press conference
-
IIFA అవార్డ్స్ విలేకరుల సమావేశంలో షారుఖ్ ఖాన్,నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
-
నిన్న తొక్కిసలాట సమయంలో 10 మంది పోలీసులు కూడా లేరు
-
కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం
న్యూఢిల్లీ: భారతదేశం పట్ల వ్యతిరేకతను కెనడా ప్రభుత్వం బహిరంగంగా ప్రదర్శిస్తోంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నా లెక్కచేయడంలేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ‘ఆస్ట్రేలియా టుడే’పై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేసింది. అలాగే మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా నిషేధం విధించింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన జైశంకర్ మీడియా సమావేశాన్ని ప్రసారం చేయడమే ఇందుకు కారణం. కెనడా చర్యపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెనడాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మీడియా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని సుద్దులు చెప్పే కెనడా ప్రభుత్వం ఆచరణలో ఆందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత్పై కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలను ఆస్ట్రేలియా గడ్డపై జైశంకర్ ఎండగట్టడాన్ని కెనడా ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు. -
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
ఐఫా-2024 ప్రెస్ కాన్ఫరెన్స్లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
-
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్నెస్పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్ను ఓడించే సత్తా హారిస్కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్ను ఓడించడం బైడెన్కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్ను ఓడించడం బైడెన్కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
రేపు NDA మిత్రపక్షాల భేటీ
-
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలే
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రంలో సైతం కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కోడ్ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో నామినేషన్ వేయొచ్చు ఆన్లైన్లో సైతం నామినేషన్ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్ పత్రాల ప్రింట్ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్రాజ్ తెలిపారు. నామినేషన్ ఫారంతోపాటు అఫిడవిట్లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్ అప్లికేబుల్’అని రా యాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్రాజ్ వెల్లడించారు. 23లోగా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్రాజ్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు. మహిళా ఓటర్లే అధికం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్రాజ్ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు. -
Lok sabha elections 2024: పార్టీని ఆర్థికంగా చిదిమేసే కుట్ర
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ సభలు, ర్యాలీలు, అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమాలకు ఎంతో ధనం అవసరమైన వేళ ప్రధాని మోదీ వ్యవస్థీకృతంగా కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా చిదిమేసేందుకు బరితెగించారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఢిల్లీలో పత్రికా సమావేశంలో సోనియా, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాం«దీలు మాట్లాడారు. పార్టీలో ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి మీడియాతో మాట్లాడటం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారఖర్చులు, ప్రకటనలకు భారీ మొత్తంలో నగదు అవసరమైన వేళ తమ బ్యాంక్ ఖాతాలను అదునుచూసి స్తంభింపజేయడాన్ని నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ‘కాంగ్రెస్కు ప్రజలిచి్చన నగదు విరాళాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఓవైపు ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, మరోవైపు ఖాతాల స్తంభనతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు. ఇవి నిజంగా అనూహ్యమైన తీవ్ర అవరోధాలు. ఇలా అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా మా శక్తిమేరకు అద్భుతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నది సుస్పష్టం. ప్రధాన ప్రతిపక్షం ఆర్థికమూలాలపై దాడి చేశారు’ అని సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఫ్రీజ్ చేస్తేనే ఆరోగ్యకర పోటీ సాధ్యం: ఖర్గే ‘డీఫ్రీజ్ చేయడమే ఎన్నికల్లో ఆరోగ్యకర పోటీకి బాటలుపరుస్తుంది. సాధారణ ప్రజానీకం కాంగ్రెస్కు విరాళంగా ఇచి్చన మొత్తాలను ఫ్రీజ్ చేసి, ఐటీ శాఖతో బలవంతంగా రూ.115.32 కోట్లు నగదు విత్డ్రా చేయించి మమ్మల్ని బీజేపీ లూటీ చేసింది. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు అత్యావశ్యకమైన ఈ తరుణంలో రాజ్యాంగబద్ధ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలను డీఫ్రీజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని ఖర్గే కోరారు. ‘బీజేపీ అధికారంలో ఉంది. పైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ తమ ఖాతాలను వేల కోట్ల రూపాయలతో నింపేసుకుంది. ఎన్నికల్లో దీటైన పోటీకి వీలు లేకుండా మా పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అధికారంలో ఉన్న వారు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగానీ రాజ్యాంగబద్ధ సంస్థలపై నియంత్రణ కల్గి ఉండొద్దు. వనరులపై గుత్తాధిపత్య ధోరణి అస్సలు మంచిది కాదు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి: రాహుల్ ‘ప్రధాన ప్రతిపక్షం అన్ని అకౌంట్లను ఫ్రీజ్చేయడం అంటే అది కాంగ్రెస్పై మాత్రమే ప్రభావం చూపదు దేశ ప్రజాస్వామ్యానికీ అది విఘాతమే. ఎన్నికల్లో పోటీచేసే సామర్థ్యాన్ని దెబ్బతీశారు. మేం ప్రచార కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నాం. ఫ్రీజ్ చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం ఉందనడం అబద్ధమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలేవీ ఇక్కడ పని చేయట్లేవు’ అని రాహుల్ అన్నారు. ‘ఖాతాల స్తంభనతో కరెన్సీ కష్టాలు విపరీతంగా పెరిగాయి. మా నేతలు, అభ్యర్థులు విమానాల్లో దేశంలోని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లలేని పరిస్థితి. విమానం సంగతి పక్కనబెట్టండి. కనీసం రైలు టికెట్ కొనేందుకు కూడా కష్టపడుతున్నాం. 20 శాతం ఓటుబ్యాంక్ మాకున్నా రూ.2 కూడా చెల్లించలేని పరిస్థితి. అదునుచూసి ఎన్నికలకు రెండు నెలల ముందు మోదీ పన్నిన కుట్ర ఇది. ఇంత జరుగుతున్నా ఈసీ మౌనంవహించడం విచారకరం. ఈ విషయంలో ఈసీ ఇంతవరకు స్పందించలేదు’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఓటమి ఖాయం కావడంతో కావాలనే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తోందని బీజేపీ ప్రతివిమర్శ చేసింది. అసుర శక్తిపైనే పోరాటం: రాహుల్ విద్వేషం నిండిన ఆసుర(రాక్షస) శక్తిపై తమ పార్టీ పోరాటం సాగిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ‘శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం’ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్వేషం నిండిన అసుర శక్తిపైనే తమ పోరాటం అని రాహుల్ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పష్టం చేశారు. అసుర శక్తిని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్ పోలింగ్ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 1 ప్లస్ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్గా సాఫ్ట్వేర్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్ 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్కు అనుమతి లభిస్తే వారు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పోలింగ్ బూత్లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్ బ్యాలెట్ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్ బాక్స్లో వేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇవి చేయొచ్చు ♦ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు ♦ చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు ♦ ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు ♦ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు ఇవి చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి ♦ పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు ♦ కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ♦ మంత్రులు ఫైలెట్ కార్లను వినియోగించకూడదు ♦ ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు -
నన్ను కొత్తగా చూస్తారు
రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన ΄ాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన విశేషాలు. లారెన్స్ మాట్లాడుతూ – ‘‘జిగర్ తండ’ సినిమాలోని గ్యాంగ్స్టర్ ΄ాత్రలో నటించే తొలి అవకాశం నాకే వచ్చింది. కానీ అప్పుడు ఇతర ్ర΄ాజెక్ట్స్తో బిజీగా ఉండటం వల్ల చేయడం కుదర్లేదు. ఆ తర్వాత ‘జిగర్ తండ’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీంతో ‘జిగర్ తండ’ కు సీక్వెల్ ఉన్నట్లయితే అందులో నేను నటిస్తానని కార్తీక్ సుబ్బరాజుకి చె΄్పాను. ఈ సీక్వెల్ ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’ కథ సిద్ధమైన ఏడాది తర్వాత కార్తీక్ సుబ్బరాజు ఫోన్ చేసి చె΄్పారు. కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించాను. ∙ఈ సినిమా విషయంలో దర్శకుడు కార్తీక్ చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులు కొత్త రాఘవా లారెన్స్ని చూస్తారు. సినిమా ఫస్టాప్లో యాక్షన్, సెకండాఫ్లో భావోద్వేగాల సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల హృదయం కూడా బరువెక్కుతుంది. ∙త్వరలో ‘కాంచన 4’ స్టార్ట్ చేస్తాను. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్గారి కోసమే కాదు.. సూపర్స్టార్, మెగాస్టార్ (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) కలిసి యాక్ట్ చేసే ఓ మల్టీస్టారర్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. కానీ వారు యాక్ట్ చేయాలి కదా’’ అన్నారు. నటుడు– దర్శకుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ– ‘‘దర్శకత్వం–నటన..ఈ రెండింటిలో నాకు నటన అంటేనే ఇష్టం. అయితే నా కెరీర్ ్ర΄ారంభంలో యాక్టింగ్ అవకాశాల కోసం డైరెక్షన్ని వారధిగా వినియోగించుకున్నాను. ఇక ‘జిగర్ తండ: డబుల్ఎక్స్’లో లారెన్స్గారిది గ్యాంగ్స్టర్ రోల్. నాదేమో దర్శకుడు కావాలనుకునే ΄ాత్ర. నా ΄ాత్రలో సత్యజిత్ రేగారి సినిమాల రిఫరెన్స్ ఉండటంతో ఇదొక బహుమతిగా భావించి ఈ మూవీ చేశాను. మంచి మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్ కోసం ఓ విలేజ్ సెట్ వేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఓ రోడ్, బ్రిడ్జ్ వేశాం. అప్పటికే రోడ్, బ్రిడ్జ్ సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్న ఆ గ్రామస్తులకు ఇవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. నేను నటిస్తూ, నా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది’’ అని చెప్పుకొచ్చారు. -
నన్ను తీసేశారా అని భయపడ్డాను
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన చరణ్రాజ్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఆకలి బాధలు అనుభవించాను. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన 40 ఏళ్ల కెరీర్ లభించింది. వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే ‘ప్రతిఘటన, జెంటిల్మేన్’ సినిమాలు నన్నొక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ఇక దర్శకుడు సెబాస్టియన్ నాకు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు నా పాత్రకు బాగా ఎగ్జయిట్ అయ్యాను. కానీ రెండు నెలలు గడిచినా సెబాస్టియన్గారి నుంచి ఫోన్ రాలేదు. మేం చేస్తే కనెక్ట్ కాలేదు. దీంతో ‘నరకాసుర’లోంచి నన్ను తీసేశారా అనే భయం కలిగింది. కథా రచనలో భాగంగా జబల్పూర్ వెళ్లానని, అందుకే ఫోన్ కలవలేదని, ‘నరకాసుర’లో నాకు చెప్పిన పాత్రను నేనే చేస్తున్నట్లుగా సెబాస్టియన్గారు ఆ తర్వాత చెప్పారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రను ఈ సినిమాలో చేశాను. ప్రస్తుతం శ్రీహరిగారి అబ్బాయి మేఘాంశ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు. -
నువ్వు నీలా ఉండు అని చెప్పింది
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో నూపుర్ సనన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఎవర్నైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేయడానికి సాహసించే మార్వాడి అమ్మాయి సారా పాత్రను చేశాను. ఈ చిత్రంలో నా వేషధారణ మోడ్రన్గా ఉంటూనే ట్రెడిషనల్గా ఉంటుంది. తెలుగులో చేసిన తొలి సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’తోనే నాకు సారాలాంటి చాలెంజింగ్ రోల్ దొరకడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం దాదాపు రెండు వందల మందిని ఆడిషన్ చేశాక, ‘సారా’ పాత్రకు నన్ను ఎంపిక చేశారు వంశీగారు. సెట్స్లో ఆయన చెప్పినట్లు నటించాను. ప్రస్తుతం నవాజుద్దిన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ‘నువ్వు నీలా ఉండు’ అని అక్క (హీరోయిన్ కృతీ సనన్) సలహా ఇచ్చింది. ‘మిమి’ సినిమాలో అక్క నటన నాకు కన్నీళ్లు తెప్పించింది. మా అక్క తెలుగులో మహేశ్బాబు, ప్రభాస్, నాగచైతన్య వంటి స్టార్లతో సినిమాలు చేసింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది’’ అని చెప్పుకొచ్చారు. -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్లో టామ్బాయ్లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్లో చాలా ఎనర్జిటిక్గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
మీడియా కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ నేతల రచ్చ
తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లోనే బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుధాకరన్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్లు మైక్ ముందే నువ్వా-నేనా అన్నట్లు తగువులాడుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రసంగాన్ని ముందు ఎవరు ప్రారంభించాలనే అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో చాందీ ఊమెన్ అఖండ విజయం సాధించిన తర్వాత సెప్టెంబర్ 8న కొట్టాయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సతీషన్, సుధారకరన్ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలో ముందు ఉన్న మైక్లను సుధాకరన్ తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో ముందు మీరెలా ప్రసంగం ప్రారంభిస్తారని సతీషన్ ప్రశ్నించారు. దీంతో వివాదం రచ్చకెక్కింది. తాను పార్టీ ప్రెసిడెంట్ను అని తెలిపిన సుధాకరన్.. తనకు ఆ హక్కు ఉంటుందని మైక్ ముందే అన్నారు. ఎట్టకేలకు సతీషన్ తగ్గగా.. మైకులను సుధాకరన్ వైపుకు ఉంచారు. ప్రెస్ మీటింగ్లో అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు ఇప్పటికే చెప్పారుగా.. అంటూ సతీషన్ దాటవేశారు. మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నలకు సధాకరన్కు సతీషన్ సహాయం చేయడానికి కూడా నిరాకరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన అంశంపై సతీషన్ను ప్రశ్నించగా.. తమ మధ్య వేరే విషయం ఉందని అన్నారు. పుత్తుపల్లి గెలుపు క్రెడిట్ మొత్తం తనకే కేటాయిస్తానని అనడంతో నేను ఆపే ప్రయత్నం చేశానని సతీషన్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: Jamili Elections: జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ -
నా పూర్వజన్మ సుకృతం ఇది
తెలంగాణ ప్రజా కవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. కాళోజీగా మూల విరాట్ నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్కు వెళుతోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘కాళోజీలాంటి గొప్ప కవి సినిమా తీయడం సాహసమే అయినప్పటికీ నాకీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు విజయలక్ష్మీ జైనీ. ‘‘ఈ సినిమాలో నటించడానికే సినిమా రంగంలోకి వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ΄ాత్ర చేశాకే నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలుగుతోంది’’ అన్నారు మూల విరాట్. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది'
''నాకిది ఆరంభం మాత్రమే.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో నేను టీమిండియాకు చాలా చేయాల్సి ఉంది.''.. ఇవీ విండీస్తో తొలి టెస్టులో శతకంతో మెరిసిన జైశ్వాల్ చేసిన వ్యాఖ్యలు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్గా యశస్వి జైశ్వాల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన జైశ్వాల్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆడుతుంది వెస్టిండీస్ లాంటి బి-గ్రేడ్ జట్టుతో కావొచ్చు.. కానీ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ఒక ల్యాండ్ మార్క్ ఇన్నింగ్స్తో కెరీర్ను మొదలుపెట్టడం ఏ క్రికెటర్ కైనా గొప్పగానే కనిపిస్తోంది. అందుకే జైశ్వాల్ రెండోరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. "నాకు, నా కుటుంబానికి, నాకు అన్ని విధాలుగా మద్దతిచ్చిన అందరికీ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనికి ఎంతగానో సహకరించిన మా అమ్మానాన్నలకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని యశస్వి అన్నాడు. ఒకప్పుడు క్రికెట్ను కెరీర్గా మలచుకోవడానికి ముంబై వచ్చి పానీపూరీ అమ్మిన యశస్వి.. ఇప్పుడు ఇండియాతరఫున అరంగేట్రం చేయడమే కాదు తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. 91 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడిన యశస్వి.. అంతర్జాతీయ క్రికెట్ ను ఘనంగా మొదలుపెట్టాడు. 2020లో తొలిసారి ఐపీఎల్ ఆడిన యశస్వి.. 2023 సీజన్ ను మరుపురానిదిగా మలచుకున్నాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచ్ లలో 625 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శన అతన్ని జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని యశస్వి వమ్ము చేయలేదు. A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో ICC-BCCI Revenue Share: పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం -
మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్సులో నరేంద్ర మోదీ?
