poor people
-
మీ కాళ్ళు మొక్కుతాం.. మా కడుపులు కొట్టొద్దు
-
అర్ధరాత్రి దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చేసిన పోలీసులు
-
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
-
చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు
‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..! (చదవండి: ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!) -
అంధకారం లోనే అంధ వృద్ధ దంపతులు .. మానవత్వం చాటుకున్న నాగోల్ సీఐ
-
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
అ‘సామాన్యులు’ వైఎస్సార్సీపీ తరఫు అభ్యర్థుల్లో నిరుపేదలు..
సాక్షి నెట్వర్క్: అటుపక్క.. ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ చూస్తే కళ్లు చెదిరే స్థిరాస్తులు.. మతిపోయే చరాస్తులు. వేలకోట్ల ధనికస్వాములూ ఉన్నారు. దేశంలోనే అపర కుబేర అభ్యర్థుల్లోని వారూ ఆ బ్యాచ్లో కొలువుదీరారు. ఇలా పెత్తందారులంతా ఒక్కటై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి తరఫున రాష్ట్ర ఎన్నికల కదనరంగంలో మోహరించారు. వీరికి దన్నుగా కోటానుకోట్ల సంపద ఉన్న ఐశ్వర్యవంతులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడెక్కడి నుంచో వారి తరఫున రాష్ట్రంలో వాలిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానులను ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ కుటుంబానికి రూ.3–4 లక్షలు వెదజల్లయినా వారిని లోబరుచుకునేందుకు వీరంతా బరితెగిస్తున్నారు.కానీ, ఇటుపక్క చూస్తే పేదలకు కొమ్ముకాసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా సై అంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఈ పార్టీ బలగం. ఈ పార్టీ ఎంపిక చేసిన అనేకమంది అభ్యర్థుల ఆర్థిక స్థోమత కూడా అంతంతమాత్రమే. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులున్న వారేమీ కాదు. కేవలం కోటి రూపాయలు అంతకన్నా తక్కువ ఆస్తి ఉన్న వారూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేస్తూ రూ.కోటి లోపు ఆస్తి ఉన్న అభ్యర్థులు ఎవరంటే.. ► శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్లోని వివరాలను పరిశీలిస్తే.. ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్ రూ.27,883 మాత్రమే ఉంది.గుడిబండ కెనరా బ్యాంకులో రూ.41, ఇదే మండలంలోని మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ.26,950 , అగళి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ.11, మడకశిర యూనియన్ బ్యాంకులో రూ.881 బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అదే విధంగా అప్పు రూ.1,13,050 ఉంది. గుడిబండ కెనరా బ్యాంకులో వ్యక్తిగత రుణం రూ.86,100, మందలపల్లి ఏడీసీసీ బ్యాంకులో రూ,26,950 అప్పు ఉంది. రూ.99,883 విలువ చేసే చరాస్తులు ఈరలక్కప్పపేరు మీద ఉన్నాయి. అలాగే చేతిలో రూ.10 వేలు ఉన్నట్లు అఫిడవిట్లో ఈరలక్కప్ప పేర్కొన్నారు. ► అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎం.వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. సెంటు స్థలం కానీ, తులం బంగారం కానీ లేదు. నామినేషన్లో ఈయన సమర్పించిన అఫిడవిట్ను పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యంత పేద అభ్యర్థుల్లో ఒకరన్న విషయం స్పష్టమవుతోంది. ఈయన పేరున విలువైన చరాస్తులు రూ.1,06,478 ఉన్నాయి.ఇందులో చేతిలో నగదు రూ.50 వేలు, అనంతపురం ఎస్బీఐలో రూ.11,193, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కొత్తూరు బ్రాంచ్)లో రూ.10,002 నగదు నిల్వ ఉంది. అలాగే, 2020లో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం ఉంది. దీని విలువ రూ.35 వేలు. ఇక ఆయన భార్య పేరున శింగనమలలోని కెనరా బ్యాంక్లో కేవలం రూ.283 నగదు ఉంది. ► పాడేరు అసెంబ్లీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వరరాజు పేరు మీద రూ.20,39,512లు, భార్య పేరున రూ.16,20,320లు, ఇద్దరు పిల్లల పేరున రూ.7,25,927లు, రూ.7,12,606లు కలిపి మొత్తం రూ.50,98,365ల ఆస్తులున్నాయి. రూ.1,20,000 గోల్డ్లోన్ అప్పు ఉంది. ► రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మొత్తం ఆస్తి రూ.53,45,321లు. ఈమె చేతిలో ఉన్న నగదు రూ.2,50,000. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నది రూ.23,72,821లు. ఇన్నోవా కారు రూ.11,22,500, బంగారు ఆభరణాల విలువ రూ.16,00,000, బ్యాంకులో అప్పు రూ.1,76,223లు ఉంది. ► కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి రూ.4,27,066లు. స్థిర, చరాస్తులు రూ.1,89,642లు. తన పేరుతో మైలవరం సెంట్రల్ బ్యాంకు అకౌంట్లో రూ.88, మైలవరం కెనరా బ్యాంకులో రూ.1000, మైలవరం మండల పుల్లూరు ఎస్బీఐ అకౌంట్లో రూ.9,823లు.. రూ.73,531 విలువ గల 2016 మోడల్ బైకు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల బంగారు ఉంగరం.. చేతిలో క్యాష్ రూపంగా రూ.50వేలు ఉన్నాయి. ఇందులో ఆయన భార్య పేరున మైలవరం యూనియన్ బ్యాంకులో రూ.1,624లు.. రూ.55,200 విలువ గల 8 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు.. రూ.1,65,600 విలువ గల 24 గ్రాముల బంగారు చైను.. చేతిలో క్యాష్ రూపంగా రూ.15వేలు ఉన్నాయి. -
CM Jagan: ఏ కష్టం వచ్చినా.. క్షణం కూడా ఆలోచించకుండా సాయం (ఫొటోలు)
-
రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం శుభవార్త
-
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు. ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. జియో ట్యాగ్ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు. కేటాయించిన ప్లాట్లో ఫోటో దిగి జియోట్యాగ్ చేయడమంటే వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్ స్థాయిలోనూ, మిగతావి బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది. రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అధికారులకు లేఅవుట్ అభివృద్ధి కోసం అప్పగించారు. -
నేనున్నానంటూ ఓ పేద కుటుంబానికి సీఎం జగన్ భరోసా
-
#HBDYSJagan జయహో జననేతా..ఏ దైవం పంపించాడో!
జనం మాటే. జగన్ బాట. ఆపదలో ఆపన్నహస్తం. కష్టాల్లో తోడు నీడ. అనేకమంది ఆశలకు, ఆశయాలకు రెక్కలు...ఏ దైవం పంపాడో ..పండగలా దిగివచ్చిన దేవుడు. తమ నీడకు నీడై, తోడుకు తోడై..వెలుగు పూలు పూయించిన జనహృదయనేత. జయహో జగన్. ఇదీ జనం మాట! అడగనిదే అమ్మ అయినా పెట్టదు అనేది సామెత. అన్నా..అని సాయం కోరితే చాలు.. నేనున్నానంటూ ఇచ్చే కొండంత ధైర్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాకూ ఓ జగన్ కావాలనేంత.. భరోసా! మాట నిలబెట్టు కోవడంలో, హామీలను తు.చ. తప్పకుండా నెరవేర్చడంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తరువాతే ఎవరైనా. అన్నదాతలను అక్కున చేర్చు కోవడం దగ్గరినించి వైద్య ఆరోగ్య సేవల వరకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ల నుంచి , మహిళా సాధికారత వరకు, చదువుల నుంచి పౌరసేవల దాకా అన్నింటా ఆయనొక భరోసా.పేదలు గెలిచే వరకు.. వారి జీవితం బాగుపడే వరకు.. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.Telugu Rap Song 🔥#HBDYSJagan pic.twitter.com/aQ812SOH5H— Roja Selvamani (@RojaSelvamaniRK) December 21, 2023ఆడపడుచులకు అండగా, బిడ్డలకు విద్యా దీవెనగా, పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు ఆయన మానస పుత్రికలు. కనుకనే ఎన్ని విమర్శ లొచ్చినా నిండుమనసుతో అమలు చేస్తున్న నిబద్ధత ఆయన సొంతం. అందుకే మాట తప్పని నేతగా, జననేతగా నిలిచారు. అంతేకాదు కరువొచ్చినా, కష్టమొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, అరుదైన వ్యాధి వచ్చినా, చదువు కోవాలన్నా ‘నేను ఉన్నాను’ అంటూ ఆదుకునే ఆ మంచి మనసు భరోసా నభూతో నభవిష్యతి. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రుజువు చేస్తూ జననీరాజనాలు అందుకుంటున్నారు సీఎం జగన్. అవినీతికి, వివక్షకు తావులేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వేగిరమే ముందుకు రావడమే కాదు. ప్రకటించిన సంబంధిత సాయాన్ని తక్షణమే అందించడంలో ఆయన తీరే వేరు. బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో గానీ, ఉద్యోగార్థులకు ఉద్యోగావకాశాన్ని కల్పించడంలో గానీ, ముఖ్యంగా తుపాను సమయాల్లో, ప్రభావిత ప్రాంతాలను పర్యటించడంలోగానీ, బాధితులను ఆదుకోవడంలోగానీ సీఎం జగన్ ఎపుడూ ముందే ఉంటారు. బాధితులను ఆదుకునేలా వెనువెంటనే సాయాన్ని అందించే పెద్ద మనసు. అలాగే ఆరుగాలం పండించిన పంట పాడైపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను ఓదార్చి, వరద ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని యుద్ధ ప్రాతిపదికన జమచేసిన ఘనత ఆయనది. ఇటీవల మిచౌంగ్ తుపాను కారణంగా తడిసిన ధాన్యంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను తీసుకొవడమే ఇందుకు గొప్ప నిదర్శనం.2023లొ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి పైలట్ కావాలన్నకలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రావణి ఏవియేషన్ శిక్షణకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. విజయవాడలో కేన్సర్తో బాధపడుతున్న చిన్నారికి తక్షణమే సాయం, అన్ని విధాలా ఆదకుంటామని హామీ. 2022లో అరుదైన ‘గాకర్స్’ వ్యాధితో బాధపడుతున్న హనీ చిన్నారికి కోటి రూపాయిల సాయం అందించారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి హృదయానికి హత్తుకునే ఘటనలు కోకొల్లలు. ఉద్ధానమా.. గర్వించు!అంతెందుకు ఏ నాయకుడూ నామమాత్రంగా కూడా పట్టించుకోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సంగతి చూడండి. ఉద్ధానం కిడ్నీ బాధితులకిచ్చిన మాటను జగన్ అక్షరాల నెరవేర్చిన సందర్భం అపూర్వం, వేనోళ్ల కీర్తి దగించిందే! దశాబ్దాల తరబడి ఆ ప్రాంత వాసులను వేధించిన సమస్యకు శాశ్వత పరిష్కారంగా వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మచ్చుతునకలు. వీటన్నింటికీ మించి ఆయన రాష్ట్రంలో ఏమూల పర్యటనకు వెళ్లినా.. పేద, గొప్ప, కులం, జాతి మతంతో సంబంధం లేకుండా తన దగ్గరికొచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కున చేర్చుకోవడం ఆయన ప్రత్యేకత. ఏ ప్రజకైనా తమ నాయకుడిని నెత్తిన పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి. (విన్నారు.. ఆదుకున్నారు)కోవిడ్-19 సంక్షోభ సమయంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రజల్ని మహమ్మారి ముప్పునుంచి కాపాడాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును, ప్రశంసల్ని దక్కించుకున్నాయి. కరోనా కష్టకాలంలో తమ ప్రియతమ నేత తీసుకున్న కీలక నిర్ణయాలు, చూపించిన ప్రేమ, ఆదరణను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలు మరువలేరు. సీఎం జనగ్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నతండ్రిలా తమను ఆదుకున్న జన నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ‘‘హ్యాపీ బర్త్డే జగనన్నా.. వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అంటూ నిండు మనసుతో జనం ఆశీర్వదిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ తో మెరుగైన వైద్యం
