kottu satyanarayana
-
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. -
‘సిట్ రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు’
సాక్షి, తాడేపల్లిగూడెం: టీటీడీ టెండర్లలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ నలుగురిని సిట్ అరెస్ట్ చేసిన ఘటనను శ్రీవారి లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ ఆరోపణలకు ముడిపెట్టడం ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి వినియోగించారంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా చంద్రబాబులో మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంలో నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండానే ఇష్టారాజ్యంగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా తప్పడు ప్రచారాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలను వైఎస్సార్సీపీ బయటపెడుతుందనే భయంతో చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు తల్లడిల్లేలా తప్పుడు ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసాయంటూ ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించారు. తరువాత సెప్టెంబర్ 25న కేసు నమోదు చేశారు. 26వ తేదీన రాష్ట్రప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తరువాత దీనిపై సుప్రీంకోర్ట్ లో వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటయ్యింది.టెండర్లలో ఉల్లంఘనలను మాత్రమే గుర్తించిన సిట్ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే అంశంపై విచారణకు వచ్చిన సిట్ ముందుగా టీటీడీ నిర్వహిస్తున్న టెండర్లను పరిశీలించింది. దీనిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించి, దానికి కారణమైన నలుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసింది. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా మరోసారి వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి తెగబడ్డారు. నెయ్యిలో కల్తీ జరిగిపోయిందని, ఈ కల్తీ నెయ్యి విషయంలోనే నలుగురి అరెస్ట్ జరిగిందంటూ అసత్య ప్రచారానికి తెర తీశారు. నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశాన్ని సిట్ నిర్ధారించక ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయనకు నిత్యం భజన చేసే ఎల్లో మీడియా నిర్ధారించి తీర్పులు కూడా చెప్పేయడం దుర్మార్గం.ఆది నుంచి చంద్రబాబు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడం, వైఎస్సార్సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ మొదట్లో తప్పుడు ప్రచారం చేశారు. నీచమైన రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏఅంశాని అయినా సరే వాడుకోగల ఘనుడు. నిత్యం అబద్ధాలతోనే రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా నిలుస్తోంది. చంద్రబాబు చెప్పే ప్రతి దుర్మార్గమైన మాటను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ల్యాబ్లు టీటీడీకి ఉన్నాయి. 2024 జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి ట్యాంకర్ల నుంచి నెయ్యి శాంపిళ్లను తీసి టీటీడీ ల్యాబ్లో పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగానే ఈ శాంపిళ్లు ఉన్నాయని నిర్థారించడం కూడా జరిగింది. అంటే లడ్డూ తయారీకి వస్తున్న నెయ్యిని పూర్తి స్థాయిలో పరిశీలించే ల్యాబ్లు, మెకానిజం టీటీడీకి ఉంది. ఈ పరిశీలనలో ఏ మాత్రం నాణ్యాతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తేలినా ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు.ఈ విషయాన్ని మొదటి నుంచి వైఎస్సార్సీపీ చెబుతూనే ఉంది. కానీ చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వాస్తవాలు అక్కరలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు వైఫల్యాలను ప్రజలు మరిచిపోయేలా చేయాలంటే ఒక బలమైన అంశంతో ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే వారి లక్ష్యం. హిందూధర్మాన్ని అనుసరించే భక్తులు శ్రీవారి లడ్డూలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిందని ఉచ్ఛరించడానికే ఇష్టపడరు. అలాంటిది దుర్మార్గమైన కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారు.వెనక్కి పంపిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎలా వినియోగిస్తారు?గత ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నాలుగు ట్యాంకర్ల ద్వారా కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. వీటి నుంచి ఎన్డీడీపీకి టెస్ట్ కోసం నెయ్యి శాంపిళ్ళను పంపించారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. దీనిలో కూడా ఈ నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎక్కడా లేదు. ఎన్డీడీపీ తన నివేదికలో ఈ నెయ్యిలో వనస్పతి కలిసి ఉండే అవకాశం ఉందని, మా నివేదిక తప్పు కూడా అయ్యేందుకు అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం: వైఎస్ జగన్అదే విధంగా జూలై 23నే టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఈ నాలుగు ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిని వెనక్కి పంపించేశామని, ప్రసాదంలో ఉపయోగించలేదని కూడా ప్రకటించారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వాడకపోయినా రెండు నెలల తరువాత అంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు ఆ నెయ్యిని వాడినట్లు ప్రకటించడం రాజకీయ దురుద్దేశంతో కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డెయిరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా ప్రారంభించారు. దీనిని సీబీఐ కూడా గుర్తించింది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపై మాట్లాడేప్పుడు ఏ ఆధారాలతో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆరోపించారని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటు తప్ప పట్టింది. దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెప్పలేదు. -
ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది బాబూ?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ క్యాంప్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ చదివే 9 లక్షల మందికి గత ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏడిపిస్తుందని మండిపడ్డారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన, ట్రెజరీలో సిద్ధంగా ఉన్న డబ్బు విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం జమ చేయలేదు. రేపటి భవిష్యత్తు విద్యార్థులది. వారికి ప్రోత్సహాం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదు. తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను చదివిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ తరపున నిరసన చేపడుతున్నాం’’ అని కొట్టు సత్యనారాయణ తెలిపారు...పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంకలా అవుతుందని గగ్గోలు పెట్టి.. ఇప్పుడు లక్షల కోట్లు ప్రభుత్వం అప్పులు చేస్తుంటే నోరుమెదపట్లేదు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని సినీఫక్కిలో డైలాగులు చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. ఆర్బీకె ల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్ళం. అన్నదాత సుఖీభవ అని 20వేలు ఇస్తామని చెప్పారు దాని ఊసే లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీ గురించి కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. యువగళంలో లోకేష్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు 3000 నెలకి ఇస్తానని నమ్మపలికారు.ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు కొనసాగిస్తామని ప్రక్కన పెట్టేసిన వ్యక్తి చంద్రబాబు. స్వలాభం, స్వార్థం, చేతకానితనంతో విజయవాడను ముంచేశారు. దాతలు ఇచ్చిన సొమ్మును కూడా వందల కోట్లు కాజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి 1 లక్షా 19 వేల కోట్లు ఇప్పటివరకు అప్పులు చేశామని చెబుతున్నారు. దీంతో పాటు మామూలుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకుండా ఇదంతా ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.‘‘సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు అర్థమవుతుంది. పొంతన లేని మాటలు, పొంతన లేని పనులు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. సీజ్ ద షిప్ అంటారు అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని కూడా ఆయనకు తెలియదు. ప్రజలు ప్రస్తుతం ఎంత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఈ ప్రభుత్వానికి తెలుసా?. చంద్రబాబు 40 సంవత్సరాల అనుభవం ఏమైంది. మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలకు అర్ధమవుతుంది. తాడేపల్లిగూడెంను ఒక పేకాట హబ్ గా మార్చేశారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రజాప్రతినిధులే అందులో పాల్గొనడం దారుణం’’ అని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. -
భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. ఎందుకు ఇలా చేశారు
-
‘చంద్రబాబు విధ్వంసం.. పురందేశ్వరికి కనబడలేదా?’
సాక్షి, తాడేపల్లి: పురందేశ్వరి (Purandeswari) కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు వలన హైందవ ధర్మానికి కల్గిన నష్టాల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబు వలన గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు చనిపోయినా ఆమె పట్టించుకోలేదు. విజయవాడలో చంద్రబాబు 50 ఆలయాలను కూల్చేసినా ఆమెకి కనపడలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు వేతనాలను పెంచారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేసింది కూడా జగనే. వంశపారంపర్య హక్కులను జగన్ తీసుకువచ్చారు’’ అని కొట్టు సత్యనారాయణ వివరించారు.కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం, కనకదుర్గమ్మ గుడి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, వాడపల్లి, అంతర్వేది, అయినవల్లి.. ఇలా అనేక ఆలయాల్లో అభివృద్ధి చేశారు. విజయవాడ గుడికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 49 ఆలయాల్లో ఏకకాలంలో కుంభాభిషేకాన్ని జగన్ నిర్వహించారు. కంచి పీఠాధిపతి సైతం దీన్ని మెచ్చుకున్నారు. శ్రీ వాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారు. ఇలా చేసిన అనేక మంచి కార్యక్రమాలు పురందేశ్వరికి కనపడలేదు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు పొందటానికే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ శంఖారావంలో రాజకీయాలు మాట్లాడటం పురంధేశ్వరికే చెల్లింది. చంద్రబాబు కోసమే ఆమె పని చేస్తున్నారు. సెక్షన్ 83 ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు వసూలు చేయటం, అన్యాక్రాంతమైన భూములను కాపాడారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయి. తిరుమల లడ్డూని అనవసరం వివాదం చేశారు.దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారు. దాన్ని కొనసాగేలా ఇప్పటి ప్రభుత్వం చూడాలి. అంతేతప్ప ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. -
సినిమా డైలాగులకు తప్ప దేనికి పనికిరాడు.. చంద్రబాబుకు బుద్ధి రావాలని దేవుడ్ని కోరుకున్న
-
పవన్, బాబును ఏకిపారేసిన కొట్టు సత్యనారాయణ
-
బాబూ.. ప్రధాని మోదీ మాటలు గుర్తున్నాయా?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుందని ఆరోపించారు. అలాగే, బుడమేరు మునగడానికి కారణం కూటమి నేతలు కాదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 67వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చుపెట్టారు?.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్లు భారం మోపారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైఎస్సార్సీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది.అమరావతికి కొత్త కళ అంటున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా?. బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారు.. అవి ఎవరికి ఖర్చుపెట్టారు?. బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లికేజ్ మొదలయ్యాయి. పోలవరంలో అవినీతి జరిగింది అనడానికి సిగ్గు ఉందా?. ప్రధాని మోదీనినే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీంఎంలా వాడుకున్నారని కామెంట్స్ చేశారు. ప్రధాని మాటలను కూటమి నేతలు మర్చిపోయారా?.మొన్నటి వరకు అమరావతి, తిరుపతి లడ్డు, పోలవరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.. ఇప్పుడు కొత్తగా సీజ్ ది షిప్ అని మొదలుపెట్టారు. అక్కడ రెండు షిప్లు ఉంటే ఒక్కటే సీజ్ చేయడానికి కారణం ఏంటి?. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పోర్టుకి వెళ్తే నన్నే రానివ్వలేదు అనడానికి సిగ్గుపడాలి. తాడేపల్లిగూడెంలో మూడు లారీల పీడీఎస్ బియ్యం సీజ్ చేస్తే వాటిని ఎవరు వదిలేశారు?. రైతులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.. రైతులను ఆదుకోలేదు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. 30వేల మంది ఆడపిల్లలు కనిపించడంలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎంత మంది ఆడపిల్లలను కనిపెట్టారు?. తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్టణంలో ఐదు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్లు నడుపుతున్నారు. పోలవరం గట్లపై ఉన్న ఎర్ర కంకరను కూటమి నాయకులు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో రైతులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారు. ప్రజలను అన్ని విషయాల త్వరలోనే తెలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రజలు చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంది
-
‘సూపర్ సిక్స్’ హామీలకు ఎంత ఖర్చు చేశావ్ బాబూ?’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఐదు నెలల్లో రూ. 59 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్ హామీలకు ఎంత ఖర్చు చేసిందంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదు నెలల పాలనలోనే ప్రజలు తిరస్కరించే స్థితికి వచ్చారని దుయ్యబట్టారు.‘‘ప్రజలు ఓటు వేశారంటే.. ఆంబోతుకి అచ్చేసి వదిలేసినట్లు కాదు. అధికారం వస్తే ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించడం కాదు. స్థానిక ఎమ్మెల్యే అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే దానికి స్థానిక ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాడేపల్లిగూడెంలో లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకున్నవా? మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల కాలంలో పట్టణంలో నాలుగు హత్యలు జరిగాయి. నేరుగా బెల్టు షాపులు గురించి మీ ఎల్లో మీడియాలొనే రాస్తున్నారు.. మాట్లాడే ముందు సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు.‘‘రోడ్లు, గుంతలు గురించి మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఎన్ని రోడ్లు వేశారు?. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవాబ్పాలెం నుంచి నిడదవోలు, చిలకంపాడు లాకుల నుండి వెంకట్రామన్నగూడెం వరకు రూ. 45 కోట్ల నిధులతో నాలుగు లైన్స్ రోడ్లు వేశాం కనబడట్లేదా?. వైఎస్ జగన్ కుటుంబం గురించి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడగలవా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.‘‘ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నపుడు శారదా గ్రంథాలయం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. అప్పడు నువ్వు డబ్బుల కోసం ఆపిన శారదా గ్రంథాలయం ప్రాంతంలో పెట్టిన వ్యాపారాన్ని నువ్వే ఇప్పుడు ప్రారంభోత్సవం చేశావ్. ప్రభాత థియేటర్ వెనకాల చేసిన సెటిల్మెంట్లో ఎంత తీసుకున్నావ్? ఎల్ఈడి లైట్లు పేరు మీద ఎంత నొక్కేసావ్?’’ అంటూ కొట్టు సత్యనారాయణ నిలదీశారు.‘‘నా కుమారులు గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తిరుపతి దర్శనాలలో అవినీతి జరగకూడదని వారికి అప్పగించాను. 2018లో దారిలో అమ్మేస్తున్న పీడిఎస్ బియ్యం లారీలు పట్టుకుని పెద్దాపురం పోలీస్ స్టేషన్లో పెడితే దాని కాంట్రాక్టు పేరు మార్చుకోలేదా? నిన్న కాక మొన్న మీకు సంబంధించిన వాళ్ల పీడీఎస్ బియ్యం లారీలు పట్టుకుంటే ఎమ్మెల్యే తన కొడుకు ద్వారా సెటిల్మెంట్ చేయించారు. కంగారు పడకు ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఒక సలహా ఇస్తున్నా గోతులు పూడిపించాను అని చెప్పడం మానేసి రోడ్ల నిర్మాణానికి ఎంత శాంక్షన్ చేశారో చెప్పాలి’’ అని కొట్ట సత్యనారాయణ అన్నారు. -
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ కామెంట్స్
-
మోసం అనే పదానికి బాబు బ్రాండ్ అంబాసిడర్: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజలను మోసం చేయడం అనే పదానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు వేశారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర పరిపాలనా చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో వరద బాధితుల కోసం ప్రజలు కదిలి వస్తే ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వలేదని మండిపడ్డారు.మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలను మభ్యపెట్టి లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో ఇంటి ఇంటికి తిరిగి పెరిగిన రేట్లుపై లేనిపోని కథలు అల్లారు. మరి నిత్యవసర వస్తువులు, పెట్రోలు మీద పెరిగిన రేట్లు తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయలేదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 55వేల కోట్లు అప్పులు చేశారు. చేసిన అప్పులు ఎక్కడికి వెళ్లాయి. కరెంట్ చార్జీలు పెంచమని అన్న మీరు ఇప్పుడు సామాన్య ప్రజలపై ఎలా భారం మోపారు. ఇసుక రేట్లు భారీగా పెంచేసి ప్రజలకు మరింత కఠినతరం చేశారు. ఇసుక కొరత వల్ల భవన కార్మికులకు పని దొరక్కపోవడంతో రోడ్డున పడ్డారు. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి భారీ రేట్లతో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపులు దర్శనం ఇస్తుంటే మన రాష్ట్రం ఎక్కడ పోతుందని భయమేస్తుంది.40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్. కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలు సాయం చేస్తే ఒక్క రూపాయి ప్రజలకు పంచిన పాపన పోలేదు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిపోయిందో చెప్పాలి. అగ్గిపెట్టలు, కొవ్వొత్తులకు 23కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పడం సిగ్గు చేటు. చంద్రబాబుకి దేవుడు మీద విశ్వాసం లేదు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెప్పాడు. దీనికి తోడు ఎల్లో మీడియాలో విష ప్రచారం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు.. చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. పాలన చేతకాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు.షర్మిలతో చేయి కలిపి వైఎస్ జగన్ కుటుంబాన్ని చంద్రబాబు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతో ఎలాగైనా బలహీనం చేసేందుకు షర్మిలతో ఆస్తి పంపకాలు నాటకాలు మొదలు పెట్టాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు మంత్రిలాగా వ్యవహరించడం లేదు.. డ్రామా ఆర్టిస్టులా ప్రవర్తిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్పై కనీస అవగాహన లేకుండా మంత్రి మాట్లాడం హాస్యాస్పదం.ఆనాడు ప్రత్యేక హోదా గాలికి వదిలేసి పోలవరం డ్రామాలు ఆడారు. పోలవరం పూర్తి అయితే కోటి ఎకరాలు ఆయకట్టు బాగుపడుతుందని వైఎస్సార్ వేసిన ఆశయం వైఎస్ జగన్ 80 శాతం పూర్తి చేశారు. ప్రజలు సూపర్ సిక్స్ నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కూటమి అధికారంలోకి వచ్చినా సూపర్ సిక్స్ ఎక్కడా లేదు. అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు పెట్టి చేతులు దులుపుకున్నారు. పేద విద్యార్థుల కోసం ఏడు మెడికల్ కాలేజీలు కడితే వాటిని నిర్వీర్యం చేసి విద్యార్థుల గొంతు కోశారు. రైతులను కూడా కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ పలు కార్యక్రమాలతో ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. -
సెంటిమెంట్ మీద కొట్టావ్..
-
నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. అలాగే, బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చేతకాని కూటమి పాలనను ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా? అంటూ ప్రశ్నించారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పశ్చిమ గోదావరిలో మీడియాతో మాట్లాడుతూ..‘గత రెండు మూడు రోజులుగా నీచాతినీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తానే అని చెప్పుకునే విధంగా సీఎం చంద్రబాబు ఆ కలియుగ దైవాన్ని అడ్డుపెట్టుకున్నాడు. వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడకూడదని డైవర్షన్గా నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి ప్రసాదంపై ఎంతో దారుణంగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆ వేంకటేశ్వరస్వామి సహించడు. తిరుపతిలో ఏ వస్తువు కొనాలన్నా టెండర్ ప్రకారం పూర్తిగా తనిఖీలు అయ్యాకే అనుమతి ఇస్తారు. నిజంగా జూలై 22న రిపోర్ట్ వస్తే ఇంతకాలం ఎందుకు తొక్కి ఉంచారు. నీ చేతకాని 100రోజుల పరిపాలన ప్రజలు నిలదీస్తారని ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలకు తెరలేపారా?. ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం కట్టి తిరుపతిలో అడ్మినిస్ట్రేషన్ నచ్చి వారిని అయోధ్యకు తీసుకెళ్లారు. తిరుపతి వంటి అడ్మినిస్ట్రేషన్ అయోధ్యలో తీసుకురావాలని చూశారు. అటువంటి తిరుపతిలో తప్పు జరిగిందని చెప్పడం ఎంత దారుణం. కోట్లాది మంది హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. బూట్లు వేసుకుని దేవుడిని పూజించే సంస్కారం చంద్రబాబుది. నీ హయాంలో జరిగిన తప్పు ఎవరి మీదకి నెట్టేస్తున్నావ్. ఇదంతా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. తగిన మూల్యం చెల్లించక తప్పదు. హాథిరామ్ మఠం దేవాదాయ శాఖ భూములను కాజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు. గత ఐదేళ్లలో దేవాలయాలు చాలా బాగా నడిచాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. సీజీఎఫ్ నిధుల ద్వారా 600 కోట్లతో పురాతన దేవాలయాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4100 పైగా దేవాలయాలను అభివృద్ధి చేశాం. మేము దేవాలయాలను ఇంత అభివృద్ధి చేస్తే చంద్రబాబు దేవాదాయ శాఖలో రివ్యూ చేసి గత ప్రభుత్వంలో జరుగుతున్న దేవాలయాల పనులను ఆపేయమని ఆదేశాలు జారీచేశారు. ఇదంతా చూస్తూ బీజేపీ నాయకులు ఎందుకు నిలదీయడంలేదు. కూటమి భాగస్వాములు ఏం చేస్తున్నారు.సూపర్ సిక్స్ అన్నారు ఏమైపోయింది. ఒక ప్రాంతంలో వచ్చిన వరదను కూడా మీరు ఎదుర్కోలేక పోయారు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడు ఉండడు. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకుని చేసిన తప్పు ఒప్పుకో. మన రాష్ట్రానికే తలమానికంగా నిలిచే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీదే నిందలు వేయడం అత్యంత బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: దేవుడి మీద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది: ఎమ్మెల్సీ బొత్స -
టీడీపీ తల్లికి వందనంపై కొట్టు సత్యనారాయణ సెటైర్లు
-
చంద్రబాబుపై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కొట్టు సత్యనారాయణ
పశ్చిమగోదావరి: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయాలని చూసే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చారని తెలిపారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లు కరోనాతో పోరాడాం. ఐదేళ్లు పూర్తి స్థాయిలో పదవికి న్యాయం చేసి ప్రజలకు మేలు చేశాం. కార్పొరేట్ విద్య ద్వారా దోచుకుంటున్న తరుణంలో దానికి ధీటుగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చాం. ప్రజలు సంక్షేమ పథకాలు ద్వారా సంతృప్తితో ఉన్నారని అనుకున్నాం. కానీ ప్రలోభాలకు గురి అవుతారని అనుకోలేదు...సంక్షేమ పథకాలు ద్వారా ఏడాదికి 70 వేల కోట్లు ఇచ్చేస్తూ ప్రభుత్వాన్ని అప్పుల పాలు అయిపోతుందని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంతకుమించి హామీలు ఇచ్చారు. వాలంటీర్లను నానా మాటలు అని మేము వస్తే 10వేలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో గెలిచిన వ్యక్తి గత ఎన్నికల్లో నా మీద 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంత మాత్రాన ఏమి అయిపోలేదు. ప్రజల కోసం మేమెప్పుడు పోరాడుతూనే ఉంటాం. ..2019లో ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చినా మేము విర్రవీగాలేదు, దాడులు చేయలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మాధవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు నోరు లేని మూగజీవలు కోసం నిల్వ పెట్టుకున్న గడ్డివాములను జనసేన కార్యకర్తలు పెట్రోల్ పోసి నిప్పటించారు. ఎన్నికల కౌంటింగ్ తరువాత స్పష్టమైన మెజారిటీ కూటమి సాధించింది. రాజ్యాంగం మీద మాకు విశ్వాసం ఉంది’’ అని అన్నారు.చదవండి: అధికారుల వల్లే నాడు టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు చెప్పగలరా? -
టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఫైర్
-
రౌడీయిజం సాగదు..టీడీపీ నేతలపై ఫైర్
-
‘పవన్పై ప్రజలకు చాలా అనుమానాలున్నాయ్’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి వారిని హక్కుదారులను చేయాలని చూస్తే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడు రామోజీరావు దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాడని.. 50 ఏళ్ల సామ్రాజ్యం అనుకునే ఈనాడు తన సామ్రాజ్యాన్ని తానే కొల్లగొట్టుకుంటుందని దుయ్యబట్టారు. జెండా సభకు జనం రాకపోతే అది కప్పిపుచ్చుకునేందుకే జెండా సభకు వచ్చిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని విషపు రాతలు రాస్తున్నారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్లు పై దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు. వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తే నష్టపోయేది ప్రజలే. చంద్రబాబు లాంటి తన్నే దున్నపోతు వెనుక ఎవరు వెళ్లే పరిస్థితి లేదు’’ అని మంత్రి అన్నారు. చంద్రబాబు రాసిచ్చింది చదివే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ ఊగిపోతూ మాట్లాడుతున్నాడో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇటీవల కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తున్నట్లు.. ఏ మాఫియా వీరికి ఏమేమి సప్లై చేస్తారో మాకు తెలియదు. పవన్ కల్యాణ్ ఉన్మాదంతోనే మాట్లాడారు. జెండా సభలో పవన్ మాట్లాడిన తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. 24 సీట్లు వల్ల కాపులకు ఒరిగేదేమీ లేదు. పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడు పోయాడని అనుకుంటున్నారు. పవన్ తీరు చూసి కాపులు సిగ్గుపడుతున్నారు. ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్న పరిస్థితి. పవన్పై కాపు సామాజిక వర్గానికి నమ్మకం పోయింది. పవన్ కల్యాణ్ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ -
పవన్ వ్యాఖ్యలను ప్రజలు హర్షించరు
-
ఆలయ దర్శనం.. ఆధ్యాత్మిక పరవశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ, పర్యాటక శాఖ సంయుక్తంగా భక్తులకు వ్యయప్రయాసలు లేనివిధంగా ఆలయ దర్శనాలు కల్పించనుంది. ఇందులో భాగంగా తొలి దశలో 20 ప్రముఖ, చారిత్రక ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 సర్క్యూట్లను రూపొందించింది. స్పెషల్ దర్శనంతో పాటు భోజన, వసతి, రవాణా సౌకర్యాలతో కూడిన ఒకటి/రెండు రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వేర్వేరుగా ఆధ్యాత్మిక సర్క్యూట్ల ప్రయాణాలను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. నచ్చిన ప్యాకేజీల్లో నిత్య దర్శనం పిల్గ్రిమ్ పాత్వేస్కు చెందిన ‘బుక్ మై దర్శన్’ వెబ్సైట్ ద్వారా ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించనుంది. గతంలో సీజన్ల వారీగా నడిచే ప్యాకేజీ టూర్లను ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సాధారణ ప్యాకేజీలో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ అయిన బుక్ మై దర్శన్ ద్వారా భక్తులు కోరుకున్న (కస్టమైజ్డ్ సర్వీసు) ఆలయాల దర్శనాలకు, పర్యటనలకు, గైడ్, భోజన వసతుల (బ్యాకెండ్ సర్వీసుల)ను కల్పిస్తోంది. ఏపీటీడీసీ బస్సులతో పాటు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఏపీటీడీసీకి చెందిన 21 బస్సులు, మరో రెండు వాహనాలు పర్యాటక సేవలు అందిస్తున్నాయి. వీటిలో 15 బస్సులు తిరుపతిలో, మరో 8 వాహనాలు విశాఖపట్నంలో నడుస్తున్నాయి. తాజాగా ఆధ్యాత్మిక సర్క్యూట్లను నిర్వహించేందుకు ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ సేవలను ‘బుక్ మై దర్శన్’ అందించేలా అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుత ప్యాకేజీల ద్వారా రోజుకు 1,500 నుంచి 2వేల మంది వరకు మాత్రమే పర్యాటకులు నమోదవుతున్నారు. ఈ సంఖ్యను 5వేల వరకు పెంచాలని ఏపీటీడీసీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులను పెంచుతోంది. తొలి దశల్లో 18 సర్క్యూట్లను ప్రతిపాదించగా.. రెండో దశలో మరో 7 సర్క్యూట్లను తీసుకురానుంది. తిరుపతిలో బ్యాక్ ఎండ్ సర్వీసుల కింద ప్రతి పర్యాటకుడికి ఆర్ఎఫ్ఐబీ ట్యాగ్లు వేసి పక్కాగా దర్శనం కల్పించేలా సాంకేతిక వ్యవస్థను వినియోగించనుంది. ఒక రోజు ప్యాకేజీ ధరలు ఇలా (పెద్దలు/చిన్నారులు) ♦ విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్ (రూ.970/రూ.780) ♦ హైదరాబాద్, శ్రీశైలం (రూ.1,960/రూ.1,570) ♦ కర్నూలు, శ్రీశైలం (రూ.1,560/రూ.1,250) ♦ విశాఖపట్నం సిటీ టూర్ (రూ.940/రూ.750) ♦ కర్నూలు, మంత్రాలయం (రూ.1,320/రూ.1,060) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం (రూ.1,650/రూ.1,320) ♦ విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం (రూ.1,470/రూ.1,180) ♦ విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం (రూ.1,560/రూ.1,250) ♦ రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం(రూ.1,470/రూ.1,180) ♦ విజయవాడ, ద్వారకా తిరుమల, మద్ది ఆంజనేయస్వామి (రూ.1,610/రూ.1,290) ♦కడప, గండి, కదిరి, లేపాక్షి (రూ.1,840/1,470) 2 రోజుల ప్యాకేజీల ధరలు ఇలా ♦ కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ (రూ.3,220/రూ.2,560) ♦ కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,020/రూ.3,220) ♦ విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది (రూ.4,670/రూ.3,740) ♦ విశాఖపట్నం, అరకు (రూ.3,070/రూ.2,460) ♦ కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం (రూ.4,460/రూ.3,570) ♦ కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం (రూ.4,520/రూ.3,610) -
4,500 కొత్త ఆలయాల్ని నిర్మించాం
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో 4,500 కొత్త ఆలయాల్ని నిర్మించిందని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేవుడి ఆస్తుల రక్షణతోపాటు ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తక్కువగా ఉండే చిన్న గుళ్లలో సైతం నిత్యం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు కొనసాగేలా.. డీడీఎన్ఎస్ పథకం పేరుతో అర్చకులకు తగిన ఆరి్థక సహాయం చేస్తోందన్నారు. 19 డీసీ, 22 ఏసీ పోస్టుల పదోన్నతి ఇటీవల కాలంలో ఆలయాల వార్షిక ఆదాయం ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల స్థాయిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు దేవదాయ శాఖలో కొత్తగా మంజూరు చేసిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్లుగా పనిచేస్తున్న 19 మందికి డిప్యూటీ కమిషనర్లుగానూ.. వివిధ ఆలయాల్లో గ్రేడ్–1 ఈవోలుగా, ఏఈవోలుగా, కార్యాలయాల్లో సూపరింటెండెంట్లుగా పనిచేస్తున్న మరో 22 మందికి అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. -
900 వందల దేవాలయాలను బాగుచేశాం.. మంత్రి కొట్టు కీలక కామెంట్స్
-
రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి
తొండంగి: రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్ నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు. -
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్..
-
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
పవన్, బాబులపై మంత్రి కొట్టు సత్యనారాయణ అదిరిపోయే పంచులు..
-
సైబర్ సిటీ అన్నావ్.. జెండా పీకేశావ్..సత్యనారాయణ కౌంటర్
-
వైభవంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
-
దుర్గగుడి పంచాంగం బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
-
పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారు: కొట్టు
-
‘పురంధేశ్వరి.. బాబు అవినీతిపై మీ భర్త రాసింది మర్చిపోయారా?’
సాక్షి, నంద్యాల జిల్లా: చంద్రబాబు అవినీతి వ్యవహారాన్ని ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో పోల్చారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ, మా ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష ఎందుకుంటుంది? బాబును అక్రమంగా అరెస్ట్ చేయలేదు, అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వంలోనే స్కిల్ స్కామ్ ఆధారాలున్న ఫైల్స్ తగులబెట్టారు. పురంధేశ్వరి టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు ఇంటి భోజనం వస్తోంది. జైలుకు వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు కేజీ బరువు పెరిగారు. పురంధేశ్వరి చెల్లి కొడుకును తీసుకొని అమిత్ షాను కలిసింది. గతంలో ఆమె భర్త చంద్రబాబు గురించి బుక్స్ రాశారు అవి మర్చిపోయారా’’ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చదవండి: ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం? -
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం: మంత్రి కొట్టు
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాల ఏర్పాట్లను శనివారం.. మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో కె.ఎస్.రామారావు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ భక్తుడికి అమ్మవారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓమ్ టర్నింగ్ వరకూ మూడు క్యూలైన్లు.. అక్కడి నుంచి ఐదు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. కేశ ఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండ చరియలు విరిగిపడిన దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ‘‘సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టాం. 3,500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం. 500 రూపాయల తీసుకున్న వారికి ముఖమండపం నుంచి దర్శనం. భక్తులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం రాకకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేశాం. గతేడాది సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అందుకే ఈసారి బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, ఏసీటీ నుంచి కనెక్షన్లు తీసుకున్నాం. వృద్ధులకు దర్శనం కోసం ఉదయం, సాయంత్రం రెండు ప్రత్యేక స్లాట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
చంద్రబాబుకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి భువనేశ్వరి, లోకేష్లదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పెంటపాడు మండలం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ దగ్గర ‘‘జగనన్న ఆరోగ్య సురక్ష’’ మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదన్న మంత్రి.. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం చంద్రబాబుకి ఉందన్నారు. ఆనాడు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును కట్టుకున్న భర్త చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ను అధికారంలో నుంచి దించేసి చివరకు ఆయన చావుకు కారణమైన కానీ భువనేశ్వరి స్పందించలేదు’’ అని మంత్రి గుర్తు చేశారు. చదవండి: టీడీపీ వీరాభిమానికి గుండె వ్యాధి.. ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వం -
పవన్ కాపుల పరువు తీసేశాడు: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు కాపు సామాజిక వర్గానికి చేసిన మేలు ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. గురువారం ఆయన తాడేపల్లిగూడెంలో ‘కాపు నేస్తం’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయన్నారు. నాలుగేళ్ల పాలనలో రూ.1492 కోట్లను కాపు సోదరీమణులకు అందించిన ఘనత సీఎం జగన్ది అని మంత్రి కొనియాడారు. ‘‘కాపులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కాపులను అణగదొక్కేందుకు ముద్రగడ కుటుంబాన్ని హింసించారు. రైలుకు నిప్పు పెట్టించి కాపులపై బాబు దొంగ కేసులు పెట్టించాడు. పవన్కు డబ్బులు సంపాదించడం తప్ప వేరే ఆలోచన లేదు. నమ్ముకున్న కాపుల పరువు తీసిన వ్యక్తి పవన్’ అంటూ మంత్రి సత్యనారాయణ మండిపడ్డారు. చదవండి: లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు -
పాజిటివ్ ఓటుతోనే మళ్లీ పగ్గాలు..
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పాజిటివ్ ఓటుతోనే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో అమలుచేసిన పాలన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత కార్యక్రమాలే తమ పా ర్టీకి వజ్రాయుధాలన్నారు. గత ఎన్నికలకు ముందు చెప్పినవి చిత్తశుద్ధితో అమలుచేశామని, దీంతో ప్రజలు ప్రభుత్వంపట్ల పూర్తి సంతృప్తిని కనబరుస్తున్నారని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సీం వైఎస్ జగన్ ఎన్నికల కోసం పనిచేసే మనిషి కాదు. ప్రజలకు వీలైనంత ఎక్కువ మంచి చేసి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. రాష్ట్రంలో 1.62 కోట్ల కుటుంబాల ఇళ్లకు వలంటీర్లను పంపి, అందరి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, ఆ ఊళ్లో డాక్టర్ల క్యాంపులు పెట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలపట్ల సీఎం చిత్తశుద్ధి తెలిసిపోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించే పరిస్థితి ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అడ్డుపడడమే పనిగా పనిచేస్తున్నాయి’అని అన్నారు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో కొన్ని ఆలయాల స్థాయిని పెంచడం ద్వారా దేవదాయ శాఖలో అదనంగా 14 డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులు అవసరమవుతాయి. పదోన్నతుల ద్వారా ఇప్పటికే ఉన్న సిబ్బందికి ఈ పోస్టుల భర్తీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకుల్లో ప్రస్తుతం నగదు డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నందున.. గతంలో తక్కువ వడ్డీ రేటుకు డిపాజిట్లు చేసిన చోట సమీక్షించి, అవసరమైతే పాత డిపాజిట్లను రద్దుచేసి కొత్తగా అదనపు వడ్డీ రేటుకు డిపాజిట్ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించాం. -
పవన్ కు చంద్రబాబు మాయ పట్టుకుంది: డిప్యూటీ సీఎం కొట్టు
-
పవన్ పై రెచ్చిపోయిన మంత్రి కొట్టు సత్యనారాయణ
-
గిఫ్ట్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఏపీకి రిటర్న్ రమ్మనండి..
తాడేపల్లిగూడెం రూరల్: గిఫ్ట్ సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఏపీకి రిటర్న్ రమ్మనండి.. తండ్రి జైల్లో ఉంటే కొడుకు ఢిల్లీలో ఖరీదైన లాడ్జిలో కులుకుతున్నాడు.. అంటూ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ లోకేశ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లోకేశ్ ఉన్న లాడ్జికి రోజుకు రూ.2 లక్షల 25 వేలు అద్దె చెల్లించి అక్కడ జల్సా చేస్తున్నాడని ఆయన చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం కృష్ణయపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు పీఏ అమెరికా పారిపోగా, ఇంకొకరు దుబాయ్ పారిపోయాడని మరొకరు మాయమైపోయాడని ఆయన అన్నారు. ఇక లోకేశ్ విషయానికొస్తే ఏ క్షణంలో అయినా తనను అరెస్టు చేస్తారని భయంతో ఢిల్లీలో దాక్కున్నాడని చెప్పారు. అది కూడా రోజుకు రూ.2,25,000 అద్దె చెల్లించి లాడ్జిలో జల్సా చేస్తున్నాడని విమర్శించారు. ఇక్కడ తండ్రి చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో జైలులో ఉంటే అక్కడ కొడుకు లోకేశ్ ఖరీదైన లాడ్జిలో జల్సాగా గడుపుతున్నాడని చెప్పారు. రాష్ట్రం నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కుని సొల్లు కబుర్లు చెప్పడం కాదని, ఆంధ్రప్రదేశ్కు వస్తే ఎవరికి ఎవరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో తెలుస్తుందని అన్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం జగన్ కృషి
సాక్షి, అమరావతి: హిందూ ధర్మ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ఆయన బలోపేతం చేశారన్నారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న 1,401 దేవాలయాలకు దీని ద్వారా సాయం అందించేవారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం 150 ఆలయాలను మాత్రమే ఈ కార్యక్రమంలోకి కొత్తగా తెచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.30 వేల వార్షికాదాయ పరిమితిని రూ.లక్షకు పెంచి, 2,978 దేవాలయాలకు అదనంగా లబ్ధి చేకూర్చామన్నారు. ప్రస్తుతం 4,750 దేవాలయాలకు ఈ కార్యక్రమం ద్వారా నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఏటా రూ.28.50 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 2,961 దేవాలయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.ఈ దేవాలయాల నిర్వహణకు ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. ♦ అర్చకులకు ఇచ్చే గౌరవ వేతనాల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయని వాటిని సరిచేయడంతో పాటు, అర్చకులు, పురోహితులకు దేవదాయ శాఖ నుంచి గుర్తింపు కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. ♦ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వినుకొండలోని కొండపై దేవాలయం నిర్మాణంలో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందన్నారు. ♦ రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ధూపదీప నైవేద్యం కార్యక్రమం పరిధిలోకి రాకుండా మిగిలిపోయిన ఆలయాలు ఉంటే వాటికి ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయాలని పొన్నూరు ఎమ్మెల్యే కె. రోశయ్య విజ్ఞప్తి చేశారు. ♦ విజనరీనని గొప్పలు చెప్పే చంద్రబాబు తాను సీఎంగా ఉండగా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి చేసింది శూన్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి. మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ♦ అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను పరిరక్షించాలని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. సర్వే నంబర్లు సబ్డివిజన్ కాకపోవడంతోనే ఆలస్యం సర్వే నంబర్ల సబ్ డివిజన్ కాకపోవడంతోనే నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ఆలస్యమవుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల రైతుల భూములు దేవదాయ భూములుగా నమోదైనట్టు పేర్కొన్నారు. ఐఎఫ్ఆర్, ఇనాం, ఆర్ఎస్ఆర్ వంటి భూములను క్షుణ్ణంగా పరిశీలించి నిషేధిత జాబితాను సవరిస్తామని చెప్పారు. రైతుల భూములను దేవదాయ భూములుగా నమోదు చేసిన అధికారులపై చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. మంత్రి వివరణను కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీదర్రెడ్డి ఆక్షేపించారు. చిన్న, సన్నకారు రైతుల భూములు రెవెన్యూ శాఖను అడిగే ఎండోమెంట్లో కలుపుకున్నారా? అని ప్రశ్నించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించమంటే రెవెన్యూ శాఖను బాధ్యులను చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ఎనిమిదేళ్లుగా రైతులు భూముల హక్కులు బదలాయించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 15 ఎకరాల దేవదాయ భూమి మాత్రమే ఉంటే.. 600 ఎకరాలకు పైగా రైతుల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలకు గురైన దేవదాయ భూములను పరిరక్షించకుండా.. రైతుల భూములను అన్యాయంగా నిషేధిత జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపించారు. దీనికి మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందిస్తూ వీలైనంత త్వరగా నిషేధిత జాబితాను సవరిస్తామన్నారు. -
లోకేష్ ఢిల్లీ వెళితే రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా?
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి ఊడపొడిచేది ఏమీలేదన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. లోకేష్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు మంత్రి. తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. ‘జనసేన తో టీడీపీ కలవడం వల్ల కూడా చాలామంది టీడీపీ నుంచి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు. జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు’ అని ఎద్దేవా చేశారు. చదవండి: బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారు: మంత్రి జోగి రమేష్ -
పవన్ ఉంటే షూటింగ్లో, లేదంటే బాబు కాళ్ల వద్ద ఉంటాడు: కొట్టు సత్యనారాయణ
-
అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి కొట్టు
సాక్షి, పశ్చిమగోదావరి: అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, కుట్ర, అవినీతిమయం అంటూ దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థను మేనేజ్ చేసి దిగజారిపోయి సైకిల్ గుర్తును లాక్కున్నాడు’’ అని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు ఏనాడు ప్రజలపై మమకారం లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. తప్పు చేసి ఎంతో కాలం తప్పించుకోలేరు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. ఇక చంద్రబాబు అధ్యాయం ముగిసిపోయింది. కుట్ర, మోసం, దగా, వెన్నుపోటులకు పుట్టిన హైబ్రిడ్ నాయకుడు చంద్రబాబు. కన్నతండ్రి చనిపోతే తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి జైలు పాలైన వ్యక్తిగా చంద్రబాబు పేరు గాంచాడు. ప్రజలను ఎన్నికల్లో కుక్క బిస్కెట్లు వేసినట్లు డబ్బులు వేసి కొనేయొచ్చని చంద్రబాబు ఆలోచన. ప్రజల్ని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూసాడు. చంద్రబాబు నేను మరిపోయానని ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ స్కిల్ స్కాంకి ఒడిగట్టాడు. చంద్రబాబు నాయుడు కొత్త బిరుదు స్కాం స్టార్ అని సంపాదించాడు. స్కిల్ స్కాం, ఐటీ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి స్కాం, పోలవరం స్కాం, ఇసుక మీద దోపిడీ ఇలా చాలా స్కాంలు ఉన్నాయి.’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబుకి ఆనాడు దోపిడీ చేసిన వాళ్లే మిగిలారు తప్ప.. ప్రజలు ఎవరూ అయ్యో పాపం అన్న పాపాన పోలేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు చేసి ఎంతో కాలం తప్పించుకోలేరని ఈ రోజు రుజువు అయింది. ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరిగింది. ఫైబర్ నెట్లో వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, అమరావతి రాజధాని అంటూ వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు దొరికింది చాలా చాలా చిన్నది.’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: బాబు, పవన్ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? -
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
హైందవ ధర్మానికి విస్తృత ప్రాచుర్యం: మంత్రి కొట్టు
సాక్షి, అమరావతి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు నిర్వహిస్తున్న ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలతో పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ధర్మప్రచార పరిషత్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధర్మప్రచారంలో భాగంగా దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న మేజర్ టెంపుల్స్ ద్వారా ధర్మ ప్రచార మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని, అయితే 6-ఎ ఆలయాల ద్వారా కూడా ధర్మప్రచార వారోత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో మాసోత్సవాలను గత మాసం 6న అన్నవరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. 18న శ్రీకాళహస్తిలో నిర్వహించడమైనదని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ నెల 16 వ తేదీన కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో 115 వరకు 6-ఎ ఆలయాలు ఉన్నాయని ఈ అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు ఆ 6-ఎ దేవాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ధర్మప్రచారం కార్యక్రమంలో భాగంగా ప్రవచనాలు, హరికథలు, భక్తి సంగీతం, కూచిపూడి నృత్యాలు, భజనలు, కోలాటాలు, పారాయణలు ఉంటాయని వివరించారు. వాటితో పాటు సామూహిక ఉచిత కుంకుమ పూజలు, అభిషేకాలు, సరస్వతీ హోమాలు, గోపూజలు, కళ్యాణోత్సవాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నగర- గ్రామ సంకీర్తన, శోభాయాత్రలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని చిన్నారులకు సంప్రదాయ వేషాలు, పాఠశాల విద్యార్థులకు పురాణ పాత్రలు, భగవద్ఘీతపై వ్యాసరచన, వక్తత్వం, చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాలకు, భక్తుల గృహాలకు ఆధ్యాత్మిక అనుబంధాన్ని పటిష్టం చేయాలన్నారు. వివిధ శుభకార్యాలకు వేదికగా ఆలయం నిలవాలన్నారు. వారోత్సవాలను ఏర్పాటు చేసుకుని ప్రచురణ/ ప్రసార మాధ్యమాలు, ఆటోలు ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, పండితులు, కళాకారులు, స్థానిక ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థలు, దాతలు, గ్రామ పెద్దలను, ముఖ్యంగా యువతను ప్రచారంలో భాగస్వాములను చేయాలన్నారు. ధర్మప్రచార పరిషత్ సభ్యులు, ఆర్జేసీ, డీసీ, ఏసీ, 6-ఎ ఆలయ ఈవోలు, మేజర్ టెంపుల్స్ ఈవోలు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకుని 6-ఎ ఆలయాల్లో కార్యక్రమాలను రూపకల్పన చేయాలన్నారు. ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ వైభవాన్ని తెలియజేస్తూ ధర్మప్రచార కార్యక్రమాలు జరగాలన్నారు. కుటుంబ, మానవ, సామాజిక ధర్మాలు, విశ్వ శ్రేయస్సు తదితర అంశాలు గురించి ప్రవచన కర్తలు ప్రవచించాలన్నారు. ధర్మప్రచార రథం నిర్వహణ, విధి విధానాలను అధికారులందరూ విధిగా పాటించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. వారంలో రెండు, మూడు గిరిజన, మత్స్యకార, వెనుకబడిన తరగతులు, తెగలు నివసించే ప్రాంతాల్లో ప్రచార రథం పర్యటించేలా చర్యలు చేపట్టి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ధర్మప్రచార సమయంలో రథం నిలిపినచోట ఉదయం, సాయంత్రం స్థానిక పండితులు, జిల్లాలోని ప్రముఖ పండితులతో ప్రవచనాలు ఏర్పాటు చేసి సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని బోధించాలన్నారు. ధర్మ ప్రచార రథంతో పాటు కనీసం ఒక వేద పండితుడు, అర్నకుడు, పరిచారికుడు, భంజత్రీలు, పర్యవేక్షకుడు, జూనియర్ అసిస్టెంట్, అటెండర్లు సహా మొత్తం 14 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి నెలా ఆ నెలలో జరిగే ధర్మప్రచార రథ యాత్రకు సంబంధించిన రూట్మ్యాప్ను 1వ తేదీ నాటికే దేవాదాయ శాఖ కమిషనర్కు అందజేయాలన్నారు. యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. హైందవ ధర్మప్రచార కార్యక్రమం నిరంతర ప్రక్రియని తెలిపారు. సమావేశంలో దేవదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలివన్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేదాంతం రాజగోపాల చక్రవర్తి, పలు ఆలయాల ఈవోలు, అధికారులు పాల్గొన్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు? -
ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే..తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే..
-
‘తప్పు చేస్తే ఆలస్యం అయినా శిక్ష పడవాల్సిందే’
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘న్యాయస్థానం మీద ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ అధికారంలో కొనసాగాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈరోజు రిమాండ్ కు పంపడం జరిగింది. తప్పు చేస్తే ఆలస్యం అయినా శిక్ష పడవాల్సిందే అని ఈరోజు నిరూపితం అయింది. ఇది ఆరంభం మాత్రమే, చంద్రబాబుకి సంబంధించి ఇంకా వేల కోట్ల కుంభకోణాలు బయట పడాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి. ప్రభుత్వానికి చంద్రబాబు మీద ఎటువంటి వ్యతిరేక భావం లేదు. ప్రతీకారం తీర్చుకోవలన్న ఆకాంక్ష, ఆలోచన లేవు. ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనడానికి ఒక ఉదాహరణ మాత్రమే’ అని అన్నారు కొట్టు సత్యనారాయణ. -
Babu Arrest : బాబు పాపం పండింది, శిక్ష ఖాయం : డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
నూరు పాపాలు చేసిన చంద్రబాబు.. ఎట్టకేలకు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయ్యారుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబును అభినవ శిశుపాలుడిగా అభివర్ణించిన మంత్రి కొట్టు.. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని అంతా దోచుకోడానికే ఉపయోగించుకున్నారని, ప్రజాధనం వేల కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు అక్రమమార్గంలో తరలించారని ధ్వజమెత్తారు. మరిది కోసం వదిన పోరాటమా? రెండెకరాలతో రాజకీయాలను ప్రారంభించిన చంద్రబాబు ఇవ్వాళ లక్ష కోట్లకు ఎదిగాడని, తన పదవులను అడ్డు పెట్టుకోని కోట్లాది రుపాయలను అక్రమంగా సంపాదించారని మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ పురందేశ్వరీ చేసిన ట్వీట్ హస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ మూడు సార్లు నోటీసు ఇచ్చినప్పుడు కూడా పురందేశ్వరీ ఖండించినట్టు భావించాల్సి ఉంటుందన్నారు. బీజేపీలో ఉంటూ, కేంద్ర ప్రభుత్వం నోటీసులిస్తే కూడా పురందేశ్వరీ.. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చంద్రబాబును వెనకేసుకు రావడం సిగ్గుచేటన్నారు. దత్తపుత్రుడికి మెలకువ వచ్చిందా? చంద్రబాబు అరెస్ట్ కాగానే.. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఖండించడం హస్యాస్పదమని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసుకు సంబంధించి సిఐడి పూర్తి ఆధారాలు సేకరించిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు మూడు సార్లు నోటీసులిస్తే.. స్పందించని పవన్ కళ్యాణ్కు హఠాత్తుగా ఇప్పుడు మెలకువ వచ్చిందా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు ఉందని చెప్పుకునే పవన్కళ్యాణ్.. చంద్రబాబుకు కేంద్రం నుంచి నోటీసులిచ్చినా.. దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్... ఏ ఒక్కరికీ సింగిల్గా పోటీ చేసే దమ్ములేదన్నారు. పాదయాత్రలో దండయాత్రనా? నారా లోకేష్ గుండాలను వెనుక వేసుకుని పాదయాత్ర పేరుతో దాడులు చేస్తున్నాడు. రక్తపాతం, మారణకాండ సృష్టిస్తున్నాడు. బ్యానర్ కనిపిస్తే చాలు వాటిని చింపేయమని అడిస్తున్నాడు. ఇదేంటని అడ్డుకుంటే వాళ్ళని రాళ్లు, కర్రలతో దాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో నారా లోకేష్ పాదయాత్ర చూస్తే అర్ధమవుతుంది. 2014 నుంచి 2019 వరకు మేము చేసిన పరిపాలన చూసి మాకు ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబు కి, నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ గాని ఉందా? అని మండిపడ్డారు. -
లోకేష్ పాదయాత్ర రక్తపాతం సృష్టిస్తుంది: కొట్టు సత్యనారాయణ
-
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’
సాక్షి, అమరావతి: డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం ధర్మంకాదని హితవు పలికారు. కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేశ్ను అరెస్ట్ చేస్తేనే ఏపీలో శాంతి భద్రతలు నెలకొంటాయి. చంద్రబాబు అవినీతి అనకొండ. చంద్రబాబు అవినీతి రూ.118కోట్లు మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉంది. చంద్రబాబు అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ జోక్యం చేసుకోవాలి. అమరావతి ముసుగులో చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. ఐటీ నోటీసులతో కేవలం ఆవగింజ అంత బయటపడింది. ఇంకా సింగపూర్ ఈశ్వరన్తో కలిసి పనిచేసిన అవినీతి దందా బయటపడుతుంది. చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం. లోకేశ్ ఘనకార్యంతో పడిపోయిన టీడీపీ గ్రాఫ్.. రెండు వేల మంది గూండాలతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారిపోయింది అని సెటైర్లు వేశారు. తండ్రి బ్రోకర్.. కొడుక జోకర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇప్పుడు తేలిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ఉద్యమాలు చేశారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పొలిటికల్ స్కామ్ స్టార్.. మరోవైపు.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎపం మార్గాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబు పొలిటికల్ స్కామ్ స్టార్. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. రాజధాని అంటున్న అమరావతిలో 3వేలు ఖర్చు అయ్యే నిర్మాణాలకు 15వేలు ఎలా ఖర్చు పెట్టారో చంద్రబాబు చెప్పాలి. కోట్ల రూపాయలను టన్ను ఐరన్తో కోడ్ లాంగ్వేజ్లో చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి. ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి 18స్టేలు తీసుకుని చంద్రబాబు తిరుగుతున్నాడు. చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలి. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్ -
‘మైకం దిగినట్లు లేదు.. టీడీపీ పని అయిపోయినట్లే’
సాక్షి, విజయవాడ: రుషికొండపై కట్టడాలు అక్రమమేమి కాదని, ప్రభుత్వ కట్టడాలు కడితే తప్పేంటి? అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు భ్రమలో ఉన్నాడు.. మైకం దిగినట్లు లేదు. టీడీపీ పని అయిపోయినట్లు ఇంకా గ్రహించినట్టు లేదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘పవన్ గ్రాఫ్ తగ్గిపోయింది. విడిగా పోటీ చేసే దమ్ము లేదు.. కలిసి పోటీ చేయడానికి సిద్దపడుతున్నారంటే వైఎస్సార్సీపీ నైతికంగా విజయం సాధించినట్టే. లోకేష్ది యువ గళం కాదు.. గందరగోళ యాత్ర. యువగళంలో బౌన్సర్లతో.. కిరాయి కూలీలతో చేసేది పాదయాత్ర అంటారా?. లోకేష్ పాదయాత్రకి 250 కోట్లు ఖర్చు పెట్టారని వారే చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ నేతలు భయపడుతున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు గతంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితాపై ఇంటింటి సర్వే చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా లోకేష్ సాధించేదేమిటి?. ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు ఇస్తామని లోకేష్ చెప్పడం దేనికి సంకేతం. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవడానికే నాడు వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజల కరెంట్ కష్టాలు చూసి ఉచిత విద్యుత్ని, ఆరోగ్యశ్రీని అమలు చేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు’’ అంటూ కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. చదవండి: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ ‘‘పిట్టలదొర మాటలని ప్రజలు నమ్మరు. చంద్రబాబు కొత్త అవతారం రాఖీ బాబా. మతి ఉండి చంద్రబాబు మాట్లాడుతున్నారా?. ఇలాంటి మానసిక స్ధితి ఉన్నవాళ్లని పిచ్చోళ్లగా చూస్తాం. పవన్ కళ్యాణ్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. పెళ్లి ఒకరితో....సంసారం మరొకరితో అన్నట్టు పవన్ ఉన్నారు’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు అంతకు దిగజారాడు: కొట్టు సత్యనారాయణ ఫైర్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రాజెక్ట్ల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు లేదన్నారు. నారాసురుడు ఉన్నంత కాలం రాష్ట్రంలో అశాంతి ఉంటుందన్నారు. కాగా, కొట్టు సత్యనారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం వచ్చి చంద్రబాబు అన్నీ అబద్దాలే చెప్పాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ప్లాన్ ప్రకారమే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని చంద్రబాబు రోజురోజుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. గుండాలను రప్పించుకుని అల్లర్లు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారాడని విమర్శలు చేశారు. -
విశాఖ వృద్ధురాలి హత్యపై పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: పేదల పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తున్నాడని.. అయితే వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ఆ నోళ్లు మూతలు పడుతున్నాయని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. పది లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఏపీని అప్పుల పాలు చేశారని పచ్చ బ్యాచ్ సీఎం వైఎస్ జగన్పై దుష్ప్రచారానికి దిగింది. పచ్చ పార్టీకి.. పిచ్చి రాతలు రాసే వాళ్ల నోళ్లు మూతలుబడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి రూ. 2.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో రూ. 1,77,991 కోట్ల అప్పులు మాత్రమే చేశారని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. ఒక పనికిమాలిన ఎంపి వేసిన ప్రశ్నతో వాస్తవం బట్టబయలైంది. టిడిపి తప్పుడు ప్రచారాలకి ఇది చెంప పెట్టు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ► సీఎం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమపాలన అందిస్తున్నారు.. ప్రజాభిమానమూ పెరిగింది. ఆ ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక రాష్ట్రం అప్పులపాలయ్యిందని.. శ్రీలంకలా మారిందని గోబెల్స్ ప్రచారం చేశారు. పేదలపొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేశారు. కానీ, వాస్తవాలు బయటపడటంతో నోళ్లు మూతబడుతున్నాయి అని అన్నారాయన. ► విశాఖలో వృద్దురాలు హత్యపైనా ఈనాడు పత్రిక అబద్దాలు ప్రచురించింది. మొత్తం వలంటరీ వ్యవస్థకు ముడిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పనితీరు సక్రమంగా లేదని తొలగించిన వ్యక్తిని ఇంకా వలంటీర్ అని ఎలా రాస్తారు. కేవలం పిచ్చి రాతల్లో భాగంగానే ఆ కథనం ప్రచురించింది అని మంత్రి మండిపడ్డారు. ► చంద్రబాబు మూడు టర్మ్లలో రూ.7.50 లక్షల కోట్లు ఏం చేశారు? మూడు సార్లు సీఎంగా పని చేసి సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారు?. మా ప్రభుత్వం నాలుగేళ్లలో నేరుగా ప్రజలకి అందించిన సంక్షేమమే 2.50 లక్షల కోట్లపైనే. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు. సీఎంగా ఉండి ఏనాడైనా పోలవరం పేరు ఎత్తాడా?. పోలవరానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని చంద్రబాబు ఎలా అంటారు?. అసలు వైఎస్సార్ హయాంలో పోలవరం పనులు ప్రారంభయ్యాయి. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేశారు. కమీషన్ కోసం కుక్కుర్తి పడి పోలవరాన్ని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టలేదా?. ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి వందల కోట్ల పనులు అప్పనంగా అప్పగించలేదా? అని నిలదీశారు. ► చంద్రబాబు దుర్మార్గుడు. చంద్రబాబు కొడుకు మాలోకం. అది యువగళమా.. విషగళమా?. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పెద్ద పదవులట!. టీడీపీ అధికారంమలోకి వస్తే కర్రలు ఇస్తాడట. ఇదీ రాబోయే కాలంలో వాళ్ల అజెండా. జోకర్ కొడుకు.. బ్రోకర్ తండ్రి అని పేర్కొన్నారాయన. పవన్ని చూస్తే జాలేస్తోంది చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసు. కాపులని అనాదిగా తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే దాకా కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉంది. అలాంటి చంద్రబాబు విష కౌగిలిలో పవన్ చిక్కకుపోయాడు. పవన్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడు. నా పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు. పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా?. అందుకే చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలి అని సూచించారు. -
రూ.12 కోట్లు దాటిన అన్ని ఆలయాలు ఇక ఆ కేటగిరి కిందకు..
-
రోజురోజుకి పడిపోతున్న జనసేన గ్రాఫ్.. అందుకే పవన్ ఇలా..
సాక్షి, అమరావతి: చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నట్లే.. మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని అని ప్రచారం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాళ్లు గతంలోనూ పొత్తు పెట్టుకున్నారు.. ఇందులో కొత్తేమీలేదు. రోజురోజుకు జనసేన గ్రాఫ్ పడిపోతుంది. అందుకే పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ కమిటెడ్ లీడర్. పార్టీలో వివాదాలంటూ పచ్చ పార్టీ పేపర్లో తప్ప ఎక్కడా కనపడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులు, కుట్రలతో కాలక్షేపం చేస్తున్నాయి. 2024లో మళ్లీ మేం ఒంటరిగానే పోటీ చేస్తాం. తిరిగి అధికారంలోకి వస్తాం. జగన్ది ప్రజారంజక పాలన. ఏపీలో సంక్షేమపాలనపై అంతర్జాతీయ స్థాయి లో చర్చ జరుగుతుంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్ ‘‘ప్రతిపక్ష పార్టీలు 2019 నుంచి వచ్చే ఎన్నికల కోసమే పని చేస్తున్నాయి. మేం ప్రజలు, భగవంతుడిని నమ్ముకున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుతిన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సర్వేల కోసం ఫీల్డ్ వలంటీర్లని ఉపయోగించుకుంటే తప్పేంటి’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. -
చంద్రబాబు ప్యాచీలు పడిన ట్యూబ్ :డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
-
మంత్రి కొట్టు సత్యనారాయణ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
‘పవన్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువ’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని, ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ మానసిక స్థితి బాగాలేదని, ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పవన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. ద్వారంపూడి సవాల్కు పవన్ తోక ముడిచారన్నారు. ప్రతీ గొడవలోనూ జనసేన కార్యకర్తలే.. ‘ప్రతీ గొడవలోనూ జనసేన కార్యకర్తలే ఉంటున్నారు. తమ కార్యకర్తలను గూండాలుగా.. రౌడీలుగా తయారు చేసేలా పవన్ రెచ్చగొడుతున్నాడు. రాష్ట్రం అగ్ని గుండంగా మారిందంటూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కుట్రలు చేస్తున్నారు. అధికారం రావడమే ఆలస్యం అందరినీ లోపల వేసేస్తారట దాని కోసం మీకు ఓటు వేయాలా?. చంద్రబాబుకి, అసలు పుత్రుడు, దత్తపుత్రుడికి దమ్ముంటే మా అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయమని చెప్పమనండి. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఏ రోజూ పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదు. మా పాలన చూసి వేయమని మేము అడుగుతున్నాం. మేము సవాల్ విసురుతున్నాం. మీరు 2014-19 పాలన చూసి ఓటు వేయమని అడగగలరా?. చంద్రబాబు లాంటి చండాలుడు రాష్ట్రానికి అవసరం లేదని ప్రజల అభిప్రాయం. 219 దేవాలయాలు కూల్చేశామని పవన్ విమర్శిస్తున్నాడు. గుళ్లు కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు కదా. బీజేపీ, టీడీపీ హయాంలో కదా గుళ్లని కూల్చేసింది. ఆ సమయంలో దేవాదాయ మంత్రి బీజేపీ నేత కాదా? కూల్చేసిన గుళ్లను సీఎం జగన్ పునఃనిర్మిస్తున్నారు.’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. -
పవన్ కల్యాణ్ పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్
-
ముద్రగడ సవాల్ ను స్వీకరించే దమ్ము పవన్ కు ఉందా: కొట్టు
-
స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో స్నేహం కారణంగా పవన్ మతిపోయిందని, టీడీపీ వాళ్లు రాసి ఇచ్చిన డైలాగులు, కిరాయి ఇచ్చిన వాళ్ళ స్క్రిప్ట్లు రెచ్చగొట్టే రీతిలో చదివేస్తే కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. పవన్ ను చూస్తే జాలేస్తుందని, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరవపరిచాడన్నారు. "హలో ఏపీ అంటే వీళ్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి బైబై చెప్పినట్టా? - బాబు, పవన్ తెలంగాణ వెళ్లిపోతున్నామని బైబై చెప్పినట్టు ఉంది. నిన్న అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు సినీ ఫక్కీలో చెప్పారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా.." అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు ఈ శతాబ్ధపు డర్టీ పొలిటీషియన్గా అభివర్ణించిన మంత్రి కొట్టు.. హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తాడన్నారు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చంద్రబాబుని ప్రజలు రాజకీయ సమాధి చేసినా.. పైకి కనబడే ఆ తలతోనే, పచ్చ మీడియా సపోర్ట్తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కాకినాడ, పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి లిస్టు ప్రకారం వారి దగ్గర చదివి ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మండలానికి సంబంధించి 2 టీమ్లు, పట్టణానికి సంబంధించి 3 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 7 రోజులు ఫిర్యాదులు సేకరించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ఏదేని కారణం చేత ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలనలో రూ. 2,16,000 వేల కోట్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సక్షన్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్’
సాక్షి, తాడేపల్లిగూడెం: చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాలుగు దశాబ్ధాల నుంచి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు వర్గ ప్రయోజనాల కోసమే పని చేస్తాడు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. గూగుల్లో వీటి పేర్లు కొడితే చంద్రబాబు ఫోటో వస్తుందని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘తెర వెనుక ఉండి రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తూ, మళ్ళీ దానిని ప్రచారం చేస్తాడు. పచ్చ మీడియా సపోర్ట్తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడు’’ అని చంద్రబాబుపై మంత్రి నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు స్నేహం కారణంగా పవన్ మతిపోయింది. పవన్ చూస్తే జాలేస్తుంది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరపరిచారు. జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: గెలవనని తెలుసు.. పవన్ కల్యాణ్ ఖాతాలో మరొకటి -
చంద్రబాబు ఒక రాక్షషుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
‘బాబూ.. చేతనైతే సాయం చేయ్.. శవాలపై పేలాలు ఏరుకోకు’
సాక్షి, కాకినాడ: విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు.. చంద్రబాబుకు పనిలేక ఖాళీగా ఉన్నాడని ఎవరు పిలుస్తారా? వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వారిని పరామర్శించావా బాబూ! 2014 - 2019 మధ్యలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? వనజాక్షిపై నీ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం వనజాక్షిని పరామర్శించావా? రెండు నెలల క్రితమే టీడీపీ స్థానిక కౌన్సిలర్ హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఖాళీగానే ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించని నేత చంద్రబాబు. చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన చేశారని బోరున ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు. మా కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తాం. పవన్కు వాస్తవాలు తెలియవు పవన్ లాగా నాకేమీ ప్యాకేజీ డబ్బులు రావటం లేదు. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి అమరనాథ్ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచాను. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివే పవన్కు వాస్తవాలు తెలియవు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకుని రావటానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హార్బర్లు కట్టిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ అప్పటికప్పుడే ఇచ్చే ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం. 2024లో కూడా జగనే సీఎం ఖాయం’ అని మోపిదేవి పేర్కొన్నారు. చదవండి: పవన్తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో! ఇది సినిమా కాదు, రాజకీయం పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్తో హడావిడీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్.. ఇది సినిమా కాదు, రాజకీయం అని హితవు పలికారు. సీఎం అవుతానంటున్న పవన్ భాష సరిగా లేదని, సభ్యత లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. ఏదైనా ఆరోపించామంటే కనీస ఆధారాలు ఉండాలి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడు. పవన్తాను ఎక్కడా కుల రాజకీయం చేయనంటుంటాడు. కులాల ప్రస్తావన లేకుండా పవన్ ఎక్కడైనా మాట్లాడాడా?. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీయే. టీడీపీ ఆవిర్భావంతో కులాల కుంపట్లు ప్రారంభం అయ్యాయి. 80 శాతం కాపులు సీఎం జగన్కే మద్దతు తెలుపుతున్నారు. పవన్ చంద్రశేఖర్రెడ్డిపై పోటీ చేయాలి. కాకినాడలో పోటీ విషయంపై ద్వారంపూడి సవాల్కు ఇవాళైనా పవన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి’ అని కన్నబాబు పేర్కొన్నారు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు ‘నాలుగు దశాబ్ధాలుగా ఏపీని పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో లబ్ది పొందాలని చూస్తున్నాడు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని. వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడుతునఆనడో తనకే తెలియట్లే. చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడుతున్నాడు. కాపుల పరువు తీసేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడు. పవన్ వ్యాఖ్యలకు బాధపడే ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో?. పవన్కు అపాయం జరిగితే చంద్రబాబుకే సానుభూతి వస్తుంది. చంద్బరాబు నుంచే పవన్కు పెను ప్రమాద పొంచి ఉంది. పవన్కు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.’ -మంత్రి కొట్టు సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఆయన కుటుంబం పట్ల పవన్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్.. పార్టీని నడింపించాల్సిన విధానం ఇదేనా?. దూషణలు, పరుష పదజాలంతో పవన్ మాట్లాడుతున్నాడు. యువతకు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?. ద్వారంపూడిపై పవన్ మాట్లాడిన భాష అభ్యంతరం. సీఎం జగన్ వారసత్వంగా రాలేదు. ఒక నాయకత్వ లక్షణంతో ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గతిని మార్చిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఒక దైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చారు. -ఎంపీ వంగా గీత -
చంద్రబాబు నుంచే పవన్కళ్యాణ్కు ముప్పు!
తాడేపల్లిగూడెం అర్బన్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని ఎందుకన్నారో తెలియదుగానీ అయితే అది చంద్రబాబు నుంచే ఉందని గ్రహించాలని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. ‘తమ్ముడూ పవన్.. చంద్రబాబుపై ఓ కన్నేసి ఉంచు! ఆయన్ను ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరించారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా పేదల నాయకుడు వంగవీటి మోహన్రంగా హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్కు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ పైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతు లాంటి చంద్రబాబును విశ్వసిస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ వెనుక తిరుగుతున్న వారంతా తమ పరిస్థితి కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అవుతుందని భయపడుతున్నట్లు చెప్పారు. పవన్ సీఎం అభ్యర్థి అని ప్రకటిస్తారా? స్థిరత్వం లేని మాటలతో ప్రజల్లో చులకన కావద్దని పవన్కు మంత్రి సత్యనారాయణ హితవు పలికారు. గతంలో తనకు ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదన్న పవన్ ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించగలరా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ కావడంతో కాపు సామాజికవర్గం ఓట్ల కోసం పవన్ కల్యాణ్ను పావులా వాడుకుంటున్నారని చెప్పారు. సొంతంగా పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులతో పోటీ చేయించాలన్నారు. జగన్ పాలనలో ప్రతి ఇంటా సిరులపంట సీఎం జగన్ పాలనలో ప్రతి ఇంటా సిరుల పంటగా ఉందని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ప్రతి మహిళకూ లక్ష్మీ కటాక్షం లభిస్తోందన్నారు. పది కాలాల పాటు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే తమ కుటుంబాలు నిలబడతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. పోలవరంలో రివర్స్ టెండర్లతో రూ.1,300 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. టీడీపీ పాలనలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెలికి తీస్తుంటే శాంతి భద్రతలు లోపించాయంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే దేవాలయాలను కూల్చిన విషయం పవన్కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.281 కోట్లతో 250 దేవాలయాల పునర్నిర్మాణంతోపాటు 5,000 దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా మరో 2,000 ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. -
‘పవన్.. జోకర్ లాంటి బాబు, లోఫర్ లాంటి లోకేశ్ మాటలు నమ్మకు’
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. వారాహి యాత్ర పేరుతో పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పవన్ను ఎవరికైనా చూపించండిరా అని ప్రజలు అనుకుంటున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. కాగా, కొట్టు సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంట నక్క లాంటి చంద్రబాబుని ప్రజలు ఓడించాలనుకున్నారు. అతనితో ఉన్నవ్ కాబట్టే పవన్ నిన్ను కూడా ప్రజలు ఓడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టం చూసి ప్రజలు మెచ్చుకుని సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కాపుల ఓట్ల కోసం పవన్ను వాడుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ వెంట కాపులు రారు. పవన్.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ముందా?. పవన్కు ప్రాణహాని అంటే అది చంద్రబాబు దగ్గర నుంచే ఉంటుంది. టీడీపీ హాయంలో కృష్ణా పుష్కరాల పేరిట 44 ఆలయాలను కూల్చేశారు. మా పాలనలో 250 ఆలయాలకు రూ.281 కోట్లు కేటాయించాం. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్.. జోకర్ లాంటి బాబు, లోఫర్ లాంటి లోకేశ్ మాటలు నమ్మకు అంటూ హితవు పలికారు. గత పారిపాలన చూసి చంద్రబాబు, పవన్ గానీ.. ఓట్లు వేయమని అడిగే దమ్ము, ధైర్యం సత్తా మీకు ఉందా?. సీఎం జగన్ను తిడితే ఆయనను ఎన్నుకున్న ప్రజలను తిట్టినట్టే అవుతుంది.. ఇది తెలుసుకో పవన్ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జనసేనలో గలాటా -
పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
-
‘కేంద్రం-రాష్ట్రం మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.’
సాక్షి, విజయవాడ: బీజేపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ కోవర్టుల స్క్రిప్ట్ను అమిత్ షా, నడ్డా చదవినట్లున్నారని మండిపడ్డారు మంత్రి. పలు సందర్భాల్లో సీఎం జగన్ను ప్రధాని మెచ్చుకున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ప్రధాని మాట్లాడిందానికి విరుద్ధంగా అమిత్ షా, నడ్డాలు మాట్లాడతున్నట్లుంది. సీఎం జగన్పై ప్రధాని మోదీకి విశ్వాసం ఉంది. కేంద్రం-రాష్ట్రంమధ్య ఎలాంటి గ్యాప్ లేదు. మోదీ 9 ఏళ్ల పాలన విజయాలపై పెట్టిన సభలో ఏం మాట్లాడారు?, చెప్పుడు మాటలు విని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా?, ‘ ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోవాలి. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై ప్రకటన చేయాలి’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
‘అవినీతి అనకొండ చంద్రబాబు’
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖ, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబూ.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్. మోసం, దగా, వెన్నుపోటు, అవినీతిని కలిపితే అదే చంద్రబాబు. నైతిక విలువలు లేని ఏకైన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అధికారం కోసం బాబు అబద్ధాలు, అడ్డదారులు తొక్కుతున్నాడు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా చేసి ఏపీని పాతాళానికి తొక్కేసాడు. 2019లో ప్రజలు ఛీకొట్టినా మళ్లీ మాయమాటలు చెబుతున్నాడు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం దురదృష్టం. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు. అవినీతి అనకొండ చంద్రబాబు. బాబు రెండెకరాల నుంచి రూ.లక్ష కోట్లకు ఎలా పడగలెత్తాడు. చంద్రబాబు పాలనలో అంతా దుర్భిక్షం, కరువు కాటకాలే. 2024 ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా? -
పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్
-
‘యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు’
సాక్షి, తిరుమల: తమ ప్రభుత్వం శ్రీమహాలక్ష్మీ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించిందని,యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్ ప్రయత్నం సఫలం కావడంతో పెండింగ్ నిధులు వచ్చాయన్నారు. ‘ పీఠాధిపతులు సూచనల మేరకు కార్తీకమాసంలోశ్రీశైలంలో కుంభాభిషేకం. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను సంబంధిత ట్రస్ట్ బోర్డు నిర్వహించేలా కేబినెట్లో నిర్ణయం. ఆయా దేవాలయాలపై పర్యవేక్షణ దేవాదాయశాఖకు ఉంటుంది. లీజు ముగిసినా కోర్టును ఆశ్రయిస్తూ స్టేలు పొందే వారిపై 15 రోజుల నోటీసుతో చర్యలు తీసుకునేలా చట్ట సవరణను ఆమోదించాం. దేవాదాయ ఆస్తుల కాపాడుకోవడానికి చట్టసవరణ. చట్ట సవరణ ద్వారా గడువు ముగిసిన లీజు భూములను మార్కెట్ రేటు ప్రకారం మళ్లీ లీజుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడుగుతామని, ఇది పేదలకి, పెత్తందార్లకి మధ్య జరిగే ఎన్నికలన్నారు. ‘సత్యానికి, అసత్యానికి జరుగుతున్న పోరాటం ఇది. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న పోరాటం ఇది. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక వైపు ఉన్నారు. చంద్రబాబు తెలంగాణ నివాసి. రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అప్పులు పాలు చేశారని చంద్రబాబు, పవన్లు విమర్శించారు. చంద్రబాబు,దత్తపుత్రుడు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి మహానాడు అంటూ దండలు వేస్తున్నారు. వ్యవసాయం అంటే నీకు గిట్టదు.. విద్యపై ఒక్క రోజు ఫోకస్ చేయలేదు.నీకు, సీఎం జగన్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. పవన్ గతంలో కాపు సామాజికి వర్గాన్ని ముంచేశారు’ అని మండిపడ్డారు. -
వారాహి వాహనాన్ని పవన్ అందుకే షెడ్లో పెట్టేశారా?
పశ్చిమ గోదావరి: జనసేన ప్రచార రథం వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలో ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న యాత్రపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా పడిందని ఆయన గుర్తు చేశారు. పెంటపాడు మండలం ముదునూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కోసం, తనకోసం ఏం చేసుకున్నా తప్పు పట్టడానికి లేదన్నారు. అయితే తన కోసం, తన పార్టీ కోసం కాకుండా టీడీపీ, చంద్రబాబు కోసం పనిచేయడం సిగ్గుచేటు అన్నారు. జనసేన ప్రచార రథానికి ఏం పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే వారాహి రథంపై ప్రచార యాత్ర గతంలో రెండుసార్లు ఎందుకు వాయిదా పడిందని ఆయన ప్రశ్నించారు. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచి వారాహి రథంపై పవన్ కళ్యాణ్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని చెప్పి ఎందుకు ఆగిపోయారని మంత్రి కొట్టు సూటిగా ప్రశ్నించారు. కేవలం ఆ సమయంలో రాజధాని రైతుల పాదయాత్ర జరుగుతుంది కాబట్టి వారాహి వాహనంపై ప్రచార యాత్ర ఆపేయాలని చంద్రబాబు ఆదేశించడంతో పవన్ కల్యాణ్ కేవలం పూజలతోనే సరిపెట్టారన్నారు. ఆ తర్వాత రెండోసారి కూడా వారాహి వాహనంపై జనసేన ప్రచార యాత్ర ప్రారంభించాలని పవన్ కల్యాణ్ తలపెడితే ఆ సమయంలో లోకేష్ యువ గళం పాదయాత్ర కోసం ప్రచార యాత్ర ఆగిపోయిందన్నారు. ఈ విధంగా రెండు సార్లు చంద్రబాబు చెప్పగానే పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని షెడ్లో పెట్టేశారన్నారు. ఇప్పుడు మూడోసారి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది జరిగేవరకు గ్యారెంటీ లేదన్నారు. ఏ సమయంలో అయినా చంద్రబాబు నుంచి యాత్ర ఆపేయమని ఆదేశాలు వస్తే పవన్ ఆపేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. హామీలు అమలు చేయని బాబును ఎందుకు నిలదీయలేదు ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు పవన్ కల్యాణ్ కు దేవుడిలా కనిపించడం దారుణమని మంత్రి అన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేయండి అని చంద్రబాబుకు కౌంటర్ గ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. -
సీఎం జగన్ దేశానికీ ఆదర్శం
-
చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలేనని బాబు విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి బాబే కారణమని, అధికారం కోసం మళ్లీ కోతల రాయుడు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లేనని దుయ్యబట్టారు. ‘ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మళ్లీ కొత్త అబద్ధాల పుట్టతో తయారయ్యాడు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు. చంద్రబాబు తొలి సంతకానికే దిక్కులేదు. ఆయన తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెంటిలేటర్పై ఉన్న టీడీపీని లేపేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం’ అని కన్నబాబు పేర్కొన్నారు. బాబు, లోకేష్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి టీడీపీ మహానాడు అట్టర్ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మహానాడు అనే కంటే కులసభ అంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు హామీలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బాబూ కొడుకులకు అధికారం అనే పిచ్చి బాగా ఎక్కిపోయిందని.. బాబు, లోకేష్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. చదవండి: ‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’ -
‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచాడని, ఆయనను మానసికంగా చంపేసి ఇవాళ పాదపూజ చేస్తా అంటున్నాడు’’ అని మండిపడ్డారు. ‘‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. బాబు దుర్మార్గ పరిపాలన చూసే ప్రజలు రాజకీయ సమాధి చేశారు. మహానాడు కోసం బలవంతపు జనసమీకరణ చేస్తున్నారు. పదవిలో ఉండగా చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్కు గౌరవం ఇచ్చాడా?. ఎప్పుడైనా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అడిగాడా?. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించిన వ్యక్తి సీఎం జగన్. బాబు కాపుల ఓట్ల కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. చంద్రబాబు మాయలో కాపు సామాజిక వర్గం పడొద్దు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘కాపులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్. అధికారంలోకి రాగానే తుని ఘటన కేసును ఎత్తివేసింది సీఎం జగనే. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. మొదటి నుంచీ ఎన్టీఆర్ను గౌరవించింది వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే.. రాజమండ్రి సభకు ఎన్టీఆర్ అభిమానులు వెళ్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది’’ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
దేశ చరిత్రలోనే ఇంతటి మహాయజ్ఞం ఇదే ప్రథమం: మంత్రి కొట్టు
సాక్షి, విజయవాడ: దేశచరిత్రలోనే తొలిసారిగా ఇంతటి మహాయజ్ఞం నిర్వహించడం ఇదే ప్రథమం అని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యాగం వైభవంగా జరిగిందన్నారు. ఎనిమిది ప్రధాన ఆగమాలని అనుసరించి ఒకే దగ్గర దేవతామూర్తులకి యాగాలు నిర్వహించాం. ఇందులో ప్రధానంగా నాలుగు ఆగమాలైన పాంచరత్న, వైఖానస, వైదిక స్మార్తం, శైవానుసారం యాగాలు నిర్వహించాం’’ అని మంత్రి అన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన యజ్ఞం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి అన్నారు. ‘‘ఆగమ సలహా మండలి, ధార్మిక మండలి, పండితుల సలహాల ప్రకారమే యాగాన్ని నిర్వహించాం. ఒక్కొక్క యాగశాలలో 27 కుండలములతో మొత్తంగా 108 కుండలాలతో యాగం ఘనంగా నిర్వహించాం. లోక కళ్యాణార్ధం, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన యజ్ఞం విజయవంతమైంది. ఆరు రోజుల పాటు ఎటువంటి అవాంతరాలు రాకుండా మహాయజ్ఞం నిర్వహించగలిగాం. 600 మంది రుత్వికులు, 200 మంది వేదపండితులు ఈ యాగాలలో పాల్గొన్నారు’’అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్ మండుటెండని సైతం లెక్క చేయకుండా రుత్వికులు ఈ మహాయజ్ణంలో పాల్గొన్నారు. అనుగ్రహభాషణ చేసిన పీఠాదిపతులకి ప్రత్యేక ధన్యవాదాలు. పాంచరత్నంలో సుదర్శన యాగం 50 వేలకి మించి అవనం సాగింది. వైదిక స్మార్త యాగశాలలో రాజశ్యామల , చండీ యాగాలు నిర్వహించాం. వైఖానస యాగశాలలో నారాయణ మంత్ర హోమం జరిగింది. శైవాగమ యాగశాలలో అతి రుద్ర యాగం నిర్వహించాం. యాగానికి అవసరమైన యజ్ణ ద్రవ్యాలలో ఎక్కడా రాజీపడలేదు. దేశీయ ఆవుతో కూడిన నెయ్యిని రుత్వికుల సూచనల మేరకు వినియోగించాం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.