాగా ఈ ప్రాంతంలో హ్యాండ్ హ్యాండిల్ థర్మల్ ఇమేజర్(హెచ్హెచ్టీఈ)ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రసారమయ్యే పరారుణ కిరణాలు శత్రువుల రాకను మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించగలవు. సూర్యాస్తమయ సమయం అనంతరం హెచ్హెచ్టీఈ భద్రతకు దన్నుగా నిలుస్తుంది. దీంతో పాటు సరిహద్దు వెంబడి కోబ్రా తీగలను అమర్చి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ కోబ్రా తీగ హై ఓల్టేజ్ కరెంటు కలిగి ఉంటుంది. దీన్ని సరిహద్దు ఫెన్సింగ్ మధ్యలో అమర్చారు. ఈ తీగలు పాకిస్తాన్ నుంచి చొరబాట్లను అరికడుతుంది. చొరబాటుదారుడు ఈ తీగను తాకగానే స్పృహ కోల్పొతాడు. హెచ్హెచ్టీఈ ద్వారా జీవుల కదిలికలను కచ్చితంగా గుర్తించగల్గుతారు. గస్తీలో పాల్గొనే డాగ్స్వ్కాడ్లోని కుక్కలకు రాత్రిపూట పహారా కసేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 ఆగస్టులోనే బీఎస్ఎఫ్ చీఫ్ శర్మ ఇండో పాక్ సరిహద్దులో సాంకేతిక పరిజ్ఞాన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ హై టెక్ పరిజ్ఞానాన్ని జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రవేశ పెట్టనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
నాగుపాములు మాత్రమే అలా చేస్తాయట..
ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నాగుపాములకు కళ్లు కనిపించవనే అపోహ ఉంది. కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్లు చక్కగా కనిపిస్తాయి. దానికితోడు వాటికి అద్భుతమైన ఘ్రాణ శక్తి కూడా ఉంటుంది. అంటే వివిధ వాసనలను బట్టి కూడా పరిసరాల్లో ఏమేం ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవన్నమాట. అంతేగాక, ఉష్టోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి. వీటన్నింటి ఆధారంగా నాగుపాములు రాత్రివేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడి, ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఓ గూడును కట్టే ఏకైక పాములు- నాగుపాములే. అదేవిధంగా, శత్రుజీవులపైనా గాని, లేదా తాము వేటాడదలచుకున్న జీవులపై గాని, విషాన్ని ఉమ్మగలిగే జీవుల్లో ఆ పనిని కచ్చితంగా చేయగలిగేవి కూడా ఇవే. ఇవి తమ పొడవులో సగం దూరం దాకా, సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి. అంటే శత్రు జీవుల కంటి దగ్గర పడాలనుకుంటే కంటి దగ్గర, ముక్కు దగ్గర పడాలనుకుంటే ముక్కు దగ్గర... ఇలా అన్నమాట. అన్నట్లు నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. నాగుపాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. -
పామును మింగిన కోడిపుంజు..
20 నిమిషాల పోరులో పుంజుదే విజయం సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): సాధారణంగా పామును చూస్తే కోళ్లు బెదిరిపోతాయి. అరుస్తూ ఆమడదూరం పారిపోతాయి. కానీ ఓ కోడిపుంజు అమాంతం పామునే మింగేసింది. కుమ్రంభీం జిల్లా కెరమెరి మండలంలోని చిన్నసాకడ గ్రామంలో ఆదివారం ఈ విచిత్రం జరిగింది. ఊళ్లో ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలోని ఓ పొలంలో 20 నిమిషాల పాటు నాగుపాము, కోడిపుంజు పోట్లాడుకున్నాయి. చాలాసార్లు పాము పడగ విప్పి బుస కొడుతుంటే కోడిపుంజు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంది. చివరి పోరులో పోట్లాడి అలసిపోయిన పామును.. తన నోటితో పొడిచి పొడిచి చివరికి అమాంతంగా మింగేసింది. ఇది చూసిన ప్రజలు పామును మింగిని కోడిని మనిషి తింటే విషమెక్కదా? అని భయం భయంగా చర్చించుకున్నారు. –కెరమెరి(ఆసిఫాబాద్) -
ఎర్రమందారం
-
కోబ్రా కమాండోలు నక్సల్స్ను కాటేస్తారా?
న్యూఢిల్లీ: చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోల వేటకు కొత్తగా రెండు వేల మంది కోబ్రా కమాండోలను సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) రంగంలోకి దించనుంది. గత నెలలో భద్రతా బలగాలపై మావోల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే సీఆర్పీఎఫ్ కొత్తగా బలగాలను రంగంలోకి దించతున్నట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతో కొత్తగా 20 నుంచి 25 కంపెనీల కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాకు పంపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బస్తర్కు తరలిస్తున్నట్లు వివరించారు. కోబ్రా దళాల్లోని జవానులకు ప్రత్యేకంగా అటవీ యుద్ధ నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. వీరు పాల్గొన్న దాడుల్లో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బలు తగులుతుంటాయి. -
ఒకటి కాదు.. రెండు కాదు.. 42 నాగుపాములు
-
వామ్మో! పాము విషానికి అంత రేటా?
కోల్కతా: ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్న పాము విషం పొడిని స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 245 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. అయితే దాని విలువ 175 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పత్రికలు వెల్లడించిన కథనాలనే నమ్మినట్లయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వెయ్యి గ్రాములకు లెక్కకడితే ఒక్క గ్రాము విలువ 1,75,000 రూపాయలు ఉంటుందని తేలుతోంది. ఇదే విషయాన్ని పోలీసులను అడిగితే ఆ మాత్రం విలువ ఉంటుందని వారూ తెలిపారు. అందుకే వాటిని బుల్లెట్ ప్రూఫ్ గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని కూడా చెప్పారు. పాము విషయం విలువ అంత ఉంటుందా? ఎవరు అంత విలువు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారు? అంతర్జాతీయ మార్కెట్లో సాధారణ నాగుపాము విలువ గ్రాముకు పది వేల రూపాయలు మాత్రమే ఉంది. ఎక్కువ విషాన్ని ఇచ్చే కింగ్ కోబ్రా నుంచి తీసే విషం గ్రాము విలువ తొమ్మిదివేల రూపాయలు మాత్రమే ఉంది. తాము స్వాధీనం చేసుకున్న పాము విషం గాజు పాత్రలపై వైద్య అవసరాల కోసం తయారు చేసినట్లు ఫ్రెంచ్ కంపెనీ గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. వారు చెబుతున్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల్లో ఈ విషాన్ని వాడతారనే విషయం మనందరికి తెల్సిందే. ముఖ్యంగా పాముకాటుకు విరుగుడు మందును తయారు చేయడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాము కాటకు విరుగుడుగా ఇచ్చే యాంటీ వీనమ్ ఇంజెక్షన్ సీసా రేటు భారత్ మార్కెట్లో వెయ్యి రూపాయలకే లభిస్తోంది. అందులో విషం పాళ్లు తక్కువగానే ఉంటుంది. భారత ఔషధ కంపెనీలు పోలీసులు చెబుతున్నట్లుగా 1,75,000 రూపాయలకు గ్రాము విషాన్ని కొన్నట్లయితే వారు యాంటీ వీనమ్ వాయిల్ను వెయ్యి రూపాయలకు ఎలా సరఫరా చేస్తారు? అంతర్జాతీయ మార్కెట్లో చైనా గ్రాము విషాన్ని 4,500 రూపాయలకు విక్రయిస్తోంది. పైగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు వెయ్యి గ్రాముల పాము విషం అవసరం లేదు. బుల్లెట్ ప్రూఫ్ గాజుల్లో ఆ పాము విషం పొడిని సరఫరా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైగా అన్ని రకాల పాముల విషాలను కలిపినట్లయితే అవి మందుల తయారీ కంపెనీలకు ఎందుకూ పనికిరావు. ఎందుకంటే ఒక్కో జాతి పాము విషయం వారికి వేర్వేరుగా కావాలి. తాచు పాము విషాన్నే భారత ఔషధ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ‘ఇరులా స్నేక్ క్యాచర్స్ కోపరేటివ్’ అనే సంస్థ ఎంతో కాలంగా అధికారికంగా భారత ఔషధ కంపెనీలకు అవసరమైన విషాన్ని సరఫరా చేస్తోంది. పది కిలోల తాచుపాము విషాన్ని సేకరించాలంటే 35వేల పాముల నుంచి 35 ఏళ్లు సేకరిస్తే వస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. పాము విషం ఆరుదైనప్పటికీ గ్రాము విలువ లక్షల్లో ఉంటుందని అనుకోవడం అతిశయోక్తేనని ఆ సంస్థ తెలిపింది. పైగా ఫ్రెంచ్ కంపెనీ పేరు స్మగ్లింగ్ సీసాలపై ముద్రించి ఉన్నట్లు పోలీసులే చెబుతున్నారు. అలాంటప్పుడు భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలు నేరుగానే వాటిని దిగుమతి చేసుకోవచ్చు. వాటిని స్మగ్లింగ్ చేయాల్సిన అవసరమేలేదు. పాము విషం అన్నది వన్య జంతువుల సంరక్షణ చట్టం కిందకు వస్తోంది. మన దేశం దాటితే ఈ చట్టం ఎవరికి వర్తించదు. అలాంటప్పుడు ఫ్రెంచ్ పాముల విషాన్ని పట్టుకునే హక్కే మన పోలీసులకు లేదు. ఆ....రేవు పార్టీల్లో, మత్తు ఎక్కడానికి కుర్రకారు ఈ విషాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారని, అందుకనే దీనికి ఇంతరేటు పలుకుతున్నట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు కొంతమంది కుర్రవాళ్లు బానిలవుతున్న విషయం కూడా తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడా గ్రాము కొకైన్ తొమ్మిదివేల రూపాయలకన్నా ఎక్కువ ధరలేదు. అలాంటప్పుడు లక్షల రూపాయలు పెట్టి పాము విషాన్ని ఎందుకు కొంటారు? అంతేకాకుండా పాము విషాన్ని తాగినట్లయితే కడుపులోని ఆమ్లాలు ఆ విషాన్ని వెంటనే నిర్వీర్యం చేస్తాయి. ఎలాంటి ప్రభావం ఉండదు. అల్సర్లు ఉంటే ప్రమాదం. ఎందుకంటే పాము విషం చాలా వేగంగా నరాల వ్యవస్థ, జన్యు వ్యవస్థను దెబ్బతీస్తాయి. రక్త ప్రసారాన్ని కూడా అడ్డుకుంటాయి. అందువల్ల మనుషులకు ప్రాణం పోవడం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. భారత దేశంలో ఏటా 45వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. వారిలో ఒక్కరు కూడా తాము ఒకవిధమైన మత్తులో తేలిపుతున్న భావాన్ని వ్యక్తీకరించలేదు. భరించలేని బాధ తప్ప. ఇలాంటప్పుడు పాము విషం పేరుతో కొకైన్నే సరఫరా చేస్తున్నారా? ఎందుకంటే చూడడానికి పాము విషం పొడి, కొకైన్ పొడి ఒకేలా ఉంటాయి. కొకైన్తో దొరికిపోతే శిక్షలు పెద్దగా ఉంటాయి కనుక, పాము విషమని స్మగ్లర్లు నమ్మిస్తున్నారా? లేదా పోలీసులే చౌక ప్రచారం కోసం ఇన్ని కోట్ల విలువైన పాము విషాన్ని పట్టుకున్నామని చెబుతున్నారా? ఏదీమైనా తాము పట్టుకున్న పదార్థాన్ని ల్యాబ్ పరీక్షకు పంపించి అదేమిటో తేలాక పోలీసులు వాస్తవాలను పత్రికలకు వెల్లడిస్తే బాగుంటుంది. snake venom, smuggling, Cobra, anti venom injection, పాము విషం, స్మగ్లింగ్, కొకైన్, యాంటీ వీనమ్ ఇంజెక్షన్ -
పాముతో సెల్ఫీ తీసుకుని బుక్కయ్యాడు!
అహ్మదాబాద్: నాగుపాముతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిన వ్యాపారవేత్త ఒకరు తగిన మూల్యం చెల్లించుకున్నారు. వడోదరకు చెందిన యాశేష్ బారోత్ జంతు ప్రేమికులు కాపాడిన కోబ్రాతో సెల్ఫీ తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఈ స్వీయచిత్రాన్ని ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసి 'వెయ్యి రూపాయిలకు కోబ్రా' అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్కు లక్షకు పైగా లైకులు రావడం గమనార్హం. వాట్సాప్ ద్వారా చాలా మంది ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో చూసి నేహా పటేల్ అనే జంతు ప్రేమికురాలు ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. యాశేష్ కు రూ.25 వేలు జరిమానా విధించారు. 'కోబ్రాతో తీసుకున్న సెల్ఫీని ఆన్లైన్ లో తానే పెట్టినట్టు యాశేష్ ఒప్పుకున్నాడు. తర్వాత ఈ పోస్ట్ ను తొలగించాడు. అతడికి రూ. 25వేలు జరిమానా విధించాం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత ప్రాణులను అమ్మకానికి పెట్టడం నేరమ'ని వడోదర ఫారెస్ట్ ఆఫీసర్ పీబీ చౌహాన్ తెలిపారు. -
తిరుమలలో ఆరడుగుల నాగుపాము
తిరుమలలో వన్యప్రాణుల బెడత పెరిగింది. ఒకవైపు చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన పడుతోంటే.. మరో వైపు.. నాగు పాములు, కొండ చిలువలు.. జనావాసాల్లోకి వచ్చి కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళవారం ఆరు అడుగుల నాగుపాము అటవీశివారు ప్రాంతం నుండి బాలాజీనగర్ చివరి సంధు వద్ద రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పామును చూసి పరుగులు తీసారు. సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ మజ్దూర్ భాస్కర్నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి పామును పట్టుకున్నాడు. దీంతో జనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత నాగుపామును అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. -
ఇంటికొచ్చిన 15 అడుగుల భారీ సర్పం
బరిపడా(ఒడిశా): ఒడిశాలోని సిమిలిపల్ పులుల సంరక్షణ కేంద్ర పరిధిలోని గ్రామంలో ఓ ఇంట్లో 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో బరిపడాలో చాలా అరుదుగా కనిపించిన ఈ సర్పాన్ని రక్షించడానికి అధికారులు ప్రత్యేకంగా పాములు పట్టేవాల్లని పిలిపించారు. పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న కృష్ణ చంద్ర ఆ పామును సురక్షితంగా అడవిలో వదిలాడు. తాను చాలా పాములు పట్టానని కానీ, ఇలాంటివి మాత్రం కేవలం ఐదు సర్పాలనే పట్టినట్టు తెలిపాడు. -
కాటేసిన విషసర్పాలు
నెంటూరులో బాలుడు బలి వర్గల్ : బుడిబుడి అడుగుల పసిబాలుడిపై నాగుపాము విషం చిమ్మింది. అమ్మ ఒడిలో అదమరిచి నిద్రపోతున్న చిన్నోడి ఉసురు తీసింది. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన వర్గల్ మండలం నెంటూరులో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నెంటూరుకు చెందిన చీర్ల స్వామి, భార్య కవిత గురువారం మధ్యాహ్నం ఏడాదిన్నర కొడుకు పరశురామ్కు ఇంట్లో పాలు తాగించి నిద్రపుచ్చింది. అనంతరం తాను కూడా నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన నాగుపాము పసిబాలుడిని పలుమార్లు కాటేసింది. బాధ తట్టుకోలేక బాలుడు గుక్కపెట్టి ఏడుస్తుండడంతో ఉలిక్కిపడి లేచిన తల్లి పక్కనే పడగవిప్పి ఉన్న పామును చూసి హడలిపోయింది. చిన్నోడిని ఎత్తుకుని పాము పాము అని అరుస్తు ఆరుబయటకు పరుగులు తీసింది. బోరుమని విలపిస్తూ కుటుంబసభ్యులు బాలుని వైద్యచికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఏడాదిన్నరకే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ తల్లి కవిత రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. -
పాముకాటుతో ఉపాధి కూలీ మృతి
తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేట మండలం జే.కొత్తూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీ శుక్రవారం పాము కాటు తో మృతి చెందింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలోని చెరువులో పూడికతీత పనులు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన సరిపల్లి పాపాయమ్మ(50) కూలి పనులకు వెళ్లగా నాగు పాము కాటేసింది. దీంతో ఆమె నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపాయమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
తహశీల్దార్ కార్యాలయంలో పాము కలకలం
ఖమ్మం జిల్లా చెర్ల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం తాచుపాము కలకలం రేపింది. కార్యాలయంలోకి పాము వచ్చిందనే సమాచారంతో ఉద్యోగులు భయాందోళనలో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానికులు వెతికి పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
సర్ప సందేశం!