-
కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్న మనసున్న అమ్మ
ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా! కొంతమంది తల్లులు తమ పిల్లల్లాగే... ఇతరులను సైతం ప్రేమగా చూసుకుంటుంటారు. కడుపున జన్మించక పోయినప్పటికీ ఆ తల్లి చూపే ప్రేమాభిమానాలకు అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బిందు రమాకాంత్ ఘట్ పాండే. బిందుని తన పిల్లలేగాక, వేలాదిమంది ‘అమ్మ’ అని అప్యాయంగా పిలుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెడుతూ ఎందరికో అమ్మగా మారింది బిందు రమాకాంత్ ఘట్పాండే. అంతమందికి అమ్మగా మారిన బిందు గురించి ఆమె మాటల్లోనే.... ‘‘రాజస్థాన్లోని ఝుంఝునులో పుట్టాను. ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబం మాది. నాన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ప్రతి రెండేళ్లకోసారి నాన్నకు బదిలీలు జరిగేవి. దీంతో చాలా భాషలు పరిచయం అయ్యాయి. పంజాబీ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలు చక్కగా మాట్లాడగలను. నా పెళ్లి అయిన తరువాత మా ఆయనతో కలిసి భోపాల్లో స్థిరపడ్డాను. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి కోల్కతా ఐఐఎమ్ టాపర్. అమ్మాయి దుబాయ్లో రేడియో జాకీ. యాంకర్గా పనిచేస్తోంది. పిల్లల బాధ్యతలు తీరాక నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. ఈ సమయంలో సమాజానికి ఏదైనా మంచి చేయాలనిపించింది. ఏం చేయాలా... అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు టీవీలో ‘గ్రాండ్ మదర్స్ కిచెన్’ గురించి చూశాను. అప్పుడే నాకు కూడా ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మా ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. వెంటనే ఇంట్లో భోజనం తయారు చేసి కారులో పెట్టుకుని రోడ్డుమీదకు ఆకలితో ఉన్న వారు కనిపిస్తే వారికి భోజనం పార్శిల్ ఇచ్చేదాన్ని. వాళ్లు తిన్న తరవాత చెప్పే కృతజ్ఞతలతో నాకు కడుపు నిండిపోయేది. అలాగే ఉదయాన్నే పాతిక లీటర్ల గంజి తయారు చేసి వీధికుక్కలకు పోసేదాన్ని. ఆ తరువాత ‘ఉత్కర్షిణి’ పేరిట కిచెన్ను ఏర్పాటు చేశాను. ప్రస్తుతం ఈ ఉత్కర్షిణి వందలాది మంది ఆకలి తీరుస్తోంది. రోజుకో మెను... కిచెన్లో ఎంతో పరిశుభ్రంగా భోజనం వండిస్తాను. తయారీ అంతా నా పర్యవేక్షణలో జరుగుతుంది. రోజుకొక మెను పెడుతున్నాను. ఒక రోజు పప్పు, కూరలు, అన్నం పెడితే.. మరుసటిరోజు రాజ్మా, అన్నం, ఇంకోరోజు పూరీ, కూరలతో వడ్డిస్తున్నాం. పప్పు, అన్నం అయితే ప్లేటు ఐదు రూపాయలకు, రసగుల్లా, హల్వా పూరీ ఉన్న రోజు ప్లేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నాం. మా భోజనం తినేవారి సంఖ్య పెరగడం... ‘‘భోజనం బావుంది, కానీ స్వీట్ ఉంటే బావుంటుంది’’ అని కస్టమర్లు చెప్పడంతో తొలుత హల్వా పెట్టడం మొదలుపెట్టాము. ఇప్పుడు రసగుల్లా కూడా పెడుతున్నాం. ఆకలి తిరడానికి మాత్రమే... ఉత్కర్షిణి కిచెన్లో తయారైన భోజనానికి ఎలాంటి నిబంధనలు లేవు. నిరుపేదల నుంచి ఎవరైనా తినవచ్చు. మా భోజనం తినేవారిలో పారిశుధ్య కార్మికులు, రిక్షా నడిపేవాళ్లు, నర్సులు, డాక్టర్లు, విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎవరికి ఆకలి వేసినా తిని వెళ్లాల్సిందే తప్ప.. ఇంటికి ప్యాక్ చేసి ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులు వేసుకునే ముందు ఏదైనా తినాలని చెప్పి సమోసా, బిస్కెట్లు తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీరు సైతం తినేలా మా కిచెన్ ఆహార పదార్థాలు అందిస్తోంది. అలా వందలమందికి.. నేను పెడుతోన్న భోజనానికి డిమాండ్ పెరగడంతో వంటవాళ్లను పెట్టుకుని వండించడం మొదలుపెట్టాను. ప్రస్తుతం ఆసుపత్రి, దానిపక్కన స్టూడెంట్ క్యాంపస్ ఉంది. అక్కడ భోజనం ప్లేటు ఐదు రూపాయలకు ఇస్తున్నాను. చాలామంది విద్యార్థులు వచ్చి తింటున్నారు. అలా నా దగ్గర భోజనం చేయడానికి వచ్చేవారు నన్ను ‘‘అమ్మ లేదా మా’’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా ఉత్కర్షిణి కిచెన్ కుటుంబం రోజురోజుకి పెరిగిపోతోంది. అందుకే త్వరలో భోపాల్లోని ఇతర ప్రాంతాలకు కూడా నా సేవలను విస్తరించబోతున్నాను. మరింత మంది ఆకలి తీర్చడమే నా లక్ష్యం’’అని చెప్పింది బిందు రమాకాంత్ ఘట్పాండే. -
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్
-
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
Zubeda Ali: నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంచిన కమెడియన్ అలీ భార్య జుబేదా (ఫోటోలు)
-
పేదలపై దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీసా: షర్మిల
హస్తినాపురం: తెలంగాణలో అణగారిన వర్గాలు, పేదలపై పోలీసులు పాశవికంగా దాడులకు పాల్పడటమే ఫ్రెండ్లీ పోలీసా.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం హస్తినాపురంలోని శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు లక్ష్మిని ఆమె పరా మర్శించారు. అనంతరం షర్మిల మాట్లాడు తూ గిరిజన మహిళ అని చూడకుండా లక్ష్మి ని పాశవికంగా చిత్రహింసలకు గురిచేసిన ఎల్బీనగర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో తన కూతురు పెళ్లి ఉందని కార్డు చూపించినా వినకుండా ఎస్ఐ రవికుమార్ చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, 120 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని మంత్రిగాని, ఎమ్మెల్యేగాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు షర్మి ల గంటసేపు ధర్నా చేశారు. అనంతరం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ ఆదేశాలతో షర్మి లను మ హిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు. -
విశాఖ పర్యటనలో మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి, పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని.. తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు. ✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. ✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. ✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం. ✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
కేంద్రం ఒప్పుకోకున్నా ఆ భారం భరించడానికి ప్రభుత్వం సిద్ధం: సజ్జల
సాక్షి, అమరావతి: కలల రాజధాని కట్టబోతున్నామని చంద్రబాబు భ్రమలు కల్పించారు తప్ప చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం జీవం ఏమీ లేదని.. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలతో ఈ ప్రాంతంలో జీవం కన్పిస్తోందన్నారు. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పేదల నిర్మాణాలకి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఆరు నెలలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా 25 ఊర్లు ఈ ప్రాంతంలో రాబోతున్నాయన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఈ భారాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆరు నెలలలో ఊళ్లు వస్తాయి.. పాఠశాలలు, డిజిటల్ లైబ్రరీలు లాంటివి వస్తాయి.. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అన్ని సౌకర్యాలతో కొత్త ఊళ్లు రాబోతున్నాయని అన్నారు. పేదల నివాసానికి అనువుగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు. చదవండి మూడు నెలల తర్వాత ఐటీ ఉద్యోగి సమాధి బద్ధలు.. పిల్లల భవిష్యత్తు కోసమేనట -
‘మంగళగిరిలో లోకేష్ ఓటమి.. అందుకే పేదల ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటోంది’
సాక్షి, అమరావతి: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు.. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి వాటి నిర్మాణాలకి శ్రీకారం చుట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఉండకూడదని సీఎం జగన్ సంకల్పించారని.. అందుకే రాష్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలో 53 వేల మంది నిరుపేదలకి సీఎఆర్డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకి ఈ నెల 24 న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయబోతున్నారని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ న్యాయస్ధానాలను ఆశ్రయించింది.. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి మాత్రం రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణాలకి శ్రీకారం చుడుతున్నారన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి రాజధానిలో పేదల సొంతిళ్ల గృహప్రవేశాలు జరగాలని భావిస్తున్నామన్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడనే కక్షతోనే పేదల ఇళ్ల నిర్మాణాలని టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి ‘ఎంతమంది కలిసొచ్చినా సీఎం జగన్కే ప్రజలు మద్దతు’ -
పేదల సమస్యలపై తక్షణం స్పందిస్తోన్న సీఎం వైఎస్ జగన్
-
పేదరికం.. తగ్గుముఖం
సాక్షి, అమరావతి: ‘పేదరికంపైనే నా యుద్ధం.. పేదల సంక్షేమమే నా లక్ష్యం’ అని విస్పష్టంగా పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధనలో కీలక మైలురాయిని అధిగమించారు. మొత్తం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. విపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో ఎంత బురద జల్లుతున్నా సంక్షేమ ఫలాలు పేదల అభ్యున్నతికి దోహదపడుతున్నట్లు మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక ఈ వాస్తవాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. పౌష్టికాహారం, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంటనూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు కలిగి ఉండటం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ.. గ్రామాల్లో గణనీయంగా తగ్గుదల.. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు. నిరుపేదలు 5.71 శాతం తగ్గారని నీతి ఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గడం గమనార్హం. 2016 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 14.72 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 2.20 శాతానికి తగ్గారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.01 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.43 శాతం పేదరికం తగ్గింది. 12 అంశాల్లోనూ మెరుగైన పనితీరు బహుముఖ పేదరిక నిర్మూలనకు సంబంధించి నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకున్న 12 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు (వంటనూనెల వినియోగం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ వినియోగం, గృహనిర్మాణం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు) ఇలా అన్నింటిలో రాష్ట్రం ప్రగతి సాధించింది. చంద్రబాబు సాధించలేనిది... జగన్ చేసి చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలను అందిస్తున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. పేదరిక నిర్మూలనకు నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిగమించడమే అందుకు నిదర్శనం. బహుముఖ పేదరిక సూచీల ప్రమాణాల ప్రకారం జనాభాలో పేదలు 10 శాతం కంటే తక్కువ ఉండాలని నీతి ఆయోగ్ పేర్కొంది. 2016 డిసెంబర్లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10 శాతం కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా, మిజోరాం రాష్ట్రాలే ఆ జాబితాలో ఉన్నాయి. 2016 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు 11.77 శాతం మంది ఉన్నారు. అంటే జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. అయితే 2021నాటికి ఆంధ్రప్రదేశ్ పేదల సంక్షేమంలో గణనీయమైన ప్రగతి సాధించింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది. పేదరికాన్ని సమర్థంగా కట్టడి చేసిన రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. రాష్ట్ర జనాభాలో నిరుపేదలను 6.06 శాతానికి తగ్గించింది. -
సీఎం దృష్టికి వచ్చిన అర్జీల సమస్యలకు తక్షణ పరిష్కారం
-
తీవ్ర ఉద్రిక్తత.. పేదల గుడిసెలు కూల్చివేత
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి. -
సీఎం దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులు
-
మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్ సభా వేదిక నుంచి నిలదీశారు. నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. మంచి చేసే ప్రభుత్వం ఇది కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం. నాన్ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్ -
ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్ ప్రకటించారు. 👉 దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారాయన. 👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్ ప్రకటించారు. -
CM YS Jagan:పెత్తందారుల కుట్రలు చేధించి మరీ..
తాము మాత్రమే బాగుండాలనేది పెత్తందారుల తత్వం.. అందుకే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారు కోర్టులో కేసులు వేయించి.. పట్టాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు పైగా అమరావతిలో పేదలకు స్థానంలేదని తక్కువచేసి మాట్లాడారు.. పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వక్రభాష్యాలు చెప్పారు.. చివరకు.. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలను సమాధులని కూడా అవహేళన చేశారు. యెల్లో మీడియా సైతం ఆ కుటిల యత్నాలకు వంతపాడింది.. కానీ, ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రేలాపనలు చేసినా.. జగనన్న పట్టించుకోలేదు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆ అంశంపైనే దృష్టి పెట్టారు. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్నది ఆయన అభిమతం. నిలువ నీడలేని వారికి సొంత గూడు ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం. పేద కుటుంబాల భవిష్యత్తు బాగుండాలన్న కృతనిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ ఆగిపోలేదు. పేద కుటుంబాల ముఖాల్లో సంతోషం చూడాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా.. అమరావతిలో 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరగనుంది. తుళ్లూరు(గుంటూరు) మండలం వెంకట పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక నుంచి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అదే సమయంలో పేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారాయన. విశేషం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఇళ్లకు సైతం మౌలిస వసతులను అందించింది జగనన్న సర్కార్. మొత్తంగా.. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. పక్షపాత రహితంగా పంపిణీలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని లబ్ధిదారులకు సూచిస్తోంది కూడా. ఈ నిజాయితీ, నీతివంతమైన పాలనను ఏపీ ప్రజానీకం మెచ్చుకుంటోంది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ.. ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం.. అందులో భాగంగా నేడు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. #YSRJaganannaIllaPattalu#YSRJaganannaColonies#CheppadanteIsthadanthe #CMYSJagan #APDC pic.twitter.com/JG00Yh2C63 — AP Digital Corporation (@apdigitalcorp) May 26, 2023 -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ, పెత్తందారులు అడ్డుకున్నారు: పొన్నవోలు
-
‘రాజకీయాల నుంచే కాదు.. దేశ బహిష్కరణ చేయాలి’
సాక్షి, గుంటూరు: చరిత్రలో చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యయం అయితే.. ఆ పాలనలో పేదలకు ఇల్లు అనేది ఒక కలగానే ఉండిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ కలను సాకారం చేయడానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే.. కోపం, అసూయ, ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు సజ్జల. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ.. 2014-19 మధ్య రాష్ట్రంలో పేదలకు ఎక్కడైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?. నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చారో బయట పెట్టగలరా?. పేదలంటే చంద్రబాబుకు చులకన భావం. కనీసం టిట్కో ఇళ్లలో కూడా 16 గజాలు ఇవ్వలేదు. అందులో కూడా కాంట్రాక్టర్లకు అధిక రేట్లుకు ఇచ్చి.. వారి నుండి కిట్ బ్యాగులు తీసుకున్నారు. ఇప్పుడేమో సెంటు స్థలంలో మురికివాడలు అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు అని సజ్జల మండిపడ్డారు. చక్కని రోడ్లు, మంచినీరు, కరెంటు అన్నీ కల్పిస్తుంటే మురికివాడలు అంటారా?. స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేదలకు సామాజిక బాధ్యతగా సిమెంట్, ఇసుక, కంకర లాంటివి తక్కువ రేటుకు ఇప్పిస్తున్నారు. జగన్ కట్టించిన టిట్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెంటు స్థలంలో సమాధులు కట్టుకోమంటున్న చంద్రబాబును రాజకీయల నుంచే కాదు.. దేశం నుంచే బహిష్కరించాలని సజ్జల అన్నారు. ముందస్తు ఎన్నికలనే తప్పుడు ప్రచారం చేసుకుని పార్టీని బతికించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తారని, చంద్రబాబు బలవంతుడు అవుతాడని భావించినప్పుడే తాము ముందస్తుకు వెళ్తామని.. కానీ, అలాంటిదేం లేనప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకు ఏంటని సజ్జల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుది దింపుడుకల్లం ఆశ. లోకేష్ ఎదగలేదనీ, పార్టీ బతకదని చంద్రబాబుకు పూర్తిగా అర్థం అయ్యింది. అందుకే ఫ్రస్టేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారు’’ అని సజ్జల అన్నారు. -
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
Andhra Pradesh: నిరుపేదకు న్యాయ ‘పట్టం’
సాక్షి, అమరావతి: నిలువ నీడలేని దాదాపు 50,000 నిరుపేద కుటుంబాలకు మంచి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ అసంబద్ధమైన వాదనలతో రైతుల ముసుగులో కోర్టుకెక్కిన టీడీపీ నేతలకు చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలివ్వకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని రైతుల పేరుతో కొందరు దాఖలు చేసిన అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈమేరకు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, ఇళ్ల పట్టాల కేటాయింపు ప్రధాన వ్యాజ్యాలు తాము వెలు వరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని వర్గాల అభివృద్ధితోనే.. రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాజధాని నగర నిర్మాణం చేపట్టేందుకు, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. అన్ని వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్), దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాల అభివృద్ధి కూడా రాజధాని అభివృద్ధిలో భాగమే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రైతులు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులిస్తే అది న్యాయ ఔచిత్యాన్ని ఉల్లంఘించినట్లవుతుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకోండి.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏను అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతుల పేరుతో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలను కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై గత నెల 21న వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనం తన నిర్ణయాన్ని వెలువరించడానికి ముందే రాజధాని రైతుల తరఫు న్యాయవాది సంజయ్ సూరనేని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు. దీంతో ధర్మాసనం రైతుల వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టింది. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవ్దత్ కామత్, సీనియర్ న్యాయవాది వీఎస్సార్ ఆంజనేయులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి, సీఆర్డీఏ తరఫున కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రైతులు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం తన నిర్ణయాన్ని వెలువరించింది. పిటిషనర్లు ప్రభావితం కావడం లేదు.. ‘గత మాస్టర్ ప్లాన్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) ఇళ్ల స్థలాల కోసం ఎలాంటి నిర్దిష్ట ప్రాంతాన్ని కేటాయించలేదు. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇస్తోందని, ఆ భూమి ల్యాండ్ పూలింగ్ స్కీంలోని లేఔట్లలో భాగం కాదని మా దృష్టికి తెచ్చారు. పేదలకు ఇప్పుడు కేటాయిస్తున్న స్థలంతో పిటిషనర్లకు (రాజధాని రైతులు) ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. పేదలకు ఇవ్వదలచిన స్థలం ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించింది. రాజధాని అభివృద్ధిలో భాగమైన నవ నగరాలు చెక్కు చెదరకుండా ఉండటమన్న అంశం సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూములపై పిటిషనర్లకు ఎలాంటి హక్కు లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు చేస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ప్రత్యక్షంగా వారు ఏ విధంగానూ ప్రభావితం కారు. రాజధాని అభివృద్ధి కోసం పూలింగ్లో భాగంగా తమ భూములిచ్చామని పిటిషనర్లు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ కూడా అందులో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీని దెబ్బ తియ్యడమంటే తమ హక్కులను హరించడమేనని వారు వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉంది. అందువల్ల పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మేం సుముఖంగా లేం’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే -
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
-
పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆసరా
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
-
Ms శ్రీదేవి.. ఎల్లలెరుగని సేవ
ఇరవై నాలుగేళ్ల వయసులో మీరైతే ఏం చేస్తారు? శ్రీదేవి మాత్రం సమాజ సేవకు సిద్ధపడింది. పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకుంది. పేదలతో మమేకమవుతూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ.. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూతనిస్తోంది. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ నేపథ్యమే తనను ఈ దిశగా అడుగులు వేసేలా చేశాయంటున్న శ్రీదేవి.. సేవా కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుపేదలకు తన వంతు సాయం చేస్తున్న ఆమె జీవితం.. ఎందరికో స్ఫూర్తివంతం. మద్దిపాడు(ప్రకాశం జిల్లా): Ms శ్రీదేవి. పేరు ఎక్కడో విన్నట్టు.. చూసినట్టు అనిపిస్తోందా? తను సామాజిక మాధ్యమం యూట్యూబ్లో ఇన్ఫ్లూయెన్సర్. నిరుపేదలకు సేవ చేయడంలో కలిగే సంతృప్తిని సమాజానికి పరిచయం చేస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కృప, సత్యనారాయణల మూడో కుమార్తె శ్రీదేవి. తను పుట్టిన మూడు నెలలకే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తనకంటే ముందు ఇద్దరు అక్కలు. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది తన తల్లి. ఈ క్రమంలో తల్లి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన శ్రీదేవి మనసులో పేదలకు సేవ చేయాలన్న ఆలోచన నాటుకుపోయింది. తన 24వ ఏట నుంచి సేవా కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారించింది. భర్తను కోల్పోయి చిన్న పిల్లలను పోషించలేక ఇబ్బంది పడుతున్న మహిళలు, పిల్లలు లేని వృద్ధులు, చదువుపై ఆసక్తి ఉన్నా చదివించే స్థోమత లేని నిస్సహాయ తల్లిదండ్రుల దీనగాథలు ఆమె దృష్టికి రాగానే వెంటనే స్పందించడం, ఆఘమేఘాల మీద ఆ ప్రాంతానికి వెళ్లి సాయం అందించి ఆత్మ సంతృప్తి పొందడం అలవాటుగా చేసుకుంది. గురువారం ఆమె మద్దిపాడు మండలంలోని గార్లపాడు పునరావాస కాలనీకి వచ్చింది. స్థానిక సర్పంచ్ గంగిరెడ్డి ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంది. కాలనీ పది మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు దుస్తులు, కొంత నగదు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకుంది. ‘నా ఆత్మ సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి నెలా సుమారు రూ.3 లక్షలకు పైగా పేదల కోసం ఖర్చు చేస్తున్నా. చిన్న పిల్లలను చదివిస్తున్నా. నా టీమ్లో మరో ఇద్దరు పనిచేస్తున్నారు. ప్రతి నెలా ఏఏ జిల్లాలకు వెళ్లాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం, ఆ తర్వాత గ్రామాలను ఎంచుకుని సహాయం అవసరమైన వారిని గుర్తిస్తాం. 20 మంది బాలబాలికలకు స్కాలర్షిప్ అందిస్తూ వారి చదువుల బాధ్యతను కూడా తీసుకున్నా’ అని సంతోషంగా చెప్పింది. శ్రీదేవి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగాలని ఆశిద్దాం. -
కేసీఆర్ సర్కార్ భారీ ప్రణాళిక.. జాగా ఉంటే నిధులు.. లేదంటే స్థలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదలకు ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సొంత జాగా ఉన్నవారితో పాటు లేని పేదలకు కూడా గృహ వసతి కల్పించే అంశంపై కసరత్తు ప్రారంభించింది. సొంత జాగా ఉంటే ఇళ్ల నిర్మాణానికి నిధులు, భూమి లేని వారికి నిర్ధారిత పరిమాణంలో స్థలాల కేటాయింపు దిశగా ఆలోచన చేస్తోంది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించటం ద్వారా వారే ఇళ్లను నిర్మించుకునే పథకానికి గతేడాది బడ్జెట్లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే విధివిధానాలు ఖరారు చేయకపోవటంతో ఆ బడ్జెట్ కాలంలో నిధులు విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో 4 లక్షల ఇళ్లను మళ్లీ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేల ఒత్తిడి నేపథ్యంలో.. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలు నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం రూపురేఖలు గొప్పగా ఉన్నప్పటికీ, ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండగా, ఈ ఇళ్లు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఒకరికి ఇస్తే వంద మంది గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆశించిన ప్రయోజనం లభించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. పేదల ఇళ్ల విషయంలో వెంటనే దిద్దుబాటు అవసరమంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కేటీఆర్, హరీశ్లకు వివరించారు. దీంతో దీనిపై ప్రభుత్వం కస రత్తు ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూములను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సొంత స్థలాలు లేని వారి కోసం.. సొంత స్థలాలు ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి బడ్జెట్లోనూ రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించింది. తద్వారా నాలుగు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. అయితే కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇస్తే జాగా లేని వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో సొంత స్థలాలు లేనివారి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. అలా స్థలాలు ఇవ్వాల్సి వస్తే ఎంతమంది లబ్ధిదారులుంటారు? ఒక్కొక్కరికి 60 గజాల నుంచి 80 గజాల వరకు అందించాలంటే ఎంత భూమి అవసరమవుతుంది? సరిపడా ప్రభుత్వ భూమి ఉందా? లేని పక్షంలో ఎంతభూమిని సమీకరించాల్సి వస్తుంది? వినియోగంలో లేని అస్సైన్డ్ భూములను వాడుకునే వీలుందా?.. తదితర అంశాలపై వివరాలను వచ్చే సోమవారం నాటికి అందజేయాల్సిందిగా తాజాగా అధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈ వివరాలు అందిన తరువాత తుది నిర్ణయం తీసుకుని భారీ స్థాయిలో ఒకే దఫాలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
దిగులు తొలగిస్తూ.. ధీమానిస్తూ!
కర్నూలు(అగ్రికల్చర్): అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు.. ఊహించని విపత్తులు.. పేద కుటుంబాలను శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆయా కుటుంబాల్లో నైరాశ్యం నెలకొంటోంది. అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితం తలకిందులవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు సైతం ఆగిపోతున్నాయి. పేదల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తూ వారిలో దిగులును తొలగిస్తోంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తూ ధీమా నింపుతోంది. రూపాయి కూడా ప్రీమియం లేకుండా.. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఒకరికి (ఇంటి యజమానికి) రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. కర్నూలు జిల్లాలో 5,05,094 కుటుంబాలకు, నంద్యాల జిల్లాలో 4,13,498 కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. బీమా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో రెండు కాళ్లు లేదంటే రెండు చేతులు పోతే రూ.5 లక్షలు, ఒక కాలు, ఒక చేయిపోతే రూ.2.50 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.లక్ష ప్రకారం పరిహారం లభిస్తుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ప్రమాద బీమా, 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణం బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకొని క్లయిమ్లను పరిష్కరిస్తారు. సహజ మరణానికి పరిహారం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అసంఘటిత రంగంలోని రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా వైఎస్సార్ బీమా సదుపాయం కల్పించడం విశేషం. సహజ మరణం పొందినా, ప్రమాదశాత్తూ మరణించినా వెంటనే సంబంధిత సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంటుకు సమాచారం ఇస్తే 24 గంటల్లోపు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు చెల్లిస్తారు. గడువులోపు పరిహారం.. వైఎస్సార్ బీమా కింద క్లయిమ్ల పరిష్కారానికి ప్రత్యేక షెడ్యూలు ఉంది. దీని ప్రకారం సహజ మరణం క్లయిమ్లను 24 రోజులు, ప్రమాద మరణం క్లయిమ్లను 65 రోజుల్లోను పరిష్కరిస్తున్నారు. సచివాలయం స్థాయిలో జరిగే డాక్యుమెంటేషన్ను అనుసరించి క్లయిమ్లు పరిష్కారం అవుతాయి. సహజ, ప్రమాద మరణాలకు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు డాక్యుమెంటేషన్ పూర్తి చేసి కలెక్టరేట్లోని డీఆర్డీఏ– వైకేపీలోని వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్కు పంపాల్సి ఉంది. కాల్ సెంటరులో బీమా డీపీఎం, డీఆర్డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే ఆమోదించి పరిహారం చెల్లింపు కోసం జీఎస్డబ్ల్యూస్ డిపార్టుమెంట్కు పంపుతారు. సహజ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాద మరణాలకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. సత్వర సాంత్వన వైఎస్సార్ బీమా పరిహారం ప్రొసీడింగ్స్ అందుకుంటున్న ఈమె పేరు జెల్లి జయమ్మ. ఆదోని మండలం ఆరేకల్ గ్రామానికి చెందిన ఈమె భర్త జెల్లి రాఘవేంద్ర ప్రమాదవశాత్తూ్త 2022 సెప్టెంబరు 6వ తేదీన మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి వైఎస్సార్ బీమా అండగా నిలిచింది. నాలుగు నెలల్లోనే 2022 డిసెంబరు 1న రాఘవేంద్ర భార్య జెల్లి జయమ్మకు రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. సత్వర స్వాంతన చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని జయమ్మ తెలిపారు. బాధిత కుటుంబానికి ఊరట ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు నాగేశ్వరమ్మ, కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని మాసామసీదు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కురువ నాగరాజు ప్రమాదవశాత్తు 2022 ఆగస్టు 10న మృతి చెందాడు. ఇద్దరు కుమారుల పోషణ కష్టంగా ఉన్న తరుణంలో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా ద్వారా చేయూత ఇచ్చింది. నాగేశ్వరమ్మకు రూ. 5 లక్షల పరిహారం లభించింది. పకడ్బందీగా బీమా పథకం అమలు వైఎస్సార్ బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సచివాలయంలో ఎంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి పంపితే అంత త్వరగా క్లయిమ్ పరిష్కారం అవుతుంది. రైస్ కార్డు కలిగిన కుటుంబాలన్నిటికీ వైఎస్సార్ బీమా లభిస్తుంది. కర్నూలు జిల్లాలో 5 లక్షలకుపైగా కుటుంబాలకు వైఎస్సార్ బీమా సదుపాయం ఉంది. – వెంకటసుబ్బయ్య, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ–వైకేపీ లక్షలాది పేద కుటుంబాలకు భరోసా జాప్యం లేకుండా క్లయిమ్లు పరిష్కారమవుతుండడంతో ఆయా కుటుంబాలకు భరోసా లభిస్తోంది. 2021–22లో వైఎస్సార్ బీమా కింద 1,398 కుటుంబాలకు భరోసా దక్కింది. 2022–23లో కర్నూలు జిల్లాలో సహజ మరణం పొందిన 496 కుటుంబాలకు రూ.4.82 కోట్లు, నంద్యాల జిల్లాలో 477 కుటుంబాలకు రూ.4.60 కోట్లు పరిహారం లభించింది. 30 క్లయిమ్లకు పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్లు 80 రిజిష్టర్ కాగా 35 పరిష్కారం అయ్యాయి. నంద్యాల జిల్లాలో ప్రమాద మరణాల క్లయిమ్లు 76 రిజిష్టర్ కాగా 23 పరిష్కారం అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్లో ఉన్నాయి. -
వలస బతుకుల మెతుకు వేట..!
సొంతూరులో ఉపాధి కరువు.. ప్రతి పూటా బతుకు పోరాటం.. జీవనయానం కోసం వేల కి.మీ. పయనం. రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఆ చెంతనే నిప్పుల కొలుములు పెట్టుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ సీజన్లోనే వీరికి ఆదరువు. ఒక వైపు యాంత్రీకరణ పెరిగిపోతున్నా.. బుక్కెడు మెతుకుల కోసం వలస జీవులు ఊరూరా తిరుగుతూ తమకు తెలిసిన నైపుణ్యంతోపనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వలస జీవుల జీవన ఆరాటంపై స్పెషల్ ఫోకస్... దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): మధ్యప్రదేశ్..ఉత్తరప్రదేశ్..ఛత్తీస్ఘడ్.. ఇవన్నీ జిల్లాకు సుదూర ప్రాంతాలే. ఎన్నో వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఎన్నో ఆశల మధ్య జీవనం సాగిస్తున్నారు వలస జీవులు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. పనిచేస్తేకానీ నోటికందని మెతుకుని రెక్కల కష్టం చేద్దామన్నా స్థానికంగా అండ లేక, పూటగడవడమే కష్టమైన వేళ.. వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిప్పుల కొలిమిలో ఇనుమును కరిగించి.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో పిల్లా పెద్దా,.. ఆడ, మగ.. ఇలా అందరికీ ఇనుముతోనే బతుకు అంతా ముడిపడి ఉంటుంది. ఒకరో ఇద్దరో కాదు ఐదు వేల మందికి పైగా నిరుపేదలకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిల్లాకు పొట్టచేత పట్టుకుని వస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏటా వ్యవసాయ సీజన్లో ఒక్కడే ఉండి ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇలా సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి సొంత ఊళ్లకు వెళ్తుంటారు. డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే.. యాంత్రీకరణ గణనీయంగా పెరిగిన ఈ రోజుల్లోనూ వారు చేతి వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉదయం ఆరున్నర గంటలకు మొదలై పని రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. ఆడ, మగ తేడా లేకుండా పనిముట్లు తయారు చేస్తారు. పనిముట్లు తయారు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు తమ వెంట తెచ్చుకుంటారు. వీటి తయారీకి లారీల పాత కమాన్ ప్లేట్లు కేజీ రూ.80కి కొంటారు. వాటిని కొలిమిలో కాల్చి ఇనుమును కరిగించి, సమ్మెటల సాయంతో గునపాలు, కొడవళ్లు, పారలు, వంట పనిముట్లు తయారు చేస్తారు. రోడ్డు పక్కన నిప్పుల పొయ్యి రాజేసుకుని చపాతీలు, రోటీలు తయారు చేసుకుని తింటారు. రాత్రయితే రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని గుడి మెట్ల పక్కనో..షాపుల ఆవరణలో నిద్రిస్తారు. సైజును బట్టి కొడవలి రూ.20 నుంచి రూ.200 వరకు విక్రయిస్తారు. గొడ్డలి రూ.150 నుంచి రూ.300, మాంసం కత్తి రూ.100 నుంచి రూ.250 వరకు విక్రయిస్తారు. రోజుకు వెయ్యి నుంచి రూ.1500 వరకు విక్రయాలు ఉంటాయి. ఊరూరా తిరుగుతూ వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలను సాకుతున్నారు. సంచార జీవితం సాగిస్తూ బతుకులు వెళ్లదీస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 5 వేల మందికి పైగా పనిముట్ల తయారీలో జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా జన సంచార ప్రాంతాల్లో కొంత స్థలంలో తాత్కాలికంగా కొలిమి ఏర్పాటు చేసుకుని పనిముట్లు తయారు చేస్తుంటారు. జిల్లాలో ఎక్కువగా దర్శి బస్టాండ్ ప్రాంతం, తాళ్లూరు వీకే కళాశాల వద్ద, వినుకొండలో కురిచేడు రోడ్లో గొర్రెల బడ్డి వద్ద వ్యవసాయ పరికరాలు తయారు చేసుకుని విక్రయిస్తున్నారు. దొనకొండ నాలుగు కూడళ్ల ప్రాంతంలో, చీమకుర్తిలో జవహర్ హాస్పిటల్ వద్ద, బీవీఎస్ కళాశాల ప్రాంతం, గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో, మోటు వద్ద, మార్కాపురంలో తర్లుపాడు మండల కేంద్రం, కొండపి బస్టాండ్ ప్రాంతంలో, కట్టంవారిపాలెం వద్ద, యర్రగొండపాలెం బస్టాండ్ ప్రాంతంలో అర్ధవీడు మండలం కుంట వద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకుని డిమాండ్ ఉన్న రోజుల వరకు అక్కడే ఉంచి పనిముట్లు తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తారు. అక్కడ ఆదరణ లేదు మధ్యప్రదేశ్లో పనిముట్లు తయారు చేసినా సరైన ఆదరణ లేదు. అమ్ముకోవాలంటే గిరాకీ లేదు. అందుకే వ్యవసాయ సీజన్లో ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటూ పలు గ్రామాలు తిరుగుతూ పనిముట్లు అమ్ముకుంటాం. రోజుకు గ్రామాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు వస్తాయి. ఖర్చులు పోను జీవనానికి ఇబ్బందులు ఉండవు. ఉపాధి కల్పిస్తున్న ఏపీకి ప్రత్యేక కృతజ్ఞతలు. – జగదీష్, భోపాల్, మధ్యప్రదేశ్ -
జోరుగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు
-
కడప పర్యటనలో అనేక మంది బాధితులకు ఆర్థిక సాయం
-
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
5 నెలల్లో పేదలకు రూ.3,400 కోట్ల ఉపాధి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు నెలల మధ్య ఐదునెలల్లో రాష్ట్రమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల కల్పన ద్వారా ప్రభుత్వం పేదలకు రూ.3,400.46 కోట్ల లబ్ధి కలిగించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు సైతం పనుల కోసం ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆ గ్రామంలోనే అడిగిన వారికల్లా పనులు కల్పించింది. రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో 40.36 లక్షల కుటుంబాలు ఈ ఐదునెలల్లో సొంత ఊళ్లోనే ఉపాధిహామీ పథకంలో పనులు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబం సరాసరి రూ.8,425 చొప్పున ప్రయోజనం పొందింది. 40.36 లక్షల కుటుంబాలకు చెందిన 65.74 లక్షలమంది కూలీలు 16.02 కోట్ల పనిదినాలపాటు ఈ పథకంలో పనిచేసుకుని లబ్ధిపొందారు. అందులో అత్యధికంగా 23.71 శాతం మేర ఎస్సీ కుటుంబాల వారున్నారు. ఈ పనులతో 9.44 శాతం ఎస్టీ కుటుంబాలు లబ్ధిపొందాయి. ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మన రాష్ట్రంతో పోలిస్తే మూడురెట్ల కన్నా ఎక్కువ ఉండే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17.73 కోట్ల పనిదినాలు కల్పించి రూ.3,818 కోట్ల మేర పేదలకు లబ్ధికలిగించింది. ఇదే కాలంలో మన రాష్ట్రం 16.56 కోట్ల పనిదినాలపాటు పేదలకు పనులు కల్పించి రూ.3,400.46 కోట్ల ప్రయోజనం చేకూర్చి రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య పేదలకు అత్యధికంగా ఉపాధి పనులు కల్పించిన పది రాష్ట్రాలు -
అన్నపూర్ణ.. అక్షయ పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది. కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది. ఎనిమిదేళ్లుగా.. ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. లాక్డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు. -
డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పేదలు
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన ప్రజలు
-
తన ఇంటి ఖర్చు మీద ఈనాడు రోతరాత.. పద్మావతి ఆగ్రహం
-
పేదల ఇళ్లపై పచ్చమీడియా కుట్ర బట్టబయలు
-
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్సిద్దిక్, హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!
సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి స్లమ్ పెయింటింగ్స్ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
పేదోడి ఫ్రిడ్జ్కు భలే గిరాకీ!
దిల్సుఖ్నగర్: అప్పుడే వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి... రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మలక్పేట, మహేశ్వరం, యాకత్పురా నియోజకవర్గాలలో కొందరు పేదల రిఫ్రిజిరేటర్ అయిన మట్టి కుండల్లోని శ్రేష్ఠమైన చల్లని నీటిని తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుండలకు గిరాకీ పెరిగింది.ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లలో రకరకాల డిజైన్లలో కుండలు, కూజాలను అందుబాటులో ఉంచారు. చల్లదనంతో పాటు మంచి డిజైన్లలో అందంగా ఉన్న కుండలను కొనుగోలు చేసేందుకు సామాన్యులతో పాటు ధనవంతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ. 60 నుంచి రూ.500 .. సరూర్నగర్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, మాదన్నపేట ఎన్టీఆర్నగర్తో పాటు ప్రధాన చౌరస్తాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు. మార్కెట్లలో రూ. 60 నుంచి రూ.500 వరకు వివిధ ధరల్లో రకరకాల కుండలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత అధికమనే చెప్పవచ్చు. వేసవి ఎండలు ఒకవైపు కొలిమిలా కాగుతుండగా దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలంటే ఈ మాత్రమైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
తండ్రి జ్ఞాపకార్థం 12 ఎకరాల్లో పేదల కోసం పట్టాల పంపిణీ
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలిలో కుమ్మరి నాగేంద్ర తన తండ్రి సుంకన్న జ్ఞాపకార్థం బుధవారం 12 ఎకరాల తన సొంత పొలంలో 670 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ స్థలాల్లో ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్కు లేఖ రాస్తానని చెప్పారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య, గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి, మంత్రి జయరాం తనయుడు అశోక్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ప్రదీప్రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు రా మ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొని నాగేంద్ర, వరలక్ష్మి దంపతులను అభినందించారు. -
ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్
ముంబై: చెడు మార్గాలు పట్టకుండా ఇకపై నిరుపేదల అభ్యున్నతి కోసం పని చేస్తానని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అన్నారు. ముంబై క్రూయిజ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఆర్థర్రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు తాజాగా కౌన్సెలింగ్ ఇచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఆర్యన్ ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకు హామీ ఇచ్చినట్టు ఒక అధికారి వెల్లడించారు. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తానని.. చెడు మార్గాల్లో నడవనని ఆర్యన్ చెప్పినట్టుగా ఆ అధికారి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీబీ అధికారులు కలిసి ఆర్యన్, అతడి సహ నిందితులకు జైలులో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై కోర్టు ఈ నెల 20న తీర్పు వెలువరించనుంది. చదవండి: (తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్..) -
పేదలకు మెరుగైనవైద్యమే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి అందించాలన్నదే జీఎస్ఆర్ ట్రస్టు లక్ష్యమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తన తండ్రి సూర్యనారాయణరావు వర్ధంతిని శనివారం గోల్కొండ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఓ వైద్యుడిగా తన తండ్రి కొత్తగూడెం ప్రాంతంలో ఎంతో మందికి సేవలు చేశారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన్ను కోల్పోవడం తమ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందన్నారు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే జీఎస్ఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీఎస్ఆర్ ట్రస్టుకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పేదలను గుర్తించి వారికి క్షేత్రస్థాయిలో విద్య, వైద్యం, ఉపాధి అందించేందుకు ట్రస్టులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెల్త్సెక్రటరీ రిజ్వీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు. -
అప్పుడు ఒక్క పూట తిండి దొరకలేదు.. ఇప్పుడు నెలకు 5 లక్షలు
భువనేశ్వర్: పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు..కానీ పేదవాడిగా గానే పోతే మన తప్పు. అది అక్షరాల నిజం.. ఒక పూట తిండికి నోచుకుని ఓ గిరిజన యువకుడు ప్రస్తుతం యూట్యూబ్లో నెలకు రూ.5లక్షలు సంపాదిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. వివరాలు.. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడు ఒకప్పుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడు. కరోనా మహ్మరి కారణంగా ఏర్పడిన లాక్డౌన్ వలన అతడు తన ఉపాధిని కోల్పోయాడు. దీంతో తన కుటంబం రోడ్డున పడింది. దీంతో ఏంచేయాలో తోచని పరిస్ధితిలో ఉన్న ముండా తన స్నేహితుడి ఫోన్లో యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్ కు సంబంధించిన వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో ఫుడ్ బ్లాగర్లను ప్రేరణగా తీసుకుని యూట్యూబ్లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే స్మార్ట్ఫోన్ కొనే స్థోమత లేదు. దీంతో ముండా స్మార్ట్ఫోన్ కొనడానికి రూ.3,000 అప్పుగా తీసుకున్నాడు. దీంతో తన మొదటి వీడియోలో తాను తీసుకునే ఆహారం కోసం చేశాడు. ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియో ను పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెటిజన్లు ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలా మొదలైన ముండా యూట్యూబ్ చానల్కు ప్రస్తుతం 7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు అతడు నెలకు సూమారు 5 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు. ఈ విషయంపై యువకుడు మాట్లడూతూ నేను చేసే వీడియోల్లో నా ఇళ్లు , తమ గ్రామంలో ప్రజలు జీవనం కోసం వీడియోలు చేస్తాను అని చెప్పాడు. తన వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం వచ్చిన డబ్బులతో తన తల్లి దండ్రలుకు ఇల్లు కట్టానని తెలిపాడు. తన ఏకైక లక్ష్యం యూట్యూబ్ వీడియోల నుంచి డబ్బు సంపాదించడం కాదు .. తమ స్థానిక సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలనుకుంటున్నా అని ముండా అన్నాడు. ప్రస్తుతం ముండా వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.. -
వహ్వా.. వలంటీర్!
పుత్తూరు (చిత్తూరుజిల్లా) : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, యాచకులను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తున్నాడు సాధారణ కూలీ కుటుంబానికి చెందిన ఓ వలంటీర్. తండ్రిని పోగొట్టుకుని పేదరికపు కష్టాలను స్వయంగా చవిచూసిన ఈ యువకుడు పదిమందికి ఉపయోగపడాలన్న తన లక్ష్యసాధనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువకుడి సేవాగాథ వివరాలివీ.. పుత్తూరు మండలం తడుకు పంచాయతీ వీఎస్ఎస్ పురం గ్రామానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు బాలాజీ. తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. ఆ తర్వాత ఉద్యోగ వేటలో ఉన్న బాలాజీ గ్రామ వలంటీరుగా ఎంపికయ్యాడు. గ్రామస్థులకు ‘సచివాలయ’ సేవలందిస్తూ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. మరోవైపు.. ఎలక్ట్రీషియన్గా కూడా పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో.. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో నిరుపేదలు, యాచకులు పడుతున్న బాధలను గుర్తించాడు. వీరికి చేయూతనివ్వాలన్న తలంపుతో ‘సేవా మిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. రోజూ 30 మందికి భోజనాలు, టిఫిన్ అందిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ యజ్ఞం శనివారం 101వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు, వీఎస్ఎస్ పురంలోని గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశాడు. వలంటీరుగా తనకు వచ్చే రూ.5 వేల గౌరవ వేతనంతోపాటు సేవామిత్ర పురస్కారం ద్వారా అందించిన రూ.10 వేలు, ఎలక్ట్రికల్ పనుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నిరుపేదల సేవకు ఖర్చు చేస్తున్నాడు. సేవలోనే సంతోషం.. పేదరికం అంటే ఏమిటో చూశాను. కరోనా కాలంలో కొందరు ఆకలితో రోడ్డు పక్కనే చనిపోయారు. అందుకే నాకు వీలైనంత వరకు సాయం చేయాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాను. మూడు నెలలుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వలంటీరుగా వచ్చే సంపాదన పూర్తిగా పేదలకే ఖర్చు చేస్తున్నాను. – బాలాజీ, వలంటీరు, వీఎస్ఎస్ పురం, పుత్తూరు మండలం -
లాక్డౌన్: అమ్మలా.. ఆకలి తీరుస్తున్నాడు
సాక్షి, వనపర్తి: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో కోవిడ్ బాధితులతో పాటు సహాయకులకు భోజనం అందక పస్తులుండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో రెండు పూటలా భోజనంతో పాటు బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ అండగా మేమున్నామంటూ జిల్లాకేంద్రానికి చెందిన పలువురు భరోసా కల్పిస్తున్నారు. అమ్మలా ఆకలి తీరుస్తున్నారు. నవోదయ ఓల్డేజ్ హోం ఆధ్వర్యంలో పలువురు యువకులు కరోనా బాధితులతో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులు, యాచకులకు రోజు అన్నం ప్యాకెట్లతో పాటు గుడ్డు, అరటిపండు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితులకు సైతం ప్రత్యేక వాహనంలో వెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెల్నంబర్ 9052507793కు కాల్ చేసి బాధితుల వివరాలు తెలియజేస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకుడు రాము తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన జర్నలిస్టు రహీం 12 రోజులుగా రాత్రిళ్లు రోడ్లపై ఉండే యాచకుల కడుపు నింపుతున్నారు. ఆయన సేవలను గుర్తించిన డీఎస్పీ కిరణ్కుమార్ తనవంతుగా రూ.7 వేల సాయం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో రహీం స్నేహితులు కూడా తమవంతు సాయం అందిస్తున్నారు. ఆహార ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న నవోదయ ఓల్టేజ్ హోం నిర్వాహకులు జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు భోజనాలు బ్రహ్మంగారికాలనీ మిత్రబృందం వారు స్వయంగా వంట చేసి ఆహార ప్యాకెట్లను జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ బాధితులు, రోగులకు మధ్యాహ్నం సమయంలో అందజేస్తూ ఆకలి తీరుస్తున్నారు. కాలనీ యువకుల సహకారంతో వారం రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ప్రతి ఆదివారం మాంసాహారం అందించనున్నట్లు కౌన్సిలర్ బ్రహ్మం తెలిపారు. రోజూ 200 మందికి భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది లాక్డౌన్ సమయంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. -
'ఆకలేస్తే వచ్చి తీసుకొని తినండి'
చెన్నై: రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. లాక్డౌన్ విధించడంతో నిరుపేదలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుల అభిమానులు నిరుపేదలు, అనాథలు, బిచ్ఛగాళ్ల ఆకలి తీర్చడానికి ముందుకు వస్తున్నారు. నటుడు అజిత్ అభిమానులు పుదుచ్చేరిలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్లతో కూడిన బండ్లను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఆకలి వేసిన వారు వచ్చి ఆహారాన్ని తీసుకుని తినొచ్చు అనే పోస్టర్లను అంటించారు. అజిత్ అభిమానుల ఉదార స్వభావాన్ని, సేవా దృక్ఫథాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. -
పేదల అకౌంట్లలో రూ. 6 వేలు జమ చేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ సాయంగా రూ. 6,000 అందించాలని కాంగ్రెస్ లోక్సభ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్డౌన్ కారణంగా పేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల వారికి ప్రభుత్వం నుంచి సాయం అందాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం సహాయం మాత్రమే కాదని, దాని వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అన్నారు. అర్హులైన పేదలందరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయాలని ఆయన మోదీని కోరారు. లాక్డౌన్లో ఏ పనులూ లేకపోవడం వల్ల ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. -
కరోనా సెకండ్వేవ్: ప్రజలకు కేంద్రం తీపికబురు!
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అనేక మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి విజృంభణ వలన దేశంలో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం, పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం కింద పేదలకు తీపికబురు అందించింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క లభ్దిదారునికి మే, జూన్ నెలలో 5 కిలోల చొప్పున ఆహర ధాన్యాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో, దాదాపు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ఆహర ధాన్యాల కోసం కేంద్రం తొలిదశలో రూ. 26 వేల కోట్లను ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. చదవండి: గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్ -
అమరావతిలో బరి తెగించిన టీడీపీ నేతలు
సాక్షి గుంటూరు: మంగళగిరి నుంచి మందడం వికేంద్రీకరణ దీక్షకు వెళ్తూ ఉండగా కృష్ణాయపాలెంలో పేదలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి పేదల ఆటోలు అడ్డుకున్న టీడీపీ నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. దీనిపై స్పందించిన మహిళలు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ కృష్ణాయపాలెం రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి యత్నించిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఆ లాజిక్ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు! మహిళలు మాట్లాడుతూ..రాజధానిలో ఇళ్ల పట్టాలకోసం వెళ్తున్న తమపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ను తమపై ఎక్కించడానికి ప్రయత్నిస్తూ, ట్రాక్టర్ తొక్కించి చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఆటో అద్దాలు కూడా పగులగొట్టారని, మహిళలని చూడకుండా అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల స్థలాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమపై దాడికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం గుంటూరు: అమరావతిలోని మందడంలో అభివృద్ధి వికేంద్రీకరణ దీక్ష 24వ రోజుకు చేరుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధానిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన 52 వేలకు పైగా ఇళ్ల స్థలాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దీక్ష చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. దీక్ష కు భారీ స్థాయిలో మహిళలు తరలి వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 12 బార్ అసోసియేషన్ నుంచి భారీ స్థాయిలో న్యాయవాదులు చేరుకుఉని.. దీక్షకు సంఘీభావం తెలిపారు. -
పేదల ‘ఇళ్ల’కు శాశ్వత పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించే అంశానికి శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి వారిలో ఇప్పటికే కొందరికి 58, 59 జీవోల ద్వారా యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. ఇంకా కొంత మందికి ఈ సమస్య అపరిష్కృతంగా ఉందని, దీనిని శాశ్వతంగా పరిష్కరించేందుకు త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్రమబద్ధీకరించిన ఆస్తుల క్రయవిక్రయాలకు సైతం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ఆస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం, పేద ప్రజల ఇళ్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై సోమవారం ప్రగతి భవన్లో అన్ని జిల్లాల మంత్రులు, పట్టణ ప్రాంత ఎమ్మెల్యేలతో మున్సిపాలిటీల వారీ గా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలు ఆస్తుల యాజమాన్య హక్కుకు సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతి ఇంచ్ భూమీ రికార్డుల్లోకి.. రాష్ట్రంలోని ప్రతి ఇంచ్ భూమినీ ప్రభుత్వ రికార్డులకు ఎక్కించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఆస్తి హక్కులకు భద్రత కల్పించే ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులను ధరణి పోర్టల్ డేటాబేస్లో నమోదు చేయడం ప్రారంభించిందన్నారు. దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. అలాగే పట్టణాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు. కాలనీల్లో ఎలాంటి భూసమస్యలున్నాయి? ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? సాధ్యమైన పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలపై సూచనలు అందించాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి శాశ్వత పరిష్కా రం చూపుతుందని హామీ ఇచ్చారు. అనం తరం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లో ని పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంగ ళవారం సాయంత్రంలోగా ఆయా పట్టణా లు, కాలనీల్లో ఉన్న ప్రతి సమస్యనూ మున్సి పల్ అధికారులకు అందజేస్తామన్నారు. -
గుడివాడలో 'హౌస్ ఫర్ ఆల్' పథకం ప్రారంభం
సాక్షి, గుడివాడ : కృష్ణా జిల్లా గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న హౌస్ ఫర్ ఆల్ పథకం పనులను బుధవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. ఇళ్ల పథకంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 200 కోట్ల రూపాయలను ఆదా చేశామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. ఒకవేళ న్యాయస్థానం అనుమతులిస్తే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల పట్టాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నాని వెల్లడించారు. -
కరోనా బిల్లుకు భయపడిన వ్యాపారి ఏం చేశారంటే
సూరత్: కరోనా బిల్లు చూసి గుండె గుభేలుమన్న సూరత్కు చెందిన ఒక వ్యాపారి కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత చికిత్స అందించేందుకు తన కార్యాలయాన్ని 85 పడకల ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ నుండి కోలుకున్న వ్యాపారవేత్త తనలాగా పేదలు కష్టపడకూడదని భావించి పెద్ద మనసు చేసుకోవడం ప్రశంసనీయంగా నిలిచింది. సూరత్కు చెందిన, ప్రాపర్టీ డెవలపర్ కదర్ షేక్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ క్లినిక్లో 20 రోజులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి బిల్లు చూసి ఒక్కసారిగా ఆయన ఉలిక్కిపడ్డారు. వ్యాపారవేత్తనైన తన పరిస్థితే ఇలా ఉంటే..ఇక పేదవాళ్ల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఫలితంగా తన 30,000 చదరపు అడుగుల (2,800 చదరపు మీటర్లు) కార్యాలయ ప్రాంగణం కోవిడ్-19 ఆసుపత్రిగా మారిపోయింది. తన మనవరాలు ‘హిబా’ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులను షేక్ పొందారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చులు చాలా భారంగా ఉన్నాయని, తానూ పేద కుంటుంబంలోంచే వచ్చాననీ, ఆర్థిక సమస్యలతో చాలా కష్టపడ్డానని షేక్ చెప్పారు. అందుకే పేదలకు తన వంతు సహాయంగా ఏదైనా చేయాలని భావించానన్నారు. కుల,మత భేదం లేకుండా అందరూ ఇక్కడ చికిత్స పొందవచ్చని వెల్లడించారు. సిబ్బంది, వైద్య పరికరాలు, ఔషధాలను ప్రభుత్వం సమకూరుస్తుండగా, మంచాలు, పరుపులతో పాటు విద్యుత్, ఇతర ఖర్చులను తాను భరించనున్నట్టు చెప్పారు. వంట, భోజనాల గది, వంటవారు, రోగుల రోజువారీ ఆహార అవసరాలు ఇలా అన్ని వసతులను సమకూర్చుతామన్నారు. తద్వారా కరోనా మహమ్మారి బారిన పడిన పేదలు ఇక్కడ ఉచితంగా చికిత్స పొందుతారంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. దాదాపు 35,000 మంది మరణించారు. -
పేదలకు అండగా
-
పేదల కోసం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
-
వీలైతే కొనండి, లేదా ఫ్రీగా తీసుకెళ్లండి
ఔరంగాబాద్: కొండంత చేసినా, గోరంత చేసినా సాయం విలువ మారదు. కరోనా విపత్తు వల్ల పూట గడవటమే కష్టంగా మారిన నిరుపేదల గురించి ఆలోచించిన ఓ కూరగాయల వ్యాపారి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఉచితంగా కూరగాయలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్కు ఎందిన రాహుల్ లాబ్డే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల కంపెనీ జీతాలివ్వడం మానేసింది. దీంతో అతను తన తండ్రితో కలిసి కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు అతని బండి దగ్గరకు ఓ వృద్ధురాలు వచ్చి రూ.5కు కూరగాయలివ్వమని అడిగింది. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) దీంతో విస్తుపోయిన లాబ్డే ఆమె దీన స్థితిని అర్థం చేసుకుని ఉచితంగా కూరగాయలిచ్చాడు. ఆ క్షణమే అతనిలో నిరుపేదలకు సాయం చేయాలన్న ఆలోచన మనసులో బలంగా నాటుకుంది. వెంటనే తన కూరగాయల బండికి ఒక బోర్డు తగిలించాడు. అందులో "వీలైతే కొనండి, లేదంటే ఉచితంగా తీసుకోండి" అని రాసి ఉంది. దీన్ని గమనించిన జనం కొందరు విడ్డూరంగా చూడగా మరికొందరు మాత్రం అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.2 వేలు విలువ చేసే కూరగాయలను ఉచితంగా ఇచ్చాడు. దీని గురించి లాబ్డే మాట్లాడుతూ.. 'రోజు ముగిసే సరికి ఆకలితో ఎవరూ నిద్రించవద్ద'న్నదే తన కోరిక అని చెప్తూ మంచి మనసును చాటుకున్నాడు. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’) -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
టీడీపీ తీరుపై భగ్గుమన్న గిలకలదిండి పేదలు
మచిలీపట్నం: పేదల ఇళ్ల స్థలాలు కోసం ఎంపిక చేసిన భూమిపై టీడీపీ నాయకులు తప్పుడు కేసులు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం గిలకలదిండి గ్రామస్తులు మంగళవారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం సంబంధిత భూమిలో స్థానిక పేదలు పిల్లాపాపలతో కలిసి బైఠాయించారు. వివరాల్లోకి వెళితే.. ► మచిలీపట్నం శివారు గిలకలదిండి గ్రామానికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. లోతట్టుగా ఉన్న ఆ స్థలాన్ని ఎత్తు చేసే పనులు కొనసాగుతున్నాయి. ► గిలకలదిండికి చెందిన సుమారు 1,100 కుటుంబాలకు ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే జాబితా సిద్ధమైంది. తాజాగా ప్లాట్లుగా విభజించే పనులు జరుగుతున్నాయి. ► అయితే, ఆ భూమిలో మడ అడవులున్నాయని, దీనివల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు కోర్టును ఆశ్రయించి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే తెచ్చినట్లు తెలుసుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులై ఆందోళనకు దిగారు. ► నిరుపేదలకు స్థలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ► అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోని రవీంద్ర ఇప్పుడు ప్రభుత్వ పథకాలేవీ అందకుండా కుట్రలు చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. ► సమాచారం అందుకున్న తహసీల్దార్ సునీల్బాబు రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ► అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, పేదలకు తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు. ► ఆ భూమి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించే నిమిత్తం డ్రోన్ కెమేరాతో ఆ ప్రాంతాన్ని వీడియో తీయించారు. ► గిలకలదిండి వద్ద ఎంపిక చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదని, వాటిపై స్టే ఇచ్చినట్లుగా న్యాయస్థానం నుంచి తమకెలాంటి పత్రాలు అందలేదని తహసీల్దార్ సునీల్బాబు మీడియాకు తెలిపారు. -
వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ మంగళవారం కీలక అభిప్రాయాలను వ్యక్తంచేశారు. మహమ్మారి కారణంగా ప్రభావితమైన వ్యాపారాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజల చేతుల్లోకి నగదు చేరాలంటే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సి వుందని బెనర్జీ సూచించారు. నిరుపేదలకు నగదు బదిలీ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని బెనర్జీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభుత్వాల ముందు పెద్ద సవాలు విసిరిందని, చాలా మంది ఉద్యోగాలు కోల్పోవచ్చన్న రాహుల్ వ్యాఖ్యాలను అంగీకరించిన ఆయన ఈ సూచన చేశారు. అంతేకాదు వీలైనంత తొందరగా లాక్డౌన్ నుంచి బయటపడాలన్నారు. కరోనా వైరస్ మహమ్మారి స్వభావం గురించి తెలుసుకోవాలి తప్ప లాక్డౌన్ పొడగింపు సహాయపడదని పేర్కొన్నారు. (పెట్రో ధరలకు వ్యాట్ షాక్ ) ఆహార కొరత సమస్యపై స్పందించిన ఆయన తాను ఇంతకుముందే ప్రభుత్వానికి సూచించినట్టుగా కనీసం మూడు నెలలు చెల్లుబాటయ్యేలా ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులివ్వాలని బెనర్జీ చెప్పారు. వీటి సాయంతో ఒక్కరికి ప్రస్తుతం బియ్యం, పప్పుధాన్యాలు, గోధుమలు, చక్కెర లాంటి వాటిని ఉచితంగా అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనావైరస్ కాలంలో కేంద్రం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రాష్ట్రాలు డైరెక్ట్ బెనిఫిట్ ఫథకాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ఉదాహరణను బెనర్జీ ఉదహరించారు. (లాక్డౌన్ సడలింపు : పసిడి వెలవెల) కరోనావైరస్ అనంతరం ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బెనర్జీ మాట్లాడుతూ, లాక్డౌన్ ద్వారా దెబ్బతింటున్న చిన్న, మధ్య వ్యాపారాలు, ఉపాధి మార్గాలపై స్పందించిన ఆయన చిన్న వ్యాపారాల రుణాలను కేంద్రం రైట్ ఆఫ్ చేయాలని పేర్కొన్నారు. తద్వారా వారిని నిలబెట్టడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలను కూడా బెనర్జీ ప్రశంసించారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అనుభవం గురించి రాహుల్ బెనర్జీని అడిగినపుడు దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పడం విశేషం. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) కాగా ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ్ రాజన్తో గత వారం ప్రారంభమైన రాహుల్ చర్చా సిరీస్లో ఇది రెండో భాగం. లాక్డౌన్తో బాధపడుతున్న పేదలకు సహాయం అందించేందుకు రూ.65వేల కోట్లు అవసరమని రాజన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. (270 కోట్ల తప్పుడు ప్రకటనలు తొలగించాం: గూగుల్)