JNTUH
-
ఆ 7 వేల సీట్ల పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశంతో పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెరిగిన 7 వేల సీట్లపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. నిబంధనల మేరకే ఉన్నందున పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని హై కోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రభుత్వం అందుకోసం జీవో ఇవ్వకపోవటంతో విద్యార్థులు, సీట్లు పెంచుకొన్న కాలేజీల యాజమాన్యాలు డోలాయమాన స్థితిలో పడ్డాయి. ప్రభుత్వం జీవో ఇస్తేనే పెరిగిన సీట్ల భర్తీకి అనుమతి ఇస్తామని జేఎన్టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే విద్యా సంవత్సరం దాదాపు సగం పూర్తి కావటంతో పెరిగిన సీట్ల భర్తీ ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొన్నది. ఈ సీట్లలో ఇప్పటికే 450 మంది వరకు విద్యార్థులు చేరిపోయారు. ఇప్పుడు ఈ సీట్లకు అనుమతి ఇవ్వకపోతే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎడతెగని పంచాయితీ..: రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు బాగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల పెంపుకోసం దరఖాస్తు చేసుకోగా.. జేఎన్టీయూహెచ్ అధికారులు ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీట్ల పెంపునకు ససేమిరా అనటంతో ఆ కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఆ 7 వేల సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తయింది. దీంతో కాలేజీలే ఈ సీట్ల భర్తీ చేపట్టి 450 సీట్లు భర్తీ చేశాయి. ఈ సీట్లను ఉన్నత విద్యా మండలి ర్యాటిఫై చేయాలి. దీనికన్నా ముందు పెరిగిన సీట్లకు జేఎన్టీయూహెచ్ అనుమతివ్వాలి. ఈ ప్రక్రియ ఇంత వరకూ పూర్తవ్వలేదు. ప్రభుత్వం జీవో ఇస్తే తప్ప తాము అనుమతివ్వలేమని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇప్పటికే చేరిన విద్యార్థులకు నష్టం జరుగుతుందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి.వచ్చే ఏడాది అయినా పెరిగిన 7 వేల సీట్లు కౌన్సిలింగ్ పరిధిలోకి వస్తాయా? రావా? అనే సందిగ్ధత నెలకొంది. వీటిలో 4,900 సీట్లు కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసే వీలుంది. మెరిట్ విద్యార్థులకు పెరిగిన సీట్లు మేలు చేస్తాయి. యాజమాన్య కోటా సీట్లు కూడా ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెబుతోంది. కాబట్టి పెరిగిన సీట్లపై ప్రభుత్వం జీవో విడుదల చేయకపోతే వచ్చే ఏడాది కౌన్సిలింగ్కు సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. -
‘సెర్చ్’ ఏదీ ?
సాక్షి, హైదరాబాద్ : యూనివర్సిటీల వీసీల నియామకంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల(వీసీ) ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అన్ని వర్సిటీల్లోనూ ఐఏఎస్లే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో వర్సిటీలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సాధారణ కార్యకలాపాలకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. ఐఏఎస్లంతా హైదరాబాద్లోనే ఉండటంతో వర్సిటీల్లోని సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం మొదలవ్వడంతో వర్సిటీలు కీలకమైన బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. జేఎన్టీయూహెచ్లో అనుబంధ గుర్తింపు, కోర్సుల మార్పిడి వంటి వాటి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్ కాలేజీలు అంటున్నాయి. మరోవైపు ఐఏఎస్లు అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఉన్నత విద్యామండలి కూడా యూనివర్సిటీ వ్యవహారాలపై ముందుకెళ్లే పరిస్థితి లేదు. కొత్త కోర్సులు, వాటికి సంబంధించిన బోధన ప్రణాళికపై ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండాపోయిందని మండలివర్గాలు అంటున్నాయి. వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. దీంతో కొత్తవారి నియామకానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఐఏఎస్ అధికారులకు వీసీలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్చ్ కమిటీలు ఏమైనట్టు? వీసీ ఎంపికకు గత నెలలోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. నిపుణులతో కూడిన ఈ కమిటీలు వచ్చిన దరఖాస్తులను వడపోయాలి. అంతిమంగా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ఇందులోంచి ఒకరిని ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. మూడు వారాలైనా ఇంతవరకూ సెర్చ్ కమిటీల భేటీ జరగలేదు. వీసీల ఎంపికలో తీసుకోవాల్సిన ప్రామాణిక అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, అందరూ సాంకేతికంగా వీసీ పోస్టులకు అర్హులే కావడంతో సెర్చ్ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. వీసీల ఎంపికలో ప్రభుత్వానికి కొన్ని రాజకీయ ప్రాధాన్యతలూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సామాజిక ప్రాధాన్యత ఇందులో కీలకమని భావిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎంపిక జరగాల్సి ఉన్నప్పుడు స్పష్టత లేకుండా మేమేం చేయగలమని వారు అంటున్నారు. ఒత్తిడే కారణమా...? ప్రధాన యూనివర్సిటీల వీసీల కోసం పెద్దఎత్తున ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే జేఎన్టీయూహెచ్ వీసీ కోసం కేంద్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దల నుంచే సిఫార్సులు వచ్చినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన ఓ వ్యక్తి కోసం పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో కాంగ్రెస్ కీలకనేత మైనారిటీకి చెందిన మరో ప్రొఫెసర్కు ఇప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. జేఎన్టీయూహెచ్ వీసీ పోస్టుకు ఎన్ఐటీలో పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పట్ల సీఎంకు సానుకూలత ఉన్నట్టు తెలిసింది. అయితే, తన మాట కన్నా పార్టీలో పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఈ కారణంగానే ఇక్కడ సెర్చ్ కమిటీ ఇంతవరకూ భేటీ అవ్వలేదని తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ పోస్టుకు ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కోసం విద్యాశాఖ ఉన్నతాధికారి కూడా పావులు కదుపుతున్నారు. సామాజిక కోణంలో ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నా, యూనివర్సిటీ వర్గాల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వీసీ పోస్టుకు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చేత పైరవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా ఒత్తిడి రావడంతోనే ప్రభుత్వం సెర్చ్ కమిటీలకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోందని ఉన్నతవిద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి జేఎన్టీయూహెచ్లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు నిర్వహించారు. అన్ని విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి 94 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ నుంచి 90 శాతం మంది పరీక్ష రాశారు.EAP CET టాపర్లు (ఇంజనీరింగ్)మొదటి ర్యాంక్ - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం,ఏపీ) రెండో ర్యాంక్ - గొల్లలేక హర్ష (కర్నూల్, ఏపీ) మూడో ర్యాంక్- రిషి శేఖర్ శుక్లఇంజనీరింగ్ విభాగంలో టాట్టెన్లో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచారు.EA PCET టాపర్లు ( అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ)మొదటి ర్యాంక్- ఆలూర్ ప్రణిత ( మదనపల్లి, ఏపీ) రెండో ర్యాంక్ - నాగుడసారి రాధా కృష్ణ (విజయనగరం, ఏపీ) మూడో ర్యాంక్- గడ్డం శ్రీ వర్షిణి (వరంగల్,తెలంగాణ)ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. ‘ఎప్ సెట్ను మొదటి సారిగా నిర్వహించాం. గత ఏడాది వరకు ఎంసెట్ పేరు మీద పరీక్షలు నిర్వహించాం’ అని తెలిపారు. ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడారు. ‘ఈ ఏడాది ఈఎపి సెట్ రాసిన విద్యార్థులకు శుభాకాంక్షలు . ఈఎపి సెట్కి గత పదేళ్ళలో లేనంతమంది ఈ సారి రిజిస్ట్రేషన్. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ప్రశాంతంగా పరీక్ష నిర్వహణ. ఒక్కో షిఫ్ట్ లో 50వేల మంది పరీక్ష రాశారు. గతంలో ఒక్కో షిఫ్ట్ లో 25 వేల మంది మాత్రమే పరీక్ష రాసేవారు. ఫలితాలు చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు. అడ్మిషన్ షెడ్యుల్ త్వరలో విడుదల చేస్తాం’అని అన్నారు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్) బుధవారం ప్రశాంతంగానే ముగిసింది. అయితే, మంగళవారం కురిసిన అకాల వర్షం కారణంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పరీక్ష కేంద్రాల్లో అనేక చోట్ల విద్యుత్ లేకపోవడం, ఇంటర్నెట్ సదుపాయం గంటల తరబడి అందుబాటులోకి రాకపోవడంతో సెట్కు సమస్యలు తలెత్తాయి.హైదరాబాద్లోని పలు పరీక్ష కేంద్రాల్లో కొద్దిసేపు కంప్యూటర్లు మొరాయించినట్టు విద్యార్థులు తెలిపారు. కానీ తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే అదనంగా జనరేటర్లను సిద్ధం చేశారు. నెట్వర్క్ సమస్యలను కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం మొదలైన ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగానికి చెందిన సెట్ రెండో రోజు కూడా జరిగింది. ఈ రెండు రోజులకు కలిపి 1,00,254 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 90 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్ సెట్కు పక్కా ఏర్పాట్లురాష్ట్రంలోని దాదాపు 175 కాలేజీల్లో ఉన్న 1.06 లక్షల ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జేఎన్టీయూహెచ్ నిర్వహించే సెట్ గురువారం మొదలవుతుంది. ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణ నుంచి 2,54,532 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సగం మందికిపైగా విద్యార్థులు హైదరాబాద్ కేంద్రం నుంచే పరీక్ష రాస్తున్నారు. దీంతో హైదరాబాద్లో 4 జోన్లు ఏర్పాటు చేశారు. వర్షం, గాలి దుమారం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ జనరేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నెట్వర్క్ సమస్య రాకుండా కూడా అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. ఈ ఫైల్ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్ కాలేజీల తీరిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ తాజా పరిశీలనలో వెల్లడైంది. పదేళ్ల నాటి కంప్యూటర్లు... జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్ సైన్స్ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటర్ ఉండాల్సి ఉండగా సెక్షన్ మొత్తానికి రెండు కంప్యూటర్లు కూడా లేవని తేలింది. అవి కూడా అతితక్కువ ప్రమాణాలతో ఉన్నాయని, సరికొత్త టెక్నాలజీ బోధించేందుకు ఏమాత్రం పనికి రావని అధికారులు గుర్తించారు. పదేళ్ల నాటి కాన్ఫిగరేషన్తో వాడే కంప్యూటర్లు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ సైన్స్, డేటా అనాలసిస్, సైబర్ సెక్యూరిటీకి వాడే అత్యాధునిక సాఫ్ట్వేర్ రన్ కావడానికి ఉపకరించే ఆధునిక కంప్యూటర్ల స్థానంలో నాసిరకం వాటితోనే కాలేజీలు బోధన సాగిస్తున్నట్లు తేలింది. ఇక అధ్యాపకుల విషయానికొస్తే కంప్యూటర్ సైన్స్ వచ్చిన కొత్తలో ఉన్న వారే ఇప్పుడూ బోధకులుగా ఉన్నారు. వారు నైపణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు ఎలాంటి ఆధారాలను యాజమాన్యాలు చూపలేదని తెలిసింది. ప్రతిరోజూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ప్రముఖ కంపెనీల్లో అధ్యాపకులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ దిశగా ఎలాంటి కసరత్తు జరగలేదు. అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే గుర్తింపు.. ఈ నెల 18 నుంచి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మొదలుపెడతాం. ప్రతి కాలేజీని పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఉంటేనే కాలేజీలకు గుర్తింపు ఇస్తాం. కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ఎక్కువ కాలేజీలే కోరుతున్నాయి. వాటి సామర్థ్యం, బోధన విధానాలను లోతుగా పరిశీలించే ఉద్దేశంతోనే ఈసారి అఫిలియేషన్ ప్రక్రియను ముందే చేపడుతున్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ 78 కాలేజీల డొల్లతనం.. ఈసారి దాదాపు వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సివిల్లో 40 శాతం, మెకానికల్లో 35 శాతం, ఎలక్ట్రికల్లో 34 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడంతో ఈసారి ఆయా బ్రాంచీల్లో సెక్షన్లు, సీట్లు తగ్గించుకుంటామని కోరాయి. వాటి స్థానంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అయితే ఆయా కాలేజీలు సమర్పించిన వివరాలను జేఎన్టీయూహెచ్ అధికారులు పరిశీలించగా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. కంప్యూటర్ కోర్సులు కోరుతున్న వంద కాలేజీలకుగాను 78 కాలేజీల్లో అత్యాధునిక కంప్యూటర్లు లేవని, కంప్యూటర్ లాంగ్వేజ్పై పట్టున్న ఫ్యాకల్టీ లేదని తేలింది. -
అఫిలియేషన్ ప్రక్రియ మొదలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. విశ్వవిద్యాలయాలు ఇప్పటికే కాలేజీల నుంచి సమాచారం సేకరించాయి. వాటిని సంబంధిత నిపుణులు పరిశీలిస్తున్నారు. అత్యధిక కాలేజీలు అనుబంధంగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో ముందుంది. కాలేజీల నుంచి సేకరించిన సమాచారాన్ని సిబ్బంది కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున ఫ్యాకల్టీ నిపుణులు వెళ్తారని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. మరోవైపు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని, డిమాండ్ ఉన్న వాటిల్లో పెంచుకునేందుకు కాలేజీలు ప్రయ త్నిస్తున్నాయి. అయితే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా తగ్గించేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు. ఆయా కోర్సుల్లో 30 శాతం సీట్లు ఉండి తీరాలని చెబుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 200కు పైగా కాలేజీల్లో తనిఖీలకు సిద్ధం జేఎన్టీయూహెచ్ పరిధిలో 145 వరకూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. మరో 70 వరకూ ఫార్మసీ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా వచ్చి న కొత్త కోర్సుల విషయంలోనే అధికారులు దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కోర్సుల్లో అవసరమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫ్యాకల్టీ సరైనది ఉందా? మౌలిక సదుపాయాలు ఏమేర ఉన్నాయి? అనే అంశాలను తనిఖీ బృందాలు నిశితంగా పరిశీలించాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని యూనివర్సిటీలు తప్పనిసరి చేసినా, పలు కాలేజీలు దీన్ని అనుసరించడం లేదు. ఈ ఏడాది నుంచి దీనిని కచ్చి తంగా అమలు చేయాలని నిర్ణయించినట్టు జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలో భాగం చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్యాకల్టీ ప్రతిభ, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా తనిఖీలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సదుపాయాలు లేకుండా గుర్తింపు కష్టం తనిఖీల విషయంలో యూనివర్సిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. తనిఖీ బృందాలు కాలేజీ యాజమాన్యాలతో మిలాఖత్ అవుతున్నాయని, మౌలిక సదుపాయాలు లేకున్నా అనుమతిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కాలేజీలో బోధించే సిబ్బంది వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, వారి వ్యక్తిగత పాన్ కార్డుల ఆధారంగా ఆదాయ పన్నుశాఖ ద్వారా తనిఖీలు చేయాలనే యోచనలో ఉన్నారు. ఫ్యాకల్టీ కాలేజీలో బోధిస్తున్నాడా? ఎక్కడైనా ఉద్యోగం చేసుకుని, కాలేజీలో ఫ్యాకల్టీగా నమోదు చేసుకున్నాడా అనే అంశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా తనిఖీలు పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులు భావిస్తున్నారు. మే రెండో వారంకల్లా పూర్తి చేస్తాం కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను మే రెండో వారంకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కాలేజీల్లో ఫ్యాక ల్టి, వసతులపై డేటా తెప్పించాం. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేని కాలేజీలు గుర్తింపు తేదీ నాటికి ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ప్రతీ కాలేజీకి ముగ్గురు చొప్పున నిపుణులు వెళ్తారు. అన్నీ పరిశీలించి, నిబంధనల మేరకు సరిగా ఉంటేనే గుర్తింపు ఇస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
కేపీహెచ్బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించి పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కిందట మెడికల్ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం ఆ నాడు జోక్గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూహెచ్ 11వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్. ఎంబీఏ, ఎంఎస్ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్–డి, ఫార్మ్ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు. -
ప్రైవేటు పీహెచ్డీలకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీహెచ్డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు. నాణ్యత ఉంటుందా...? అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు. పీహెచ్డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్ల చేత పీహెచ్డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు. నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్డీకి గైడ్గా ఉండే వ్యక్తికి పీహెచ్డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాణ్యత దెబ్బతింటుంది ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. – డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అర్హత ఉన్న వారికే అవకాశం గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు. – ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్టీయూహెచ్ -
