land distribution
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
రేపు సీఎం జగన్ చేతుల మీదుగా భూ బదిలీ పత్రాలు పంపిణీ
అమరావతి: పేద అక్క చెల్లమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ.. రికార్డు స్థాయిలో 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అందించడమే గాక దేశంలోనే తొలిసారిగా లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరు మీదనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం పంపిణీ ప్రకాశం జిల్లా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రేపు(శుక్రవారం) 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం భూ బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు కూడా మంజూరు చేసి, ఆ పత్రాలు పంపిణీ చేయనుంది సీఎం జగన్ ప్రభుత్వం దీంతోపాటు 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' క్రింద రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసిన 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఆ పేద అక్కచెల్లెమ్మల పేరు మీదుగానే సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ కూడా చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని రేపు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ ద్వారా కలిగే ప్రయోజనాలు పదేళ్ల తర్వాత ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్ధిదారుల పేరిట గ్రామ/వార్డు సచివాలయాల్లోనే, ఇప్పుడే ఉచితంగా స్థలాల రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ కూడా అందజేత రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇప్పటికే దాదాపు 15 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి.. శరవేగంగా మిగిలిన రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉన్న జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ (జెఎస్ఆర్వో) డేటాబేస్లో వివరాలన్నీ పదిలం.. ఎప్పుడైనా ఈ జెఎస్ఆర్వోలలో సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం.. ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికి గానీ ఆస్కారమే ఉండదు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు.. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు.. అమ్ముకునే సమయంలో ఎన్వోసీ కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఎలాంటి లింకు డాక్యుమెంట్ల అవసరం లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. శుక్రవారం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లు, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. అర్హులైన 20,840 మంది పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు, మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ చేసి రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్స్ను అందజేయనున్నారు. భూమి కొనుగోలు, జగనన్న టౌన్ షిష్ల అభివృద్ధికి రూ.210 కోట్లు, లే అవుట్ల అభివృద్ధికి రూ. 21.33 కోట్లు సీఎం జగన్ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. -
భూ పంపిణీపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: భూ పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం, అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం’’ అని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి పేదవాడిని గుండెల్లో పెట్టుకుని, ముందుకు నడిపించే కార్యక్రమం ఈ 53 నెలల పాలనలో జరిగింది. పేదవారిపై ప్రేమ చూపిస్తూ నేనెప్పుడు మాట్లాడినా ఆ మాటలు పెత్తందారులకు నచ్చవు. కానీ మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవకుండా పేదల పట్ల ఎంత చిత్తశుద్ధితో.. బాధ్యతతో వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ రోజు జరుగుతున్న కార్యక్రమమే నిదర్శనం’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములకు అనుభవదారులుగా ఉన్న రైతన్నలకు నేడు మన ప్రభుత్వంలో పూర్తి హక్కులు కల్పించాం. అలాగే పలువురికి కొత్తగా డీకేటీ పట్టాలను కూడా అందజేశాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వంలో భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టాం. గతంలో… pic.twitter.com/a6WijlZP4x — YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2023 -
54 వేల ఎకరాల 'భూ పంపిణీ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలు, అసైన్డ్, సర్వీస్ ఇనామ్, లంక భూముల రైతులకు భారీ మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా భూములకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలు రైతులకు చేకూరనుంది. ఈ నిర్ణయాలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దివంగత సీఎం వైఎస్సార్ తర్వాత మళ్లీ భూ పంపిణీకి సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. 54,129.45 ఎకరాలను భూమిలేని దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. భూమిని ప్రభుత్వం కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయిన అనంతరం ఆ భూమిపై సంబంధిత రైతులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టా భూముల రైతుల మాదిరిగానే అసైన్డ్ భూముల క్రయ, విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం వాస్తవంగా ఎవరికైతే భూమిని కేటాయించిందో వారికి యాజమాన్య హక్కు దక్కుతుంది. వారు లేని పక్షంలో వారి వారసులకు హక్కులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇంకా మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆ కుల వృత్తుల వారికి శుభవార్త మూడు కేటగిరీల్లోని 9,062 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని భూములను ఐదేళ్లు లీజు ఇవ్వడానికి అనుమతించారు. ఈ నిర్ణయంతో 19,176 మంది రైతులకు మేలు చేకూరునుంది. పేదలకు భూ పంపిణీ, లంక భూములకు డీ పట్టాలు ఇవ్వడం ద్వారా మొత్తంగా 63,191 ఎకరాలకు సంబంధించి 66,111 మందికి లబ్ధి చేకూరనుంది. గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన సర్వీస్ ఈనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కుమ్మరి, చాకలి, కమ్మరి, నాయీబ్రాహ్మణ (బార్బర్) తదితర కుల వృత్తులు చేసుకునే వారికి గతంలో ఈనామ్గా ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగింపు ద్వారా వారికి సర్వ హక్కులు కల్పించనున్నారు. 1,68,603.71 ఎకరాల భూములు నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించడం ద్వారా 1,13,610 మందికి ప్రయోజనం కలుగనుంది. 2013కు ముందే వీరందరూ రైత్వారీ పట్టాలు పొందారు. ఆ తర్వాత ఈ భూములపై ఆంక్షలను విధించారు. ఇప్పుడీ ఆంక్షలన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళితులకు సానుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 14,223 మందికి సంబంధించి కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కూడా మాఫీ చేయడం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో దళితులకు హక్కు పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. అంతిమ సంస్కారానికి దిగులుండదు గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం.. ఇందులో 1,700 రెవిన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న 1,050.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎకరం వరకు భూ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. మరో 266 రెవిన్యూ గ్రామాలకు భూ సేకరణ చేసి ఇవ్వనున్నారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెలలో అమలు చేసే కార్యక్రమాలకు ఆమోదం ► ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ, వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు. ► ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. ► ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 50,793 మందికి ప్రభుత్వం 1,366.48 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కాగా, 47,017 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదల ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ► ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. ► ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. వైద్య రంగంలో పోస్టుల భర్తీ 2024–25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్ కాలేజీలకు గత మంత్రివర్గ సమావేశంలో పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన రెండు చోట్ల.. మదనపల్లి, మార్కాపురం వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 1,412 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలలను ఈ విద్యా సంవత్సరం(2023–24) నుంచి ప్రారంభించనున్నారు. క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కర్నూలులో కేన్సర్ ఇన్స్టిట్యూట్కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తోంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో విమ్స్.. మెడికల్ కాలేజీగా మార్పు, ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో కార్డియాలజీ, కేథ్లా్బŠ, సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరు, పుంగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అనుమతించింది. పునరావాసానికి ప్రత్యేక చర్యలు వైఎస్సార్ జిల్లాలో 10,231 గండికోట ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కింద రూ.454.6 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 2, 3లోని ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్1 బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనుల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బంది పని చేస్తున్నారు. ఇందుకు గాను 73 పోస్టులను కేబినెట్ ఆమోదించింది. వీటికి అదనంగా 6 ఔట్ సోర్సింగ్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన ► వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ రూ.8,104 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. దీని ద్వారా 1500 ఉద్యోగాల కల్పన జరగనుంది. ► హీరో ప్యూచర్స్కు చెందిన క్లీన్ ఎనర్జీ ప్రైయివేటు లిమిటెడ్ సోలార్, విండ్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆమోదం. ఈ సంస్థ 375 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో రూ.2,450 కోట్ల పెట్టుబడితో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 375 మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కుతాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ పరిధిలోని వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల భూముల కేటాయింపులకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం. ఇందులో రూ.4,204.07 కోట్ల పెట్టుబడుతో 4,705 మందికి ఉపాధి దక్కనుంది. వీటితో పాటు ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది. ► శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అవరసరమైన వనరుల సమీకరణకు ఏపీ మారిటైం బోర్డు రూ.3,884.70 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం. ► ఏపీ మారిటైం బోర్డులో రెండు ఇంజినీరింగ్ పోస్టులు, ఎస్ఐపీబీలో ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు, చెన్నై– కడప, విజయవాడ–కడప, బెంగళూరు–కడప, విశాఖపట్నం– కడప మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొనసాగింపునకు కేబినెట్ అంగీకారం. మరిన్ని అంశాలకు ఆమోదం ► నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలల్లో 128 టీచింగ్ పోస్టులు, 68 నాన్ టీచింగ్ పోస్ట్ల మంజూరుకు ఆమోదం. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటన్నింటికీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ► జేఎన్టీయూ కాకినాడలో 27 నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి ఆమోదం. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు. రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయం. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో భారీ జాప్యం ఉంటోంది. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 62 ఏళ్లకు రిటైర్ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను 65 ఏళ్ల వరకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్ ఆమోదం. ► టోఫెల్ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం విఖ్యాత విద్యా సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్(ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఈటీఎస్. సన్నాహక పరీక్షలతోపాటు టోఫెల్ ప్రైమరీ, జూనియర్ స్థాయి పరీక్షలను ఈటీఎస్ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయి నుంచే మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ శిక్షణను ప్లస్, ప్లస్ వన్ స్థాయికి విస్తరించనున్నారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టోఫెల్పై శిక్షణ ప్రారంభం కానుంది. ► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టి)ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్సీఈఆర్టీలో కాంట్రాక్ట్ పద్ధతిలో తొమ్మిది అకడమిక్ ఎక్స్పర్ట్ పోస్టుల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్లో 19 పోస్టుల మంజూరు, కొత్తగా ఏర్పాటైన ఒంగోలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్ మండలాల్లో 70 పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 13 స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నం, గుడివాడల్లో ఆరు కాలనీల్లో 1970–80 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మార్కెట్/నామినల్ విలువపై భూములు కేటాయిస్తూ అప్పుడు పేర్కొన్న నిబంధనలను సవరించేందుకు ఆమోదం. ► రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోని దర్యాప్తు విభాగానికి కేటాయించిన 9 పోస్టుల మంజూరుతో పాటు, మరో 21 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ► విశాఖ భూముల అక్రమాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల సిట్ కమిటీ ఇచ్చిన తొలి నివేదికలోని 69 సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఇందులో మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమన్న సిట్ నివేదికకు సమ్మతి వ్యక్తం చేసింది. -
అమరావతిలో ఆప్షన్ 3 ఆవాసాలే!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది లబ్దిదారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం లబ్దిదారుల్లో 88.79 శాతం మంది ఆప్షన్–3కి మొగ్గు చూపారు. వైఎస్సార్ జయంతి రోజు శంకుస్థాపన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 26వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా శంకుస్థాపన తేదీని కూడా సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం జోరందుకోనుంది. ఉచితంగా ఇసుక.. రాయితీపై 14 రకాల సామగ్రి విలువైన ఇళ్ల స్థలాలను ఉచితంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కూడా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్కు బిల్లుల రూపంలో రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణంగా సమకూరుస్తూ రూ.2.15 లక్షలు చొప్పున అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతోపాటు సబ్సిడీపై స్టీల్, సిమెంట్ లాంటి 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ రూ.54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల (సాధారణ ఇళ్లు 18.63 లక్షలు + టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సాధారణ ఇళ్లలో సుమారు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇళ్ల పథకం ద్వారా ఒక్కో పేదింటి మహిళకు సగటున రూ.15 లక్షల స్థిరాస్తిని సమకూర్చడం ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. కొనసాగుతున్న లబ్దిదారుల ట్యాగింగ్.. సీఆర్డీఏ పరిధిలో మెజారిటీ లబ్దిదారులు ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో కొనసాగుతున్నాయి. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు వస్తాయి. గృహ నిర్మాణాలకు జూలై 8న శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – అజయ్జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
భూ పంపిణీయే పరిష్కార మార్గం!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు గడిచినా దేశంలో అసమానతల్లో పెద్దగా మార్పేమీ కనిపించడంలేదు. పేదల కోసం పోరాడే వారంతా ఒక గొడుగు కిందకు వచ్చి ఆర్థిక పోరాటాలు చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఇప్పుడు పీడిత వర్గాలకు దళితులు నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చింది. వేలాది జిగ్నేష్ మేవానీలు, కన్హయ్య కుమార్లు, ఉమర్ ఖాలీద్లు పుట్టుకు రావాలి. అప్పుడే ఈ బహుజనుల మౌలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిజానికి ఈ ప్రజల మౌలిక సమస్య – భూమి సమస్య. అంబేడ్కర్ మేధావి, మానవతావాది, ఆర్థికవేత్త, తత్త్వవేత్త. ఆయన ఆర్థిక సంబంధాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ఈ వర్గాల ప్రజల ఉన్నతికి రాజ్యాంగ రక్షణ కల్పించటం కోసం ఆయన ఎంతో తపన పడ్డారు. ప్రజలకు అన్నంపెట్టే కీలక రంగమైన వ్యవ సాయాన్ని పూర్తిగా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమగా ప్రకటించాలని సూచించారు. భూమిని ఒక స్థిర ప్రమాణంలో విభజించి వ్యావసాయిక పరిశ్రమలను వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ వ్యావసాయిక క్షేత్రాలను సమష్టి సహకార క్షేత్రాలుగా చేసి కుల, మత భేదాలు లేకుండా ఏర్పడిన గ్రామ సమూహాలు సాగు చేయాలనీ, ఉత్పత్తిని సమష్టిగా పంచుకోవాలనీ అన్నారు. భూస్వాములు, కౌలుదారులు, భూమిలేని కూలీలు ఉండరాదనీ, సమష్టి వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి పెట్టుబడి, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే సమకూర్చాలనీ; తద్వారా ఉత్పాదకతను పెంచాలనీ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ సోషలిజం తప్పనిసరి అని సూచించారు. లేకుంటే ఆర్థిక అసమానతలు పుడతాయని చెప్పారు. ఈయన సూచనలు సహజంగానే ఆనాటి జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన బడా భూస్వామ్య వర్గాలు పక్కనపెట్టాయి. ఎప్పటికో, రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 ఏళ్ల తరువాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిస్టు’ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చి చేతులు దులుపుకొన్నారు. దారిద్య్ర నిర్మూలనకు అవసరమైన మౌలికమైన వ్యవసాయ సంస్కరణలు అమలు కాలేదు. గ్రామ సీమల్లో అణచివేతకు, వివక్షకు గురవుతున్న నిమ్న జాతుల ప్రజలకు దక్కాల్సిన భూమి వారికి దక్కలేదు. భూ సంస్కరణలు అమలు కాలేదు. ‘నేను ఏర్పరచిన రిజర్వేషన్లతో ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందనుకున్నా, అయితే వాటివల్ల గుప్పెడుమంది గుమస్తాలు మాత్రమే తయారయ్యారు. కానీ మెజారిటీ ప్రజానీకం నేటికీ గ్రామాల్లో భూమి లేకుండా భూస్వాములకు దాస్యం చేస్తు న్నారు. వారి కోసం నేను ఏమీ చేయలేక పోయాను’ అంటూ ఆవేదన చెందారు అంబేడ్కర్. (క్లిక్: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) అంటే భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం జరగదు. వ్యవసాయా ధారిత దేశంలో భూమికీ, సామాజిక న్యాయానికీ ఉన్న సంబంధం ఇదే. ప్రజలకు దక్కాల్సిన భూములు గుంజుకొని దేశ, విదేశీ బహుళజాతి కంపెనీలకు, బడా బాబులకు కట్టబెడుతున్నాయి కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు. వీరు భూమి సంబంధాలన్నింటినీ మార్కెట్ సంబంధాలుగా మార్చారు. మార్కెట్ ఎప్పుడూ లాభం కోసమే వెంపర్లాడుతుంది కానీ ప్రజా సంక్షేమం దానికి పట్టదు. అందుకే వ్యవసాయాన్ని దండగమారి వృత్తిగా చిత్రించి, రైతు వ్యతిరేక విధానాలతో దాన్ని కుప్ప కూల్చారు. దీంతో కార్పొరేట్లకు భూములను అమ్ము కొని రైతులు పట్టణాల్లో కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారిపోయారు. వ్యవసాయం మీదే ఆధారపడి కూలీలుగా బతికే బహుజనులదీ అదే దారయింది! (క్లిక్: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - షేక్ కరిముల్లా వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
తండ్రి జ్ఞాపకార్థం 12 ఎకరాల్లో పేదల కోసం పట్టాల పంపిణీ
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలిలో కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 12 ఎకరాల తన సొంత పొలంలో 670 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్థలాల్లో ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్కు లేఖ రాస్తానని చెప్పారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి, మంత్రి జయరాం తనయుడు అశోక్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు రా మ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొని నాగేంద్ర, వరలక్ష్మి దంపతులను అభినందించారు. -
సీఎంపై సభాహక్కుల నోటీస్ పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రకటించి ఇప్పుడు వెనక్కు తగ్గిన సీఎం కేసీఆర్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని సీఎం అవాస్తవాలు మాట్లాడారని, భగ వద్గీత, ఖురాన్, బైబిల్పై సీఎం ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ఆ విధంగా చేయ లేని పక్షంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ తప్పుగా ప్రచురితమైందని, దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తారా అని నిలదీశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో అప్పటి మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన సభాసంఘం సమ ర్పించిన నివేదికను శాసనసభ ఎదుట ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో కులాల వారీగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయట పెట్టడంలేదో చెప్పాలన్నారు. -
జగనన్న ‘స్మార్ట్ టౌన్’కు వేగంగా అడుగులు
మండపేట: పట్టణాల్లోని మధ్యతరగతి వర్గాల సొంతింటి కల సాకారానికి అడుగులు పడుతున్నాయి. తక్కువ ధరకే స్థలం అందించేందుకు ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన వారికి స్థలాల పంపిణీకి 3,215 ఎకరాల భూమి అవసరమని అంచనా. కాకినాడలో 1,284 ఎకరాలు పరిశీలిస్తున్నారు. మిగిలిన పట్టణాల్లో 1,931 ఎకరాల సేకరణకు రూ.2,128 కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. పట్టణాల్లో సెంటు భూమి కొనాలన్నా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో సొంతింటిపై ఆశలు వదులుకున్న మధ్య తరగతి వర్గాల వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్’ పథకం కొత్త ఉత్సాహం కలిగించింది. మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా సొంతిల్లు సమకూరేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పట్టణం సమీపంలో భూములు సేకరించి మార్కెట్ ధర కంటే తక్కువకు స్థలాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ స్థలాల్లో మౌలిక వసతులు కల్పించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఆదాయం కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులకూ అవకాశం కలి్పంచింది. లబి్ధదారుల వార్షికాదాయం మేరకు మూడు, నాలుగు, ఐదు సెంట్ల చొప్పున కేటగిరీలుగా స్థలాలు పొందేందుకు రెండు నెలల క్రితం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలీ్టలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 41,504 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలు ఆయా కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఈ పథకానికి జిల్లాలో 3,215 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు గుర్తించారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో 1,284 ఎకరాలు అవసరమవుతుండగా స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మిగిలిన పట్టణాల్లో ఇప్పటికే పలు స్థలాలను పరిశీలించిన అధికారులు అక్కడి ధరల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఎకరం భూ సేకరణకు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకూ అవుతుందని అంచనా. స్థల సేకరణ జరగాలి ఎంఐజీ స్కీంకు జిల్లాలో మూడు కేటగిరీల్లో 41,504 దరఖాస్తులు వచ్చాయి. స్థల పంపిణీకి దాదాపు 3,215 ఎకరాల వరకూ అవసరమవుతుందని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. స్థల సేకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. - రంగనాయకులు, మున్సిపల్ ఆర్డి, రాజమహేంద్రవరం -
తెరపైకి వెదిరె రామచంద్రా రెడ్డి జీవితం
తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి జీవితాన్ని ప్రముఖ దర్శకుడు నీలకంఠ తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ) నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబా భావే పేదలకు భూ పంపిణీ కోసం అడగ్గానే ప్రథమ భూదాతగా వంద ఎకరాల భూమిని వెదిరె రామచంద్రారెడ్డి దానంగా ఇచ్చారు. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన ఆయన జీవిత కథతో సినిమా తెరకెక్కించనున్నాం. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయాలనుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: తోలుపునూరి కృష్ణగౌడ్, గడ్డం రవికుమార్. -
‘సర్కారు భూమిల మన్నుబొయ్య..’
సాక్షి, మహబూబాబాద్: దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మూడెకరాల భూమి ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటన బొమ్మకల్ గ్రామంలో జరిగింది. గతంలో ఈ గ్రామంలోని 20 మంది దళితులకు 3 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 20 మందికి పంపిణీ చేసిన మూడు ఎకరాల భూమిని గ్రామ సర్పంచ్ ఒప్పందంతో అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి ఎకరం చొప్పున పంచుకోవాలని గతంలో దళితులంతా ఒప్పందం చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఎకరాల భూమిని 20 మందికి మాత్రమే వర్తిస్తుందని లబ్ధిదారులు అనడంతో దళితులంతా ఆగ్రహించారు. మహిళలని కూడా చూడకుండా లబ్దిదారులపై విచక్షణరహితంగా దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దవంగర ఎస్ఐ జితేందర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దళితులంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సమర్పించారని ఎస్ఐ తెలిపారు. ఇక గ్రామంలోని కొంతమంది దళితులకే ప్రభుత్వం భూములు ఇవ్వడంతోనే ఈ గొడవలకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారు భూమిల మన్నుబొయ్య మా పానాలు తీస్తరా’ అని బాధితులు ఆక్రోశం వెళ్లగక్కారు. -
పేదలకు నాణ్యమైన ఇళ్లు
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరా దని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్ సిబ్బందితో మంగళవారం తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లికార్జునరావు పలు సూచనలు చేశారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ నెల 26న సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 25న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాష్బోర్డులో పురోగతి వివరాలు.. ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం, పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సెమినార్లో సూచించారు. డిసెంబర్ 25న సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని, ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు. -
కలల గృహాలకు కదలిక
సాక్షి, అమరావతి : పేదల కలల గృహాలకు కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడున్నరేళ్లలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ అవసరమైన కసరత్తు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయనున్నారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుముతో పాటు పెద్ద ఎత్తున మెటల్, రంగులు (పెయింట్) అవసరం కావడంతో రివర్స్ టెండరింగ్ ద్వారా వాటిని సేకరించేందుకు అధికారులు విధి విధానాలు తయారు చేస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో అదే రోజు ఇంటి మంజూరు పత్రాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. పట్టాలు మంజూరైన పేదలందరికీ గృహాలు నిర్మిస్తారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లే అవుట్ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచి నీరు, విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలు వారి ఖాతాలకు బిల్లులు జమ అయ్యే వరకు గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో పని చేస్తున్న డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పాటు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లు, తాపీ పని చేసే వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకు గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేలా తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను ఇప్పటికే గ్రామ, పట్టణాల వారీగా సేకరించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు టెక్నికల్ కమిటీ పర్యవేక్షిస్తుంది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే పరికరాలు ఇస్తాం లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి ఐరన్, సిమెంట్, బ్రిక్స్, తలుపులు, కిటికీలు తదితర పరికరాలు ఇస్తాం. నిర్మాణానికి అవసరమైన ఇసుక కూడా ఉచితమే. డిసెంబర్ 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టాలు పంపిణీ చేసే రోజే 10 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా వాటికి మ్యాపింగ్ చేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ నిర్మిస్తాం. - చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి మొదటి విడత ఇళ్లు మంజూరు ఇలా జిల్లా ఇళ్ల సంఖ్య తూర్పు గోదావరి 2,40,100 కృష్ణా 1,75,939 విశాఖపట్నం 1,70,912 గుంటూరు 1,58,710 పశ్చిమ గోదావరి 1,54,855 చిత్తూరు 1,41,087 అనంతపురం 1,01,310 వైఎస్సార్ కడప 76,445 ప్రకాశం 70,990 కర్నూలు 58,738 శ్రీకాకుళం 56,608 విజయనగరం 51,767 నెల్లూరు 42,539 -
ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు
సాక్షి, అమరావతి: ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. మూడేళ్ల పాటు ప్రాజెక్టు ► రూ.2,500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టనున్నాం. ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం. డిసెంబర్ 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి. ► ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం రూ.9,550 కోట్లు వ్యయం చేస్తుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం. ► పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు? చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. జగన్ స్కీమ్ కావాలనుకున్న వారికి డిసెంబర్ 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవుతుంది. ఎవరి స్కీమ్ కావాలి? ► వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకువెళతారు. మీకు చంద్రబాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. ఇదీ బాబు స్కీమ్.. ► లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది. ఇది జగన్ స్కీమ్.. ► డిసెంబర్ 25న 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు. -
ఏపీ: డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ
-
ఏపీ: ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. డిసెంబర్ 25న అర్హులకు డి-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వాస్తవానికి జూలై 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు వాయిదా పడింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోయే స్థలాలు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.. డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. -
గిరిజన సంక్షేమానికి పెద్దపీట
-
గ్రామ స్వరాజ్యం సాకారం చేశాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామగ్రామానికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు.లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ , రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలిపారు. (చదవండి: గిరిజనుల దశాబ్దాల కల సాకారం..) ‘‘మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తా. భూ వివాదాలకు ఎక్కడా తావు లేకుండా డిజిటల్ సర్వే ద్వారా పంపిణీ చేశాం. గిరిజనులకు భూమితో పాటు రైతు భరోసా కింద సాయం అందిస్తాం. పట్టాలు పొందిన గిరిజనులకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటాం.పంటలు పండించుకునేందుకు గిరిజనులకు ఆర్ధిక సాయం అందిస్తామన్నారు. గిరిజనులకు ఫారెస్ట్ అధికారులతో పాటు కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తారని’’ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదని, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు. ‘‘పాదయాత్రలో గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులను చూశా.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి.గిరిజనుల ఆదాయం, పచ్చదనం పెరగాలి. నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాం. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను తీసుకొచ్చామని’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చప్పట్లతో అభినందించాలి.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. సీఎం జగన్ ఏమన్నారంటే... ‘‘అక్టోబరు 2న గాంధీ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేస్తున్నాను. మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలని కోరుతున్నా. నేనుకూడా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి నా ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొడతాను. మన వంతు ఆదరణ వారికి చూపించాలని’’ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
గిరిజనుల దశాబ్దాల కల సాకారం..
సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. వారికి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి రోజున పట్టాల పంపిణీతో పాటు మరిన్ని గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రభుత్వం 246.30 కోట్లు మంజూరు చేసింది. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం
సాక్షి, అమరావతి: పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతుల స్వప్నం గాంధీ జయంతి రోజు సాకారం కానుంది. గిరిజన రైతులకు వారు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పత్రాలను పంపిణీ చేయనున్నారు. ►తొలిసారిగా గిరిజన రైతులు సాగు చేసుకునే అటవీ భూములపై దివంగత వైఎస్సార్ హక్కు పత్రాలను అందచేశారు. 1,30,679 ఎకరాలకు సంబంధించి 55,513 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. తరువాత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించాయి. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అదే స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. ►సరిహద్దులను గుర్తించడం, రాళ్లు పాతడం, వెబ్ల్యాండ్, ఆర్వోఎఫ్ఆర్ డేటా బేస్లో వివరాల నమోదు ఇప్పటికే పూర్తయింది. ►ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 1.53 లక్షల మంది గిరిజన రైతులకు సుమారు మూడు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?) ►ఏజెన్సీలో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులకు నేడు శ్రీకారం ►పాడేరు మెడికల్ కాలేజీతోపాటు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనులను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభిస్తారు. సీతంపేట (శ్రీకాకుళం), పార్వతీపురం (విజయనగరం), రంపచోడవరం (తూర్పుగోదావరి), బుట్టాయగూడెం (పశి్చమగోదావరి), దోర్నాల (ప్రకాశం)లో ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.246 కోట్లు విడుదల చేసింది. ►నవరత్నాల్లో భాగంగా గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఏజెన్సీలో అక్షరాస్యత పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణకు పలు కార్యక్రమాలను చేపట్టారు. అధికారం చేపట్టగానే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.5177.54 కోట్లు కేటాయించగా సెపె్టంబర్ నెలాఖరు వరకు 184 పథకాల కింద గిరిజనుల కోసం రూ.2,560.33 కోట్లను వ్యయం చేశారు. ►విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.153.85 కోట్లను విడుదల చేసింది. -
ఇళ్ల స్థలాలు కావాలన్న కుటుంబాలు వెలి
మనుబోలు: మండలంలోని వెంకన్నపాళెం ఎస్సీ కాలనీలో ప్రభుత్వం అందజేసే ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు కొన్ని కుటుంబాలను తోటి సామాజిక వర్గం పెద్దలే వెలివేశారు. గత మూడ్రోజులుగా వారితో కాలనీ వాసులు ఎవరూ మాట్లాడకుండా నియమం విధించారు. దుకాణాల్లో సరుకులు సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వెంకన్నపాళెంలో ఎస్సీ కాలనీని ఆనుకుని సర్వే నంబర్ 131లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. లేఅవుట్ను సైతం సిద్ధం చేశారు. అయితే ఓ ప్రతిపక్ష నాయకుడి అండతో స్థానిక ఎస్సీలు తమకు అక్కడ స్థలాలు వద్దని వ్యతిరేకించడంతో లేఅవుట్పై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు ఇటీవల దౌర్జన్యంగా లేఅవుట్లో గుడిసెలు వేశారు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం తహసీల్దార్ నాగరాజు లేఅవుట్ విషయమై ఎస్సీలతో చర్చించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం మంచిది కాదని నచ్చజెప్పడంతో కొందరు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో మిగిలిన వారు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడిన 14 ఎస్సీ కుటుంబాలను ద్వేషంతో వెలివేశారు. బాధితుల్లో నలుగురు గ్రామ వలంటీర్లు కూడా ఉండడం విశేషం. ఎస్సీల వెలి, ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగరాజు పోలీసులతో కలిసి సచివాలయం వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు తోటి కులస్తులే తమను కుల బహిష్కరణ చేశారని బాధితులు తహసీల్దార్ వద్ద వాపోయారు. తమతో ఎవరు మాట్లాడినా రూ.10 వేలు జరిమానా వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెలేసిన ఎస్సీ సామాజిక వర్గ పెద్దలను తహసీల్దార్ పిలిపించి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఇతరులను వెలివేసే హక్కు ఎవరికీ లేదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు రెడీ
అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనుంది. వాస్తవంగా ఈ నెల 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో చివరి నిముషంలో ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 15కు వాయిదా వేశారు. సాక్షి, విజయవాడ: నగరంలో ఇళ్ల స్థలాల కోసం 1.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.05 లక్షల మంది అర్హులని నగర పాలక సంస్థ గుర్తించింది. వీరందరికీ ఇళ్ల స్థలాలు నగర పరిసర గ్రామాల్లోనూ, రాజధాని గ్రామాల్లోనూ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో గడువు దాటిన తరువాత వచ్చిన దరఖాస్తులను కూడా తీసుకుని వారికీ ఇళ్లు కేటాయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నగర పరిసర గ్రామాల్లో 1,333.59 ఎకరాల్లో 70,680 ప్లాట్లు సిద్ధం పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను జిల్లా రెవెన్యూ అధికారులు సేకరించారు. సెంటు ప్లాటు చొప్పున విడగొట్టి సిద్ధం చేశారు. మొత్తం 1,333.59 ఎకరాల్లో 18 లేఅవుట్లలో 70,680 ప్లాటు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో 85.56 ఎకరాల్లో 4,535 ప్లాట్లు, ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 40.72 ఎకరాల్లో 2,158 ప్లాట్లు, పెనమలూరు మండలం వణుకూరులో 155.07 ఎకరాల్లో 8,219 ప్లాట్లు, గన్నవరం మండలం సూరంపల్లి, కొండపావులూరుల్లో 396.66 ఎకరాల్లో 21,023 ప్లాట్లు, జి కొండూరు మండలం మునగపాడు, సున్నంపాడు గ్రామాలలో 521.22 ఎకరాల్లో 27,625 ప్లాట్లు, కంకిపాడు మండలం గొడవర్రులో 134.36 ఎకరాల్లో 7,121 ప్లాట్లు సిద్ధంచేశారు. ఆయా ప్లాట్ల మధ్యలో విశాలమైన రోడ్లు వేశారు. ఏ బిట్కు ఆ బిట్ విడగొట్టి సర్వే రాళ్లు పాతి లబ్ధిదారులు చూసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలకు కంటగింపు మిగిలిన వారికి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఒకేసారి నగరంలో లక్ష కుటుంబాలకు ఇళ్ల స్థలాలు వస్తే టీడీపీ పార్టీ ముఖం చూసేవారే కరువవుతారనే కంటగింపు ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. దీంతో ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదంటూ అక్కడ రైతులతో కోర్టులో కేసులు వేయించారు. ఇక రైతుల నుంచి సేకరించిన భూమిని పేదలకు దక్కకుండా కోర్టులలో కేసులు దాఖలు చేయిస్తున్నారు. వీరి ప్రయత్నాలన్నీ తాత్కాలికమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. పేదల ఎదురు చూపులు ఇప్పటికే రెండు సార్లు టీడీపీ నాయకులు అడ్డుపడటాన్ని పేదలు గమనిస్తున్నారు. వారి వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. -
పేదల ఇళ్ల స్థలాల కోసం 30,875 ఎకరాలు గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణకు దిగింది. ఒకవైపు ఇళ్ల స్థలాలకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు మరోవైపు లబ్ధిదారుల గుర్తింపును కూడా సమాంతరంగా చేపట్టింది. వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో అధికార యంత్రాంగం పేదల ఇళ్ల స్థలాల కోసం అనువైన భూములను గుర్తించే పనిలో తలమునకలైంది. ఇప్పటివరకు 10,674 గ్రామాల్లో 26,527.73 ఎకరాలు.. 72 పట్టణ ప్రాంతాల్లో 4,348.23 ఎకరాలు కలిపి 30,875.96 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు లక్షల సంఖ్యలో వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పుడు అదే తరహాలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తిస్తోంది. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తించకపోగా బడా పారిశ్రామికవేత్తల కోసం ఏకంగా పది లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేసింది. పేదల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోందని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. 17.34 లక్షల మంది అర్హులు రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇళ్ల స్థలాలు లేని, ఇళ్లు లేని పేదలందరినీ గుర్తించారు. గత నెలాఖరుకు రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సర్వేను వలంటీర్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ లేకుండా రియల్టైమ్ గవర్నెన్స్ చర్యలు చేపట్టింది. తద్వారా 24.83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. ఈ లబ్ధిదారుల అర్హతలు, తనిఖీల ప్రక్రియను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏకకాలంలో కొనసాగిస్తున్నారు. తనిఖీల అనంతరం ఇప్పటివరకు 12,84,611 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు అర్హులని తేల్చారు. వీరు కాకుండా 4,50,206 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు అర్హులుగా తేల్చారు. ఇంకా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7లోగా ఇంకా ఎంత భూమి అవసరమనేది అధికారులు నిర్ధారించనున్నారు. అవసరమైన భూమిని వచ్చే ఏడాది జనవరి 25లోగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో మార్కింగ్ చేసి చూపిస్తారు. అంతేకాకుండా ఆ కుటుంబాల మహిళల పేరిట ఉగాది నాడు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం
సాక్షి, అమరావతి : అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించాలన్నదే సర్కారు ధ్యేయమని, ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అర్హతగల ప్రతి కుటుంబానికి నివాస స్థల పట్టా అందించాలని సూచించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఎన్ని కుటుంబాలకు ఇల్లు, ఇంటి జాగా లేదో పరిశీలించి అర్హులను ఖరారు చేయాలన్నారు. వారందరికీ నివాస స్థలాలు ఇవ్వడానికి ఎంత భూమి అవసరం అవుతుందో.. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో అంచనా వేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో సమగ్ర భూ సర్వేకు ఆధునిక పరికరాలు వినియోగించాలని చెప్పారు. భూ వివాదాల కట్టడి, భూ రికార్డుల మ్యుటేషన్, భూ యజమానులకు శాశ్వత భూ హక్కుల కల్పన కోసం అత్యంత కచ్చితత్వంతో భూములు రీసర్వే చేయాలని ఆదేశించారు. ఉగాదికి నెల రోజుల ముందే భూమిని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామాల్లో 20,800 ఎకరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,580 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో ఎంత భూమి ఇళ్ల స్థలాలకు అనువైనదో నిర్ధారించే కార్యక్రమం చేపట్టామని వివరించారు. గ్రామాల్లో దాదాపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇందులో 15.75 లక్షల మందికి భూమిని సమకూర్చాల్సి ఉందన్నారు. లోపరహితంగా భూ రీసర్వే ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్న కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (సీఓఆర్ఎస్.. కార్స్) టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం భూముల రీసర్వేకి వినియోగించనున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి చదరపు కిలోమీటర్కు రూ.1.10 లక్షలు ఖర్చవుతుందని, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, గ్రీస్ దేశాల్లో కార్స్ ద్వారా రోవర్స్తో ఉపగ్రహ సేవలను వినియోగించుకుని సర్వే చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు దేశంలో మొదటిసారి మనం ఖర్చుకు వెనకాడకుండా ఈ విధానంతో సర్వేకు సన్నద్ధమవుతున్నామన్నారు. రూ.300 కోట్లతో పరికరాల కొనుగోలు రాష్ట్రంలో 670 మండలాల పరిధిలోని 17,460 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి చెందిన 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో భూములను రీసర్వే చేయడానికి రూ.1,688 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు చెప్పారు. రూ.300 కోట్లతో పరికరాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ‘1880 – 1930 మధ్య తొలిసారి రైత్వారీ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. 1960 – 80 మధ్య మరోసారి సెటిల్మెంట్ గ్రామాలపై రికార్డులు రూపొందించారు. ప్రస్తుతం అన్ని భూ సమస్యల పరిష్కారానికి రీసర్వేనే మార్గం. అందుకే 75 బేస్ స్టేషన్లు, 3,440 రోవర్స్, ఒక కంట్రోల్ సెంటర్, 1,850 లాప్టాప్స్, 700 డెస్క్ టాప్స్ వినియోగించి ఒకేసారి మూడు వేల గ్రామాల్లో రీసర్వే చేపడతాం. అన్ని శాఖలకు ఉపయోగపడేలా డేటా పక్కాగా ఉంటుంది. మూడు విడతల్లో రెండున్నరేళ్లలో సర్వే పూర్తి చేస్తాం’ అని అధికారులు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనసున్న మారాజు
యానాం: పది రూపాయలిచ్చి లక్షలాది రూపాయల ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో కూడా యానాంకు చెందిన ఓ దళితుడు నిస్వార్థంగా తనకున్న రూ.కోటి విలువ చేసే భూమిని పేదలకు పంచిపెట్టారు. కుల మతాలకు అతీతంగా 54 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. యానాం మున్సిపాలిటీ పరిధిలోని దరియాలతిప్పకు చెందిన మెల్లం సుబ్బారావు గతంలో కౌన్సిలర్గా పనిచేశారు. ఆ సమయంలో తన పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్నన పొందారు. సుబ్బారావుకు దరియాలతిప్పలో రెండు ఎకరాలు కొబ్బరి తోట ఉంది. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.కోటి వరకు ఉంటుంది. అయినా కూడా పేదలకు సొంత గూడు కల్పించేందుకు ఆ భూమిని ఆదివారం ఉదారంగా పంచి పెట్టాడు. 65 చదరపు మీటర్ల చొప్పున విభజించి ఎస్సీలు, మత్స్య కారులు, బ్రాహ్మణులు, కాపులు, శెట్టిబలిజకు చెందిన 54 మంది పేదలకు పంపిణీ చేశారు. కాగా, సుబ్బారావుకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక కుమారుడు చనిపోగా మిగిలిన వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు మాట్లాడుతూ ‘సొంత ఇళ్లు లేని పేదల కష్టాలను ప్రత్యక్షంగా చూశాను. ఎప్పటికైనా వారికి సాయపడాలని అనుకున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇళ్లు లేని వారికి ఏదో నా వంతు సాయం చేశాననే సంతృప్తి కలిగింది’ అని పేర్కొన్నారు. -
రైతుల గుండెల్లో గ్రంధి శ్రీనివాస్
భూములున్నా.. పంట పండించుకోవడం తప్ప.. వారికి ఎటువంటి హక్కులేదు. పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నా బ్యాంకుల్లో కుదవ పెట్టుకునే అవకాశం లేదు. దీంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరం. అటువంటి సమయంలో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ వారికి అండగా నిలిచారు. ప్రభుత్వాన్ని ఒప్పించి సీఏడీ భూములకు పట్టాలు ఇప్పించారు. దీంతో అక్కడ సుమారు 1000 మంది రైతులకు మేలు కలిగింది. అటువంటి శ్రీనివాస్ను తాము ఎప్పటికీ మర్చిపోలేం అని రైతన్నలు చెప్పారు. మళ్లీ ఆయన్ని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారంతా నడుం బిగించారు. సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సర్కార్ అగ్రికల్చర్ డెవలప్మెంట్(సీఏడీ)భూములు సుమారు 1532 ఎకరాలు ఉన్నాయి. వాటిని 1921 సంవత్సరం నుంచి గ్రామానికి చెందిన కొంతమంది పేదలు సాగుచేయడం ప్రారంభించారు. అడవి మాదిరిగా చెట్లు, చేమలు, రుప్పలతో అస్తవ్యస్థంగా ఉండే ఆ భూములను అప్పటి రైతులు ఎంతో కష్టపడి సాగుకు అనుకూలంగా మార్పుచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ భూములపై రైతులకు చట్టబద్ధంగా ఎటువంటి హక్కులేకపోయింది. ఆ భూములు మావేనని చెప్పడానికి వారి వద్ద ఎటువంటి ఆధారం ఉండేది కాదు. కనీసం తమ ఆడబిడ్డలకు పిల్లలకు కట్న కానుకలుగా ఇచ్చే అవకాశం లేకపోయింది. ఎంతోకాలంగా పట్టాలిప్పించాలని రైతులు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎంతో నిరాశలో ఉన్న రైతులకు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ ఆశాదీపంగా కనిపించారు. రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే వారికి పట్టాలు ఇప్పించడానికి కృషి ప్రారంభించారు. 1532 ఎకరాల సీఏడీ భూముల్లో సుమారు 902 మంది రైతులకు 950 ఎకరాలకు పట్టాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. అయితే మిగిలిన భూములకు పట్టాలు ఇప్పించడానికి పదేళ్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఎటువంటి శ్రద్ధ చూపించలేదని విమర్శిస్తున్నారు. మళ్లీ శ్రీనివాస్ ఎమ్మెల్యే అయితే మిగిలిన భూములకు పట్టాలు వస్తాయని వారంతా నేడు ఆశగా ఉన్నారు. మా కష్టం తెలిసిన మహనీయుడు శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యేగా ఎంతోమంది పని చేశారు. కానీ రైతుల కష్టాలు ఎవరూ గుర్తించేవారు కాదు. గ్రంధి శ్రీనివాస్ గుర్తించి 950 ఎకరాలకు పట్టాలిచ్చి 900 మందికి పైగా రైతుల కళ్లలో ఆనందాన్ని చూసిన వ్యక్తి. మా వంశంలోని తరతరాలకు గుర్తుండిపోతారు. –జి.వెంకట సుబ్బలక్ష్మి, మహిళా రైతు, గొల్లవానితిప్ప రైతు బిడ్డ కనుకనే.. రైతులంటే రైతు బిడ్డ అయిన శ్రీనివాస్కు అభిమానం ఎక్కువ. రైతులు కనబడితే కారు ఆపి పలకరిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేను చూడలేదు. –మెంటే పల్లయ్య, రైతు, గొల్లవానితిప్ప కట్నంగా ఇస్తున్నాం పట్టాలు ఇవ్వక ముందు మా ఆడబిడ్డలకు భూమిని కట్నంగా ఇచ్చే అవకాశం ఉండేది కాదు. శ్రీనివాస్ చలువ వల్ల ఇప్పుడు కట్నాలుగా ఇస్తున్నాం. –పాకల రంగారావు, రైతు, గొల్లవానితిప్ప నాలుగు మెతుకులు తింటున్నాం అప్పట్లో మా పొలానికి పట్టాలు ఏమి లేకపోవడంతో భూమికి విలువ ఉండేది కాదు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టాలు ఇచ్చిన తరువాత భూమికి విలువ పెరిగింది. ఆయన దయవల్లే నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం. - గుద్దటి పెద్దిరాజు, రైతు, గొల్లవానితిప్ప -
పాత పట్టాలకు పునర్జీవం
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాళెం సెంటర్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే లక్షలాది రూపాయలు విలువగల ప్రభుత్వ భూమిని (రద్దయిన పట్టాల భూమి) టీడీపీ అభ్యర్థికి సహకరిస్తున్నారని అప్పనంగా కట్టబెట్టిన వైనమిది. వివరాలు.. ఆత్మకూరు పట్టణంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టైలర్లకు ఇళ్ల నివేశన స్థలాలు సర్వే నంబర్ 1906లో పట్టాలు మంజూరు చేయించారు. సుమారు 108 మందికి ఈ పట్టాలు అందచేశారు. స్థలాలు పట్టణానికి దూరంగా ఉండటంతో పట్టాలు అందుకున్న వారెవ్వరూ ఈ స్థలాల గురించి పట్టంచుకోలేదు. అనంతరం ఈ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఐదేళ్ల క్రితం ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో ఆ స్థలాలకు డిమాండు పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో మైనార్టీలను ఆకట్టుకునేందుకు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే తిరిగి పట్టాలు వచ్చేలా చేస్తామని వారికి ఆశ చూపారు. దీంతో అభ్యర్థివద్దకు వారందరినీ తీసుకుని వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో ఆయన అంగీకారం తెలుపుతూ అధికారులతో మాట్లాడి ఆ స్థలాన్ని చదును చేసేందుకు తన ‘సహకారం’ అందించారు. అంతే సర్వే నంబరు1906లోని రెండు రోజుల వ్యవధిలో రేకుల గదుల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. దండకాలు షురూ..! అప్పట్లో ప్రభుత్వం పేదలైన టైలర్ కుటుంబాలకు నివేశన స్థలాలు మంజూరు చేసేందుకు పట్టాలు అందజేసింది. అయితే వారు అప్పట్లో నిర్మాణాలు చేపట్టక పోవటంతో అవి రద్దయ్యాయి. తిరిగి ఆ పట్టాలు పొందాలంటే ఒక్కొక్కరూ ఒక్కో పట్టాకు రూ. 2 వేల చొప్పున చెల్లించాలంటూ దళారులు దండకాలు చేపట్టారు. అప్పట్లో 108 మందికి పట్టాలు పంపిణీ చేస్తే ఇప్పుడు అదే స్థలంలో 150 మందికి పైగా పట్టాల కోసం దళారులకు డబ్బులు చెల్లించటం విశేషం. దండకాల్లో భాగంగా నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ తరఫున పట్టాల కోసం నగదు చెల్లించటంతో అసలైన లబ్ధిదారులు విస్తు పోతున్నారు. 20 ఏళ్ల క్రితం టైలర్లుగా ఉన్న కొందరు మృతి చెందటం, కొందరు ఊరు విడిచి వెళ్లటం, కొంతమంది వివిధ ఉద్యోగాలలో చేరారు. వారి స్థానంలో కొత్త వారిని చేరుస్తామంటూ సదరు నాయకులు నగదు వసూలు చేశారు. అసలైన పేదలకు అన్యాయం అప్పట్లో టైలర్ వృత్తి చేస్తూ అనారోగ్యానికి గురై పక్షవాతం సోకి జీవనం కోసం సత్రం సెంటర్లో బడ్డీ బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి వద్ద రూ. 2వేలు డిమాండు చేయటంతో అతను ‘తండల్’కు తెచ్చి చెల్లించాడు. ఇదే క్రమంలో బస్టాండు సెంటర్లో ఏళ్ల తరబడి టైలర్ పని చేసి ప్రస్తుతం మంచంలో ఉన్న ఖాజా మస్తాన్, సత్రం సెంటర్లో టైలర్ పని చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నజీర్ తదితరులు పేర్లు తొలగించారు. ఇలా ఇష్టారాజ్యంగా అసలైన లబ్ధిదారులను తొలగించి నగదు చెల్లించిన వారికి పట్టాలు మంజూరు చేసేందుకు దళారులు పూనుకోవటం పట్ల పేదలు మండి పడుతున్నారు. దళారులలో ఓ ప్రధాన వ్యక్తి రూ.2 వేలు చొప్పున చెల్లించిన వారికి చీటీలు వేసి డిప్ ద్వారా ఫ్లాట్ నంబర్ కేటాయించటం విశేషం. ఆయన కేటాయించిన మేరకే ఫ్లాట్లు ఇస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉన్నతాధికారులు పరిశీలించి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్ విద్యాసాగరుడుని సంప్రదించగా ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకపోవటంతో అవి గడువు తీరిన అనంతరం ప్రభుత్వ స్థలాల కిందే లెక్క. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలియటంతో సిబ్బందిని పంపి నిలుపుదల చేయించా. ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు చేస్తుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -
కొంప ‘కొల్లేరు’ చేసింది బాబే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘కొల్లేరు’ రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. కొల్లేరు రైతుల గురించి ఇన్నాళ్లూ ఏమాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,600 ఎకరాల జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇప్పిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం చూసి అధికార యంత్రాంగం విస్తుబోతోంది. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సాధికార కమిటీ అనుమతి లేనిదే కొల్లేరు అభయారణ్యంలో సెంటు భూమి కూడా ఎవరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 20,600 ఎకరాలను అభయారణ్యం నుంచి మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి, రైతులకు ఇచ్చేస్తామని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని అధికారులు, పర్యావరణ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదు? వాస్తవానికి కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 3 నుంచి 5కు పెంచడం ద్వారా రైతులను దగా చేసింది చంద్రబాబే. మూడో కాంటూరు వరకూ 135 చదరపు కిలోమీటర్ల పరిధిలో 33,750 ఎకరాలకే పరిమితమైన కొల్లేరు అభయారణ్యాన్ని ఐదో కాంటూరుకు పెంచారు. దీనివల్ల కొల్లేరు అభయారణ్యం విస్తీర్ణం 77,138 ఎకరాలకు(308 చదరపు కిలోమీటర్లకు) విస్తరించింది. ఈ మేరకు 1999 అక్టోబరు 4న చంద్రబాబు ప్రభుత్వం జీవో 120ను జారీ చేసింది. దీనివల్ల 20,000 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములు కొల్లేరు అభయారణ్యం పరిధిలోకి కొత్తగా చేరాయి. ఫలితంగా ఆయా భూముల్లో పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం లేక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలని, తమ భూములను అభయారణ్యం నుంచి మినహాయించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పలు మండలాల రైతులు ఉద్యమించారు. తర్వాత కొల్లేరును కాంటూరు 5 నుంచి 3కు కుదించాలంటూ చంద్రబాబు సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని ప్రకారం సీఎం నేతృత్వంలోని రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు ఇదే తీర్మానం చేసి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపించి చేతులు దులుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జాతీయ వైల్డ్ లైఫ్ బోర్డు 2015 సెప్టెంబరులో ఈ తీర్మానాన్ని తిరస్కరించింది. దీన్నిబట్టే కాంటూరు కుదింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం ఆమోదం కోసం మోదీపై చంద్రబాబు ఏమాత్రం ఒత్తిడి తేలేదని తేటతెల్లమవుతోంది. తాజాగా కొల్లేరు రైతులకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో చంద్రబాబు కళ్లు తెరుచుకున్నాయి. 3–5 కాంటూరు పరిధిలోని జిరాయితీ, పట్టా భూముల రైతులకు ఏదో మేలు చేస్తున్నామనే భ్రమలు కల్పిస్తున్నారు తప్ప చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి నిజంగా తమ మేలు కోరే వారే అయితే ఈ నాలుగేళ్లూ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పరిధిలోని అంశమని తెలిసినా.. కొల్లేరు కాంటూరు 3–5 మధ్య ఉన్న 20,000 ఎకరాలకు పైగా జిరాయితీ, డి.పట్టా భూములను రైతులకు ఇస్తామని చంద్రబాబు చెప్పడం వారిని మోసగించడమేనని అధికారులు అంటున్నారు. జాతీయ వైల్డ్లైఫ్ బోర్డు ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు నేతృత్వంలోని సాధికార కమిటీ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం (జాతీయ వైల్డ్లైఫ్ బోర్డు) ప్రతిపాదన పంపితేనే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. అయినా ఆయా భూములను తానే రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు చెప్పడం మోసగించే ప్రయత్నమేనని అధికారులు పేర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామన్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కొల్లేరు రైతుల గోడు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరు వాసుల నుంచే ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. కొల్లేరు భూములు రీ సర్వే చేస్తామని ప్రకటించారు. నిర్ణయాధికారం సుప్రీంకోర్టుదే.. ‘‘కొల్లేరు సరస్సు కాంటూర్ కుదింపు లేదా భూముల మినహాయింపు అధికారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సెంట్రల్ సాధికార కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు కొల్లేరులో భూములను చేపల చెరువులుగా మార్చేసి, వ్యాపారం చేస్తున్నారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొల్లేరు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ – తల్లవజ్జుల పతంజలిశాస్త్రి, పర్యావరణవేత్త, రాజమండ్రి(ఫోటో నెంబర్ 1001) చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు ‘‘కొల్లేరు భూముల విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కొల్లేరు భూములు పంపిణీ చేయాలంటూ నాలుగేళ్లుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటూ తిప్పి పంపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండంతో మళ్లీ భ్రమల్లో ముంచుతున్నారు’’ – ఘంటసాల లక్ష్మీ, రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు (1002) జగన్ హామీ ఇవ్వడం వల్లే.. ‘‘కొల్లేరు కాంటూరును కుదిస్తామంటూ నాలుగేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఆశ పెట్టింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారం దక్కించుకున్న తర్వాత మోసం చేసింది. నాలుగేళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మా సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు భూములపై మాట్లాడుతున్నారు’’ – ఘంటసాల బలరామయ్య, గుడివాకలంక (1004) -
ఒక పట్టాన చెవికెక్కదు
వ్యవసాయ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పనిముట్లు.. వీటి గురించి టీవీ, పేపర్లలో వినడమేగానీ.. వారి దరి చేరింది లేదు. తరతరాలుగా చెమట చుక్కలను చిలకరించి పుడమి తల్లిని పులకరింపజేసి నాలుగు మెతుకులు తినడమేగానీ.. ఆ భూములు వారికి దక్కింది లేదు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఊరూరా తిరుగుతూ సాగు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారుగానీ.. నాలుగేళ్లుగా వారి గోడు పట్టించుకున్న దిక్కు లేదు. ‘మాకు పట్టాలివ్వండి మహాప్రభో’ అంటూ వచ్చిన 26 వేల దరఖాస్తులకు సమాధానం చెప్పే నాథుడు లేడు. ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్రలో 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారు. ఫలితంగా భూములు సాగు చేసుకునేందుకు గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి,అమరావతి బ్యూరో: జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 2.5 లక్షల మందికిపైగా గిరిజనులు ఉన్నారు. వీరు సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలు ఇచ్చేందుకు వీలుగా 2005–06 అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లాలో 28 వేల ఎకరాల భూమిని సర్వే చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేశారు. జిల్లాలో 3,200 మంది గిరిజనులకు 5,326 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు గిరిజనుల భూమి పట్టాల గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ 26 వేల మంది గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూమి సాగు చేసుకొనేందుకు తిప్పలు ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ కావడంతో గిరిజనులు భూములు సాగు చేసుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్లు, ఎద్దులు, అరకలు తీసుకెళ్తున్నారు. వీటిని అటవీ అధికారులు అడ్డుకొని, వాటిని సీజ్ చేసి కేసులు పెడుతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంకొండ మండలం రామాంజనేయపురంలో 32 మంది ఎస్టీలకు 118 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అయితే కొంత మంది ఆ పొలాలను దౌర్జన్యంగా లాక్కొని, ఎస్టీలు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకొంటున్నారు. ఎస్టీలు పలుమార్లు అధికారులకు సమస్యను విన్నవించి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు. వెల్దుర్తి మండలం సిరిపురం తాండలో 200 మంది ఎస్టీలకు గాను కేవలం 70 మందికి మాత్రమే భూమి పట్టాలు ఇచ్చారు. అయితే వారు పొలాల వద్దనే గుడిసెలలో నివాసం ఏర్పాటు చేసుకొని భూములు సాగు చేసుకొంటున్నారు. అక్కడ ప్రభుత్వం కనీçసం తాగునీటి వసతి కూడా కల్పించక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని వేడుకొంటున్నారు. సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు తరతరాలుగా భూములు దున్నుకొంటున్న గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లలో సెంటు భూమికి పట్టా ఇవ్వలేదు. వైఎస్సార్ హయాంలో మాత్రం అటవీ హక్కుల చట్టాన్ని విస్తృతంగా అమలు చేసి, భూమి పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు గిరిజనులు తమ పొలాలను సాగు చేసుకొనేందుకు అడవికి వెళ్తుంటే అడ్డుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఆర్.కృష్ణానాయక్, లంబాడి హక్కుల పోరాట సంఘం నేత -
2,073 ఎకరాలు.. ‘పంపిణీ’కి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: దళితుల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ వడివడిగా కదులుతోంది. ఇప్పటివరకు భూముల కొనుగోలుపై దృష్టి సారించిన అధికారులు.. తాజాగా వాటిని పంపిణీ చేసే పనిలోపడ్డారు. 2017–18 వార్షిక సంవత్సరంలో 10,254 ఎకరాలు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఎస్సీ కార్పొరేషన్.. ఇప్పటివరకు 2,073 ఎకరాలకు సంబంధించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకు రూ.96.74 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు రికార్డుల్లో మార్పులు పూర్తి చేసి.. సదరు భూమిని పొజిషన్లోకి తీసుకుంది. దీంతో ఈ భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. మరో 3 వేల ఎకరాలు ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ వద్ద మరో 3 వేల ఎకరాలకు సంబంధించి ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. భూముల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాటిని కొనుగోలు చేయనున్నారు. మరోవైపు లక్ష్యానికి తగ్గట్టుగా పలు జిల్లాల్లో భూ లభ్యత ఆశాజనకంగా లేదు. అనువైన భూములు ఉంటే ధరలు ఎక్కువగా ఉండటం.. తక్కువ ధరలుంటే సారం లేకపోవడంతో అధికారులు ఆయా భూముల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యంలో 50 శాతం మాత్రమే సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక అందుబాటులో ఉన్న భూములను పూర్తి స్థాయి సౌకర్యాలతో పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా అందుబాటులో ఉన్న 2,073 ఎకరాలు పంపిణీ చేసి.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 3 వేల ఎకరాలను పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. 11 జిల్లాల్లో నిల్! భూ పంపిణీ పథకానికి సంబంధించి మూడు జిల్లాలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించలేదు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోలుకు అనువైన భూములు లేవు. హైదరాబాద్ జిల్లాలో సాగు భూములు లేకపోగా.. మేడ్చల్ జిల్లాలో ఎకరా ధర కోట్లల్లో ఉండటంతో ఆ జిల్లాల్లో ఈ పథకం సాధ్యం కాదని అధికారులు అంచనాకు వచ్చారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోనూ ఈసారి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. ఇవికాక మరో ఎనిమిది జిల్లాల్లోనూ భూముల లభ్యత ఆశాజనకంగా లేదు. జగిత్యాల, జనగామ, మహబూబ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ (అర్బన్) జిల్లాల్లో భూ పంపిణీ పథకం నిబంధనల ప్రకారం సాగు భూములు లభించడం లేదు. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో భూములు కొనుగోలు చేయకపోవడంతో అక్కడ పంపిణీ ప్రక్రియకు బ్రేక్ వేశారు. దీంతో ఈ ఏడాది 20 జిల్లాల్లో మాత్రమే భూ పంపిణీ జరిగే అవకాశం ఉంది. -
వైఎస్సార్ హయాంలోనే భూపంపిణీ : కుంతియా
నిజామాబాద్: తెలంగాణలో భూ పంపిణీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. డిచ్ పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ బూత్ కమిటీ మెంబర్స్ కు నిర్వహించిన ఇందిరమ్మ రైతు బాట అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కొత్తగా తెలంగాణలో ఎక్కడా భూపంపిణీ చేయలేదని తేల్చి చెప్పారు. బూత్ లెవల్ లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గద్దె దిగడం, 2019 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. -
ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న ప్రభుత్వం
సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి మంకమ్మతోట: పేద దళితులకు భూము లు పంపిణీ చేస్తామ ని ఆశలు రేకెత్తించి ప్రభుత్వం ఆత్మహ త్యలకు పురిగొల్పుతోందని సీఎల్పీ ఉప నేత టి.జీవన్రెడ్డి విమర్శించారు. మంగళ వారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వం దళితులపై కక్షసాధింపు చర్యల కు పాల్పడుతోందన్నారు. గూడూరుకి చెం దిన శ్రీనివాస్, పరశురామ్లు ప్రభుత్వం ఇస్తున్న భూమి తమకు ఇప్పించాలని కోరితే.. డబ్బులు ఇస్తేనే భూములు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం తోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఆత్మ హత్యలను పురిగొల్పే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలన్నారు. -
బాధితులకు ఈటల, హరీశ్ పరామర్శ
హైదరాబాద్: భూ పంపిణీలో న్యాయం జరగలేదని ఆత్మహత్యకు యత్నించి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, పరశురాంను మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ సోమవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ వినోద్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. హరీశ్రావు విలేకరులతో మాట్లాడేం దుకు నిరాకరించారు. చిన్న మనస్పర్థల వల్లే.. : ఈటల భూపంపిణీలో స్థానికంగా నెలకొన్న చిన్న మనస్పర్థలతోనే ఈ ఘటన చోటుచేసుకుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది క్షణికావేశంలో జరిగిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల కంటే మానకొండూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా భూపంపిణీ జరిగిందని చెప్పారు. భూ పంపిణీతో ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. అపోహతోనే అలా చేశారు: రసమయి మానకొండూరు నియోజకవర్గంలో విడతలవారీగా భూపంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి అన్నారు. భూమి దొరకని చోట రైతులను బ్రతిమిలాడి కొనుగోలు చేసి దళితులకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. శ్రీనివాస్కు కూడా ఎకరం 10 గుంటల భూమి కేటాయించినట్లు చెప్పారు. తనకు తక్కువ భూమి వస్తోందనే అభద్రతకు గురై ఆత్మహత్యకు యత్నించారని చెప్పారు. తాను దళితుడినేని, తన జాతి బాగుపడాలనే ఉద్దేశంతో ఈ పథకం కోసం ఎంతో శ్రమించానని రసమయి చెప్పారు. -
విపక్షాల నిరసన గళం
► దళితులకు భూపంపిణీలో అన్యాయంపై ధ్వజం ► ఆత్మహత్యకు యత్నించిన బాధితులను పరామర్శించిన విపక్ష, ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ : దళితులకు భూపంపిణీలో అన్యాయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భూపంపిణీలో న్యాయం జరగలేదని ఎమ్మెల్మే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన బాధితులను వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సోమవారం పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ (35), యాలాల పరశురాం(24) ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 40 శాతం గాయాలకు గురైన శ్రీనివాస్ కిడ్నీలు పాడైపోయాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 48 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. 35 శాతం గాయాలైన పరశురాం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన శ్రీనివాస్ భార్య తల్లి పోశవ్వ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీమంత్రులు జీవన్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఆస్పత్రికి వచ్చారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ నాయకులు రేవంత్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, వైఎస్ఆర్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడ్క జగదీశ్వర్గుప్త, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్వెస్లీ, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, గోపాల్, జనార్దన్, శ్రీరాం నాయక్, రచయిత్రి సుజా త తదితరులు బాధితులను పరామర్శించారు. దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీ సులు మోహరించారు. ఆస్పత్రి ఎదుట టీ మాస్ ఫోరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వంపై నేతల ఆగ్రహం హామీలు నెరవేర్చాలి: భట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఎంత నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయో ఈ ఘటనలో బయటపడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొని హామీలను నెరవేర్చాలి. సీఎంపై కేసు పెట్టాలి: వీహెచ్ దళిత యువకుల ఆత్మహత్య ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఆయనపై కేసు నమోదు చేయాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లంచాలు అడిగితే చెప్పుతో కొట్టమని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మాటలు సినిమా డైలాగుల్లా ఉంటున్నాయి. కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలి: రేవంత్ దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. దళితులపై దాడుల ఘటనల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం, 3 ఎకరాల భూమి ఇవ్వాలి. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలపై పడి లంచాలు వసూలు చేస్తున్నారు. పరిహారం చెల్లించాలి: కోదండరాం గ్రామ స్థాయిలో పరిపాలన కుప్పకూలిపోయిందనడానికి ఇదే నిదర్శనం. దీన్ని ఒక ఘటనగా తీసుకోకుండా పాలనాపరమైన లోపంగా గుర్తించాలి. ఎమ్మార్వో, ఆర్డీవో తదితర అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ బాధితులు తిరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. దీంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం, భూమి అందించాలి. వారి వైద్య ఖర్చులను భరించాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ: చాడ బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. కేవలం వీఆర్వోనే కాకుండా ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులపై పూర్తి స్థాయి విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అధికారులు భూమి ఉన్నవారినే భూపంపిణీకి ఎంపిక చేసి, ఇంచ్ భూమి లేనివారిని విస్మరించారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో దళిత యువకులు ఆత్మహత్యకు యత్నించారు. రాజకీయ రాబందులే కారణం: తమ్మినేని భూ పంపిణీలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ అవినీతికి పాల్పడి అర్హులకు భూ పంపిణీలో చోటు లేకుండా చేశారు. రాజకీయ రాబందులే ఈ ఘటనకు కారణం. చిన్న, చిన్న అధికారులను బలి చేయకుండా రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలి. మంగళవారం నుంచి టీ మాస్తో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వానిదే బాధ్యత: విమలక్క పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలు విస్మరించి దళితులకు భూ పంపిణీ చేయడం లేదు. అందుకే ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మూల్యం చెల్లించక తప్పదు: మంద కృష్ణ కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 120 మంది దళితులను హత్య చేశారు, 50 మందిపై అత్యాచారం జరిగింది, 5 వేల మందిపై దాడులు జరిగాయి. దీనికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజా ఘటనపై ఈ నెల 5, 6వ తేదీల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తాం. 7వ తేదీన భూ పంపిణీపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ విడుదల చేస్తాం. హామీలు విస్మరించారు: జగదీశ్వర్గుప్తా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించినా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఈ ఘటనలో హరీశ్రావు బంధువు జడ్పీటీసీ డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. -
భూ పంపిణీ.. బూటకం: మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ బూటకమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. భూపంపిణీలో జరుగుతున్న అవినీతితో అసహ నానికి గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకులను సోమవారం ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. భూపంపిణీ అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమేగానీ గోరంతైనా పంపిణీ జరగలేదన్నారు. దళితుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నడిరోడ్డుపై దోషిగా నిలబెడతామని, ఇందుకోసం ప్రజాపోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 5, 6ల్లో గ్రామస్థాయి లో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -
కేసీఆర్ మోసాలను ఎండగట్టాలి
• దళితులకు మూడెకరాల భూ పంపిణీలో టీఆర్ఎస్ మోసం • టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో కొప్పుల రాజు సాక్షి, హైదరాబాద్: భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిస్తా మని మోసం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును ఊరూరా ఎండ గట్టాలని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితునికే తొలి అవకాశం దక్కుతుందని ప్రకటించిన కేసీఆర్.. తానే సీఎం కుర్చీలో కూర్చున్నారని, దళితుల అవకాశాన్ని తీసుకుని వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని దుయ్యబట్టారు. మంగళ వారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్తోపాటు రాజు పాల్గొన్నారు. రాజు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయి నా దళితులకు మూడెకరాల భూ పంపి ణీపై పురోగతి లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేసిందన్నారు. సమాజంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా పేదలె క్కువగా ఉన్న దళిత సామాజిక వర్గానికే అవకాశాలు రావాల్సి ఉంటుందని, సంక్షే మ పథకాలను అమలు చేయకపోతే ఎక్కు వగా నష్టపోయేదీ ఎస్సీ లేనన్నారు. నష్ట పోయిన దళిత జాతి పక్షాన కాంగ్రెస్ పోరా టం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయికి వెళ్లాలని.. భూమిలేని, ఇళ్లురాని దళి తులతో దరఖాస్తులు ఇప్పించాలన్నారు. గ్రామ స్థాయిలో ఎస్సీ సెల్ కార్య వర్గాన్ని పూర్తి చేయాలని, వీటితోనే పార్టీకి బలమైన పునాదులు ఏర్పడతాయ ని చెప్పారు. ప్రచారమే కీలకం రాజకీయాల్లో ప్రచారమే కీలకమని.. దేశ స్వాతం త్య్ర పోరాటం నుంచి ఇప్పటివరకు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ప్రచారం చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో కొప్పుల రాజు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని చెప్పారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లు రవితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
భూమి ఉన్నా పంపిణీ ఎందుకు చేయరు?
హైదరాబాద్ : పేదలకు భూ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వ భూమి ఉన్నచోట ముందుగా భూపంపిణీని పూర్తిచేయాలని కోరుతూ ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ మేరకు భూమిలేని ప్రతి దళిత, ఎస్టీ కుటుంబానికి వెంటనే భూ పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా భూపంపిణీపై నిర్దిష్టమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ పథకం ఒక ప్రహసనంగా మారిందని లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో మూడు లక్షల దళిత కుటుంబాలకు సాగుభూమి లేదని ఎన్నికలకు ముందు కేసీఆర్ పేర్కొన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా కనీసం ఒక్కశాతం కుటుంబాలకు కూడా భూ పంపిణీ జరగలేదన్నారు. -
పంపిణీ.. పడకే!
* ‘దళితులకు భూపంపిణీ’ లక్ష్య సాధనలో నత్తనడక * రెండేళ్లలో 3,596 మంది లబ్ధిదారులకు 9,457 ఎకరాలే పంపిణీ సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ. పథకం ఆశయం ఘనం, ఆచరణ అధ్వానం. కొత్త రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం నత్తనడకన సాగుతోంది. మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా సాధించలేకపోతోంది. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోట వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 3,596 మంది లబ్ధిదారులకు 9,457.30 ఎకరాలు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఈ ఏడాది అంతంత మాత్రంగానే... ఈ పథకం కింద 2016-17లో 3,400 మందికి 10 వేల ఎకరాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర నెలలు గడిచినా రెండు వేల ఎకరాల మేర మాత్రమే ఇవ్వగలిగారు. కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో అసలు భూపంపిణీకే శ్రీకారం చుట్టలేదు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొనుగోలు చేసిన భూమికి పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించకపోవడం, కొన్ని బిల్లులు ఇంకా పెండింగ్లో ఉండడం పథకానికి ఆటంకంగా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యంలో ఈ పథకం కోసం కొనుగోలు చేసే భూముల ధరలను కూడా ఎకరానికి రూ.10 లక్షల వరకు పెంచాలనే విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. కానీ, భూమి తీరును బట్టి రూ.2-7 లక్షల మధ్య ధర పెట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కొత్త జిల్లాలు, ప్రాజెక్టులతోనూ తిప్పలే.. రాష్ట్రంలో దాదాపుగా అన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు, ఫార్మాసిటీ వంటి వివిధ పరిశ్రమల స్థాపన కోసం భూముల సేకరణ కూడా ఈ పథకానికి ఒక అవాంతరంగా మారుతోంది. దీనితోపాటు దసరాకల్లా మరో 14 జిల్లాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల రైతులు ఆచితూచి స్పందిస్తున్నారు. కొత్త జిల్లాల స్వరూపం,తమ భూమికి వచ్చే విలువ తదితరాలపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని రైతులు భావిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రతిపాదనకు ముందు భూములు అమ్మేందుకు సుముఖత చూపిన వారు కూడా ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లుగా అధికారవర్గాలు వెల్లడించాయి. -
భూపంపిణీలో అడ్డంకులను దూరం చేయాలి
ఎస్సీ శాఖకు వివిధ సంఘాల నేతల సూచన హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకంలో భాగంగా భూమిని కొనుగోలు చేసే రేటుపై కిందిస్థాయిలో సరిగా ప్రచారం జరగలేదని, కళాజాతాలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయాలని ఎస్సీ శాఖకు అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు సూచించారు. ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ మాదిరిగానే మండలస్థాయి కమిటీని ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందిని పెంచాలని, బకాయిలను విడుదల చేయాలని, అధిక భూమి రియల్ఎస్టేట్ వ్యాపారుల వద్దనున్నందున భూమి రేటును మరింత పెంచాలనే సూచనలు వచ్చాయి. పంపిణీ చేసిన భూమిని లబ్ధిదారులు కౌలుకు ఇవ్వకుండా చూడాలని, ఎస్సీ కార్పొరేషన్లోనే భూమి కొనుగోలుకు ప్రత్యేకవిభాగం ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం సంక్షేమ భవన్లో భూపంపిణీలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘స్టేక్హోల్టర్స్’తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి రవి, ఎస్సీ శాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్కుమార్, పి.శ్రీనివాస్ (డిక్కి ప్రతినిధి), ఆంజనేయులు (సెంటర్ ఫర్ దళిత్స్టడీస్), వివిధ ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా, భూపంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు వచ్చేనెల 8న నల్లగొండలో రైతులతో కలసి తాను పాదయాత్ర (వాక్ ఫర్ ల్యాండ్ ప్రోగ్రామ్)ను నిర్వహస్తున్నట్లు పిడమర్తి రవి చెప్పారు. గతంలో నీటి వసతి ఉన్న భూమినే ఇవ్వగా ఇప్పుడు నీటి వసతి లేకపోయినా పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నామని ఎం.వి.రెడ్డి తెలిపారు. -
దళితులకు భూపంపిణీలో పరిమితులు!
► వార్షికాదాయం రూ.1.5 లక్షలలోపు ఉన్నవారికే పథకం వర్తింపు ►18-60 ఏళ్ల మధ్య ఉన్నవారే అర్హులు ►మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని యోచిస్తున్న సర్కారు ►సీఎం ఆమోదముద్ర పడగానే అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద లబ్ధి పొందేవారికి ఎలాంటి ఆదాయ, వయోపరిమితి లేదు. కానీ ఇకపై వార్షికాదాయం రూ.1.5 లక్షలలోపు ఉన్నవారికే పథకాన్ని వర్తింపచేయాలని యోచిస్తోంది. అలాగే 18-60 ఏళ్ల మధ్య ఉన్న వారినే లబ్ధిదారులుగా గుర్తించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్నారు. సీఎం ఆమోదముద్ర పడగానే ఇవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి డాక్యుమెంట్లు ఎస్సీ కార్పొరేషన్ అధీనంలో 15 ఏళ్లపాటు ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కెనాల్ ఏరియాలో, సారవంతమైన భూమి, భూగర్భ జలాలు బాగా చోట ఉన్న భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రక్రియ గతంలో జిల్లా, మండల స్థాయి కమిటీల ఆధ్వర్యంలో భూమి గుర్తింపు, కొనుగోలు ప్రక్రియ సాగేది. దాన్ని జిల్లా కమిటీకే పరిమితం చేశారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కన్వీనర్గా, ఆర్డీవో/ఎమ్మార్వోలు సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయయోగ్యమైన భూమి గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక, ఇతర ప్రక్రియల బాధ్యతను ఎమ్మార్వోలకు అప్పగించనున్నారు. భూమి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి, ఏడాదిపాటు పంట వేసుకునేందుకు అన్ని వసతులను కల్పిస్తారు. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్నారు. -
అసైన్డ్.. అక్రమాల పుట్ట
► జిల్లాలో 4.47 లక్షల ఎకరాలు ► బడాబాబుల అధీనంలో నిరుపేదల భూములు ►చెరబట్టిన నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు ► అసైన్డ్ భూములపై దృష్టి సారించిన సర్కారు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అసైన్డ్ భూముల అక్రమాల పుట్ట పగలనుంది. భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. ముఖ్యంగా పట్టణ పరిసర గ్రామాల్లోని రూ.కోట్లు విలువ చేసే ఈ భూములన్నీ బడాబాబుల అధీనంలోకి వెళ్లిపోయాయి. నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు నయానో భయానో ఈ భూములను కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తారు. అన్యాక్రాంతమైన ఈ భూములను చెరబట్టిన వారిపై తాజాగా ప్రభుత్వం దృష్టి సారించడంతో బడాబాబుల భూ బాగోతం వెలుగులోకి రానుంది. నిరుపేదల సాగు కోసం పంపిణీ చేసిన ఈ అసైన్డ్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి.. వాటిని సాగు చేసుకుంటున్న వారెందరు.. విక్రయాలు జరిగాయా..? లేదా వారి వారసులు సాగు చేసుకుంటున్నారా..? ఇలా ఈ భూముల వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల హైదరాబాద్లో సీఎం కేసీఆర్తో జరిగిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల సదస్సులో ఇది ప్రధాన అంశంగా చర్చ జరిగింది. పలువిడతల్లో భూ పంపిణీ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 4.47 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేసింది. 1.44 లక్షల మంది భూమిలేని కూలీలకు అసైన్డ్ చేసింది. ఇందులో సగానికిపైగా భూములు చేతులు మారాయి. అసైన్డ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములు ఇతరులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్నగర్ వంటి పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్టర్లు, నేతలు, కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. నయానో భయానో నిరుపేదలను బెదిరించి, నిబందనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇందుకు చాలా చోట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో చేతులు కలిపి అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా భూముల దందా కొనసాగింది. కేవలం పట్టణాల సమీపంలోని భూములే కాదు, తాండూరు, రెబ్బెన, ఖనాపూర్ వంటి మండల కేంద్రాల పరిసరాల్లోని అసైన్డ్ భూములు కూడా పరాధీనమయ్యాయి. ముఖ్యంగా పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. అసైన్డ్దారులను నయానో భయానో మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రియల్టర్లు, వాటి ప్లాట్లుగా చేసి రూ.కోట్లు దండుకున్నారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం ఈ అసైన్డ్ భూముల రికార్డుల దుమ్ము దులుపుతుండటంతో ఈ అసైన్డ్భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారుకానుంది. పట్టణాల్లోనే అక్రమాలు.. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల, బట్టిసావర్గాం వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు వివిధ పార్టీల నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. చాలా మట్టుకు ప్లాట్లుగా చేసి, రూ.కోట్లు దండుకున్నారు. ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. నిర్మల్ పట్టణ సమీపంలోని గ్రామాల పరిధిలోని భూముల్లో పలు రియల్వెంచర్లు వెలిశాయి. తూర్పు జిల్లా కేంద్రంగా పేరున్న మంచిర్యాలలో ఈ అసైన్డ్ భూముల దందా మూడు వెంచర్లు.. ఆరు ఎకరాలు అన్న చందంగా మారాయి. అసైన్డ్ భూముల్లో ప్లాట్ల దందా ఇప్పటికీ కొనసాగుతోంది. నస్పూర్ పంచాయతీ పరిధిలోనైతే రూ.కోట్లు విలువ చేసే అసైన్డ్భూములు పరాధీనంలో ఉన్నాయి. అలాగే మంచిర్యాల సమీపంలోని మందమర్రి మండల పరిధిలోకి వచ్చే గద్దెరాగడి, క్యాతన్పల్లి గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములు కూడా రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. మంచిర్యాల టౌన్, వేంపల్లి, హాజీపూర్, ముల్కల్ల, పాత మంచిర్యాల, గుడిపేట్, దొనబండల్లో చాలాచోట్ల అసైన్డ్ భూములు రియల్ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. ఈ వెంచర్లలో వివిధ పార్టీల నేతలే భాగస్వాములుగా ఉండటంతో ప్రభుత్వం తలపెట్టిన చర్యలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో ప్రశ్నార్థకంగా మారనుంది. -
దళితులకు 10 వేల ఎకరాల భూపంపిణీ
♦ నవంబర్, డిసెంబర్లో అందజేస్తాం ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: దళితులకు భూ పంపిణీలో భాగంగా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో 10 వేల ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 8 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. పంపిణీ చేసిన భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. గతంలో పంపిణీ చేసిన భూమికి త్వరలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం చూపు తెలంగాణ వైపు రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో అమలు కావడం గొప్ప విషయం. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. ఉద్యమ పార్టీకి పాలన అనుభవం లేదని, తెలంగాణ విడిపోతే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుందని గతంలో కొందరు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అనుమానాలు, అపోహలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. రెండేళ్లలోనే దేశంలోనే ప్రభావవంతమైన సీఎంగా నిలిచారు. ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసిన భూమిని లబ్ధిదారులైన ఎస్సీ మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసే విషయంలో అధికారుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంపిణీ చేసిన భూమి అభివృద్ధి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బోర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించినా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితులున్నందున పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సంక్షేమంలో మేమే ముందు.. కేవలం దళితులకే కాకుండా ఎవరూ ఊహించని విధంగా అన్ని వర్గాలకు మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దళితుల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చింది. మూడెకరాల భూపంపిణీతోపాటు కల్యాణలక్ష్మి వంటి పథకాలను తెచ్చాం. దళితులకు మూడెకరాల భూమి, బడుగు, బలహీన వర్గాలకు కల్యాణలక్ష్మి, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ప్రతి ఒక్కరికీ 6 కే జీల బియ్యం,అన్ని జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్లు, 10 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల వరకు రుణం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒకేసారి 250 గురుకుల పాఠశాలలు, అందులో ఎస్సీలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఎస్సీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిని మించిన శిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు వినూత్నంగా గుర్రపు స్వారీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిపై అవగాహన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒక్క రూపాయీ దుర్వినియోగం కాకూడదు.. గత ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ను అప్పగించింది. సీఎం ఇప్పటికే రెండేళ్ల బకాయిలన్నీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చింది. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదనేది సీఎం ఉద్దేశం. దళితులకు, ఇతర అణగారిన వర్గాలకే ఈ మొత్తం చెందాలనేది ప్రభుత్వ ఆలోచన. -
తిరష్కార మంత్రం
► టీడీపీ రెండేళ్ల పాలనలో పేరుకుపోయిన దరఖాస్తులు ► ఇంటి స్థలాలకే 70,685.. ► 70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లు చూపుతున్నవైనం ► తిరస్కారానికే పరిష్కారమని పేరు పెట్టిన రెవెన్యూ యంత్రాంగం టీడీపీ అధికారం చేపట్టింది మొదలు పేదలకు భూమి, ఇంటి స్థలాల పంపిణీ దాదాపు నిలిచిపోవడంతో అందుకు సంబంధించిన దరఖాస్తుల పెండింగ్ జాబితా పెరిగిపోయింది. అయితే రెవెన్యూ యంత్రాంగం మాత్రం వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించినట్లు చూపుతున్నారు. ప్రతి దరఖాస్తును గడువుకు రెండు, మూడు రోజుల ముందు వరకు ఉంచుకుని ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తూ వాటినే పరిష్కారం జాబితా కింద చూపుతుండడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): పేదలు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందేందుకు గత ప్రభుత్వాలు భూపంపిణీ పేరుతో ప్రభుత్వ భూములను పంపిణీ చేశాయి. అవసరాన్ని బట్టి పేదలకు ప్రభుత్వ భూములను అసైన్డ్ చేయడం సర్వసాధారణం. అదే విధంగా పేదలకు ఒకే చోట ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇచ్చి హౌసింగ్ కాలనీలు నిర్మించేవారు. ఇళ్లు లేని నిరుపేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం రెవెన్యూ శాఖలో సాధారణం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ భూములను పేదలకు అసైన్డ్ చేయడం, హౌసింగ్ కాలనీల నిర్మాణానికి భూములు కేటాయించి ప్లాట్ వేయడం, వ్యక్తిగతంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్ల పాలనలో పేదలు ఉపాధి పొందేందుకు ప్రభుత్వ భూములు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు కేటాయించిన దాఖలాలు లేవు. అనుమతి లేనిదే... ప్రభుత్వ భూములను ఎవ్వరికి అసైన్డ్ చేయవద్దని, ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇటు ఇళ్ల స్థలాలు, అటు భూముల కోసం వచ్చే దరఖాస్తులు పేరుకుపోయాయి. మాజీ సైనికులకు కూడా భూములు ఇవ్వడాన్ని నిలిపేసింది. పరిశ్రమల కోసం ప్రభుత్వ భూముల రిజర్వేషన్.. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తోంది. ఔత్సాహికులను గుర్తించి అవసరమైన భూములు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములను రిజర్వులో ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భూములు, ఇళ్ల స్థలాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. . ఇంటి స్థలాల దరఖాస్తులు 70 వేలపైనే... ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక 70,685 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఒక్క దరఖాస్తుకు కూడా ఇంటి స్థలం కేటాయించకపోయినా 70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లు రెవెన్యూ శాఖకు చెందిన మీ కోసం వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉపాధి నిమిత్తం భూములు కేటాయించాలని 951 దరఖాస్తులు రాగా ఒక్క దరఖాస్తుకు కూడా భూమిని అసైన్డ్ చేయలేదు. అయినా 609 దరఖాస్తులను పరిష్కరించామని 342 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మీ కోసం రిపోర్టు స్పష్టం చేస్తోంది. పరిష్కారం అంటే తిరస్కారమే... ఒక దరఖాస్తును తిరస్కరిస్తే దానిని పరిష్కరించినట్లుగా మీకోసం వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నందునా పరిష్కరించినట్లుగా పేర్కొంటున్నారు. కాని ప్రజా సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. ఇంటి స్థలాల కోసం 70,685 దరఖాస్తులు వస్తే ఒక్కదానిని పరిష్కరించకున్నా ఏకంగా 70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లుగా చూపడం గమనార్హం. హడావుడే తప్ప... కార్యాచరణ శూన్యం రెండేళ్లుగా ఇదిగో పరిశ్రమలు.. అదిగో శంకుస్థాపన... అంటూ హడావుడి హంగామా చేస్తున్నా... ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఓర్వకల్లు మండలంలోనే అత్యధికంగా పరిశ్రమలు స్థాపించబడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పరిశ్రమల స్థాపన పేరుతో ఇటు పేదలు, అటు మాజీ సైనికులకు భూములు, ఇంటి స్థలాల పంపిణీని నిలిపివే యడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు పరిశ్రమలు రావడం అవసరమే అయినా అవసరాన్ని బట్టి పేదలకు కూడా భూములు, ఇంటి స్థలాలు పంపిణీ చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత
♦ అంబేద్కర్ జయంతి సభలోమంత్రి హరీశ్రావు ♦ 71 మంది దళితులకు భూ పంపిణీ సంగారెడ్డి టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నివాళి అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవిద్య, పేదరికం వల్ల అస్పృశ్యతకు గురవుతున్నారన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందుకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం కేజీ టు పీజీ పీజీ విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలు పెంచుతామన్నారు. సాగుకు యోగ్యమైన 1236 ఎకరాల భూమిని 70 కోట్ల ఖర్చుతో జిల్లాలోని దళితులకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో భూ పంపిణిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 11 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా123.39 ఎకరాల భూమిని 5.79 కోట్లతో 71 మంది దళితులకు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఒకరికి హోండా కారును, మరొకరికి కంకర యంత్రాన్ని అందజేశారు. మహిళా సంక్షేమానికి కృషి చేయాలి : కలెక్టర్ మహిళా సంక్షేమానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. అప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు అన్ని కాలాల్లో ఆచరణీయమన్నారు. కల్యాణలక్ష్మి కింద 2848 కుటుంబాలకు రూ.51 వేల చొప్పున అందించామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి నెల రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 27 వేల మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులకు 25.65 కోట్లు, 20635 మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులకు రూ.3.85 కోట్లు అందించామన్నారు. 50 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగిస్తున్న వారికి 92738 కుటుంబాలకు విద్యుత్ చార్జీల కింద 2.35 కోట్లు విద్యుత్ బోర్డుకు చెల్లించామని చెప్పారు. ఎస్సీలకు స్వయం ఉపాధి కింద ఇస్తున్న సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచామన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ అలుగు వర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాగవ్వకు అంబేద్కర్ అంటే అభిమానం మిరుదొడ్డి: నిరక్ష ్యరాస్యురాలైన ఆ అవ్వ పేరు జోడోళ్ల నాగవ్వ. మండల పరిధిలోని కాసులాబాద్లోని 9వ వార్డు సభ్యురాలు. కూలీ నాలీ చేసుకోవడమే ఆమె వృత్తి. అక్షరం ముక్క రాకపోయినా ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. ఆయన జయంతి, వర్ధంతి రోజున గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం ఆనవాయితీగా పెట్టుకుంది. గురువారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి అధికారులతో పాటు ఆమె దండ వేసి నివాళుర్పించింది. అంబేద్కర్ అంటే ఎందుకింత అభిమానం అని ప్రశ్నించగా పెద్ద సారు అందరు మంచిగుండాలని గదేదో పెద్ద పుస్తకం (రాజ్యాంగం) రాసిండట. గాయిన పెట్టిన రిజర్వేషన్లతోనే నేను వార్డు సభ్యురాలిగా పోటీ చేసి గెలిచా అంటోంది.. అక్షరం ముక్క రాక పోయినా అంబేద్కర్పై అవగాహన కలిగిన ఈ నాగ వ్వను పలువురు అభినందించారు. -
మురిపించారు...
► పట్టాలిచ్చి.. రద్దు చేశారు ► దళితులకు అందని భూమి ► అధికారుల నిర్లక్ష్యం మూడెకరాల భూ పంపిణీ.. పేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ప్రభుత్వం అనుకున్నట్లే పలువురు లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలూ అందించింది. కానీ, ఆ ‘అదృష్టవంతుల’ జాతకం మాత్రం మారలేదు. చేతిలో పట్టాలున్నా.. భూమి సాగు చేసుకోలేని దైన్య స్థితి. భూ యజమానులకు డబ్బులివ్వకపోవడంతో వారు మరొకరికి అమ్ముకున్నారు. దీంతో పలు చోట్ల భూపంపిణీ ఉత్తదేనని తేలింది. - హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి, రేగొండ గ్రామాల్లో దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం కింద 14 మంది పేద కుటుంబాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇతర రైతుల వద్ద అందుబాటులో ఉన్న 18 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5.7 లక్షలు ధర నిర్ణయించి సేకరించారు. మొదట నాలుగు కుటుంబాలకు 2014 ఆగస్టు 15న మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా పట్టాలు అందించారు. భూమి యజమానులకు అధికారులు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఆరునెలల చూసి వారు అధిక ధరలకు మరో రైతుకు విక్రయించారు. దీంతో దళితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది. దీంతో వారే గ్రామంలో భూమి అమ్మే వారిని నలుగురిని గుర్తించి రెవెన్యూ అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. అగ్రిమెంట్ రాసిచ్చేలా చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా భూ సేకరణ విషయమై రెవెన్యూ అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. దళితులు రెవెన్యూ కార్యాలయూల చుట్టూ తిరిగినా రేపు.. మాపు అంటూ మాటదాట వేస్తున్నారు. భూమి లేదన్నారు ఏ భూమి కావాలని చిట్టీలు తీస్తే మాకు అదృష్టం వచ్చిందనుకున్నం. కానీ, దురదృష్టం వదలిపెట్టదని తెలిసింది. కాయితం పట్టుకుని వీఆర్వో దగ్గరికి పోతే ఇచ్చంత్రంగా సూసుడు. ఆర్ఐ దగ్గరకు పోయి బాధలు చెప్పుకున్నం. ఎవరు పట్టించుకునేటోళ్లు లేరు. ఈ బాధలు పడలేక ఇంత మందుతాగుతం సార్ అంటే.. ‘నేను ఏం చేయ్యాలె. నేను మందు డబ్బాకొనిస్తా తాగుపో’ అని గద్దరియ్యవట్టె. ఇగ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలె. - ఎల్కపెల్లి భాగ్యమ్మ, గోవర్ధనగిరి తిరుగని ఆఫీస్ లేదు మాకు భూమి పట్టా కాయితం ఇచ్చిండ్రు. భూమికాడికి పోయి హద్దులు చెప్పిండ్రు. నిజంగానే భూమి ఇత్తండ్రు అనుకున్నం. గిట్ల చేత్తరనుకోలె. భూమిచ్చిండ్రు కదా యాసింగి ఎవుసం చేయాలని మురిసిపోరుునం. తీరా యాసింగి వచ్చే సరికి మాకు డబ్బులు ఇయ్యలేదు.. మీకు భూమి ఇయ్య అని ఆసామి భూమి మీదికి రానియ్యలేదు. కలెక్టర్ వచ్చి బండరాళ్ల భూమి ఎట్ల కొన్నరు? ఇవి రద్దు చేసి వేరే కాడ ఇయ్యుమని చెప్పినా అధికారులు ఇత్తనేలేరు. భూములు అమ్మే రైతులను మేం తీసుకెళ్లినా అధికారులు పట్టించుకుంటలేరు - ఎల్కపెల్లి లక్ష్మి, మల్లయ్య -
డీల్ కుదిరింది!
► ఇక కేసులు లేనట్టే! ► 467 సర్వే నంబర్ భూమి వ్యవహారం ► చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు జమ్మికుంట మండలం కొత్తపల్లి సర్వేనంబర్ 467 భూమి కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొలతలు వేసిన అధికారులు ఆరు గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇళ్లు కోల్పోయిన వారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటుందని ప్రచారమైనా... అధికార పార్టీ నాయకుల జోక్యంతో సయోధ్య కుదిరినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి అని గుర్తించిన దాంట్లో నిర్మాణాలకు పరిహారం ఇచ్చేలా ఈ డీల్ కుదరడం గమనార్హం. కొత్తపల్లి (జమ్మికుంట రూరల్) : కొత్తపల్లిలోని సర్వేనంబర్ 467లో ప్రభుత్వ భూమిలో కొందరికి భూ పంపిణీ చేయగా, మిగతా భూమి కబ్జా అవుతోందనే అధికారులకు గతంలో ఫిర్యాదులందాయి. ఎరుకల సంఘం వారు తమ సంఘ భవన నిర్మాణానికి 467లో స్థలం కేటాయించాలని కోరడంతో సర్వే అధికారులు కొద్ది రోజుల క్రితం కొలతలు వేశారు. 19 గుంటలు ప్రభుత్వ భూమి ఉంటుందని భావించగా, ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి మిగిలి ఉందని లెక్కలు తేల్చారు. ఈ ఆరు గుంటల స్థలంలో నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన దళితులు స్థానిక దళిత నాయకుల సహకారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు హుజూరాబాద్ డీఎస్పీ 467 సర్వేనంబర్ భూమి వ్యవహారంపై విచారణ జరిపారు.ఒక దశలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మిన వారిపై, దళితులకు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఆస్తినష్టం కేసులు నమోదవుతాయని ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఇళ్లు కోల్పోయినవారి సన్నిహితులు, బంధువుల వివరాలు సేకరించి సయోధ్య కుదర్చాలని అధికార పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తూ, తిరిగి ఇళ్లు నిర్మించి, ఖర్చుల కోసం కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దీంతో ఇక పోలీసు కేసులు లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. 467 భూమి వ్యవహారం పలు మలుపులు తిరుగుతుందని భావించిన తరుణంలో అందరి అంచనాలు తారుమారయ్యేలా సయోధ్య కుదిరినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినవారిలో ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఓ నాయకుడు, ఓ ఫోరం అధ్యక్షుడు మానేరు సమీప గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి భర్తతోపాటు మరికొంత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అయితే 6 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, బాధితులకు తిరిగి స్థలాన్ని ఎక్కడ నుంచి అప్పగిస్తారన్న సందిగ్ధం పలువురిలో నెలకొంది. -
‘3 ఎకరాలకు’ ముచ్చెమటలు!
♦ ‘రియల్’తో భూముల రేట్లకు రెక్కలు ♦ ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ♦ అందుబాటులో లేని భూములు ♦ ఈ ఏడాది 27 మందికే భూమి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దళితుల భూపంపిణీ కాగితాలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు అందుబాటులో లేకపోవడంతో సర్కారు ఆశయం నీరుగారుతోంది. ‘భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాల’కు కనిష్టంగా మూడు ఎకరాలను పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. వ్యవసాయోగ్య భూములకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించింది. ఈ మేరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వేయి ఎకరాల మేర దళితులకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ప్రభుత్వ మార్గదర్శకాలు.. చెల్లింపు ధరలపై పరిమితి విధించడంతో ఇప్పటివరకు రెండంకెలను కూడా దాటలేకపోయింది. కేవలం 77.29 ఎకరాలను మాత్రమే జిల్లా యంత్రాంగం సమీకరించి.. దళితులకు పంపిణీ చేసింది. గతేడాదితో పోలిస్తే కొంత పురోగతి ఉన్నప్పటికీ, జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భూ కొనుగోలు సాధ్యపడదని అధికారయంత్రాంగం తేల్చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. పరిమితులు సడలిస్తే తప్ప ముందుకు సాగలేమని స్పష్టం చేసింది. కేవలం 14 మండలాల్లోనే... జిల్లాలో కేవలం 14 మండలాల్లోనే భూములను కొనాలని రాష్ట్ర సర్కారు నిర్దేశించింది. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే 19 మండలాలను మిన హాయించి.. మిగతా మండలాల్లోనే దళితులకు భూ పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా గరిష్టంగా ఎకరాకు రూ.7 లక్షల వరకు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాజధాని చేరువలో ఉన్న జిల్లా కావడం.. భూముల విలువలు ఆకాశన్నంటడడంతో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు లభించడంలేదు. అక్కడక్కడా భూములు దొరికినా.. వాటిలో అత్యధికం వివాదస్పద భూములే ఉంటున్నాయి. సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములను కొనుగోలు చేయకూడదనే నిబంధనలు ఒకవైపు... పట్టాదారు ఒకరయితే.. పొజిషన్లో మరొకరు ఉండడం కూడా భూసేకర ణకు ప్రతిబంధకంగా మారుతోంది. దీనికితోడు నీటి లభ్యత ఉండే భూములను కొనుగోలు చేయాలనే నిబంధన కూడా ఈ పథకం ముందుకు సాగ కపోవడానికి కారణంగా కనిపిస్తోంది. దళితులకు భూ పంపిణీ నుంచి మినహాయించిన మండలాల్లో వారికి ఎలా న్యాయం చేస్తారన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన భూముల్లో దాదాపు 659 ఎకరాలు వేర్వేరు కారణాలతో తిరస్కరించగా, దీంట్లో 108 ఎకరాలు కేవలం నీటి జాడలేదని భూగర్భ జలవనరుల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా పక్కనపెట్టారు. రియల్తో దెబ్బ జిల్లా పశ్చిమ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ఈ పథకంపై ప్రభావం చూపుతోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంగా మారనుందనే ప్రచారంతో ఈ ప్రాంతంలో భూముల విలువలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఈ పరిసర మండలాల్లో భూముల ధరలను ఆమాంతం పెంచేశారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు అమ్మడానికి ఎవరు ముందుకు రావడంలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది భూ విక్రయానికి ఆసక్తి చూపినా.. అవి వ్యవసాయోగ్యానికి అనువుగా లేకపోవడంతో తోసిపుచ్చాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. గతేడాది 16 మంది లబ్ధిదారులకు 48 ఎకరాలను అందజేసిన యంత్రాంగం.. ఈసారి ఇప్పటివరకు 27 మందికి 77.29 ఎకరాలను పంపిణీ చేసింది. మరో 60 ఎకరాలకు సంబంధించి సంప్రదింపులు జరుపుతోంది. దీంటో అధికశాతం యాలాల్, మర్పల్లిలోనే ఉన్నాయి. కొసరు ధరలతో ఎసరు పంటలు పండక.. గిట్టుబాటు ధరలు రాక నమ్ముకున్న భూమిని విక్రయిస్తున్న రైతాంగం పట్ల జిల్లా యంత్రాంగం కారుణ్యం ప్రదర్శించడంలేదు. ఎకరాకు గరిష్టంగా రూ.7 లక్షల వరకు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నా.. మన అధికారులు మాత్రం భూ కొనుగోలులో పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు భూ లభ్యత లేదని గగ్గోలు పెడుతూనే.. మరోవైపు ధరల చె ల్లింపుపై బేరం ఆడుతూ రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లలో రూ.4.22 కోట్లతో 125.29 ఎకరాలను కొనుగోలు చేయగా... అత్యధికంగా ఎకరాకు రూ.4.30 లక్షలను మాత్రమే వెచ్చించారు. ఇక అత్యల్పంగా రూ.2.55 లక్షలకే భూమిని కొన్నారు. సంప్రదింపులు జరుపుతున్నాం సాగుకు అనువైన భూములనే పరిగణనలోకి తీసుకుంటున్నాం. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భూ కొనుగోలులో వెనుకబడ్డా.. గత రెండు నెలలుగా మంచి పురోగతిని సాధించాం. నిరంతర సంప్రదింపులు జరపడం ద్వారా సాధ్యమైనంత మందికి లబ్ధి చేకూరేలా ప్రయత్నాలు సాగిస్తున్నాం. ముందస్తు కార్యాచరణను అమలు చేయడం ద్వారా వచ్చే ఏడాది అవాంతరాలను అధిగమిస్తాం. - చంద్రారెడ్డి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
రాబందు రాక్షస క్రీడ!
► అమరావతినే కాదు..పల్లెలనూ వదలని టీడీపీ నేతలు ► అనంతవరంలో మితి మీరినఎంపీటీసీ మాజీ సభ్యుడు ► కసుకుర్తి బాలకోటయ్య భూ ఆక్రమణలు ►పార్టీలకు అతీతంగా టంగుటూరుతహశీల్దార్కు ఫిర్యాదు చేసిన ప్రజలు కానల్లో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కు తింటారుు.. అవి జీవం ఉన్న వాటి జోలికి వెళ్లవు !అనంతవరంలో ఉన్న రాబందు.. బతికి ఉండగానే.. దళిత రైతులను నంజుకు తింటోంది!! - టంగుటూరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు భూముల పంపిణీ చేశారు. ఆ సయంలోనే అనంతవరానికి చెందిన 50 మంది పేదలకు ఒక్కొక్కరికి 40 సెంట్లు చొప్పున మొత్తం 20 ఎకరాాలు పంచారు. అందుకు సంబంధించిన రికార్డులను అప్పటి తహసీల్దార్ గాంధీ పక్కాగా రూపొందించారు. తొలి విడత భూములు దక్కించుకున్న వారిలో 13 మంది పేర్లు ఆన్లైన్లో గోల్మాల్ అయ్యూరుు. వీరి స్థానంలో అనంతవరం టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కసుకూర్తి బాలకోటయ్య అనుయాయుల పేర్లు రెవెన్యూ రికార్డులో ప్రత్యక్షమయ్యాయి. అన్లైన్లోనూ పాత లబ్ధిదారుల స్థానంలో టీడీపీ నేత సూచించిన కొత్త పేర్లు ఉన్నారుు. విషయం తెలిసి లబ్ధిదారులు కంగారు పడ్డారు. స్వయంగా అనంతవరానికే చెందిన మరొక టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుని తల్లి పేరు కూడా మాయం కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఇది చర్చనీయూంశమైంది. తాజా వివాదం ఇదీ.. ఆ గ్రామానికే చెందిన మరో టీడీపీ నేత కసుకుర్తి భాస్కర్రావు శుక్రవారం తహశీల్దార్ను కలిసి లబ్ధిదారుల రికార్డు గోల్మాలైన విషయంపై ఫిర్యాదు చేశాడు. అక్రమంగా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ చేసి కొత్తగా ఎక్కించిన పేర్లు తొలగించి నిజమైన లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్ చేర్చాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల వల్లే సదరు నేత అక్రమానికి పాల్పడగలిగాడని, గ్రామంలో అనేక భూకుంభకోణాలతో సంబంధం ఉన్న ఆయన మాటే వేద వాక్కుగా తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతోందని మండిపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు కొందరు ఆయన కనుసన్నలో ఎందుకు పని చేస్తున్నారని భాస్కర్తో పాటు అదే గ్రామానికి చెందిన కొందరు తహశీల్దార్ను నిలదీశారు నోటీసుల జారీ గ్రామస్తుల ఒత్తిడితో తహశీల్దార్ కామేశ్వర్రావు ఆ భూములకు సంబంధిన వాస్తవ లబ్ధిదారులు 13 మందితో పాటు వారి స్థానాల్లో కొత్తగా ప్రత్యక్షమైన వారికి ఇది వరకే నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా శుక్రవారం వాస్తవ లబ్ధిదారులంతా తమ ఆధారాలతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నాయకుడు కసుకుర్తి బాలకోటయ్య తన అనుయాయులను కొంతమందిని వెంటేసుకొని వచ్చాడు. పాత వారంతా తమ రికార్డులను అధికారులకు సూపించారు. టీడీపీ నేత మాత్రం ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చి కొందరు అధికారులతో గుసగుసలాడి వెళ్లాడు. అధికార పార్టీ నేతల భూదాహం ఇంకా తీరినట్టు లేదు. టీడీపీ అగ్ర నేతల నుంచి గ్రామ స్థారుు నేతల వరకూ అందిరిదీ ఒకే దారి. ముఖ్య నేతలు నూతన రాజధాని అమరావతి చుట్టూ కనిపించిన ఖాళీ స్థలాలను అప్పనంగా స్వాధీనం చేసుకుంటుంటే.. గ్రామస్థారుు నేతలు కూడా తామేం తక్కువ తిన్నామా.. అంటూ పల్లెల్లో యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మండలంలోని అనంతవరంలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ భూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆయన అక్రమాలు అప్రతిహాసంగా సాగిపోతున్నా అధికారులుగానీ ప్రజాప్రతినిధులుగానీ ఏమీ చేయలేకపోతున్నారంటే ఆయన ఏ స్థారుులో ఉన్నతాధికారులను సైతం మభ్య పెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ టీడీపీ నేత వల్లే ఘర్షణలు మరో టీడీపీ నేత భాస్కర్ మాట్లాడుతూ వాస్తవ లబ్ధిదారులంతా పేదవారేనని, ఒక్కరి కోసం ఇంత మందికి అన్యాయం చేయవద్దని తహశీల్దార్ను కోరారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు సర్పంచి కసుకుర్తి సుందర్రావు, ఎంపీటీసీ కసుకుర్తి గోవిందమ్మ, న్యాయవాది కసుకుర్తి వీరరాఘవులు, గ్రామపెద్ద కసుకుర్తి వెంకటేశ్వర్లు (ఎల్ఐసీ వెంకటేశ్వర్లు) విడివిడిగా తహసీల్దార్ను కలిసి నిజమైన పాత లబ్ధిదారులకు న్యాయం చేయాలని, రికార్డు ట్యాంపరింగ్ చేసిన సదరు మాజీ ఎంపీటీసీని కఠినంగా శిక్షించాలని కోరారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అతను చేస్తున్న భూవివాదాలతో గ్రామానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో తరచూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యాలయంలోని కొత్తమంది సిబ్బంది ఆ నాయకునికి రెవెన్యూ రికార్డు అప్పజెబుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. -
భూ పంపిణీకి 696 ఎకరాలు
ఇందూరు: జిల్లాలో దళితులకు భూపంపిణీ కోసం 696 ఎకరాలు కొనుగోలు చేశామని కలెక్టర్ యోగితారాణా తెలి పారు. సాగుకు యోగ్యమైన భూమిని దళితులకు పంపి ణీ చేసేందుకు క్షేత్రాస్థాయిలో పరిశీలించి, భూయజ మానులతో చర్చించి పారదర్శకంగా భూమిని కొనుగో లు చేస్తున్నట్లు చెప్పారు. భూ పంపిణీ, ఆర్థిక సహాయ పథకాల ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులకు భూపంపిణీ కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. జిల్లాకు నిర్దేశించిన 717 ఎకరాల లక్ష్యానికి మించి అదనంగా 300 ఎకరాలను పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న కలెక్టర్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారు. ఆర్థిక సహాయ పథకం కింద 22 వేల దరఖాస్తులు అందాయని కలెక్టర్ వివరించారు. వాటిలో 17 వేల దరఖాస్తులను సక్రమంగా ఉన్నట్లు స్క్రూటినీలో గుర్తించామని, వారిలో 1:4 దామాషాలో రుణ మంజూరుకు బ్యాంకర్లకు పంపనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 4 నుంచి గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికకు కార్యాచరణను ప్రకటించామన్నారు. 29లోపు యూనిట్ల మంజూరుకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని, మార్చి 2లోపు లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వివరించారు. మార్చి రెండో వారంలోపు యూనిట్లను గ్రౌండింగ్ చేస్తామన్నారు. అలాగే, ముద్రా బ్యాంకు రుణాల ద్వారా 8 వేల మంది లబ్దిదారులకు రూ.95 కోట్ల విలువైన యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్య కార్యదర్శి టి.రాధ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఏజేసీ రాజారాం, డీఆర్డీఏ పీడీ వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విజయ్కుమార్, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు విజయ్కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి విమలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు భూ పంపిణీ
విజయనగరం(పాచిపెంట): విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలోని గిరిజనులకు గురువారం భూ పంపిణీ చేశారు. 12 గ్రామాలకు చెందిన 232 గిరిజన కుటుంబాలకు 425.30 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూములకు సంబంధించిన పట్టాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర, టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. -
కర్రలతో రైతుల దాడి
11 మందికి గాయాలు పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు బుచ్చెయ్యపేట : గున్నెంపూడి రెవెన్యూ పరిధిలో భూ వివాదం రెండు గ్రామాల రైతుల మధ్య చిచ్చురేపింది. ఆ గ్రామాలకు చెందిన రైతు లు బుధవారం ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో 11 మందికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. గున్నెంపూడి సర్వే నంబర్ 1లో గ్రామానికి చెందిన 16 మంది రైతులకు 22 ఎకరాల భూమిని ఆరో విడత భూ పంపిణీలో పట్టాలు అందజేశారు. దీంతో రైతులంతా ఇటీవల యూకలిఫ్టస్ మొక్కలు వేశారు. అయితే పక్కనున్న రావికమతం మండలం మట్టవానిపాలెంనకు చెందిన రైతులు ఈ మొక్కలు పీకుతుండడంతో గున్నెంపూడి రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది కొట్లాటకు దారితీసింది. కర్రలతో దాడి చేసుకోవడంతో గున్నెంపూడికి చెందిన తుమ్మలపూడి సత్తిబాబు, గణేష్ తలపై తీవ్ర గాయాలవ్వగా.. తుమ్మలపూడి చినబాబుకు ఎడమ చేయి విరిగింది. సెలపురెడ్డి సత్తిబాబు, స్వామి, ముచ్చకర్ల వెంకునాయుడు, తుమ్మలపూడి చినబాబు తలపై గాయాలయ్యాయి. అలాగే మట్టవానిపాలెంకు చెందిన అక్కిరెడ్డి అప్పారావు, దేవర పరిశెట్టి నాయుడు, కరణం చిననాయుడు, మామిడి అప్పారావు గాయాలపాలయ్యారు. వేలాది రూపాయిలు పెట్టుబడులు పెట్టి మొక్కలు నాటితే.. మట్టవానిపాలెం ఎంపీటీసీ రైతులతో కలిసి తమపై దాడి చేశారని గున్నెంపూడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకలు మొక్కలు తింటే తమపై దాడి చేశారని మట్టవానిపాలెం రైతులు ఆరోపించారు. ఇరువర్గాలు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భూ పంపిణీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేసిందని, దాన్ని అమలు చేయడంతో మాత్రం చిత్తశుద్ధి కొరవడిం దని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. శుక్రవారం హై దరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో దళితులు, భూమిలేని పేదలకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10 నుంచి చేపట్టను న్న ర్యాలీ, ధర్నాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పెద్దల కంపెనీలకు ఇవ్వడానికే భూమి సరిపోక పాయే.. ఇక పేదలకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అనేక భూసంస్కరణలు తీసుకొచ్చినా పేదలకు భూ మి లభించలేదన్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటున్నామ ని ప్రభుత్వం చెబుతోందని... ఎంత స్వాధీనం చేసుకుందో ఎవరికీ తెలియదన్నారు. రైతుల జీవన స్థితి గతులను పెంచేందుకు వారికి ఎరువులు, విత్తనాలు, నీళ్లు ఉచితం గా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ, ప్రజాకళా మండలి ప్రధా న కార్యదర్శి కోటి, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
భూమి ఏమాయె!
దళితులకు భూ పంపిణీపై ప్రభుత్వానికి కొరవడిన చిత్తశుద్ధి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలు ఎక్కడా ఉండకూడదు. అర్హులైన దళితులకు వ్యవసాయ యోగ్యమైన భూమి అందించడమే లక్ష్యం. ఎన్ని కోట్లు ఖర్చరుునా సరే భూమి లేని నిరుపేద దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు - శాఖల సమన్వయ లోపం.. లబ్ధిదారులకు శాపం - నిధులు కోట్లలో.. ఖర్చు లక్షల్లో.. - సరైన మార్గదర్శకాలు కరువు - ఏడాది దాటినా ఎదురుచూపులే ఖమ్మం సంక్షేమ విభాగం: భూమిలేని నిరుపేద దళితులకు మూడు ఎకరాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటన చేసి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికీ ఇది సరిగా ఆచరణకు నోచుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయలోపంతో కనీస లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతోంది. భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, భూముల కొనుగోలుకు నిధులు కేటాయింపులో ఎస్సీ కార్పొరేషన్ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. 59 ఎకరాలు మాత్రమే పంపిణీ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 22 మంది లబ్ధిదారులకు 59 ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఖమ్మం రెవె న్యూ డివిజన్లో వందలాది ఎకరాల భూములను రైతు లు స్వచ్ఛందంగా విక్రయించేందుకు ముందుకు వస్తు న్నా విధివిధానాలు అస్పష్టంగా ఉండడంతో అధికారు లు పట్టించుకోవడం లేదు. భూమి కొనుగోలు ప్రాంతం, మార్కెట్ ధరలు, సాగు యోగ్యం, నీటివసతి ఆధారంగా రేటు నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాల నుంచి సాగులో ఉన్న వ్యవసాయ భూములను సైతం కొన్ని శాఖల అధికారులు నివేదికల ఆధారంగా ఎంపిక చేయాలని సూచించడంతో ప్రారంభ దశలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. భూగర్భ జలవనరుల శాఖ నీటి లభ్యత నివేదిక ఇచ్చిన తరువాతనే మార్కెట్ ధరలు, ఇతరత్ర అంశాలను బట్టి ప్రభుత్వం రేట్లు నిర్ణరుుంచాలని జిల్లా స్థాయి కమిటీలో సూచించారు. వివిధ కారణాలతో భూములు అమ్ముకునేందుకు చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాల నుంచి నీటి వనరుల ఆధారంగా సాగు చేస్తున్న భూములకు భూగర్భ జలవనరుల శాఖ నివేదిక ఎందుకనే ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతోంది. ధరల్లో వ్యత్యాసం కూడా కారణమే.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు అటుఇటుగా భూములు దొరికే పరిస్థితి ఉన్నా వివిధ శాఖల అధికారుల సమన్వయ లోపంతో అక్కడ కూడా సాధ్యం కావడం లేదు. ఉదాహరణకు సాగు యోగ్యమైన భూమి, నీటివసతి, మార్కెట్ ధర ఆధారంగా ఎకరానికి 7లక్షల వరకు వెచ్చించవచ్చని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం మారుమూల ప్రాంతాల్లో ఎకరం ధర లక్ష నుంచి మూడు లక్షల మధ్య లభిస్తుంది. బహిరంగ మార్కెట్లో కనిష్ట స్థాయి 5 లక్షల నుంచి 15 లక్షల మధ్య కొనసాగుతోంది. మార్కెట్ ధరల ప్రకారం రాళ్లు రప్పలతో కూడిన బీడుభూములు మినహా పూర్తి నీటివసతి ఉన్న సాగుభూములు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. భూమిలేని నిరుపేదలకు భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసే పథకం ముందుకు సాగాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సడలించాల్సి ఉంది. రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో కూడిన కమిటీకి జాయింట్ కలెక్టర్ను చైర్మన్గా నియమిస్తే భూపంపిణీ పథకం ఊపందుకునే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఆటంకాలెన్నో..! ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండడంతో భూమి లభ్యత తక్కువగా ఉంది. మైదాన ప్రాంతాల్లో హైదరాబాద్ను తలదన్నేలా రియల్ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుండడంతో భూముల ధరల అమాంతం పెరిగాయి. ఇ క్కడ భూమిని విక్రయించే రైతుల సంఖ్య తక్కువగా ఉం డగా లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉంది. కొన్ని మండలా ల్లో రెవెన్యూ అధికారులు భూమి కొనుగోలు పథకం పట్ల అయిష్టంగా ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్ప ష్టమైన ఆదేశాలు రాకపోవడం, శాఖాపరమైన పనులు కూడా పథకానికి ఆటంకంగా మారాయి. రాష్ట్రస్థాయిలో ఒకే ధర కాకుండా రెవెన్యూ డివిజన్ యూనిట్గా ధర నిర్ణయించాలి.. కమిటీలో అనవసర శాఖల ప్రమేయాన్ని తగ్గించాలి.. బహిరంగ మార్కెట్ ధరలను పరిగణలోకి తీసుకుని మధ్యేమార్గంగా ఓ ధరను నిర్ణయించాలని పలువురంటున్నారు. 2014 ఆగస్టులో భూమి పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఏడాది దాటినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. శాఖలన్నీ సీఎం చేతిలో ఉన్నా దళితులకు అన్యాయమే సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతిలో పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సీఎంకు మిషన్ కాకతీయ, వీటర్గ్రిడ్ పథకాలపై ఉన్న శ్రద్ధ దళితుల అభివృద్ధిపై ఏమాత్రం లేదు. - వచ్చలకూర వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీస్ రాష్ట్ర నాయకులు రైతులు ముందుకు వస్తేనే... రైతులు ముందుకు వస్తే భూ పంపిణీ పథకానికి వెంటనే భూమి కొనుగోలు చేసి ఆయా మండలాల్లో ఎంపిక చేసిన పేద దళితులకు రెవెన్యూ శాఖ సహకారంతో అందిస్తాం. - సీతామహాలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హరితహారం పేరుతో భూములు లాక్కుంటున్నారు దళితులకు భూపంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు తగిన మార్గదర్శకాలు రూపొందించలేదు. దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. - మందుల ప్రభాకర్, ఎమ్మార్పీస్ జిల్లా ఇన్చార్జి వీటిని మినహారుుస్తే ఎలా? జిల్లాలో అత్యధిక మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నారుు. మైదాన ప్రాంతాల్లోని మండలాల్లో నీటి ఎద్దడి పేరుతో తిరుమలాయపాలెం, అధిక ధరల పేరుతో ఖమ్మం అర్బన్, రూరల్ మండలాలను మినహాయించారు. ఇలా అయితే పథకం లక్ష్యం నెరవేరేదెలా? - సీహెచ్ రాంబాబు, ఎమ్మార్పీస్ జిల్లా కార్యదర్శి -
భూపంపిణీ @ నత్త
తూతూమంత్రంగా దళితులకు భూపంపిణీ పథకం మే వరకూ 959 మందికి 2,524 ఎకరాల పంపిణీ హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళితుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కారు భూపంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడంతోపాటు ఏడాదిపాటు సాగుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో గతేడాది ఆగస్టు 15న దీన్ని ప్రారంభించింది. ఈ ఏడాది మే 21 వరకు మొత్తం 959 మంది లబ్ధిదారులకు 2,524 ఎకరాల మేర ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని మంజూరు చేసి వాటిలో 640 మందికి లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసింది. అయితే వివిధ కారణాల వల్ల ఈ పథకం ఇంకా వేగం పుంజుకోలేదు. ముఖ్యంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఎంత మేర భూమిని పంపిణీ చేయాలన్న దానిపై లక్ష్యాలను నిర్దేశించకపోవడంతో పథకం అమలు నింపాదిగా సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని నిరంతరం సాగే పథకంగా, భూమి అందుబాటులోకి రావడాన్ని బట్టి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెబుతోంది. ఇదీ పథకం ఉద్దేశం... వ్యవసాయ రంగంపై ఆధారపడిన భూమిలేని నిరుపేద ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని వందశాతం సబ్సిడీపై అమలు చేస్తున్నారు. వ్యవసాయ భూమిని ఎకరానికి రూ. 2 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్యన కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు, నీటి వసతి, పరికరాలు, విద్యుత్ మోటార్లు, పంపులు వంటి సౌకర్యాలు అందించి కనీసం వన్క్రాప్ ఇయర్కు (విత్తనాలు, ఎరువులు,పురుగుమందులు, దున్నడం, తదితర సదుపాయాలు) అందించాలని పథకాన్ని ప్రారంభించినప్పుడే ప్రభుత్వం నిర్దేశించింది. విడుదలకాని మార్గదర్శకాలు... ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో గత తొమ్మిదిన్నర నెలలుగా జిల్లా కలెక్టర్లు, అధికారులు తోచిన విధంగా పనిచేస్తున్నారు. భూపంపిణీకి నీటి వసతి ఉన్న భూమినే కొనాలా, లేకపోయిన కొనవచ్చా అనే విషయమై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. దీంతో కలెక్టర్లు మొదలుకొని రెవెన్యూ యంత్రాంగం వరకు దీనిపై మొక్కుబడిగానే వ్యవహరిస్తుండటంతో ఈ పథకం చతికిలపడింది. నిరుపయోగంగా 800 కోట్లు భూపంపిణీ పథకం కోసం గత బడ్జెట్లో ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించినా ఈ ఏడాది మార్చి ఆఖరు వరకు అందులో రూ. వంద కోట్లు కూడా ఖర్చుచేయకపోవడంతో (దాదాపు రూ. వంద కోట్ల వరకు స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు కేటాయించారు) దాదాపు రూ. 800 కోట్లు నిరుపయోగంగా మిగిలిపోయాయి. ఈ ఏడాది మే 21 వరకు మొత్తం 959 మంది లబ్ధిదారులకు 2,524 ఎకరాల మేర మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని మంజూరు చేసి వాటిలో 640 మందికే లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేయగలిగారు. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 59.38 ఎకరాలు మంజూరు చేసి కేవలం ఏడుగురికి, రంగారెడ్డి జిల్లాలో 65.39 ఎకరాలు మంజూరుచేసి 14 మందికి, మహబూబ్నగర్ జిల్లాలో 87 ఎకరాలు మంజూరు చేసి 20 మందికి రిజిస్టర్ చేశారు. 2015-16 బడ్జెట్లోనూ రూ. వెయ్యికోట్లు కేటాయించినా భూపంపిణీ, స్వయం ఉపాధి పథకాలకు ఎంతెంత వ్యయం చేయాలనే దానిపై మార్గదర్శకాలే విడుదల కాలేదు. -
భూ పంపిణీలో కూలీలకే మొదటి ప్రాధాన్యం
- జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ - రైతుల భూముల పరిశీలన నెక్కొండ/నర్సింహులపేట/దుగ్గొండి/చెన్నారావుపేట : మూడెకరాల భూ పంపిణీలో లబ్ధిదారుల ఎంపికలో ఉపాధి కూలీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. నెక్కొండ మండలం నాగారం, నర్సింహులపేట మండలం వేములపల్లి, దుగ్గొండి మండలం తిమ్మంపేట, చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామాల్లో రైతుల భూములను కొనుగోలు చేసేందుకు మంగళవారం ఆయన పరిశీలించారు. నాగారం గ్రామానికి చెందిన కర్కాల వెంకట్రెడ్డి, సత్యనారాయణరెడ్డికి చెందిన సర్వే నం.248,249,251లోని 17 ఎకరాల 8 గుంటల భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సుమారు 48 దళిత కుటుంబాలు ఉండగా.. మొదటి విడతలో ఆరుగురు లబ్ధిదారులకు భూ పంపిణీ చేయూలని అన్నారు. నెక్కొండ జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గటిక అజయ్కుమార్, ఆర్డీఓ భాస్కర్రావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్నబీ, తహసీల్దార్ రాములు, డీటీ విక్రమ్కుమార్, సర్పంచ్ పర్కాల బిక్షం, వీఆర్ఓ అలీం, సంపత్, నాయకులు చిల్లా వెంకటేశ్, చల్లా వినయ్రెడ్డి, అమ్జత్ఖాన్, పాషా పాల్గొన్నారు. నర్సింహులపేట మండలం వేములపల్లిలో సర్వే నం.5లో 51 ఎకరాలు, 230లో 8-37 ఎకరాలు, 231లో 4-32 ఎకరాల భూములను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాస్కర్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, తహసీల్దార్ అమర్నాథ్, మూడావత్ కోమి, సర్పంచ్ గుమ్మడవల్లి పర్శయ్య, ఎంపీటీసీ సభ్యుడు రవి, సర్వేయర్లు గోపీసింగ్, మధు, ప్రసన్న పాల్గొన్నారు. కాగా, గ్రామంలోని ఊర చెరువులో సుమారు 4 ఎకరాల భూమిని కొందరు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్వేయర్లతో కొలతలు వేయించి రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దుగ్గొండి మండలం తిమ్మంపేటలో 10 మంది రైతులకు చెందిన 21 ఎకరాల వ్యవసాయ భూమిని జేసీ పరిశీలించారు. ఇదే మండలం వెంకటాపురంలో 13 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మడానికి రైతులు ముందుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ రామకృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు తోటకూరి రమేష్, రైతులు బీరం ప్రభాకర్రెడ్డి, వీరారెడ్డి, ఇంద్రారెడ్డి, గంట రాజిరెడ్డి, వీఆర్ఓ రాజు పాల్గొన్నారు. చెన్నారావుపేట వుండలం లింగగిరి గ్రావుంలోని ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ గ్రావుంలో ప్రభుత్వ భూమి 22 ఎకరాలు ఉందన్నారు. నిరుపేద దళితులకు ప్రభుత్వం 3 ఎకరాలు భూమి అందించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రవుంలో తహసీల్దార్ ఆంజనేయుులు, సర్పంచ్ గణేష్, ఆర్ఐలు విఠలేశ్వర్ సిరంగి, ఉవూరాణి, వీఆర్వో నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'భూ పంపిణీపై సీఎంనే అడగండి'
హైదరాబాద్: నేపాల్లో పశుపతినాథ్ ఆలయ పునరుద్ధరణకు రూ. 2 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రెవెన్యూ శాఖలో సంస్కరణలను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పాస్బుక్ల జారీలో ఆలస్యం జరుగుతుందన్నారు. సర్వేయర్లు లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుందని వెల్లడించారు. త్వరలోనే ఈపీఎస్ మిషన్లు ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలను వేగంగా జారీ చేయిస్తామని చెప్పారు. భూ పంపిణీపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం చంద్రబాబునే అడగండి అంటూ కేఈ సమాధానమిచ్చారు. అయితే ఇప్పటి వరకు భూ పంపిణీపై ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని డిప్యూటీ సీఎం కేఈ తెలిపారు. -
‘భూ పంపిణీ’కి నిర్లక్ష్యపు చీడ!
- అమ్మేందుకు ముందుకొచ్చిన రైతులు - సంప్రదింపుల్లో అధికారుల జాప్యం - నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం - 16 దళిత కుటుంబాలకే భూ పంపిణీ - జిల్లాలో ఎంపిక చేసిన దళిత కుటుంబాలు : 688 - పంపిణీ చేయాల్సిన భూమి (ఎకరాల్లో) : 2,064 - కేటాయించిన నిధులు : రూ.10.32 కోట్లు - ఇప్పటివరకు పంపిణీ (ఎకరాల్లో): 48 - లబ్ధిపొందిన కుటుంబాలు : 16 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది. ప్రభుత్వ భూమి దొరక్కపోతే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసైనా దళితులకు పంపిణీ చేయాలనే సర్కారు మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం పట్టించుకోవడంలేదు. అమ్మేవారు లేకపోవడంతో ‘భూ పంపిణీ’లో జాప్యం జరుగుతోందని గతంలో గగ్గోలు పెట్టిన అధికారులు.. తాజాగా 100 ఎకరాలను విక్రయించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చినా పట్టించుకోవడంలేదు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూమిలేని నిరుపేదలకు సగటున మూడెకరాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘భూ పంపిణీ’కి శ్రీకారం చుట్టింది. సర్కారీ భూములు లేకపోతే మార్కెట్ ధరలకు అనుగుణంగా గరిష్టంగా రూ.ఏడు లక్షలు చెల్లించైనా సరే సేకరించమని అధికారులకు దిశానిర్దేశం చేసింది. అయితే భూముల కొనుగోలులో ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినా మన జిల్లా యంత్రాంగం మాత్రం చొరవచూపడంలేదు. ఇప్పటివరకు కేవలం 24 మందికి 72.39 ఎకరాలను మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. దీంట్లో 66.39 ఎకరాలు ప్రైవేటు కాగా, ఆరెకరాలు మాత్రమే ప్రభుత్వానిది. రాజధానికి చేరువలో జిల్లా ఉండడంతో భూముల ధరలు ఆకాశన్నంటాయి. జిల్లాలో ఎకరా ధర కనిష్టం గా రూ.4 లక్షలు పలుకుతోంది. ఈ ధరలను చెల్లించేందుకు ముందుకొచ్చినా అమ్మేవారు లేకపోవడంతో భూపంపిణీకి సరిపడా భూమిని సేకరించలేకపోయారు. అయితే ప్రస్తుతం జిల్లా లో పరిస్థితి మారింది. భూముల ధరలు తగ్గకపోయినప్పటికీ, స్థిరాస్తి వ్యాపారం మాత్రం ఒడుదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం కునారిల్లింది. దీంతో చాలామంది రైతులు భూముల అమ్మకానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు రైతులు భూములను అమ్ముతామని ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అభ్యర్థనలు కూడా పెట్టుకున్నారు. దీంట్లో కుల్కచర్ల, నవాబ్పేటలలో 20 ఎకరాల చొప్పున, పూడూరు, యాలాలలో పదెకరాల చొప్పున .. యాచారంలో 40 ఎకరాలను విక్రయించేందుకు భూ యజమానులు ముందుకొచ్చారు. అయితే, భూ యజమానులు దరఖాస్తులను చకచకా పరిష్కరించడంలో ఇటు ఎస్సీ కార్పొరేషన్, ఇటు రెవెన్యూ యంత్రాంగం వేగంగా స్పందించడంలేదు. దీంతో నాలుగు నెలల క్రితం వచ్చిన దరఖాస్తులకు కూడా ఇప్పటికీ మోక్షం కలగలేదు. లక్ష్యం 2,062 ఎకరాలు జిల్లాలో 688 మంది దళిత కుటుంబాలకు 2,064 ఎకరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు రూ.10.32 కోట్లను కేటాయించింది. దీంట్లో ఇప్పటివరకు 48 ఎకరాలను మాత్రమే దళితులకు అందజేసింది. ఎకరా రూ.మూడు లక్షల చొప్పున మొత్తం రూ.122.28 లక్షలతో కొన్న ఈ భూమిని 16 మందికి కేటాయించింది. గుర్తించిన మరో 24 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. రూ.3.65 లక్షల చొప్పున ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి పంపిణీ ఎప్పటికి పూర్తవుతుందో అధికారులకే తెలియాలి. ప్రభుత్వం ప్రాధామ్యాలలో ఈ పథకాన్ని చేర్చినప్పటికీ మన యంత్రాంగం మాత్రం అంతగా దృష్టి సారించినట్లు కనిపించడంలేదు. -
మూడెకరాలు ముమ్మరం!
దళితుల భూపంపిణీ ప్రక్రియ వేగవంతం ప్రస్తుతం 24 మందికి 68 ఎకరాలు అందజేత 782 ఎకరాల భూమి కొనుగోలుకు కసరత్తు 652 ఎకరాల్లో ఎస్సీ కార్పొరేషన్ పరిశీలన పూర్తి ప్రతిపాదనలు సిద్ధం.. నక్కలగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రక్రియపై అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తు తం 24 మంది లబ్ధిదారుల కోసం 68 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఎస్సీ కార్పొరేషన్... ఇంకా 782 ఎకరాలను సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో నర్సంపేట మండలం బానోజుపేటకు చెందిన ఏడుగురు దళిత నిరుపేద కుటుంబాలకు 21 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. వీరితోపాటు శాయంపేట మండలం కాట్రాపల్లిలో ఏడుగురు లబ్ధిదారులకు 19.33 ఎకరాలు, పర్వతగిరి మండలం వడ్లకొండలో ఆరుగురికి 17 ఎకరాలు, నర్మెట మండలం అమ్మాపురంలో నలుగురికి 10.07 ఎకరా ల భూమిని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఇచ్చిం ది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు చేసింది. అరుుతే జిల్లాలో భూమి కొనుగోలును పర్యవేక్షించిన అప్పటి జేసీ పౌసుమిబసు ఈ పథకంపై కొంత నిర్లిప్తతను వ్యవహరించడంతో ఆమెపై విమర్శలు వ్యక్తమయ్యూరుు. ప్రక్రియ వేగవంతం చేయూలి : కడియం జిల్లాలోని వివిధ పథకాల పురోగతిపై ఈనెల 9న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లాలో దళితులకు భూ పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. ఈ పథకం అమలులో జిల్లా వెనుకపడిందని, 782 ఎకరాల భూమి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయూలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మండలాలు, గ్రామాలవారీగా సర్వే చేపట్టారు. ఇప్పటివరకు 23 మండలాల్లో 652 ఎకరాల భూమిని పరిశీలించిన అధికారులు కొనుగోలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణీత ధరలకు, భూమి యజమానులు చెబుతున్న ధరలకు మధ్య చాలా మేరకు వ్యత్యాసం ఉంది. ఈ ధరలు భూమి కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. -
20 కుటుంబాలు.. 60 ఎకరాలు
ప్రహసనంగా దళితులకు భూ పంపిణీ ►భూమి కొనుగోలుకు జిల్లాకు రూ.24.5 కోట్లు విడుదల ►ఖర్చుచేసింది కేవలం రూ.1.55కోట్లు మాత్రమే ►భూ పంపిణీలో కూడా భారీ అక్రమాలు సాక్షి, మహబూబ్నగర్ : నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది. ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరేలా లేదు. భూపంపిణీ ప్రక్రియ కోసం జిల్లాకు రూ.24.50 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు కేవలం రూ.1.52 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. తద్వారా కేవలం 20 కుటుంబాలకు 60 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు. జిల్లాలో 7,08,954 మంది(2011 జనాభా లెక్కల ప్రకారం)ఎస్సీలు ఉన్నారు. జనాభాలో 17.5శాతం మంది ఉన్నారు. అయితే వీరిలో కేవలం మూడు శాతం మందికి మాత్రమే వ్యవసాయ సాగుభూములు ఉన్నాయి. మిగతా వారికి కూడా విడతల వారీగా భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకనుగుణంగా జిల్లాకు పెద్దమొత్తంలో నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ అధికారుల అలసత్వం కారణంగా భూ పంపిణీ ప్రక్రియ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో ఆగస్టు 15న మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభిస్తూ.. 12 మంది లబ్ధిదారులకు కూడా పట్టాలు అందజేశారు. ఆ తర్వాత మరో ఎనిమిది మందికి మాత్రమే భూ పంపిణీ చేశారు. మంత్రి ప్రారంభం తర్వాత ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ పథకం ముందడుగు వేయడం లేదు. మొక్కబడిగా మొదటి విడత జిల్లాలో మొదటివిడతగా ఆరుగ్రామాల్లో మాత్రమే ఎస్సీలకు భూ పంపిణీ చేశారు. అయితే మొదటి విడతలో ఎంపికైన గ్రామాల్లోని ఒకటి మినహా అన్నీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలే కావడం గమనార్హం. కేవలం వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న అలంపూర్లో ఉంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడం చేత అక్కడ భూ పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ప్రధానంగా ఎస్సీల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూ పంపిణీకి అటవీచట్టాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎస్సీ జనాభా ఎక్కువగా అచ్చంపేట నియోజకవర్గంలో అటవీచట్టం(1 యాక్టు 1970 ప్రకారం) అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూరు, లింగాల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సీలు నిరాశకు లోనవుతున్నారు. దళారుల దందా దళితుల భూ పంపిణీలో దళారులు దగాకు గురిచేస్తున్నారు. ఓ వైపు భూ అమ్మకందారుల నుంచి, మరోవైపు లబ్ధిదారులైన నిరుపేద దళితుల నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల వసూళ్లలో వీఆర్ఓలతో మొదలుకుని పైస్థాయి అధికారులు, చోటామోటా నాయకుల వరకు వాటాలు తీసుకుంటున్నట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలు బహిరంగంగా బయటకు చెప్తే ఊళ్లో ఎలాంటి సహాయ సహకారాలు అందవని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని చోట్ల భూమి విలువను అమాంతం పెంచేసి.. దళారులు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. -
'ఆసరా'లో అక్రమాలు వాస్తవమే: ఈటెల
సామాజిక పింఛన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నిజాయితీగల అధికారులతో సామాజిక ఆడిట్ నిర్వహిస్తే పింఛన్లకు 20 శాతానికిపైగా అనర్హులవుతారని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో తాగునీరు, పింఛన్లు, విద్య, వాటర్గ్రిడ్, సన్నబియ్యం, హరితహారం, ఎస్సీ కార్పొరేషన్ నిధులు వంటి అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించారు. ఎంతో గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరాలో తప్పటడుగులు దొర్లాయని, సీఎం ఆశయం నెరవేరలేదన్నారు. అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం తమకు పోషణ కరువైందంటూ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పాఠశాలల్లో సన్నబియ్యం భోజన పథకం విజయవంతమైతే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రవేశపెడతామన్నారు. దళితుల భూమి కొనుగోలు అంశంపై ప్రత్యేక కమిటీలు వేసి భూ పంపిణీని వేగవంతం చేస్తామన్నారు. -
దళితుల దరిచేరని పథకాలు
* ముందుకు కదలని భూపంపిణీ * లక్ష్యం చేరని స్వయం ఉపాధి * మొండికేస్తున్న బ్యాంకులు * నేడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాక * సంక్షేమ పథకాలపై సమీక్ష కరీంనగర్ : దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా పథకాలు దళితుల దరికి చేరడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా తయారు కాగా, స్వయం ఉపాధి రుణాలదీ అదే బాట. దళితులకు ప్రభుత్వ పథకాలు ఆమడదూరంలో ఉంటున్నాయి. హడావుడి చేసి ప్రారంభించిన కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీకి మళ్లీ మోక్షం కలగడం లేదు. పథకాన్ని ప్రారంభించి ఐదు నెలలవుతుండగా ప్రభుత్వ భూముల కొరతతో ఇప్పటివరకు 216 మందికి మాత్రమే పత్రాలు అందించారు. జిల్లాలో 1.77 లక్షల ఎస్సీ కుటుంబాలుండగా, ఇందులో అసలు భూమిలేని కుటుంబాలు 1.50 లక్షలు. పథకం ప్రారంభానికి ముందు మండలానికో గ్రామం ఎంపిక చేసి పంచాలని నిర్ణయించినా... భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి మొదటా 122 మంది లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15న 307.57 ఎకరాల భూపంపిణీ పత్రాలు అందించారు. అనంతరం మరో 94 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు 216 మందికి 558 ఎకరాల 29 గుంటలు పంచారు. ఇందులో ప్రభుత్వ భూములు 119 ఎకరాలు కాగా 53 మందికి, 129 ఎకరాల ప్రైవేట్ భూమిని 163 మందికి పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసింది కొంతే... భూపంపిణీ కింద జిల్లాకు రూ.24 కోట్లు విడుదల కాగా, భూముల కొనుగోలుకు రూ.12.75 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం ఆర్డీవో ఖాతాల్లో చేరాయి. ఆర్భాటంగా పత్రాలిచ్చిన్పటికీ పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి డబ్బులు ఇవ్వకపోగా... లబ్ధిదారులకు ఇంకా భూములు అప్పగించలేదు. హద్దులు నిర్ణయించలేదు. ఫలితంగా సాగుభూమి బీడుగా ఉంటోంది. మొత్తంగా జిల్లాలో 248 ఎకరాల భూమి 111 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అంటే పంపిణీ చేసిన వారిలోనే ఇంకా 52 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఆరు వేల ఎకరాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా పరిస్థితులు ఇలాగే ఉంటే కార్యరూపం దాల్చడం అనుమానమే. స్వయం ఉపాధిదీ అదే తీరు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గత జనవరిలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాల కోసం స్వీకరించిన దరఖాస్తులకు ఏడాది గడిచినా మోక్షం లేదు. అప్పటి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన జిల్లా వాసి అడ్లూరి లక్ష్మణ్కుమార్ రెండు సార్లు అధికారులతో సమావేశమై రుణాలకు బ్యాంకు అనుమతి పత్రాలు కొర్రీలు పెట్టకుండా ఇవ్వాలని ఆదేశించారు. అంతలోనే గవర్నర్ పాలన వచ్చి... వరుస ఎన్నికలతో రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాంకు అనుమతి పత్రాలు పొందిన నిరుద్యోగులు రుణాల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2380 యూనిట్లకు రూ.32.16 కోట్లు మంజూరు చేసింది. 3225 దరఖాస్తులు రాగా 2682 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. లక్ష్యానికి మించి 299 మందికి కూడా రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు ప్రకటించినా... ఇప్పటివరకు 35 శాతం యూనిట్లు కూడా గ్రౌండింగ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.15.6 కోట్లతో 1514 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 8.78 కోట్లు సబ్సిడీ ఉండా రూ.6.29 కోట్లు బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్కు రూ.310 కోట్లతో 316 మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. 352 దరఖాస్తులు రాగా 45 శాతం గ్రౌండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకులదీ అదేబాట నిరుద్యోగులకు రుణాల మంజూరుకు అనుమతి పత్రాలు ఇవ్వడంలో బ్యాంకులు పాత బాటనే పయనిస్తున్నాయి. స్వయం ఉపాధి కింద ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రుణాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందిస్తే రుణాలిచ్చేందుకు సిద్ధమేనని చెబుతున్నారు. ఓవైపు జిల్లా యంత్రాంగం జనవరి 26న యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించగా... లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి. నేడు జిల్లాకు చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. పథకాల వేగవంతంపై దళితులంతా ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. -
దళితులకు వెయ్యి ఎకరాలు
సంగారెడ్డి అర్బన్: భూ పంపిణీ కింద జిల్లాలోని దళితులకు వెయ్యి ఎకరాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, అయితే లక్ష్యాన్ని మించి పంపిణీ చేసి భూపంపిణీలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి వెల్లడించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో దళితులకు మంజూరు చేస్తున్న పింఛన్లు, భూపంపిణీ కార్యక్రమాలపై పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, దళితులకు భూపంపిణీ చేసేందుకు జిల్లాకు రూ.110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో వెయ్యి ఎకరాల భూమిని దళితులకు పంపిణీ చేసే లక్ష్యాన్ని అధిగమించాలని ఆయన సూచించారు. భూపంపిణీకి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. జిల్లాలో అవసరమైనంత భూమి అందుబాటులో ఉందని, ధరలు కూడా తక్కువగానే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జియాలజిస్ట్లు, సర్వేయర్ల కొరత వల్ల భూపంపిణీ కార్యక్రమం కొంత మందకొడిగా సాగిందన్నారు. రానున్న రోజులలో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే ఆసరా పథకం పనులు పూర్తయినందున అధికారులు భూపంపిణీ పథకంపై దృష్టి సారించాలన్నారు. త్వరలోనే దళితులకు కొత్త రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల దళితులకు ఉపాధి కోసం ఇచ్చే రుణాలను రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పిడమర్తి రవి వెల్లడించారు. అనంతరం డీఆర్ఓ దయానంద్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో జిల్లా రెండవ స్థానంలో ఉందని, త్వరలోనే తొలిస్థానానికి తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో దళితుల సంక్షేమానికి స్వయం ఉపాధికి తీసుకుంటున్న చర్యలను డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్దాస్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో రూ. 7.15 కోట్లతో 67 మంది నిరుపేద దళితులకు 172 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశామని, పంపిణీ చేసేందుకు మరో వందఎకరాల భూమి సిద్ధం చేశామన్నారు. ఇదే కాకుండా భూపంపిణీ కోసం మొత్తం 2 వేల ఎకరాలను గుర్తించామన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీడీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కల్యాణలక్ష్మీ పథకం కింద జిల్లాకు కోటి రూపాయలు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు ఈ పథకం కింద వంద దరఖాస్తులు అందాయన్నారు. ఈ సమీక్షలో ఆర్డీఓ మధుకర్రెడ్డి, ఎల్డీఎం రమణా రెడ్డి, వివిధ శాఖల అధికారులు, షెడ్యూల్డ్ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
హామీలు ఏమయ్యాయి?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అర్హులైన నిరుపేదలందరికీ స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు 125గజాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను త్వరితంగా ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఇళ్లు, స్థలాలను కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేపట్టామని, కానీ ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలే అయ్యాయని అన్నారు. హయత్నగర్ మండలంలోని వేల ఎకరాల భూములు సంఘీ, రామోజీరావు గుప్పి ట్లో ఉన్నాయని, వారినుంచి చట్ట ప్రకా రం భూములను వెనక్కు తీసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరుణం లో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలన్నారు. ధర్నా లో భాగంగా కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనాలు పెద్ద సంఖ్యలో రావడం, మరోవైపు కలెక్టరేట్ ఎదుట మెట్రోరైలు పనులు జరుగుతున్నందున పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు వచ్చేవరకు ధర్నాను ఆపేదిలేదని తేల్చడంతో.. జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వారి వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. పేదల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు బుధవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, భూపంపిణీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే పెన్షన్ల అంశంపై కాంగ్రెస్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. -
3 ఎకరాల భూపంపిణీ ప్రస్తావన ఏది?: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తోందని ఖమ్మం జిల్లా పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీలో గిరిజనులు, దళితులకు భూ కేటాయింపులపై వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ భూమి లేని పేద దళితులకు, గిరిజనులు మూడు ఎకరాలు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. భూపంపిణీ వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆగస్ట్ 15న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా దళితులకు భూపంపిణీ ప్రారంభించిందని, అయితే ఎంతమందికి పంపిణీ చేశారో చెప్పాలరన్నారు. అలాగే భూములతో పాటు సాగునీరు, కరెంట్, సాగునీరు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 ఎకరాల భూ పంపిణీపై ప్రస్తావన లేదన్నారు. మరోవైపు భూమి కోసం దళితులు, గిరిజనులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై సభలో ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతామని చెప్పారు. -
దళితులను దగా చేసిన కేసీఆర్ బడ్జెట్
కామారెడ్డిటౌన్: తెలంగాణలో మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్ దళితుడిని దగా చేసిందని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో ప్రకారం ఎస్ సబ్ప్లాన్ నిధులు కాకుండా, ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను దళితుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇపుడు బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి మోసగించారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ. 50 వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తేనే దళితులకు ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందన్నారు. భూ పంపిణీ పేరిట దళితులకు రూ. వెయ్యికోట్లతో భూములు కొనుగోలు చేసి అందిస్తామని కేసీఆర్ గారడీ చేస్తున్నారని విమర్శిం చారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి రూ. 6,500 కోట్ల విలువ గల ప్రభుత్వ భూములను అ మ్ముకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇది దొరలకు మేలు కలిగించడానికేనని మండిపడ్డారు. ప్రభుత్వ భూములనే దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు ఎల్అండ్టీ కంపెనీ నుంచి మైహోమ్ కంపెనీకి ఎలా అంటగట్టారో ఇప్పుడు ప్రభుత్వ భూములను సొంత సామాజిక వర్గాలకు అం ట గట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామాలకే పరిమితమవుతున్న దళితులకు నగరాలలో ఉన్న ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ అంశంపై మోసం అధికారంలోకి వచ్చాక రెండు నెలలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్తోపాటు కేటీఆర్ , కవిత హామీ ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్ప టి వరకు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బడ్జెట్లో ఫ్యాక్టరీకి నయా పైసా కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఫ్యాక్టరీని చంద్రబాబునాయుడు గతంలో పెట్టుబడిదారులకు అంటగడితే, కేసీఆర్ కూడా అదే తోవలో నడుస్తున్నారన్నారు. దీనిని స్వాధీనం చేసుకుంటే 10 వేల మందికి ఉపాధి దక్కుతుం దన్నారు. బడ్జెట్లో బీసీలకు కూడా పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు శ్యామ్యూల్, బా లు, ఫర్జానా, కిష్టయ్య, రమేశ్, సాయిలు, లక్ష్మణ్, శంకర్, యాదగిరి, బోకే లింగం తదితరులున్నారు. -
3ఎకరాలు.. 20మందికే!
మహబూబ్నగర్ టౌన్: ప్రభుత్వం తమకు గంటెడు జాగా ఇస్తే దున్నుకొని దర్జాగా బతకవచ్చని భావించిన పేదలకు అంతలోనే నిరాశే ఎదురైంది. ఎంపికచేసిన గ్రామాల్లో అర్హులందరికీ పంపిణీచేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కొందరికి మాత్రమే పంపిణీ చేయడంతో మిగతావారిలో నైరాశ్యం నెలకొంది. పంద్రాగస్టు రోజున పట్టాలు అందుకోవచ్చని ఆశించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 14 గ్రామాలను భూపంపిణీకి ఎంపికచేశారు. ఆయా గ్రామాల్లో అర్హులను గుర్తించి వారిలో ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు నెలరోజుల పాటు కసరత్తుచేశారు. తీరా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ఆరు గ్రామాల్లో 20మందికి మాత్రమే 60 ఎకరాలను పంపిణీచేసి చేతులు దులుపుకున్నారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎంపికచేసిన ఆ ఎనిమిది గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. ఇక పంపిణీచేసిన గ్రామాల్లో కూడా అందరికీ ఇవ్వలేకపోయారు. దీంతో అర్హులు ఒకింత అసహనానికి గురయ్యారు. నిధులు ఖాతాకే పరిమితం ప్రభుత్వ భూములు ఉంటే సరేసరి.. లేకపోతే జిల్లాలో భూమిని కొనుగోలు చేసైనా దళితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.24కోట్లు మంజూరుచేసింది. అయితే కేవలం రూ.1.55కోట్లు వెచ్చించి 60 ఎకరాలను కొనుగోలుచేసిన అధికారులు 20 మంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగతా రూ.22.45కోట్లను ఖాతాకే పరిమితంచేశారు. వీటిని కూడా వినియోగిస్తారా? లేదా? అన్నది అయోమయం నెలకొంది. పంపిణీచేయని గ్రామాలు జిల్లాలో ఎంపికచేసినా.. కొన్ని గ్రామాల్లో భూమిని పంపిణీ చేయలేదు. వాటిలో కొల్లాపూర్ నియోజకవర్గం ఎల్లూరు, కల్వకుర్తి మండలం వెల్దండ శేరి అప్పారెడ్డిపల్లి, తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం పాల్వాయి, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నందిపాడు, మక్తల్ నియోజకవర్గంలోని కర్నె, వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ మండలం పెద్దచింతకుంట గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 29 మంది లబ్ధిదారులను గుర్తించారు. కాగా, భూ పంపిణీకి సంబంధించి అధికారులు కేవలం 20 మందికి మాత్రమే పంపిణీచేసి.. మిగతావారికి ఎప్పుడు పంపిణీచేస్తారనే విషయమై మౌనం దాల్చారు. -
తడిసిమోపెడు
భూ పంపిణీ ఖర్చు ప్రభుత్వానికి తడిసిమోపెడవుతోంది. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సర్కారు.. అమలుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పంద్రాగస్టున శ్రీకారం చుట్టిన ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 122 మందికి 307.57 ఎకరాలు పంచారు. ప్రభుత్వభూమి లభించక ప్రైవేటు భూములు సేకరిస్తుండగా ఖర్చు అంచనాలు మించిపోతోంది. ఈ ఒక్కసారికే రూ.8.43 కోట్లు భారం కాగా... నిరంతరం అమలు చేయడం గగనమే కానుంది. - భూ‘భారం’ - అంచనాలు తారుమారు - ఎనిమిది మండలాల్లోనే ప్రభుత్వ భూములు - పూర్తిస్థాయి పంపిణీకి రూ.500 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : డీఆర్డీఏ సర్వే ప్రకారం జిల్లాలో 1,48,982 దళిత కుటుంబాలున్నాయి. ఇందులో భూమిలేని కుటుంబాలు 51,445. ఎకరం, ఆపై ఉన్న కుటుంబాలు 97,537 ఉన్నాయి. ప్రతి కుటుంబానికి మూడెకరాల చొప్పున అందించాలంటే మొత్తం రెండు లక్షల ఎకరాల భూమి అవసరమవుతుంది. జిల్లాలో అంతమొత్తం ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ముందుగా సరేనన్న ప్రభుత్వం.. పునరాలోచనలో పడి ఆ లెక్కలన్నీ తప్పుల తడకేనని, ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో ప్రైవేటు భూముల ధర ఎంత ఉంది? అర్హుల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? స్థానికంగా మార్కెట్ విలువ ఎంత? అనే అంశాలపై ఆరా తీసింది. ముందుగా విధించిన కొన్ని నిబంధనలను సడలించి.. ఐదేళ్లుగా సాగులో ఉన్న భూములు కొనుగోలు చేయడంతోపాటు తక్కువ లబ్ధిదారులున్న గ్రామాలను గుర్తించాలని ఆదేశించింది. ముందుగా మండలానికో గ్రామం అనుకున్నా.. తర్వాత నియోజకవర్గానికో గ్రామానికే పరిమితం చేసింది. ఏడాదికి రూ.60 వేల లోపు ఆదాయమున్నవారినే ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్లినా..జిల్లాలో ఇప్పుడున్న అర్హులకు భూమి పంచాలంటే రూ.500 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. ఒక్క జిల్లాకే రూ.500 కోట్లు వెచ్చిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు భూమి కొనుగోలు చేసి ఇవ్వాలంటే వేలాదికోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. సర్కారు భూములు కరువు మండలానికో గ్రామాన్ని గుర్తించి.. లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అధికారులు కరీంనగర్ మండలం మినహా 56 మండలాల్లో 56 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల్లో భూపంపిణీకి 1202 ఎస్సీ కుటుంబాలను అర్హులుగా పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మండలాల్లోనే ప్రభుత్వ భూములున్నాయని, 49 గ్రామాల్లో 3,288 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులు విక్రయించేందుకు ముందుకొస్తున్నారని, వీటి కొనుగోలుకు మార్కెట్ ధర ప్రకారం రూ.397.47 కోట్లు అవసరమని నివేదిక సిద్ధం చేశారు. అయితే మెట్ట భూమికే ప్రైవేటు వ్యక్తులు ఎకరాకు రూ.7లక్షలకు పైగా ధర చెబుతున్నారు. ఇక బావులు, బోర్లు ఉన్నవారు భూములకు అధిక రేటు చెబుతున్నారు. ఎట్టకేలకు తొలివిడత భూ పంపిణీ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నా.. ప్రభుత్వానికి మాత్రం కునుకు లేకుండా చేస్తోంది. నిరంతరం భూపంపిణీ చేయాలంటే భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమవుతోంది. -
పేదలకందిన భూమి
►మంత్రి ఈటెల చేతులమీదుగా 307 ఎకరాలకు హక్కులు ►రూ.8.42 కోట్లతో కొనుగోలు ►122 మంది దళిత మహిళలకు పట్టాలు కరీంనగర్ :నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ మొదటివిడత కార్యక్రమం పంద్రాగస్టు వేదికగా ప్రారంభమైంది. ఎన్నో అవాంతరాలు, అనేక అభ్యంతరాలు, సవాలక్ష నిబంధనల మధ్య అనుకున్న సమయానికి వీలైనన్ని గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలరోజులకు పైగా శ్రమించిన అధికారయంత్రాంగం చేతులెత్తేస్తుందని భావించినా.. చివరకు ఒకట్రెండు రోజుల్లోనే ప్రక్రియకు తుదిరూపం తీసుకురావడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా 122 మందిదళితమహిళలకు 302 ఎకరాలకు సంబంధించిన పట్టాలు అందించారు. ముకరంపుర : నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాలు కేటాయించాలని సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ఆది నుంచీ అవాం తరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఐదేళ్ల నుంచి సాగులో ఉన్న పట్టా భూములను కొందామ న్నా.. ‘బేరం’ కుదరకపోవడం, ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు సరిపడా భూములు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకుని లబ్ధిదారులను గుర్తించాలని భావిం చిన ప్రభుత్వం.. కొద్దిరోజులకు నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంచుకోవాలని నిర్ణయించింది. అయినా వారికీ భూములు లభ్యం కాకపోవడంతో మొదటివిడతలో పరిమిత సంఖ్యలో లబ్ధిదారులను ఎంపికచేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో ఆరుగురి నుంచి తొమ్మిది మందిని హైదరాబాద్లోని గోల్కొండకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు పంపాలని సీఎం ఆదేశించారు. మరోవైపు జిల్లాలోనూ భూ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై గురువారం రాత్రి నుంచి పొద్దుపొడిచే వరకూ క్షే త్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు కసరత్తు వేగిరం చేశారు. నియోజకవర్గానికో గ్రామం పక్కనపెట్టి పట్టా భూములు ఎక్కడ లభిస్తే అక్కడే లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి 122 మందిని గుర్తించారు. వీరికి 307. 57 ఎకరాలు అందించేందుకు రూ.8,42,69,741 వెచ్చించారు. ఇందులో ఆరు గ్రామాల్లో 53 మంది లబ్ధిదారులకు 117.71 ఎకరాల ప్రభుత్వభూమి, మిగిలిన 69 మందికి 10 గ్రామాల్లో 190 ఎకరాల పట్టా భూమిని రూ.8.42 కోట్లతో కొని లబ్ధిదారులకు అందించారు. మరోవైపు ఎంపిక చేసిన గ్రామాల్లో పట్టా భూములు ప్రభుత్వ ధరకు బేరం కుదరక పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. విడతలవారీగా భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. సాగుయోగ్యమైన భూములు అమ్ముకోవడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదు. భూములన్న చోట అర్హులు లేకపోవడం.. ప్రభుత్వ నిబంధనల కిరికిరి కొనసాగుతుండడంతో ఈ ప్రక్రియ ఎంతటితో సరిపెడతారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దళితులకు భూ పంపిణీ
సాక్షి, మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు మూడెకరాల భూపంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన వేడుకలకు అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్, సమాచార, సాంకేతికరంగ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన అర్హులైన 20 మంది దళితులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన ఎం.లక్ష్మమ్మ, ఆర్.నారమ్మ, అలంపూర్ మండలం కోయిల్దిన్నెకి చెందిన హెచ్.లక్ష్మీదేవి, హెచ్.మేరియమ్మ, హెచ్.భాగ్యమ్మ, హెచ్.ప్రమీలమ్మలు పట్టాలు అందుకున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గం కరివెన గ్రామానికి చెందిన కప్పెట నాగమ్మ, బొడ్రాతి మూర్తమ్మ, గొరిట మాసమ్మ, షాద్నగర్ నియోజకవర్గం వెంకిర్యాలకి చెందిన కె.లక్ష్మమ్మ, టి.నర్సమ్మ, వి.సుక్కమ్మ, జడ్చర్ల నియోజకవర్గం కొత్తూరు గ్రామానికి చెందిన బి.రేవతమ్మ, ఎం.లక్ష్మమ్మ, వై.మంజులకు పట్టాలు పంపిణీ చేయగా, మిగిలిన వారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలను తీసుకున్నారు. జీవితాంతం రుణపడి ఉంటాం మిడ్జిల్ : ‘నిరుపేదలను గుర్తించి భూమి ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి, కేసీఆర్ సార్కు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మాలాంటోళ్లకు పిలిచి భూమి ఇచ్చిన సర్కార్ ఇదొక్కటే. సంతోషంగా ఉంది. క లలో కూడా పట్టాదారులమవుతామని అనుకోలేదు. తీసుకున్న భూమిలో పంటలు సాగుచేసి వాటితో పిల్లల్ని బాగా చదివించుకుంటాం’ అని భూములు పొందిన లబ్ధిదారులు చెప్పిన మాటలివి. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిడ్జిల్ మండలం కొత్తూర్కు చెందిన ముగ్గురు నిరుపేద రైతులకు మంత్రి కేటీఆర్ పట్టాలు అందజేశారు. వీరిలో లక్ష్మమ్మకు సర్వే నం.384/ఈలో, పార్వతమ్మకు 384/అ లో, మంజులకు 384/ఆ లో మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు. -
నేడే భూపంపిణీ
సీఎం చేతుల మీదుగా.. తొమ్మిది మందికే పట్టాలు జిల్లాకు రూ.5 కోట్ల నిధులు ఆగమాగం అధికారుల కసరత్తు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకల అనంతరం సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. పలు జిల్లాల నుంచి లబ్ధిదారులను హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా జిల్లా నుంచి 9 మంది ఎస్సీ మహిళ లబ్ధిదారులను ఎంపిక చేసింది. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం కానంపల్లికి చెందిన ఆరె నర్సమ్మ, రాదపాక లక్ష్మి, లింగంపల్లి రాజేశ్వరి, మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ప్రతాపగిరి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశ్వరి, మేదరి లక్ష్మి, హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని పాతర్లపల్లికి చెందిన దుబ్బాసి రజిత, కోడెం రాజమణి, సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక రాజవ్వ, మల్లారపు లావణ్యను ఎంపిక చేశారు. వీరికి పంపిణీ చేసేందుకు నిర్ధేశించిన భూములకు సంబంధించి పట్టాలను సిద్ధం చేశారు. కొన్ని చోట్ల లబ్ధిదారులకు అవసరమైన భూములను రెవెన్యూ అధికారులు అప్పటికప్పుడు కొనుగోలు చేశారు. హడావుడిగా గురువారం రాత్రి వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వారి పేరిట సిద్ధం చేయించారు. ఎంపిక చేసిన తొమ్మిది మంది లబ్ధిదారుల జాబితాను జిల్లా ఎస్సీ సేవా సహకార సంఘం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కార్యాలయం ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి పంపించింది. స్వాతంత్య్ర వేడుక ల్లో పట్టాలు అందుకునేందుకు వీరికి ప్ర త్యేక పాసులు జారీ చేయించింది. జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లోనూ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయించాలని జిల్లా యంత్రాంగం భావి స్తోంది. ఇప్పటికే గుర్తించిన గ్రామాల్లో ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబి తాను పంపించాలని ఆర్డీవోలను కోరింది. భూముల కొనుగోలుకు అవసరమయ్యే ని ధులను ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసింది. మొత్తం రూ.5 కోట్లు విడుదల చేసి ఆర్డీవోలకు అందించామని ఈడీ సత్యనారాయణశర్మ తెలిపారు. బెజ్జంకి మం డలం పారువెల్లలో ఎన్.ఎల్లవ్వ, పి.పోచ వ్వ, ఎల్.పోచవ్వ, ఎం.మల్లవ్వ, ఎం.మల్ల వ్వ, స్వరూపను ఎంపిక చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా పట్టాలు అందించనున్నారు. -
‘15’తో సరి
►సీఎం జిల్లా పర్యటన రద్దు ►గోల్కొండ కోటలోనే భూ పంపిణీ ►జిల్లా నుంచి ఐదుగురికే అవకాశం ►జిల్లా కేంద్రంలో మరో పదిమందికి.. ముకరంపుర : పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లాలోని 15 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా భూ పంపిణీ సరిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జిల్లా నుంచి ఐదుగురిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఆదేశాలందాయి. రాత్రికిరాత్రే లబ్ధిదారులను ఎంపిక చేయాలని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. మరో 10 మందికి జిల్లాకేంద్రంలోని వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా పట్టాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ డివిజన్కు ఒకరు చొప్పున ఐదుగురికి రాజధానిలోని గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పట్టాలందించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీంతో ఆయన జిల్లా పర్యటనపై ఆశలు ఆవిరయ్యాయి. అచ్చొచ్చిన జిల్లా, తాత స్వగ్రామమైన ముస్తాబాద్ మండలం మోహినికుంటలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని భావించినా.. పర్యటన రద్దుకావడంతో దళితులకు నిరాశే ఎదురైనట్లయ్యింది. భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం భూములను గుర్తించేందుకు తీవ్ర కసరత్తు చేసింది. ప్రభుత్వ భూములు లేకుంటే ప్రైవేట్ భూములు కొనాలని ఆదేశించడం.. సాగుకు యోగ్యమైన భూములే చూడాలని నిబంధన విధించడంతో భూములు అమ్ముకునేందుకు ఇతర రైతులెవరూ ముందుకు రాలేదు. దీంతో భూ సేకరణ ఇబ్బందిగా మారింది. ముందుగా మండలానికో గ్రామాన్ని గుర్తించాలని అనుకున్నా.. భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని పరిమితం చేశారు. కరీంనగర్, మంథని మినహా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. గుర్తించిన గ్రామాల్లో 451 ఎకరాలు అవసరం కాగా.. అందుబాటులో మాత్రం 155 ఎకరాలు ఉండడంతో మిగిలిన 296 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని భావించారు. తాజాగా ఆగమేఘాల మీద లబ్ధిదారుల జాబితా పంపించాలని ఆదేశించడంతో.. ఇన్నాళ్లూ కొలిక్కిరాని ప్రక్రియ ఒక్క రాత్రిలో ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒక్కో లబ్ధిదారుడిని, మూడెకరాల భూమికి రిజిస్ట్రేషన్ పత్రాలను సిద్ధం చేసే పనిలో ఆయా నియోజకవర్గాల అధికారులు రాత్రంతా బిజీ అయ్యాయి. ఎంపిక చేసిన గ్రామాలివే.. బెజ్జంకి మండలం పారువెల్ల, ముస్తా బాద్ మండలం మోయినికుంట, జమ్మికుంట మండలం పాతర్లపల్లి, హుస్నాబాద్ మండ లం రేగొండ, వేములవాడ మండలం చెక్క పల్లి, రామగుండం మండలం అక్కెనపల్లి, శ్రీరాంపూర్ మండలం పెద్దరాతపల్లి, ధర్మారం మండలం కానంపల్లి, రాయికల్ మండలం దామన్పల్లి, మల్లాపూర్ మండలం అడవి మాదాపూర్, మల్యాల మండలం గొర్రెగుండం గ్రామాలను ఎంపిక చేశారు. -
కొనాలె.. ఇవ్వాలె!
పంద్రాగస్టున దళితులకు భూ పంపిణీ ఇంకా... రెండు రోజులే గడువు ఏర్పాట్ల దశలోనే అధికారులు భూ లభ్యతపై కొనసాగుతున్న పరిశీలన జిల్లాలో 113 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే... తేల్చేసిన అధికార యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లాలో భూమి లేని నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇంకా రెండు రోజులే గడువు ఉంది. అరుునా... జిల్లాలో ఎంత మందికి, ఎంత విస్తీర్ణంలో భూములు పంపిణీ చేసే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భూ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఎక్కడ ప్రారంభించాలనే అంశంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో సంప్రదించిన తర్వాత అధికారులు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అరుుతే.. దళితులకు భూ పంపిణీ చేసేందుకు జిల్లాలో ప్రభుత్వ భూములు లేని పరిస్థితి ఉంది. సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూములు జిల్లాలో 113 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రికార్డుల ప్రకారం ఈ భూములు ప్రభుత్వానికి చెందినట్లుగా ఉన్నా... ప్రస్తుతం ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. దీంతో భూ పంపిణీ కోసం ప్రైవేట్ భూములను కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 15న ప్రతి నియోజకవర్గంలో కాకుండా ఒకే నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం భూములను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. మొదటి విడతలో 500 ఎకరాలు జిల్లాలో మొదటి విడతలో 500 ఎకరాల భూ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు మండలాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించారు. అదేవిధంగా... ప్రయోగాత్మకంగా ప్రతి గ్రామంలో సగటున 18 మంది భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే జిల్లా యంత్రాంగం నివేదికను రూపొందించింది. వ్యవసాయశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) సమష్టిగా భూ అభివృద్ధి, నీటి వనరుల సదుపాయూల కల్పన బాధ్యతలు చేపట్టనుంది. రెండు రోజులే... జిల్లాలో భూమిలేని నిరుపేద దళిత మహిళలకు ప్రభుత్వం అందచేసే భూముల్లో మొదటి పంటకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి.. ఆ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి 3 ఎకరాల చొప్పున భూపంపిణీ చేయాలని సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఆర్డీఓలు, ఐకేపీ-డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు నెల రోజులుగా ఇదే పనిలో నిమగ్నయయ్యారు. భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడానికి ఇంకా రెండు రోజులమాత్రమే ఉంది. కానీ.. ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎంపిక చేయాలన్న దానిపై జిల్లా యంత్రాంగంలో స్పష్టత రాలేదు. ఒకట్రెండు రోజుల్లో తేలేది కాదు.. ముందుగా అధికారులు ప్రభుత్వ భూమి లభ్యత, అమ్మకానికి ఉన్న ప్రైవేట్ భూముల వివరాలు పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు సేకరించి కొన్ని గ్రామాలు ఎంపిక చేశారు. అవసరమైన మేరకు ప్రభుత్వ భూమి లేదని, అందుబాటులోకి వచ్చే భూమి సాగు యోగ్యం కాదని తేలడంతో పూర్తిగా ప్రైవేట్ భూమి కొనాలని నిర్ణయించారు. రైతుల నుంచి ప్రభుత్వ భూములు కొనుగోలు చేయడం ఒకటి, రెండు రోజుల్లో తేలే వ్యవహారం కాదు. అధికారులు చెల్లిస్తామని చెబుతున్న ధరకు గ్రామాల్లో మార్కెట్ ధరకు వ్యత్యాసం ఉంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ధరలకు భూములు అమ్మేందుకు రైతులు ముందుకు రావడంలేదు. కొన్నిచోట్ల ధర విషయంలో పెద్దగా సమస్య లేకున్నా... భూమి కొన్న తరువాత సాగునీటి కోసం బోర్లు వేయిస్తే నీళ్లు వస్తాయా... లేదా.. అనే విషయంలో అనుమానాలు ఉంటున్నాయి. పంట ఉత్పత్తి విషయంపై భూసార పరీక్షలు చేయిస్తే నేలసారం ఎలా ఉన్నది తెలుస్తుంది. ఇవన్నీ ఆర్డీఓలు పరిశీలించి భూములు సాగుయోగ్యమైనవని, నీటివనరులు అందుబాటులో ఉన్నాయని... లేదా... అందుబాటులోకి తేవచ్చని తేల్చాక ధర ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయాక అధికారులు భావించిన మేరకు ధరలు ఉండే పరిస్థితి కనిపించడంలేదు. ఈ అంశాలపై మంగళవారం కలెక్టర్ జి.కిషన్ సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
కూలీలు కాదు.. ఇక రైతులే
- భూ పంపిణీతో ఎస్సీ,ఎస్టీల్లో వెలుగులు - ప్రతిష్టాత్మకంగా అమలుకు చర్యలు - సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు కృషి - నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సిద్దిపేట అర్బన్: వ్యవసాయ ఆధారిత ఎస్సీ, ఎస్టీ కూలీలను రైతులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావువు అత్యంత ప్రతిష్టాత్మకంగా భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ కేసీఆర్ భూ పంపిణీ పథకాన్ని ఈ నెల 15న రాష్ట్రంలో ప్రారంభిస్తారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకెళ్లి ఎస్సీ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. భూ పంపిణీ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో కొనసాగిన ప్రభుత్వాలు సాగుకు యోగ్యం కానీ బంజరు భూములను లబ్ధిదారులకు అందజేసి భూ పంపిణీ చేశామనిపించారన్నారు. ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమినే లబ్ధిదారులకు అందజేస్తామని, అందుకు అవసరమయ్యే విద్యుత్ను, బోరు బావిని, విద్యుత్ మోటార్ను, మొదటి పంటకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు తదితర పెట్టుబడులను ఉచితంగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించి అందరికీ మూడు ఎకరాల సాగు భూమిని అందజేస్తామన్నారు. వివిధ గ్రామాల్లో ప్రభుత్వానికి అమ్మే భూములను గుర్తించి అధికారులు నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో భూ పంపిణీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. ప్రధాన మంత్రి ఢిల్లీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జాతీయ జెండాను ప్రథమంగా ఎగురవేయనున్నారని చెప్పారు. సమావేశంలో సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వైగిరి, నంగునూరు, చిన్నకోడూరు మండలాల తహశీల్దార్లు శ్రీహరి, వసంతలక్ష్మి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీపీలు ఎర్ర యాదయ్య, కూర మాణిక్యరెడ్డి, జాపశ్రీకాంత్రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
నాలుగు గ్రామాల్లో భూపంపిణీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితులకు భూపంపిణీకి యంత్రాంగం సిద్ధమైంది. నిర్దేశిత తేదీలో పథకం అమలు చేయాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగిన జిల్లా యంత్రాంగం నాలుగు గ్రామీణ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని వాటి పరిధిలో నాలుగు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. ఆగస్టు 15న వీరికి భూపంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాల్లో.. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో నాలుగు గ్రామాలను గుర్తించిన అధికారులు.. వాటి పరిధిలో 19 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి మూడెకరాల చొప్పున 57ఎకరాలు పంపిణీ చేయనున్నారు. దోమ మండలం గూడూరు పంచాయతీ పరిధిలో ముగ్గురు, నవాబ్పేట మండలం అర్కతల పంచాయతీ పరిధిలో ఆరుగురు, మర్పల్లి మండలం కల్కోడలో నలుగురు, బషీరాబాద్ మండలం మర్పల్లిలో ఆరుగురు చొప్పున గుర్తించారు. అయితే బషీరాబాద్ మండలం మర్పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సాగుభూమికి నీటి వనరుల లభ్యత కష్టంగా ఉందని అధికారులు తేల్చారు. దీంతో ఈ గ్రామానికి బదులుగా యాలాల మండలం చెన్నారంలో భూ సర్వే చేస్తుండగా.. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. రూ.కోటి యాైభై లక్షలతో.. ఆగస్టు 15న తలపెట్టే భూపంపిణీకి జిల్లా యంత్రాంగం రూ.1.5కోట్లు ఖర్చు చేస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేయగా.. వాటితో భూకొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మర్పల్లి మండలం కల్కొడలో మాత్రమే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా.. మిగతాచోట్ల సర్కారు విడుదలచేసిన నిధులతో భూమి కొనుగోలు చేస్తున్నారు. -
దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ
కనగల్ :దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవు లు తెలిపారు. కనగల్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని హైదలాపురంలో గురువారం ఆయన భూపంపిణీ పథకం లో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల తో సమావేశమయ్యారు. మొదటి విడత భూ పంపిణీకి ఎంపికైన ఆదిమల్ల లక్ష్మ మ్మ, మాధవి, సరిత, శివకుమారి, పగడాల అంజలి వివరాలను అడిగి తె లుసుకున్నారు. భూపంపిణీకి వీరు అర్హులేనా అని గ్రామసభలో ప్రజలను అడిగారు. గ్రామంలో సాగుకుయోగ్యమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఇతరుల నుంచి 17 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ వివరించారు. గ్రామ ంలో ఎకరం భూమి ఎంత ధర పలుకుతుందని కలెక్టర్ అడిగారు. సుమారు రూ 3లక్షల నుంచి రూ. 3.5 లక్షల దాకా పలుకుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకుయోగ్యమైన భూమిని లబ్ధిదారులకు చూపించి వారు నచ్చితేనే కొనుగోలు చేయాలన్నారు. దళితులకు పంపిణీ చేసే భూములను అమ్మడానికి కొనడానికి వీల్లేదన్నారు. ఒక వేళ క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిలేని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకవేళ అర ఎకరం, ఎకరం భూమి ఉన్నవారికి సైతం ఆ భూమి మినహా మిగతా భూమి ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలి పారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో హైదలాపురం గ్రామాన్ని భూపంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఆగస్టు 15న మహిళా లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేస్తామన్నారు. అనంతరం దళితులకు పంపిణీ చేసే భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ ఎండీ జహీర్, కనగల్ తహసీల్దార్ ఎం. వెంకన్న, ఆర్ ఐ ధర్మారెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, వీఆర్ఓ రాంచందర్రావు, సర్వేయర్ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో కూడా దళితులకు పంపిణీ చేయనున్న భూమిని కలెక్టర్ పరిశీలించారు. -
దళితుల భూములు క్షేమమేనా!
నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వం పలుమార్లు భూపంపిణీ చేపట్టినా వాటి ప్రయోజనం మాత్రం దళితులు పొందలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. భూమి దళితుల పేరున ఉంటే..దానిని ఇతరులు అనుభవిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేయనున్న మూడెకరాల భూమైనా దళితులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నాయి. జిల్లాలో 1982 నుంచి 2013 వరకు దళితులకు 6,149 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 6,060 మంది లబ్ధిదారులకు ఈ భూమిని అందించారు. అయితే ఇందులో ఎంత మంది దళితుల వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి ఉందో చెప్పడం కష్టమేనని అంటున్నారు. దళితులకు పంపిణీ చేసిన భూమిలో సగం వరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇటు భూపంపిణీ జరుగగానే అటు కబ్జాదారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎగురేసుకుపోతున్నారు. మరి కొందరు దళితులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి అడవులు, గుట్టల ప్రాంతంలో ఉండడంతో దళితులు సైతం సాగుచేయలేని స్థితిలో ఇతరులకు అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికారులు సైతం దళితుల భూమి అన్యాక్రాంతమవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. నిజామాబాద్ శివారులోని అర్సపల్లి ప్రాంతంలో ఒక కాంగ్రెస్ నాయకుడు, కొంతమంది వ్యాపారస్తులు కలిసి 20 ఎకరాల వరకు దళితుల భూమిని అక్రమించుకున్నారు. తాడ్వాయి, మాచారెడ్డి, బిచ్కుంద, మాక్లూర్ ప్రాంతాల్లో దళితులకు కేటాయించిన భూమి ఇతరుల స్వాధీనంలో ఉంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల భూములకు ఎసరు పెడుతున్నారని అరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులను ఊరించి, మభ్యపెట్టి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. డిచ్పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ వద్ద ఒక రాజకీయ నాయకుడు పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ మండలం ఎల్లమ్మకుంట వద్ద, నిజామాబాద్లోని 4వ పోలీస్స్టేషన్ ప్రాంతా లలో దళితుల భూములు అక్రమణకు గురయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం అన్ని ప్రభుత్వాల కంటే మరో ముందడుగు వేసింది. దళితులకు మూడు ఎకరాల భూమి కే టా యించేందుకు నిర్ణయించింది. జిల్లాలోని 3,393 మంది లబ్ధిదారులకు మొదటి విడతలోనే భూమిని అందిచాలని ప్రణాళిక రూపొందించారు. విడతలవారీగా దళితు లకు భూమి కేటాయించనున్నారు. -
పట్టా ఉంది.. భూమే లేదు!
యాచారం: పేదలకు భూపంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే. అయితే హడావుడిగా పట్టాలు పంచేసి.. హద్దులు చూపకపోవడంతో చాలా మంది రైతులు లబ్ధిదారులుగా మారుతున్నారు తప్ప.. వారికి ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులకు తమ భూమి ఎక్కడుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అర్హులైన రైతులకు భూమి చూపించి, హద్దులు గుర్తించి, సర్వేయర్తో మ్యాప్ తయారు చేయించిన తర్వాతే పట్టాలివ్వాలి. కానీ అలా చేయకపోవడం వల్ల వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం దళితులకు భూపంపిణీలో భాగంగా సాగుకు యోగ్యమైన భూమిని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్లోనే యాచారం మండలంలో మంతన్గౌరెల్లి గ్రామాన్ని ఎంపికచేసి అర్హులైనవారికి మూడెకరాల చొప్పున పంపిణీకి నిర్ణయించారు. గ్రామంలో అర్హులైన తొమ్మిది మంది రైతులను ఎంపిక చేశారు. గ్రామంలో దళితులకు భూపంపిణీ కింద సాగుయోగ్యమైన భూమిని పంపిణీ చేయడానికి అధికారులు నిర్ణయించడంపై నాడు పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. తమను కూడా ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని వారంతా కోరుతున్నారు. నేడు ఫిర్యాదుల బాట యాచారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా వందలాది పేద రైతులకు దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పలుమార్లు భూపంపిణీ కింద పట్టాలిచ్చింది. అప్పట్లో అధికారుల తప్పిదంవల్ల కొన్ని గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల్ని పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లోనైతే భూముల్లేకుండానే రైతులకు పట్టాలిచ్చారు. అప్పట్లో పేద రైతులు భూములు లేకున్నా పట్టాలిస్తేచాలు అనే తరహాలో పట్టాలు తీసుకున్నారు. ఏళ్లు గడిచినా వారికి భూములు చూపించలేదు. అధికారుల సర్వేలో పట్టాలు పొందిన రైతులకు భూములన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. దీనివల్ల భూములు లేకున్నా వారు నేడు భూపంపిణీకి అర్హులు కాకుండా పోయారు. నేడు ప్రభుత్వం సాగు భూములనే పంపిణీ చేయాలనే యోచనతో ఉండడం వల్ల నాడు పట్టాలు పొందిన రైతులు నేడు ఫిర్యాదుల బాట పట్టారు. సోమవారం మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన 15మందికి పైగా రైతులు నాడు భూములు లేకుండా పట్టాలిచ్చిన పుస్తకాలను తీసుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తమకు పట్టాలు మాత్రమే ఇచ్చారనీ, భూము లివ్వలేదని వాపోయారు. నాటి పట్టాలు రద్దుచేసి ప్రస్తుతం భూపంపిణీ ఎంపిక అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా నమోదు చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు రమేష్గౌడ్, తహసీల్దార్ వసంతకుమారికి ఫిర్యాదు చేశారు. మంతన్ గౌరెల్లి గ్రామంలోనే కాకుండా మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తాడిపర్తి తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులకు అప్పటి అధికారులు కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి భూమి చూపించలేదని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ వసంత కుమారిని సంప్రదించగా భూపంపిణీలో భూమి ఇవ్వకుండా పట్టాలిచ్చిన విషయమై వివరాలు సేకరిస్తామని అన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని అన్నారు. -
‘భూ పంపిణీ’ సాధ్యమేనా?
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని భూమిలేని దళిత నిరుపేదలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దళితబస్తీ పేరిట ఆగస్టు 15న పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో భూ పంపిణీ చేసేందుకు 170 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తిం చారు. వీరికి 510 ఎకరాల భూమి అవసరం. కాగా 41 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూ మి అందుబాటులో లేకపోవడంతో సమస్య వచ్చిపడింది. రూ. 16 కోట్లు అవసరం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున పది గ్రామాల్లో మొదటి దశలో 170 మందికి భూ పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. వీరికి ప్రస్తుతం 41 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మిగతా 469 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి నిరుపేదలకు పంచాలి. ఇందుకు రూ.16 కోట్లు అవసరం. భూ పంపిణీకి ప్రభుత్వం నిర్దేశించిన గడువు దగ్గర పడుతుండడం.. భూమి లభ్యతపై యంత్రాంగానికి స్పష్టత లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామంటున్న సర్కారు.. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయకపోవడం అధికారులను గందరగోళంలో పడేసింది. క్షేత్రస్థాయిలో జరగని లబ్ధిదారుల ఎంపిక మొదటి విడతలో భాగంగా 170 మంది కుటుంబాలకు లబ్ధిచేకూర్చేలా ప్రాథమికంగా ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు స్పష్టత లేదు. దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఇదివరకే అధికారులకు శిక్షణ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లే ఆ ఊరి ప్రజల జాబితా తీసుకెళ్లి మండలాధికారులకు అందజేశారనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తే తప్పా అర్హులకు మేలు జరిగే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. మండలానికో గ్రామం చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని గ్రామాల ఎంపిక పెండింగ్లో ఉంది. మొదటి దశలో నియోజకవర్గానికో గ్రామం చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులకు సులువైంది. వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమి లేకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే భూమి గుర్తించడానికైనా.. లేదా కొనుగోలు చేసేందుకైనా సమయం పడుతుంది. ఆగసుట 15లోగా ఇది సాధ్యం కాదని అధికారులే పేర్కొనడం గమనార్హం.