‘‘పాపం... దానికింత జండూబామ్ ఇచ్చే దిక్కుండదు. కానీ నడుములు పడిపోయేలా డాన్స్ చేస్తుంటుందిరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎవరది?’’ విషయం తెలియక అడిగా. ‘‘ఇంకెవరు... మన నాగుపామే. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఎవడి నిధి, నిక్షేపాలకో సెక్యూర్టీ గార్డు డ్యూటీ చేస్తుంటుందా! రోజంతా నెత్తిన మణి పెట్టుకొని ఆ మోతబరువంతా మోస్తుందా! మళ్లీ మరో చోట గారడీవాడి జేబులోకి నాలుగు కాసులు రాలడానికి, పొద్దస్తమానం వాడి బుట్టలో పడుకోడానికి తయారు. దాని త్యాగాన్ని చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి రా’’ అన్నాడు రాంబాబు గాడు. రోజురోజుకూ మా రాంబాబు ధోరణికి బీపీ రెయిజ్ అవుతోంది నాకు. ఏది ఏమైనా వాడిని దారికి తెచ్చుకోవాల్సింది నేనే కదా. అందుకే వాడికి రెండు హితవు మాటలు చెప్పా. ‘‘ఒరేయ్ లోకమంతా ఓ దారయితే నువ్వు మరో రూటు రా. కాటేసే పాముకు మంచితనం ఏంట్రా?’’ అని అననైతే అన్నాను కానీ... వాడు చెప్పింది విన్న తర్వాత నాకూ పెద్దగా తప్పనిపించలేదు. అలంకార్ టాకీస్ దగ్గర గారడీవాడు ప్రదర్శించిన, ఉచిత పబ్లిక్ షో చూసి వస్తున్నాట్ట. వెంటనే వాడు నాగుపాము పక్షం వహించాడు. ‘‘అదెంత మంచిదో... దాని శ్రమను అప్పనంగా దోచుకునే గారడీవాణ్ణి చూడు. అదెంత మంచిదో... అమాయకంగా వాడు ఆడించినట్టల్లా ఎలా ఆడుతుందో చూస్తే తెలుస్తుంది. ఒక్క వాడికనే ఏమిటిలే అలనాటి మన శ్రీదేవి దగ్గర్నుంచి మొన్నటి మల్లికా షెరావత్ వరకూ అందరికీ తన రోల్స్ ధరించే అవకాశం ఇచ్చింది. తన కాస్టూమ్స్ వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లలా ఫ్యామిలీ పాములుండేవి. నువ్వు నమ్మవుగానీ... అప్పట్లో ఫ్యామిలీ పాముల కాన్సెప్టుతో నోము లాంటి సినిమాలూ వచ్చేవి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఎవరిమాటా కాదనదురా పాపం పాము...’’ ‘‘సామాన్యుల మాట కూడా కాదనదా?’’ ‘‘అవును. నాగుల చవితి రోజున పాలు పోస్తుంటే తన ఒళ్లూ ఇల్లూ గుల్లయ్యేలా పబ్లిక్ పాలు పోస్తున్నా... వద్దు అనదు రా అది. ఏమైనా చెప్పాలంటే పళ్లు లేక, కోరలు పీకి ఉన్న అది ‘బుస్ బుస్’ అంటూ మూగగా రోదిస్తుంటుంది. గారడీవాడు బూర పైకి లేపినప్పుడల్లా ఇది తోక మీద లేవాలి కదా. దాంతో వాడి బూర ఊదుడుకు తగ్గట్లు డాన్స్ చేయడానికి దాని తల ప్రాణం తోకకు వస్తుందిరా’’ అన్నాడు. ‘‘ఇంకొక్క మాట మాట్లాడితే బుర్ర బద్దలు కొట్టేస్తా. ఇంక నోర్ముయ్’’ అని కోప్పడ్డాను. వెంటనే వాడు... ‘‘ఒరేయ్... మంచితనం అన్నది కొబ్బరి నీళ్ల లాంటిది, కానీ సదరు మంచితనాన్ని మన ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలంటే బొండాకు బొక్కెట్టకుండా, టెంకాయను పగలగొట్టకుండా, పాముకు పడగ విప్పనియ్యకుండా పనవుతుందా? అందుకే రా అనాదిగా నీలాంటి వాళ్ల చేతుల్లో మాలాంటివాళ్ల బుర్రబద్దలు అవుతూనే ఉన్నాయి. గారడీవాడి బూరలకు అమాయకప్పాముల పడగలు వాచిపోతున్నాయి’’ అంటూ ఆవేశపడ్డాడు. ఇలా మాటల్లో నడుస్తూ, నడుస్తూ... మా అక్కవాళ్ల ఇంటి దగ్గరకు చేరాం. నేను చెబితే ఎలాగూ వినడం లేదు. పెద్దవాడు... కనీసం మా బావతోనైనా చెప్పిద్దామని ఆయనతో విషయమంతా చెబితే... ‘‘పాములు విషం కక్కుతాయనీ, నేను నిజం కక్కుతాననీ ప్రతీతి. అయినా రాంబాబు గాడు చెప్పింది నిజమేనేమోరా... అంతే అందంగా ఉండి, ఒకవేళ విషం గానీ లేకపోతే మన నాగుపామును పెంచుకోవాలని ఉబలాటపడనివాడు ఎవడైనా ఉంటాడా? అయినా ఒక్క మాట చెబుతా వినండ్రా. అక్రమంగా ‘మనీ’ సంపాదించే ‘కాల్’నాగుల కంటే... మన కాలనాగు బెటర్ కాదంటావా?’’ అన్నాడు మా బావ చిద్విలాసం చిందిస్తూ!! - యాసీన్ -
పామును మింగుదామని ప్రయత్నించి....
సాక్షి, బెంగళూరు: సాధారణంగా చేపలను, కప్పలను పాములు తినే సందర్భాలు మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగాఓ చేప తనకంటే పదింతలు పెద్దదైన పామునే మింగేయాలని పోరాటం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేప దెబ్బకి అంత పెద్ద పాము గిలగిలా కొట్టుకుంది. చివరకు చేప పోరాడి ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని సీగేబాగే గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీగేబాగే ప్రాంతంలోని భద్రానదిలో ఓ నాగుపామును చేప నోటితో కరిచి పట్టుకుంది. ఉన్నట్లుండి జరిగిన ఈ ఘటనతో నాగుపాము గిలగిలా కొట్టుకుంది. ఈ పోరులో చేప, పాము నది ఒడ్డుకు చేరుకున్నాయి. కాసేపు పెనుగులాడిన అనంతరం ఊపిరాడక చేప చనిపోయింది. చేప చనిపోయిన కొంత సేపటి తరువాత బయటపడిన నాగుపాము బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటనను భద్రానది ఒడ్డున జాలర్లు చిత్రీకరించడంతో వెలుగులోకొచ్చింది. -
పాము కాటుతో చిన్నారి మృతి
నాగు పాము కాటు వేయడంతో ఓ చిన్నారి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని గేదెలవానిపేటలో ఈ ఘటన జరిగింది. సిమ్మా యామిని (5) శనివారం ఉదయం నిద్రలేవ లేదు. దీంతో తల్లి రమ్య కదిలించి చూడగా మృతి చెందినట్టు తెలిసింది. సమీపంలోనే నాగుపాము కనిపించడంతో పాము కాటు వల్లే మృతి చెందినట్టు గుర్తించారు. పాములు పట్టే వ్యక్తిని పిలిపించి నాగు పామును పట్టించారు. -
ముగ్గుర్ని బలిగొన్న తాచుపాము
మంత్రాలయం: కర్నూలు జిల్లా కోసిగి మండలం, కందుకూరులో పాముకాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తన కుమార్తెలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని కలతచెందిన ఓ తండ్రి తన పరిస్థితిని గమనించలేక పోయాడు. చివరికి తన బిడ్డలను రక్షించుకోలేకపోయాడు. తానూ విగత జీవుడయ్యాడు. ఇదీ గ్రామానికి చెందిన తిమ్మయ్య ,భాగ్యమ్మల ఇంట నెలకొన్న విషాదం. వారికి పవిత్ర, పల్లవి, అంజలి, అనిత సంతానం. తమ పొలంలోనే రేకుల షెడ్డు వేసుకుని 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. వారంతా గాఢ నిద్రలో ఉండగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వేళ ఓ తాచు పాము తిమ్మయ్యతో పాటు పల్లవి(6), అంజలి(4)ని కాటేసింది. బాధతో పల్లవి ఏడుస్తుండడతో తల్లి లేచి పామును గమనించింది. అప్పటికే అది మరో ఇద్దరిని కాటేసింది. ఈ హడావుడిలో తననూ కాటేసిన విషయం పట్టించుకోని తిమ్మయ్య కూతుళ్లను రక్షించుకునేందుకు మోటారు సైకిల్పై భార్యతో కలిసి నాటు వైద్యం నిమిత్తం కౌతాళం మండలం కరణి గ్రామానికి బయలు దేరాడు. పరిస్థితి విషమించి పల్లవి దారిలోనే మరణించింది. అయినా అంజలిని రక్షించుకునేందుకు కరణికి వెళ్లినా.. చికిత్స మొదలుపెట్టే లోగానే ఆమే మృతి చెందింది. ఆ తర్వాత తిమ్మయ్య స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం ఆదోనికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
మా బుజ్జిగాడే నా సైన్యం!
మా దైవసమానుడి దైన్యం.. పొగడ్తలతో ముంచేసి అగడ్తల్లోకి దించేయడం ఈ పురుషపుంగవులు ఎప్పుడూ చేసే పనే. అవ్వాళ్ల ఒళ్లునొప్పులూ, జ్వరం అంటూ ఆఫీసుకు లీవు పెట్టారాయన. ‘‘నీలో లక్ష్మీకళ పూర్తిగా తాండవిస్తోందోయ్. అబ్బ... జ్వరం, ఒళ్లునొప్పులూ తెగ బాధిస్తున్నాయ్! నేను విష్ణుమూర్తిని కాకపోయినా.. లక్ష్మీదేవిలాంటి నీ భర్తనే కదా. కాబట్టి నొప్పులు తగ్గడానికి వైద్యంగా, కాసేపు కాళ్లు నొక్కవోయ్’’ అంటూ రిక్వెస్ట్ చేశారు. బాధ పడే వ్యక్తికి అవసరమైన చికిత్సగా కాసేపు కాళ్లు పట్టాను. అంతే... ఆ సిచ్యువేషన్ను అడ్వాంటేజీగా తీసుకొని వెంటనే ఆయన ఓ సైడుకు తిరిగిపోతూ... ‘‘ఇప్పుడు అచ్చం నేను విష్ణుమూర్తిలా లేనూ’’ అంటూ ముసిముసిగా నవ్వుతూ మా బుజ్జిగాడితో, నాతో ఏకకాలంలో పరాచికాలు మొదలుపెట్టారు. సెటైర్లు వేయడంలో ఇప్పుడిప్పుడే మా బుజ్జిగాడూ నాలా తయారవుతున్నాడు. ‘‘అవున్నాన్నా... అలంకార్ సెంటర్ దగ్గర పాములు ఆడించేవాడు ఉంటాడు చూశావా? వాణ్ణి రిక్వెస్ట్ చేసి కాసేపు నాగుపామును అద్దెకు తెచ్చి మీ హెడ్డు కవర్ అయ్యేలా సరిగ్గా మీ తల దగ్గర దాన్ని వదులుతా. దాంతో ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రకు నిండుదనం వస్తుంది’’ అన్నాడు. అంతే! ఆ మాటల్లోని మర్మం అర్థమై... ఒళ్లు నొప్పుల మాట మరచిపోయి సెలవు క్యాన్సిల్ చేసుకుని మరీ ఆఫీసుకు బయల్దేరారాయన. మరోరోజు మసాలా వంకాయ ఫ్రై చాలా బాగా కుదిరింది. ముగ్గురం తినడానికి సరిపోయినంత వండినా... ఆరోజు ఆయన నాలుకకు అది బాగా రుచిగా అనిపించడంతో ముందువెనకా చూసుకోకుండా మొత్తం తినేశారు. అందుకు మాకేమీ బాధ లేదు గానీ... తను చేసిన పనిని కప్పిపుచ్చుకోడానికో, తన గిల్టీ ఫీలింగ్ను కవర్ చేసుకోడానికో మళ్లీ ఓ డైలాగ్ వదిలారాయన. ‘‘ఒరేయ్... మీ అమ్మ సాక్షాత్తూ పార్వతీ మాతరా. అంటే నాలో సగం అన్నమాట. కాబట్టి నేను తిన్నదాంట్లో సగం ఆటోమేటిగ్గా ఆమెకే అంకితమవుతుంది కదరా. అందుకే అమ్మకు కూర మిగల్లేదని బాధపడకు’’ అంటూ ఓదార్చబోయారు. ఆ మాటతో మళ్లీ మా బుజ్జిగాడికి ఒళ్లు మండిపోయింది. ‘‘అవున్నాన్నా. నేను చెప్పానుగా... అలంకార్ సెంటర్లో పాములాడించే వాడు ఉంటాడని. ఈసారి పామును తెచ్చి నీ తల దగ్గర కాకుండా, నీ మెడకు చుడదాం’’ అన్నాడు వాడు కసిగా. ‘‘చూశావోయ్... నీ పెంపకంలో వీడు పూర్తిగా అమ్మ కూచి అయిపోయాడు. ఎప్పుడూ నీ పార్టీనే. ఇవ్వాళ్ల అన్నీ నీ తరఫున మాట్లాడుతున్నాడని సంతోషపడుతున్నావేమో? ఇలాంటి వాళ్లే రేపు పెళ్లాల చేత మరపు మందు అడిగి మరీ పెట్టించుకుని, వాళ్ల భార్యలకు సపోర్టు చేస్తూ ఉంటారు. రేపు వాడి పెళ్లాం వచ్చాక వాడు ఆమెనే సమర్థిస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు... ప్రస్తుతం నేను పడుతున్న బాధ’’ అన్నారు ఆయన ఉక్రోషంగా. అప్పుడు అన్నాన్నేను ఒక మాట... ‘‘పోన్లెండి, ఇప్పుడు నేను అనుభవించే బాధలేవీ వాడి పెళ్లాం పడదన్నమాట. ఆ ఊహే నాకు ఆనందంగా ఉంది. అలా ప్రవర్తించే మన బుజ్జిగాడి మంచితనాన్ని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలన్న తన స్వార్థంతోనైనా తను మన అబ్బాయిని బాగా చూసుకుంటుంది. ఈ ఆలోచనే నన్నెంతగానో సంతోషపెడుతోంది’’ అన్నాను. అంతే... ‘హు’ అంటూ తన అసహనాన్ని ప్రకటిస్తూ, పెండింగ్ వర్క్ అనే సాకుతో వెంటనే బయల్దేరారు మరోమారు ఆఫీసుకు! - వై!