పీజీ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈ సెట్–2023 షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్ ఈ పరీక్షను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో పరీక్ష కోసం ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.600)తో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం https:// pgecet.tsche.ac.in వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని ఆయన సూచించారు. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈసారి నర్సింగ్ కూడా.. నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్కు ఇంటర్లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్లో ఇంటర్కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్సైట్కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్కుమార్ తెలిపారు. -
ఎంసెట్ నోటిఫికేషన్పై ఎందుకు జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎంసెట్ను మే నెలలో నిర్వహిస్తామని తేదీలు ప్రకటించినా, ఇంతవరకూ వివరణాత్మక నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థుల్లో స్పష్టత కొరవడింది. ఎంసెట్లో ఇంటర్కు వెయిటేజీ ఉండబోదని కూడా అధికారులు చెబుతున్నా దీనిపై జీవో వెలువడలేదు. దీంతో ఎంసెట్ను నిర్వహించే పరీక్షకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్టు జేఎన్టీయూహెచ్ చెబుతోంది. మరోవైపు కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియను జేఎన్టీయూహెచ్ వచ్చే వారంలో చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే కాలేజీల డేటా తెప్పించినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేస్తే తప్ప, వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసే వీలుండదని అంటున్నారు. వీలైనంత త్వరగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులు నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని యూనివర్సిటీల వీసీలు కూడా అంటున్నారు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలిదశ పూర్తయింది. రెండో విడత ఏప్రిల్లో జరగనుంది. కోవిడ్ మూలంగా గత రెండేళ్ళుగా విద్యా సంవత్సరం ఆలస్యంగా నడుస్తోంది. ఈసారైనా సకాలంలో పూర్తి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అన్ని రాష్ట్రాలకూ సూచించింది. త్వరలోనే కొత్త విద్యా సంవత్సరంలో చేపట్టే మార్పులు, చేర్పులతో మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తోంది. కానీ మన రాష్ట్ర ఎంసెట్ విషయంలో మాత్రం అధికారులు నిర్లిప్తంగా ఉండటం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక వర్గాలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. స్పష్టత కోరుతున్న విద్యార్థులు ఎంసెట్ వివరణాత్మక నోటిఫికేషన్ వస్తేనే అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ ఏడాదికి 70 శాతం సిలబస్ ఉంటుందా? లేదా? వెయిటేజీ ఇస్తారా? ఇవ్వ రా? అనేది తెలిస్తే ఎంసెట్కు ఎలా సన్నద్ధమవ్వాలనే దానిపై స్పష్టత ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంసెట్తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మే 7వ తేదీన ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12, 13, 14 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ ఎంసెట్ ఉంటా యని తెలిపారు. రెండురోజుల్లో వర్సిటీలు వివరణాత్మక నోటిఫికేషన్లు ఇస్తాయని చెప్పారు. కానీ ఇంతవరకు వెలువడకపోవడంతో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్ధం కాక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఎంసెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. విడుదలకు ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయినా వీలైనంత త్వరలోనే జారీ చేస్తాం. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు సకాలంలోనే క్లాసులు మొదలవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
బ్లాక్ హాక్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత జేఎన్టీయూహెచ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జేఎన్టీయూహెచ్ (సౌత్జోన్) నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీబీఐటీ)పై 15-7, 15-13, 15-19 స్కోర్తో విజయం సాధించింది. ప్రాధమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలనే ప్రయత్నాల్లో భాగంగా జేఎన్టీయూహెచ్ స్పోర్ట్స్ కౌన్సిల్తో కలిసి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్ను రెండు రోజుల పాటు జెఎన్టీయూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వాలీబాల్ టీమ్లు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నాయి. ‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నాము’’అని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ప్రిన్సిపల్ యజమాని, అభిషేక్ రెడ్డి అన్నారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని శ్యామ్ గోపు (సహ యజమాని) అన్నారు. -
ఛత్తీస్గఢ్కు మన పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు తెలంగాణ ఆచార్యులు బోధించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరింది. త్వరలోనే ఈ మేరకు ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించనుంది. దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పలు దఫాలుగా చర్చించారు. ఉన్నత విద్యలో జేఎన్టీయూహెచ్ తీసుకొస్తున్న సంస్కరణలు ఛత్తీస్గఢ్ వర్సిటీలను ఆకర్షించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో నెలకొన్న ప్రొఫెసర్ల కొరతను కూడా ఆ రాష్ట్రం పరిగణలోనికి తీసుకుంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు జేఎన్టీయూహెచ్ని సరైన భాగస్వామిగా ఎంచుకుంది. ముందుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సును ప్రారంభించాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని కోర్సులకు మన రాష్ట్ర అధ్యాపకుల తోడ్పాటు తీసుకునే అవకాశం ఉంది. కోర్సు నిర్వహణ, ఇతర అంశాలపై మరింత లోతుగా చర్చించాల్సి అవసరం ఉందని, ఆ తర్వాత అఖిల భారత సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు మరికొన్ని సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉందని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. డిమాండ్ దృష్ట్యానే.. బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ–కామర్స్ వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో ఈ రంగంలో నిపుణుల అవస రం ఉందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. భారత్లో డేటా అనలిస్ట్ పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి వేతనాలతో ఉపాధి పొందుతు న్నారు. మన దేశంలోనూ డేటా అనలిస్టుల కొరత 60 శాతం వరకూ ఉందని ఇటీవల సర్వేలు పేర్కొన్నాయి. దీన్ని దృష్టి లో ఉంచుకుని గత రెండేళ్ళుగా బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సు ను అంతర్జాతీయ ప్రమాణాలతో జేఎన్టీయూహెచ్ అభివృద్ధి చేసింది. ఛత్తీస్గఢ్లోనూ బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు మంచి డిమాండ్ వస్తోంది. అయితే అక్కడ నిష్ణాతులైన అధ్యాపకుల కొరత కారణంగా ఈ కోర్సుకు అన్ని కాలేజీల్లోనూ అనుమతి ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో భాగస్వామ్యానికి ఛత్తీస్గఢ్ సిద్ధమైంది. కోర్సు నిర్వహణ ఎలా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో బీబీఏ అనలిస్ట్ కోర్సులో ప్రవేశాల ప్రక్రియను ఆ రాష్ట్రమే నిర్వహిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూహెచ్కు లాగిన్ అవుతారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రొఫెసర్లు ఆన్లైన్ ద్వారా వారికి బోధన చేస్తారు. దీనికి అనుగుణంగా రెండుచోట్లా ఒకే తరహా సిలబస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. పరీక్షలు కూడా ఆన్లైన్లోనే చేపట్టినప్పటికీ, మూల్యాంకన విధానం మాత్రం తామే చేపడతామని ఛత్తీస్గఢ్ అధికారులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. బోధించే అధ్యాపకులే మూల్యాంకనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలావుండగా ఈ కోర్సు నిర్వహణ కారణంగా జేఎన్టీయూహెచ్కు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అవసరమైతే కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చే అంశాలపైనా ఆలోచిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఛత్తీస్గఢ్ కోరిక మేరకు బీబీఏ డేటా అనలిస్ట్ కోర్సుకు అవసరమైన బోధన తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మన అధ్యాపకులకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే కోర్సు నిర్వహణపై సమాలోచనలు జరుగుతున్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభించే యోచనలో ఉన్నాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (జేఎన్టీయూహెచ్ వీసీ) -
సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూల మార్పులకు జేఎన్టీయూహెచ్ శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ కోర్సులకు ధీటుగా సాంప్రదాయ బ్రాంచిలకు అదనపు హంగులు అద్దుతోంది. క్రెడిట్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. భారత్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ కోర్సులకు రూపకల్పన చేసింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. అమల్లోకి ఆర్–22 ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి. అన్ని బ్రాంచ్లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు ఇంజనీరింగ్లో సీఎస్సీ ఓ క్రేజ్గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్తో), క్లౌడ్ డెవలప్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్టీయూహెచ్ వీలు కల్పిస్తుంది. ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్లైన్లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది. ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్ను ఆన్లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం. -
ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
కేపీహెచ్బీ కాలనీ: విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. జేఎన్టీ యూహెచ్ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవం పురస్కరించుకొని ‘‘ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’’అనే అంశంపై గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మేధస్సు అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆవిష్కరణల వైపు మొగ్గుచూపాలని సూచించారు. సరికొత్త ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా టీహబ్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రోజుకు 24 గంటలపాటు విద్యుత్, ఇంటింటికీ తాగునీటి సదుపాయం, సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై అన్ని పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భారత పారిశ్రామిక అభివృద్ధికి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే మూడు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని విధానాలు రూపొందించాలని తాను సూచించినట్లు తెలిపారు. మౌలిక వసతుల సద్వినియోగం ఏదీ.. దేశంలో ఉన్న మౌలిక వసతులన్నింటినీ సద్వినియోగం చేసుకోలేని దుస్థితి నెలకొందని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. దేశంలోనే వివిధ రూపాల్లో నాలుగు లక్షల ఆరువేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా గరిష్టంగా వినియోగించే విద్యుత్ రెండు లక్షల పన్నెండు వేల మెగావాట్లు మాత్రమేనని తెలిపారు. అయినప్పటికి విద్యుత్ ఉత్పత్తిలో దేశం వెనుకబడిందన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, పారిశ్రామికవేత్త పద్మశ్రీ బి.వి.మోహన్రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బయోమెట్రిక్’ అమలు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఆటలకు చెక్ పెట్టేలా హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) చర్యలకు ఉపక్రమించింది. కాలేజీలకు వర్సిటీ అనుబంధ గుర్తింపుప్రక్రియలో భాగంగా అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిస రి చేసిన వర్సిటీ.. దానిని అమలు చేయని కాలేజీలకు నోటీసులు జారీచేస్తోంది. అధ్యాపకులకు రోజువారీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయా నోటీసుల్లో ప్రశ్నించింది. కనీస హాజరు శాతం కూడా ఉండడం లేదని పేర్కొంది. కాలేజీల తనిఖీల సమయంలో బయోమెట్రిక్ హాజరులేని బోధన సిబ్బందిని పరిగణనలోకి తీసుకోబోమని, వారిని ఫ్యాకల్టీగా భావించబోమని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సవరం నుంచి బయోమెట్రిక్ హాజరును పాటించకపోతే తదుపరి అనుబంధ గుర్తింపునకు అవకాశం ఉండబోదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తనిఖీల్లో గుర్తింపుతో.. 2022–2023 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం వర్సిటీ కమిటీలు కాలేజీల్లో గతనెల 18 నుంచి 22 వరకు తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ సర్వర్లో అధ్యాపకుల బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాని విషయాన్ని గమనించి నివేదిక సమర్పించాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. సగానికి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత జేఎన్టీయూహెచ్ పరిధిలో సుమారు 143 కళాశాలలు ఉండగా సగానికి పైగా కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. మరోవైపు అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా మరొకరు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫార్మసీ లాబ్ల్లో, మెడికల్ షాపుల్లో పనిచేసేవారితో పాటు, సాఫ్ట్వేర్æ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు (కాంట్రాక్ట్ పద్ధతిలో), ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నవారిని ఫ్యాకల్టీగా కళాశాలలు చూపించడం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే దిశలో జేఎన్టీయూహెచ్ చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. నాణ్యమైన విద్య అందుతుంది ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసి, దానిని అమలు చేయని కాలేజీల కు నోటీసులు జారీ చేయడం హర్షణీయం. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని కాలేజీల్లో సిలికాన్ వేలిముద్రలు వినియోగిస్తున్నారు. దానిపైనా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్టీసీఈఏ -
ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్ జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఏదైనా కాలేజీపై నిర్ధిష్ట ఆరోపణలువస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే, వాటికి సంబంధించిన ల్యాబ్లు, కోర్సులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారా.. లేదా? అనేది పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలపై ‘145 కాలేజీ లు.. మూడు రోజుల్లోనే తనిఖీలపై అనుమానా లు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనం లో వాస్తవం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ స్పష్టంచేశారు. కాలేజీల్లో సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించామని తెలిపారు. కొన్నేళ్లుగా నడుస్తున్న పాత కాలేజీల్లో సివిల్, మెకానికల్ కోర్సులకు సంబంధించి ల్యాబొరేటరీలు, అధ్యాపకుల వ్యవస్థ ఉంటుందని, అలాంటప్పుడు వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన కంప్యూటర్ కోర్సులకు ల్యాబ్స్, బోధించే సిబ్బంది సక్రమంగా ఉన్నారా? లేదా? అనే అంశంపైనే తాము దృష్టిపెట్టినట్టు వివరించారు. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో సంతృప్తిచెంది, కాలేజీల్లో ఉన్న లోపాలను యాజమాన్యాలకు వివరించకుండా, వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, అనుబంధ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతేడాది నుంచి నిజనిర్ధారణ కమిటీలు ఎత్తిచూపిన లోపాలను కాలేజీ మేనేజ్మెంట్లకు చూపి, వాటిని సరిచేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాల్స్తో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. -
జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ
సాక్షి, కేపీహెచ్బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్కుమార్ తెలిపారు. దాడిని ఖండిస్తూ ర్యాలీ... బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్కు, ఓఎస్డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్) -
నో సి‘విల్’ .. మెకాని‘కిల్’!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో సంప్రదాయ కోర్సులకు కాలం చెల్లనుందా? డిమాండ్ లేని కోర్సులను ఎత్తేసి, విద్యార్థులు కోరుకునే కోర్సులు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. గత మూడేళ్లుగా కంప్యూటర్ కోర్సుల్లో వచ్చిన ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సుల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. దీంతో 95 శాతం సీట్లు ఈ కోర్సుల్లోనే భర్తీ అవుతున్నాయి. మరోవైపు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు వందకుపైగా కాలేజీలు తమ సంస్థల్లో సివిల్, మెకానికల్ కోర్సులను ఎత్తివేసేందుకు హైదరాబాద్ జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు సోమవారం నుంచి విచారణ జరపనున్నారు. మూడేళ్లుగా 30 శాతం సీట్లు భర్తీ కాలేదని కాలేజీలు సరైన ఆధారాలు చూపిస్తే జేఎన్టీయూహెచ్ ఆ కోర్సులు ఎత్తివేసేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇస్తుంది. దీని ఆధారంగా కాలేజీలు సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత సీట్లు తెచ్చుకునే వీలుంది. 10 వేలకు పైగా సీట్లకు ఎసరు రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 79 వేల సీట్లు ఉంటాయి. వీటిల్లో కూడా 38,796 సీట్లు కంప్యూటర్, దాని అనుబంధ కోర్సులే ఉన్నాయి. ఈసీఈ 13,935, ఈఈఈ 7,019 ఉంటే, సివిల్ 6,221, మెకానికల్ 5,881 సీట్లున్నాయి. ఇతర కోర్సుల సీట్లు మరికొన్ని ఉన్నాయి. అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ముగిసిన వెంటనే తక్షణ ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ను ఎంచుకుంటున్నారు. కొంతమంది అమెరికా వంటి విదేశాలకు వెళ్లేందుకు కూడా కంప్యూటర్ కోర్సుల బాట పడుతున్నారు. కంప్యూటర్ కోర్సులకు సంబంధించి కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకున్నా విద్యార్థులు ఇదే దారిలో పయనిస్తున్నారు. వాస్తవానికి ఈ కోర్సులు చేసినప్పటికీ కేవలం 8 శాతం మాత్రమే స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నట్టు ఇటీవల సర్వేలో వెల్లడైంది. కానీ విద్యార్థుల డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ కోర్సుల సీట్లు వీలైనంత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ లేని మెకానికల్, సివిల్ కోర్సుల ఎత్తివేతకు రంగం సిద్ధం చేశాయి. వర్సిటీ ఎన్వోసీ ఇస్తే వందకుపైగా కాలేజీల్లో 10 వేలకు పైగా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లేకుండా పోయే అవకాశం ఉంది. 2021లో ఈ రెండు కోర్సుల్లోనూ సగటున 30 శాతానికి పైగానే సీట్లు భర్తీ కావడం గమనార్హం. పాలిటెక్నిక్ విద్యార్థుల మాటేమిటి? సంప్రదాయ కోర్సులు కనుమరుగు కావడం భవిష్యత్లో దుష్పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశం పొందే వీలుంది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లన్నీ ఎత్తేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. పాలిటెక్నిక్లో కేవలం సివిల్, మెకానికల్ వంటి కోర్సులు మినహా కంప్యూటర్ కోర్సులు లేకపోవడం గమనార్హం. అలాగే రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో సివిల్, మెకానికల్ కోర్సుల ఎత్తివేత వల్ల భవిష్యత్తులో సంబంధిత నిపుణుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు తగ్గిపోతే ప్రమాదం. ముఖ్యంగా పాలి టెక్నిక్ విద్యార్థులకు భవిష్యత్ ఉండదు. అందువల్ల సంప్రదాయ కోర్సు లు వందకు వంద శాతం రద్దుకు అనుమతించే ప్రసక్తే లేదు. కాలేజీలతో సంప్రదింపులు జరిపి సా ధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు రద్దవ్వకుండా చూస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆ కోర్సుల రద్దుకు అనుమతించకూడదు సంప్రదాయ కోర్సుల రద్దుకు యూనివర్సిటీ అనుమతించకూడదు. కంప్యూటర్ కోర్సులు చేసిన వారందరికీ ఉపాధి లభిస్తోందనేది అవాస్తవం. కంప్యూటర్ సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాలేజీలు అనేకం ఆయా కోర్సులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కంప్యూటర్ కోర్సుల కోసం ఎగబాకే ప్రైవేటు కాలేజీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఎంటెక్ చేసిన వాళ్లకు నెలకు కేవలం రూ.35 వేల వేతనం ఇస్తూ నాణ్యతలేని విద్యను అందిస్తున్నాయి. ఇవన్నీ విద్యార్థులు గ్రహించాలి. – డాక్టర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
జేఎన్టీయూహెచ్లో టెక్నికల్ ఫెస్ట్-2022 (ఫొటోలు)
-
విద్యార్థినులకు కొత్త వసతి గృహాన్ని నిర్మించండి
కేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూహెచ్లో విద్యార్థినుల కోసం కొత్త వసతి గృహాన్ని నిర్మించాలని ఓఎస్డీ స్కూడెంట్స్ అఫైర్ బానోతు ధర్మాను కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్ఠి నాయకురాలు శేషుశ్రీ పంచాల మాట్లాడుతూ... ఇటీవల వసతి గృహాల్లోనే లైబ్రరీ సదుపాయం కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థినుల సంఖ్య పెరిగిందన్నారు. విద్యార్థినుల సంఖ్యకు అందుకనుగుణంగా మరో వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరాన్నారు. మెస్ బిల్లులు సైతం ఎక్కువగా వస్తున్నాయని, మెస్ బిల్లులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కో ఆర్డినేటర్ పవిత్ర, కీర్తన, శ్రీజ, జ్ఞాన ప్రసీద, శ్రేయ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్తో కలిపి)గా నిర్ణయించారు. -
2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులకు కొన్ని పేపర్లలో సున్నా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగగా.. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ 2, 3 సంవత్సరాల విద్యార్థుల ఆఖరి సెమిస్టర్ మార్కులను ఇటీవల ప్రకటించారు. ఈ ఫలితాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో జీరో మార్కులు వచ్చాయి. వీరిలో ఎక్కువమంది పాలిటెక్నిక్ డిప్లొమా చేసి, ఐసెట్ ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాది ప్రవేశాలు పొందిన వాళ్లు కావడం గమనార్హం. ఇంటర్నల్ పరీక్షల్లో వీరిలో చాలామందికి 25కు గాను 23 వరకు మార్కులొచ్చాయి. అయితే ఎక్స్టర్నల్స్లో మాత్రం ఏకంగా జీరో రావడం విస్మయం కలిగిస్తోంది. ఈ విధంగా మార్కులొచ్చిన వారు ఇప్పటివరకు 2 వేల మందిని గుర్తించినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అన్ని కాలేజీల నుంచి డేటా తెప్పిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం దశలోనో, మార్కుల వెల్లడిలోనో జరిగిన సాంకేతిక లోపం ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు ) ఇప్పటికీ వినియోగంలో పాత సాఫ్ట్వేర్ కళాశాలలకు చెందిన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన తర్వాత మార్కులను ఆయా కాలేజీల వారీగా జేఎన్టీయూహెచ్ సాఫ్ట్వేర్లో ఆప్లోడ్ చేస్తారు. దీనికోసం వర్సిటీ ఇప్పటికీ ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట్వేర్నే వాడుతోంది. ఆప్లోడ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని తప్పుగా గుర్తించే విధానం ఈ సాఫ్ట్వేర్లో లేదని, తప్పులు ఆటోమేటిక్గా గుర్తించే సాఫ్ట్వేర్ను వర్సిటీ ఇప్పటికీ అందిపుచ్చుకోలేదని నిపుణులు అంటున్నారు. మరోవైపు అధ్యాపకులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో జరిగిన పరీక్షలకు దాదాపు రెండు లక్షల వరకు విద్యార్థులు హాజరయ్యారు. అయితే అతి తక్కువ మందితో వాల్యుయేషన్ చేయించడం, వేగంగా మార్కులు అప్లోడ్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జీరో మార్కులు రావడానికి ఇవన్నీ కారణాలై ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. (చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) సాంకేతిక సమస్యలు సరిదిద్దుతాం ఎంతమందికి జీరో మార్కులొచ్చాయో డేటా తెప్పిస్తున్నాం. సమాధాన పత్రాలు పరిశీలిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తాం. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే అవకాశం లేదు. సాంకేతికపరమైన సమస్యలుంటే సరిదిద్దుతాం. విద్యార్థుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – మంజూర్ హుస్సేన్, రిజిస్ట్రార్, జేఎన్టీయూహెచ్ అధ్యాపకులపై ఒత్తిడే కారణం.. వాల్యుయేషన్ నేపథ్యంలో అధ్యాపకులపై విపరీ తమైన ఒత్తిడి ఉంటోంది. వర్సిటీ అధికారులు త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు పరుగులు పెట్టిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తున్నారు. వాల్యుయేషన్కు వెళ్లినా కాలేజీల్లో బోధన చేయాల్సి వస్తోంది. జీరో మార్కులు రావడానికి ఈ పరిస్థితులే కారణమని భావిస్తున్నాం. – అయినేని సంతోష్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం అప్పుడు 82 శాతం.. ఇప్పుడు జీరో ఇంటర్నల్స్లో నాకు 82% మార్కులొచ్చాయి. రెండో ఏడాది మ్యాథ్స్ పేపర్లో సున్నా మార్కులు వేశారు. పరీక్ష బాగానే రాశాను. అందుకే ఇదేం అన్యాయమని కాలేజీ వాళ్లను అడిగాను. జవాబు పత్రం మూల్యాంకనం చేసేది మేము కాదు యూనివర్సిటీ వాళ్లని, అక్కడకెళ్లి అడగాలని చెబుతున్నారు. – సంజయ్, విద్యార్థి, అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధికారులే బాధ్యత వహించాలి వర్సిటీ అధికారుల మొద్దు నిద్రకు ఇది ఓ ఉదాహరణ. ఇంటర్నల్స్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన విద్యార్థులకు ప్రధాన పరీక్షలో సున్నాలు ఎలా వస్తాయి? విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాడటం అన్యాయం. ఇందుకు అధికారులు బాధ్యత వహించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
బయోమెట్రిక్ హాజరు లేకుంటే అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–హైదరాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అప్డేషన్ సిస్టం (ఏబీఏఎస్)ను పక్కాగా అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. నూతన సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలని, నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏబీఏఎస్ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. బోధన సిబ్బంది, పోస్ట్రుగాడ్యుయేషన్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం తప్పకుండా వేలిముద్రలతో కూడిన హాజరు ఇవ్వాలని తేల్చిచెప్పింది.ఏబీఏఎస్ హాజరు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలపై నెలకు రూ.20వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును రద్దు చేసేందుకు సైతం వెనుకాడబోమని జేఎన్టీయూహెచ్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఒక్క పరీక్షతో.. ఏడు వర్సిటీల్లో ప్రవేశం
దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. కోర్సులు ► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది. ► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్/సోషల్ వెల్ఫేర్/ డెవలప్మెం ట్ స్టడీస్ /హెచ్ఆర్ఎం/టూరిజం మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. ► ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి, పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్సీఏ), హిందీ, ఇస్లామిక్ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. ► ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యు కేషన్లో ఎంఈడీ, ఎంపీఈడీ; ► ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. అర్హతలు ► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(బీఏ/బీకామ్/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎల్ఎల్బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి. ► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి. ► ఓపెన్/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు. ► బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ/బీటెక్ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు. ► బీఎస్సీ(ఎంఎల్టీ)/బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్సైన్స్) /బీటెక్/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు. ► బీఈ/బీటెక్ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ , ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సీపీజీఈటీను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుంది. అభ్యర్థి తన అర్హతలను బట్టి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021 ► రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 30.08.2021 ► రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 03.09.2021 ► సీపీజీఈటీ– 2021 పరీక్ష తేది: 08.09.2021 ► వివరాలకు వెబ్సైట్: www.tscpget.com -
ఎక్కడి వారికి అక్కడే ప్రాక్టికల్స్!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలతోపాటు ప్రాక్టికల్స్ను తమ సమీపంలోని కాలేజీల్లో చేసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు జేఎన్టీయూ కసరత్తు చేస్తోంది. కరోనా అదుపులోకి రాకపోవడం, కాలేజీలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు పట్టణ ప్రాంతాల్లో 90 శాతం వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం వరకు విద్యార్థుల హాజరు ఉంటోందని గుర్తించింది. గత మూడు రోజులుగా యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపైన చర్చించింది. ఆన్లైన్ తరగతుల హాజరు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ప్రత్యామ్నాయ తరగతులను నిర్వహించాలని యాజమాన్యాలను ఆదేశించింది. అప్పుడు సెమిస్టర్ పరీ క్షలు నిర్వహించడం సాధ్యం అవుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా యాజమాన్యాల సంసిద్ధతపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించింది. జేఎన్టీయూ పరిధిలోని 180కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కో సెమిస్టర్లో 50 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం, ప్రథమ సెమిస్టర్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రథమ సెమిస్టర్ విద్యార్థులు మినహా మిగతా ఐదు సెమిస్టర్ల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే వారంతా ప్రస్తుతం తాము చదువుతున్న కాలేజీలున్న ప్రాంతాల్లో ఉండటం లేదు. కరోనా కారణంగా తమ తమ జిల్లాలు, గ్రామాల్లోనే ఉంటున్నారు. అక్కడే ఉండి ఆన్లైన్ తరగతులను వింటున్నారు. వారందరికీ వచ్చే ఒకటీ రెండు నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పాఠ్యాంశాల బోధన ఏ మేరకు పూర్తయిందన్న దానిపైనా యాజమాన్యాలతో సమీక్షించింది. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సిలబస్ బాగానే అయినా, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో సగమే అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అదనపు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని యాజమాన్యాలను ఆదేశించింది. ఇక విద్యార్థులు తమ కాలేజీలకు వెళ్లి పరీక్షలు రాయడం, ప్రాక్టికల్స్ చేయడం వంటివి లేకుండా, వారికి సమీపంలో ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన షెడ్యూల్ను సిద్ధం చేస్తోంది. షెడ్యూలు జారీ చేసిన వెంటనే విద్యార్థులు తమకు సమీపంలోని కాలేజీ వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆయా కాలేజీల్లో సెమిస్టర్ పరీక్షలు రాసేలా, ప్రాక్టికల్స్ చేసేలా ఏర్పాట్లు చేయనుంది. -
జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ధర్నా ఫొటోలు
-
‘ఇంజనీరింగ్ పరీక్షలను రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) వద్ద విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.. యూనివర్సిటీ గేటు దాటి విద్యార్థులంతా మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ ఈసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో గత నెల 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలోనూ పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం శుభపరిణామం అని అన్నారు. పరీక్ష నిర్వహణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. -
16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షల (రెగ్యులర్/సప్లిమెంటరీ) తేదీలు ఖరారయ్యాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రెండో సెమిస్టర్ పరీక్షలను తాజాగా ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్ను విడుదల చేసింది. షెడ్యూల్ను వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. బీటెక్, బీ ఫార్మసీలో ఆర్09, ఆర్13, ఆర్15, ఆర్16 సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్ పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పరీక్ష నిర్వహిస్తారు. -
శభాష్.. రాజేష్ కన్నా!
కేపీహెచ్బీకాలనీ: లాక్డౌన్ సందర్భంగా ‘కనెక్ట్– చాన్సలర్’’ పేరుతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆన్లైన్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన జేఎన్టీయూహెచ్ రిసెర్చ్ స్కాలర్ రాజేష్ కన్నాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంస పత్రంతో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రశంసపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కనెక్ట్– చాన్సలర్ పేరుతో పోటీలను నిర్వహించగా రాజేష్ఖన్నా కవితలు, వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జేఎన్టీయూహెచ్లో స్కాలర్గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన రచయితగా రాజేష్కన్నా ఇప్పటికే పలు పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా గవర్నర్ నిర్వహించిన పోటీల్లోనూ ప్రశంస పొందటం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఐటీ కోర్స్.. హైటెక్ జాబ్స్
సాక్షి, సిటీబ్యూరో: జాబ్ మార్కెట్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న సాంకేతిక కోర్సులకు నగరంలో డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం నగరంలో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలోని సుమారు 30 అటానమస్ కళాశాలలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కోర్సులు ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకతపై ఇటీవల ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్.. ఆయా కళాశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన సాంకేతిక కోర్సులు తమ కళాశాలల్లో పరిచయం చేయాలని ఆదేశించింది. వీటిలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఆయా కళాశాలల్లో అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక కోర్సులు... వాటికి విద్యార్థుల నుంచి లభిస్తున్న ఆదరణ, క్యాంపస్ ప్లేస్మెంట్స్, నూతనంగా ప్రవేశపెట్టబోయే కోర్సులపై అటానమస్ కళాశాలలు తమకు నివేదిక సమర్పించాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆదేశించింది. టెకీల చూపు.. హైటెక్ కోర్సుల వైపు విశ్వవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఇటీవల గడగడలాడించిన ర్యాన్సమ్వేర్.. వానా క్రై వైరస్ వంటి ఉపద్రవాలతోపాటు డిజిటల్ యుగంలో పెరుగుతోన్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు, సేవారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, పలు రకాల సేవల సరళీకరణకు ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సులకు ఇటీవలికాలంలో డిమాండ్ బాగా పెరుగుతోంది. హైటెక్సిటీగా పేరొందిన గ్రేటర్ నగరంలోనూ ఇప్పుడిప్పుడే టెకీలు ఈ కోర్సులవైపు దృష్టిసారిస్తున్నారు. బీటెక్,ఎంటెక్ పూర్తిచేసినవారు..ఇప్పటికే ఐటీ,సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నవారు సైతం సైబర్ సెక్యూరిటీ కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ కోర్సులు నేర్చుకున్నవారికి ఆయా కంపెనీలను బట్టి అనుభవాన్ని బట్టి జీతభత్యాలు లభిస్తుండడం విశేషం. నూతనంగా ఉద్యోగంలో చేరిన టెకీ కంటే హైటెక్ కోర్సులు పూర్తి చేసినవారికి రెట్టింపు వేతనాలు లభిస్తున్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం ఇటీవలికాలంలో సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్,నాస్కామ్,జేఎన్టీయూ నిపుణుల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు విడతల వారీగా పలు అంశాలను నేర్పిస్తున్నాము. ఇటీవలి కాలంలో ఈ కార్యక్రమాలకు విద్యార్థులు,టెకీలు,కంపెనీల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. – జయేష్రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి -
‘ఫేక్’ ఫ్యాకల్టీలను తేల్చేస్తాం!
సాక్షి, సిటీబ్యూరో: అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న హెచ్ఓడీలు, అధ్యాపకుల పీహెచ్డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను మరోసారి చూపించాలని జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ పీహెచ్డీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో అనేక కళాశాలల్లో హెచ్ఓడీలు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేవలం మూడు నెలల కాలంలోనే మరోసారి పరిశీలనకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఈ చర్య నకిలీ విద్యార్హతలతో కొనసాగుతున్న వారిలో వణకు పుట్టిస్తోంది. ఇదే విధంగా ఫిర్యాదులు రావడంతో గడిచిన అక్టోబర్ నెలలోనూ ఫ్యాకల్టీ పీహెచ్డీలు, ఇతర విద్యార్హత సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించింది. అయినప్పటికీ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వస్తుండటంతో మరోసారి పక్కాగా నిర్వహించేందుకు సిద్ధం అయింది. దీంట్లో భాగంగానే ఈ నెల 8న మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్యాకల్టీ సభ్యులు యూనివర్సిటీలోని అకాడమిక్ ఆడిట్ సెల్ వద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు స్వయంగా హాజరు కావాలని ఇన్చార్జి రిజిస్ట్రార్ గోవర్దన్ అనుబంధ కళాశాలకు ఆదేశాలు జారీచేశారు. పనితీరు పరిశీలన... తాజా ఆదేశాల ప్రకారం ఫ్యాకల్టీ యూజీ, పీజీ, పీహెచ్డీ, పీహెచ్డీ అడ్మిషన్ లెటర్, సినాప్సిస్ కాపీ, థీసిస్ కాపీ, ప్రీ పీహెచ్డీ పరీక్ష రిజల్ట్ కాపీతో పాటు ఇతర పత్రాలను తీసుకుని స్వయంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ కమిటీ డాక్టరేట్లను పరిశీలించడంతో పాటు, ఫ్యాకల్టీ నైపుణ్యం, పనితీరును తెలుసుకోనున్నారు. తక్కువ వేతనాల కోసం... యూజీసీ నిబంధనల ప్రకారంఒక్కో కళాశాలలో పనిచేస్తున్న 10 శాతం మంది అధ్యాపకులకు పీహెచ్డీ హోదా ఉంటేనే ఆ కళాశాలలకు అక్రిడేషన్ హోదా వస్తుంది. పీహెచ్డీ హోదా ఉన్న అధ్యాపకులను 10 శాతం మందిని కొనసాగించాలంటే కళాశాలల యాజమాన్యాలకు ఆర్ధికంగా మోయలేని భారం అవుతుంది. హెచ్ఓడీ స్థాయిలో పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా డాక్టరేట్ ఉండాల్సిందే. కాబట్టి చాలా కళాశాలలు తక్కువ వేతనాలకు దొరికే వారిని నియమించుకుంటున్నారు. వారి డాక్టరేట్లు, విద్యార్హత సర్టిఫికెట్లను పూర్తిగా పరిశీలించడం లేదు. దీని వల్ల టెక్నికల్ కళాశాలల్లో విద్యాబోధనలో నాణ్యత కొరవడుతుంది. విచారణకు రానివారిని తొలగిస్తాం ఫేక్ సర్టిపికెట్లతో అనుబంధ కళాశాలల్లో కొంత మంది పనిచేస్తున్నారని యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కమిటీని నియమించాం. ఫ్యాకల్టీ వారి డాక్టరేట్లు, ఇతర విద్యార్హత పత్రాలను తీసుకుని వచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ముందు హాజరు కావాలి. ఈ విచారణకు రాని వారిని ఫ్యాకల్టీ జాబితా నుంచి తొలగిస్తాం.– గోవర్దన్, ఇన్చార్జి రిజిస్ట్రార్,జేఎన్టీయూహెచ్ పదేపదే పరిశీలన సరికాదు యూనివర్సిటీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఫ్యాకల్టీలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గడిచిన అక్టోబర్ నెలతో పాటు అంతకుముందు కూడ ఒకసారి ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను పరిశీలించారు. అయినప్పటికీ మరోసారి డాక్టరేట్లు, ఇతర విద్యార్హతలను రుజువు చేసుకోవాలని ఆదేశించడం సరికాదు.– వి.బాలకృష్ణారెడ్డి, తెలంగాణటెక్నికల్ ఎంప్లాయీస్అసోసియేషన్ అధ్యక్షులు -
ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే మేలు
కేపీహెచ్బీకాలనీ: ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే యువతకు మేలు చేకూరుతుందని, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించా లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఎన్ఎస్ఎస్, కూకట్పల్లి ఇస్కాన్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘కిల్ కేన్సర్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేన్సర్ పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వా లు చర్యలు తీసుకోవాలన్నారు. యంగ్ తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే యంగ్ గవర్నర్గా తాను నియమితులు కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదిత రులు పాల్గొన్నారు. కాగా, ఏసు ప్రభువు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని, ఆయన బోధనలు ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
కేపీహెచ్బీకాలనీ: కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మెటలర్జికల్ ఇంజనీరింగ్ (బీటెక్)లో పి.సందీప్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతీయేడు సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో 75శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో భాగంగా అటెండెన్స్ తక్కువగా ఉన్న విద్యార్థులను డిటెండ్ లిస్టులో చేర్చారు. సందీప్ 55శాతం అటెండెన్స్ తో డిటెండ్ అయ్యాడు. తన అటెండెన్స్ ను పెంచాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులపై అతను ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో బుధవారం మరికొందరు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులతో కలసి ప్రిన్సిపల్ సాయిబాబారెడ్డి చాంబర్కు వెళ్లి అటెండెన్స్్స పెంచి పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కోరాడు. అందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో విద్యార్థులతో ఆందోళనకు దిగాడు. ఆందోళనకు దిగిన సందీప్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకోవడంతో తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు సందీప్ను అదుపులోకి తీసుకొని క్యాంపస్ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లి పరీక్షల అనంతరం పోలీస్స్టేష కు తరలించారు. సెమిస్టర్ పరీక్షలకు ముందు డిటెండైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని, వెబ్సైట్లోనూ పెడతామని దీంట్లో మార్పుచేర్పులకు తావులేదని ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి తెలిపారు. గత నెలలో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడంతో ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశానని, ఆ సంఘటనను మనసులో పెట్టుకొని తనపై కావాలనే కుట్రచేసి డిటెండ్ చేశారని సందీప్ ఆరోపించాడు. -
మీ డాక్టరేట్లను రుజువు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: మీ డాక్టరేట్లు (పీహెచ్డీలు) ప్రామాణికమైనవైతే తగు రుజువులు చూపి వాటిని నిరూపించుకోవాలని జేఎన్టీయూహెచ్ తన అనుబంధ కళాశాలల ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీచేసింది.వర్సిటీ అనుబంధ కళాశాలల్లో తప్పుడు పీహెచ్డీలతో లేదా సంబంధిత పట్టాపత్రాలు లేకున్నా కొందరు హెచ్వోడీలుగా, అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారికి చెక్ పెట్టడంతో పాటు, ఉన్నవారి పనితీరు సమీక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. నిజమని తేల్చిన తరువాతే.. దీనిలో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను అందించడం తోపాటు, వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న పీహెచ్డీ పట్టా కలిగిన అధ్యాపక సభ్యులు తమ డిగ్రీలు నిజమైనవని నిరూపించుకోవాలి, అలాగే తమ పనితీరు మూల్యాంకనం కోసం సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ముందు హాజరుకావాలి. కమిటీ సభ్యులు అధ్యాపకుల పీహెచ్డీ డిగ్రీ నిజమైనదా కాదా తేల్చాల్సి ఉంది. అలా ధ్రువీకరణ పొందాకనే వాటిని ఫ్యాకల్టీ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి అనుమతిస్తారు. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. పీహెచ్డీ, ఫ్యాకల్టీల పత్రాలను వర్సిటీకి పంపించే బాధ్యతను అను బంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కమిటీ అప్పగించింది. వీటిని అక్టోబర్ 19లోగా పంపాలి. దీనికోసం పీహెచ్డీలు గల అధ్యాపకులు తమ పీహెచ్డీ పత్రాల హార్డ్ కాపీలతోపాటు వర్సిటీల నుంచి పొందిన సర్టి ఫికెట్లను సమర్పించాలి. పరిశీలించిన తర్వాత వీటిని వర్సిటీకి ప్రిన్సిపాళ్లు పంపించాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య తెలిపారు. నకిలీ అధ్యాపకులకు చెక్:పీహెచ్డీ ఉన్న అధ్యాపకులు హార్డ్ కాపీలను గడువులోగా వర్సిటీకి సమర్పించడంలో విఫలమైతే, వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ కళాశాల ల్లో నకిలీ అధ్యాపకులను తొలగించటానికి ఇది తోడ్పడనుంది. యూజీసీ నిబంధనల ప్రకారం 10% మంది అధ్యాపకులకు పీహెచ్డీ హోదా ఉంటేనే ఆ కళాశాలకు అక్రిడేషన్ వస్తుంది. దీంతో కళాశాలలు పీహెచ్డీ ఉన్న వారినే నియమించుకోవటానికి అవకాశం ఉంటుంది. -
ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ వంటి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలే కాదు.. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లోనూ ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు అందుకు ఓకే చెప్పాయి. వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 కాలేజీలకు ఆమోదం తెలపగా, మరో రెండు కాలేజీలకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్లో విపరీత డిమాండ్ ఉండగా, ఆ నైపుణ్యం ఉన్న వారు 2.5 శాతమే ఉన్నట్లు నేషనల్ ఎంప్లాయిబిలిటీ సర్వేలో తేలింది. 2016లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 89.86 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట ఐఐటీ హైదరాబాద్ ముందుకు వచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు కూడా గత 8 నెలలుగా ఆయా కోర్సులపై కసరత్తు చేశాయి. కోర్సుల డిజైనింగ్, బోధన సిబ్బంది తదితరాలపై ప్రణాళికలు రూపొందించుకుని వర్సిటీల నుంచి ఆమోదం పొందాయి. ఏడు కాలేజీల్లో కొత్త కోర్సులు.. రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన అంశాలతో స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది. ఇక బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక కోర్సుగా సీవీఎస్ఆర్ కాలేజీ, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ను వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, కంప్యూటర్సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సీవీఆర్ కాలేజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులను కిట్స్ కాలేజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సును మల్లారెడ్డి కాలేజీలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో సీవీఎస్ఆర్, విద్యాజ్యోతి, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మల్లారెడ్డి కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండుమూడు రోజుల్లో స్టాన్లీ, కిట్స్ కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతి లభించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి కాలేజీకి 60 సీట్లు.. మొదటిసారిగా కోర్సును ప్రవేశ పెడుతున్నందున 60 సీట్లకే వర్సిటీలు ఆమోదం తెలిపాయి. దీంతో మొత్తంగా ఆయా కాలేజీల్లోని ఆయా కోర్సు ల్లో 480 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 13 ఇంజనీరింగ్ కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇన్నాళ్లు బీటెక్ ఎంబీఏగా ఇంటిగ్రేటెడ్ కోర్సును రద్దు చేసి, ఆ సీట్లను బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కలిపింది. ఇందులో గతంలో 75 సీట్లు మాత్రమే ఉండగా, ఇ ప్పుడు వాటి సంఖ్య 150కి చేరుకోనుంది. బీటెక్తోపాటు ఎంటెక్ కలిగిన ఈ ఐదేళ్ల కోర్సుకు డిమాండ్ ఉండటంతో జేఎన్టీయూ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. -
టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఈసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్లోని జేఎన్టీయూహెచ్లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిల్లో 92.38 శాతం, అబ్బాయిల్లో 89.51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) అంశాల్లో ఈ నెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్ చేసుకోగా 27,123 మంది (96.74 శాతం) హాజరయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ ఎ.వేణుగోపాల్రెడ్డి, ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, టీఎస్ ఈసెట్ కోకన్వీనర్ ఎం.చంద్రమోహన్, కోఆర్డినేటర్ నర్సింహ పాల్గొన్నారు. వరంగల్ విద్యార్థుల ప్రతిభ.. రామన్నపేట: టీఎస్ ఈసెట్లో వరంగల్ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. హన్మకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన జోగం గౌతమ్ మెకానికల్ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు. ఇతను వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. భవిష్యత్లో మెకానికల్ ఇంజనీరింగ్లో రాణిస్తానని పేర్కొన్నారు. కంప్యూటర్ విభాగంలో.. హన్మకొండ కాపువాడకు చెందిన విన్నకోట శ్రీవాణి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని ఏపీ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రాణించాలన్నదే తన లక్ష్యమని విన్నకోట శ్రీవాణి పేర్కొంది. మెరిసిన కవలలు.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన కొండూరు నిర్మల, ఉమామహేశ్వర్ దంపతుల కవల పిల్లలు శ్రీకన్య, శ్రీలేఖ టీఎస్ ఈసెట్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వరంగల్ పాలిటెక్నిక్లో ఈసీఈ పూర్తి చేసిన వీరిద్దరూ ఏపీ, తెలంగాణలో నిర్వహించిన ఈసెట్ పరీక్షలు రాశారు. ఏపీ ఈసెట్లోశ్రీకన్య రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు, శ్రీలేఖ 50వ ర్యాంకు సాధించింది. అలాగే తెలంగాణ ఈసెట్లో శ్రీకన్య రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, శ్రీలేఖ 65వ ర్యాంకు సాధించినట్లు వారి తండ్రి ఉమామహేశ్వర్ వెల్లడించారు. -
మానవ మేధస్సును మించింది లేదు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు చేసిన పరిశోధనలు దేశానికి ఉపయోగపడాలని అప్పుడే వారి చదువుకు సార్థకత లభిస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్, జేఎన్టీయూహెచ్ చాన్స్లర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్లో శుక్రవారం 8వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన గవర్నర్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలుగా మారవద్దని సూచించారు. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన సాంకేతిక వస్తువులు జీవితంలో సౌకర్యాలను సులభతరం చేస్తాయి కానీ మానవ మేధస్సుకు ప్రతి రూపాలు కాలేవని అన్నారు. మానవ మేధస్సును మించింది లేదని ఉద్ఘాటించారు. జేఎన్టీయూహెచ్కు ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. ఇది మనందరికీ గర్వకారణం అని అన్నారు. యూనివర్సిటీలోని ప్రయోగశాలలో నిత్యం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయని వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు నేర్చుకోవడం అనేది నిరంతర అభ్యాసంగా స్వీకరించాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి ఆహార భద్రత, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణకు పరిశోధనలు సాగాలని కోరారు. ఆరోగ్య భద్రతా రంగంలోనూ పరిశోధనలు చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేలా సాంకేతికత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టెక్నా లజీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయనడానికి సైబర్ టెర్రరిజం ఒక ప్రధాన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. సైబర్ టెర్రరిజం నుంచి ముప్పు ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన అన్నారు. ఈ ఏడాది పట్టాలు పొందిన వారు చేసిన పరిశోధనల వివరాలన్నింటినీ తనకు అందించాలని వైస్ చాన్స్లర్ ఎ.వేణుగోపాల్రెడ్డిని కోరారు. పీహెచ్డీ పట్టాల ప్రదానం.. మేనేజ్మెంట్ కోర్సెస్ ఇన్ క్రైమ్ అనే అంశంపై ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) జితేందర్ పీహెచ్డీ పూర్తి చేయడంతో ఆయనకు గవర్నర్ చేతుల మీదుగా పట్టాను అందించారు. ఈ స్నాతకోత్సవంలో 2017–18 సంవత్సరానికి గానూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన 42 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. అదే విధంగా 217 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూహెచ్లో అధ్యాపకుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో 186 అధ్యాపకుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాగా, మిగిలిన 154 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ కానున్నాయి. జేఎన్టీయూహెచ్ హెడ్క్వార్టర్స్తోపాటు హైదరాబాద్, జగిత్యాల, మంథని, సుల్తాన్పూర్లోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ లో భాగంగా ఈ నియామకాలను చేపట్టను న్నారు. జేఎన్టీయూహెచ్లో మొత్తం 410 అధ్యాపక పోస్టులుండగా, తాజాగా ఖాళీల సంఖ్య 260కు పెరిగిందని జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఖాళీలు 186గా ఉన్నప్పుడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఆ తర్వాత జరిగిన పదవీ విరమణలతో ఈ సంఖ్య 260కు పెరిగిందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఈ ఖాళీలు భర్తీ చేస్తా మన్నారు. ఈ నెల 26న జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో సాయంత్రం 3 గంటలకు వర్సిటీ స్నాతకోత్సవం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ యూబీ దేశాయ్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 721 మంది ఎంపికయ్యారన్నారు. మైక్రోసాప్ట్, ఐబీఎం వంటి 52 కంపెనీలు క్యాంపస్ నియామకాల్లో పాల్గొన్నాయని చెప్పారు. -
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిగ్రీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్–2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. శనివారం జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మే 3నుంచి ఆన్లైన్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం టీఎస్టీఎస్, టీసీఎస్ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 పరీక్ష జోన్లుగా విభజించి 54 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నామని, తెలంగాణలో 15 జోన్లు, ఆంధ్రప్రదేశ్లో 3 జోన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆన్లైన్లో మాక్ టెస్ట్కు అవకాశం కల్పించామని, ఇందుకు సెట్ వెబ్సైట్ చూడాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలను ఖరారు చేస్తామని పాపిరెడ్డి చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రస్తుతం ప్రకటించిన పరీక్షల తేదీల్లో ఎన్నికల తేదీలు ఉంటే వాటిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది 2.40 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈసారి మరో 10 వేల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదీ ఎంసెట్ షెడ్యూల్... ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 06–03–2019 దరఖాస్తుల స్వీకరణ గడువు: 05–04–2019 దరఖాస్తులో తప్పుల సవరణ: 06–04–2019 నుంచి 09–04–2019 రూ. 500 అపరాధ రుసుముతో గడువు: 11–04–2019 రూ. 1000 అపరాధ రుసుముతో గడువు: 17–04–2019 ఆన్లైన్లో హాల్టికెట్లు జనరేట్ అయ్యే తేదీ: 18–04–2019 హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం తేదీ: 20–04–2019 హాల్టికెట్ల డౌడ్లోడ్కు చివరి తేదీ: 01–05–2019 రూ. 5,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 24–04–2019 రూ. 10,000 అపరాధ రుసుముతో దరఖాస్తు సమర్పణ గడువు: 28–04–2019 పరీక్ష తేదీలు: ఇంజనీరింగ్ స్ట్రీమ్- మే 3, 4, 6 అగ్రికల్చర్, ఫార్మసీ- మే 8, 9 పరీక్ష సమయం: మార్నింగ్ సెషన్: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫ్టర్నూన్ సెషన్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు: కేటగిరీ ఫీజు వివరాలు ఇంజనీరింగ్ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 అగ్రికల్చర్, ఫార్మసీ ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఇతరులకు రూ. 800 రెండు కేటగిరీలకు ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, ఇతరులకు రూ. 1,600 -
ఇంజనీరింగ్లో 10 వేల సీట్లు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాలేజీల మూసివేత, బ్రాంచీల రద్దుకు యాజమాన్యాల నుంచి వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఈ సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 173 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలోనే 6 వేలకుపైగా సీట్లు తగ్గిపోనుండగా, ఉన్న కాలేజీల్లో మరో 4 వేల వరకు సీట్లు తగ్గనున్నాయి. ఇందుకోసం యాజమాన్యాలే స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నాయి. అందులో బీటెక్లో 26 బ్రాంచీలు, ఎంటెక్లో 66 బ్రాంచీలు, ఎంబీఏలో ఐదు, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో 140 వరకు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు యూనివర్సిటీల అధికారులు అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలతో (ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు చేపట్టనున్నారు. ఆ సమయంలో నిబంధనల ప్రకారం ప్రమాణాలు, సౌకర్యాలు లేకుంటే మరిన్ని సీట్లకు కోత పడే అవకాశం ఉంది. కాలేజీల్లో చేరే సంఖ్యకు అనుగుణంగా కాకుండా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపిన సీట్ల సంఖ్య ప్రకారమే ఫ్యాకల్టీని నియమించాలని గురువారం జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చే క్రమంలో దానినే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమిస్తామని చెబుతున్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కాలేజీలివే.. అల్ హబీబ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అయాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, నిశిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పల్లవి వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విద్యాభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పీఆర్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్, ధ్రువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, షాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా జేఎన్టీయూహెచ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది. కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో నాణ్యత ప్రమాణాలు, నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్నాయా.. లేదా అన్న అంశాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు నిర్వహించి వాటి ఆధారంగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేది. కానీ ఇకపై అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలోనే కాకుండా ఏడాది మొత్తంలో ఎప్పుడైనా తనిఖీలు చేపట్టనుంది. అంతేకాదు తనిఖీల సమయంలో టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించకుండా దొరికినా.. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేకపోయినా.. అనధికారికంగా సెలవులు ఇచ్చినా, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా సెలవులు ఉన్నా కాలేజీ అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. జేఎన్టీయూ తమ పరి«ధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలను శుక్రవారం జారీ చేసింది. అందులో అనుబంధ గుర్తింపు పొందాలనుకునే కాలేజీలు అనుసరించాల్సిన నిబంధనలను పొందుపరిచింది. త్వరలో ‘అనుబంధం’నోటిఫికేషన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయకపోయినా, ల్యాబ్లలో తగిన సదుపాయాలు కల్పించకపోయినా అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది. అఖిల భారత సాంకేతిక విదాయ మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారమే అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ఉంటుందని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని జేఎన్టీయూ వర్గాలు వెల్లడించాయి. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ కానీ బ్రాంచీల మూసివేత అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. అద్దె భవనాల్లో కాలేజీలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రతి 300 మంది విద్యార్థులకు అదనపు ల్యాబ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. కాలేజీల మూసివేతకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కోర్సులు, కాలేజీలు మూసివేసేందుకు ఎన్వోసీ పొందేందుకు యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాలేజీలు తమ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు కోర్సుల వారీ వివరాలను ఈనెల 20లోగా అందజేయాలని తెలిపింది. అటానమస్ కాలేజీలు అమలు చేస్తున్న సిలబస్ వివరాలను కూడా ఇవ్వాలని పేర్కొంది. అధ్యాపకుల వివరాలివ్వాలి కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వివరాలు ఈ నెల 17 లోగా అనుబంధ గుర్తింపు దరఖాస్తుల పోర్టల్కు అప్లోడ్ చేయాలని సూచించింది. కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని, వారి పాన్, ఆధార్ నంబర్లను ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ నంబర్ను అఫీలియేషన్ దరఖాస్తు సమయంలో అందజేయాలని వివరించింది. కాలేజీలు ఆన్లైన్లో దరఖాస్తు చేసినపుడు అప్లోడ్ చేసిన డేటాకు, ఎఫ్ఎఫ్సీలు చేసే వెరిఫికేషన్లో వెల్లడయ్యే డేటా మధ్య అధిక వ్యత్యాసం ఉంటే ఆ కాలేజీ చేసిన అనుబంధ గుర్తింపు దరఖాస్తునే తిరస్కరించనుంది. -
జేఎన్టీయూహెచ్ విద్యార్థ్ధి ఆత్మహత్యాయత్నం
కేపీహెచ్బీకాలనీ: జేఎన్టీయూహెచ్ అనుసరిస్తున్న డిటైన్డ్ విధానంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థి బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేందుకు యత్నించిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలోని స్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న రషీద్ అనే విద్యార్థి గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని నిర్మాణంలో ఉన్న మధుకాన్ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కిన అతను తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న భవనంపైకి ఎక్కి అతన్ని మాటల్లో పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రషీద్ మాట్లాడుతూ మూడు నెలలుగా డిటైన్డ్ విధానం ఎత్తివేయాలని ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నాడు. మూడు నెలలుగా పస్తులుంటూ అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా తమకు మాత్రం న్యాయం చేయడంలేదని ఆరోపించాడు. జేఎన్టీయూహెచ్ విధానాల్లో లోపాలు ఉన్న పట్టించుకోకండా కేవలం విద్యార్థులను క్రెడిట్స్ తక్కువ వచ్చాయని డిటైన్డ్ చేస్తుస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రషీద్ను స్టేషన్కు తరలించి కేసునమోదు చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా..... డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూహెచ్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన డిటైన్ట్ విద్యార్ధులు ఆందోళనలో పాల్గొని యూనివర్శిటీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారితో రిజిస్ట్రార్ యాదయ్యను కలిసి వినతిపత్రం ఇప్పించారు. అయితే అధికారులు క్రేడిట్స్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయికిరణ్, సంతోష్లతో పాటు పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యార్థులకు జేఎన్టీయూ నోట్బుక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ ను జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) పంపిణీ చేయనుంది. తమ ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా సుమారు లక్ష నోట్బుక్స్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. వర్సిటీ నిర్వహించే సెమిస్టర్ పరీక్షలకు హాజరైన వారి జవాబు పత్రాలు, గైర్హాజరైన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం తర్వాత ధ్వంసం చేసేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జవాబు పత్రాలు వృథా కాకూడదనే ఉద్ధేశంతో వర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూడేళ్లుగా గైర్హాజరైన వారి జవాబు పత్రాలతో తయారు చేసిన లక్ష నోటు పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ర్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకాల్లో టెన్త్ తర్వాత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సమాచారం, వర్సిటీ నిర్వహిస్తోన్న సాంకేతిక విద్యా విభాగాల సమాచారం పొందుపరిచినట్లు జేఎన్టీయూహెచ్ తెలిపింది. రెండేళ్ల నిబంధనను పట్టించుకోవటం లేదు సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధన సిబ్బం ది బదిలీల్లో ఉన్నతాధికారులు ‘రెండేళ్ల’ నిబంధనలను పట్టించుకోవటం లేదని టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల సొసైటీ పరిధిలో టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. సోమవారం జోన్ 5, జోన్ 6 పరిధిలోని ప్రిన్సిపాళ్ల ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించగా... మంగళవారం జోన్ 5 పరిధిలోని టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రిన్సిపా ళ్లు, టీచర్లకు మాత్రమే అవకాశం కల్పించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా, ఎస్సీ గురుకుల సొసైటీలో ఐదేళ్లు నిండిన వారికే అవకాశం కల్పించారని వారు ఆరోపిస్తున్నారు. గురువారం జోన్ 6 పరిధిలోని టీచర్లకు కౌన్సెలింగ్ జరుగనుంది. -
ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన కడియం శ్రీహరి
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు. ఫలితాలతో పాటు ఇంటర్ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ర్యాంక్లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్సైట్ లో చూడవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ర్యాంక్లు 1. వెంకట పాని వంశీనాథ్(మాదాపూర్) 2. గట్టు మైత్రేయ (మాదాపూర్) 3.వినాయక (రంగారెడ్డి) 4. హేమంత్ కుమార్ (విశాఖపట్నం) 5.మదన్ మోహన రెడ్డి (విజయవాడ) 6. భరత్ (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం) 7. యస్కర్ (హైదరాబాద్ మదీనాగూడ) 8. రిశీయంత్ (హన్మకొండ) 9. షేక్ వాజిద్ (రంగారెడ్డి) 10.వెంకట మల్లిబాబు (రంగారెడ్డి) అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకులు 1. నమ్రత -కర్నూలు 2. సంజీవ్ కుమార్- హైదరాబాద్ 3. శ్రీఆర్యన్, ఆర్మూర్ 4.సంజన -మల్కాజ్గిరి 5. జయసూర్య-హైదరాబాద్ 6. గంజికుంట శ్రీవత్సావ్-ఆదోని 7. విచిత్- గోదావరి ఖని 8. అనగ లక్ష్మి- దిల్ సుఖ్ నగర్ 9. శ్రీ చైతన్య- కరీంనగర్ 10.సత్యశ్రీ సౌమ్య- ఖమ్మం -
ఈనెల 19న ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఎంసెట్ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రేపే ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సాంకేతిక విద్యా శాఖ కసరత్తు వేగవం తం చేసింది. శుక్రవారం(18న) ప్రవేశాల నోటిఫికేషన్ను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్టీయూహెచ్ చర్యలు చేపట్టింది. దీంతో ఈ నెల 26 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని భావిస్తోంది. 26 నుంచి సాధ్యం కాకపోతే 28 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ గురువారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఆ సమావేశానికి జేఎన్టీయూహెచ్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు జేఎన్టీయూహెచ్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపునకు సంబంధించి జేఎన్టీయూహెచ్ ఇచ్చే సమాచారాన్ని బట్టి షెడ్యూల్ను ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనుబంధ గుర్తింపు ప్రక్రియ షురూ! జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 110 కాలేజీలకు గుర్తింపును జారీ చేసినట్లు తెలిపింది. -
వర్సిటీల ‘పరిధి’ మార్పులపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల భౌగోళిక పరిధుల మార్పులపై ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు చేయాల్సిన మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమగ్ర అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా వర్సిటీల పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు మించి ఉండటానికి వీల్లేదని, అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న వర్సిటీలకు నిధులను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండో దశ రూసా సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యూనివర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలను ఎలా తగ్గించాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 500కు పైగా అనుబంధ కాలేజీలు ఉండగా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనూ 300కు పైగా కాలేజీలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేఎన్టీయూహెచ్ పరిధిలో 280కి పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిధిలోని కాలేజీలను కొన్నింటిని ఇతర యూనివర్సిటీల పరిధిలోకి తీసుకెళ్లేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీలైనన్నిమార్పులు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పాత వరంగల్ జిల్లాతోపాటు పాత ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నుంచి పాత ఆదిలాబాద్లోని కొన్ని కొత్త జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని మçహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్చేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓయూ పరిధిలోని జిల్లాలు కొన్నింటిని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్పు చేసేలా చర్యలు చేపడుతోంది. అయితే ఇలా మార్పులు చేసినా ఓయూ, జేఎన్టీయూహెచ్ పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు పైగానే ఉండే అవకాశం ఉంది. దీంతో వీటిపై ఏం చేయాలన్న దానిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడ ఒక్కో యూనివర్సిటీని వేర్వేరు పేర్లతో విభజించారు. అదే విధానంలో ఇక్కడ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. పరిధుల మార్పు ప్రతిపాదనలు కూడా త్వరలోనే పంపించాలని భావిస్తోంది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలోనూ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. -
గురుకులాల నియామక బోర్డుకు తుదిరూపు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకాలకు సంబంధించి రాష్ట్ర గురుకుల విద్యాలయాల సిబ్బంది నియామక బోర్డు (టీఎస్ఆర్ఈఐఆర్బీ) ఏర్పాటుకు ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. గురు కుల పాఠశాలల్లో బోధన సిబ్బంది నియామకా న్ని టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా ప్రత్యేక బోర్డు ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సోమవారం సీఎం కార్యాలయంలో బోర్డు ఏర్పాటుకు సంబంధించి గురుకుల సొసైటీల కార్యదర్శులు, పలువురు ఉన్నతాధికారుల తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోర్డు ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అధికారులు చర్చించారు. బోర్డు కన్వీనర్ నియామకం కొలిక్కి! నియామకాల ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం టీఎస్ఆర్ఈఐఆర్బీని ఏర్పాటు చేస్తోంది. బోర్డుకు కన్వీనర్గా ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్కుమార్ పేరును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. బోర్డు ఏర్పాటు ఫైలుకు సీఎం ఇప్పటికే ఆమోదముద్ర వేశారని, స్వల్ప మార్పులు చేసి 3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. ప్రశ్నపత్రాల తయారీ, సిలబస్ తదితర అంశాలపై జేఎన్టీయూహెచ్కు బాధ్యతలు అప్పగించాలని ప్రభు త్వం భావిస్తోంది. అయితే ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. మెజారిటీ అధికారులు జేఎన్టీయూహెచ్కు ఇవ్వాలని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాక ఆయన నిర్ణయం ఆధారంగా ఖరారు చేసే అవకాశముంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించాలంటే దాదాపు 5 వేల ఖాళీలను భర్తీ చేయాలి. బోర్డు ఏర్పాటైతే ఈ పోస్టులన్నీ భర్తీ చేయొచ్చని, ఈ మేరకు వరుస నోటిఫికేషన్లు వెలువరిచే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. -
సృజనాత్మకతదే భవిష్యత్..
కేపీహెచ్బీకాలనీ: గ్లోబలైజేషన్తో ప్రపంచం కుగ్రామంగా మారిందని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సాంకేతిక ఉత్సవాలు దోహపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సాంకేతిక ఉత్సవాలు బుధవారం వర్శిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల ప్రారంభోత్సవానికి నేషనల్ ఇన్సూరెన్స్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎల్. వెంకటరావు, జిటాటెక్ అధినేత ఆర్.శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చీర కట్టు.. అదిరేట్టు.. కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు.. ప్రిన్సిపల్ ఇ.సాయిబాబారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావుతో కలిసి వారు వేడుకను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువులు పూర్తికాగానే ఎంటర్ప్రెన్యూర్లుగా ఎలా ఎదగాలో ముందుగానే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ జాతీయ విద్యార్థి సదస్సుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రోమోలను ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శించారు. కాగా సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, మేనేజ్మెంట్ విద్యార్థులు వేడుకలో విభిన్నంగా సందడి చేశారు. -
11 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేత!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు తక్కువగా ఉన్న, విద్యార్థులు లేని ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 11 ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయాలని నిర్ణయించాయి. 2018–19 విద్యా సంవత్సరంలో తమకు అనుబంధ గుర్తింపు అవసరం లేదని, తమ కాలేజీలు మూసివేసుకుంటామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని జేఎన్టీయూహెచ్కు దరఖాస్తు చేసుకున్నాయి. అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు యాజమాన్యాల నుంచి జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా 266 ఇంజనీరింగ్ (బీటెక్) కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, 11 కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలు, ఫ్యాకల్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు జేఎన్టీయూహెచ్ సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) తనిఖీల్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే కాలేజీలకు, సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. ఈసారి కొత్త కోర్సులను ఇచ్చేది లేదని ఏఐసీటీఈతోపాటు జేఎన్టీయూహెచ్ కూడా చెబుతుండటం, గడిచిన మూడేళ్లలో 25 శాతం లోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు సీట్ల సంఖ్య భారీగా తగ్గనుంది. బ్రాంచీల రద్దుకు మరిన్ని కాలేజీలు.. 8 ఇంజనీరింగ్ కాలేజీలు 11 రకాల బీటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. డిమాండ్ లేని కోర్సులను మూసి వేసుకుంటామని వెల్లడించాయి. దీంతో భారీ గా సీట్లు రద్దు కానున్నాయి. అలాగే 28 ఎంటెక్ కాలేజీల్లోనూ 77 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంలో 15 వేల వరకు ఎంటెక్లో సీట్లు ఉండగా గతేడాది వాటిని జేఎన్టీయూహెచ్ 5,400కు పరిమితం చేసింది. ఈసారి 77 బ్రాంచీల రద్దుతో ఎంటెక్ సీట్ల సంఖ్య 3 వేల లోపే ఉండే అవకాశం ఉంది. మరోవైపు 4 ఫార్మసీ కాలేజీలు 7 బ్రాం చీలను, ఒక ఎంబీఏ కాలేజీ ఒక బ్రాంచీని, 3 ఎంసీఏ కాలేజీలు 3 బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. 25 శాతం లోపు ప్రవేశాలు.. జేఎన్టీయూహెచ్ పరిధిలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కాలేజీలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. 30 శాతం ప్రవేశాలు ఉన్న కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని, వాటిని మూసివేయాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకోగా, 25 శాతం లోపు ప్రవేశాలు ఉన్న కాలేజీలను మూసివేయాలని జేఎన్టీయూహెచ్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అలాంటి కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. -
సీఐఐతో జేఎన్టీయూహెచ్ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యా భివృద్ధికి జేఎన్టీయూహెచ్ సరికొత్త కార్యచరణకు ఉపక్రమించింది. విద్యార్థులు కోర్సు పూర్తికాగానే ఉద్యోగం పొందాలంటే.. ఇంజనీరింగ్ కొనసాగుతున్న సమయంలోనే వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. ఇందుకు పరిశ్రమల సహకారాన్ని తీసుకు నేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. కోర్సుకు సంబంధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సంబంధిత పరిశ్రమల్లో ప్రాజెక్టు, అప్రెంటిస్షిప్నకు అవకాశం కల్పిస్తారు. పారిశ్రామిక వేత్తలు, సీనియర్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జేఎన్టీయూహెచ్, సీఐఐల మధ్య ఒప్పందంతో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోతాయని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ సీట్లపై అదే ఉత్కంఠ!
- కాలేజీలు, సీట్ల జాబితాపై జేఎన్టీయూహెచ్ జాప్యం - 14 లేదా 15న జాబితా.. 75 వేల సీట్లకు అనుమతి? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏయే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తారన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. గడిచిన ఐదారేళ్లుగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలు, సీట్ల వివరాలపై జేఎన్టీయూహెచ్ చివరి క్షణం వరకూ జాప్యం చేస్తూ వస్తోంది. ఈసారి అదే పరిస్థితి. రాష్ట్రంలోని 250 కాలేజీలు, వాటిల్లోని 1,26,315 సీట్లకు నెల రోజుల కిందటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుబంధ గుర్తింపునిచ్చింది. అయితే కాలేజీల్లో సదుపాయాలు పరిశీలించి అనుబంధ గుర్తింపు ఇవాల్సిన యూనివర్సిటీలు మాత్రం ఆలస్యం చేస్తున్నాయి. ఎట్టకేలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కాలేజీలు, వాటిల్లోని దాదాపు 10 వేల సీట్ల జాబితాలను మంగళవారం ఉన్నత విద్యా మండలికి అందజేశాయి. కానీ 95 శాతం కాలేజీలు, సీట్లున్న జేఎన్టీయూ మాత్రం మంగళవారం రాత్రి వరకూ జాబితాలివ్వలేదు. అయినా ఉన్నత విద్యా మండలి 12 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించింది. 16 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు షెడ్యూలు జారీ చేసింది. కౌన్సెలింగ్ ఆగిపోతుందని.. ఈ నెల 10 నాటికే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలిస్తామన్న జేఎన్టీయూ ఇంతవరకూ ఇవ్వలేదు. కాలేజీలు, సీట్ల వివరాల జాబితాలను ముందుగానే ఇస్తే యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని, కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగిపోయే పరిస్థితి ఉంటుందని చివరి క్షణం వరకు జాబితా ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈనెల 14 లేదా 15వ తేదీ రాత్రికి జాబితాలిచ్చే అవకాశం ఉందని, 75 వేల ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్ని కాలేజీలు, సీట్లకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు ఇస్తుందోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏఐసీటీఈ 1.39 లక్షల సీట్లకు అనుమతిచ్చినా.. 1.04 లక్షల సీట్లలో ప్రవేశాలకే వర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. నేడు 16,001– 26 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్ ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో భాగంగా ఈ నెల 14న 16,001 ర్యాంకు నుంచి 26 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. నిర్ణీత హెల్ప్లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. స్పెషల్ కేటగిరీలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారికి ఒకటి నుంచి 36 వేల ర్యాంకు వరకు, క్యాప్లో ఒకటి నుంచి 40 వేల ర్యాంకు వరకు సాంకేతిక విద్యాభవన్లో బుధవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. సోమ, మంగళవారాల్లో ఒకటి నుంచి 16 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్కు పిలువగా.. 10,279 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారని క్యాంపు అధికారి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 9,172, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 710, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 342, నాన్ లోకల్స్ 55 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. గతేడాది ఒకటో ర్యాంకు నుంచి 16 వేల ర్యాంకు వరకు 9,566 మంది వెరిఫికేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. -
ఈసెట్ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లు మాయం!
- వెబ్సైట్లో లింకును తొలగించిన జేఎన్టీయూహెచ్ - అందరికీ రీఎగ్జామ్కు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల వినతి సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్ ఎంట్రీ) ఈ నెల 6న నిర్వహించిన ఈ సెట్ మార్కుల గల్లంతు వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మంది విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ జేఎన్టీయూహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేవలం 3 గంటల పరీక్ష రాయని, 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించని వారే రీ ఎగ్జామ్కు అర్హులని జేఎన్టీయూ ప్రకటించడంతో నష్టపోయిన విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా అలాంటి విద్యార్థులు కేవలం 130 మంది మాత్రమే ఉన్నారని వారికే వచ్చే నెల 4న మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే జేఎన్టీయూహెచ్ విధించిన నిబంధనల ప్రకారమే మంగళవారం వరకు 530 మంది వరకు విద్యార్థులు రీఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 3 గంటలపాటు పరీక్ష రాసినా, 200 ప్రశ్నలకు జవాబులను గుర్తించినా ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లో కేవలం 80 నుంచి 100 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్లు ఉండడంతో వారంతా తీవ్ర గందరగోళంలో పడ్డారు. వాస్తవానికి వారికి 120కి పైగా మార్కులు రావాల్సి ఉన్నా, ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ సరిగా కాకపోవడంతో కేవలం 80 నుంచి 100 ప్రశ్నలకు సంబంధించి 50 నుంచి 60 మార్కులే ర్యాంకు కార్డుల్లో చూపించడంతో వారంతా లబోదిబోమంటున్నారు. తమకు రీ ఎగ్జామ్కు అవకాశం కల్పించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా మొదట నష్టపోయిన విద్యార్థులు 120 మంది మాత్రమే ఉన్నారని జేఎన్టీయూహెచ్ చెప్పినా.. మొత్తం పరీక్ష రాయని వారు 530కి పైగా ఉన్నట్లు తాజా దరఖాస్తులతో బయట పడింది. నష్టపోయిన విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోందని గ్రహించిన అధికారులు ఈ సెట్ వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ల లింకును తొలగించారు. కొంత మంది విద్యార్థులకు ఇంకా ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. జేఎన్టీయూహెచ్, కంప్యూటర్ ప్రాసెసింగ్ సంస్థ చేసిన తప్పిదాలకు తాము నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కల్పించుకుని వచ్చే నెల 4న నిర్వహించే రీఎగ్జామ్కు అందరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. -
రేపు ఎంసెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్టీయూహెచ్లో ఫలితాల విడుదలకు కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 12న ఎంసెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,41,190 మంది దరఖాస్తు చేసుకోగా, 1,39,100 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,061 మంది దరఖాస్తు చేసుకోగా, 73,601 మంది పరీక్ష రాశారు. -
ఇంజనీరింగ్లో 14 వేల సీట్ల కోత!
- 2017–18లో 242 కాలేజీల్లోని 1.24 లక్షల సీట్లకే అనుమతి - వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి 14 వేల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత విధించింది. గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 33 కాలేజీలకు అనుమతులు తగ్గగా, వాటిల్లోని 14 వేల సీట్లకు కోత ఏఐసీటీఈ పెట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్య కాలేజీలకు ఏఐసీటీఈ తాజాగా అనుమతులు జారీ చేసింది. గతేడాదితో పోల్చితే బీ ఫార్మసీలో 2 వేలు, ఎంబీఏలో 5 వేలు, ఎంసీఏలో 1,500కు పైగా సీట్లకు కోత పడింది. ఎంటెక్లోనూ 7 వేల సీట్లకు అనుమతులి లభించలేదు. ఎంఫార్మసీలో వేయి, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 వేల సీట్లకు కోత పడింది. అయితే త్వరలో మరిన్ని కాలేజీలు, సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాగా, ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్లలో సీట్ల సంఖ్య పెరిగింది. హుస్నాబాద్ కొత్త పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి లభించింది. గతేడాది రాష్ట్రంలో 56 ప్రభుత్వ పాలిటెక్నిక్లలో 11,980 సీట్లు ఉండగా, ఈసారి 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 12,100 సీట్లకు అనుమతి వచ్చింది. ఇంజనీరింగ్లో 242 కాలేజీల్లోని 4,613 బ్రాంచీలకు అనుమతి లభించింది. మరింతగా తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు.. రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలోని 275 కాలేజీల్లో 1,38,168 సీట్లకు అనుమతినిచ్చిన ఏఐసీటీఈ.. ఈసారి 242 కాలేజీల్లోని 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. మరోవైపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం తనిఖీ నివేదికల పరిశీలన జరుపుతోంది. వాటిలో లోపాలున్న కాలేజీలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. దీనికితోడు సీట్లు, బ్రాంచీల తగ్గింపునకు 81 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 11 కాలేజీలు పలు కోర్సులు, ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపేసేందకు (క్లోజర్) దరఖాస్తు చేసుకున్నాయి. ఆ ప్రకారం మరో 20 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎంటెక్లోనూ భారీ కోత.. ఎంటెక్లో అనుమతులు పొందిన కాలేజీల సంఖ్య తగ్గడంతో ఈసారి 7 వేల వరకు సీట్లకు కోత పడింది. గతేడాది 264 ఇంజనీరింగ్ కాలేజీల్లో 32,086 ఎంటెక్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతివ్వగా ఈసారి 203 ఇంజనీరింగ్ కాలేజీలకు, వాటిల్లో 25,140 సీట్లకే అనుమతులు మంజూరు చేసింది. కాగా, కాలేజీల్లో లోపాల కారణంగా జేఎన్టీయూహెచ్ మరిన్ని సీట్లకు కోత పెట్టే అవకాశముంది. -
తట్టుకోలేం.. తప్పుకుందాం!
- జేఎన్టీయూహెచ్ నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్న కాలేజీలు - సమీప వర్సిటీల నుంచి అఫిలియేషన్ తీసుకునేందుకు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల యత్నం - జేఎన్టీయూ నిబంధనలు, తనిఖీల నుంచి తప్పించుకునే ఎత్తుగడ - ఇప్పటికే అర్జీలు పెట్టుకున్న 19 కాలేజీలు కాలేజీ వ్యవహారాల కోసం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు పలు దఫాలుగా రావడం అసౌకర్యంగా ఉంది. ఇందుకు సమయం వృథా కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కాలేజీకి దగ్గరలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని భావిస్తున్నాం. అందుకు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం)తో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.ఇటీవల జేఎన్టీయూహెచ్కు కరీంనగర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్న దరఖాస్తు సారాంశమిది. సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) నుంచి కొన్ని ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిష్క్రమించాలని యోచిస్తున్నాయి. దూరాభారం, సమయ పాలనలో సమస్యల్ని సాకుగా చూపుతూ సమీపంలో ఉన్న వర్సిటీల నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం అనుమతి ఇవ్వాలంటూ వర్సిటీకి వినతులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. వర్సిటీ మార్పు కోసం పెద్ద సంఖ్యలో కాలేజీలు దరఖాస్తు చేసుకోవడంపై జేఎన్టీయూహెచ్ యంత్రాంగం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రఖ్యాత వర్సిటీ గుర్తింపు కాకుండా చిన్నపాటి వర్సిటీల వైపు కాలేజీల చూపేంటని సందిగ్ధంలో పడింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 315 ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ (ఎంబీఏ, ఎంసీఏ) కాలేజీలు ఉండగా, ఇందులో 147 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తప్పించుకునేందుకేనా? రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో సగానికిపైగా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు కాలేజీల అఫిలియేషన్ విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూ తనిఖీలు కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో వసతులు సరిగ్గా లేని కాలేజీలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాజమాన్యాలు జేఎన్టీయూ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వర్సిటీ మార్పు తెర మీదకు తీసుకొచ్చాయి. జేఎన్టీయూ నుంచి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, కాలేజీకి సమీపంలో ఉన్న వర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవాలని ఎత్తుడగ వేశాయి. ఈ క్రమంలో వర్సిటీ మార్పు కోసం జేఎన్టీయూకు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. ఇప్పటివరకు 19 కాలేజీలు వర్సిటీ మార్పును కోరుతూ వినతులిచ్చాయి. ఆచితూచి అడుగులు యూనివర్సిటీ మార్పు అంశం చిన్నదే అయినా జేఎన్టీయూ మాత్రం నిశితంగా పరిశీలిస్తోంది. దరఖాస్తు చేసుకున్న కాలేజీల పరిస్థితి, మౌళిక వసతులు తదితర అంశాలను లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకో నుంది. ఈ మార్పులతో కాలేజీల సంఖ్య తగ్గితే వర్సిటీ పరపతిని ప్రభావితం చేస్తుం ది. అధిక సంఖ్యలో కాలేజీలు, పెద్ద ఎత్తున పరిశోధనలతో ఉన్న జేఎన్టీయూ నుంచి కాలేజీలు నిష్క్రమిస్తే పరిధి చిన్నది కావడంతోపాటు కార్యక్రమాలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో వర్సిటీల మార్పు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జేఎన్టీయూ ఆచితూచి వ్యవహరిస్తోంది. కాలేజీల సంఖ్య తగ్గడంతో న్యాక్(నేషనల్ అసిస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఇచ్చిన ‘ఏ’ గ్రేడ్కూ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాలేజీల్లో ప్రమాణాలు సైతం తగ్గుతాయని ఆందోళన చెందుతోంది. దీంతో తమ పరిధిలోని కాలేజీలను ఇతర వర్సిటీల పరిధికి వెళ్లనివ్వకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాలేజీల నుంచి వచ్చిన అర్జీలను ప్రభుత్వానికి, ఉన్నత విద్యా మండలికి నివేదించాలని నిర్ణయించింది. మార్పు ప్రక్రియను ఆమోదిస్తే మరిన్ని కాలేజీలకు అవకాశం కల్పించినట్లవుతుందని భావిస్తున్న జేఎన్టీయూహెచ్ ఆ మేరకు ప్రభుత్వానికి సూచన చేసేందుకు సిద్ధమవుతోంది. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
-
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్లో స్వీకరణ మే 12న పరీక్ష.. అదేనెల 22న ర్యాంకుల ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్–2017 షెడ్యూల్ జారీ అయింది. మే 12న నిర్వహించనున్న ఎంసెట్కు వచ్చేనెల 3 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. సోమవారమిక్కడ జేఎన్టీయూహెచ్లో జరిగిన ఎంసెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.250 చెల్లించాలి. ఇతర విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ నిర్వహణ కోసం 25 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 6, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 16, ఆంధ్రప్రదేశ్లో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కర్నూలులోనూ సమన్వయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ఈసారి ఇవ్వలేదు. మహబూబ్నగర్, వనపర్తి సమన్వయ కేంద్రాలు సమీపంలోనే ఉండటం, కర్నూలులో పరీక్ష రాసే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున అక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని విలేకరుల సమావేశంలో పాపిరెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా నిర్మల్, భువనగిరి, శంషాబాద్, పెద్దపల్లిలో సమన్వయ కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్లో 2 జోనల్ కేం ద్రాలను తగ్గించినట్లు పేర్కొ న్నారు. గతేడాది ఎంసెట్ లీకేజీ నేపథ్యంలో ప్రశ్నపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో ఎంసెట్ కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.మల్లేశం, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్, కో–కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్పై ఆరోగ్య శాఖకు లేఖ రాస్తాం నీట్ పరిధిలోకి ఆయుష్ కోర్సులు వెళ్లే విషయంలో తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని పాపిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల తోపాటు ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి, యోగా) కోర్సులకు ఎంసెట్ చేపడుతున్నామన్నారు. ఆయుష్పై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తారా? తాము ఎంసెట్ నిర్వహించాలా? అన్న అంశాన్ని అడుగుతామని, వారి నుంచి వచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు చేపడతామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుతించబోమని, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈసారి గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు. మే నెలాఖరుకల్లా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించామని, ఈసారి త్వరగా ప్రవేశాలు చేపట్టి జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 2018 నుంచి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ప్రవేశాలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్లో ఆన్లైన్ పరీక్షలు భవిష్యత్లో ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో చేప ట్టేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్రెడ్డి తెలి పారు. గతేడాది అగ్రికల్చర్ ఎంసెట్ను ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో నిర్వ హించినా... ఈసారి ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. ఏపీలో అన్ని పరీక్షలను ఆన్లైన్లో నిర్వ హించేందుకు చర్యలు చేపట్టారని, అక్కడి ఫలి తాలను పరిశీలించి, భవిష్యత్లో అవసర మైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసారి ఈసెట్, పీజీఈసెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిం చేందుకు చర్యలు చేపట్టామన్నారు. -
మరింత తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు!
♦ బ్రాంచీల రద్దుకు 80కి పైగా కాలేజీల దరఖాస్తు ♦ ప్రవేశాల రద్దుకు దరఖాస్తు చేసిన మరో 11 కాలేజీలు ♦ దరఖాస్తులను పరిశీలిస్తున్న జేఎన్టీయూహెచ్ ♦ నెలాఖరులో ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు షురూ! ♦ కాలేజీల గుర్తింపు నోటిఫికేషన్ జారీ చేసిన ఏఐసీటీఈ ♦ ఈనెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ సీట్లు భారీగా తగ్గనున్నాయి. 11 కాలేజీల వరకు ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జవహర్లాల్ నెహ్రూ సాంకే తిక విశ్వ విద్యాలయం–హైదరాబాద్ (జేఎన్టీ యూహెచ్)కు దరఖాస్తులు వచ్చాయి. కాలేజీల్లో కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ గడువు డిసెంబరు 27వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జేఎన్టీయూహెచ్ ఇచ్చే ఎన్వోసీతో కాలేజీ యాజమాన్యాలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోనున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 219 కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి మరింతగా సీట్లు తగ్గిపోనున్నాయి. గుర్తింపునకు ఏఐసీటీఈ నోటిఫికేషన్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి సాంకేతిక విద్యా కాలేజీ యాజమాన్యాలు గుర్తింపు, కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు, కాలేజీల షిఫ్టింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుముతో (పాత కాలేజీలు) వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. కాలేజీల అనుమతుల ప్రక్రియను పిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారం భిస్తామని, ఏప్రిల్ 10 లోగా పూర్తి చేస్తామని ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ అలోక్ ప్రకాశ్ మిట్టల్ ఆ నోటిఫికేషన్లో వివరించారు. కసరత్తు వేగవంతం చేసిన జేఎన్టీయూహెచ్ ఏఐసీటీఈ నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రంలో యూనివర్సిటీ నుంచి కాలేజీలు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్) పొందే ప్రక్రియపైనా జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల నిర్ణ యించింది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించి.. మరోవైపు తనిఖీలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో తనిఖీలను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 25 నుంచి కాలేజీల్లో తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉంది. వీలైతే కలసి.. లేదంటే సమాంతరంగా తనిఖీలు ఏఐసీటీఈ బృందాలు కాలేజీల్లో సదుపాయాలపై తనిఖీ చేయనున్నాయి. వీలైతే ఏఐసీటీఈ బృందాలతో జేఎన్టీయూహెచ్ ఎఫ్ఎఫ్సీ బృందాలు కలసి తనిఖీలు చేసే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అనుమతుల ప్రక్రియ, కాలేజీల తనిఖీలను ఏఐసీటీఈ ప్రారంభించనుంది. దీంతో కలసి తనిఖీలు చేపట్టే అంశంపై ఏఐసీటీఈతో మాట్లాడేందుకు జేఎన్టీయూహెచ్ సిద్ధమవుతోంది. తద్వారా కాలేజీల్లో సదుపాయాలు, లోపాలు, సమస్యలపై తనిఖీలను మరింత పక్కాగా, పారదర్శకంగా చేపట్టవచ్చని భావిస్తోంది. అలా వీలుకాకపోతే సొంతంగా తనిఖీలు జరపనుంది. మే నెలలో యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయనుంది. జూన్ 1వ తేదీకల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. -
జూన్లోనే ఇంజనీరింగ్ ప్రవేశాలు!
జనవరి 1 నుంచి 31 వరకు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపునకు దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు కాలేజీల్లో నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు ఏప్రిల్లోగా కాలేజీలతో సంప్రదింపులు పూర్తి మే నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఆలస్యం కాకుండా ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జూన్లోనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన యూని వర్సిటీలను అందుకు సమాయత్తం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు దరఖాస్తుల ప్రక్రియను ప్రారం భించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. కాలేజీల అనుబంధ గుర్తింపునకు షెడ్యూల్ ఖరారు చేయ డంతోపాటు గుర్తింపు ఇచ్చే క్రమంలో అమలు చేయాల్సిన నిబంధనలపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్టీయూహెచ్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా చర్చించింది. పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఎంటెక్ కోర్సులకు ప్రతి బ్రాంచ్కు పీహెచ్డీ అర్హతగల ఇద్దరు ప్రొఫెసర్లు ఉండాలని, బీటెక్లో ప్రతి బ్రాంచ్కు పీహెచ్డీ విద్యార్హతగల ప్రొఫెసర్ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని... లేదంటే అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. మంజూరైన సీట్ల మేరకు కాకుండా, కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా అందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించినట్లు సమాచారం. ముందుగానే తనిఖీలు... వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులిచ్చే ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించేలా జేఎన్టీయూహెచ్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఏఐసీటీఈతో సంప్రదించిన అధికారులు వారి సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదట్లో లేదా నెలాఖరులో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఏఐసీటీఈ జారీ చేయనుంది. ఆ జాబితా సాంకేతిక విద్యాశాఖకు అందేలోపే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా జేఎన్టీయూ హెచ్ చర్యలు చేపట్టింది. జాబితా అందిన వెంటనే మే నెలలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు పత్రాలను జారీ చేసి ప్రవేశాలకు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అనుబంధ గుర్తింపు షెడ్యూల్ను కాలేజీ యాజమాన్యాలకు తెలిపి అందుకు సిద్ధంగా ఉండా లని సూచించినట్లు తెలిసింది. జనవరి 1 నుంచి 31 వరకు కాలేజీల నుంచి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలియజేసినట్లు సమాచారం. అదే నెల 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిజనిర్ధారణ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేపడతామని తెలియజేసినట్లు తెలిసింది. వీలైతే తనిఖీలను ఏఐసీటీఈ బృందాలతో కలిపి చేసేందుకు ప్రయ త్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏప్రిల్ నెలా ఖరులోగా కాలేజీల యాజమాన్యాలతో ఎఫ్ఎఫ్సీ నివేది కలపై చర్చలు జరిపి లోపాలను సవరించుకునేలా అవకాశం ఇవ్వను న్నట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపు పత్రాలను మే మొదటి వారం నుంచి చివరిలోగా జారీ చేసి జూన్ 1కల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. -
సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా
హైదరాబాద్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో శుక్రవారం జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్(డీఈ) ఆంజనేయప్రసాద్ వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, మొదటి సెమిస్టర్ పరీక్ష సెప్టెంబర్ 16వ తేది మధ్యాహ్నం, రెండో సెమిస్టర్ పరీక్ష అదే రోజు ఉదయం నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బీటెక్, బీఫార్మసీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఫెయిల్.. ఆబ్సెంట్.. కాదు పాస్!
♦ జేఎన్టీయూహెచ్లో బీటెక్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల పరిస్థితి ఇదీ.. ♦ ఏప్రిల్లో రాసిన పరీక్షల ఫలితాల కోసం 600 మంది ఎదురుచూపు ♦ కొందరి ఫలితాలు వెల్లడించినా.. అందులోనూ గందరగోళమే.. ♦ రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం 16 వేల మంది దరఖాస్తు ♦ ఆ ఫలితాలు వెల్లడించకుండానే సప్లిమెంటరీ సాక్షి, హైదరాబాద్: నయీఫ్ అనే విద్యార్థి బీటెక్ ఫస్టియర్ పరీక్షలు రాస్తే ఫలితాల్లో ఇంగ్లిష్ పరీక్షకు హాజరు కాలేదని (ఆబ్సెంట్) వచ్చింది. దీంతో ఆలస్య రుసుము రూ.5,000 చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నాడు. హాల్టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్తే.. ఫెయిల్ అయిన వారి లిస్టులో నీ పేరు లేదు ‘నువ్వు పాసయ్యావు’ వెళ్లొచ్చని చెప్పారు.. ఇదీ జేఎన్టీయూహెచ్లో బీటెక్ విద్యార్థుల పరిస్థితి! ఇలాంటి విచిత్రాలు జేఎన్టీయూహెచ్లో రోజుకోరకంగా చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఫెయిలైతే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవడం సహజం. కానీ కొంతమంది బీటెక్ ఫస్టియర్ విద్యార్థులు ఏప్రిల్లో రాసిన పరీక్షల ఫలితాలను ఇప్పటికీ విడుదల చేయని జేఎన్టీయూహెచ్.. శుక్రవారం నుంచి అఫిలియేటెడ్ కాలేజీల్లో అదే బీటెక్ ఫస్టియర్ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తోంది. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. మరోవైపు వెల్లడించిన ఫలితాలపై సందేహాలున్న సుమా రు 16 వేల మంది విద్యార్థులు రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా, రిజల్ట్ రాకుండానే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషం వరకు రీ వాల్యుయేషన్ ఫలితాల కోసం ఎదు రుచూసిన విద్యార్థులు, తీరా అవి ఇప్పట్లో రావని తెలిసి, సప్లిమెంటరీ పరీక్షలకు హాజర య్యారు. మరోవైపు గురువారం కొంతమంది విద్యార్థుల ఫలితాలను వర్సిటీ విడుదల చేసిం ది. విద్యార్థులు ఆ ఫలితాలను చూసుకుని అవాక్కయ్యారు. ఫలితాల్లో ఆబ్సెంట్ అని ఉండటం తో తలపట్టుకుంటున్నారు. రిజల్ట్లో ఫెయిల్ అని ఉండగా, సప్లిమెంటరీ పరీక్ష రాద్దామని వెళ్తే పాస్ అని చెప్పారని కొంతమంది వాపోతున్నారు. ప్రతిష్టాత్మక వర్సిటీలో, పరీక్షల వ్యవస్థ గందరగోళంగా మారడం శోచనీయమని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. 600 మందికి ఎదురుచూపులే నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు 2015-16 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆయా కళాశాలల్లో అప్పటికే ఫస్టియర్ బీటెక్ చదువుతున్న సుమారు 800 మంది విద్యార్థులకు వారు కోరుకున్న కాలేజీల్లో ప్రవేశం కల్పించింది. ఆపై మరో వారం రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ఉండటంతో తాత్కాలిక హాల్టికెట్ నంబరు ఇచ్చి జేఎన్టీయూహెచ్లోనే పరీక్షలు నిర్వహిం చింది. జూలై 20న విడుదల చేసిన ఫస్టియర్ ఫలితాల్లో ఈ 800 మంది విద్యార్థుల ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. విద్యార్థులంతా వర్సిటీలో బైఠాయించడంతో రెండు రోజుల నుంచి ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నారు. శుక్రవారానికి ఇంకా 600 మంది ఫలితాలను విడుదల చేయలేదు. సెప్టెంబర్లో జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను పలు కారణాల వల్ల ఆగస్టులోనే నిర్వహిస్తుండటంతో ఓవైపు ఫలితాలు రాక, మరోవైపు ఫెయిలైతే సప్లిమెంటరీకి అవకాశం లేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు రెండు రోజుల నుంచి దశల వారీగా ఫలితాలను అందుకున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. పరీక్షలు రాసినప్పటికీ ఫలితాల్లో తాను ఇంగ్లిష్ పరీక్షకు ఆబ్సెంట్ అని పేర్కొన్నారని నయీఫ్ అనే విద్యార్థి వాపోయాడు. ఆలస్య రుసుము చెల్లించి సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్నానని, తీరా పరీక్ష కేంద్రానికి వెళ్తే ‘నువ్వు పాసయ్యావు’ పొమ్మన్నారని నయీఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. రీ కౌంటింగ్ ఫలితాలు ఎప్పుడో? బీటెక్ ఫస్టియర్ ఫలితాలను జూలైలో విడుదల చేసిన అధికారులు రీ కౌంటింగ్/ రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం కల్పిం చారు. దీంతో సుమారు 16 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ముందస్తు సప్లిమెంటరీకి షెడ్యూలు ప్రకటించిన జేఎన్టీయూహెచ్, పరీక్షలు ప్రారంభమయ్యేలోగా ఆ ఫలితాలను విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు చేసేది లేక ఆందోళనతోనే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, రీ కౌంటింగ్/రీ వాల్యుయేషన్ దరఖాస్తులు కాలేజీల నుంచి వర్సిటీకి చేరేందుకే 10 రోజుల సమయం పట్టిందని, రీ వాల్యుయేషన్ పూర్తిచేసి ఫలితాలు ఇచ్చేందుకు కనీసం మరోవారం పడుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. -
8న ఎంసెట్-3 నోటిఫికేషన్
-
8న ఎంసెట్-3 నోటిఫికేషన్
≈ సెప్టెంబర్ 3 నుంచి కొత్త హాల్టికెట్ల డౌన్లోడ్కు అవకాశం ≈ 11వ తేదీన రాత పరీక్ష, వారంలోగా ఫలితాలు, ర్యాంకులు ≈ ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ హాల్టికెట్లు ≈ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన అమలు ≈ లీకేజీలో లబ్ధి పొందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులే ≈ ఎంసెట్-3 కమిటీ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 11న నిర్వహించనున్న ఎంసెట్-3 రాత పరీక్షకు ఈ నెల 8న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎంసెట్-3 ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్)లో శని వారం ఎంసెట్-3 కమిటీ సమావేశమైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్రెడ్డి, కన్వీనర్ యాదయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు. 56,153 మందికి అవకాశం.. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరినీ ఎంసెట్-3 రాసేందుకు అనుమతించాలని కమిటీ నిర్ణయించింది. ఎంసెట్-2 రాసేందుకు తెలంగాణతోపాటు ఏపీకి చెందిన మొత్తం 56,153 మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50,961 మంది జూలై 9న నిర్వహించిన పరీక్షకు హాజరు కాగా.. 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. అయితే లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్ష, ర్యాంకులు అన్నింటిని రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. హాల్ టికెట్లు మాత్రం కొత్తవి జారీ చేస్తారు. వచ్చే నెల 3 నుంచి హాల్టికెట్లను విద్యార్థులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించరు. పరీక్ష జరిగిన రోజే ప్రాథమిక కీ విడుదల చేస్తారు. వారం రోజుల్లోగా ఫలితాలను, ర్యాంకులను వెల్లడిస్తారు. వీలైతే 16, 17 తేదీల్లోనే ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులకు 25 వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం వెబ్సైట్లో పాత ప్రశ్నపత్రాలను, మోడల్ ప్రశ్నలను అందుబాటులో ఉంచుతారు. ఈసారి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కార్బన్లెస్ జవాబు పత్రం ఇస్తారు. అలాగే ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలోనూ జంబ్లింగ్ ఉంటుంది. విద్యార్థులపైనా పోలీసు నిఘా ఎంసెట్-2 పేపర్ లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు కూడా పరీక్ష రాసేందుకు అర్హులే. ప్రస్తుతం విచారణ పూర్తి కానందునా వారి పేర్లను ఇప్పుడే తొలగించలేమని, వారు పరీక్ష రాయకుండా నిలుపుదల చేయలేమని జేఎన్టీయూ రిజిస్ట్రార్, ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య పేర్కొన్నారు. వారితోపాటు విద్యార్థులందరిపైనా పోలీసు నిఘా ఉంటుంది. విద్యార్థుల ఫోన్ నంబర్లతో పాటు వివరాలన్నింటినీ ఎంసెట్ కమిటీ ఇప్పటికే పోలీసులకు అందజేసింది. మరోవైపు గతంలో పరీక్ష రాసినవారు ఇపుడు ఎందుకు పరీక్ష రాసేం దుకు దరఖాస్తు చేసుకున్నారన్న దానిపై లోతైన విచారణ జరిపించాలని కమిటీ నిర్ణయించింది. 1970 నుంచి 1994 మధ్యలో జన్మించిన వారు, గతంలో ఎంసెట్ రాసి, ఎంపికై, మెడిసిన్ చదువుతూ ఎంసెట్ రాసేం దుకు దరఖాస్తు చేసిన వారు ఉన్నారు. 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసినవారు 609 మంది ఉన్నారు. 2014లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు 5,041 మంది, 2013లో పాసైన వారు 1,474 మంది, 2012లో ఉత్తీర్ణులైన 455 మంది, 2011లో ఉత్తీర్ణులైన 167 మంది, 2010లో పాసైన 67 మంది ఉన్నారు. ఇలా 1981 నుంచి ఇప్పటివరకు ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేశారు. వారందరిపై పోలీసు నిఘా ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో మార్పులు.. పరీక్ష నిర్వహణ కోసం గతంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కేంద్రాల్లో మార్పులు ఉండవు. ఒక్కో రీజనల్ కేంద్ర పరిధిలో పరీక్ష కేంద్రాలు మాత్రం మారుతాయి. ఎంసెట్-2కు 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గతంలో విద్యార్థులు పరీక్ష రాసిన కేంద్రాలను మార్చుతారు. ఈ పరీక్ష కేంద్రాలన్నీ ప్రభుత్వ విద్యా సంస్థలు, స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తారు. ఇన్విజిలేటర్లు కూడా పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, ఆర్నమెంట్స్ను పరీక్ష హాల్లోకి అనుమతిం చరు. ఆఫ్లైన్లోనే పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తారు. విద్యార్థుల ఫొటోలు, వేలిముద్రలు సేకరిస్తారు. ఏపీ నుంచి పరీక్షకు హాజరయ్యేందుకు గతంలో 17,934 మంది దరఖాస్తు చేశారు. వారికి ఈసారి కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. -
మరో 6 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి
హైదరాబాద్: మరో ఆరు ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. కాలేజీల్లో లోపాలు సరిదిద్దుకున్నట్లు తేలడంతో వాటిల్లో ప్రవేశాలకు ఓకే చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని కేఎన్ఆర్ఆర్, మల్లారెడ్డి, మల్లారెడ్డి (మహిళ), ఎన్ఆర్ఐ కాలేజీలు, నల్లగొండ జిల్లా కోదాడలోని గాంధీ అకాడమీ, శ్రీసాయి కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేశారు. వాటిని కౌన్సెలింగ్లో పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో కోత విధించిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) కోర్సులకు అనుబంధ గుర్తింపు లభించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అయినట్లు తెలిసింది. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీగా కోత
79,705 సీట్లకే గుర్తింపు.. 46 వేల సీట్లకు కోత - కాలేజీల అనుబంధ గుర్తింపు జాబితా వెలువరించిన జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్ : జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లకు ఈసారి భారీగా కోత పడింది. సీట్లే కాదు కాలేజీల సంఖ్య కూడా తగ్గిపోయింది. గతేడాది మొత్తంగా 1.16 లక్షల సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా ఈసారి 79,705 సీట్లకే గుర్తింపు ఇచ్చింది. గతేడాది 220 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా.. ఈసారి 158 కాలేజీలకే గుర్తింపు ఇస్తున్నట్టు ఆదివారం రాత్రి జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న మేరకే కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకట్రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. 40 కాలేజీలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసమే దరఖాస్తు చేసుకోకపోగా, మరో 43 కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించింది. వాటిలో 36 వేలకు పైగా సీట్లకు కోత పెట్టింది. ఇక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జేఎన్టీయూహెచ్ పరిధిలోని కాలేజీల్లో 1.24 లక్షల సీట్లకు అనుమతి ఇవ్వగా జేఎన్టీయూహెచ్ 158 కాలేజీల్లోని 671 కోర్సుల్లో 79,705 సీట్లకే అనుబంధ గుర్తింపునిచ్చింది. అంటే దాదాపు 46 వేల సీట్లకు కోత పడింది. ఇక ఎంసెట్లో 1.04 లక్షల మంది అర్హత సాధించి ర్యాంకులు పొందగా.. 63,777 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం వారంతా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రకటన సోమవారం రానుంది. వాటిల్లో 14 వేల వరకు సీట్లు ఉండగా.. 10 వేల సీట్ల వరకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. దీంతో ఈసారి మొత్తంగా 90 వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అనుబంధ గుర్తింపు 158 కాలేజీలకే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 241 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో జేఎన్టీయూహెచ్ తనిఖీలను నిర్వహించింది. అలాగే మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీలు నిర్వహించింది. రెండు విభాగాల తనిఖీ నివేదికలను పోల్చి చూసి 158 కాలేజీల్లో 79,705 సీట్లలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. సగం ఫార్మసీ కాలేజీలకు నో జేఎన్టీయూహెచ్ పరిధిలో 89 ఫార్మసీ, 30 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. ఈసారి 46 ఫార్మసీ కాలేజీల్లోని 4 వేల సీట్లలో ప్రవేశాలకే అనుబంధ గుర్తింపు లభించింది. అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీల్లో కోర్సులు, సీట్ల వివరాలను ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్కు పంపించింది. -
22 నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
- అందుకు అనుగుణంగా చర్యలు - చేపట్టాలని కడియం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 22వ తేదీ నుంచే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జేఎన్టీయూహెచ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. విజిలెన్స్ విభాగం తనిఖీలు పూర్తి చేసి జేఎన్టీయూహెచ్ నివేదికలతో సరిపోల్చి అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని, నెలాఖరులో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇక మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశంపై వారం తర్వాత మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నట్లు తెలిసింది. -
ఉదయం 6గంటలకు ఎంసెట్ 'కోడ్' విడుదల
హైదరాబాద్: ఎంసెట్ - 2016 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి మెడిసిన్ పరీక్ష జరగనుంది. ఈమేరకు పరీక్షా పత్రాల సెట్ కోడ్ లను మంత్రులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ సెట్ కోడ్ ను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని జేఎన్ టీయూహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్ ప్రశ్నాపత్నం కోడ్ ను వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉదయం 9:30 గంటలకు వెల్లడిస్తారు. (చదవండి: రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష) -
ప్రశ్నర్థకంగా జేఎన్టీయూహెచ్ సెమిస్టర్ ఎగ్జామ్స్!
హైదరాబాద్ : హైదరాబాదు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూహెచ్) అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. యూనివర్శిటీ ఇప్పటికీ కాలేజీలకు ఎగ్జామ్ మెటీరియల్తో పాటు హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కాలేజీలు కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ మెటీరియల్, హాల్ టికెట్లు అందచేస్తామని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందాకే కామన్ సర్వీస్ ఫీజు చెల్లిస్తామని కాలేజీలు చెబుతున్నాయి. కాలేజీల నుంచి దాదాపుగా రూ.50 కోట్ల బకాయిల్లో కొంతైనా చెల్లించాలని జేఎన్టీయూహెచ్ డిమాండ్ చేస్తోంది. దీంతో పరీక్షలు దగ్గర పడుతున్నా హాల్ టికెట్లు అందక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. -
వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!
♦ అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోని 58 ఇంజనీరింగ్ కాలేజీలు ♦ వాటిలోని విద్యార్థులకు చదువుకు ‘గుర్తింపు’ సమస్య ♦ చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ జేఎన్టీయూహెచ్ ప్రకటన ♦ ఆందోళనలో విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్టీయూహెచ్) పరిధిలోని 58 ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 7 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా జేఎన్టీయూ నుంచి పొందాల్సిన అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) కోసం ఈసారి 58 ఇంజనీరింగ్ కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో విద్యార్థుల చదువుకు ‘గుర్తింపు’ సమస్య ఏర్పడనుంది. అనుబంధ గుర్తింపు లేకపోతే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. యూనివర్సిటీ వారికి పరీక్షలను నిర్వహించదు కూడా. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు. అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీల జాబితాను జేఎన్టీయూ గురువారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు అవకాశం కల్పించామని.. అయినా ఈ కాలేజీలు పట్టించుకోలేదని తెలిపింది. ఆయా కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవానికి ఒకవేళ ఏదైనా కాలేజీలో విద్యార్థులు తక్కువగా ఉండి, తరగతులు నిర్వహించలేకపోతే... వారిని మరో కాలేజీకి తరలించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు వద్దనుకున్నా... ద్వితీయ, తృతీయ, నాలుగో ఏడాది విద్యార్థుల కోసమైనా ‘గుర్తింపు’ పొందాలి. దీనినీ ఖాతరు చేయలేదు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ‘‘దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం ఇచ్చాం. మొదట సాధారణంగా, తరువాత ఆలస్య రుసుముతో దరఖాస్తుల గడువు పెంచాం. అయినా అఫిలియేషన్ల కోసం 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఆయా కాలేజీలపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయి..’’ - జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య అఫిలియేషన్కు దరఖాస్తు చేసుకోని కాలేజీలు రంగారెడ్డి జిల్లాలోని.. అన్వర్ ఉలూమ్ కాలే జ్ ఆఫ్ ఇంజనీరింగ్, యెన్నేపల్లి; ఆర్యభట్ట ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మొహబ్బత్నగర్; అసిఫియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చింతుల; అవేర్ మాధవన్జీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, భగవతిపురం; భారత్ ఇంజనీరింగ్ కాలేజ్, మంగళపల్లి; చిలుకూరి బాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అజీజ్నగర్; సీఆర్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, లాల్గడిమలక్పేట; హస్విత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, కీసర; హస్విత ఇనిస్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కీసర; హైపాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిలుకూరు; హోలీమేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, భోగారం; జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తుర్కపల్లి; కేఎస్ రాజు ఇనిస్టిట్యూ ట్ టెక్నాలజీ అండ్ సైన్స్, కనకమామిడి; కైట్ కాలేజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సెన్సైస్, షాబాద్; ఎంఆర్ఆర్ కాలేజీ ఆఫ్ బీ ఫార్మసీ, నాదర్గుల్; ప్రజ్ఞా భార తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముద్మియాల్; సింబియాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, షామీర్పేట్; ఎస్పీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-టెక్నాలజీ, అంకుషాపూర్; ఉషోదయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-టెక్నాలజీ, సీతారాంపేట్; శ్రీనివాస ఫార్మాస్యూటికల్ ఇనిస్టిట్యూట్ అండ్ సెంటర్ ఫర్ రీసెర్చ్, బురుగుపల్లి; విశ్వభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నాదర్గుల్; వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, బాటసింగారం. మెదక్ జిల్లాలోని.. ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, పటేల్గూడ; ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్, చిన్నగుండవల్లి; గోపాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్ద కంజర్ల; పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, గౌరారం; పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వర్గల్; ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పసల్వాడి, సంగారెడ్డి; మహేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, ఇస్నాపూర్; మహేశ్వరరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, చిత్కుల్; శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హవేలి ఘన్పూర్; సుశృత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, తడ్డనపల్లి; టీఆర్ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, పటాన్చెరు. ఖమ్మంలోని.. కవిత మెమోరియల్ పీజీ కాలేజ్ (ఎంబీఏ), వెలుగుమట్ల; కవిత మెమోరియల్ పీజీ కాలేజ్ (ఎంసీఏ) వెలుగుమట్ల; పులిపాటి ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శ్రీబాలాజీ నగర్; సింగరేణి కాలరీస్ విమెన్స్ కాలేజ్, కొత్తగూడెం; ట్రినిటీ పీజీ కాలేజ్, బల్లేపల్లి. కరీంనగర్ జిల్లాలోని.. లోటస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎంబీఏ), శ్రీనగర్ కాలేజీ, గోదావరిఖని; వాగీశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్, రామకృష్ణా కాలనీ; వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మల్కాపూర్ శివారు, గోదావరిఖని. నల్లగొండ జిల్లాలోని.. మేధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లక్ష్మిదేవీగూడెం, బీబీనగర్; మోనా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గొల్లగూడ; శ్రీవాన్మయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అన్నంపట్ల. వరంగల్ జిల్లాలోని.. ఆరుషి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, పున్నేల్; అపెక్స్ ఇంజనీరింగ్ కాలేజ్, విశ్వనాథపురం; పాత్ఫైండర్ఇంజనీరింగ్ కాలేజ్, తిమ్మాపూర్; ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్, శామీర్పేట్, జనగాం; సహస్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, వంగపహడ్; సెయింట్ జాన్ ఎంబీఏ కాలేజ్, ఎల్లాపూర్; సెయింట్ జాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎల్లాపూర్; సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేమాలిగొండ; వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వికాస్నగర్. హైదరాబాద్లోని.. గ్రీన్ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, బండ్లగూడ; శ్రీమాధవన్జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శాంతివనం. నిజామాబాద్ జిల్లాలోని.. విజయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, మానిక్ బండార్. మహబూబ్నగర్ జిల్లాలోని.. శ్రీనాగోజీరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (విమెన్), తిరుమల హిల్స్, అప్పన్నపల్లి. ఆదిలాబాద్ జిల్లాలోని.. ఏఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మావల్ల. -
దేశాభివృద్ధికి యువత కృషి చేయాలి: కేటీఆర్
హైదరాబాద్ : దేశ అభివృద్ధికి యువత కృషిచేయాలని, స్కిల్ డెవలప్మెంట్ మోటివేషన్ పెంచుకోవాలని యువతకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారకరామారావు సూచించారు. కూకట్పల్లిలోని జవహర్ లాల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన మోడల్ యునైటెడ్ నేషన్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రగామి దేశాలతో పోల్చుకుంటే భారత దేశం వెనుకబడి ఉందని, దేశ అభివృద్ధికి యువత నడుం బిగించాలని, స్కిల్డెవలప్మెంట్ మోటివేషన్ పెంచుకోని దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన అన్నారు. భారతదేశంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ టెక్నాలజీని యువత అందిపుచ్చుకొని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా యువత భారీగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఎవ్వరికి భయపడకుండా సొంత నిర్ణయంతో ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. -
పేరుకు ముందు ‘డాక్టర్’ చేర్చాలి...
హైదరాబాద్: ఆరేళ్లపాటు చదివి డిగ్రీలను పొందినా కనీసం ప్రభుత్వ పరంగా చేయూత లేకపోగా... పట్టాలను జారీచేసిన విశ్వవిద్యాలయాలు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాలను చేర్చేందుకు కూడా నిరాకరిస్తున్నాయంటూ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా డీ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం జేఎన్టీయూహెచ్ పరిపాలన భవనం ఎదుట వందలాది విద్యార్థులు ప్రభుత్వానికి, వర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇచ్చే ప్రొవిజనల్, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్లలో పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చాలని సూచించినప్పటికీ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర చోట్ల పీసీఐ నిబంధనలకు అనుగుణంగా డాక్టర్ అనే పదాన్ని చేర్చి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుండగా ఓయూ, జేఎన్టీయూహెచ్లు మాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర మనోవేదనను వ్యక్తం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ యాదయ్యను కలిసి నెలరోజుల పాటు గడువు ఇస్తున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మా డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, సత్యసునీల్, బారి నరేష్, అసోసియేషన్ ఫర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అధ్యక్షుడు లక్ష్మికాంత్, జగదీశ్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పాత పద్ధతిలోనే ప్రమోషన్ క్రెడిట్స్
- పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న జేఎన్టీయూహెచ్ - ‘సాక్షి’ కథనంతో స్పందన.. సాక్షి, హైదరాబాద్: వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసిన ప్రమోషన్ క్రెడిట్స్ అంశంపై జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) వెనక్కి తగ్గింది. జేఎన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు గతంలో ఉన్న ప్రమోషన్ క్రెడిట్స్ విధానాన్నే అమలు చేస్తామని గురువారం వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి ప్రమోట్ కావడానికి అవసరమైన క్రెడిట్స్ని పెంచుతూ కొద్దిరోజుల క్రితం అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 23న ‘సాక్షి’లో ‘విద్యార్థులపై క్రెడిట్స్ పిడుగు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో స్పందించిన ఇన్చార్జి వీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం వర్సిటీలో అకడమిక్ సెనేట్ భేటీ అయింది. రిజిస్ట్రార్, ఎవాల్యుయేషన్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డెరైక్టర్లు, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు జరిగిన సమావేశంలో క్రెడిట్స్ పెంపు, దీని ప్రభావం, అందుకు దారితీసిన అంశాలపై అధికారులను అడిగి ఇన్చార్జి వీసీ తెలుసుకున్నారు. ‘సాక్షి’ కథనం వాస్తవానికి అద్దం పట్టిందని, వేల మంది విద్యార్థులు డిటెన్షన్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఇన్చార్జి వీసీకి వివరించారు. ఈ నేపథ్యంలో క్రెడిట్స్ పెంపు సమంజసం కాదని.. పాత విధానాన్నే అవలంబించాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సమావేశం అనంతరం రిజిస్ట్రార్ యాదయ్య మాట్లాడుతూ.. క్రెడిట్స్ పెంపును విరమించుకుంటున్నామని, గత ఏడాది వరకు అమలైన క్రెడిట్స్ విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకూ క్రెడిట్స్ అర్హతలో కొంత మినహాయింపు ఇచ్చారు. దీంతో డిటెన్షన్కు గురవుతామని ఆందోళన చెందిన విద్యార్థులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.మరోవైపు ఈ నెల 25తో పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గడువును అక్టోబర్ ఒకటి వరకు పొడిగించారు. -
కేంద్ర బిందువు రిజిస్ట్రారే..!
- జేఎన్టీయూహెచ్లో ‘క్రెడిట్స్’ పెంపు రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయమే - వెల్లువెత్తుతున్న ఆరోపణలు - ‘సాక్షి’ కథనంతో దుమారం.. సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూహెచ్)లో ప్రమోషన్ క్రెడిట్స్ పెంపు అంశం దుమారం రేపుతోంది. వర్సిటీ అధికారులు అర్ధంతరంగా క్రెడిట్స్ పెంచడంతో ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ ‘విద్యార్థులపై క్రెడిట్స్ పిడుగు’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అధికారుల నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే పరి స్థితి ఏర్పడటంతో ఈ కథనం యూనివర్సిటీలో చర్చనీయాం శంగా మారింది. రిజిస్ట్రార్ ఏకపక్ష నిర్ణయంతోనే ఈ దుస్థితి దాపురించిందని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ లో కిందిస్థాయి అధికారులు సైతం క్రెడిట్స్ పెంపు పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్వీ రమణారావు పదవీ విరమణ తర్వాత రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ యాదయ్య తన మార్క్ ప్రదర్శించాలన్న తహతహతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోధనలో నాణ్యత, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలన్న ఉద్దేశం మంచిదే అయినా.. ఉన్నఫళంగా అమలు చేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై ‘సాక్షి’ రిజిస్ట్రార్తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కాల్ని స్వీకరించలేదు. నేడు సమావేశం.. ధర్నా: ‘సాక్షి’ కథనం నేపథ్యంలో సమస్య వర్సిటీ ఇన్చార్జి వీసీ రాజీవ్ ఆచార్య దృష్టికి వెళ్లింది. ఆయన ప్రమోషన్ క్రెడిట్స్ విషయాన్ని ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో క్రెడిట్స్ పెంపుపై చర్చ కోసం గురువారం భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ ఆచార్య, రిజిస్ట్రార్, రెక్టార్, ఇవాల్యూషన్ డెరైక్టర్, అకడమిక్ అండ్ ప్లానింగ్ డెరైక్టర్తోపాటు సంబంధిత విభాగాధిపతులు పాల్గొననున్నారు. అటు రిజిస్ట్రార్, వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వర్సిటీ లో గురువారం ధర్నా నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. -
విద్యార్థులపై ‘క్రెడిట్స్’ పిడుగు!
సాక్షి, హైదరాబాద్: సంస్కరణల పేరిట జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూహెచ్) అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టి మూణ్ణెళ్లు గడిచాక .. ఉన్నపళంగా ప్రమోషన్ క్రెడిట్స్ను పెంచడమే దీనికి కారణం. దీంతో తృతీయ సంవత్సరంతోనే విద్యార్థుల చదువు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు మంగళవారం వర్సిటీలో నిరసనకు దిగారు. అధిక సంఖ్యలో విద్యార్థులను డీటెండ్ చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకునే కుట్రలకు పాలకులు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జేఎన్టీయూహెచ్ ఇన్చార్జ్ వీసీ, రిజిస్ట్రార్లు అందుబాటులో లేకపోవడంతో డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ఆంజనేయప్రసాద్కు వినతిపత్రాన్ని అందజేశారు. అధికారుల అస్తవ్యస్త నిర్ణయాలు.. ఉత్తమ బోధన.. నాణ్యమైన ఫలితాల పేరిట జేఎన్టీయూహెచ్ అధికారులు ఇటీవల కొన్ని సంస్కరణలు తెచ్చారు. అయితే ఇవి ఇప్పుడు విద్యార్థులకు శాపంగా మారాయి. గతంలో ఒక విద్యార్థి చివరి సంవత్సరంలోకి అడుగుపెట్టాలంటే.. 3.1 సెమిస్టర్ వరకు సదరు విద్యార్థికి 125 క్రెడిట్స్కుగానూ.. 50 క్రెడిట్స్ రావాలి. 3.2 సెమిస్టర్ వరకు 150కి 62 క్రెడిట్స్ సాధించాలి. ఇలా క్రెడిట్స్ పొందితేనే పైతరగతులకు ప్రమోట్ చేస్తారు. అయితే ఈ ఏడాది నుంచి ప్రమోషన్ క్రెడిట్స్ మొత్తాన్ని అధికారులు అకస్మాత్తుగా పెంచారు. 3.1 సెమిస్టర్ వరకు 62 క్రెడిట్స్ పొందితేనే చివరి సంవత్సరంలోకి అనుమతిస్తామని, తక్కువ క్రెడిట్స్ ఉన్న వారిని డిటెన్షన్ చేస్తామని, 3.2 సెమిస్టర్ గ్రేడ్స్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. క్రెడిట్స్ పెంపు, డిటెన్షన్ విషయాలను తృతీయ సంవత్సరం ఫలితాలు వెల్లడించిన సమయంలోనే విద్యార్థులకు చెప్పాలి. కాని అధికారులు మొన్నటి వరకు గోప్యత పాటించారు. ఇది తెలియని విద్యార్థులు 3 నెలలపాటు చివరి సంవత్సరం తరగతులకు హాజరయ్యారు. చాలామంది బోధన ఫీజులు చెల్లించి.. వేల రూపాయలు ఖర్చు చేసి పుస్తకాలు, స్టడీ, ప్రాజెక్ట్ మెటీరియల్ కొనుగోలు చేశారు. మరోవైపు 4.1 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో క్రెడిట్స్ పెంపు, డిటెన్షన్ విధానాన్ని అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు డిటెన్షన్కు గురికానున్నారు. ఫలితంగా తృతీయ సంవత్సరంతోనే వారి చదువులు ఆగిపోనున్నాయి. వర్సిటీలో ఏదైనా కొత్త విధానాన్ని అవలంబించేటప్పుడు మొదటి సంవత్సరం నుంచే వర్తింపజేయాల్సి ఉంటుంది. ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నూతన విధానాల నుంచి మినహాయింపు ఇస్తారు. అయితే మరో ఏడాదిలో ఇంజనీరింగ్ పూర్తయ్యే విద్యార్థులకు ఇప్పుడు మినహాయింపు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కొత్త నిబంధనలు వద్దు.. పదేళ్లుగా అనుసరిస్తున్న నిబంధనలను మార్చి 3.1లో 62 క్రెడిట్స్ను తీసుకువచ్చి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించిన సమయంలో వారి జీవితాలతో ఆడుకోవద్దు. - గూడురు అజిత్రెడ్డి, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి విద్యార్థుల గోడు పట్టించుకోరా.. డిటెన్షన్పై కళాశాలకు వెళ్తే జేఎన్టీయూహెచ్కు వెళ్లమని, జేఎన్టీయూహెచ్కు వస్తే కళాశాలలో తేల్చుకోమని చెబుతూ తప్పించుకుంటున్నారు. పది జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఒకే కౌంటర్ను కేటాయించడం దుర్మార్గం. - భానుప్రకాష్రెడ్డి, వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి