michelle obama
-
చంపేంత కోపం.. చచ్చేంత ప్రేమ.. పుకార్లకు ఒబామా దంపతుల ఫుల్స్టాప్ (ఫొటోలు)
-
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్కాస్ట్లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
ఒబామా దంపతులు విడిపోనున్నారా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్, ఆయన భార్య మిచెల్ ఒబామా(60) తమ వివాహ బంధానికి ముగింపు పలకనున్నారా? సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా ఒక్కరే హాజరురవుతారంటూ ఈ దంపతుల కార్యాలయం చేసిన ప్రకటనలే ఇందుకు బలం చేకూరుస్తోంది. అధికార కార్యక్రమానికి భర్త బరాక్ ఒబామాతో కలిసి మాజీ ప్రథమ మహిళ మిచెల్ గైర్హాజరవడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాళి కార్యక్రమంలో సైతం మిచెల్ పాల్గొనలేదు. అమెరికా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సతీసమేతంగా పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, లారా బుష్ దంపతులు హాజరుకానున్నారు. కాగా, ఒబామా దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్ని నెలలుగా వార్తలు వెలువడుతున్నాయి. జిమ్మీ కార్టర్ నివాళి, ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అందుకు ఆజ్యం పోశాయి. సామాజిక మాధ్యమ వేదికల్లోనూ వీరు విడిపోయారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. 1989లో డేటింగ్ ప్రారంభించిన బరాక్, మిచెల్లు 1992లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. -
ట్రంప్ గెలుపు... మహిళలకు ముప్పు: మిషెల్
కలమజూ (మిషిగన్): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్తో కలిసి హారిస్ ట్రాక్ హౌజ్ బార్ అండ్ గ్రిల్కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు. మహిళలకు అవకాశాలు: బైడెన్ హారిస్ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పిట్స్బర్గ్లోని లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఆయన మాట్లాడారు. కారి్మకులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కారి్మక ప్రయోజనాల కోసం ట్రంప్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: కమలాహారిస్కు గాయని బియాన్స్ మద్దతు -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
ఎట్టకేలకు కమలా హారిస్కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్కు మద్దతు ప్రకటించారు. -
అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ అవుట్?.. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో బైడెన్ను మార్చే అవకాశం ఉందని తెలిపారు.కాగా నవంబర్లో అమెరికా అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్ను భర్తీ చేసే మార్గాలపై చర్చిస్టున్నట్లు తెలుస్తోంది.బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆయన మాట్లలో బొంగురు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, సమాధానలు చెప్పడంలో, ఆలోచనలను వివరించడంలో తడబాటు.. వంటి పలు కారణాలతో బైడెన్ను రేసు నుంచి తప్పించాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిడెన్ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాలని చూస్తుందని చెప్పారు టెడ్ క్రూజ్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియమించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు తెలిపారు. -
USA: బైడెన్ వద్దు.. మిషెల్లీ ఒబామా బెటర్.. ఆసక్తికర పోల్స్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans . She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth. Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67 — Prashant shah (@prashantsapp) February 28, 2024 ఇక, అదే సమయంలో బైడెన్ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. -
పిలల్ల పెంపకంలో ఆ తప్పులు చెయ్యొద్దంటున్న మిచెల్ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా సోషల్ మీడియా ఇంటర్యూలో పిలల్ల పెంపకం గురించి మాట్లాడరు. పిల్లలను చక్కగా పెంచడం అనేది ఓ యజ్ఞం లాంటిదని అన్నారు. ఎందుకుంటే మనం చెప్పేవి వాళ్ల మంచికేనని తెలియాలి, అదే టైంలో తల్లిదండ్రులు వాళ్లకు విలన్స్ కాదు శ్రేయోభిలాషులు అనే నమ్మకం కలిగించాలి. అంతేగాదు ఆమె పిల్లల పెంపకం అనేది చాలా కష్టమైన పని అని, అది కత్తి మీద సాములాంటిదని అన్నారు. ఏ మాత్రం మనం అజాగ్రత్తతతో లేదా నిర్లక్ష్యపూరితంగా వ్యహరిస్తే వారి భవిష్యత్తు నాశనమవ్వడం తోపాటు మనకు తీరని మనోవ్యధే మిగిలుతుంది అని చెబుతున్నారు మిచెల్. తాను ఈ విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న మెళుకువలే తన ఇద్దరి పిల్లల పెంపకంలో ఉపయోగపడ్డాయిని చెబుతోంది. అందుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మిచెల్. అవేంటంటే.. పిల్లలు తమంతట తామే పెరుగుతారు. వారికి ఎదిగే క్రమంలో మన సాయం కావాల్సిన చోటల్లా భరోసా ఇస్తే చాలు. వారే చుట్టూ ఉన్న వాతావరణం, తమ స్నేహితులు, బంధువుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. పైగా తెలివిగా అభివృద్ధి చెందుతారు. ఆ క్రమంలో పిలల్లు కొన్ని తప్పులు చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది తప్పు, ఇది కరెక్ట్ అనేంత మెచ్చూరిటీ లెవెల్స్ పిలల్లకు ఉండవు. మనం చేసే ఒక్కో పని సంక్రమంగా లేకపోతే ఎంత పెద్ద సమస్యను సృష్టిస్తుందనేది కూడా వాళ్లు అంచనా వేసేంత బ్రెయిన్ వాళ్లకు ఉండదు. కాబట్టి పిల్లలను తెలివిగా, సక్రమంగా పెంచాలంటే ఈ సింపుల్ మెళుకువలు పాటిస్తే ఎంతటి మొండి పిల్లలైనా తీరు మార్చుకుంటారు. కాస్త సమయ తీసుకున్నప్పటికీ మంచి పిల్లలుగా గుర్తింపు తెచ్చుకుంటారని అన్నారు. మిచెల్ చెప్పే మెళుకువలు.. పిల్లలను నేరుగా విమర్శించొద్దు.. చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు ఇదే అని మిచెల్ అంటున్నారు. మీరు పిల్లలను మంచి కోరే నేరుగా వాళ్ల చేస్తుంది తప్పు అని చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్లు మనం అన్నమాటలు ఎలా తీసుకుంటున్నారనేది గమనించకపోతే పేరెంట్స్కి, పిల్లలకు మధ్య ఉండే బాండింగ్ దెబ్బ తింటుంది. మిమ్మల్ని శత్రువులుగా చూసే ప్రమాదం ఎక్కువగా ఉంది. పిల్లలు తమ తప్పును వాళ్లే గుర్తించేలా విడమర్చి చెబుతూ మిమర్శనాత్మకంగా చెప్పండి. అంతేగాదు పేరెంట్స్ మీరు క్షమించినా, బయట ఇలా చేస్తే వాళ్లను ఎలా చూస్తారనేది అర్థమయ్యేలా వివరించాలి. ఇలా చేస్తే పిల్లలు పేరెంట్స వద్ద ఎలాంటి దాపరికలు లేకుండా ఫ్రెండ్లీగా మెలుగుతారు. బాధ్యతలను తీసుకునేలా చేయాలి.. చాల మంది తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పులు చేస్తున్నారని మిచెల్ అంటున్నారు. పిల్లలు అమాయకులు, ఎంత ఎదిగినా చిన్నవాళ్లే అనే భావనల నుంచి పేరెంట్స్ ముందు బయటకు రావాలి. వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కారించాలనే ఆలోచన డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడే వాళ్లలోని దాగున్న ప్రతిభ, సామర్థ్యాలను బయటకు వస్తాయి. ఇక్కడ బాధ్యతలు అనగానే ప్రతీది కాదు వారు చేయగలిగేలా, ప్రయోజనం చేకూర్చేవి, తప్పక నేర్చుకోవాల్సిన బాధ్యతలు చిన్న చిన్నగా ఇవ్వండి. రాను పిల్లలకు తెలియకుండా నా కుటుంబం కోసం నేను ఇది చేయాలనే అవగాహన రావడమే గాక ఇది తన బాధ్యత అనే స్థాయికి చేరుకుంటారని అంటున్నారు మిచెల్. సమస్యలతో పోరాడనివ్వండి.. తల్లిదండ్రులుగా మనం రక్షణగా ఉన్నప్పటికీ వారు వ్యక్తిగతంగా ఏదోఒక సమయంలో వారికి వారే పోరాడాల్సి ఉంటుంది. అందువల్ల చిన్న సమస్యలను వాళ్లు ఎలా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారో చూడండి. వెళ్తున్న దారి కరెక్టే అయితే ధైర్యం ఇవ్వండి. ఒకవేళ్ల తప్పుదోవలో సమస్య పరిష్కరించేందుకు చూస్తుంటే అడ్డుకుని వివరించండి. ఈ విధానం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కెరీర్ పరంగా వచ్చే సమస్యలను, ఒత్తిడులను జయించగలిగే శక్తిని ఇస్తుంది . తప్పిదాల నుంచే విజయం పొందడం ఎలా..? ఒక పని చేస్తున్నప్పుడూ పదే పదే ఫెయ్యిల్యూర్లు వస్తుంటే.. అక్కడితో నిరాశగా ఢీలా పడిపోకుండా ముందుకు నడవడం ఎలా అనేది తెలియజేయండి. ఎన్ని ఓటములు ఎదురైనా.. పాజిటివ్ ఆటిట్యూడ్ని వదలకూడదు, ఓడిపోయానని చేతులెత్తేయకూడదని చెప్పండి. చివరి నిమిషం వరకు విజయం కోసం వేచి చూసే స్పూర్తిని నేర్పించండి. తప్పిదాలనే విజయానికి బాటలుగా చేసుకోవడం ఎలా అనేది వివరించండి. ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తుల గూర్చి కథకథలుగా చెప్పండి. అప్పుడూ వాళ్లకు సక్సెస్ అనేది అందుకోలేని బ్రహ్మపదార్థంలా కనిపించదు. అలాగే ప్రస్తుత పరిస్తుతలను చూసి చాలామంది తల్లిదండ్రులు మనోడు మంచిగా ఉంటాడా? అని ఆందోళన చెందకూడదు. నిజానికి బయట పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మీరు వారితో వ్యవహరించే విధానం బాగుంటే ఆందోళనకి చోటు ఉండదనే విషయం గుర్తెరగాలి. అంతేగాదు చెడు అలవాట్ల జోలికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ మనసు లాగినా పేరెంట్స్ మీదున్న గౌరవం ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా చేస్తుంది అని చెబుతున్నారు. నిజంగా మిచెల్ చెప్పిన మెళుకువలు ప్రతి తల్లిదండ్రులు అనుకరిస్తే పిల్లలు మంచిగా పెరగడమే కాకుండా దేశానికి మంచి పేరు కూడా తెస్తారు కదూ. (చదవండి: ఇన్నోవేటర్స్..తక్కువ ఖర్చుతో అద్భుత ఆవిష్కరణలు!) -
ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అరగంట ఏడ్చాను: మిచెల్ ఒబామా
వాషింగ్టన్: 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున వైట్హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వెల్లడించారు. ది లైట్ పాడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయలను గుర్తుచేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తాము వైట్హౌస్ను విడిచిపెట్టడం చాలా బాధగా అనిపించిందని, ఆ క్షణాల్లో ఆమె పడిన అవేదనను తలుచుకుంటూ అప్పటి విషయాలను చెప్పుకొచ్చారు. తెలియన బాధ... అరగంట ఏడ్చాను ట్రంప్ ప్రమాణస్వీకారం రోజు అనేక కారణాల వల్ల ఆ రోజు కన్నీళ్లు కూడా వచ్చినట్లు చెప్పారు. వైట్హౌస్తో తమకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉందని, అది తమ పిల్లలకు తెలిసిన ఏకైక ఇల్లుగా పేర్కొన్న మిచెల్.. ఆ ఇంటిని విడిచిపెట్టే రోజు చాలా ఉద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. మా పిల్లల స్వస్థలం చికాగో అయినప్పటికీ, వాళ్లు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్హౌస్లో గడిపారన్నారు. వీటితో పాటు అక్కడ పని చేసే సిబ్బందితో కూడా బంధం ఏర్పడిందని, వారిని వదిలిపెట్టాల్సి రావడం కూడా బాధగా అనిపించిందన్నారు. ఈ విషయంపై ఆమె కొనసాగిస్తూ.. ‘ఆ రోజు ఎందుకో నాలో కన్నీళ్లు, భావోద్వేగం ఉన్నాయి. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్పై మేము కనిపిస్తున్నాం. ఆ వేదికపై ఎలాంటి వైవిధ్యం, కళ లేదు. అమెరికా విశాల భావానికి ప్రతిబింబం లేదు’ అని భావోద్వేగంతో వెల్లడించారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్లో ఎక్కిన మరుక్షణం తనలో దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక 30 నిమిషాలు నిర్విరామంగా ఏడ్చానని మాజీ ప్రథమ మహిళ అప్పటి విషయాలును గుర్తుచేసుకున్నారు. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్
అమెరికా మాజీ ప్రథమ మిచెల్ ఒబామాకి తరుచుగా ఎదరవుతున్న ప్రశ్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారా? లేదా అని. ఈ ప్రశ్న ఆమెకి తన భర్త ఒబామా అధ్యక్షుడిగా (2009 నుంచి 2017) ఉన్న సమయంలో కూడా ఈ ప్రశ్న ఎదురైంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అంటూ పలువురు ఇప్పటికీ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె ఈ విషయమై స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు మిచెల్. ప్రస్తుతం జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా చక్కగా పాలిస్తున్నారని, అతని పరిపాలనలో ప్రారంభించిన కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అలాగే బైడెన్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కూడా ఆమె చాలా తెలివిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఇది బైడెన్, అతని కుటుంబం అలోచించుకోవాల్సిన విషయం. ఇది పూర్తిగా బైడెన్ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. అలాగే బైడెన్, జిల్ బైడెన్ ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆలోచించే మిలియన్లమంది వ్యక్తులలో ఒకరిగా తాను ఉండాలనుకోవడం లేదు’ అంటూ కౌంటరిచ్చారు. అయితే ఆమె బైడెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారా అనే దానికి పూర్తి అంగీకారం ఇవ్వకుండా పరోక్షంగా చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పకనే చెప్పారు. (చదవండి: అమెరికాలో ట్రంప్ ఫెయిల్: బైడెన్) -
పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుక సందర్భంగా దక్షిణ భారత వస్త్రాధారణలో మెరిసిపోతున్నాడు. ఆయన భార్య మిచెల్, కూతుళ్లు కూడా భారత సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు అనే క్యాప్షన్ని జోడించి మరీ ఒబామ్ కుటుంబం ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలో కింద హ్యాపీ దీపావళి అని కూడా ఉంది. వాస్తవానికి అవి మార్ఫింగ్ ఫోటోలే అయినపట్టికీ ఆ ఫోటోలు అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి ముంచెత్తించి.. కళ్తు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని ప్రభుత్వ స్కూల్స్కి 2023 నుంచి దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించనుందట. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్కుమార్లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేగాదు దీపావళిని జరుపుకునే హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన సుమారు 2 లక్షల మంది న్యూయార్క్ వాసులను గుర్తించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని రాజకుమార్ ఈ సందర్భంగా అన్నారు. పైగా జూన్ మొదటి గురువారం జరుపుకునే వార్షికోత్సవాన్ని దీపావళిగా మార్చి మరీ సెలవు ప్రకటించనుంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ ఫోటోలను చూసి ఆయన భారత్ ఒబామా అని ఒకరు కిర్రాక్ ఒబామ అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. obama’s Diwali party outfit pic.twitter.com/Ny7c1Jl6le — bad bitch in booties 👢 (@lilcosmicowgirl) October 18, 2022 (చదవండి: భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు) -
వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు
వాషింగ్టన్: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్ ఒబామా దంపతులు 2017లో వైట్ హౌస్ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్హౌస్కి తిరిగి వచ్చారు. ఇది అమెరికా వైట్ హౌస్ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు జో బైడెన్ ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్ ఒబామా దంపతులకు వైట్హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్ అన్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్ హౌస్లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్ బైడెన్ అన్నారు. అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్ బైడెన్. ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్ చేపట్టింది. తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్కర్డీ, మిచెల్ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్గా బైడెన్ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. I want to thank Robert McCurdy for his extraordinary work on my portrait. Robert is known for his paintings of public figures, and I love how he paints people exactly the way they are. Take a look at the process behind creating the official White House portraits: pic.twitter.com/oZb6ov4uwr — Barack Obama (@BarackObama) September 7, 2022 (చదవండి: స్వీట్ బాక్స్లో ఏకంగా రూ.54 లక్షలు) -
మిచెల్ ఒబామాపై జో బైడెన్ కామెంట్స్.. ఖంగుతిన్న అమెరికన్లు..!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పులో కాలేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆదివారం అమెరికా అణుసబ్మెరైన్ యూఎస్ఎస్ డెలావేర్ను అధికారికంగా విధుల్లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఇచ్చిన స్పీచ్లో బైడెన్ తప్పుగా వ్యాఖ్యానించారు. బైడెన్ ప్రసంగిస్తూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా గురించి ప్రస్తావించిన ఆయన.. మిషెల్ను మాజీ ఉపాధ్యక్షురాలు అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా మిషెల్ ఒబామా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైన పలు కార్యక్రమాలను ప్రస్తుతం ఉన్న ప్రథమ మహిళ ముందుగా తీసుకెళుతున్నారని ప్రశంసించారు. అయితే, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాను ప్రథమ మహిళ అని పిలవాల్సి ఉండగా.. బైడెన్ తప్పుగా ఉపాధ్యక్షురాలు అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Does Biden think Michelle Obama was Vice President? pic.twitter.com/SyzKLsu378 — Benny (@bennyjohnson) April 2, 2022 -
‘‘ఎలా మొదలైంది..ఎలా కొనసాగుతోంది’’ భావోద్వేగ పోస్ట్ వైరల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్లీ ఒబామా దంపతులు తమ సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ వార్షికోత్సవం, వాలెంటైన్స్ డేకి పరస్పరం అభినందిచుకోవడం ఈ దంపతులకు అలవాటు. ఈ క్రమంలో అక్టోబరు 3 ఆదివారం, 29 వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిచెల్లీ ఒక పోస్ట్ పెట్టారు. తన హబ్బీ కోసం పెట్టిన ఒక స్వీట్ పోస్ట్ వైరల్గా మారింది. దీంతో ఈ ఒబామా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రెండు ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పటికే 2.7 మిలియన్లకు పైగా లైక్స్ను సాధించడం విశేషం. అందమైన జంట..హ్యాపీ యానివర్సరీ కమెంట్ల జోరు కొనసాగుతోంది. తమ పెళ్లి రోజు సందర్భంగా మెచెల్లీ భర్త ఒబామాకు ఇన్స్టాగ్రామ్లో విషెస్ అందించారు. ఎలా ప్రారంభమైంది.. ఎలా కొనసాగుతోంది అంటూ తమ అపురూపమైన జర్నీని గుర్తు చేసుకున్నారు. లవ్ యూ బరాక్ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఒబామాతో కలిసి ఉన్న అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను షేర్ చేశారు. కాగా 1992, అక్టోబర్ 3 న వివాహం చేసుకున్నారు ఒబామా, మిచెల్లీ. వీరికి మలియా (23) సాషా (20) ఇద్దరు సంతానం. గత ఏడాది తమ 28వ వార్షికోత్సవ సందర్భంగా 2020 అధ్యక్షఎన్నికల్లో జోబైడెన్ విజయంకోసం ఓటువేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Michelle Obama (@michelleobama) -
మిషెల్ మిమ్మల్ని ఎంత గౌరవించారు.. మీరేంటిలా?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. వివాదాలు, విమర్శల విషయంలో అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ట్రంప్ రికార్డును సమం చేయలేరు. ఇక అధ్యక్ష ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ట్రంప్ మరిన్ని వివాదాస్పద చర్యలకు పూనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేయడం.. ఆ తర్వాత ట్రంప్పై అభిశంసన ప్రవేశపెట్టడం వంటివి చోటుచేసుకున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. రేపు జో బైడెన్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి తాము హాజరు కాబోవడం లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుత ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్పై కూడా నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. వైట్ హౌస్ సంప్రదాయలను పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘మీ కన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా దంపతులు మీ విషయంలో ఎంత గౌరవంగా.. హుందాగా ప్రవర్తించారు.. మరి మీరేంటిలా’ అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) నెటిజనులు మెలానియాను ఇంతటా ట్రోల్ చేయడానికి కారణం ఏంటంటే ఆమె భవిష్యత్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ను ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్కి ఆహ్వానించలేదు. అధికార పరివర్తనలో భాగంగా ప్రస్తుత ఫస్ట్ లేడి.. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కార్యక్రమం కన్నా ముందే భవిష్యత్ ఫస్ట్లేడీని ప్రైవేట్ లివింగ్ క్వార్టర్స్కి ఆహ్వానిస్తారు. బ్రెస్ ట్రూమన్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం మిషెల్ ఒబామా వరకు అందరు పాటించారు. ఇక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన భర్త పౌరసత్వానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి.. మిషెల్ ఒబామా వాటిని మనసులో పెట్టుకోలేదు. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా, తన భర్తతో కలిసి వెళ్లి మెలానియాను సాదరంగా ఆహ్వానించారు. కానీ ప్రస్తుతం మెలానియా ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఇప్పటివరకు ఆమె భవిష్యత్ ఫస్ట్ లేడి జిల్ బైడెన్ని కనీస పలకరించిన దాఖలాలు కూడా లేవు. (చదవండి: శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు) Michelle Obama graciously hosted Melania Trump at the White House immediately after 2016 election to ensure a smooth transition. Melania Trump has done absolutely nothing for Dr. Jill Biden. Some people are givers, others takers: pic.twitter.com/lBYWe32wkR — Michael Beschloss (@BeschlossDC) January 18, 2021 దాంతో నెటిజనలు మెలానియాను విమర్శిస్తున్నారు. కొందరు(ఒబామా లాంటి వాళ్లు) ఇవ్వడానికి ఉంటే.. మరికొందరు(ట్రంప్ ఆయన భార్య మెలానియా) లాంటి వాళ్లు తీసుకోవడానికే ఉంటారని దుయ్యబడుతున్నారు. ఇక తన ఫేర్వెల్ మెసేజ్లో మెలానియా అమెరికన్లు తమ ఉత్తమమైన చొరవను అనుసరించాలని.. హింస ఎన్నడూ సమాధానం కాదని స్పష్టం చేశారు. -
శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు
పెద్దయ్యాక ఏమౌతావ్? పిల్లల్ని అడుగుతాం. వాళ్లకేం తెలుసు ఏమవ్వాలో?! ఏదో ఒకటి చెబుతారు. అవడానికి ఏమేం ఉన్నాయో.. ముందు మనం చెప్పాలి వాళ్లకు. శ్యామ్ చెబుతున్నాడు. యు కెన్ బి ఎనీ థింగ్’అంటూ.. పెద్దయ్యాక ఏమేం అవొచ్చో ‘ర్యాప్’ డ్యాన్స్తో చూపిస్తున్నాడు. శ్యామ్ని చూసి.. మిషెల్ ముగ్ధులైపోయారు. శ్యామ్ వైట్కి ఆరేళ్లు. నల్లవాళ్లబ్బాయి. ర్యాప్తో సీన్లోకి వచ్చాడు! ‘ఆల్ఫాబెట్ ర్యాప్’ అని.. వాళ్ల డాడీ శ్యామ్ పాడి, ఆడిన ఆ వీడియోకి పేరు పెట్టాడు. ఆఫ్రికన్ స్టెయిల్లో చేతులు, తల ఆడిస్తూ ఎ ఫర్ ఆర్కిటెక్ట్, బి ఫర్ బయోకెమిస్ట్.. అని శ్యామ్ తీసిన దిద్దనక రాగాల ర్యాప్ను చూసి మిషల్ ఒబామా కూడా నవ్వును ఆపుకోలేకపోయారు! వాడి ఫీలింగ్స్, ఆ ఊగడం అది. ‘‘నాకు తెలుసు. ఇవి ఒత్తిళ్లతో కూడిన కాలాలు. ఈ వీడియో నా ముఖంపై స్ట్రెస్ను పోగొట్టి నన్ను ఆహ్లాదపరిచింది. అందుకని మీకు షేర్ చేస్తున్నాను. మనమంతా మన కిడ్స్ కోసం ఒక్కక్షణం ఆగి ఆలోచించేలా చేస్తాడు శ్యామ్. భవిష్యత్తులో వాళ్లను ఎలా చూడాలని అనుకుంటున్నామో మనకో ఆలోచన ఉంటుంది. అయితే శ్యామ్ ‘ఎబిసి ర్యాప్’ వెర్షన్ వేరేలా ఉంది. తనేం అంటాడంటే.. ‘యు కెన్ బి ఎనీ థింగ్’ అంటాడు. అవును. పిల్లల్ని తమకు ఇష్టమైన కలను కనమని శ్యామ్ చెబుతున్నాడు’’ అని మిషెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. శ్యామ్ కెమెరాను చూస్తూ నిలబడి పాడుతుంటాడు. తండ్రి బాబీ వైట్ కొడుకు వెనుక బల్ల ముందు కూర్చొని బీట్ ఇస్తుంటాడు. అదొక లయబద్ధమైన స్ఫూర్తి గీతం. రెండున్నర నిముషాల క్లిప్. ఇలా మొదలౌతుంది. ముందు తండ్రి అతడిని అడుగుతాడు. పెద్దయ్యాక ఏమౌతావ్ అని. ఏమైనా అవ్వొచ్చు అంటాడు శ్యామ్! ‘అంటే?’ అని తండ్రి అడుగుతాడు. ఇక శ్యామ్ ప్రారంభిస్తాడు. యు కెన్ బి ఎ ‘ఎ’.. యు కెన్ బి యాన్ ఆర్కిటెక్ట్! క్యాచ్ ఎ బిల్డింగ్ టు కిస్ ద స్కై. (నువ్వు ఆర్కిటెక్ట్ అవొచ్చు. ఆకాశాన్ని కిస్ చెయ్చొచ్చు.) యు కెన్ బి ఎ ‘బి’. యు కెన్ బి ఎ బయోకెమిస్ట్. మేక్ మెడిసిన్స్.. సేవ్ లైవ్స్. (నువ్వు బయోకెమిస్ట్ కావొచ్చు. మందులు కనిపెట్టి, ప్రాణలను నిలపొచ్చు). యు కెన్ బి ఎ ‘సి’. కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలపర్. (నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. ప్రోగ్రామ్స్ రాయొచ్చు)... ఇలా ఎ టు జడ్.. ర్యాప్ సాగుతుంది. శ్యామ్ పాటకు, స్టెప్స్కి చక్కగా జోడీ కుదిరింది. కొరియోగ్రఫీ కూడా శ్యామ్దే! ఎ నుంచి జడ్ వరకు ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. కెమెరా వైపు చూస్తూ శ్యామ్ ర్యాప్ కొట్టడానికి టెలీ ప్రాంప్టరేం లేదు. గుర్తుపెట్టుకున్నాడు! ర్యాపింగ్ నైపుణ్యాలను మధ్యమధ్య కుమారుడికి కొంత అద్దాడు తండ్రి. ‘యు కెన్ బి ఎ ‘డి’. ఎ డెంటిస్ట్. బికాజ్ ఎవ్రీబడీ లవ్స్ టు స్మైల్ అన్నప్పుడు.. నవ్వినట్లుగా పెదవులను సాగదీయమని చెబుతాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్లో చివరికి వచ్చేసరికి ఎవరికైనా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వీడియో చూస్తూ ఉన్నప్పుడు మనకూ అనిపిస్తుంది ఈ పిల్లాడు ఎక్స్, వై, జడ్లకు ఏం చెబుతాడో అని. జడ్ కి ‘జలస్లీ స్ట్రైవ్’ అంటాడు. అసూయతో రగిలిపోతూ కష్టపడి సాధించమని. ‘వై’కి యువర్ ఓన్ బాస్ అంటాడు. నువ్వే నీకు బాస్వి కమ్మని. ‘ఎక్స్’ ప్రత్యేకంగా చెప్పలేదు. సమ్ ‘ఎక్స్’.. ఏదైనా అవ్వు కానీ, సోమరిగా మాత్రం ఉండిపోకు అని చెబుతాడు. ర్యాప్ ముగియగానే తండ్రి ఆనందం పట్టలేక గట్టిగా పిడికిలితో బల్లను గుద్దుతాడు. ఈ తండ్రీ కొడుకులది యు.ఎస్.లోని టెన్నెనీ రాష్ట్రంలోని మెంఫిస్. శ్యామ్ తన కడుపులో ఉండగా శ్యామ్ తల్లి పుస్తకాలు బాగా చదివారట. రెండేళ్ల వయసులోనే శ్యామ్ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నించేవాడని కూడా ఈ ‘యు కెన్ బి ఎనీథింగ్’ ర్యాప్కి వచ్చిన స్పందనకు చూసి ఆ తల్లి ఉప్పొంగిపోతూ చెబుతున్నారు. స్టెఫానీ ఆమె పేరు. గత సెప్టెంబరులోనే శ్యామ్కు ఆరో ఏడు వచ్చింది. తండ్రి రాసి ఇచ్చిన ఏబీసీ ర్యాప్ను లిరిక్ లైన్స్ గుర్తుపెట్టుకుని పాడటానికి శ్యామ్ యాభైసార్లకు పైగా మననం చేసుకున్నాడు. ఇప్పటికింకా వైరల్ అవుతూనే ఉన్న ఈ వీడియోకు గత ఐదు రోజుల్లో యూట్యూబ్లో రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫేస్బుక్లో మూడు లక్షలసార్లు షేర్ అయింది. నువ్వు ఏమైనా అవొచ్చు అంటున్న శ్యామ్.. ఇంతకీ తను ఏమవ్వాలని అనుకుంటున్నాడు? ఆర్కెటెక్ట్ అవుతాడట. ఆకాశాన్ని చుంబించే భవంతులకు ప్లాన్లు గీయడం కోసం. View this post on Instagram Robert Samuel raps about career choices for kids. A post shared by Sam (@rsamuelw3) on Oct 26, 2020 at 12:14pm PDT -
జో బిడెన్ను గెలిపించండి : మిషెల్లి ఒబామా
వాషింగ్టన్ : ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, కరోనా మహహ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జో బిడెన్ కృషిచేస్తారని మాజీ అమెరికా ప్రథమ మహిళ మిషెల్లి ఒబామా అభిప్రాయపడ్డారు. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో జో బిబెన్ను అద్యక్షుడిగా ఎన్నుకోవాల్సిందిగా కోరారు. డెమొక్రటిక్ కన్వెన్షన్ నైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిషెల్లి ఒబామా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బిడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారని, ఆయన పనితనం ఏంటో తనకు తెలుసునని అన్నారు. స్మార్ట్ ప్రణాళికలు రచించి తన జట్టులోని సభ్యులను ముందుకు నడిపిస్తారని, ఎంతో మార్గదర్శకంగా పనిచేస్తారని కొనియాడారు. ఆర్థక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, కరోనా మహమ్మారి నుంచి రక్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో బిబెన్కు బాగా తెలుసనని మిషెల్లి అభిప్రాయపడ్డారు. (ఆమె మొదటిది కానీ చివరిది కాదు) ఇవి అత్యంత ప్రమాదకరమైన ఎన్నికలు : ట్రంప్ బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలా నిజాయితీగా, జవాబుదారితనంతో పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోవిడ్ లాంటి అంటువ్యాధిని ఎదుర్కోవడంలో ట్రంప్ విఫలమయ్యారని మిషెల్లి ఒబామా ఆరోపణలు గుప్పించారు. శాస్ర్తవేత్తలు, డాక్టర్లు ఈ మహమ్మారి గురించి ఎప్పటినుంచో అలర్ట్ చేసినా ట్రంప్ అవేవీ పట్టనట్లు ఉన్నారని, దాని మూలంగానే నేడు దేశంలో కరోనా విజృంభణ ఈ స్థాయిలో ఉందని మండిపడ్డారు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విస్కాన్సిన్, మిన్నెసోటాలో కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఫైర్ అయ్యారు. ఇక అమెరికాలో నవంబరులో జరగునున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. డెమాక్రాట్ అభ్యర్థులుగా జో బిడెన్, కమలా హ్యారిస్ను ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ ఏదో ఒక విధంగా నోరు పారేసుకుంటునారు. ఓష్కోష్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వారిద్దరూ గెలిస్తే పిచ్చి సోషలిస్ట్ విధానాలను అమలు చేస్తారని ఆరోపించారు. అమెరికాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యంత ప్రమాదకరమై ఎన్నిక అని ట్రంప్ అన్నారు. వాళ్లను గెలిపిస్తే అమెరికా మరో వెనిజులాగా మారుతుంది అని ఆరోపించారు. (డెమోక్రాటిక్ అభ్యర్థులపై నోరు పారేసుకున్న ట్రంప్) -
కమలా హ్యారిస్పై మిషెల్ ఒబామా భావోద్వేగ పోస్ట్
వాషింగ్టన్ : భారత సంతతికి చెందని కమలా హ్యారిస్ అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. ఈ విషయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లి ఒబామా హర్షం వ్యక్తం చేశారు. రంగుతో సంబంధం లేకుండా ఓ మహిళ తనను తాను ఎంతో గొప్పగా ఎదిగిన తీరును ప్రశంసించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కమలా హ్యారీస్పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది. ఈ సందర్భంగా మిషెల్లీ మాట్లాడుతూ...''మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఈ యుద్ధంలో మీ పనితనంపై విమర్శలు చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. మీరు ఈ పదవికి అర్హురాలు కాదని నినదించే వాళ్లూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీ పనితనంపై మాకు నమ్మకం ఉంది. చిన్న వయసులోనే మీ లక్ష్యాన్ని చేరేందుకు శ్రమిస్తున్నారు. (కమలా హ్యారిస్పై నోరు పారేసుకున్న ట్రంప్) మార్పు నెమ్మదిగా రావచ్చొమో కానీ కశ్చితంగా మొదలవుతుంది. మీ పురోగతికి సంకేతాలు కనిపిస్తున్నాయి. జమైకా, భారతీయ మూలాలున్న ఓ వలసదారుల కుమార్తె నేడు ఓ ప్రధాన పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మొదటి నల్లజాతి మహిళగా, ఆసియా-అమెరికన్ మహిళగా మీరు రికార్డు నెలకొల్పారు. నవతరం అమ్మాయిలు సైతం తమలాగే కనిపించే వారు కూడా అధ్యక్షులుగా ఎదిగి దేశాన్ని ముందుకు నడిపించవచ్చు అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. వారిలో కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని రేకిత్తించారు. ఎందుకంటే కమలా హ్యారిస్ మొదటివారు కావచ్చు కానీ చివరివారు కాదు'' అంటూ ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చదువుతున్నంత సేపు గూస్బంప్స్ వచ్చాయి అంటూ పలువురు ఉద్వేగానికి లోనయ్యారు. ఇక విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్ను తన లెఫ్ట్నెంట్గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. (నేనెప్పుడు దోశ వేయలేదు: కమలా హారిస్) View this post on Instagram You get used to it, even as a little girl—opening the newspaper, turning on the TV, and hardly ever seeing anyone who looks like you. You train yourself to not get your hopes up. And sometimes it’s a battle just to keep telling yourself that you might deserve more. Because no matter how much you prepare, no matter what grades you get or even how high you rise at work, it always feels like someone is waiting to tell you that you’re not qualified. That you’re not smart enough. That you’re too loud or too bossy. That there’s just something about you…you’re just not quite the right fit. Change can be slow and frustrating, but signs of progress are all around us. This week Senator @KamalaHarris, the daughter of Jamaican and Indian immigrants, became the first Black woman and first Asian-American woman on a major party’s presidential ticket. I’ve been thinking about all those girls growing up today who will be able to take it for granted that someone who looks like them can grow up to lead a nation like ours. Because @KamalaHarris may be the first, but she won’t be the last. I am here for it all. Let us embrace and celebrate this moment. Go get ‘em girl. 💪🏾 A post shared by Michelle Obama (@michelleobama) on Aug 13, 2020 at 12:07pm PDT -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
ఫస్ట్ లేడీ
అమెరికన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న వ్యక్తి భార్యను ఫస్ట్ లేడీ అని సంబోధిస్తారు. హాలీవుడ్లో ప్రస్తుతం ‘ఫస్ట్ లేడీస్’ అనే టైటిల్తో ప్రెసిడెంట్ సతీమణులపై ఓ సిరీస్ రూపొందబోతోంది. ఈ సిరీస్ మొదటి సీజన్లో అమెరికాకు ప్రెసిడెంట్లుగా వ్యవహరించిన ఇలియానోర్ రూజ్వెల్ట్ , బెట్టీ ఫోర్డ్, ఒబామా భార్యల కథలను చర్చించనున్నారు. ఇందులో ఒబామా భార్య మిచ్చెలీ ఒబామా పాత్రలో వయోలా డేవిస్ నటించనున్నారు. ‘మిచ్చెలీ లాంటి ధైర్యవంతురాలు, ఎక్స్ట్రార్డినరీ ఉమెన్ పాత్ర చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది’ అని డేవిస్ అన్నారు. -
అధ్యక్ష ఎన్నికల బరిలో మిషెల్ ఒబామా..!?
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా.. దేశ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె బరిలో దిగబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించగల శక్తి మిషెల్కి మాత్రమే ఉందని.. ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అమెరికాకు చెందిన సినీ నిర్మాత మైఖేల్ మూర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పలు చర్చల్లో ట్రంప్కు దీటుగా ఆమె ప్రసంగించగలరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూర్ వ్యాఖ్యలపై శుక్రవారం మిషెల్ ఒబామా స్పందించారు. తాను అమెరికా అధ్యక్ష పదవి బరిలో లేనని స్పష్టం చేశారు. ‘మెరుగైన ప్రపంచంలో అమెరికాను అభివృద్ది చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే దేశంలోని పలు కుటుంబాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి.. యువ కార్యకర్తలతో కలిసి పలువురికి సాయం చేస్తున్నాను. ఈ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటేసామాజిక కార్యక్రమాల్లో భాగం కాలేను. ప్రజలు సేవ చేయాలనే తపనతో మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా’ అని తెలిపారు. -
ట్రంప్పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా దిగువ సభలోని మైనారిటీ మహిళా సభ్యులపై ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆదేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది నా అమెరికా కాదు, నీ అమెరికా కాదు.. మన అమెరికా’ అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆమె ట్విట్టర్ వేదికగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. ‘‘ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యం. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ అందాన్ని చూస్తున్నాను. మనం ఇక్కడ పుట్టిన వారమే కావచ్చు లేదంటే వలస వచ్చిన వారమే కావచ్చు.. కానీ, ప్రతి ఒక్కరికి ఈ నేలపై హక్కుంది. మనం ఒక్క విషయం తప్పక గుర్తుకు పెట్టుకోవాలి. అమెరికా నీదో, నాదో కాదు. మనందరి అమెరికా’’ అని మిషెల్లీ హితవుపలికారు. ఓ ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా దిగువ సభలోని నలుగురు నల్లజాతీ సభ్యులను ‘మీ స్వదేశానికి వెళ్లిపోండి’ అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు అనుగుణంగా సభకు హాజరైన ప్రజల్లో చాలా మంది ‘వారిని వెళ్లగొట్టండి’ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెళ్లువెత్తుత్తున్నాయి. అధ్యక్షుడిగా జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేయడంగా సరికాదని అభిప్రాయపడుతున్నారు. -
రాక్షసత్వం
రాక్షసిలా పని చెయ్యడం (లీనింగ్ ఇన్).. స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’! ఇంటినీ, ఆఫీస్నీ బ్యాలెన్స్ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్ ఇన్’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెకు గుర్తింపు తెచ్చిపెడుతోందిప్పుడు! అయితే ‘అంతలేదు’ అని మిషెల్ ఒబామా నవ్వేస్తున్నారు. బహుశా ఆమె ఉద్దేశం.. ‘అంత అవసరం లేదని’ కావచ్చు. భర్త ఇంట్లో ఉంటే, బయటి సొంత పనులు తెముల్చుకోడానికి భార్యకు సౌఖ్యంగా ఉంటుంది. గ్యాస్ బాయ్ వచ్చి, ఎవరూ లేరని వెనక్కి వెళ్లిపోతాడేమోనని, మంచినీళ్ల ట్యాంకరొస్తే బిందెల్లోకి నీళ్లు పట్టేవారుండరనీ మనసు పీకులాట ఉండదు. ఇంటి పనులు, ఆఫీసు పనులు కాకుండా స్త్రీలకు వేరే సొంత పనులేం ఉంటాయని అనిపించవచ్చు! మీరు భర్త గనుకైతే, మీరు మీ ఆఫీసుకి ఒకరోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండి, అదే రోజు ఆమెనూ ఆమె ఆఫీసుకు సెలవు పెట్టమని చెప్పి.. ‘నీ పనులేమైనా ఉంటే చూసుకో. ఇంట్లో పనులు ఇవాళ నేను చూసుంటాను’ అని నమ్మకం ఇవ్వండి. అప్పుడామె.. పని మీద బయటికి వెళ్లినట్లుగా ఉండదు. పండక్కి పుట్టింటికి వెళ్తున్నట్లుగా వెళ్తుంది. నిజం. చీరకు ఫాల్ కుట్టించుకునేందుకు తీరిక దొరకడం కూడా ఆమెకు పండగే. అంతగా ‘లీన్ ఇన్’ అయి ఉంటున్నారు గృహిణులు, ఉద్యోగినులూ! జాబ్ చేసే మహిళలంటే ఆఫీస్లోనూ పని చెయ్యాలి, ఇంటికొచ్చి బియ్యమూ కడిగి ఉడికించాలి. మరి గృహిణులకేమైంది? గృహిణులకేమైందీ కాదు.. గృహిణులకే అయింది. ఆఫీస్ పనిలోనన్నా మిగతా స్టాఫ్ నుంచి చెయ్యో, చేతులో సపోర్టుగా వస్తాయేమో కానీ.. గృహిణి చెయ్యలేకపోయిన పనిలో ఒక చెయ్యేసేవాళ్లెవరుంటారు? ఇంట్లో తనొక్కరిదే తన పని కాదు. ఇంట్లో వాళ్లందరి పనీ తనదే. పగలూ రేయీ చేస్తూ ఉండాల్సిందే. తెల్లారే సూర్యుడు కూడా ‘ఆలస్యంగా ఉదయించానా’ అని అనుమానపడి అవమానపడతాడు.. ఈ ‘రాక్షసి’ నాకంటే ముందెలా లేవగలుగుతోందని! లేదంటే.. సంశయపడతాడు.. రాత్రంతా నిద్రమానుకుని పని చూస్తూనే ఉందా ఏంటి అని. రాక్షసిలా పని చెయ్యడం, రాక్షసిలా పరుగులు తియ్యడం.. రాక్షసిలా కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యడం.. స్త్రీని ఇప్పుడు ఆకాశంలోకి ఎత్తేస్తున్న ‘సుగుణం’. ఇంటినీ, ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకుంటోందంటే ఆమె ఇంకా పెద్ద రాక్షసి. స్త్రీలోని ఆమె స్వాభావికతల కన్నా.. ‘లీన్ ఇన్’ అవడం అనే ఈ పని రాక్షసత్వమే ఆమెలో ప్రతిచోటా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు. ‘లీన్ ఇన్’ అంటే పెనుగాలికో, ఈదురుగాలికో లేక అలాంటి పరిస్థితులకో మనిషి ఒరిగిపోవడం. 2013లో ‘లీన్ ఇన్ : ఉమెన్, వర్క్, అండ్ ది విల్ టు లీడ్’ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చాక ‘లీన్ ఇన్’ కు ‘ఇంటినీ, ఆఫీస్నీ బ్యాలెన్స్ చేసుకునేంత రాక్షసత్వం’ అనే అర్థం బాగా వాడుకలోకి వచ్చింది. ఆ పుస్తక రచయిత్రి షిరిల్ శాండ్బర్గ్. ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఆ పుస్తకం శాండ్బర్గ్ని ఎంత పాపులర్ చేసిందో, అందులోని ‘లీనింగ్ ఇన్’ అనే మాట అంత పాపులర్ అయింది. దూసుకెళ్లడం, పది చేతులతో పని చెయ్యడం, పైపైకి ఎదగడం, ఫాలో అవకుండా.. లీడ్ చెయ్యడం.. వీటన్నిటినీ కలిపి ‘లీన్ ఇన్’ అన్నారు శాండ్బర్గ్. అనడమే కాదు.. ప్రపంచ మహిళలారా ‘లీన్ ఇన్’ అవండి అని ఒక మూవ్మెంట్ని కూడా తెచ్చారు. లీన్ ఇన్ అవడానికి దుర్గమ్మకు ఉన్నంత శక్తి ఉండాలి. లేదంటే ఒక గృహిణికి, ఒక ఉద్యోగినికి ఉన్నంత శక్తి ఉండాలి. మిషెల్ ఒబామా కూడా గృహిణే. బరాక్ ఒబామా భార్యగా ‘అమెరికా మాజీ ప్రథమ మహిళ’ అనే గుర్తింపు ఉండొచ్చు గాక.. ప్రజలకు పనికొచ్చే ఏవో ఒకట్రెండు ఉద్యమాలు మినహా ఉద్యోగాలేమీ చేయలేదు మిషెల్. గృహిణిగానే ఉండిపోయారు. పిల్లలిద్దరూ పెద్దవాళ్లయ్యాక మిషెల్కి ఇంటి పనుల్నుంచి కాస్త తీరిక దొరికింది. ఆ తీరిక సమయంలోనే తన ఆత్మకథను రాసుకుని దానికి ‘బికమింగ్’ అని పేరు పెట్టుకున్నారు. బికమింగ్ ఈ ఏడాది నవంబర్ పదమూడున విడుదలైంది. ఇప్పటికే ఇరవై లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి! నాన్–ఫిక్షన్ కేటగిరీలో టాప్ సెల్లింగ్లో ఉంది. ఒబామా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మిషెల్ తన అభిమాన పాఠకుల కోసం యు.ఎస్. అంతా పర్యటించే వీలు చిక్కింది. అలా పర్యటిస్తూ.. డిసెంబర్ రెండున న్యూయార్క్లో బార్క్లేస్ సెంటర్లోకి వెళ్లడానికి ముందు ఓ టీనేజ్ అమ్మాయిల గుంపు మిషెల్ను కలిసింది. వాళ్లేదో అడగాలని చూస్తున్నారు. ‘ఊ.. కానివ్వండి’ అన్నారు మిషెల్ నవ్వుతూ. ‘‘నెక్స్›్ట అమెరికన్ ప్రెసిడెంట్ మీరే అంటున్నారు. పోల్ నంబర్స్, అప్రూవల్ రేటింగ్స్ కూడా మీ వైపే చూపిస్తున్నాయి. మరి మీరు కంటెస్ట్ చెయ్యబోతున్నారా?’’ అని అడిగారు ఆ పిల్లలు. మిషెల్ నవ్వారు. ‘‘ప్రెసిడెంట్ అవ్వాలని నాకు లేదు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ఒకర్ని పెళ్లి చేసుకున్నానే కానీ, రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని చెప్పారు. అక్కడి నుంచి బార్క్లేస్ సెంటర్ లోపలికి వెళ్లాక అక్కడా ప్రశ్నలు మొదలయ్యాయి. ‘‘ఈమధ్య ఆడవాళ్లంతా.. గ్రేటర్ క్వాలిటీస్ అని, రెస్పెక్ట్ ఇన్ వర్క్ప్లేస్ అనీ అంటున్నారు.. కదా’’ అని ఎవరో అన్నారు. అందుకు మిషెల్.. ‘‘ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు లీన్ ఇన్. బికాజ్ దట్ షిట్ డజెంట్ ఆల్వేస్ వర్క్’’ (‘లీన్ ఇన్’ అయినంత మాత్రాన సరిపోదు. ఆ దరిద్రం అన్ని సమయాల్లో పనిచేయదు) అని అన్నారు. ఒకటే చప్పట్లు, అరుపులు. మిషెల్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని పేరు. మనసులో ఉన్నది కూడా ఉన్నట్లే మాట్లాడారు.మిషెల్ అన్న ఈ మాటలు నెట్లో ఇప్పుడు విశేషంగా ప్రచారం అవుతున్నాయి. ఎరిన్ స్ట్రెకర్ అనే అమ్మాౖయెతే.. మిషెల్ మాటల్ని అన్నవి అన్నట్లు తన ఒంటిపై టాటూ వేయించుకుంది. ఇంకో అమ్మాయి.. ‘మిషెల్ ఒబామా ఈజ్ మై ప్రెసిడెంట్’ అని ట్వీట్ చేసింది. ముందు తరంతో పోలిస్తే ఈ తరం పురుషులు ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెడుతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ స్త్రీల పనులు మాత్రం తగ్గలేదు! బ్యాలñ న్సింగ్ ఇంకో అదనపు పని. వర్క్ లైఫ్నీ, హోమ్ లైఫ్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ‘లీన్ ఇన్’ అవడం స్త్రీల మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. సమానత్వాన్ని రుజువు చెయ్యడానికైతే మాత్రం స్త్రీకి అంత ఒత్తిడి అవసరం లేదేమోనని మిషెల్ ఒబామా భావిస్తున్నట్లు ఆమె మాటల్ని బట్టి అర్థంచేసుకోవాలి. ∙మాధవ్ శింగరాజు -
ఒబామాను వదిలేద్దామనుకున్నా: మిచెల్
వాషింగ్టన్ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిచెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆ విషయంలో ట్రంప్ని ఎన్నటికి క్షమించను’
వాషింగ్టన్ : నా భర్త పౌరసత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేసి నా కుటుంబానికి భద్రత లేకుండా చేశాడు. ఈ విషయంలో ట్రంప్ను ఎన్నటికీ క్షమించలేను అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బర్తర్’ థియరి పేరుతో తన కుటుంబం పట్ల ట్రంప్ ప్రవర్తన గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో పలు విషయాల్ని ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ 2011 సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బర్తర్’ థియరిని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఒబామాను ఉద్దేశిస్తూ ‘ఎందుకు నీ బర్త్ సర్టిఫికేట్ను చూపించడం లేదం’టూ ట్రంప్ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది అమెరికా రాజకీయాల్లోనే పెను సంచలనం అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోక ఈ అంశానికి మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు ట్రంప్. ‘ఒబామా ముస్లిం అనుకుంటాను. అందుకే తన బర్త్ సర్టిఫికేట్ని చూపించడం లేదం’టూ ఆరోపించారు. ఈ విషయాలన్నింటి గురించి మిచెల్ తన ‘బికమింగ్’ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. ట్రంప్ లాంటి జాత్యహంకార వ్యక్తిని తానేప్పుడు చూడలేదన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల తన కుటుంబ భద్రతకు ముప్పు వాటిల్లిందని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ట్రంప్ ప్రచారం చేసిన ‘బర్తర్’ థియరీ చూడ్డానికి చాలా హాస్యాస్పదంగా ఉన్నా ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎవరైనా మతి స్థిమితం సరిగా లేని వ్యక్తి ట్రంప్ మాటలను విశ్వసించి మా మీద ద్వేషం పెంచుకుని.. ఏ చాకో.. గన్నోతీసుకుని మా కుటుంబం మీద దాడి చేయడానికి వస్తే మా పరిస్థితి ఏంట’ని ప్రశ్నించారు. అందుకే ఈ విషయంలో తాను ఎప్పటికి ట్రంప్ని క్షమించలేనని తెలిపారు. మూడు భాగాలుగా వస్తోన్న బికమింగ్ పుస్తకాన్ని నవంబర్ 14న విడుదల చేయనున్నారు -
నిర్మాతలుగా ఒబామా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ‘నెట్ఫ్లిక్స్’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్ నిర్మించి నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రసారం చేయనున్నారు. ఒబామా దంపతులు నిర్మించే డాక్యుమెంటరీల్లో ముందస్తు స్క్రిప్టు రాసుకున్నవి, స్క్రిప్టు అవసరంలేని డాక్యుమెంటరీలు ఉంటాయని నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల అనుభవాలను కూడా నెట్ఫ్లిక్స్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోనున్నారు. నెట్ఫ్లిక్స్తో ఒబామా దంపతులకు త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత మార్చి నెలలోనే ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ కోసం ఒబామా దంపతులు ‘హయ్యర్ గ్రౌండ్ ప్రొడక్షన్స్’ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించబోతున్నామని, వారి విలువైన అభిప్రాయలను, అభిరుచులను తెలుసుకోవడంతోపాటు వాటిని ప్రపంచ ప్రజలతో పంచుకునేలా చేయడం కోసమే తాము ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ వర్గాల ప్రజల్లో నిగూఢంగా దాగున్న నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని కూడా వెలికితీసి ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. -
మెలానీయా టూర్లో మెలిక!
నాడు మిషెల్లీని విమర్శించిన ట్రంప్! నేడు ట్రంప్ సతీమణిదీ అదే దారి.. తలపై వస్త్రం లేకుండానే పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు తమ తొలి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. అయితే, ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలైన మెలానీయా ట్రంప్ ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధంగా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. 2015 జనవరిలో అప్పటి ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఇలా చేయడం సౌదీని అవమానించడమేనని, దీనివల్ల అమెరికాకు శత్రువులు మరింత పెరిగిపోతారని ట్విట్టర్లో విమర్శించారు. ఇప్పుడు అదే ట్రంప్ సతీమణితోపాటు ఆయన కూతురు, వైట్హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ సైతం తలపై వస్త్రం కప్పుకోకుండానే సౌదీ పర్యటనకు రావడం గమనార్హం. ఇస్లామిక్ సంప్రదాయ రాజ్యమైన సౌదీలో మహిళల పట్ల, మహిళల వస్త్రధారణ పట్ల పలు ఆంక్షలు ఉంటాయి. సౌదీకి చెందిన మహిళలు బహిరంగ ప్రదేశాలకు వస్తే కచ్చితంగా వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్ కప్పుకోవాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల మహిళలకు ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. -
ట్రంప్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన మిషెల్
-
ట్రంప్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన మిషెల్
వాషింగ్టన్ : అమెరికా మాజీ తొలి మహిళ మిషెల్ ఒబామా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాల భోజన పోషకాహార అవసరాలను తగ్గిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకోవడంపై ఆమె సీరియస్ అయ్యారు. '' పాఠశాలలో మన పిల్లలకు మంచి భోజనం ఎందుకు వద్దనుకుంటున్నారు? మీకు ఏమైందసలు? ఎందుకంత పక్షపాత ధోరణిలో ఉంటున్నారు? అని ప్రశ్నలు సంధిస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను ఒబామా శుక్రవారం రాత్రి పార్టనర్ షిప్ ఫర్ హెల్దియర్ అమెరికా నిర్వహించిన వార్షిక సమిట్ లో కడిగిపారేశారు. బాల్యదశలో ఊబకాయంపై పోరాటం కోసం ప్రైవేట్, పబ్లిక్ రంగాలు కలిసి ఈ నాన్-ప్రాఫిట్ సంస్థను ఏర్పాటుచేశాయి. పాఠశాల భోజన పోషకాహార అవసరాలను కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారని మిషెల్ ఒబామా ఈ సమావేశంలో ప్రశ్నించారు. తృణధాన్యాలు, ఉప్పు, పాలు వంటి మూడు ముఖ్యమైన పదార్థాల్లో వచ్చే ఏడాదికి సంబంధించిన పాఠశాల ప్రమాణాలను సడలిస్తూ ట్రంప్ ప్రభుత్వంలోని అగ్రికల్చర్ సెక్రటరీ సోని పర్డ్యూ ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన వారం రోజులోనే మిషెల్ ఒబామా దీనిపై స్పందించారు. అగ్రికల్చర్ సెక్రటరీ జారీచేసిన ప్రకటనలో తృణధాన్యాలు 100 శాతం స్టాండర్డ్స్ కలిగి ఉండాలనే నిబంధనలపై పాఠశాలకు విముక్తి ఇచ్చే విధంగా రాష్ట్రాలు సడలింపుల ఇవ్వచ్చని పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఆఫర్ చేసే ఆహారంలో తక్కువ సోడియం ఉండాలనే కఠినతరమైన నిబంధనను పాఠశాల యాజమాన్యాలు పాటించకపోయినా చర్యలు ఉండవు. అయితే పాలసీలో మార్పులు పాఠశాలలో పిల్లలకు ఇచ్చే ఆహార విషయంలో నాణ్యత కోల్పోయే అవకాశముందని మిషెల్ ఆందోళన వ్యక్తంచేశారు. పాఠశాలలో ఆరోగ్యకరమైన భోజన ప్రాముఖ్యతపై ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఓ సారి ఆలోచించాలని మిషెల్ పేర్కొన్నారు. '' దీనిపై నేను నా పోరాటాన్ని కొనసాగిస్తా. ఈ సమస్యలపై నా అంకితభావం నిజమైనది'' అని తెలిపారు. -
మిషెల్ ఒబామా ఫోన్ నెంబర్ ట్వీట్ చేయడంతో..
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. వైట్ హైస్ లో గతంలో విధులు నిర్వహించిన ఓ మాజీ ఉద్యోగికి సంబంధించిన ఫోన్ నంబర్ను మిషెల్ ఇటీవల ట్వీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్లో ఆమెకు 76లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మిషెల్ నుంచి ట్వీట్ రావడంతో ఫాలోయర్లలో చాలా మంది వెంటనే స్పందించారు. ఏదో కారణం ఉండటంతో ఫోన్ నెంబర్ ట్వీట్ చేశారని భావించిన ఫాలోయర్లు ఆ నెంబర్ కు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఫోన్ అందుబాటులో లేదని రెస్పాన్స్ రావడంతో మిషెల్ ఒబామా ట్విట్టర్ హ్యాక్ అయి ఉండొచ్చునని ఫాలోయర్లు ట్వీట్లు చేశారు. పొరపాటును గ్రహించిన మిషెల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. మిషెల్ ట్విట్టర్ హ్యాక్ కాలేదని ఆమె సిబ్బంది తెలిపారు. ఆ ట్వీట్ పై మిషెల్ స్పందిస్తూ.. తన భర్త బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో క్రియేటివ్ డిజిల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన డంకన్ వోల్ఫ్ నెంబర్ అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేయడం లేదని, ఆ ట్వీట్ తాను పొరపాటుగా చేశానని తెలపడంతో అంతా సర్దుకుంది. -
ఒబామా, మిషెల్లీ పెద్ద మనసు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్లీ ఒబామా పెద్ద మనసు చాటుకున్నారు. చికాగోలోని దక్షిణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలను కల్పించే సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు రెండు మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. చికాగోలోని జాక్సన్ పార్క్లో దీనిని ఏర్పాటుచేయనున్నారు. ఇందులోనే 200 నుంచి 300 ఉద్యోగాలు ఏర్పడనుండగా దీని ద్వారా దాదాపు రెండు వేల ఉద్యోగాలు క్రియేట్ చేయనున్నారు. వాస్తవానికి చికాగోలో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్ను ఒకటి ఏర్పాటు అవడానికి ఇంకా నాలుగేళ్లు పట్టనుందని అందరూ భావిస్తుండగా అప్పటి వరకు తాము ఉండలేమంటూ స్వయంగా ఒబామా దంపతులు ముందుకొచ్చి ఈ విరాళం ప్రకటించారు. ‘మిషెల్లీ నేను వ్యక్తిగతంగా రెండు మిలిన్ డాలర్లను సమ్మర్ జాబ్స్ ప్రోగ్రామ్ కోసం విరాళంగా ప్రకటిస్తున్నాం. పని కోరేవారికి ఇది సరైన మార్గం.. దీని ద్వారా వారికి సదావకాశాలు అందించవచ్చు. మనందరం కలిసి పనేచేసేందుకు మరో నాలుగేళ్లపాటు మేం వేచి చూడలేం. అందుకే నేను, మిషెల్లీ ఇప్పుడే దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు. -
మిషెల్ ప్రసంగం స్ఫూర్తితో..
► సేవా రంగం వైపు భారతీయ యువతి సింధూ ► ఒబామాకు లేఖ వాషింగ్టన్ : ‘అది 1996వ సంవత్సరం. నేనొక చర్చిలో కూర్చొని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ ఆమె ప్రసంగం మాత్రం నాలో స్ఫూర్తిని రగిలించింది. ఆమె రగిలించిన ఆ స్ఫూర్తిని నేనెప్పటికీ మరచిపోలేను. ఆ స్ఫూర్తితోనే నా తదుపరి జీవితాన్ని సేవకు అంకితం చేశాను. ఒక ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవకురాలిగానూ, సమాజంలో వెనుకబడిన విద్యార్థులకు సాహిత్యాన్ని బోధించడంలోనూ సహాయపడ్డాను. అయితే చాలా రోజుల తర్వాత నాకొక విషయం తెలిసింది. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా అని.. ఈ సందర్భంగా ఒబామా దంపతులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ భారత సంతతికి చెందిన 38 ఏళ్ల సింధూ ఒబామాకు జనవరిలో లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖను మహిళా దినోత్సవం సందర్భంగా మీడియం అనే సామాజిక మాధ్యమం ద్వారా బరాక్ ఒబామా పంచుకున్నారు. ‘సింధూ జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చిన నా భార్యను చూసి నేనెంతో గర్వపడు తున్నారు. సింధూ కథను చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. అందుకే ఈ కథను మీతో పంచుకోవాలని భావించాను’ అని ఒబామా తెలిపారు. -
విద్యాప్రచారం కోసం భారత సంతతి బాలిక
వాషింగ్టన్: అమెరికాలో విద్యా ప్రచారం కోసం భారత సంతతి బాలిక శ్వేతాప్రభాకరన్ ఎంపికయ్యారు. ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఏర్పాటు చేసిన ‘బెటర్ మేక్ రూమ్’కు అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా శ్వేత సేవలందిస్తారు. బెటర్ మేక్ రూమ్ అనే సంస్థ యువతను ఇంజనీరింగ్ విద్యవైపు మళ్లించేందుకు కృషిచేస్తోంది. మొత్తం 17 మందిని ఇందుకోసం ఎంపికచేయగా అందులో శ్వేత ఒకరు. ఇందులో 12 మంది హైస్కూల్ విద్యార్థులు ఉంటే, ఐదుగురు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లక్ష్యాలను నేరవెర్చేందుకుగాను బెటర్ మేక్ రూమ్ అనే సంస్థను మిచెల్ బబామా స్థాపించారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి కృషి చేస్తూనే యువ ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. శ్వేత తల్లిదండ్రులు తమిళనాడులోని తిరునవెళ్లికి చెందినవారు. 1998లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. బెటర్ మేక్ రూమ్ స్టూడెంట్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని శ్వేత అన్నారు. భరతనాట్యంలో 2015 సంవత్సరానికిగాను వైట్హౌజ్ నుంచి బహుమతి కూడా గెలుచుకున్నారు శ్వేత. అంతేకాదు ఇంటర్నేషనల్ లిటరసీ అసోసియేషన్–2016కు కూడా ఎంపికయ్యారు. -
చింపాంజి అంటూ కామెంట్
అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ ఉద్యోగం ఊడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత తనకు ఆనందంగా ఉందని ఇప్పటివరకూ ప్రథమ పౌరురాలి స్ధానంలో ఓ చింపాంజిని చూడాల్సివచ్చిందని క్లే కౌంటీ డెవలప్ మెంట్ కార్ప్ అనే నాన్ ప్రాఫిట్ సంస్ధకు డైరెక్టర్ గా పనిచేస్తున్న పమిలా టేలర్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో అమెరికాలో దుమారం రేగింది. ఆ సంస్ధ కార్యాకలాపాలపై దృష్టి సారించిన అధికారులు పలు చోట్ల నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించారు. ప్రభుత్వ సాయం పొందుతున్న సంస్ధలో నియమావళి ఉల్లంఘన కారణంగా సదరు సంస్ధను రద్దు చేయడం లేదా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడమో జరుగుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల పాటు సంస్ధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఓ ఏజెన్సీని నియమించింది. గత నెలలో మిషెల్లీ ఒబామాను వెస్ట్ వర్జీనియాకు మేయర్ బెవర్లీ వాలింగ్స్ చింపాంజితో పోల్చారు. వాలింగ్స్ పోస్టుతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్లు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో వాలింగ్స్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
'ఒబామా 2017లో చనిపోతాడు'
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాత్యహంకార మాటలు అన్నారు. 2017లో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నానని, ఆయన భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. 2017లో ఏం జరగాలని కోరుకుంటున్నారని ఓ మీడియా ప్రశ్నించగా అతను ఈ వ్యాఖ్యలు చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్కు సంబంధించి కార్ల్ పలాడినో అనే ఓ వ్యాపార వేత్త, రిపబ్లికన్ పార్టీ నాయకుడు కో చైర్మన్గా పనిచేశారు. ఆయన గతంలో న్యూయార్క్ గవర్నర్గా కూడా పనిచేశారు. వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరో ఏడాదిలో మిషెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ అది తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. -
నేను అద్భుతం చేయబోతున్నా: ట్రంప్
న్యూయార్క్: తన ఎన్నిక జరిగినప్పటి నుంచి అమెరికా గంపెడు ఆశతో ఉందని త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అదే సమయంలో తన ఎన్నికతో భవిష్యత్పై భయమేస్తోందంటూ వ్యాఖ్యానించిన అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మాటలు గుర్తుచేశారు. ‘ఎప్పుడు బ్రహ్మాండమైన ఆశను కలిగి ఉన్నాం. బ్రహ్మాండమైన వాగ్దానం కూడా మనకు ఉంది. అలాగే పెద్ద మొత్తంలో శక్తిని కూడా మనం కలిగి ఉన్నాం. మనం తిరిగి భారీ విజయం సాధించబోతున్నాం. ఈ దేశంలో మనం అద్భుతం చేయబోతున్నాం. ఆ అద్భుతం నేనే చేస్తా’ అంటూ ట్రంప్ అలబామాలోని మొబైల్లో ర్యాలీ సందర్భంగా చెప్పారు. చివరికి మీకు ధన్యవాదాలు అంటూ ఆయన ముగించారు. గత శుక్రవారం ఆఫ్రా విన్ఫ్రే తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మిషెల్లీ మాట్లాడుతూ ట్రంప్ విజయం తర్వాత అమెరికన్లలో కాస్తంత ఆందోళన ఉందని, తనకు అలాంటిదే ఉందని, అయితే, జీవితంలో ఆశ కలిగి ఉండటం ముఖ్యమైనందున తాను కూడా మంచే జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. -
మిచెల్లీ గురించి ఒబామా ఏమన్నారంటే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్లీ ఒబామా రాజకీయ భవితవ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మిచెల్లీ బరిలో ఉండరని స్పష్టం చేశారు. మిచెల్లీ రాజకీయ ప్రవేశంపై అమెరికాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారని తొలుత కథనాలు వినిపించాయి. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ ఓడిపోయాక, వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ పోటీచేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒబామా దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిచెల్లీ ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టం చేశారు. ఆమె చాలా ప్రతిభావంతురాలని, అమెరికా ప్రజలతో మమేకమయ్యారని ప్రశంసించారు. కాగా మిచెల్లీకి రాజకీయాలపై పెద్దగా ఆసక్తిలేదని ఒబామా చెప్పారు. -
మిషెల్లీ ఒబామాను చింపాంజితో పోల్చి
అమెరికా ప్రస్తుత ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాను వెస్ట్ వర్జీనియాకు మేయర్ బెవర్లీ వాలింగ్స్ చింపాంజితో పోల్చారు. అమెరికాకు కొత్త ప్రథమ పౌరురాలు(మెలనియా ట్రంప్) వచ్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, ఇన్నాళ్లు ఆ స్ధానంలో ఓ చింపాంజి ఉండేదని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాలింగ్స్ పోస్టుతో చిర్రెత్తుకొచ్చిన నెటిజెన్లు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రథమ పౌరురాలిపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది. దీంతో ఆమెను మేయర్ పదవి నుంచి తప్పించాలనే ఒత్తిళ్లు పెరిగాయి. ఈ విషయం తెలుసుకున్న వాలింగ్స్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు క్లే టౌన్ కౌన్సిల్ కు లేఖ రాశారు. వాలింగ్స్ లేఖను పరిశీలించిన కౌన్సిల్ ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు పేర్కొంది. వైట్ హౌస్ మార్పుపై మాట్లాడానే తప్ప తన మనసులో మరే దురుద్దేశం లేదని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. తాను తెలిసినవారందరికీ జాతి ద్వేషిని కాదని తెలుసని అన్నారు. మిషెల్లీపై చేసిన కామెంట్ కు క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్టు కూడా చేశారు. -
ట్రంప్ భార్యకు మిషెల్లీ అరుదైన ఆతిథ్యం
వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా త్వరలో రానున్న కొత్త ప్రథమ మహిళ డోనాల్డ్ ట్రంప్ భార్య మిలానియా ట్రంప్కు అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. త్వరలో ఆమె అడుగుపెట్టనున్న శ్వేత సౌదం దానికి సంబంధించిన ఇతర భవనాల గురించి తన అనుభవాలు పంచుకున్నారు. తేనీరును కూడా పంచుకున్న మిషెల్లీ.. ఒక్కసారి అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టాక ఎన్నో భావోద్వేగాలు అలుముకుంటాయని, అవన్నీ ఎప్పటికీ వదిలిపెట్టబుద్ధికానంత గొప్పగా అందంగా ఉంటాయని వివరించారు. మిలానియాను శ్వేత సౌదానికి చెందిన ప్రైవేటు భవనంలో తిప్పుతూ ప్రముఖమైన ట్రూమన్ బాల్కనీ వద్దకు కూడా తీసుకెళ్లారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తన పిల్లలను ఎలా పెంచానన్న అనుభవాలు కూడా ఆమెతో పంచుకున్నారు. శ్వేత సౌదంలో నివసించడమనేది ఫిష్బౌల్లో ఉంటున్నట్లుంటుందని, మ్యూజియంలో జీవిస్తున్నంత అద్బుతంగా ఉంటుందని మిలానియా ట్రంప్ కు తెలియజేశారు. మిలానియాకు కూడా అచ్చం ఇలాంటి అనుభూతులే కలుగుతాయని మిషెల్లీ చెప్పారని, త్వరలో శ్వేతసౌదాన్ని విడిచి వెళుతున్న ఆమె మధ్యమధ్యలో కొంత భావోద్వేగానికి లోనయ్యారని వౌట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. -
మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
-
మిషెల్ కోరుకుంటే.. కేబినెట్లో చోటు!: హిల్లరీ
వాషింగ్టన్: ఈనెల 8న జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. అమెరికా ప్రస్తుత ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాకు మంత్రి వర్గంలో చోటు కల్పించేందుకు తనకు అభ్యంతరమేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు మిషెల్ గతంలో నాతో చెప్పారు. పాలనలో ఉత్తమ భాగస్వామి కావాలని నేనూ కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని ఆమె అనుకుంటే.. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని హిల్లరీ అన్నారు. -
మిచెల్లీ ఒబామాకు హిల్లరీ బంపర్ ఆఫర్
అమెరికా మొదటి మహిళ మిచెల్లీ ఒబామాకు హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నవంబర్ 8న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే, మిచెల్లీని తన కేబినెట్లోకి తీసుకుంటానని డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని విన్స్టన్-సాలెంలో తామిద్దరూ భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలపై చర్చించినట్టు తెలిపారు. తనకు ఉత్తమమైన భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాని, మిచెల్లీని మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్టు క్లింటన్ ఓ టీవీ చానెల్కు చెప్పారు. ఒకవేళ నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే, అమెరికాకు ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పేరొందనున్నారు. క్యాంపెయిన్ తుదిదశలో క్లింటన్ ప్రత్యామ్నాయంగా మిచెల్లీ కొన్ని ర్యాలీలో పాల్గొన్నారు. మొదటిమహిళగా ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలని, ఆ బాధ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసని క్లింటన్ అన్నారు. మిచెల్లీ తనకందించిన ధైర్య, సహాకారాలను తాను అభినందిస్తున్నానని క్లింటన్ చెప్పారు. -
ఒబామా మనసులో ఏముంది?
తన భార్య మిషెల్లీ ఒబామాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని ఇటీవల చెప్పిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా మరో విషయాన్ని వెల్లడించారు. ఒబామా శనివారం ఓ రేడియో షోలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం తన భార్య ఎప్పుడూ పోటీ చేయదని, ఆ పదవిపై ఆమెకు మోజు లేదని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిషెల్లీ ఒబామా ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు. నార్త్ కరోలినాలో దాదాపు 10వేల మంది డెమొక్రటిక్ పార్టీ మద్ధతుదారులు ఉన్న ఓ కార్యక్రమానికి మిషెల్లీ హాజరుకాగా, ఆమెను చూసిన వాళ్లు అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పేరుగా బదులుగా మిషెల్లీ పేరుతో నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికలలో నెగ్గి వైట్ హౌస్ లో కాలుపెట్టేది హిల్లరీనా.. లేక మిషెల్లీనా అనే తరహాలో అక్కడ సీన్ మారిపోయింది. ఈ విషయాలపై ఒబామా స్పందిస్తూ.. మిషెల్లీకి అధ్యక్షురాలిగా ఉండటానికి కావలసిన ఓపిక, రాజకీయాలపై ఆసక్తి రెండూ లేవని పేర్కొన్నారు. తన భార్య మిషెల్లీ చాలా తెలివైనదని, ఎంతో నేర్పరి అని ఒబామా కొనియాడారు. అయినా ఆమెను చూస్తే తనకు గర్వంగా లేదన్నారు. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిషెల్లీ కాకపోవడంపై ఒబామా తనలో చిన్నపాటి బాధను, తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
పెళ్లయిన 30 ఏళ్లకు ఆ రహస్యాన్ని చెప్పింది!
షికాగోలో ఓ పుస్తక దుకాణాన్ని నడిపించే నాన్సీ ఫగిన్ (62) పెళ్లయి 30 ఏళ్లు అయింది. ఈ 30 ఏళ్లలో ఆమె ఎప్పుడూ ఓ రహస్యాన్ని భర్త రాన్ వెబర్ (75)కు చెప్పలేదు. కానీ ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళలపై అతి దుర్మార్గంగా చేసిన లైంగిక వ్యాఖ్యల టేప్ వెలుగుచూడటం అమెరికాలో పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో నాన్సీ తొలిసారి తన భర్త ఎదుట నిజం చెప్పింది. తాను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు షికాగో చరిత్ర మ్యూజియంలో వాలంటీర్గా పనిచేశానని, ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భర్తకు వివరించింది. ఆమెను ఓదార్చిన భర్త.. తన మొదటి భార్య కూడా ఏవిధంగా లైంగిక దాడుల బారిన పడిందో వివరించారు. మహిళలను ముద్దుపెట్టుకోవడం, అసభ్యంగా తాకడం, వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ట్రంప్ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యల ఆడియో టేప్ వెలుగుచూడటం అమెరికాలో పెద్ద చర్చను లేవదీసింది. మహిళలపై ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించేది లేదంటూ మిషెల్లీ ఒబామా ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం మహిళలకు ప్రేరణగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ట్రంప్ ఆశలను భారీగా దెబ్బతీసిన ఈ టేప్తో అమెరికాలో ఇప్పుడు కొత్త తరహా చర్చ మొదలైంది. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిన వేధింపుల గురించి చాలామంది జంటలు ఇప్పుడు చర్చించుకుంటున్నాయి. తొలిసారిగా మహిళలు తమ భర్తలకు, ప్రియులకు.. నైట్క్లబ్బుల్లో, సబ్వేలలో, వీధుల్లో, పనిచేసే చోట తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తున్నారు. తమ చీకటి అనుభవాలను వెల్లడిస్తున్నారు. తమ పిల్లలు లైంగిక హింస బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించుకుంటున్నారు. చాలావరకు ఇలా చీకటి అనుభవాలు భాగస్వాములు ఒకరితో ఒకరు పంచుకోవడం వారి అనుబంధాన్ని మరింతగా పెంపొందిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో వీటిని వెల్లడించడం వల్ల చిక్కులూ ఎదురవుతున్నాయి. నార్త్ కరోలినాలో ఓ 52 ఏళ్ల మహిళ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తన భాగస్వామికి చెప్పడం వివాదానికి దారితీసింది. తాను బాలికగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె మహిళ చెప్పగా.. దానిని ఆమె భాగస్వామి తప్పుబట్టాడు. దీంతో వారిరువురు వీడిపోయి తలోదారి చూసుకున్నారు. ట్రంప్ దుర్మార్గమైన వ్యాఖ్యల టేప్ నేపథ్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. -
మిషెల్లీ భుజం మీదుగా హిల్లరీపై తూటాలు
ఫ్లెచర్: మహిళలపై దురుసు వ్యాఖ్యానాలకు ముందుండే డోనాల్డ్ ట్రంప్ మరోసారి అదేపనిచేశాడు. ఫస్ట్ టేడీ మిషెల్లీ ఒబామా భుజం మీదుగా ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై మాటల తూటాలు పేల్చాడు. 2008లో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన సందర్భంలో మిషెల్లీ.. హిల్లరీని దారుణంగా తిట్టిపోసినవైనాన్ని ట్రంప్ తిరగదోడాడు. 2007లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం ఒబామా, హిల్లరీ క్లింటన్ ను పోటీపడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో తన భర్త ఒబామా తరఫున ప్రచారం చేసిన మిషెల్లీ.. 'ఇంటిని చక్కదిద్దుకోలేని హిల్లరీ క్లింటన్.. వైట్ హౌస్ ను, దేశాన్ని సరిగా పాలించగలదా?'అని ప్రత్యర్థిపై పంచ్ లు విసిరింది. నార్త్ కరోలినా రాష్ట్రం ఫ్లెచర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తుచేశారు. 'ఫ్రెండ్స్.. ప్రస్తుత పాలకులంతా పిల్లకాకులు, పరాజితులు. వీళ్ల తీరు ఎలా ఉంటుందంటే.. 2007లో హిల్లరీని తిట్టిపోసిన మిషెల్లీ ఇప్పుడు నన్ను విమర్శిస్తోంది. నాటి మిషెల్లీ వ్యాఖ్యలు బిల్ క్లింటన్ అక్రమ సంబంధాల నేపథ్యంలో చేసినవేనని జనం చర్చించుకున్నారు. ఇవీ.. మనల్ని పాలిస్తున్నవాళ్ల బతుకులు' అని వ్యంగ్యాస్త్రాలు వేశారు. పోలింగ్ తేదీ(నవంబర్ 8) దగ్గర పడుతుండటంతో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ పార్టీలు కీలకంగా భావించే రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సర్వేల ప్రకారం అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే అవకాశాలు హిల్లరీకి 47 శాతం, ట్రంప్ కు 43 శాతం ఉన్నాయి. దీంతో వచ్చే 18 రోజుల్లో హిల్లరీపై ట్రంప్ మరిన్ని కంపు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. -
నెట్ను కుదిపేస్తున్న మిషెల్లీ ఫొటో!
ఆమె అందరినీ ప్రేమిస్తుంది. ఆమెను అందరూ ప్రేమిస్తారు.. ఆమె ఎవరంటే అమెరికా ప్రథమ పౌరురాలు.. ఫ్లోటస్ మిషెల్లీ ఒబామా. ఆమె ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాషింగ్టన్లో ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర, సంస్కృతి జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన కలయిక తటస్థించింది. ఈ సందర్భంగా మిషెల్లీ బుష్ను ఆలింగనం చేసుకుంటున్న ఫొటో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో బుష్, ఒబామా సైతం ఒకే ధోరణిలో ప్రసంగించారు. ఒక దేశ చరిత్రలోని వాస్తవాలను మరుగన పరచడం సరికాదని, అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని గుర్తించాలని వారు పేర్కొన్నారు. వారి ప్రసంగం ఎలా ఉన్నా నెటిజన్ల దృష్టి మాత్రం మిషెల్లీ-బుష్ ఫొటోపై పెట్టారు. ఈ ఫొటోపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. పోస్టులు పెట్టారు. తమ ఫొటోషాప్ పైత్యమంతా ఈ ఫొటోపై చూపించారు. వారి విన్యాసాలు కావాలంటే మీరు కూడా చూడొచ్చు. -
మిషెల్లీ ఒబామా వైరల్ వీడియో!
భర్తను బాగా ఇమిటేట్ చేయడంలో భార్యలే ముందుంటారేమో.. తాజాగా మిషెల్లీ ఒబామా భర్త బరాక్ను చిలిపిగా ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా అమెరికాకు సేవలు అందించిన ఒబామా త్వరలో ఈ పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బర్ట్ నిర్వహించే ’ద లేట్ షో’లో ఫ్లోటస్ మిషెల్లీ ముచ్చటించింది. వైట్హౌస్లో కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్లీ ఈ సందర్భంగా వివరించింది. డిన్నర్ చేస్తున్నప్పుడు పెద్ద కూతురు మలియా తండ్రి ఒబామాను గ్లోబల్ వార్మింగ్ వంటి సీరియస్ ప్రశ్నలను అడుగుతూ ఉండేదని మిషెల్లీ చెప్తూ.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో ఒబామా ఎలా సమాధానమిస్తాడో ఇమిటేట్ చేసి మరీ చూపించింది. ’వెల్.. నువ్వు ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానాన్ని నీకు వివరిస్తాను. పాయింట్ 1, పాయింట్ 1a, పాయింట్ 1ab అంటూ’ ఒబామా వివరిస్తూ పోతారని ఆయనను అచ్చం ఇమిటేట్ చేస్తూ మిషెల్లీ ప్రేక్షకుల్లో ఆనందం నింపింది. తాను, చిన్న కూతురు సాషా మాత్రం ఫేవరెట్ పాటల గురించి చర్చించుకుంటామని చెప్పింది. బుధవారం సాయంత్రం యూట్యూబ్లో ఈ పెట్టిన ఈ వీడియో ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి వైరల్ గా మారింది. -
మా ఆవిడతో కలిసి తాజ్మహల్ చూడాలి: ఒబామా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇది ఎనిమిదోసారి. లావోస్లో జరిగిన ఏసియాన్ సదస్సుకు మోదీతో పాటు ఒబామా కూడా హాజరయ్యారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం, ఒబామా పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మోదీ ఆయనను మరోసారి భారతదేశానికి ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా భారత్ రావాలని చెప్పారు. దానికి ఒబామా కూడా సానుకూలంగా స్పందించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ను తాను ఇంతవరకు తన భార్య మిషెల్తో కలిసి చూడలేదని, ఒకసారి దాన్ని చూడాలని ఉందని, అందుకోసం తప్పకుండా వస్తానని చెప్పారు. 2008 నాటి ముంబై ఉగ్రదాడులతో పాటు పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఈ జనవరిలో జరిగిన దాడికి కారకులను పాకిస్థాన్ గుర్తించి శిక్షించాలని ఏషియాన్ సదస్సు సందర్భంగా ఒబామా, మోదీ ఇద్దరూ గట్టిగా డిమాండ్ చేశారు. తమ పొరుగున ఉన్న ఒక దేశం ఉగ్రవాదాన్ని తయారుచేసి, ఎగుమతి చేస్తోందని పాకిస్థాన్ పేరు చెప్పకుండానే నరేంద్రమోదీ అన్నారు. అలాంటి దేశాల మీద ఆంక్షలు విధించి, వాటిని ఒంటరి చేయాలని చెప్పారు. జి20 సదస్సులో సైతం.. ఒకే ఒక్క దేశం దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని మోదీ అన్నారు. కాగా, జీఎస్టీ బిల్లును ఆమోదించినందుకు ప్రధాని మోదీని బరాక్ ఒబామా అభినందించారు. -
పాక్ రాయబారితో మిషెల్లీ ఫొటోపై దుమారం!
అమెరికాలోని పాకిస్థాన్ ప్రధాన రాయబారి జలిల్ అబ్బాస్ జిలానీ ఇటీవల చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామాతో ఆయన, ఆయన భార్య దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్లో పెట్టడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించినట్టు కథనాలు వచ్చాయి. 'ఫ్లోటస్కు పాకిస్థాన్ హౌస్లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందం కలిగిస్తున్నది' అంటూ గత మే నెలలో జిలానీ ట్వీట్ చేశాడు. మిషెల్లీతో ఆయన, ఆయన భార్య కలిసి దిగిన ఫొటోను ఈ ట్వీట్కు జోడించారు. అమెరికా ప్రథమ పౌరురాలిని ఆంగ్ల సంక్షిప్త అక్షరాలతో కలిపి ఫ్లోటస్ అని సన్నిహితులు మాత్రమే పిలుస్తారు. అధికారికంగా ఇలా పిలువడాన్ని అనుమతించారు. ఈ నేపథ్యంలో కొంతసేపటికీ ఈ ట్వీట్ను ఆయన తొలగించారు. అయితే, ఈ విషయంలో పాక్ రాయబారిని తీవ్రంగా మందలిస్తూ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ తాజాగా ఓ లేఖ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఒబామా కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం కలిగించేందుకు ఈ ఫొటోను జిలానీ ట్వీట్ చేశారని, ఇది సరికాదని వైట్హౌస్ పేర్కొన్నట్టు సమాచారం. పాక్ రాయబారి ఇంటికి మిషెల్లీ వెళ్లడం వ్యక్తిగత అంశమని, దీని నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే సరికాదని వైట్హౌస్ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఒబామా కూతుళ్లు, పాక్ రాయబారి జిలానీ కొడుకు ఒకే పాఠశాలలో చదువుతుండటంతో, జిలానీ కొడుకు గ్రాడ్యుయేషన్ పార్టీకి మిషెల్లీ హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, తమ రాయబారిని మందలిస్తూ వైట్హౌస్ లేఖ రాసిందన్న వార్తలను పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. ఈ విషయంలో వైట్హౌస్ ఎలాంటి లేఖ రాయలేదని పేర్కొంది. -
చివరి సమ్మర్ వేకేషన్లో..!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుటుంబం వేసవి విడిదిలో భాగంగా మార్థాలోని విన్యార్డ్లో విహరిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా ఒబామాకు ఇది చివరి వేసవి విహారం కానుంది. రెండువారాలపాటు ఒబామా కుటుంబం ఇక్కడ విహరించనుంది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో రానున్న కొద్దిరోజుల్లో ఒబామా బిజీగా మారిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో భార్య మిషెల్లి, కూతుళ్లతో కలిసి ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ రెండువారాలు గోల్ఫో ఆడుతూ.. సముద్ర తీరంలో విహరిస్తూ.. బైక్ రైడింగ్ చేస్తూ.. కుటుంబసభ్యులు, కొందరు ఆప్తమిత్రులతో ఒబామా గడుపనున్నారు. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా సేవలు అందించిన ఒబామా దేశాధినేత పదవిలో ఇప్పటివరకు ఏడుసార్లు వేసవి విహారానికి వెళ్లారు. -
మెస్మరైజింగ్.. మిషెల్
డెమొక్రటిక్ పార్టీ సదస్సులో ఉద్వేగభరిత ప్రసంగం - హిల్లరీకే అధ్యక్ష పదవికి అర్హత ఉందని వ్యాఖ్య ఫిలడెల్ఫియా : అమెరికా అధ్యక్షపదవి చేపట్టటానికి డెమోక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ ఒక్కరే అర్హురాలంటూ ఆ దేశ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మద్దతు ప్రకటించారు. మంగళవారం ఫిలడెల్ఫియాలో పార్టీ జాతీయ సదస్సులో ఆమె ప్రసంగిస్తూ.. ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలు కాగలదని హిల్లరీ కారణంగా తన కుమార్తెలతో పాటు దేశంలోని యువత విశ్వసిస్తోందని పేర్కొన్నారు. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ద్వేషపు మాటలు మాట్లాడేవారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు దేశాధ్యక్ష పదవికి తగరని వ్యాఖ్యానించారు. మిషెల్ పావుగంట ఉద్వేగ ప్రసంగం పార్టీ డెలిగేట్లను కదిలించింది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయాలన్న ట్రంప్ నినాదాన్ని ఎండగడుతూ.. ప్రపంచంలో అమెరికా అతి గొప్ప దేశమని, ఇంతకుముందు ఒక ఆఫ్రికా-అమెరికా జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతోపాటు, ఇప్పుడు ఓ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోగలిగే అవకాశం లభించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ‘బానిసలు కట్టిన శ్వేతసౌధంలో ప్రతి ఉదయం నిద్ర లేస్తుంటాను. నా ఇద్దరు కుమార్తెలు.. అందమైన, తెలివైన నల్ల యువతులు శ్వేతసౌధం ఆవరణలో కుక్కపిల్లలతో ఆడుకోవడాన్ని చూస్తుంటాను. వారి తండ్రి పౌరసత్వాన్ని ప్రశ్నించే వారిని, ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించే వారిని విస్మరించాలని, టీవీ చానళ్లలో ప్రముఖుల విద్వేష ప్రసంగాలు అమెరికా వాస్తవ స్ఫూర్తికి ప్రాతినిధ్యం కాదని వారికి మనమెలా చెప్పగలం? వారు దిగజారినపుడు మనం మరింత ఉన్నతంగా ప్రవర్తించాలి అని చెప్తాం’ అని అన్నారు. ఈ ప్రసంగానికి డెలిగేట్లు హర్షాతిరేకాలతో స్పందించగా కొందరు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఐ లవ్యూ మిషెల్లీ..!
-
ఐ లవ్యూ మిషెల్లీ!
ఫిలడెల్ఫియా: అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా తన అద్భుతమైన ప్రసంగంతో ఆహూతులను కట్టిపడేశారు. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు మద్దతు ప్రకటిస్తూ మిషెల్లీ చేసిన ప్రసంగం ‘నభూతో’ అన్నతరహాలో ఆద్యంతం పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. అమెరికాకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు కావడం ఎంత ప్రయోజనకరమో చెప్తూనే.. సందర్భోచితంగా ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై వాగ్బాణాలు సంధించారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిన తరుణంలో పార్టీ జాతీయ సదస్సులో ఆమె చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో సమధికోత్సాన్ని, ఐక్యతను నింపింది. ‘ఈ ఎన్నికల్లో నేను విశ్వసించే బాధ్యతాయుతమైన వ్యక్తి, అమెరికా అధ్యక్ష పదవికి అర్హురాలైన ఏకైక వ్యక్తి.. అది మన fమిత్రురాలు హిల్లరీ క్లింటనే’ అంటూ మిషెల్లీ ప్రకటించారు. భావోద్వేగాలను మిళితం చేస్తూ ఆమె ప్రసంగం సాగుతుండగా.. ఆహూతులు పలుసార్లు లేచినిలబడి కరతాళ ధ్వనులతో తమ హర్షం ప్రకటించారు. లింగ, జాతి వివక్షతలు, ట్రంప్ ప్రాతిపదిస్తున్న విచ్ఛిన్నకరమైన రాజకీయాలను పరోక్షంగా విమర్శిస్తూ మిషెల్లీ ప్రసంగం సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి ఏమాత్రం అర్హులు కారని ఆమె స్పష్టం చేశారు. ‘మనం దేశం గొప్పది కాదని, దానిని మళ్లీ గొప్పగా చేయాల్సిన అవసరముందని చెప్తున్నవారిని ఎంతమాత్రం అంగీకరించండి. ఇప్పుడు భూమిపై ఉన్న గొప్ప దేశం మనదే’ అని మిషెల్లీ పేర్కొన్నారు. భార్య మిషెల్లీ ప్రసంగానికి ఫిదా అయిపోయిన అధ్యక్షుబు బరాక్ ఒబామా.. ఆమెను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘గొప్ప మహిళ చేసిన గొప్ప ప్రసంగం ఇది. నువ్వు అమెరికా ప్రథమ పౌరురాలిగా ఉండటం నిజంగా గర్వకారణం. ఐ లవ్యూ మిషెల్లీ’ అంటూ ఒబామా ట్విట్టర్లో పేర్కొన్నారు. Incredible speech by an incredible woman. Couldn't be more proud & our country has been blessed to have her as FLOTUS. I love you, Michelle. — President Obama (@POTUS) July 26, 2016 -
కారులో కూచొని మిషెల్లీ ఏం చేసిందంటే?
సాక్షాత్తూ అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ కారు ఫ్రంట్ సీటులో కూర్చొని.. జాలీజాలీగా పాటలు పాడుతూ.. చిందులు వేశారంటే మీరు నమ్ముతారా?.. కానీ, మిషెల్లీ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ మ్యూజిక్ వీడియోలో ఇలాగే కనిపించారు. కారు ఫ్రంట్ సీటులో కూర్చోవడమే కాదు మిషెల్లీ ర్యాప్ సాంగ్ పాడుతూ.. ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ‘కార్పూల్ కారావుకే’ మ్యూజిక్ వీడియోలో హల్చల్ చేశారు. ఈ వీడియోలో ఆమెతోపాటు సింగర్లు జేమ్స్ కార్డన్, మిస్సీ ఎలియట్ అద్భుతంగా పాట పాడుతూ ధూమ్ ధాం చేశారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి. -
కాపీ కొట్టిన ట్రంప్ గారి భార్య!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలినియా ట్రంప్ తనను తాను అమెరికా ప్రజలకు పరిచయం చేసుకునేందుకు ఇచ్చిన ఉపన్యాసం విమర్శలపాలవుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ భార్య, మాజీ మోడల్ మెలినియా (46) రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో సోమవారం ప్రసంగించారు. ఒక భర్తగా, తండ్రిగా, సమర్థమైన నాయకుడిగా తన భర్త గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె ఉపన్యసించారు. అయితే, తన జీవితాన్ని నిర్దేశించిన విలువల గురించి ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు మక్కీకిమక్కీ మిషెల్లీ ఒబామా ఉపన్యాసాన్ని పోలి ఉండటం గమనార్హం. అధ్యక్ష ఎన్నికలకు ఒబామా పోటీచేసినప్పుడు 2008లో డెమొక్రటిక్ పార్టీ సదస్సులో మిషెల్లీ ఇచ్చిన ఉపన్యాసాన్ని దాదాపుగా మెలినియా తిరిగి వల్లేవేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లిదండ్రులు తనకు నేర్పిన సామాజిక, నైతిక విలువలు, ఎదుటివారిని గౌరవించడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటివి ఇప్పటికీ తనతోపాటు నిలిచి ఉన్నాయని మెలినియా పేర్కొనగా.. 2008లో మిషెల్లీ కూడా ఇదే తరహాలో కుటుంబ, నైతిక, సామాజిక విలువల గురించి తెలుపడంతో ఆమె ఉపన్యాసాన్ని మెలినియా కాపీ కొట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆ ఇద్దరు ట్రంప్పై దుమ్మెత్తిపోశారు!
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్పై ఇద్దరు మహిళా నేతలు విరుచుకుపడ్డారు. డెమొక్రటిక్ పార్టీ ఫ్రంట్ రన్నర్ హిల్లరీ క్లింటన్, అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లి ఒబామా ట్రంప్ విధానాలపై దుమ్మెత్తిపోశారు. సాన్బెర్నార్డినోలో జరిగిన ర్యాలీలో హిల్లర్లీ మాట్లాడుతూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే నియంత అయ్యే అవకాశముందని హెచ్చరించారు. మనకు అధ్యక్షుడు కావాలి కానీ నియంత కాదని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని వలసదారులను కించపరిచడం తప్ప ఆయన ప్రచారంలో మరేమీ లేదని, ఇది పూర్తిగా పొలిటికల్ స్టంటేనని ఆమె అభిప్రాయపడింది. న్యూయార్క్ సిటీ కాలేజీలో మిషెల్లి ప్రసంగిస్తూ ట్రంప్ విధానాలను తప్పుబట్టారు. వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడలు కడతామన్న ట్రంప్ వ్యాఖ్యలు సరికావని ఆమె పేర్కొన్నారు. భయాలకు లొంగిపోయి గోడలు కడతామని అనుకోవడం సరికాదని, ఇతర దేశాల్లో జన్మించి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న చాలామంది అమెరికాను ప్రపంచంలో గొప్ప దేశంగా నిలబెట్టేందుకు కృషి చేశారని మిషెల్లి గుర్తుచేశారు. -
రాణి విందుకు ఒబామా
లండన్: పదవి కాలం ముగుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిషెల్లీ చరిత్రలో గుర్తుండిపోయే పర్యటనలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న క్యూబా వెళ్లిన ఆ జంట ఇప్పుడు బ్రిటన్లో అడుగుపెడుతున్నారు. విండ్సర్ భవనంలో బ్రిటన్ రాణి ఇచ్చే గౌరవ విందును స్వీకరించనున్నారు. ఆ తర్వాత బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేథరిన్లను కలవనున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ప్రకటించింది. ఈ వారంలో బ్రిటన్ పర్యటనకు అధ్యక్షుడు ఒబామా, మిషెల్లీ వెళుతున్నారు. శుక్రవారం జరిగే ఆమె 90వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కెన్సింగ్టన్ ప్యాలెస్ లో రాజు, రాణిలను ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ వారి రాక కోసం తాము ఎంతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా అతిథి సేవలు చేయాలనుకుంటున్నామని ప్రకటించారు. -
'హిల్లరీలా అధ్యక్ష పదవికి ఆశపడను'
వాషింగ్టన్: అధ్యక్షపదవిపై తనకు అంతగా మోజు లేదని అమెరికా ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా వ్యాఖ్యానించారు. టెక్సాస్ లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. అమెరికాలో రాజకీయాల కంటే కూడా వేరే విషయాలలోనే తన ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షపదవికి బరిలో దిగేందుకు హిల్లరీ క్లింటన్ లా తాను సిద్ధంగా లేనని స్పష్టంచేశారు. దాదాపు 6కోట్ల మంది విద్యార్థినులు స్కూలుకు వెళ్లడం లేదని ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఓ పాటను పాడి వినిపించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా... అమెరికా అధ్యక్షపదవి తనకు ఇష్టం లేదని మరోసారి ఆమె ఉద్ఘాటించారు. వైట్ హౌస్ కు బయట ఉంటేనే తాను ఎన్నో పనులు చేయగలనని ధీమా వ్యక్తంచేశారు. తాను బయట ఉంటే సాధారణ పౌరులు కూడా తన మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చమత్కరించారు. వివాదాలకు అవకాశాలు ఇవ్వకూడదని, సమస్యలపై పోరాడటం తన లక్ష్యమని ఊబకాయం సమస్యపై దృష్టిపెట్టామన్నారు. ఎనిమిదేళ్ల వైట్ హౌస్ నివాసం తర్వాత తన కూతుళ్లు మలియా, సాషాలు ఎక్కడైనా హాయిగా బతకగలిగేలా ఉంటే చాలని, ఇప్పటివరకు మాకు ఇది చాలు అని మిషెల్ ఒబామా వివరించారు. -
మిషెల్ ‘కిక్’..
మీరు చూస్తున్నది నిజమే.. ఇక్కడ కిక్ బాక్సింగ్లో ఇరగదీస్తున్నది అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామానే. ఆరోగ్యకర జీవనానికి సంబంధించి తన ‘లెట్స్ మూవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె 2 నిమిషాల వర్క్అవుట్ వీడియోను విడుదల చేశారు. అందులోనివే ఈ చిత్రాలు. ఓ చిత్రంలో ఆమె ఒక్కోటి 15 కిలోల బరువున్న డంబెల్స్తో కసరత్తు చేయడం విశేషం. -
డ్యాన్స్ చేసిన మిచెల్ ఒబామా
-
మిసమిషెల్
మనం ధరించిన దుస్తులను చూసి విదేశీయులు నచ్చి, మెచ్చి వాటిని గౌరవించడం మనకు తెలుసు. అయితే ఒక విదేశీ వనిత ధరించిన మన దేశీ దుస్తులు టాక్ ఆఫ్ ది వరల్డ్ కావడం.. అవి మనకు అద్భుతంగా అనిపించడం.. ఇప్పుడు ఆ స్టైల్స్ని అనుసరించడానికి ఫ్యాషన్ లవర్స్ ఆరాటపడటం.. జరుగుతోంది. అంటే నిజంగా ఆ విదేశీ వనితను అభినందించాల్సిందే. ఆ ఘనత దక్కించుకుంది మరెవరో కాదు మిషెల్ ఒబామా. ఇప్పుడు సిటీ ఫ్యాషన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది ట్రెండ్స్. . .:: ఎస్.సత్యబాబు అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన భర్తతో సహా మన దేశానికి వచ్చారు. తిరిగి వెళ్లనూ వెళ్లారు. మనదేశంతో అనుబంధాల గురించి మాట్లాడి ఒబామా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నట్టే.. అద్భుతమైన డిజైనర్ దుస్తులతో మిషెల్ కూడా అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సిటీజనులకు ట్రెండ్ సెట్టర్ అయ్యారు. క్రేజీ కాంబినేషన్... మిషెల్ ధరించిన దుస్తులు క్రేజీ కాంబినేషన్గా అందరి మెప్పునూ పొందుతున్నాయి. పాపీ ప్రింట్ కోట్ కు కేప్ కోట్, సింపుల్ బ్లాక్ పంప్స్ కాంబినేషన్తో లుక్ని మెరిపించిన మిషెల్.. డ్రెస్సింగ్ ఇప్పుడు సిటీ డిజైనర్స్కు హాట్ ట్రెండ్ అయింది. సిటీలో పలువురు ఫ్యాషన్ ప్రియులైన అమ్మాయిలు మిషెల్ డ్రెస్సింగ్ స్టైల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటంతో.. సిటీ డిజైనర్లు అర్జెంట్గా తమ అస్త్రాలకు పదును పెట్టి ఆ తరహాలో వెరైటీ డిజైన్లకు శ్రీకారం చుడుతున్నారు. బ్లూ ఫ్లోరల్ మోటిఫ్స్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ నీ లెంగ్త్ డ్రెస్ను ఆమె ప్రత్యేకంగా మన భారత్ సందర్శన కోసం రూపొందించుకున్నారు. దీనిలో ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి రానున్న స్ప్రింగ్ సమ్మర్కి సంబంధించిన లేటెస్ట్ కలె క్షన్. దీన్ని ‘షీట్’ డ్రెస్ అని పిలుస్తారు. మిషెల్ ధరించిన దుస్తుల్లో కోట్, డ్రెస్ రెండింటికీ ఒకే ఫ్యాబ్రిక్ వాడారు. ఇది కొత్త ట్రెండ్. ఆమె ధరించిన దుస్తులకు వాడింది పాలియస్టర్ బ్లెండ్లో సూతింగ్ ఫ్యాబ్రిక్ అయి ఉంటుందని సిటీ డిజైనర్ నీరజ కోన అంటున్నారు. భారతీయ డిజైన్ల అభిమాని... తాజా మిషెల్ పర్యటన కోసం దుస్తుల్ని డిజైన్ చేసింది జన్మతః ఒడిసాలోని రూర్కెలా వాసి, ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్న భారతీయ డిజైనర్ బిభూ మహాపాత్ర. భారతీయ డిజైన్లకు ప్రపంచవ్యాప్త కీర్తి తీసుకొచ్చారు మిషెల్. ఇప్పుడే కాదు అమెరికాలో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్కు ఆమె జన్మతః ముంబై వాసి అయిన డిజైనర్ నయీమ్ ఖాన్ దుస్తులను ధరించారు. గత 2010లో భారత సందర్శనకు వచ్చినప్పుడు కూడా ఆయనే రూపొందించిన మెటాలిక్ కాలమ్ను ధరించారు. అదే ఏడాది 33వ యాన్యువల్ కెన్నెడీ సెంటర్ హానర్స్ కార్యక్రమానికి సైతం ఆమె నయీమ్ డిజైన్ చేసిన స్లీవ్లెస్ గౌన్నే ధరించారు. తర్వాతి ఏడాది జర్మన్ చాన్స్లర్ అంజెలా మెర్కెల్ కోసం నిర్వహించిన స్టేట్ డిన్నర్లో ఆమె బ్రీడెడ్ కాలమ్ ధరించారు. బ్రెజిలియన్ ప్రెసిడెంట్ డిల్మా రూసెఫ్ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా ఆమె నీ లెంగ్త్ ఎంబ్రాయిడరీ డ్రెస్ను ఎంచుకున్నారు. 2012లో భారత్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా న యీమ్ ఖాన్, రాచెల్రాయ్ల డిజైన్లను ధరించిన మిషెల్ ఇప్పుడు కూడా తన భారతీయ ఫ్యాషన్ ప్రియత్వాన్ని చాటుకున్నారు. పెద్దన్నలో అర్ధభాగమైన మిషెల్ ఒబామా డ్రెస్సింగ్ స్టైల్స్లో మన డిజైన్లు ఒక విడదీయలేని భాగం అయిపోవడం విశేషం. ట్రెండీ డ్రెస్ అది... మిషెల్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు ధరించిన డ్రెస్ రియల్లీ ట్రెండీ. దీని వల్ల ఇండియన్ డిజైనర్ బాగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు. నీ లెంగ్త్ షీట్ డ్రెస్. ఇప్పుడు సిటీలో చాలా మంది అమ్మాయిలు ఈ వెరైటీ కాంబినేషన్పై ఆసక్తి చూపుతున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చారనే కాదు గతంలో కూడా అమెరికాలో తను పాల్గొన్న పలు కార్యక్రమాల్లో మిషెల్ ఇండియన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించారు. అయితే ఈసారి డ్రెస్సింగ్ బాగా ఎలివేట్ కావడంతో గతంలో మిషెల్ ధరించిన ఇండియన్ డిజైనర్స్ డ్రెస్ల గురించి కూడా సిటీ అమ్మాయిలు నెట్లో సెర్చ్ చేస్తున్నారు. - నీరజ కోన, టాలీవుడ్ స్టైలిస్ట్ -
మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!
సౌదీ అరేబియా పర్యటనలో మిషెల్ ఒబామా బురఖా ధరించకపోవడం అక్కడ పెద్ద వివాదానికి కారణమైంది. భారతదేశ పర్యటన ముగించుకుని సౌదీ అరేబియా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్.. తన దుస్తుల తీరును కొంతవరకు మార్చుకున్నారు. ఇక్కడ కాస్త పొట్టి గౌన్లలో కనిపించిన ఆమె, అక్కడ పొడవాటి ప్యాంట్లు కూడా ధరించారు. అయినా కూడా బురఖా లేదన్న కారణంతో ఆమె ముఖాన్ని సౌదీ అధికారిక చానల్లో బ్లర్ చేసి చూపించారని పెద్ద వివాదం రేగింది. అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని, వాస్తవాలు చూడాలి తప్ప ఫేస్బుక్ వివాదాల మీద ఆధారపడొద్దని సౌదీ ఎంబసీ ట్వీట్ చేసింది. వాస్తవానికి యూట్యూబ్లో పోస్ట్ చేసిన క్లిప్పింగులలో అయితే సౌదీ అరేబియా టీవీ మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చూపించినట్లు ఉంది. అయితే, ప్రత్యక్ష ప్రసారం చూసినవాళ్లు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఇదంతా పెద్ద వివాదంగా మారింది. గల్ఫ్ దేశాల్లో మహిళల దుస్తుల మీద సాధారణంగా కఠినమైన నిబంధనలుంటాయి. మహిళలు తప్పనిసరిగా బురఖా వేసుకోవాలి, ముఖం కూడా కప్పుకోవాలి. అయితే విదేశీయులకు మాత్రం ఈ నిబంధన ఉండదు. -
తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్
న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్మహల్ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ మేరకు బదులిచ్చారు. ఆగ్రా పర్యటన రద్దు కావడం తనకు నిరాశ కలిగించిందన్నారు. వాస్తవానికి ఒబామా దంపతుల భారత పర్యటన షెడ్యూల్లో మంగళవారం తాజ్ సందర్శన ఉన్నప్పటికీ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సౌదీ వెళ్లాలని ఒబామా నిర్ణయించుకోవడంతో షెడ్యూల్ను కుదించారు. తాజ్మహల్ను ఇప్పటివరకూ పలువురు దేశాధినేతలు కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. 2010లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తన భార్య కార్లా బ్రూనీ 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సీతో కలసి తాజ్ను వీక్షించారు. -
మెరిసిపోయిన మిషేల్ డ్రెస్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ డ్రెస్ జిగేల్మంది. నలుపు రంగు డ్రెస్పై తెల్ల గీతలు.. వాటిపై నీలి రంగు పూల డిజైన్తో మిషెల్ మెరిసిపోయారు! మోకాళ్ల వరకున్న ఈ డ్రెస్పై మ్యాచింగ్ కోటు ధరించారు. ఈ దుస్తులను న్యూయార్క్లోని భారతీయ డిజైనర్ బిహు మహాపాత్ర రూపొందించారు. ఒడిషాలోని రూర్కెలాకు చెందిన బిహు అమెరికాలో ప్రఖ్యాత డిజైనర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన బెనారస్లో ఓ ప్రత్యేకమైన పట్టుచీర మిషెల్ కోసం రూపొందించారు. పూర్తిగా చేతితో నేసిన ఈ చీరలో సన్నని బంగారు, వెండి పోగులు వాడారు. 400 గ్రాములు ఉండే ఈ చీర ఖరీదు లక్షా 50 వేల రూపాయలు. బెనారస్కు చెందిన ముగ్గురు నిపుణులు దీన్ని మూడు నెలలు కష్టపడి తయారు చేశారు. శనివారమే దీన్ని దేశ రాజధానికి తీసుకువచ్చారు. -
ప్రత్యేక ఆకర్షణగా మిషెల్ ఒబామా!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఒబామా వెంట ఎక్కడికి వెళ్లినా తన ప్రత్యేకత నిలుపుకునే మిషెల్ భారత్ పర్యటనలోనూ దాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆమె ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యూయార్క్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన డిజైనర్ బిభు మహాపాత్ర డిజైన్ చేసిన దుస్తులు ఆమె ధరించారు. జియోమెట్రిక్- ప్రింట్ బ్లాక్, తెలుపు , నీలం రంగు కలయికతో చూడగానే ఆకట్టుకునేవిధంగా ఈ డ్రెస్ రూపొందించారు. ఇక సెలబ్రిటీ మహిళలకు దుస్తులు రూపొందించడంతో బిభు మహాపాత్ర పేరు గాంచారు. -
ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ
వారణాసి: ఈ-కామర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాలని వ్యాపారస్తులకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మార్కెట్ కు సంబంధించి మాట్లాడిన మోదీ.. ఈ కామర్స్ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు. " ఈ కామర్స్ మార్కెట్ లో సృజనాత్మకత, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రాబోయే ఇరవై ఏళ్లలో 20 కోట్ల మంది యువతులు వివాహానికి సిద్ధమవుతారు. వాళ్లందరి కోసం ఇరవై కోట్ల చీరలు అవసరమవుతాయి. ఇంతటి పెద్ద మార్కెట్ మీ కోసం ఎదురుచూస్తోంది'' అని మోడీ వస్త్ర వ్యాపారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఉత్పత్తిలో నాణ్యతను పెంచి, మంచి డిజైన్లు రూపొందించి, మంచి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. వారణాసిలోని దాదాపు 40 వేల మంది ముస్లింలు దశాబ్దాలుగా వివిధ రకాల చేతివృత్తుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. -
సాషా, మలియాలు రావట్లేదు
వాషింగ్టన్: భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల వెంట వారి కుమార్తెలు సాషా(16),మలియా(13) లు రావటం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా ప్రథమ కుమార్తెలిరువురూ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తారని, స్కూలుకు సెలవులు ఉన్నపుడు మాత్రమే తల్లిదండ్రులతో కలసి విదేశీ ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ గురువారం విలేకరులకు వెల్లడించారు. -
మిషెల్ ఒబామాకు ఊహించని కానుకలు
-
తెరకెక్కనున్న ఒబామా ప్రేమకథ!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు.. తన భార్య మిషెల్ అంటే ఎనలేని ప్రేమ ఉంది. వీరిద్దరి ప్రేమకథను తెరకెక్కించి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచన కొంతమందికి వచ్చింది. అంతే.. వెంటనే అమెరికా తొలి జంట ప్రేమకథను సినిమాగా తీయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. సౌత్ సైడ్, యూ విల్ అనే రెండు సంస్థలు కలిసి సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసుకుంటున్నాయి. మిషెల్ యుక్తవయసులో ఉన్నప్పటి పాత్రకు టికా సంప్టర్ను ఎంచుకున్నారు. ఒబామా పాత్రకు ఎవరు సరిపోతారా అని ఇంకా వెతుకుతున్నారు. బరాక్ ఒబామాతో కలిసి మిషెల్ తొలిసారిగా చికాగోలోని ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో డూ ద రైట్ థింగ్ అనే ప్రదర్శన చూసిన సంఘటనను ఈ సినిమాలో బాగా హైలైట్ చేస్తారని సమాచారం. తాను స్వయంగా రాసిన స్క్రీన్ప్లే ఆధారంగా రిచర్డ్ టేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ట్రేసి బింగ్, స్టెఫానీ అలైన్ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. -
త్వరలో యూఎస్ కు మహిళ దేశాధ్యక్షురాలు
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అతి త్వరలో మహిళ అధిరోహించనుందని ప్రస్తుత దేశాధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా వెల్లడించారు. మహిళ అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు యూఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం వాషింగ్టన్లో యూఎస్ అధ్యక్ష భవనం సిబ్బంది కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన భేటీలో మిషెల్లీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రానున్న ఎన్నికల్లో మహిళ దేశాధ్యక్షురాలిగా ఎన్నికవుతారా అంటూ వారు అడిగిన ప్రశ్నకు మిషెల్లీ ఒబామాపై విధంగా స్పందించారు. దేశంలో ఎవరైనా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించవచ్చు అని అన్నారు. అందుకు కులమతాలు, ఆర్థిక అసమానతలు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుగోడలు కావని మిషెల్లి వివరించారు. మిషెల్లీ చెప్పిన సమాధానంతో వైట్ హౌస్ ప్రాంగణం చప్పట్లతో మారు మోగింది. అయితే 2016లో అమెరికా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఆ ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీచేయనున్న సంగతి తెలిసిందే. -
మిషెల్ ఒబామా బట్టల బిల్లు కట్టేదెవరు?
మామూలుగానే అమెరికా అధ్యక్షుడి భార్యలు భలే హై ప్రొఫైల్ గా ఉంటారు. సందర్భోచిత దుస్తులతో దర్శనమిస్తారు. వాళ్ల స్టయిల్, వేసుకున్న దుస్తుల గురించి ఫాషన్ మాగజైన్ల నుంచి టాబ్లాయిడ్ల దాకా తెగ చర్చిస్తారు. ఇక ఒబామా శ్రీమతి మిషెల్ దుస్తుల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆమె 'మోస్ట్ స్టైలిష్ ఫస్ట్ లేడీ' గా ఇప్పటికే పేరొందారు. గంటకో స్కర్టు, గడియకో గౌను తో ఆమె దర్శనమిచి, కెమెరామెన్లకు బోలెడంత పనిపెట్టారు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఎవరు భరిస్తారు? ఆమెకు జీతం లేదు. వార్డ్ రోబ్ అలవెన్స్ కూడా లేదు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఆమే భరిస్తారు. మామూలుగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫస్ట్ లేడీకి దుస్తులు గిఫ్ట్ ఇవ్వడమూ జరుగుతుంది. కానీ వాడిన తరువాత వాటిని వెంట తీసుకెళ్లడానికి వీలుండదు. అమెరికన్ జాతీయ వస్తు సంగ్రహాలయానికి పంపించాలి. అక్కడే వాటిని భద్రపరచి ఉంచుతారు. -
అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!
అమెరికన్ మ్యూజికల్ డ్రామా సిరీస్ 'నాష్ విల్లే' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా అతిధి పాత్రలో దర్శనివ్వనున్నారు. మే 7 తేదిన ప్రసారం కానున్న ఏబీసీ డ్రామా ఎపిసోడ్ లో యూఎస్ ప్రథమ పౌరురాలు మిచెల్లీ అతిధి పాత్రలో కనిపించనున్నారు. కోని బ్రిటన్ సరసన మిచెల్లీ నటించనున్నారని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఇకముందు ఇలాంటి పాత్రలు చేస్తానని అనుకోవడం లేదని, దేనికి వెనకంజ వేయడం తన నైజం కాదని మిచెల్లీ అన్నారు. ఏది మంచి అనుకుంటే దాన్ని మహిళలు స్వీకరించాలని మిచెల్లీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోని ఓ క్యారెక్టర్ అఫ్ఘనిస్తాన్ లో గాయపడటంతో మిచెల్లీకి ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఓ చారిటీ షోలో పాల్గొనాల్సిన మిచెల్లీ ఈ కార్యక్రమంలో నటించడానికి ఒప్పుకున్నారు. -
బఫెట్ అయినా.. బరాక్ భార్య అయినా
డబ్బు సంపాదించడం ఒక ఎత్తు.. సంపదను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. కోట్లు సంపాదించినా.. ఎంతంటే అంత ఖర్చు చేయగలిగే స్తోమత ఉన్నా కొందరు సెలబ్రిటీలు ఏ చిన్నది కొనాలన్నా ఎక్కడ చౌకగా దొరుకుతుందో చూసుకుంటూ ఉంటారు. విలాసాల కోసం భారీ ఖర్చుల జోలికి పోరు. ప్రసిద్ధ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ మొదలుకొని.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ దాకా పలువురు ఈ కోవకి చెందిన వారే. పొదుపు విషయాల్లో ఆదర్శంగా నిలిచే.. ఈ సెలబ్రిటీలు పాటించే జాగ్రత్తలేమిటో చూద్దామా.. వారెన్ బఫెట్.. పెట్టుబడులు పెట్టే విషయంలో అందరికీ గురువులాంటి బఫెట్ సంపద దాదాపు 58 బిలియన్ డాలర్ల పైమాటే (సుమారు రూ. 3,48,000 కోట్లు). ఇంత ఆస్తి ఉన్నా ఆయన మాత్రం గత 54 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. 1958లో 31,500 డాలర్లకు కొనుక్కున్న ఈ ఇంటిలో అయిదు బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉంటున్న ప్రాంతంలో ఈ తరహా ఇంటి విలువ అప్పటి రేటుతో పోలిస్తే పన్నెండు రెట్లు ఎక్కువ పలుకుతోందట. అందుకే ఇది తనకు సంబంధించి మూడో ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్ అంటారు బఫెట్. (తన మొదటి, రెండో భార్యకు కొనిచ్చిన ఉంగరాలను తొలి రెండు ఉత్తమ పెట్టుబడులు అంటారాయన). మిచెల్లీ ఒబామా.. అవడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి భార్య అయినా, చెప్పుకోతగినంత సంపద ఉన్నా.. మిచెల్లీ భారీ ఖర్చుల జోలికి పోరు. ఒబామా కుటుంబానికి సుమారు 8 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంది. ఫ్యాషన్ ఐకాన్గా కూడా పేరొందినప్పటికీ మిచెల్లీ మాత్రం చాలా ఆచి తూచి ఖర్చు చేస్తారట. కుటుంబానికి కావల్సిన వస్తువులను ఎక్కడ మెరుగ్గా డిస్కౌంట్లు ఇస్తారో చూసుకుని వెళ్లి కొనుక్కుంటుంటారు. ఫ్యాషన్ విషయంలోనూ అంతే. ఖరీదైనవి కొనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ.. చౌక స్టోర్స్లో కూడా షాపింగ్ చేస్తుంటారామె. క్రితంసారి 35 డాలర్లు పెట్టి (రూ.2,100) కూడా డ్రెస్ కొనుక్కున్నారట. హిల్లరీ స్వాంక్.. రెండు సార్లు ఆస్కార్ అవార్డులను అందు కున్న హాలీవుడ్ నటి హిల్లరీ స్వాంక్. ఆమె సంపద దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుంది. నటిగా నిలదొక్కుకునే క్రమంలో.. నివసించడానికి ఇల్లు కూడా లేకపోవడంతో కారునే ఇల్లుగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దశ తిరిగి కోట్లు వచ్చినా.. డబ్బు లేనప్పుడు తాను పడిన కష్టాలను మర్చిపోలేదు హిల్లరీ. అందుకే విలాసాల జోలికి పోదు. టూత్పేస్టు నుంచి టాయిలెట్ పేపర్ దాకా ఎక్కడ చౌకగా వస్తాయో చూసుకుని హోల్సేల్గా కొంటుంది. డిస్కౌంటు కూపన్లలాంటివి దాచిపెట్టి షాపింగ్కి వెళ్లినప్పుడు సద్వినియోగం చేసుకుంటుంది. స్నోరెటోరియా.. కోటీశ్వరుల్లో పైసా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే వారితో పాటు.. అనవసరమైన వాటిపై కోట్లు ఖర్చు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారిలో హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ కూడా ఉన్నాడు. ఒక రేంజిలో గురక పెట్టే క్రూయిజ్ లాంటి వారు .. లేటెస్టుగా స్నోరెటోరియంలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. వినడానికి ప్లానెటోరియంలాగా ఉన్నా.. ఇది ఆ కోవకి చెందినది కాదు. హాయిగా గురక పెట్టి పడుకోవాలనుకునే వారికి ఉపయోగపడే బెడ్రూమ్ లాంటిది ఇది. ఈ గదిలో ఉన్న వారు ఎంత గురక పెట్టినా శబ్దం బైటికి రాకుండా సౌండ్ ప్రూఫ్ చేసి ఉంచుతారట. తన 2 కోట్ల పౌండ్ల పైగా ఖరీదైన ఇంటిలో ఇలాంటి స్నోరెటోరియాన్ని కట్టుకున్నాడు క్రూయిజ్. గతంలో కొందరు హాలీవుడ్ స్టార్స్.. అణుబాంబు దాడులు జరిగిపోతాయేమోనన్న భయంతో.. ఇలాగే ఇళ్లల్లో న్యూక్లియర్ షెల్టర్లు కూడా కట్టుకున్నారు. -
త్వరలో ఒబామాకు మిషెల్ విడాకులు?
-
మిచెల్ నృత్యానికి అరుదైన గౌరవం
న్యూయార్క్ : అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా బాలీవుడ్ నృత్యానికి అరుదైన గౌరవం దక్కింది. వైట్హౌజ్కు సంబంధించిన టాప్-10 ఫోటోలలో మిచెల్ చేసిన బాలీవుడ్ నృత్యానికి చోటు దక్కింది. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని వైట్హౌజ్ లోని స్టేట్ డైనింగ్ రూంలో మిచెల్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ళక్రితం ఇండియాకు వచ్చినప్పుడు ముంబైలో బాలీవుడ్ గీతాలతో పరవశించి డ్యాన్స్ చేసిన మిచెల్ ఈసారి కూడా దీపావళి వేడుకల్లో వినిపించిన బాలీవుడ్ సంగీతానికి పరవశించిపోయి నృత్యం చేశారు. కాగా మిచెల్కు మొదటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం...అది అమెరికాదా లేదా భారతీయ సంగీతమా అని కాదు... ఏదైనా సరే కాలు కదపాల్సిందే. మంద్రంగా సాగే సంగీతానికి నాట్యం చేయడమంటే మిచెల్కి ఇష్టం. -
నా బర్త్డే పార్టీకి భోంచేసి రండి
వాషింగ్టన్: ఎవరైనా పుట్టినరోజు వేడుకల్లో ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. అనంతరం వారి హోదాకు తగ్గట్టుగా డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మరి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా తన పుట్టినరోజును ఎలా జరుపుకోనున్నారా తెలుసా? భారీ హంగామాలు ఏమీ లేవు. పార్టీ ఇస్తారు.. కానీ భోజనం ఉండదు. ఆమె జన్మదిన వేడుకలకు ఆహ్వానం అందిన అతిథులు భోజనం చేసేసి పార్టీకి వెళ్లాలి. లేకుంటే వారికి ఆ పూట పస్తే! తన పార్టీలో ఎలాంటి ఆహారం ఉండదని, అందువల్ల అంతా ఇంటి దగ్గరే తినేసి రావాలని మిషెల్ స్వయంగా తన అతిథులకు సూచించారు. ఈనెల 17న అమెరికా ప్రథమ పౌరురాలు తన 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మరుసటి రోజున శ్వేతసౌథంలో పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలకు వచ్చే అతిథులు సౌకర్యవంతమైన బూట్లు వేసుకోవాలని, ముందుగానే డ్యాన్స్ప్రాక్టీస్ చేసుకోవాలని, సుష్టుగా తినేసి రావాలని మిషెల్ సూచించారు.