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ. "బిగ్ డీల్" దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. ఇవి కూడా అడగండి.. ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక నిర్ణయం!
‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1973 మార్చిలో నా సినిమా (‘జగమే మాయ’) షూటింగ్ మొదలైంది. నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు నా కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్ని. చనిపోయేంతవరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను’’ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్. -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా తగ్గేది లేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ధ్వజమెత్తారు. తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను.. పోరాడుతానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకి పంపినా భయపడేది లేదని.. ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. అదానీ , మోదీ స్నేహం గురించి పార్లమెంట్లో మాట్లాడాడని.. వీరిద్దరి బంధం, ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఉందన్నారు. ‘నిబంధనలు మార్చి ఎయిర్పోర్ట్లు అదానీకి ఇచ్చారు. నేను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని కేంద్రమంత్రులు పార్లమెంటులో అబద్ధం చెప్పారు. నేను రెండు లేఖలు రాస్తే.. వాటికి జవాబుల లేదు. స్పీకర్ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నేను ఒకటే ప్రశ్న అడిగాను. అదానీ షెల్ కంపెనీలో 20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని..ఆ డబ్బు ఎవరిదని ప్రశ్నించాను’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చదవండి: రాహుల్పై అనర్హత వేటు.. సెప్టెంబర్లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక? -
వాయిదాల్లో ఏసీడీ సేకరణ
హనుమకొండ: అదనపు వినియోగాధారిత డిపాజిట్(ఏసీడీ)ను వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(ఎన్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్రావు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీడీ విధింపుపై ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. విద్యుత్ సర్వీస్ తీసుకున్నప్పటి కంటే అదనంగా లోడ్ పెరిగినప్పుడు ఆ మేరకు ఏసీడీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏసీడీపై ప్రతి ఏడాది మే నెలలో వడ్డీ చెల్లిస్తూ బిల్లులు సర్దుబాటు చేస్తామని, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే ఏసీడీ విధిస్తున్నామన్నారు. ఇది విద్యుత్ పంపిణీ సంస్థలు, పాలకమండలి సొంత నిర్ణయం కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు వరుసగా రెండు నెలలు బిల్లు చెల్లించనప్పుడు మూడో నెల నోటీసు ఇచ్చి డిపాజిట్ నుంచి సంస్థకు రావాల్సిన బకాయిలు తీసుకుని సర్వీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వినియోగదారులు వినియోగిస్తున్న యూనిట్లకు ఎంత బిల్లు వస్తుందో ఏడాదికి సగటున లెక్కించి రెండు నెలల బిల్లు మొత్తాన్ని ఏసీడీగా సేకరిస్తున్నామని, ఈ ఏసీడీని ఇంటి యజమాని చెల్లించాలన్నారు. అద్దెదారులు, ఇంటి యజమాని పరస్పర అవగాహనకు వచ్చి ఏడీసీని అద్దెదారులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, తలసరి వినియోగంలోనూ ముందున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర్రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, వి.తిరుపతిరెడ్డి, సీజీఎం మధుసూదన్ పాల్గొన్నారు. -
'భారీ స్కోర్లు రావడం లేదని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా'
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బలహీనంగా కనిపించిన టీమిండియా బౌలింగ్ రెండో వన్డేలో మాత్రం అదిరింది. ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన పేస్ పదునుతో కివీస్ బ్యాటర్లను వణికించాడు. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత మిగతా పనిని సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, సుందర్లు పూర్తి చేశారు. మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలర్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా బౌలింగ్ గాడిన పడడం మాకు కలిసొచ్చే అంశం. ఈ ప్రదర్శన ఇక్కడికే పరిమితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రోహిత్ వెల్లడించాడు. రోహిత్ మాట్లాడుతూ.. 'గత ఐదు మ్యాచ్ల్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేం అడిగిందల్లా చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్లో ఇలాంటి పేస్ పిచ్లను చూసుండరు. విదేశాల్లోనే ఇలాంటి వికెట్లను తరుచూ చూస్తుంటాం. మా బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ కింద బంతి స్వింగ్ అవ్వడం గమనించాం. దాంతో న్యూజిలాండ్ 250 పరుగులు చేసినా పోరాడే లక్ష్యమని భావించాం. ఈ ఆలోచనతోనే చేజింగ్కు మొగ్గు చూపాను. గత మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో.. ఈ మ్యాచ్లో మమ్మల్ని మేం సవాల్ చేసుకోవాలనుకున్నాం. కానీ మేం అనుకున్న కఠిన పరిస్థితులు ఎదురవ్వలేదు. ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జట్టులో ప్రతీ ఒక్కరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. జట్టును ఇలా చూడటం గొప్పగా ఉంది. షమీ, సిరాజ్లు లాంగ్ స్పెల్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఉందనే విషయాన్ని వారికి నేను గుర్తు చేస్తున్నాను. ఈ సిరీస్ నేపథ్యంలో మేం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నా ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం ముఖ్యమని భావిస్తున్నా. నేను భారీ స్కోర్లు చేయడం లేదనే విషయం తెలుసు. దాని గురించి నేను బాధపడటం లేదు. అతి త్వరలోనే భారీ స్కోర్ సాధిస్తాననే నమ్మకం ఉంది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, గిల్ 40 పరుగులు చేశాడు. చదవండి: రోహిత్ శర్మ.. ఇంత మతిమరుపా! -
'జట్టులో పంత్ ఎందుకు?'.. డీకే అదిరిపోయే రిప్లై
నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభిస్తే.. చివర్లో దినేశ్ కార్తిక్ తనదైన ఫినిషింగ్తో ముగించాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్, ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొంతకాలంగా చూసుకుంటే పంత్ జట్టులో ఉంటే కార్తిక్ ఉండకపోవడం.. కార్తిక్ ఉంటే పంత్ మ్యాచ్ ఆడకపోవడం లాంటివి జరుగుతూ వస్తుంది. ఇద్దరు జట్టులో ఉన్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20లో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కింది. ఇక పంత్ వికెట్ కీపర్గానే బాధ్యతలు నిర్వహించాడు. అయితే మ్యాచ్ విజయం అనంతరం దినేశ్ కార్తిక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాతో రెండో టి20లో పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు. దానికి డీకే అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ''వర్షం కారణంగా మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్ రోహిత్కు ఐదుగురు బౌలర్ల ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు.. అయితే హార్దిక్ రూపంలో ఐదో బౌలర్ ఉండనే ఉన్నాడు. అందుకే ఉమేశ్ యాదవ్ స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయమేంటంటే.. ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నాతో పాటు పంత్ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్లో ఇలాగే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు -
రిలీజ్ తర్వాత పాన్ ఇండియా అవుతుంది
‘‘నటన, దర్శకత్వం నాకు రెండు కళ్లు. హీరోగా సక్సెస్ అయి, ఆ తర్వాత ఓ 30 ఏళ్లకు డైరెక్షన్ చేయాలనుకున్నాను. కానీ సరైన అవకాశాలు దొరక్క నా తొలి సినిమా ‘ఫలక్నుమా దాస్’కి నా బ్యానర్లో నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తి దక్కలేదు. ఎందుకంటే ఇది రీమేక్ చిత్రం. ప్రస్తుతం నేను చేస్తున్న దాస్కా ‘దమ్కీ’ చిత్రం నాలోని దర్శకత్వ ప్రతిభను చూపిస్తుందనే నమ్ముతున్నాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దమ్కీ’. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్. వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్లో వేసిన సెట్లో యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఇంకా ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం జరిగిన ఈ సినిమా విలేకరుల సమావేశంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో హోటల్లో వర్క్ చేసే కృష్ణదాస్ అనే పాత్రలో కనిపిస్తాను. యాక్షన్ కొత్తగా ఉంటుంది. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్–జుజితో అద్భుతమైన క్లయిమాక్స్ సీన్స్ను ప్లాన్ చేశాం. ఈ కథలో కలర్స్ మారుతుంటాయి. ఆడియన్స్ నవ్వుతుంటారు.. అలాగే చెమటలు పడతాయి. కథలో అంత బలం ఉంది. అవుట్పుట్పై నమ్మకం ఉంది. అందుకే ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నాం. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నవరసాలు ఉంటాయి’’ అన్నారు కరాటే రాజు. -
ప్రెస్ కాన్ఫరెన్స్కు రోహిత్ డుమ్మా; కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..
ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు మరో 24 గంటలు మాత్రమే మిగిలిఉంది. మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్లే తమ ప్రాక్టీస్లో స్పీడును పెంచాయి. అయితే పాకిస్తాన్ జట్టను మాత్రం గాయాలు కలవరపెడుతున్నాయి. మోకాలి నొప్పితో షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా వెన్నునొప్పితో మహ్మద్ వసీమ్ ఆసియాకప్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో హసన్ అలీని తుదిజట్టులోకి ఎంపిక చేసినట్లు పీసీబీ ట్విటర్లో ప్రకటించింది. ఇక మ్యాచ్కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్మీట్కు రావడం ఆనవాయితీ. అయితే ఈ ప్రెస్మీట్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ డుమ్మా కొట్టాడు. హిట్మ్యాన్ స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ హాజరయ్యాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..'' మ్యాచ్ ఓటమి అనేది బాధించడం సహజం. గత టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లోనే మేం ఓడిపోయాం. అప్పటి ఓటమికి బదులు తీర్చుకునేందుకు మాకు మరో అవకాశం వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాక్తో మేజర్ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడడం లేదు. అందుకే ఎప్పుడు పాక్తో మ్యాచ్ జరిగినా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఇవన్నీ క్రీడలో భాగంగానే. ఏ ఆటైనా జీరో నుంచే మొదలవుతుంది. ఇక పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఒక వరల్డ్క్లాస్ బౌలింగ్ను మేము ఈ మ్యాచ్లో మిస్సవుతున్నాం'' అంటూ ముగించాడు. ఇక కేఎల్ రాహుల్ గజ్జల్లో గాయం నుంచి కోలుకొని జింబాబ్వేతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్గా ఉన్న రాహుల్ జట్టును విజయపథంలో నడిపాడు. ఆ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే బ్యాటింగ్ మాత్రం కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. జింబాబ్వేతో చివరి రెండు వన్డేల్లో ఓపెనర్గా వచ్చిన రాహుల్ 1, 30 పరుగులు చేశాడు. #WATCH | Dubai: Cricketer KL Rahul says, "...We always look forward to India-Pakistan clash as we don't play each other anywhere else but these big tournaments. So, it's always an exciting time & a great challenge for all of us to compete against a team like Pak..."#AsiaCup2022 pic.twitter.com/7ul1SvfCdT — ANI (@ANI) August 26, 2022 చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్ ఆల్రౌండర్ Asia Cup 2022: కోహ్లి, రోహిత్ అయిపోయారు.. ఇప్పుడు పంత్, జడేజా వంతు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయడం లేదు'
క్రికెట్లో ఒక సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్లు మీడియా ముందుకు రావడం ఆనవాయితీ. జట్టు కాంబినేషన్, గేమ్ ప్లాన్, విన్నింగ్ స్ట్రాటజీ, బ్యాటింగ్ ఆర్డర్ సహా మరికొన్ని విషయాలు గురించి కెప్టెన్ వివరించడం చూస్తుంటాం. ఇదే తరహాలో శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ కూడా మీడియా ముందుకు వచ్చాడు. మాములుగానే మీడియాతో మాట్లాడేటప్పుడు ఫన్ క్రియేట్ చేయడంలో ముందుండే రోహిత్ మరోసారి రెచ్చిపోయాడు. విషయంలోకి వెళితే.. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకరి.. ఔట్ ఫీల్డ్లోనే మీరు మ్యాచ్ ఆడబోతున్నారా.. అసలు పిచ్ గురించి ఏం మాట్లాడడం లేదు అని ప్రశ్నించాడు. దీనికి రోహిత్ కాస్త భిన్నంగా స్పందించాడు. '' అసలు ఈ మధ్యన ఒక్కరు సరైన ప్రశ్నలు వేయడం లేదు. మీరు అడిగినది వాస్తవానికి మంచి ప్రశ్న. అంతేకాదు పిచ్ గురించి కానీ, జట్టు కాంబినేషన్ గురించి, ప్రేక్షకుల గురించి ఒక్కరు కూడా అడగడం లేదు. మీరు అడగకపోవడం కూడా ఒక రకంగా మంచిదే.. అన్ని విషయాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్కు ప్రేక్షకులు వస్తుండడం నాకు సంతోషం కలిగించింది'' అంటూ పేర్కొన్నాడు. దీంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రోహిత్ శర్మకు పూర్తిస్థాయి కెప్టెన్గా ఇదే తొలి టెస్టు సిరీస్. కోహ్లి టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్కు స్వదేశంలోనూ ఇదే తొలి సిరీస్. కోహ్లి కూడా లంకతో తొలి టెస్టు ద్వారా వందో టెస్టు మ్యాచ్ ఆడనుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. చదవండి: Dewald Brevis: జూనియర్ ఏబీ క్రికెట్ రూంలో ఆశ్చర్యకర విషయాలు IND vs SL 1st Test: నెట్స్లో చెమటోడ్చుతున్న హిట్మ్యాన్.. ఫోటోలు వైరల్ 💬 💬 We want to make the occassion special for @imVkohli: #TeamIndia Captain @ImRo45 #INDvSL | @Paytm | #VK100 pic.twitter.com/NOxk0bTRr8 — BCCI (@BCCI) March 3, 2022 .@ImRo45 😂pic.twitter.com/xKXNPaA4gi — Manojkumar (@Manojkumar_099) March 3, 2022 -
కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్న గంగూలీ!
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఒక సీనియర్ ప్లేయర్గా జట్టుకు అందుబాటులో ఉంటానని.. ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇప్పుడంటే కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా తప్పుకున్నాడు కాబట్టి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. చదవండి: Kohli VS Bavuma: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది? కానీ ఇదే కోహ్లి.. సౌతాఫ్రికా టూర్ బయలుదేరడానికి ముందు మీడియా ముందుకు వచ్చి బీసీసీఐతో పాటు గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదమే. ఈ వివాదం ఎంత రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్డే కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని... కెప్టెన్గా తప్పుకోవద్దంటూ గంగూలీ తనను అడగలేదంటూ కోహ్లి కుండబద్దలు కొట్టాడు. దీంతో బీసీసీఐకి, కోహ్లికి.. పరోక్షంగా గంగూలీతో వివాదం తారాస్థాయికి చేరిందంటూ వార్తలు వచ్చాయి. దీంతో భారత మాజీ క్రికెటర్లు జోక్యం చేసుకొని .. కోహ్లి ఆటపై దృష్టి పెట్టాలని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: Virat Kohli-Sourav Ganguly: కోహ్లిపై మాట దాటేసిన దాదా.. కారణం అదేనా? తాజాగా దక్షిణాఫ్రికా టూర్కు ముందు కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసు ఇవ్వబోయాడని కొందరు క్రీడా పండితులు పేర్కొన్నారు. అయితే బీసీసీఐ బోర్డులో ఒక సభ్యుడి ఒత్తిడితో గంగూలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇండియా హెడ్న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం గంగూలీ.. కోహ్లికి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి డ్రాఫ్ట్ లెటర్ కూడా తయారు చేశాడని.. కానీ బోర్డు సభ్యుడు ఒకరు అడ్డుపడడంతో గంగూలీ ఆ ఆలోచనను మానుకున్నట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా టూర్కు ముందు కోహ్లి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని రిపోర్టులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమై.. గంగూలీ కోహ్లికి షోకాజ్ నోటీసు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని క్రీడా పండితులు పేర్కొన్నారు. చదవండి: వన్డే కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన బీసీసీఐ..! -
మీడియా సమావేశానికి కోహ్లి డుమ్మా కొట్టనున్నాడా!
క్రికెట్లో ఏ జట్టైనా సరే.. సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు కెప్టెన్ కోచ్తో కలిసి మీడియా సమావేశానికి రావడం ఆనవాయితీ. అయితే దానిని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్రేక్ చేయనున్నట్లు సమాచారం. మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. చదవండి: IND vs SA: 'ఐదో స్థానం మాకు కీలకం.. పెద్ద తలనొప్పిగా మారింది' ఈ నేపథ్యంలో మ్యాచ్కు ఒకరోజు ముందు (డిసెంబర్ 25)న మీడియా సమావేశానికి కోహ్లి హాజరుకావాలి. కానీ కోహ్లి ఈ సమావేశానికి డుమ్మా కొట్టనున్నట్లు సమాచారం. టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక మెయిల్ జారీ చేసింది. సెంచూరియన్లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్కు ముందు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే పాల్గొంటాడని మొయిల్లో పేర్కొంది. అయితే వన్డే కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లి దక్షిణాఫ్రికా టూర్కు బయలుదేరే ఒకరోజు ముందు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగే సమయంలో తనను ఆపినట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన ప్రకటనను కోహ్లీ ఖండించాడు. కోహ్లీ వ్యాఖ్యలపై గంగూలీ ఏం చెప్పకుండా అంతా బీసీసీఐ చూసుకుంటుందని పేర్కొన్నాడు. తాజాగా కోహ్లి బీసీసీఐ ఆదేశాలతోనే మీడియా సమావేశానికి దూరంగా ఉండనున్నాడా లేక తనంతట తానుగానే ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: James Anderson: 'మా బౌలింగ్ను విమర్శించే హక్కు మీకు లేదు' -
విలేకరుల సమావేశం జరపవద్దు!... అంటూ సాలీడు ఎలా అడ్డుపడుతుందో చూడండి!!
Spider Interupts Australia News Conference: ఒక్కోసారి ప్రజానాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడూ అది కూడా మీడియా ప్రత్యక్ష ప్రశారాల్లో అనుకోని అంతరాయాలు ఏర్పడటం చూస్తుంటాం. సిగ్నల్స్ లేక లేదా ఒక వేళ అక్కడ ఉన్న వ్యక్తులు సమావేశం జరగకుండా అడ్డుతగలడమే చూస్తుంటాం. కొంత మంది వ్యక్తులైతే పనిగట్టుకుని ఉపన్యాసిస్తున్న నేతను పట్టుకుని అందరి ముందు దులిసేసి రసభాస చేయడం కూడా ఇటీవలకాలంలో మనం ఎక్కువగా చూశాం. కానీ ఒక సీరియస్ మీటింగ్లో అది కూడా ఒక ఆరోగ్య మంత్రి సమావేశంలో ఒక చిన్న సరీసృపం ఎలా అంతరాయం కలిగించిందో తెలుసా!. పైగా ఒక్క నిమిషంపాటు ఆ మంత్రి కూడా కంగారుపడి పోవడం కూడా జరిగింది. (చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!! అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ ఆరోగ్య మంత్రి యివెట్ డి అథ్వాస్ కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణలు, వ్యాక్సిన్లకు సంబంధించి బహిరంగ మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఆ సమావేశంలో వ్యాక్సినేషన్ విధివిధానాలకు అనుగుణమైన వ్యాపార ఆవశ్యక్యత గురించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక సాలీడు ఆమె మాట్లాడుతుండగా ఆమె మీద నుంచి సమీపంలోని పోడియం పై పడుతుంది. దీంతో ఏదో మీద పడినట్టుగా భావించి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఆ తర్వాత వెంటనే మీలో ఎవరైన దీన్ని ఇక్కడ నుంచి తీసేయగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతలో చీఫ్ హెల్త్ ఆఫీసర్ జాన్ గెరార్డ్ కొన్ని కాగితాలను ఉపయోగించి సాలీడును తీసేశాడు. అయితే ఆమె మన వద్ద కోవిడ్ ఉంది, స్పైడర్లు ఉన్నాయంటూ చమత్కరించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఫిలిప్పీన్స్లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) -
వన్డేలు ఆడుతాడా లేదా?.. మీడియా ముందుకు కోహ్లి!
Virat Kohli Press Confernce About Playing ODIs In SA Tour.. దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ సిరీస్ కంటే కెప్టెన్సీ విషయం ఎక్కువ ప్రాధాన్యం సంతరించకుంది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తొలగించి రోహిత్ను ఎంపిక చేసినప్పటి నుంచి సమస్య పెరిగిపోతుందే తప్ప కొలిక్కి రావడం లేదు. దీనికి తోడూ సౌతాఫ్రికా టూర్లో టీమిండియా ఆడనున్న టెస్టు సిరీస్కు రోహిత్ దూరమవ్వడం.. ఆ తర్వాత రోహిత్ సారధ్యంలో టీమిండియా ఆడనున్న వన్డే సిరీస్కు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు Virat Kohli: వన్డే, టి20లకు గుడ్బై చెప్పే యోచనలో కోహ్లి! ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లి మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని పలు మీడియాలు కథనాలు ప్రచురించాయి. రోహిత్ కెప్టెన్సీలో కోహ్లి ఆడడానికి ఇష్టపడడం లేదని... అదే సమయంలో అటు రోహిత్ కూడా కోహ్లి నాయకత్వంలో ఆడేందుకు సముఖుత చూపించడం లేదంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రశ్నలన్నింటకి సమాధానం చెప్పడానికి కోహ్లి బుధవారం మధ్యాహ్నం 1గంటకు ప్రెస్మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అయితే మీడియా ముందుకు వస్తున్న కోహ్లి సౌతాఫ్రికా టూర్లో వన్డే సిరీస్లో ఆడుతాడా లేక వైట్బాల్ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా తనను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తొలగించారన్న బాధను మనుసులో పెట్టుకున్న కోహ్లి వన్డేలు, టి20లకు గుడ్బై చెప్పే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే పలు కథనాలు ప్రచురితమయ్యాయి. మరి నిజంగా కోహ్లి మీడియా ముందుకు రానున్నాడా లేక ఇది కూడా గాలి వార్తేనా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. చదవండి: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్ ప్రశంసల జల్లు -
జోరుగా పుష్ప ప్రమోషన్..మీడియాతో అల్లుఅర్జున్ చిట్చాట్ ఫొటోలు
-
పాపం కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు.. అందుకే
Mohammed Azharuddin Slams Virat Kohli And Ravi Shastri.. న్యూజిలాండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్కు రాకుండా బుమ్రాను పంపించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా కెప్టెన్ ప్రెస్మీట్కు రావడం ఆనవాయితీ. కెప్టెన్తో పాటు కోచ్ రావడం కూడా సహజంగా కనిపిస్తుంది. ఆటలో ఏం తప్పులు చేశాము.. అవి తర్వాతి మ్యాచ్లో రిపీట్ చేయకుండా ఉండేందుకు ఏం చేయాలనేది ప్రణాళిక రచించుకోవాలి. ఒకవేళ కోహ్లి ప్రెస్మీట్ రావాలా వద్ద అనేది వదిలేద్దాం. కనీసం కోచ్ పాత్రలో రవిశాస్త్రి అయినా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే బాగుండేది. పాపం కోహ్లి, రవిశాస్త్రి తాము కెప్టెన్, కోచ్ అని మరిచిపోయుంటారు అంటూ కామెంట్ చేశాడు. చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా! ఇక టీమిండియా న్యూజిలాండ్, పాకిస్తాన్తో మ్యాచ్ల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో గెలిచినప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ
శంషాబాద్ రూరల్: శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భగవద్రామానుజుల వారు కూర్చున్న భంగిమలోని 216 అడుగుల పంచలోహా విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సోమవారం చినజీయర్స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. చరిత్రకు వన్నె తీసుకురాగల ఓ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విగ్రహం చూసిన ప్రతి ఒక్కరిలో ఓ జిజ్ఞాస కలిగించి సమతాస్ఫూర్తి పొందేలా భారీ మూర్తిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు. స్ఫూర్తి కేంద్రం రెండో అంతస్తులో ప్రతిష్టించే శ్రీ భగవద్రామానుజుల వారి 120 కిలోల బంగారు విగ్రహానికి నిత్యారాధన ఉంటుందన్నారు. ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వంద ఎక రాల విస్తీర్ణం, రూ. 1,200 కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న ఈ కేంద్రంలో సహస్రాబ్ది పారాయణ సమా రోహం గురించి భక్తులకు తెలియజేసేందుకు సెల్ఫ్ గైడెడ్ టూర్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. స్ఫూర్తి కేంద్రంలో 12 రోజులపాటు 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో 1,035 కుండాలతో హోమాలు నిర్వహిం చనున్నట్లు చినజీయర్స్వామి తెలిపారు. వ్యక్తిలో మానసిక స్థైర్యం, ధైర్యం కల్పించేందుకు 12 రోజులపాటు çపంచ సంస్కార దీక్షదారులతో ప్రతిరోజూ కనీసం కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేయనున్నట్లు వివరించారు. కోటి అవణ క్రతువు కూడా నిర్వహిస్తామన్నారు. దసరా రోజున యాగశాలలకు భూమిపూజ స్ఫూర్తి కేంద్రంలో దసరా రోజున 128 యాగశాలల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. ఒక్కో యాగశాల వద్ద 8 కుండాలతో ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం 5 వేల మంది రుత్వికుల సేవలు వినియోగిస్తామన్నారు. విగ్రహావిష్కరణకు 135 రోజుల కౌంట్డౌన్ మొదలైందని, నేటి నుంచి విగ్రహావిష్కరణ వరకు ప్రపంచం నలుమూలలా ఉన్న వారు వందే గురు పరంపరా మంత్రాన్ని జపించాలని జీయర్స్వామి పిలుపునిచ్చారు. ఇది ఓ ఉద్యమంలా సాగాలన్నారు. రెండు నెలలపాటు నిర్వహించనున్న చాతుర్మాస దీక్షను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీ అహోబిల జీయర్స్వామి, శ్రీ దేవనాథ జీయర్స్వామి, మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు పాల్గొన్నారు. -
WTC Final: అలా ఎలా డిసైడ్ చేస్తారు, అది తప్పు: కోహ్లీ
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓ సాధారణ టెస్ట్ మ్యాచ్ మాత్రమేనని, ఇందులో టీమిండియా గెలిచినా.. ఓడినా క్రికెట్లో కొనసాగక తప్పదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కేవలం ఒక్క మ్యాచ్తో ఎవ్వరూ ప్రపంచ ఛాంపియన్లు కాలేరని, ఐదు రోజుల ఆట ఆధారంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ను డిసైడ్ చేయడం తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఫైనల్ మ్యాచ్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా విజయావకాశాలపై స్పందించాడు. క్రికెట్ కూడా ఇతర క్రీడల్లాంటిదేనని, ఇందులోనూ గెలుపోటములు సాధారణమేనని పేర్కొన్నాడు. టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచినా.. ఓడినా, మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదని, అందుకే ఈ మ్యాచ్ను మరీ ప్రత్యేకంగా చూడనవసరం లేదని అభిప్రాయపడ్డాడు. టీమిండియా టెస్ట్ క్రికెట్లో గతకొన్నేళ్లుగా అద్భుతంగా రాణిస్తుందని, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా తమ ఫామ్ను అలాగే కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టు సభ్యులంతా కుర్రాలని, నాటి ఆ ఫైనల్ మ్యాచ్తో పోలిస్తే ఇది మరీ అంత ముఖ్యమైందేమీ కాదని వెల్లడించాడు. ఇక సౌథాంప్టన్లో వాతావరణం తమ జట్టు కూర్పుపై ప్రభావం చేపలేదని, అన్ని విభాగాల్లో సమతూకాన్ని మెయింటైన్ చేసి, పటిష్ఠమైన జట్టుతో బరిలోకి దింపుతున్నామని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులంతా ఎంతో హుషారుగా ఉన్నారని, ఇదే ఊపులో చక్కగా రాణించాలని ఆశిస్తున్నారని తెలిపాడు. ఫైనల్ చేరేందుకు మేమెంత కష్టపడ్డామో అందరు గమనించారని, అయితే అసలు సిసలైన పరీక్ష మాత్రం ముందుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఐసీసీ.. రాత్రికిరాత్రి రూల్స్ మార్చడాన్ని కోహ్లీ తప్పుపట్టాడు. ప్రపంచమంతా స్తంభించినప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పద్ధతిని మార్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. కనీసం ఇకనైనా అర్ధ రాత్రుల్లు రూల్స్ మార్చొద్దని సూచించాడు. పాయింట్ల విధానం మార్చాక ఫైనల్ చేరేందుకు తామెంతో కష్టపడ్డామని వివరించాడు. అంకితభావం, పట్టుదలతో ఆడి ఈ స్థితికి చేరుకున్నామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య మెగా పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చదవండి: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్ర.. కుంబ్లే ఫీట్కు దక్కని చోటు -
మహిళా క్రికెట్కు మీడియా మద్దతు అవసరం..
ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల క్రికెట్కు మీడియా మద్దతు అవసరం ఎంతైనా ఉందని, అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్కు తానెప్పుడూ డుమ్మా కొట్టాలని అనుకోనని భారత మహిళల టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించారు. సమాజంలో మీడియా ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి క్రీడారంగానికి చెందిన వారందరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. క్రీడారంగానికి చెందిన వారెవరికైనా క్వారంటైన్లో గడపడం కష్టమేనని, ఒక్కసారి మైదానంలోకి అడుగుపెట్టాక ఆ కష్టాలు వాటంతటవే కనుమరుగవుతాయని ఒసాకాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. మహిళా క్రికెట్ అభ్యున్నతి కోసం తనతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రికెటర్ కలిసి రావాలని, ఈ క్రమంలో ప్రతి ఒక్కరు మీడియాతో హుందాగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడేది లేదంటూ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మిథాలీ ఈ మేరకు స్పందించారు. కాగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచ నంబర్ 2 టెన్నిస్క్రీడాకారిణి ఒసాకా ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆమె తీసుకున్న నిర్ణయంతో అభిమానులందరూ నిరాశ చెందడమే కాకుండా, టోర్నీ కూడా కళావిహీనంగా మారిపోయింది. మీడియాతో మాట్లాడేది లేదంటూ, ప్రెస్ కాన్ఫరెన్స్ను బాయ్కాట్ చేసిన ఒసాకాకు ఆదివారం మ్యాచ్ రిఫరీ ఫైన్ విధించారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను సహజమైన పబ్లిక్ స్పీకర్ను కాకపోవడం వల్ల ప్రపంచ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతానని, నిజానికి 2018 యూఎస్ ఓపెన్ నుంచి తాను కుంగుబాటులో ఉన్నానని, అందుకే మీడియా సమావేశానికి ఒప్పుకోలేదని ఆమె వివరణ ఇవ్వడం కొసమెరుపు. చదవండి: డీకే తిట్టుకున్న బ్యాట్తో తొలి ఫిఫ్టీ కొట్టిన రోహిత్.. -
మీడియాతో మాట్లాడేది లేదు!
ఫ్రెంచ్ ఓపెన్కు ముందు జపాన్ స్టార్ నవోమీ ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నడూ లేని విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరు కానని ప్రకటించింది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పింది. గ్రాండ్స్లామ్ నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి హాజరు కాకపోతే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) జరిమానా విధించే అవకాశం ఉండగా...అందుకు తాను సిద్ధమని ప్రకటించింది. -
కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్ భేటీ
ఇస్లామాబాద్: కరోనా వైరస్ బారిన పడిన తరువాత కూడా తన మీడియా టీమ్తో వ్యక్తిగతంగా సమావేశం నిర్వహించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్కు కరోనా సోకినట్లుగా గత శనివారం నిర్ధారణ అయింది. కొన్ని రోజుల ముందే ఇమ్రాన్ చైనాకు చెందిన సైనోఫార్మ్ టీకాను తీసుకున్నారు. కరోనా సోకిన తరువాత క్వారంటైన్లో ఉండకుండా, సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. కరోనా నిబంధనలను ప్రధానే ఉల్లంఘించడం దారుణ మన్నారు. దేశంలో థర్డ్ వేవ్ నడుస్తున్న సమయ ంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాని, ఆయనతో సమావేశంలో పాల్గొన్న మీడియా టీమ్పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సంబంధిత సమావేశ వీడియోను సమాచార ప్రసార మంత్రి షిబ్లి ఫరాజ్, ఎంపీ ఫైజల్ జావేద్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ట్రాక్ సూట్లో ఉన్న ఇమ్రాన్ కొద్ది దూరంలో కూర్చుని ఉన్న ఫరాజ్, జావేద్లతో పాటు తన మీడియా టీమ్తో మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. (చదవండి: భారత్–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు) -
అడవుల్లోకి వెళ్లొచ్చాక నేను పెళ్లి చేసుకున్నాను..
‘‘కోవిడ్ తర్వాత మన తెలుగు పరిశ్రమే గాడిలో పడింది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనూ ఇలా లేదు. సినిమాలు రిలీజ్ చేసిన వెంటనే ప్రేక్షకులు థియేటర్స్కు వస్తున్నారు. అలాగే తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది’’ అన్నారు రానా. ప్రభు సాల్మన్ డైరెక్షన్లో రానా ప్రధాన పాత్రలో ఈరోస్ ఇంటర్నేషనల్స్ నిర్మించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, ప్రియా పింగోల్కర్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ’ రిలీజ్ను వాయిదా వేశారు. హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో రానా చెప్పిన విశేషాలు. ►దర్శకుడు ప్రభు సాల్మన్ మన భూమి కోసం, భవిష్యత్ తరాల కోసం పోరాడే వ్యక్తి కథ ‘అరణ్య’ అనగానే ఆసక్తికరంగా అనిపించింది. ఏనుగుల వల్ల అడవుల విస్తీర్ణం పెరుగుతుంది. అది మన భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది. అందుకే ‘అరణ్య’ భవిష్యత్ తరాలకు కూడా చెప్పాల్సిన కథ. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజులు ముందుగానే థాయ్ల్యాండ్కు వెళ్లాం. కథ గురించి చెప్పి 18 ఏనుగులతో షూట్ చేయాల్సి ఉంటుంది అన్నారు ప్రభు. ఏనుగులతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు ఏనుగుల సంరక్షకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. సాధారణంగా ఒక ఏనుగు మన పక్కన నడిస్తేనే భూమి కంపిస్తుంది. అలాంటిది ఒకేసారి 18 ఏనుగులతో కలిసి ఉంటూ, షూటింగ్ చేశామంటే మేం ఎంత కష్టపడి ఉంటామో ఊహించుకోవచ్చు. ►ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా బిరుదొచ్చాక జాదవ్ పయేంగ్ని అరణ్య అని పిలుస్తుంటారు. అందుకే మా సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. జాదవ్ పయేంగ్, ఎలిఫెంట్ విస్పరర్గా పిలవబడే లారెన్స్ ఆంథోనీ జీవితాల్లోని సంఘటనలు, కాజీరంగా ఘటనను కూడా ఈ సినిమాలో చూపించాం. ►ప్రతి సినిమా ఎంతో కొంత మార్పు తీసుకువస్తుంది. ఈ సినిమా కోసం అడవుల్లోకి వెళ్లొచ్చాక నేను పెళ్లి చేసుకున్నాను. ఇంతకన్నా మార్పు ఏం ఉంటుంది (నవ్వుతూ). ►స్పీడ్గా సినిమాలు చేయాలనుకుంటాం. ‘బాహుబలి’ సినిమాని రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటే ఐదేళ్లయింది. ‘అరణ్య’కు మూడేళ్లు పట్టింది. ఈ ఏడాది నావి మూడు సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్లో నటిస్తున్నాను. -
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు
క్రైస్ట్చర్చి: పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కివీస్ 176 పరుగులు ఇన్నింగ్స్ తేడాతో పాక్పై ఘనవిజయం సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరవడమేగాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') కివీస్ సహచర ఆటగాడు బీజే వాట్లింగ్ విలియమ్సన్ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దీంతో అనుకోని సంఘటనతో మొదట విలియమ్సన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే వెంటనే చిరునవ్వు అందుకుంటూ వాట్లింగ్ తెచ్చిన షర్ట్పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ బ్లాక్ క్యాప్స్ తన ట్విటర్లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్గా మారింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా సీరియస్గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్ అడుగుతాడని విలియమ్సన్ బహుశా ఊహించి ఉండంటూ' క్యాప్షన్ జత చేసింది. కాగా రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ (157; 18 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది. విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజహర్ అలీ(37), జాఫర్ గౌహర్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.(చదవండి: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) "What is going on?" 🤔 Not much, just BJ Watling fanboying Kane Williamson in the middle of a press conference 😄pic.twitter.com/aLJ2ypQUef — ICC (@ICC) January 6, 2021 -
జీడీపీ పరుగులు పెట్టేలా ప్రత్యేక ప్యాకేజీ: నిర్మల
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల కనిపిస్తున్న డిమాండ్ తాత్కాలికమైనదికాదని..ఇకపైనా పటిష్టంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంకా ఏమన్నారంటే.. హైలైట్స్ - ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ. 65,000 కోట్ల కేటాయింపు. - జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి(ఎన్ఐఐఎఫ్)కి రూ. 6,000 ఈక్విటీ పెట్టుబడులు. తద్వారా 2025కల్లా ఎన్ఐఐఎఫ్ రూ. 1.1 లక్షల కోట్లను సమీకరించగలుగుతుంది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చగలుగుతుంది. - గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి రూ. 10,000 కోట్ల అదనపు కేటాయింపులు. - రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కు బూస్ట్- డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను సంబంధిత ఉపశమన చర్యలు- సెక్షన్ 43సీఏలో సవరణలు! - ఆత్మనిర్భర్ తయారీ పథకంలో భాగంగా 10 చాంపియన్ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించనున్నారు. - ఈ పథకం విలువ రూ. 1,45,980 కోట్లు. - అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకు రూ. 18,100 కోట్లు - ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్టులు రూ. 5,000 కోట్లు - ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు రూ. 57,042 కోట్లు - ఫార్మాస్యూటిక్స్, ఔషధాలు రూ. 15,000 కోట్లు - టెలికం, నెట్వర్కింగ్ ప్రొడక్టులు రూ. 12,195 కోట్లు - టెక్స్టైల్ ప్రొడక్టులు రూ. 10,683 కోట్లు - అధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రూ. 4,500 కోట్లు - వైట్ గూడ్స్(ఏసీలు, లెడ్) రూ. 6,328 కోట్లు - స్పెషాలిటీ స్టీల్ రూ. 6,322 కోట్లు - స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా మార్చి- సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. - ఈఎల్సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం. 61 లక్షల రుణగ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి. - 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం. - పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్యూ బ్యాంకుల పోర్ట్ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించాం. - ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి. - 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్గా చెల్లించాం. -
ఒక దేశం, ఒక మార్కెట్ దిశగా కీలక ముందడుగు
-
చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
-
‘జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే గయ్యిమని ఎగవడకు’
సాక్షి, హైదరాబాద్ : ఇవాళ్టి ప్రెస్మీట్లో అయినా నిజం చెప్పాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. వలస కార్మికుల భోజనం, ఇతర సౌకర్యాల కోసం కేంద్రం ఇచ్చిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు, రూ.599 కోట్లను ఏo చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కరోనా ఆసుపత్రుల అభివృద్ధికి, వైద్యపరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15000 కోట్లు విడుదల చేసిందని ధర్మపురి అరవింద్ తెలిపారు. అందులో మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఎన్ని పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు కొన్నారు? అని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ రూ.982 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందన్నారు. కార్డు హోల్డర్స్ కి మీరిచ్చిన రూ.1500, ఈ నిధుల నుండే మళ్లించారు కదా అని మండిపడ్డారు. మీడియా సమావేశంలో జర్నలిస్ట్ ఎవరైనా ఈ ప్రశ్నలు అడిగితే, గయ్యిమని ఎగవడకు!!! అంటూ ఎద్దేవా చేశారు.(తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు) -
విస్తృత పరీక్షలే ఆయుధం: రాహుల్
న్యూఢిల్లీ: కోవిడ్పై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విస్తృతంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించడమొక్కటే ప్రధాన ఆయుధమనీ, అయితే కరోనాను ఎదుర్కోవడంలో లాక్డౌన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ప్రతి ఒక్కరూ పోరాడగలిగితే ఇతర దేశాలకన్నా భారత్ మంచిస్థానంలో ఉంటుందని రాహుల్ అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఆహారం, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రభుత్వం ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలనీ, లేదంటే ఇది సామాజిక అస్థిరతకు దారితీయవచ్చునని రాహుల్ ఆందోళన వెలిబుచ్చారు. కీలకమైన పరిశ్రమలూ, చిన్నా చితకా కంపెనీలను విదేశీ కంపెనీలు కొనుగోలుచేసే ప్రమాదం ఉన్నదనీ, విదేశీ కంపెనీల బారి నుంచి సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడాలని రాహుల్ కోరారు. లాక్డౌన్ పరిష్కారం కాదన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యానాన్ని బీజేపీ తిరస్కరించింది. లాక్డౌన్ పరిష్కారం కాదని భావస్తే, కేంద్రం కన్నా ముందుగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ ని పొడిగించారని బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్సంతోష్ ట్వీట్ చేశారు. -
'జిన్నానా? భారతమాతానా? తేల్చుకోండి'
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయ నేతల్లో మరింత దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి మరువక ముందే ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని షాహిన్బాగ్లో ఏర్పాటు చేపిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్లో డిసెంబర్ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్ పేర్కొన్నారు. (ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు : కపిల్ మిశ్రా) -
'పై నుంచి ఆదేశాలు వస్తే పోలీసులేం చేయగలరు'
ఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. జనవరి 5న జేఎన్యూలో హింసాత్మక వాతావరణం ఏర్పడినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. జేఎన్యూ ఘటనపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని తెలిపారు.(అసలేంటి ఇదంతా.. నాకేం అర్థం కావట్లేదు!) 'పై నుంచి ఆదేశాలు వస్తే ఢిల్లీ పోలీసులు మాత్రం ఏం చేయగలరు. జేఎన్యూలో ఎలాంటి హింస జరిగిన, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినా మీరెంలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రమే వారిని ఆదేశించింది. ఒకవేళ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే వారిని సస్పెండ్ చేయడమో లేక ఉద్యోగాలు ఊడిపోవడమో జరిగేది' అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5న హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్యూఎస్యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు. దిశకు సంబంధించిన సెల్ఫోన్, పవర్బ్యాంకు, వాచ్ తదితర వస్తువులను సేకరించేందుకు నలుగురు నిందితులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లామని, ఈ సందర్భంగా తమ పోలీసు అధికారుల వద్ద ఉన్న తుపాకీలను లాక్కుని ఆరిఫ్, చెన్నకేశవులు ఎదురు దాడికి దిగారని చెప్పారు. మిగతా నిందితులు రాళ్లతో పోలీసులపై దాడి చేశారని తెలిపారు. లొంగి పొమ్మని చెప్పినా వినకపోవడంతో వారిని ఎన్కౌంటర్ చేసినట్టు స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ కేసులో ఏ1 మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు తమ ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తమ పోలీసులు కాల్పులు జరిపారన్నారు. బుల్లెట్ గాయాలతోనే నిందితులు హతమైనట్టుగా తెలిపారు. మిగిలిన వివరాలు పోస్ట్మార్టం నివేదిక అనంతరం తెలుస్తుందన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో 10 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారనీ, అంతా అయిదు పది నిమిషాల్లో ముగిసిపోయిందని ఆయన వివరించారు. ఎన్నిరౌండ్ల ఫైరింగ్ జరిగింనేది విచారణలో తేలుతుందన్నారు. మరోవైపు తెలంగాణాలో చోటు చేసుకున్న ఈ ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటాగా తీసుకుంది. అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. ఎన్కౌంటర్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోయిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర హోం శాఖకు, ఎన్హెచ్ఆర్సీకి తమనివేదికను అందిస్తామని చెప్పారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్.. మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ? ‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు.. ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి’ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది: మనోజ్ -
ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే సమ్మె
సాక్షి, హైదరాబాద్: ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. దసరా సమయంలో లక్షలాది మంది గ్రామాలకు వెళ్లే సమయంలో సమ్మె చేయడం వెనుక అర్థం ఇదేనని, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసేలా సమ్మెను చేపట్టారన్నారు. ఈనెల ఐదోతేదీ సాయంత్రం ఆరుగంటల్లోపు విధుల్లో చేరిన వారిని మాత్రమే కార్మికులుగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారు కార్మికులు కాదని, వారితో చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నారు. శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో జరిగిన సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. చెప్పని మాటలను చెప్పినట్లు కార్మికులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సమంజసం కాదని మంత్రి సూచించారు. దసరా రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్, కాలేజీ బస్సులను నడిపించామని, ప్రస్తుతం ఆ అవసరం లేదన్నారు. సమ్మెను ప్రయాణికుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారని మంత్రి మండిపడ్డారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులతో పాటు వివిధ ప్రైవేటు వాహనాల్లోఅధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం అన్ని విధా లుగా సిద్ధంగా ఉందన్నారు. సమ్మె పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్లతో ప్రభుత్వం కమిటీని నియమించిందని, దానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కూడా ముగిసిందని ఈనెల నాలుగో తేదీనే చెప్పామని, బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రతి ఆర్ఎం కింద పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని రకాల పాసులు అనుమతిస్తామని, ఈ విషయంలో ఆదేశాలు సైతం ఇచ్చామన్నారు. -
'ఢిల్లీ నుంచి భయపెడతాం'
సాక్షి, భైంసా(మంచిర్యాల) : బీజేపీ కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలని, ప్రత్యర్థి పార్టీలకు భయపడవద్దని, వారు మిమ్మల్ని భయపెడితే.. వారిని మేం ఢిల్లీ నుంచి భయపెట్టిస్తామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం భైంసా పట్టణంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.రమాదేవి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే వందకుపైగా నియోజకవర్గాలు అభివృద్ధిలో అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అందులో ముథోల్ నియోజకవర్గం స్థానం దయనీయంగా ఉందన్నారు. ప్రధాని మోదీ వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే ముథోల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రానికి బీజేపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలోనే ఏకైక ట్రిపుల్ ఐటీ అయిన బాసర కళాశాలలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. బంగారు తెలంగాణలో కనీసం విద్యార్థులకు సౌకర్యాలు అందడం లేదని ఆయన విమర్శించారు. అధ్యాపకులు లేక ఇప్పటికీ విద్యార్థులకు సిలబస్ ప్రారంభం కాలేదని, వసతిగృహాల్లో సౌకర్యాలు లేవన్నారు. మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసమే.. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వాఖ్యలు అలాంటివేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలను తమవైపు తిప్పుకునే కుట్రలో భాగమేనన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని, దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలిపించాలన్నారు. అలాగే భైంసా మున్సిపల్లో జరిగిన వార్డుల విభజన, ఓటరు జాబితాలో తప్పులపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఏ పార్టీకి నష్టం లేకుండా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15వార్డులో పర్యటన పట్టణంలోని 15వ వార్డులో ఎంపీ పర్యటించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేవని, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు లేవని, పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదముందన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా 15వార్డు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏడాదిలోపు కాలనీలో సమస్యలు పరిష్కరించి, మోడల్ కాలనీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. -
‘పిల్లి’మంత్రి ప్రెస్మీట్.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు
న్యూఢిల్లీ: కిర్జిస్తాన్ బిష్కెక్లో జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా దౌత్యపరమైన మర్యాదలు పాటించకుండా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం అంతకుమించి కితకితలను నెటిజన్లకు పంచింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కేబినెట్ సమావేశం శనివారం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం ఆ ప్రావిన్స్ సమాచార మంత్రి షౌకత్ అలీ యూసఫ్జాయి విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశాన్ని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు క్యాట్ ఫిల్టర్స్ను ఆన్ చేశారు. అంతే, మంత్రి, ఇతర అధికారులు మాట్లాడుతుండగా.. వాళ్ల ముఖాల మీద ‘డిజిటల్ పిల్లి స్టిక్కర్లు’ దర్శనమిచ్చాయి. లైవ్ ప్రసారాన్ని వీక్షించిన నెటిజన్లు వెంటనే దీనిని గుర్తించి.. కామెంట్లు కూడా చేశారు. కొంతసేపటివరకు ఇది సాగింది. ఏకంగా మంత్రి లైవ్లో డిజిటల్ స్టిక్కర్లతో పిల్లిలాగా కనిపించడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు వేశారు. ఈ కామెడీ చూడలేక నవ్వి నవ్వి చచ్చిపోయామంటూ కామెంట్ చేశారు. ఫిల్టర్ తీసేయండి.. మంత్రిగా పిల్లిగా మారిపోయాడని ఒకరు కామెంట్ చేస్తే.. పిల్లి డిజిటల్ మాస్క్ల్లో వాళ్లు భలే క్యూట్గా ఉన్నారని, కామెడీలో దీనిని బీట్ చేసే వారే లేరని, కేబినెట్లో పిల్లి కూడా ఉందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. You can't beat this! Khyber Pakhtunkhwa govt's live presser on Facebook with cat filters.. 😹 pic.twitter.com/xPRBC2CH6y — Naila Inayat नायला इनायत (@nailainayat) June 14, 2019 According to KP government’s social media team we now have a cat in the cabinet #Filter pic.twitter.com/LNl7zwOfLU — Mansoor Ali Khan (@_Mansoor_Ali) June 14, 2019 🤣🤣❤️Cutest politician pic.twitter.com/3ToUEAFPDM — Manas 🇮🇳 মানস (@ManasBose_INDIA) June 14, 2019 -
మోదీ అప్పుడెందుకు రాలేదు?
న్యూఢిల్లీ: దేశానికి కాబోయే ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పనితీరు ఆధారంగా 23న ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించామని పేర్కొంటూ తమకు తాము ‘ఏ’ గ్రేడ్ ఇచ్చుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును ఆయన తప్పుబట్టారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని, తమను మాత్రం కట్టడి చేసిందని వాపోయారు. మోదీ ప్రచారానికి అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. మోదీ- అమిత్ షా దగ్గర లెక్కలేనంత సొమ్ము, అధికారం ఉందని విమర్శించారు. మోదీ కుటుంబంపై తాను విమర్శలు చేయలేదన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. ఎన్నికలు ముగియడానికి నాలుగైదు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారని వెల్లడించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ విలేకరుల సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. రఫేల్ వ్యవహారంపై చర్చకు రావాలని సవాల్ విసిరినా మోదీ ఎందుకు స్పందించలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అమిత్ షాతో కలిసి మోదీ ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
నేడు మోగనున్న ఎన్నికల నగరా
-
నేడు మోగనున్న ఎన్నికల నగరా
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ మీడియాకు సమాచారం ఇచ్చింది. లోక్సభ ఎన్నికలతోపాటు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. ఏప్రిల్- మే మధ్య మొత్తం ప్రక్రియ ముగిసేలా.. 7 నుంచి 8 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నాటికి లోక్సభ కాలపరిమితి ముగుస్తుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 10 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమౌతాయని ఈసీ భావిస్తోంది. అందుకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తోంది. తొలివిడత పోలింగ్కు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను మార్చి 5వ తేదీన ప్రకటించారు. ఈసారి మార్చి 10వతేదీన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు ఈసీ సిద్ధమైంది. పలు దఫాలుగా నిర్వహించనున్న ఎన్నికల కోసం శనివారం ఈసీ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల సన్నాహక సమావేశాల కోసం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ను ఈసీ ఇప్పటికే బుక్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో...! ఏపీలో ఏప్రిల్ రెండోవారం ఎన్నికలు జరిగే అవకాశముందని వినిపిస్తోంది. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని.. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ చివరివారంలో నిర్వహించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన కేసు.. ఓట్ల తొలగింపు కోసం పెద్ద ఎత్తున ఫామ్-7 దరఖాస్తులు దాఖలైన వ్యవహారం కలకలం రేపుతుండటంతో ఎన్నికల నిర్వహణ తేదీలపై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
మీడియా అంటే భయపడే ప్రధానిని కాదు : మన్మోహన్
న్యూఢిల్లీ : మీడియాతో మాట్లడాలంటే నాకేం భయం లేదు. అలా అనుకున్న వారందరికి నా పుస్తకం సమాధానం చెప్తుందన్నారు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్. తన పుస్తకం ‘చేంజింగ్ ఇండియా’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జనాలు నన్ను సైలెంట్ ప్రధానమంత్రిగా భావిస్తారు. ఇప్పుడు ఈ పుస్తకం వారికి సమాధానం చెప్తుందని భావిస్తున్నాను. మీడియా అంటే భయపడే ప్రధానిని కాదు. విదేశి పర్యటనల సమయంలో నేను తప్పకుండా ప్రెస్ని కలిసేవాడిని. తిరిగి వచ్చాక కూడా మీడియా సమావేశం నిర్వహించేవాడిన’ని తెలిపారు. అంతేకాక ‘నేను కేవలం యాక్సిడెంటల్ ప్రధానిని మాత్రమే కాదు.. యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అంటూ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మన్మోహన్ను ఉద్దేశిస్తూ సైలెంట్ పీఎం.. మీడియాతో మాట్లడాలంటే భయం అని విమర్శిచింన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మన్మోహన్ ఇలాంటి కామెంట్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మన్మోహన్ సింగ్ను ఉద్దేశిస్తూ.. మౌని మోహన్ సింగ్ అంటూ ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. రాహుల్ గాంధీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘మోదీ ప్రచారం కూడా ముగిసింది. ఇక ఇప్పుడు మీరు మీ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నాను. మీరు ప్రధాని అయ్యి ఇప్పటికి 1,654 రోజులు పూర్తయ్యాయి. కానీ ఇంతవరకూ ఒక్క ప్రెస్ కాన్ఫరేన్స్ కూడా నిర్వహించలేదు. హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించిన కొన్ని ఫోటోలను చూశాను. మరో సారి ప్రయత్నించండి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా సరదగా ఉంటుందంటూ’ ఈ నెల 5న రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
మహారాష్ట్ర పోలీసులపై బాంబే హైకోర్టు సీరియస్
-
మన్మోహన్ను విమర్శించిన మోదీ..అందులోనూ ఫస్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ : చాలా విషయాల్లో తానే మొదటి వ్యక్తిని అని చెప్పుకునేందుకు తాపత్రయ పడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో విషయంలో నిజంగా మొదటి వ్యక్తి అయినప్పటికీ చెప్పుకోవడం మరచిపోయినట్టున్నారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నర ఏళ్లు గడచి పోయినప్పటికీ ఇంతవరకు ఒక్క విలేకర్ల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన పార్టీ నాయకుడు అటల్ బిహార్ వాజపేయితోపాటు దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వారంతా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారే. ఆయన మౌన ప్రధానిగా ఎద్దేవా చేసినా మన్మోహన్ సింగ్ కూడా ఏడాదికి రెండు సార్లు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానిగా మోదీకి మరో 16 నెలలు పదవీకాలం ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్న నమ్మకం లేదు. తాను చెప్పింది వినాలిగానీ, ఎదురు ప్రశ్నించడం నరేంద్ర మోదీకి నచ్చదని కొంత మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆయన మనస్తత్వాన్ని ఇప్పటికే విశ్లేషించి చెప్పారు. అంటే విలేకరుల సమావేశంలో ఎదురు ప్రశ్నలు ఉంటాయికనుకనే ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం అవుతోంది. అందుకనే ఆయన తన పట్ల విధేయత చూపుతున్న రెండు టీవీ ఛానళ్లను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూలు మాత్రం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ముందుగా తాను ఎంపిక చేసుకున్న ప్రశ్నలే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ముఖాముఖి సంబంధాలు ఉండాలికనుక ట్విట్టర్, నమో ఆప్, రేడియోలో ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలతో టచ్లో ఉంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మతి ఇరానీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్లు ఇదివరకు విలేకరుల సమావేశాలను తరచుగా ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు వారు కూడా అందుకు జంకుతున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు కూడా విలేకర్లను దూరంగా ఉంచుతున్నారని తెల్సింది. గతంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు విలేకరులకు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ నియమించుకున్న గుజరాత్కు చెందిన ఆయన సహాయకుడొకరు పార్లమెంట్ సెంట్రల్ హాల్ గేటు వద్ద కాపు కాస్తాడు. ఏ జర్నలిస్ట్ ఎవరి కోసం వచ్చాడో ఎంక్వైరీ చేస్తారు. ఆరోజు ఏ మంత్రి ఎక్కడ విలేకరులతో మాట్లాడుతాడో చెబుతారు. ఆ అధికారి అనుమతి ఉంటే తప్ప విలేకరులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్ మంత్రియే విలేకరుల ముందు వాపోయిన సందర్భమూ ఉంది. నరేంద్ర మోదీ తనకు విధేయులుగా ఉండడం కోసం కీలకమైన పదవుల్లో గుజరాత్కు చెందిన వారినే ఎక్కువ మందిని నియమించుకున్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు ప్రెస్కు బ్రీఫింగ్ ఇవ్వడం కోసం మన్మోహన్ సింగ్ వరకు ప్రధానికి ‘ప్రెస్ అడ్వైజర్’గా ఒకరిని నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పదవిలో సీనియర్ జర్నలిస్ట్నుగానీ, అధికారినిగానీ నియమిస్తారు. ఈ సంప్రదాయానికి కూడా నరేంద్ర మోదీ తిలోదకాలిచ్చారు. గుజరాత్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మోదీ మీడియాను దూరంగానే ఉంచేవారని, ఏ మంత్రి నుంచి ఎలాంటి సమాచారం అందేది కాదని గుజరాత్ మీడియా మిత్రులు తెలియజేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కోసం విడివిడిగా వివిధ మంత్రిత్వ శాఖలకు, అధికార విభాగాలకు ఆర్టీఐ కింద పిటిషన్లు దాఖలు చేసుకోవడం, అక్కడి నుంచి సమాధానం వచ్చే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు అలాకాదు. అన్ని ఆర్టీఐ దరఖాస్తులను పీఎంవోకు పంపించాల్సిందే. ఇదివరకు (కాంగ్రెస్ హయాంలో) పీఎంవో కార్యాలయం పది శాతం దరఖాస్తులను తిరస్కరిస్తే ఇప్పుడు 80 శాతం దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఎదురులేని చక్రవర్తిగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరచుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటే మోదీ ఒక్క విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ఏ మార్కు ప్రజాస్వామ్యం అనుకోవాలి ? ఇప్పుడు నిజమైన మౌని ప్రధాని ఎవరు? -
మీడియా సమావేశానికి కోహ్లి గైర్హాజరు
కేప్టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ను పంపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో కాన్పిడెంట్గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా.. ‘కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. అంతేకాదు సౌతాఫ్రికా కెప్టెన్ హాజరవుతున్నాడన్న సమాచారం లేదని తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం గురువారం ప్రాక్టీస్ సెషన్నూ ఎగ్గొట్టారు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉండే. కానీ, ఎవరూ రాలేదు. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. గతంలో ఇలా భారత కెప్టెన్ మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం ఎప్పుడు జరగలేదు. మాజీ కెప్టెన్ ధోని ఈడెన్ గార్డెన్స్లో ఓ సారి ఇషాంత్ను పంపించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. -
రేపు అఖిలేశ్, రాహుల్ ప్రెస్మీట్
లక్నో: యూపీ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్న సమాజ్వాదీ పార్టీ నేత, సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆదివారమిక్కడ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. పొత్తుపై ప్రజల్లో ఉన్న గందరగోళానికి తెరదించనున్నారు. ఇద్దరు నేతలు కలసి విలేకర్ల సమావేశం మాట్లాడితే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. -
గత పాలకుల తీరే ‘పాలమూరు’కు శాపం
రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని, వారి పాలనే ప్రాజెక్టులకు శాపమైందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను ముంచే పులిచింతలకు సహకరించింది ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలే అని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. పులిచింతల ప్రాజెక్టును వ్యతిరేకించిన నాయకులే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోలీసులను పెట్టించి మరీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయించారని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు నష్టం లేదని ఒక దినపత్రికలో వ్యాసం రాశారని.. తాను వ్యాసం రాసినట్లు నిరూపిస్తే చిన్నారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారన్నారు. పోతిరెడ్డిపాడు కట్టాలని ఆయన 2007 జనవరి 20వ తేదీన వ్యాసం రాశారని, ఆ వ్యాసం ప్రతిని విలేకరుల సమావేశంలో చూపెట్టారు. -
‘అసలు ప్రధాని ప్లాన్ ఏమిటి?’
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి గురువారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ నగదు రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. టెక్స్టైల్స్, ప్రభుత్వం రంగాల్లోని 3.19కోట్ల మంది ఉద్యోగులు జీతాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దును ప్రకటించిన తర్వాత వరుసగా మరో 16 కొత్త నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. అసలు తాను ఏం చేయాలనుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క మాట కూడా చెప్పకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వాళ్ల సొంత డబ్బును కూడా అవసరాలకోసం ఉపయోగించుకోలేకపోతున్నారని బ్యాంకుల నుంచి తీసుకోలేకపోతున్నారని అన్నారు. -
‘అసలు ప్రధాని ప్లాన్ ఏమిటి?’
-
వేధింపుల వల్లే వివాహిత ఆత్మహత్య
డీఎస్పీ చిదానందరెడ్డి గుత్తి: అత్తింటి వారి వేధింపుల కారణంగానే గొందిపల్లి గ్రామానికి చెందిన నవ వధువు ఆదిలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని తాడిపత్రి డీఎస్సీ చిదానంద రెడ్డి తెలిపారు. వివాహిత మృతిపై సోమవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మృతురాలి తల్లిదండ్రులు నర్సమ్మ, పెద్ద కదిరి, బంధువులను విచారించారు. మృతురాలి భర్త ప్రసాద్, కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అనంతరం డీఎస్పీ విలేఖరులతో మాట్లాడారు. కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, అత్తమామల వేధింపులే కారణమని ఆదిలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు మీడియాకు చెబుతామన్నారు. కార్యక్రమంలో సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్ఐలు చాంద్బాషా, రామాంజనేయులు పాల్గొన్నారు. -
నట్టి ఆరోపణలు టాలీవుడ్లో ప్రకంపనలు
-
సేవచేయండి.... ఆనందం పొందండి
విలేకరుల సమావేశంలో సీఎం సాక్షి, అమరావతి/విజయవాడ: వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు అనుసంధానం కావాలని, ప్రజలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తను గతేడాది కృష్ణా, గోదావరి అనుసంధానాన్ని సంక్పలంగా తీసుకుని పట్టిసీమ ద్వారా పూర్తి చేశానని, ఈ కృష్ణా పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తరలించాలని సంకల్పం తీసుకున్నానని, పూర్తి చేస్తానని చెప్పారు. విజయవాడలో ఏర్పాటైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నదీమాతకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి రుణం తీర్చుకోవాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు నదీజలాలను వినియోగించుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్లి బాగా సంపాదించారని, వారందరూ పుష్కరాల్లో సేవ చేసి ఆనందం, తృప్తి పొందాలన్నారు. దుర్గామాత దర్శనాని కి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. డ్వాక్రా బజార్లను స్టార్టప్లుగా మార్చేందుకు మూలధనం.. డ్వాక్రా సంఘాల యూనిట్లను స్టార్టప్(అంకుర) సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత మూలధనాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్వాక్రా బజారు స్టాల్ను సీఎం ప్రారంభించారు. మొక్కలు పెంచకుంటే రాయితీలు కట్ ఉద్యోగులు మొక్కలు పెంచకుంటే బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన ‘వనం-మనం’ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడే వారికోసం ప్రత్యేక పాలసీ, మొక్కల్ని పెంచే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇస్తామన్నారు. సీఎం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
శాయంపేట : శాయంపేట మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారని వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి మారపల్లి సుధాకర్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. శాయంపేటకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లిలో కలపకుండా వరంగల్ జిల్లాలోనే కొనసాగించేలా స్పీకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి చొరవ తీసుకోవాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కసారి మండలాన్ని భూపాలపల్లిలో కలిపితే జీవితాంతం మండల ప్రజలు బాధపడుతారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా వారి అభిప్రాయం మేరకు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించేలా స్పీకర్ బహిరంగ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మారపల్లి సుదర్శన్, అల్లె అర్జున్ పాల్గొన్నారు. -
ఓన్లీ శాసన్ నో భాషన్
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ రెండేళ్ల పాలనలో సాధించింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. శాసన్ నో భాషన్ (శాసనాలు చేయడమే తప్ప మాట్లాడింది లేదని లేదు) తోనే సరిపెట్టారని ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కపిల్ సిబల్, గులామ్ నబీ ఆజాద్, మళ్లికార్జున ఖర్గే, రణదీప్ సూరజ్ వాలా లుబీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. కపిల్ సిబల్ మాట్లాడుతూ.. రెండేళ్ల కాలంలో ఏం సాధించారని వేడుకలు చేసుకుంటున్నారని , వ్యవసాయ ఉత్పత్తులపై 50 శాతం లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. రెండేళ్లలో కిస్ కా సాత్ కహన్ హే వికాస్ (ఎవరితో అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి) జరిగిందని ఆయన చమత్కరించారు.. మోదీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారని దేనికీ సమాదానం ఇవ్వరన్నారు.. గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. మోదీ అన్ని రంగాల్లో విఫలం అయ్యారని ఆరోపించారు..కేవలం హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం లేదన్నారు. యూపీఏ ప్రభుత్వ పథకాలనే పేరు మార్చి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి దళితులు, విద్యర్థుల భయం పట్టుకుందని ఆయన ఎద్డేవా చేశారు. -
చీకట్లో విద్యుత్ మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. శుక్రవారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. తన శాఖ సాధించిన విజయాలను, నరేంద్రమోదీ నాయకత్వంలోని తమ ప్రాధాన్యతలను వివరిస్తున్నారు. ఈ సమయంలో ఉన్నంట్టుండి ఒక్కసారిగా పవర్ కట్ అయింది. మంత్రి కాసేపు చీకట్లోనే కూర్చున్నారు. తరువాత మళ్లీ పవర్ వచ్చిన తర్వాత ఆయన తమ శాఖ సాధించిన విజయాలపై బుక్ లెట్ ను విడుదల చేశారు. -
72 గంటలు ఏకధాటిగా...
దూరపు కొండలు నునుపు అన్నట్లు.. సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుందని దూరం నుంచి చూసినవాళ్లు అనుకుంటారు. నిజంగానే బాగుంటుంది. కానీ దానివెనక వాళ్ల కష్టం మామూలుగా ఉండదు. నైన్కి ఆఫీసుకి వెళ్లి ఫైవ్కి హాయిగా ఇంటికొచ్చే పరిస్థితి ఉండదు. పని గంటలతో పని లేకుండా పని చేయాలి. ఇటీవల శ్రద్ధాకపూర్ అలానే చేశారు. ఈ నాజూకు సుందరి బ్యాంకాక్లో విశ్రాంతి లేకుండా నాన్స్టాప్గా షూటింగ్ చేస్తూ, ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరు కావడం విశేషం. ఆ విషయంలోకి వస్తే... శ్రద్ధాకపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘భాగీ’ షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. మరోవైపు ఆమె ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న ఓ ఉత్పత్తికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలో ఏర్పాటైంది. శ్రద్ధా కపూర్ కంగారుపడలేదు. బ్యాంకాక్లో ఫ్లయిట్ ఎక్కి ముంబైలో వాలిపోయారు. రెండు గంటల పాటు జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్లో పాల్గొని బ్యాంకాక్ వెళ్లిపోయారు. పోనీ వెళ్లాక విశ్రాంతి తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఏకధాటిగా షూటింగ్లో పాల్గొన్నారు. అది కూడా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్లో. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తవ్వాలంటే ఏకధాటి షూటింగ్ చేయాలట. అందుకని, 72 గంటల పాటు షూటింగ్ చేస్తానని దర్శక-నిర్మాతలు సబీర్, సాజిద్ ఖాన్లకు మాటిచ్చేసి షాకిచ్చారట. పేరులోనే శ్రద్ధ ఉంది కాబట్టి.. శ్రద్ధగా పని చేస్తూ, సార్థక నామధేయురాలు అనిపించుకుంటున్నారామె. -
ధరల అదుపులో కేంద్రం విఫలం
బృందాకారత్ సాక్షి, హైదరాబాద్ : నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐద్వా జాతీయనాయకురాలు, మాజీ ఎంపీ బృందాకారత్ విమర్శించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ ్వ ర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ ధరలు పెరగడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోందని, మహిళలకు పౌష్టికాహారం లభించక రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పది వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు. పోడుభూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. తెలంగాణలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, హైమావతి, ఇందిర, అరుణజ్యోతి, భవాని తదితరులు పాల్గొన్నారు. -
జీవితాంతం జగన్ వెంటే..
ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది నా కోరిక నెల్లూరు: జీవితాంతం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తానని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తన కోరికని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోటకు వచ్చిన ఆయన కుటుంబసభ్యులతో కలసి కోటమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన చివరిశ్వాస వరకూ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తానన్నారు. కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. -
కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది!
ముంబై: నటి కాజోల్ను కలవరపాటుకు గురిచేసిన ఫోన్ కాల్ గురించే ప్రస్తుతం ముంబై సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాజోల్కు ఫోన్ చేసింది ఎవరు? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముంబైలోని ప్రముఖ నాటకక్షేత్రంలో శనివారం తన సోదరి తనీషా ప్రధాన పాత్ర ధరించిన 'ద జురీ' అనే నాటకాన్ని తిలకించిన కాజోల్.. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ ను అలా రిసీవ్ చేసుకున్నారో లేదో.. 'క్షమించండి' అని విలేకరులతో అంటూ చకచకా వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె ఒకింత ఆందోళనకు గురయినట్లు కనిపించారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కారు దగ్గర డ్రైవర్ కనిపించకపోవడంతో కొద్దిగా అసహనానికి గురైన ఆమె.. 'త్వరగా రా' అంటూ మరాఠీలో డ్రైవర్కు ఫోన్ చేసింది. అతను రాగానే తాళాలు తీసుకుని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కాజోల్ చర్య.. ఆమె సోదరి తనీషా సహా అక్కడున్నవాళ్లందరినీ కలవరపెట్టింది. జూహీ చావ్లా, లారా దత్తా, మహేశ్ భూపతి, క్రికెటర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ తదితరులు ఆ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు. -
తాగిన మైకంలోనే శ్రుతిమించారు
విశాఖపట్నం : తాగిన మైకంలో చిందులేశారు. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై వికృత చేష్టలకు దిగారు. వీరి ఆగడాలు కనిపించకుండా చీకట్లు సృష్టించారు. పరారైన వీరిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. దీనికి సంబంధించి గోపాలపట్నం పోలీస్స్టేషన్లో శుక్రవారం డీసీపీ డాక్టర్ రామ్భూపాల్నాయక్ విలేకర్ల సమావేశంలో వివరించారు. మల్కాపురం జనతా కాలనీలో దళిత నాయకుడుగా చెలామణి అవుతున్న కవ్వాడ వెంకటరావు, ప్రకాష్నగర్కి చెందిన మైలపల్లి పోలారావు, ఇదే ప్రాంతానికి చెందిన అనిల్కుమార్ రాయ్, గుంటు రవికుమార్, మల్కాపురం హరిజనవీధికి చెందిన జోరీగల మాధవరావు, ముప్పిడి కుమార్రాజా స్నేహితులు. వీరు ఈనెల 23న రాత్రి ప్రకాష్నగర్ జంక్షన్లో మద్యం సేవించారు. ఇందుకోసం వీధిలో వున్న లైట్లు వెలగకుండా విద్యుత్తు వైర్ల కనెక్షన్ తెంచేశారు. అక్కడి నుంచి మరింత మితిమీరారు. ఏ నాయకుడు ఏం చేశారని వారిలో వారు వాదించుకున్నారు. శ్రుతిమించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్పై విమర్శల దాడి చేశారు. ఎవడు అడ్డం వస్తాడో చూస్తామంటూ దగ్గర్లో వున్న ఆవుపేడని అంబేద్కర్ విగ్రహానికి పులిమారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన తరువాత రోజు వెలుగు చూడడంతో ఆందోళన వ్యక్తమయింది. మల్కాపురం పోలీస్టేషన్కి ఫిర్యాదు అందడంతో కేసు నమోదయింది. నిందితుల కోసం గాలించారు. శుక్రవారం ఉదయం సింథియాలో తిరుగుతున్న నిందితులను సీఐ రంగనాథ్ పోలీసులతో పట్టుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశామని డీసీపీ రామ్గోపాల్నాయక్ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు దళితులు వున్నారని చెప్పారు. వారిపై ఐపీసీ 153/ఎ, 295, 427 కేసులు నమోదు చేశామని, రిమాండ్కి తరలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఏసీపీ మధుసూధన్రావు, సీఐ రంగనాథ్, ఎస్ఐ పి.రాజు పాల్గొన్నారు. -
సరదాగా...
‘హీరో’ సానియా సెలబ్రిటీల దుస్తుల మీద రకరకాల కామెంట్స్ రాసి ఉంటాయి. కొందరు సరదాగా, కొందరు స్ఫూర్తి పెంచేలా, కొందరు సందర్భాన్ని బట్టి రకరకాల టీ షర్ట్లు వాడుతుంటారు. వింబుల్డన్ గెలిచి హైదరాబాద్ రాగానే సానియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సాధారణంగా మోడ్రన్ దుస్తుల్లోనే మీడియా ముందుకు వచ్చే సానియా ఈసారి సింపుల్గా ఓ టీషర్ట్ ధరించి వచ్చింది. దాని మీద పెద్ద అక్షరాలతో హీరో అని రాసి ఉంది. తన విజయం దేశంలోని మహిళల్లో మరింత స్ఫూర్తి పెంచాలని సానియా వ్యాఖ్యానించింది. బహుశా అదే సందేశం తన దుస్తుల ద్వారా ఇవ్వాలనుకుందేమో. ఏమైనా వరుస విజయాలు సాధిస్తున్న ఈ హైదరాబాదీ భారత్లో ‘హీరో’నే..! -
జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయండి
జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి విజయసారథి వరంగల్ లీగల్ : కేసుల పరిష్కారం నిమిత్తం శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయూలనిజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సి.విజయసారథి ఆచార్యులు కోరారు. గురువారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ప్రధానంగా విద్యుత్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు వేల కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 3600విద్యుత్ కేసులు రాజీకి అవకాశం ఉన్నాయని, 288క్రిమినల్ కేసులూ పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులకు నోటీసులు జారీచేసిన ట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నీలిమా పాల్గొన్నారు. వరంగల్కు రావడం ఆనందంగా ఉంది సుదీర్ఘకాలం పనిచేసిన వరంగల్కు జిల్లా ప్రధాన జడ్జిగా పదోన్నతిపై రావడం ఆనందంగా ఉందని విజయసారథి ఆచార్యులు అన్నారు. గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి స్వాగతం పలికారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్జి విజయసారథి మాట్లాడారు. సీనియర్ న్యాయవాదులు ఉన్న ఓరుగల్లు నుంచి తర్ఫీదు పొందానని, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా జడ్జిగా పనిచేసిన సందర్భంగా ఇక్కడి న్యాయవాదులతో ఏర్పడ్డ అనుబంధం మరువలేనిదని అన్నారు. ముగిసిన శిక్షణ.. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 రోజులుగా నిర్వహిస్తున్న జూనియర్ సివిల్ జడ్జిల రాత పరీక్ష ఉచిత కోచింగ్ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలు బోధించిన రెండో అదనపు జిల్లా జడ్జి యార రేణుక, జూనియర్ సివిల్ జడ్జి ఆర్.రగునాథ్రెడ్డి, కేయూసీ న్యాయ కళాశాల రిటైర్డ్ ప్రిన్స్పాల్ విజయలక్ష్మి, ప్రిన్స్పాల్ విజయచందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎండీ సర్దార్, జి.భద్రాద్రి, న్యాయవాది టి. సుజాత, తరగతుల నిర్వహణ బోధనలో సమన్వయకర్తగా వ్యవహరించిన న్యాయవాది నగునూరి విద్యాసాగర్ను సన్మానించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి నర్సింహులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లా మహాత్మ, సహాయ కార్యదర్శి పత్తిపాటి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శి నారగోని సునిత, కోశాధికారి దైద డేవిడ్రాజ్కుమార్, కార్యవర్గ స భ్యులు దేవేందర్, సంతోష్, గౌసియా, శివకుమార్, మురళి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రేపు హైకోర్టు జడ్జీల రాక వరంగల్క్రైం: హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఎంఎస్. రాంచంద్రరావు, బి.శివశంకర్రావు శనివారం వరంగల్కు రానున్నారు. ఆదివారం కాజీపేటలో జూనియర్ డివిజన్ సివిల్ జడ్జీలకు జరగనున్న స్క్రీనింగ్ టెస్ట్ పరిశీలనలో వీరు పాల్గొంటారు. -
శాసనసభలో ప్రజాస్వామ్యం ఖూనీ
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ దేశచరిత్రలో ఎక్కడా జరగని రీతిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. ప్రతిపక్షానికి రక్షణగా, హుందాగా వ్యవహరించాల్సిన సభాపతి టీడీపీ సభ్యుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాట్లాడుతుంటే అధికార పక్షం నుంచి నిరసన రాకపోయినా మైక్ కట్ చేయడం ప్రతిపక్షనేతను అవమానించడమేనన్నారు. 67 మంది సభ్యులు కలిగిన బలమైన ప్రతిపక్షం నేడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే పరిస్థితి వచ్చిందంటే పాలకపక్షం, స్పీకర్ వైఖరే కారణమన్నారు. ప్రజల సమస్యలుగానీ, రైతులు, మహిళల రుణాల మాఫీ అంశంగానీ ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్షం గొంతునొక్కడమంటే ప్రజల గొంతునొక్కడమేనన్నారు. టీడీపీ సభ్యులు వీధిరౌడీల్లా, గూండాల్లాగా వ్యవహరించి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం సిగ్గుచేటన్నారు. ఇది సభను కించపరచమే అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీలలో జరుగుతున్న విపరీతపోకడలను ఇప్పటి వరకూ మనం చూశామని, ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అలాంటి దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు తెలుగు ప్రజలను తలదించుకొనేలా చేశాయన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించడం లేదని, అన్ని పక్షాలను సమానంగా చూడటం లేదని విమర్శించారు. వ్యక్తిగత దూషణలకే అధిక సమయం వృథా... ప్రతిపక్షనేత అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగి సమస్యను పక్కదారి పట్టించడం అధికారపక్షానికి ఆనవాయితీగా మారిందని నగర మేయర్ కె. సురేష్బాబు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ స్కూల్లో చదివితే వీరికెందుకండీ...బడ్జెట్పై చర్చ సాగుతున్నప్పుడు సంబంధం లేని విషయాలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ప్రతిసారి మైక్ కట్ చేసి మంత్రులకు, టీడీపీ సభ్యులకు మైకులిస్తున్నారన్నారు. ఒక ఫ్యాక్షనిస్టును స్పీకర్ను చేస్తే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్షనేతకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ప్రస్తుత సీఎం చంద్రబాబు నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలియాలంటే ప్రతిపక్షనేతకు అధిక సమయం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నారు మాధవ్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఈ వేసవిలో కోతలుండవు
రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ బెంగళూరు : ఈ వేసవిలో కరెంటు కోతలుండబోవని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....ఈ వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 300 నుంచి 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కొరతను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని పేర్కొన్నారు. వేసవిలో కరెంటు కోతలను నివారించేందుకు గాను 500 మెగావాట్ల విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుందని తెలిపారు. మార్చి మొదటి వారం నుంచే విద్యుత్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు కరెంటు రాక, పోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్లు పంపించేందుకు గాను విద్యుత్ శాఖ నిర్ణయించిందని తెలిపారు. తద్వారా రైతులు తమ పొలాల్లోని పంపుసెట్ల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాసే ఇబ్బంది తప్పుతుందని పేర్కొన్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని రైతుల సెల్ఫోన్ నంబర్లను సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కాగా రాష్ట్ర విద్యుత్ శాఖ గత ఏడాది నుంచి అమలు చేస్తున్న ‘నవీకృత ఇంధన విధానానికి’ గాను జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుందని డి.కె.శివకుమార్ పేర్కొన్నారు. విద్యుత్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రస్తుతం అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. -
ట్రాఫిక్పైనే దృష్టి
సిబ్బంది రహిత నియంత్రణ నైట్ ఆపరేషన్ ఆగలేదు మోటారు సైకిళ్ల చోరీలను ఉపేక్షించేది లేదు సింగపూర్ శిక్షణ స్ఫూర్తిదాయకం విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు విజయవాడ సిటీ : నగరంలోని ట్రాఫిక్ సమస్యపై వచ్చేవారం నుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అశోక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. సిబ్బంది రహిత ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగానే రోడ్లపై ట్రాఫిక్ విధులు నిర్వహించే 150 మంది కానిస్టేబుళ్లకు కెమెరాలు ఇచ్చి నిబంధనల ఉల్లంఘనులను గుర్తిస్తామన్నారు. రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటివి కెమెరాల్లో బంధించి ఈ-చలానా ద్వారా కాంపౌండింగ్ ఫీజు వసూలు చేస్తామని సీపీ తెలిపారు. తద్వారా పోలీసులకు, వాహనదారులకు మధ్య ఘర్షణ వాతావారణం నిలువరించి స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడమే తమ అభిమతమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆర్సీ పుస్తకం, డ్రైవింగ్ లెసైన్స్ తనిఖీలు వంటివి అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా ఉంటాయని సీపీ వివరించారు. నైట్ ఆపరేషన్ ఆగదు నైట్ ఆపరేషన్ చేసినప్పుడు అల్లరి గ్యాంగులు, బ్లేడ్బ్యాచ్ సభ్యులు కనిపించలేదని సీపీ పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు ఆ పని చేయడం లేదనే ప్రచారంతో తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు. తాము నైట్ ఆపరేషన్ ఆపలేదని, విధుల నిర్వహణలో భాగంగా రాత్రి గస్తీలు, పెట్రోలింగ్ యథావిధిగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. నైట్ ఆపరేషన్ కొనసాగుతుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని, ఏ సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. మోటారు సైకిళ్ల చోరీపై నిఘా సీసీఎస్ పునర్వ్యవస్థీకరణ తర్వాత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సీపీ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా రొటీన్ తనిఖీలు కాకుండా రోజువారీ ప్రాధాన్యతలు నిర్ణయించుకుని నేరస్తుల పట్టివేతకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చేవారం నుంచి మోటారు సైకిళ్ల చోరీపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రెండువేల మోటారు సైకిళ్లు చోరీకి గురైతే.. కేవలం 900 మోటారు సైకిళ్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, ఇకపై మోటారు సైకిళ్ల దొంగలను ఉపేక్షించేది లేదన్నారు. ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉంద న్నారు. మోటారు సైకిళ్ల యజమానులు రికార్డులు, డ్రైవింగ్ లెసైన్స్ వెంట ఉంచుకోవాలన్నారు. బాధ్యతారాహిత్యమే ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఆయా వ్యక్తుల వృత్తి, ఆదాయ వ్యయాలను విచారించుకోకపోవడం యజమానుల బాధ్యతారాహిత్యంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నేరస్తులు చిన్నచిన్న ఇళ్లను అద్దెకు తీసుకుంటూ చోరీలు, ఇతర అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇల్లు అద్దె కోసం ఎవరైనా వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే ఉచితంగానే అద్దెదారుల వివరాలు తెలుసుకుని అందజేస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణం సహా ఇతర విధులకు వేర్వేరు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకు వచ్చే వారు కూడా పోలీసుల సాయంతో వారి గురించి సమాచారం సేకరించాలని సూచించారు. సింగపూర్ కన్సెల్టెన్సీ సమంజసమే.. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ సంస్థకు మాస్టర్ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడాన్ని సీపీ వెంకటేశ్వరరావు స్వాగతించారు. సీఆర్డీఏ తరఫున ఐదు రోజుల సింగపూర్ శిక్షణకు వెళ్లిన ఆయన అక్కడి విషయాలను వివరిం చారు. పోలీస్ విధివిధానాలు తెలుసుకోవడానికి వెళ్లలేదని, నగర నిర్మాణం, అభివృద్ధి, గృహ నిర్మాణం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు మేనేజ్మెంట్ అంశాలపై ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నామన్నారు. దీనిపై అక్కడి ఉన్నతస్థాయి అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణం, ఆధునిక సిటీ నిర్వహణ వంటి అంశాలపై వారు ఇచ్చిన శిక్షణ ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. పోలీసింగ్ విధివిధానాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మరోసారి పంపే అవకాశం ఉందన్నారు. సింగపూర్ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకునే న వ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ రూపొం దించే పని వారికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు.