-
ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ
-
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కాబట్టి కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో.. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 21వ తేదీన ఈడీ మనీలాండరింగ్ అభియోగాలతో కేజ్రీవాల్ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్ను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
తిహార్ జైలుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ విధానంలో అక్రమాల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ కోర్టు ఈనెల 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 21న ఈడీ అరెస్ట్చేశాక మార్చి 28వ తేదీదాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీచేయడం తెల్సిందే. తమ విచారణలో కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించట్లేడని, మరికొంతకాలం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం, అందుకు కోర్టు సమ్మతిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీదాకా కస్టడీని పొడిగించడం తెల్సిందే. ఏప్రిల్ ఒకటిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయనను జడ్జి బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారణకు సహకరించని ఆయనను 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. ఈ వాదననతో ఏకీభవిస్తూ ఏప్రిల్ 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచి్చనపుడు ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత అక్కడికొచ్చారు. ‘‘ కస్టడీలో ఈడీ 11 రోజులపాటు ప్రశ్నించింది. ఇంక ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. ఆయనను ఇంతవరకు కోర్టు దోషిగా ప్రకటించలేదు. మరి అలాంటపుడు జైలుకు ఎందుకు పంపించారు?. లోక్సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయనను జైలుకు పంపింది’’ అని సునీతా ఆరోపించారు. పార్టీలో సునీతా అత్యత ‘క్రియాశీలక’ పాత్ర పోషించనున్నట్లు ఆప్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆదివారం ఢిల్లీలో రాంలీలా మైదాన్లో విపక్షాల ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో పాల్గొనడం ద్వారా సునీతా ఒక రకంగా రాజకీయ అరంగేట్రం చేసినట్లేనని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో కేజ్రీవాల్ కీలక పాత్రధారి. లబ్ధిదారులకు లాభం చేకూరేలా మద్యంపాలసీ రూపకల్పన, అమలులో ఈయన ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం పాలసీని అమలుచేయకముందే క్విడ్ ప్రో ద్వారా తమకు రావాల్సిన నగదును కిక్బ్యాక్ రూపంలో పొందారు’’ అని ఈడీ తన రిమాండ్ దరఖాస్తులో ఆరోపించింది. మూడు పుస్తకాలు, ఔషధాలు, లాకెట్.. జడ్జి ఉత్తర్వుల అనంతరం కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్ను జైలుకు తరలిస్తున్నారన్న వార్త తెలిసి ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తిహార్ జైలుకు చేరుకుని ‘నేనూ కేజ్రీవాల్’ అని టీ–షర్ట్లు ధరించి, ఆప్ జెండాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. రెండో నంబర్ జైలులో కేజ్రీవాల్ను ఉంచే అవకాశముంది. వైద్య పరీక్షలు చేస్తున్నాం. తర్వాత ఆయనను ఒంటరిగా ఒక గదిలో ఉంచునున్నారు. గదిలో ప్రతిరోజూ 24 గంటలపాటు సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగనుంది. అనారోగ్యం దృష్ట్యా సంబంధిత ఔషధాలు, ప్రత్యేక ఆహారాన్ని ఆయనకు అందించనున్నారు. మతవిశ్వాసాన్ని గౌరవిస్తూ ఒక లాకెట్ ధరించేందుకు ఆయనకు అనుమతి లభించింది. భగవద్గీత, రామయణం, నీరజా చౌదరి రాసిన ‘ హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాలనూ అనుమతించారు. ఉదయం ఆరున్నరకు దినచర్య మొదలు కేజ్రీవాల్ దినచర్య మిగతా విచారణఖైదీల్లాగే ఉదయం ఆరున్నర గంటలకు మొదలుకానుంది. ఉదయం చాయ్, బ్రెడ్ అల్పాహారంగా ఇవ్వనున్నారు. కోర్టులో కేసు విచారణ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు. లేదంటే 10.30 నుంచి 11 మధ్యలో లంచ్ వడ్డిస్తారు. పప్పు, కూరగాయలు లేదంటే ఐదు చపాతీలు లేదా అన్నం వడ్డిస్తారు.తర్వాత మూడు గంటల దాకా గదిలోనే ఉంచుతారు. మూడున్నరకు టీ, బిస్కెట్లు అందిస్తారు. నాలుగు గంటలకు తమ లాయర్లను కలిసేందుకు అనుమతిస్తారు. 5.30గంటలకే డిన్నర్ వడ్డిస్తారు. ఏడింటికల్లా గదికి పంపించి తాళం వేస్తారు. టీవీ సదుపాయం కల్పిస్తారు. వైద్య, సహాయక సిబ్బంది 24 గంటలూ అందుబాటులోఉంటారు. వారానికి రెండుసార్లు కుటుంబసభ్యులను కలవొచ్చు. ఆప్ నేత సంజయ్ సింగ్ను గతంలో ఈ సెల్లోనే ఉంచారు. ఇటీవల ఐదో నంబర్ జైలుకు మార్చారు. ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఒకటో నంబర్ జైలులో, బీఆర్ఎస్ నేత కె.కవితను ఆరో నంబర్ మహిళా జైలులో ఉంచారు. -
జ్యుడీషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు లో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో కవితను ఈడీ అధికా రులు తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. రెండోసారి ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హుస్సేన్ ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కవిత కీలక కుట్రదారు, లబ్ధిదారు అని ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ జరిపిన విచారణ ఆధారంగా సౌత్ గ్రూప్ లాబీలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోని అగ్రనేతలతో కలసి మద్యం కుంభకోణానికి కుట్రపన్నారని తేలిందన్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలు, మద్యం విధానంలో మార్పులు, అమల్లో కవిత కీలకపాత్ర పోషించారన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని.. ఆమెను బెయి ల్పై విడుదల చేస్తే సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని తద్వారా విచారణకు ఆటంకం కల గొచ్చని వాదించారు. కవిత పాత్రపై ఇంకా పరిశోధించా ల్సిన అవసరం ఉందని... నేరంలో చేతులు మారిన మిగి లిన సొమ్ము గురించిన ఆధారాలు వెలికితీస్తున్నట్లు వివ రించారు. నేరం ద్వారా వచ్చిన రాబడితో ప్రమేయం ఉన్న లేదా సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించనున్నా మని, ఆర్థిక నేరాలపై దర్యాప్తు సాధారణ నేరాల దర్యాప్తు కంటే క్లిష్టంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నామని చెప్పారు. కుమారుడికి పరీక్షలున్నాయి.. మధ్యంతర బెయిలివ్వండి: కవిత లాయర్ కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ బెయిల్ పిటిషన్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం నుంచి కవిత కుమారుడికి వార్షిక పరీక్షలు మొదలుకానున్నందున మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే ఈడీ కస్టడీలో నిర్వహించిన వైద్య పరీక్షల వివరా లను అందించాలన్నారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే బెయిల్ పిటిషన్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి వారం సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనల అనంతరం కవితను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా అదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు కవితను తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారిస్తామని, ఈలోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కవితకు ఇంటి భోజనం, పరుపు, దుప్పటి, చెప్పులు, బట్టలు, పుస్తకాలు, కలం, కాగితాలు, అవసరమైన మందులను నిబంధనల మేరకు అనుమతించాలని తిహార్ జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవితకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భర్త అనిల్, కొందరు జాగృతి నేతలు కార్యకర్తలు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: కవిత కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఈ కేసు నిందితుల్లో ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరితే మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మరొకరు బీజేపీకి రూ. 50 కోట్ల నిధులు ఇచ్చారు. జై తెలంగాణ’ అని కవిత వ్యాఖ్యానించారు. -
Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు. -
12 దాకా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. -
మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్పై 12న విచారణ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
Delhi Liquor Scam: సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: లిక్కర్ స్కాంలో అరెస్టయిన(సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన్ని ఇవాళ(బుధవారం) రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో.. స్పెషల్ జడ్జి ఎంకే నాగ్పాల్, సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ ఆదేశించారు. ఇక సిసోడియాను ఈడీ వారంగా తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసే ఉంటుంది. మరోవైపు సీబీఐ విచారిస్తున్న లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనపై విచారణను మంగళవారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన విచారణ కోసం పిలిపించుకున్న సీఐబీ.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనే ఆయన్ని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇక.. మనీల్యాండరింగ్ అభియోగాలకుగానూ ఈడీ, సిసోడియాను మార్చి 9వ తేదీన తీహార్ జైల్లో అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: మోదీకి వ్యతిరేకంగా వేల ఫ్లెక్సీలు -
తీర్పు వచ్చేవరకు జ్యుడీషియల్ కస్టడీలో నేపాల్ క్రికెటర్
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది. చదవండి: డిఫెండింగ్ చాంపియన్కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్కు ముచ్చెమటలు -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సంజయ్ రౌత్కు లభించని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్ రౌత్ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే.. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్.. ఆ వినతికి కోర్టు నో!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
ఊహించని షాక్.. జైలుకు పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలు
కోల్కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ నేటితో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. పాఠశాల నియామకాల స్కామ్లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని ఈడీకి తెలిపారు నడి అర్పితా ముఖర్జీ. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
‘ఆల్ట్ న్యూస్’కు విదేశీ విరాళాలు
న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్లు అన్నీ థాయ్ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు. జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. -
Beef Row: లంచ్లోకి బీఫ్.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్
దిస్పూర్: తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్ చేస్తున్న టైంలో.. తాను ఇంటి నుంచి తెచ్చిన వంటకాన్ని నలుగురికి పంచాలనుకుంది ఓ ప్రధానోపాధ్యాయురాలు. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది..కటకటాల వెనక్కి నెట్టింది. అస్సాం గోల్పరా జిల్లా లఖిపూర్లోని ముర్కాచుంగి మిడిల్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా(56).. గొడ్డుకూరను లంచ్ బాక్స్లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్లో జరిగిన ఓ పంక్షన్ సందర్భంగా ఇది జరిగింది. బీఫ్ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఐపీసీ 153ఏ(విద్వేషాలు రగిల్చే ప్రయత్నం), 295ఏ (మత మనోభావాలు దెబ్బతీయడం) కింద.. ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బీఫ్ తినొచ్చు, కానీ.. ఈశాన్య రాష్ట్రం, పైగా బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో గొడ్డు మాంసం క్రయవిక్రయాలు, తినడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కిందటి ఏడాది ప్రభుత్వం ‘అస్సాం క్యాటల్ ప్రిజర్వేషన్ యాక్ట్’ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హిందువులు, జైనులు, గొడ్డు మాంసానికి దూరంగా ఉండే కమ్యూనిటీలు ఉన్న ఏరియాలకు, హిందూ ఆలయాలకు ఐదు కిలోమీటర్ల అవతల.. బీఫ్ సెంటర్లను నిర్వహించకోవచ్చు. ఆవు అందరికీ అమ్మ. గోమాతను పూజించే గడ్డపై.. గొడ్డు మాంసం తినకపోవడమే ఉత్తమం. అదే సమయంలో తిండి అలవాట్లను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరమూ లేదు: అస్సాం సీఎం హిమంత గతంలో చేసిన కామెంట్లు చదవండి: జాతరలో బీఫ్, పంది బిర్యానీకి నో.. కలెక్టర్కు నోటీసులు -
Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్
Hanuman Chalisa Row: మాజీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. అయితే, హనుమాన్ చాలీసా చాలెంజ్తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తర్వాత నవనీత్ రాణా దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. ఈ అభియోగంపై వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్పై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు. ఇది చదవండి: డ్రాగన్ దేశం చైనాకు బిగ్ షాక్ -
NSE Co-Location Scam: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చిత్ర రామకృష్ణ..!
ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఢిల్లీ కోర్టు నేడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి నిచ్చింది. చిత్ర రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రామకృష్ణ కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు న్యాయవాది కోరారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆహారం కూడా మంచిదని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సమయంలో వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఆమె న్యాయమూర్తి కోర్టును కోరారు. దీనిని కూడా కోర్టు తిరస్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో(ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. (చదవండి: కో-లొకేషన్ కుంభకోణంలో హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..!) -
బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని జనవరి 28 వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా, దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై జనవరి (17) సోమవారం విచారణ జరగనుంది. బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్తో పాటు శ్వేత, మయాంక్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుల తరపు న్యాయవాది, తమ క్లయింట్ల ట్విటర్ ఖాతాను హ్యక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. ఇప్పటికే శ్వేత, మయాంక్లను ఉత్తరాఖండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు విశాల్ కుమార్ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. విశాల్కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో అతడిని ముంబైలోని కలీనా క్వారంటైన్ సెంటర్కు తరలించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నీరజ్ను భోపాల్లోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పదిహేను సంవత్సరాల వయసులోనే హ్యకింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ బుల్లి బాయ్ యాప్తో మహిళలను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’ -
కస్టడీ మరణాలపై జాతి మేలుకోవాలి
కొన్ని వారాల క్రితం, 22 ఏళ్ల కుర్రాడు అల్తాఫ్ పెళ్లాడతానని చెప్పి ఒక మైనర్ బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఉద్దేశంతోనే అతడు ఆ బాలికను తన స్నేహితుడితో కలిసి ఆగ్రా చేరుకోమని సూచించాడు. వారు అక్కడికి వచ్చాక త్వరలోనే తాను అక్కడికి వస్తానని చెప్పాడు. కానీ అతడా పని చేయలేదు. కారణం అలా చెప్పిన మరుసటి రోజే ఆ అమ్మాయి కుటుంబం చేసిన ఆరోపణలతో పోలీసులు అల్తాఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు తర్వాత అతడు చనిపోయాడు. పోలీసు స్టేషన్ వాష్ రూమ్లో నేలకు కొన్ని అడుగుల ఎత్తున ప్లాస్టిక్ టాప్కు వేలాడుతూ కనిపించాడు. ఇంటరాగేషన్ చేస్తున్న చోటే అతడు తాను ధరించి ఉన్న జాకెట్ దారం సహాయంతో ఉరివేసుకున్నాడని పోలీసుల ప్రకటన. ఇది విడి ఘటన కాదు. అలాగని విశేష ఘటన అంత కంటే కాదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం గత 20 ఏళ్లలో దేశంలో 1,888 మంది అటు పోలీసు కస్టడీలో లేక జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చనిపోయారని తెలియడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పైగా ఇవి అధికారికంగా ప్రకటించిన కస్టడీ మరణాల సంఖ్య మాత్రమే. నిజానికి ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉంటాయన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రకమైన నెత్తుటి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్ కూడా ఈ జాబితాలో చేరుతోందని ఎన్సీఆర్బీ పేర్కొంది. 2020 లోనే గుజరాత్లో 15 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా 76 మంది ఇలా చనిపోయారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజ లకు వ్యతిరేకంగా రాజ్యమే రెచ్చగొడుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకమైన మరణాల వైపు భారత దేశం శరవేగంగా దూసుకెళుతోంది. పోలీసు కస్టడీలో లేదా విచారణ సమయంలో జరుగుతున్నట్లు అధికారులు చెబు తున్న కారణాలు రోతపుట్టిస్తాయనడంలో సందేహం లేదు. అనారోగ్యం, గుండెపోటు, వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సహజ మరణం లేదా వయసు కార ణంగా సహజమరణం వంటివి కస్టడీ మరణాలకు కారణా లని చెబుతున్నారు. ఇంత హృదయం లేని వివరణల కారణంగానే కస్టడీ మరణాలపై సుప్రీంకోర్టు ధ్వజమె త్తింది. చట్టబద్దంగా పాలన సాగుతున్న పౌర సమాజంలో కస్టడీ మరణాలకంటే మించిన ఘోరనేరాలు మరొకటి ఉండవని కోర్టు కడిగిపారేసింది. జాతి సిగ్గుపడే విధంగా, అమానుషమైన రీతిలో కస్టడీలో జరుగుతున్న మరణాలపై సుప్రీకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా శాంతిభద్రతల వ్యవస్థలో ఏ ఒక్కరూ లెక్క చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపోలీసు స్టేషన్, నిఘా సంస్థ, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీతో సహా ప్రతి కార్యాలయంలోనూ సీసీటీవీలు నెలకొల్పాలని, నైట్ విజన్, ఆడియో రికార్డింగు సౌకర్యం వీటికి తప్పక కల్పిం చాలని గతేడాది నవంబరులో సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలీసు స్టేషన్లలో జరిగే ప్రతి విచారణను తప్పకుండా రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్ గదులు, లాకప్ గదులు, పోలీసు స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలన్నింటిలో భద్రతా కెమెరాలను ఏర్పర్చాలని కూడా కోర్టు ఆదేశించింది. స్టేషన్లు, ఇంటరా గేషన్ కార్యాలయాల్లోని కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ఏరియాలు, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఉండే గదులు, బయట ఉండే వాష్ రూముల వద్ద కూడా కెమెరాలు అమ ర్చాలని ఆదేశించింది. అలాగే మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేస్తున్న ఆఫీసులు– ఇలా అన్ని చోట్లా సీసీటీవీ రికార్డు చేసి వాటిని 18 నెలలపాటు భద్రపర్చా లని ఏ విచారణ క్రమంలోనైనా మానవ హక్కుల ఉల్లం ఘన జరిగినట్లయితే పర్యవేక్షణకు ఇవి ఉపయోగ పడతాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి ఆరువారాల లోపు గడువు విధించుకుని మరీ కార్యాచరణ పూర్తి చేయా లని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశం ఎంత అపహాస్యం పాలైందంటే ఇదే సమస్యను మనం సంవ త్సరం తర్వాత ఇప్పుడూ చర్చించుకుంటూనే ఉన్నాం. 2018లో పంజాబ్లో జరిగిన ఒక కస్టడీ చిత్రహింసల కేసును విచారించిన సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విధమైన ఆదేశం జారీ చేసింది. కానీ మూడున్నర సంవ త్సరాల తర్వాత కూడా తన ఆదేశాలను అమలు చేయక పోవడంపై అత్యున్నత న్యాయస్థానం అభిశంసించింది. అయినా సరే పోలీసు స్టేషన్లలో ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో లాక్డౌన్ నిబం ధనలను ఉల్లంఘించారనే సాకుతో పోలీసులు... తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘాతుక చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం నవంబర్ 20న సుప్రీం కోర్టు తాజాగా అవే ఆదేశాలు మళ్ళీ జారీ చేసింది. సంవత్సర కాలంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు కూడా హామీ ఇవ్వాలన్నది వీరి డిమాండ్. ఈ రైతుల పిల్లలే మన అంతర్జాతీయ సరిహద్దులను పరి రక్షిస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల సాను భూతి ప్రకటించకపోవడం అటుంచి వారి ట్రాక్టర్లను దేశ రాజధానిలో ప్రజలపైకి తోలారంటూ ఆరోపిస్తున్నాం. చివరకు రైతులపైకి వాహనాలు తోలి చంపిన లఖిం పూర్ ఖేరీ ఘటనపై కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే విచారణ మొదలెట్టారు. యూపీలో స్థానిక పోలీసు బలగాలు చేపట్టే ఎలాంటి విచారణపైనా తనకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వాధికారం గుప్పిట్లో పెట్టుకున్న శక్తుల ఉచ్చులో మనం పడి పోతు న్నాం. తాము అన్ని చట్టాలకూ అతీతమని, ఎవరి ఆదేశా లనూ, సూచనలనూ తాము పాటించబోమంటున్న అధి కార శక్తుల ప్రాబల్య కాలంలో మనం మనుగడ సాగి స్తున్నాం. ఈ రాజ్యాంగేతర శక్తుల ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మన సామూహిక చైతన్యం సైతం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ప్రాథమికమైన, ప్రాణాధా రమైన ఈ చైతన్యాన్ని కూడా మనం కోల్పోతే అది ఎన్నటికీ తిరిగిరాదు. నిజంగానే ఇది మనకు మేలుకొలుపు లాంటి దేనని గ్రహించాలి. – నారాయణ్ రాజీవ్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ -
నాగశౌర్య ఫామ్హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: బర్త్డే పార్టీ ముసుగులో పేకాట -
పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖీమ్పూర్ఖేరి/బహ్రెయిచ్: లఖీమ్పూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్ ఆయన పక్కనే ఉంటారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. టింకోనియాలో నేడు అంతిమ్ అర్థాస్ లఖీమ్పూర్ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్ అర్థాస్ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్ కిసాన్ దివస్గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన కార్యక్రమానికి రాకేశ్ తికాయత్ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్పూర్ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
తెలంగాణలో వీసీల పంచాయితీ
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే?
‘చార్ధామ్’ మార్గంలో విషాదం.. ఇప్పటివరకూ 14 మంది మృతి
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖవాసి అరెస్ట్
ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!
ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
- డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
Advertisement