rent
-
అభిషేక్ బచ్చన్కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?
షాపింగ్ చేయాలన్నా..నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. టికెట్ బుకింగ్స్ కోసం, ఇంటి అద్దె చెల్లించడం కోసం, ఇలా అవీ ఇవీ అని తేడా లేకుండా క్రెడిట్ కార్డును విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వాడకం మంచిదే కానీ.. కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్రెడిట్ కార్డును ఉపయోగించి రెంట్ (అద్దె) కట్టడం మంచిదేనా? దీని వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడం.. రివార్డ్ పాయింట్లను కూడబెట్టుకోవడానికి లేదా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి మంచి వ్యూహం కావచ్చు. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపుప్రాసెసింగ్ ఛార్జీలు: మీరు క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లించినప్పుడు, కొంతమంది ఓనర్స్ లేదా ఏజెన్సీలు ప్రాసెసింగ్ ఛార్జీలను సైతం వసూలు చేస్తారు. ఈ ఛార్జి మీరు చెల్లించే అద్దెలో రెండు నుంచి మూడు శాతం వరకు ఉంటుంది.క్యాష్ అడ్వాన్స్ ఫీజు: అద్దె చెల్లింపులను సాధారణ లావాదేవీలుగా పరిగణించడానికి బదులు.. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు వాటిని క్యాష్ అడ్వాన్స్లుగా పరిగణిస్తారు. దీనికి సాధారణ వడ్డీ కంటే కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.గత బకాయి చెల్లింపులపై వడ్డీ: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించకపోతే.. అది తప్పకుండా మీ మీద ఆర్ధిక భారం పెంచుతుంది. కాబట్టి అలాంటి సమయంలో అద్దె చెల్లిస్తే.. వడ్డీ మరింత ఎక్కువవుతుంది.క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లించే ముందు తెలుసుకోవసిన అంశాలుఫీజులు: అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడం వల్ల.. ప్రాసెసింగ్ ఫీజు కొంత ఎక్కువగా ఉంటుంది.వడ్డీ ఆధారిత ఫీజులు: మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మీ క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్పై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్ ఇదే!క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లించడాం వల్ల లాభాలురివార్డ్లను సంపాదించవచ్చు: క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లిస్తే.. క్యాష్ బ్యాక్ లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్లను పొందవచ్చు. ఇది షాపింగ్ వంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి షాపింగ్ సమయంలో కొంత డబ్బు ఆదా అవుతుంది.క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు: క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేయడం వల్ల.. క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.అద్దె చెల్లించడంలో ఆలస్యం నివారించవచ్చు: చేతిలో డబ్బు లేకపోయినా.. మీరు క్రెడిట్ కార్డు ద్వారా సకాలంలో అద్దె చెల్లించవచ్చు. ఒకవేళా ఇంటి ఓనర్.. అద్దె ఆలస్యం చేస్తే విధించే ఫెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు.పేమెంట్ సెక్యూరిటీ: క్రెడిట్ కార్డు హిస్టరీ వల్ల మిమ్మల్ని ఎవరూ మోసం చేసే అవకాశం లేదు. కాబట్టి మీ చెల్లింపులకు ఇక్కడ భద్రత లభిస్తుంది. -
పౌరసరఫరాల సంస్థకు అద్దె భారం!
సాక్షి, అమరావతి: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సీఎస్సీ) పరిస్థితి మారనుంది. రేషన్ బియ్యం నిల్వ చేసేందుకు అవసరమైన బఫర్ గోడౌన్లను గిడ్డంగుల సంస్థ ద్వారా అద్దెకు తీసుకోవాలనే ప్రతిపాదనతో భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి రానుంది.ప్రైవేటు వ్యక్తుల నుంచి సీఎస్సీ నేరుగా గోడౌన్న్ల అద్దెకు తీసుకునే ధరకంటే గిడ్డంగుల సంస్థల ద్వారా తీసుకుంటే ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గత ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పుల్లో మూలుగుతున్న సీఎస్సీపై ఆరి్థక భారం తగ్గించేందుకు నేరుగా ప్రైవేటు వ్యక్తుల గోడౌన్లతో ఒప్పందాలు చేసుకుంది. కానీ, ప్రస్తుత పాలకుల రాజకీయ స్వలాభం కోసం కార్పొరేషన్ను ఆరి్థక కష్టాల్లోకి నెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఫ లితంగా పౌరసరఫరాల సంస్థపై రూ.16–25 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. సొంతంగా తీసుకుంటేనే అద్దె తక్కువ సీఎస్సీ ప్రైవేటు వ్యక్తుల నుంచి గోడౌన్లను తీసుకుంటే నెలకు ఒక బస్తాకు రూ.4.25 అద్దె, 6 శాతం సూపర్వైజరీ చార్జీలు చెల్లిస్తుంది. అదే రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థ ద్వారా గోడౌన్లు తీసుకుంటే బస్తాకు రూ.5 అద్దె చెల్లించడంతో పాటు 7 శాతం సూపర్వైజరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం గోడౌన్ల వినియోగానికి ఏడాదికి సుమారు రూ.175 కోట్లు చెల్లిస్తుండగా గిడ్డంగుల సంస్థ ద్వారా గోడౌన్లు తీసుకుంటే కార్పొరేషన్పై ఏడాదికి సుమారు రూ.16–25 కోట్లు మేర ఆర్థిక భారం పడనుంది. నిర్ణీత సమయంలోనే.. ప్రైవేటు గోడౌన్లు టైమ్ బౌండ్ లేకుండా పనిచేస్తాయి. కానీ.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గిడ్డంగులైతే సెలవు రోజుల్లో పని చేయవు. ప్రతిరోజు నిర్ణీత సమయానికి మాత్రమే తెరచుకుంటాయి. అప్పుడే ప్రజాపంపిణీకి అవసరమైన కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు ఓవర్ అండ్ ఎ»ౌవ్ చార్జీలను క్లెయిమ్ చేస్తారు. అవకాశం ఉన్నంత మేరకు స్టోరేజీ లాస్లను డిక్లేర్ చేస్తారు. మరోవైపు పరిమితికి మించిన స్టోరేజీ లాస్ అయితే దానికి సంబంధించి బియ్యం పరిమాణం ఎంత ఉంటుందో.. ఆ బియ్యం ఖరీదు (ఎకనమిక్ కాస్టు)ను లెక్కగట్టి కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెల్లించాల్సిన అద్దె మొత్తం నుంచి సీఎస్సీ రికవరీ చేస్తుంది. ఇలా రికవరీ చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రైవేటు గోడౌన్ల నిర్వహణలో యజమానులదే పూర్తి బాధ్యత కావడంతో ఇలాంటి సమస్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి.గిడ్డంగుల సంస్థలో బియ్యం భద్రమేనాప్రైవేటు వ్యక్తులకు చెందిన బఫర్ గోడౌన్లలో బియ్యం నిల్వ చేస్తే పక్కదారి పడుతున్నాయంటూ కూటమి పాలకులు విషప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మచిలీపట్నం ఘటనలో సదరు గోడౌన్ యజమాన్యం స్వయంగా లేఖ రాసిన తర్వాతే నిల్వలు తగ్గాయన్న విషయం బయటకు వచ్చిoది. సదరు గోడౌన్ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరిస్తే ప్రభుత్వ పెద్దలు మాత్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనినే సాకుగా చూపించి ప్రైవేటు వ్యక్తుల గోడౌన్లలో బియ్యం దారి మళ్లుతున్నాయంటూ దుష్ప్రచారం చేపట్టింది. వాస్తవానికి గతంలో అనేకసార్లు గిడ్డంగుల సంస్థ గోడౌన్లలో పీడీఎస్ సరుకులు మాయమయ్యాయి. గిడ్డంగుల సంస్థకు చెందిన ఆత్మకూరు గోడౌన్లో కందులు, శనగలు, నంద్యాలలో బియ్యం స్టాక్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. అనంతపురం జిల్లాలోని తిమ్మంచెర్లలో చేయని పనులకు బిల్లులు చూపించి సీఎస్సీ నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని గిడ్డంగుల సంస్థ ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న ఓ గోడౌన్లో నిర్వహణ లోపంతో బియ్యం నాణ్యత దెబ్బతింది. ఇలా పీడీఎస్ బియ్యం నిల్వల్లో గిడ్డంగుల సంస్థ నిర్లక్ష్యం బయటపడింది. వాస్తవానికి గిడ్డంగుల సంస్థలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కో వ్యక్తి 2–3 గోడౌన్ల బాధ్యతలను చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో గిడ్డంగుల సంస్థలో బియ్యం నిల్వ చేస్తే భద్రంగా ఉంటా యా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చాలా వరకు గిడ్డంగుల సంస్థ గోడౌన్లు 30–40 ఏళ్లు నిండి, సరైన నిర్వహణకు నోచుకోకకుండా ఉన్నాయి. ఉదాహరణకు కడప గోడౌన్లో పందులు, బర్రెలు తిరుగుతుండటం గమనార్హం.ఒక్కో గోడౌన్కు ఒక్కో చార్జీ గిడ్డంగుల సంస్థకు అద్దెకు ఇచ్చిన ప్రైవేటు గోడౌన్ల యజమానుల సమస్యలు వర్ణణాతీతం. అద్దెలు సమయానికి చెల్లించకపోవడం, ఒక్కో గోడౌన్కు ఒక్కో రకమైన.. పద్ధతి లేని స్టోరేజీ చార్జీలు ఉంటున్నాయి. గిడ్డంగుల సంస్థ ద్వారా వెళితే ప్రైవేటు గోడౌన్లకు నెలకు బస్తాకు రూ.3.25 మాత్రమే అద్దె దక్కుతోంది. దీనికితోడు ఆలస్యంగా అద్దె చెల్లిస్తుండటంతో ప్రైవే టు గోడౌన్ల యజమానులు సీఎస్సీ వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్టు టెండర్లలో గిడ్డంగుల సంస్థలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'ఫేస్బుక్' (Facebook) తన హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజును మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం రెండు లీజింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పుడు కంపెనీ నెలకు రూ.2.8 కోట్లు అద్దె చెల్లించనుంది.హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్ సిటీలోని ది స్కైవ్యూలో ఉన్న మొత్తం ఆఫీస్ స్పేస్ 3.7 లక్షల చదరపు అడుగులు. ఇప్పటి వరకు కంపెనీ దీనికోసం నెలకు రూ. 2.15 కోట్ల అద్దె చెల్లించింది. ఇప్పుడు అద్దె రూ. 2.8 కోట్లకు చేరింది. ఈ లెక్కన కంపెనీ ఐదేళ్ల కాలనికి చెల్లించాల్సిన అద్దె రూ.168 కోట్లు.మొత్తం లీజు వ్యవధి ఐదు సంవత్సరాలు.. దీని కోసం కంపెనీ రూ.16.8 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను చెల్లించింది. అయితే 2026 నుంచి అద్దె మరో 15 శాతం పెరుగుతుందని ఒప్పందంలో పేర్కొన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఐదేళ్ల తరువాత అద్దె మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది.వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంరియల్ ఎస్టేట్ (Real Estate) రంగం వేగంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.. అద్దెకు ఆకాశాన్నంటుతున్నాయి. న్యూస్ పోర్టల్ ప్రకారం.. 2019లో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో అద్దె నెలకు రూ. 23,000. ఈ అద్దె 2023లో రూ. 27,500కు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే అద్దె సుమారు 19 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!హైదరాబాద్లో ఐటీ హబ్గా.. బెంగళూరుకు గట్టి పోటీనిస్తుంది. ఇక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు ఐటీ, ఆర్థిక సేవలకు నెలవు. ఆఫీస్ స్పేస్ కూడా.. సాధారణంగా హైటెక్ సిటీలో సగటున అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. అనరాక్ డేటా ప్రకారం.. కొండాపూర్లో 2019 - 23 మధ్యలో అద్దెలు 19 శాతం పెరిగాయి. గచ్చిబౌలిలో 20 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా హైదరాబాద్లోని తన ఆఫీస్ స్పేస్ డీల్ పునరుద్ధరణ చేసుకుని నెలకు రూ. 2 కోట్ల రెంట్ చెల్లించేలా డీల్ కుదుర్చుకుంది. -
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
అద్దె భారం.. గురుకులాలకు తాళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. పలు గురుకులాలకు తాళాలు యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.హుజూర్నగర్లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు. గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. రేగొండ మండలంలోని లింగాల, వరంగల్ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్ కుమార్పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు. అద్దె భవనాల్లో 625 పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు. -
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..ఒక విచిత్రమైన ఫేస్బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్బుక్ మార్కెట్ప్లేస్ లిస్టింగ్లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
క్రికెట్ గ్రౌండ్స్.. ఫర్ రెంట్!.. అద్దె కట్టు.. బ్యాట్ పట్టు..
మన దగ్గర క్రికెట్ అంటే ఉండే క్రేజే వేరు. చిన్నప్పుడు గల్లీల్లో క్రికెట్ ఆడినా.. కాస్త పట్టు చిక్కినవారు, దానిపై మక్కువ ఉన్నవారు, ప్రొఫెషనల్గా తీసుకునేవారు మాత్రం విశాలమైన గ్రౌండ్ల కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే నగర శివార్లలో అద్దె మైదానాలు వెలిశాయి. ఔటర్ రింగ్రోడ్డుకు అటూ ఇటూ భూములున్నవారు ఖాళీగా ఉన్న తమ భూములను క్రికెట్ మైదానాలుగా మార్చేసి అద్దెకు ఇస్తున్నారు. మ్యాచ్కు ఇంత అని లేకుంటే రోజుకు ఇంత అని వసూలు చేస్తున్నారు. అటు క్రీడాకారుల అవసరాన్ని తీర్చుతూనే, ఇటు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇలా నగరంలో, శివార్లలో వందలకొద్దీ గ్రౌండ్లు ఏర్పాటయ్యాయి. అందులో ఒక్క మొయినాబాద్ మండలం పరిధిలోనే 60కిపైగా మైదానాలు ఉండటం గమనార్హం.రోజురోజుకూ విస్తరిస్తున్న విశ్వనగరం హైదరాబాద్లో క్రికెట్ అంటే మోజు ఎక్కువ. ఆ ఆటను చూసేవారే కాదు.. ఆడేవారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. సిటీలో గచ్చిబౌలి, ఉస్మానియా యూనివర్సిటీ, యూసఫ్గూడ, ఎల్బీ స్టేడియం, సరూర్నగర్లలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉన్నా.. అవి క్రీడాకారుల అవసరాలకు సరిపోవడం లేదు. మరోవైపు క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి, వెలికి తీసేందుకు వివిధ సంఘాలు, అసోసియేషన్లు ఏదో ఒక పేరుతో తరచూ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాయి.దీంతో గ్రౌండ్ల కోసం డిమాండ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అటు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా, తామూ కొంత ఆదాయం పొందేలా.. నగర శివార్లలో భూములున్నవారు తమ భూములను క్రీడా మైదానాలు మారుస్తున్నారు. భూములను చదును చేసి, చుట్లూ ఎత్తయిన ప్రహరీలు లేదా ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ చెట్లను, మైదానమంతా పచ్చనిగడ్డిని పెంచుతున్నారు. ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క క్రికెట్ అనేగాకుండా వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి ఇతర పోటీలకు కూడా ఈ గ్రౌండ్లను అద్దెకు ఇస్తున్నారు.శివార్లలో సాగు చేయలేక..సిటీ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం, వానలు సరిగా పడకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయడం లేదు. ఈ ప్రాంతాల్లో కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది. సాగు చేసినా.. ఖర్చులు రెట్టింపు అవుతున్న పరిస్థితి. దీనితో ఖాళీగా ఉన్న పొలాలను మైదానాలుగా మారుస్తున్నారు. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నవారు ఓపెన్ స్టేడియాలుగా మారుస్తుండగా.. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న వారు నెట్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని క్రీడా మైదానాల నిర్వాహకులకు లీజుకు ఇస్తున్నారు. ముఖ్యంగా నగరానికి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలం క్రీడా హబ్గా మారుతోంది. ఈ ఒక్క మండలంలోనే సుమారు 65 క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, శంషాబాద్ మండలంలో ఐదు, హయత్నగర్ మండలంలో మూడు మైదానాలు ఏర్పాటయ్యాయి.ఉద్యోగ, వ్యాపార వర్గాలూ..రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు.. సిటీ శివార్లలో భారీగా భూములు కొనుగోలు చేశారు. వారిలో కొందరు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఏర్పాటు చేస్తే.. మరికొందరు భూములను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక క్రీడా మైదానాలుగా మారుస్తున్నారు. కొనుగోలు చేసిన భూములకు రక్షణగా ఉండటంతోపాటు అద్దె ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఆకర్షించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాయి. వారాంతాల్లో వాటిని అద్దెకు కూడా ఇస్తున్నాయి.ఏర్పాట్లను బట్టి అద్దెలు..ఈ గ్రౌండ్లలో వీక్షకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మరుగుదొడ్లు, విద్యుత్, సౌండ్ వ్యవస్థలు, భారీ స్క్రీన్లు, ఎల్ఈడీ లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదుపాయాలను బట్టి, డిమాండ్ను బట్టి అద్దెలు వసూలు చేస్తున్నారు. గ్రౌండ్ల బుకింగ్ కోసం కొందరు నిర్వాహకులు ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. పెద్ద గ్రౌండ్లు అయితే ఒక్కో మ్యాచ్కు రూ.5000 నుంచి రూ.10 వేల వరకు చార్జీ చేస్తున్నారు. నెట్, ఫెన్సింగ్తో ఉండే చిన్న గ్రౌండ్లకు గంటకు రూ.500 నుంచి రూ.1000 వరకు చార్జీ చేస్తున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగా వసూలు చేస్తున్నారు.క్రికెట్పై ఇష్టంతోచిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే క్రికెట్ ఆడేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటా. హైదరాబాద్ నగరంలో క్రికెట్ మైదానాలు అందుబాటులో లేవు. ఎక్కడైనా పార్కుల్లో ఉన్నా క్రికెట్ ఆడేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దాంతో ప్రతిరోజు క్రికెట్ ఆడేందుకు సిటీ బయటి ప్రాంతాలకు వెళ్తున్నాను. క్రీడాకారులందరం డబ్బులు పోగేసుకుని మైదానాన్ని అద్దెకు తీసుకుంటాం. - సయ్యద్ అర్షద్, క్రీడాకారుడుఆన్లైన్ ద్వారా అద్దెకు..క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా క్రికెట్ మైదానాలు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చాలా వరకు క్రీడాకారులు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతుంటారు. సాధారణ రోజుల్లో మ్యాచ్కు రూ.2 వేల నుంచి రూ.4 వేలు.. శని, ఆదివారాల్లో అయితే మ్యాచ్కు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె వసూలు చేస్తాం. గ్రౌండ్ నిర్వహణకే చాలా వరకు ఖర్చవుతుంది. మౌలిక సదుపాయాలు, డిమాండ్ను బట్టి చార్జీలలో మార్పులు ఉంటాయి.– రాజేందర్రెడ్డి, క్రికెట్ మైదానం నిర్వాహకుడు, మొయినాబాద్క్రికెట్ గ్రౌండ్లు ఉన్నగ్రామాల వివరాలివీ..గ్రామం గ్రౌండ్లుబాకారం 15అజీజ్నగర్ 12ఎనికేపల్లి 12చిలుకూరు 6నజీబ్నగర్ 4అమ్డాపూర్ 3నాగిరెడ్డిగూడ 3హిమాయత్నగర్ 3కనకమామిడి 3రెడ్డిపల్లి 3తుర్కయాంజాల్ 2కొంగరకలాన్ 2మోత్కుపల్లి 1శ్రీరాంనగర్ 1బొంగుళూరు 1ఇబ్రహీంపట్నం 1నాదర్గుల్ 1 -
మిల్కీ బ్యూటీ బిగ్ డీల్.. ఏకంగా నెలకు రూ.18 లక్షలు!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. గతేడాది రజినీకాంత్ మూవీ జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా.. ముంబయిలో ఖరీదైన ప్రాంతంలో కార్యాలయాన్ని రెంట్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా తమన్నా భాటియా ముంబయిలోని ఓ వాణిజ్య కార్యాలయం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలకు దాదాపు రూ. 18 లక్షలు చెల్లించనుంది. ఖరీదైన జుహు తార ప్రాంతంలో ఈ వాణిజ్య కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్ దాదాపు 6,065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. నానావతి కన్స్ట్రక్షన్ నుంచి ఐదేళ్ల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంది. ఈ బిగ్ డీల్ జూన్ 27న జరగ్గా.. దీనికోసం తమన్నా రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అంతే కాదు ఆమెకు చెందిన అపార్ట్మెంట్లను కూడా భారీ మొత్తానికి బ్యాంకులో తనఖా పెట్టినట్లు సమాచారం. అంతే కాకుండా తమన్నా అంధేరీలోని వీర దేశాయ్ రోడ్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లాట్లను ఇండియన్ బ్యాంక్లో రూ.7.84 కోట్లకు రుణం కోసం తనఖా పెట్టినట్లు సమాచారం. జూన్ 14న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నటి రూ.4.70 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ఇక సినిమాల విషయానికొస్తే తదుపరి చిత్రం వేదాలో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు15న రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు నటిస్తోన్న స్ట్రీ- 2లో ప్రత్యేక పాత్రలో పోషించనుంది. -
అద్దెకు మినీ థియేటర్లు
మణికొండ: ఎవరైనా సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెల్లాల్సిందే. అదే సంపన్నులైతే ఇంట్లోనే హోం థియేటర్లను ఏర్పాటు చేసుకుని ఇంటిల్లిపాదీ కలిసి అందులో నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. అదే సామాన్యులు, పేదులు అయితే ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలనే చూస్తారు. అలాంటి సామాన్యులకూ తమ ఇంట్లోని హోం థియేటర్లో కూర్చుని సినిమా చూసిన అనుభూతిని కలి ్పంచేందుకు మినీ థియేటర్లు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకొచ్చాయి. వాటిలో సినిమాలు చూడటమే కాదు కుటుంబ సమేతంగా బర్త్డేలు, ఇతర సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. సినిమా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తే అయ్యే ఖర్చుకన్నా తక్కువకే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రం నుంచి నార్సింగి రోడ్డులో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల బింగే క్యాస్టల్ హోం థియేటర్లను ప్రారంభించారు. అందులో ఇద్దరి నుంచి మొదలుకుని ఎనిమిది మంది వరకూ సినిమా చూసే వెసులుబాటును కలి ్పంచారు. అద్దెలు ఇలా... బింగే క్యాస్టల్ ప్రైవేట్ హోం థియేటర్లలో కపుల్స్కు రూ.1449లు, ఐదుగురు కలిసి చూసే థియేటర్ రూ.1549లు, పది మంది కలిసి చూసే థియేటర్కు రూ.1749లు తీసుకుంటున్నారు. వాటిలో అదనపు వ్యక్తి వస్తే రూ.299 లు వసూలు చేస్తున్నారు. ఓటీటీలో అందుబాటులో ఉన్న నచ్చిన సినిమాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. సినిమా చూస్తున్న సమయంలో స్నాక్స్ కావాలన్నా అందిస్తున్నారు. 3 గంటల పాటు సినిమా చూ డటం, అందులో ఉండేందుకు అవకాశం కలి్పస్తున్నారు.సామాన్యులు సైతం హోం థియేటర్లో కూర్చుని, నచి్చన సినిమా చూస్తూ చిన్న, చిన్న పారీ్టలు సెలబ్రేట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నారు. థియేటర్లలో సినిమా చూసిన అనుభూతే ఇందులో కలుగుతుంది. వీటిల్లో వారికి ప్రైవసీ ఉంటుంది. కేక్లు, స్నాక్స్ కావాలన్నా అందుబాటులో ఉంటాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. రానున్న రోజుల్లో మరిన్నింటిని పెంచుతాం. – డి.శ్రావణ్ కుమార్, బింగే క్యాస్టల్ థియేటర్స్ యజమాని -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్కే ఫ్లాట్కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్కేక్లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి.అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
సేనానికి ప్యాకేజీ.. నమ్ముకున్నవారికి నిరాశ..!
వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు. ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు. బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్ను నిలదీశారు పోతిన మహేశ్.. కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు. పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..?
దేశంలోని అనేక నగరాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో అద్దెలు వేలల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది. భారతీయులు ఎగబడి మరీ వెళుతున్న కెనడాలో అద్దెలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కెనడా రాజధాని టొరంటోలో ఇంటి అద్దెలు తెలిస్తే అవాక్కవుతారు. ఈ నగరంలో హౌసింగ్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ క్రమంలో టొరంటోకు చెందిన అన్య ఎట్టింగర్ అనే మహిళ నెలకు రూ.54,000 చొప్పున తన క్వీన్సైజ్ బెడ్ను మరో మహిళతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటన షేర్ చేసింది. ఈ ప్రాంతంలో సింగిల్ బెడ్ రూమ్ నెల అద్దె దాదాపు రూ.2.17 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న అద్దెల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వీడియోలో తెలిపింది. తాను కాండోలో ఉంటున్నట్లు మాస్టర్ బెడ్రూమ్, క్వీన్-సైజ్ బెడ్ను పంచుకోవడానికి మహిళ కోసం వెతుకుతున్నానని అందులో చెప్పింది. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? గతంలో తాను ఫేస్బుక్ కంపెనీలో పరిచయమైన అమ్మాయితో బెడ్రూమ్ని పంచుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. సగం మంచాన్ని అద్దెకు ఇవ్వడానికి మహిళ చేసిన ప్రయత్నం ఓకే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు వినటానికే ఇది హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anya Ettinger (@aserealty) -
కౌలు చెల్లించాల్సింది సీఆర్డీఏ.. రాష్ట్ర ప్రభుత్వం కాదు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీనిపై కౌంటర్లు దాఖ లు చేయాలని భూములిచ్చిన పిటిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించినందుకు ‘మీరు పిటిషనర్ల పట్ల ప్రతికూల అభిప్రాయంతో ఉన్నారం’టూ న్యాయమూర్తిపై రాజధాని రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర ఆరోపణ చేశారు. రాజధానికి భూములిచ్చినందుకు మేలో చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇప్పటివరకు చెల్లించలేదంటూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితితో సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం మరోసారి విచారణ జరి పారు. ఈ సందర్భంగా బైరెడ్డి సాయి ఈశ్వరరెడ్డి తరపున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాజధానికి భూములిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం కౌలు చెల్లించడాన్ని సవాలు చేస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం సేకరించిన భూముల కోసం రూ.1,000 కోట్లతో డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారని, ఇది సీఆర్డీఏ వద్ద ఉంటుందని తెలిపారు. ఈ ఫండ్ నుంచి సీఆర్డీఏనే కౌలు చెల్లించాలన్నారు. ఇందుకు విరుద్ధంగా 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పత్రికల్లో రోజూ కథనాలు వస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కోట్ల రూపాయలను రాజధానికి భూములిచ్చారన్న పేరుతో కేవలం ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తులకే చెల్లించడం సరి కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఎలాంటి క్లెయిమ్స్ లేవనెత్తడానికి వీల్లేదన్నారు. సీఆర్డీఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరడానికి వీల్లేదని, రాజధాని విషయంలో నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందని చెప్పా రు. వాదనలు వినిపించేందుకు తమను ఇంప్లీడ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్ను అనుమతిస్తున్న ట్లు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకే... ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించడంపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినకుండా ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించడం సరికాదన్నారు. రైతులకు కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇందులో భాగంగానే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైందని తెలిపారు. మీరు (జస్టిస్ కృష్ణమోహన్) తమ పట్ల ప్రతికూల అభిప్రాయం (ప్రిజుడీస్) కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. రాజకీయాలతో ఈ పిటిషన్కు సంబంధం లేదని, పిటిషనర్ న్యాయవాది అని వివేకానంద వివరించారు. ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆ తరువాత పూర్తి విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
నెలకు రూ. 40.50 లక్షలు రెంట్ ఇవ్వడానికి రెడీ.. అట్లుంటది కుబేరుడంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన 'బెర్నార్డ్ ఆర్నాల్డ్' (Bernard Arnault)కి చెందిన లూయిస్ విట్టన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లోని ఉబెర్ లగ్జరీ మాల్ అయిన జియో వరల్డ్ ప్లాజాలో తన కొత్త స్టోర్ కోసం మొత్తం 7,365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను లీజుకు తీసుకుంది. దీనికి నెలకు అద్దె రూ. 40.50 లక్షలు కావడం గమనార్హం. సంస్థ 60 నెలల లాక్-ఇన్ పీరియడ్తో 114 నెలలకు (9.5 సంవత్సరాలు) రూ. 2.43 కోట్ల లైసెన్స్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ప్రతి 36 నెలల తరువాత రెంట్ 15 శాతం పెరుగుతుంది. ఈ డీల్ 2023 ఫిబ్రవరి నుంచి 2032 డిసెంబర్ వరకు ఉండనుంది. ఇదీ చదవండి: మొదటి కుమార్తె మరణం కంటే అది చాలా బాధాకరం - ఎలాన్ మస్క్ 1854లో పారిస్లో లూయిస్ విట్టన్ స్థాపించిన ఈ కంపెనీ 2003లో న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భారతదేశంలో తన మొదటి షాప్ ప్రారంభించింది. అయితే ఈ రోజు బెంగళూరులోని UB సిటీ, న్యూఢిల్లీలోని DLF ఎంపోరియో, దక్షిణ ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్తో సహా దేశవ్యాప్తంగా మూడు స్టోర్లను కలిగి ఉంది. -
వార్షిక కౌలుపై పిటిషన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి: వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలన్న రాజధాని రైతుల అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం ముందు రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ అభ్యర్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంలేదని, దీనిపై తాము సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు మాత్రమే జారీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అప్పీల్ దాఖలు చేయాలని అనుకుంటున్నామని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయనప్పుడు దేనిపై అప్పీల్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
భారత్లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!
Tesla: ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశంలో టెస్లా (Tesla) కంపెనీ ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సంస్థ కోసం టేబుల్స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కోసం పూణే విమాన్ నగర్లోని పంచశీల్ బిజినెస్ పార్క్లో కార్యాలయ స్థలాన్నిఅద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టెస్లా బృందం గత వారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి సంబంధించిన ప్రోత్సాహకాలను, ప్రయోజనాలను గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్.. టెస్లా యూనిట్.. భారతదేశంలో టెస్లా యూనిట్ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. సుమారు 5,580 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్పేస్ కోసం నెలకు అద్దె రూ. 11.65 లక్షల వరకు ఉండనుంది. అద్దె 2023 అక్టోబర్ 01 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ స్పేస్ను 5 సంవత్సరాలు లీజుకి తీసుకున్నట్లు, ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 34.95 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ గడువును పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో ఒక సారి బెంగళూరులో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని సంస్థ యోచిస్తోంది. -
గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..
గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు. (చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..) -
6 నెలల్లో ఏకంగా రూ.15 వేలు పెరిగిన ఇంటి అద్దె!
కొన్నేళ్ల క్రితం వరకు నగరాలు, పట్టణాల్లో సామాన్యుడికి సొంత ఇల్లు అనేది కలగానే ఉండేది. కానీ కోవిడ్ -19తో పరిస్థితులు మారాయి. మహమ్మారి సమయంలో అద్దె ఇంట్లో ఉండే వారి వెతలు ఎలా ఉన్నాయో కొన్ని సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా సొంతిల్లు కొనే పనిలో పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల్లో సులభంగా లభించే ఇంటి రుణాలు సొంతింటి కలను మరింత నిజం చేశాయి. మరి అద్దె ఇంట్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నెలల వ్యవధిలో యజమానులు పెంచుతున్న ఇంటి అద్దెల్ని కట్టుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. తాజాగా, బెంగళూరులో 23 ఏళ్ల శామ్ సంగ్ ఉద్యోగి అర్ష్ గోయల్ తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మారతహళ్లి దొడ్డనుకుంది గేటెడ్ కమ్యూనిటీ హాల్స్లో 3 బీహెచ్కే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అద్దె నెలకు రూ.57,000. బెంగళూరు వంటి మహానగరాల్లో ఏడాదిలో 11 నెలల పాటు రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఆ అపార్ట్మెంట్లో చేరిన అర్ష్ గోయల్కు 6 నెలల తర్వాత యజమాని పెట్టిన ఖండీషన్కు కంగుతిన్నాడు. అదేంటంటే? అద్దెకు చేరి ఆరు నెలలు పూర్తయింది కాబట్టి.. రెంటును అకస్మాత్తుగా మరో రూ.15,000 పెంచుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణయాన్ని అంగీకరించడం, లేదంటే ఇల్లును ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. అయితే, యజమానికి రెంట్ పెంచడాన్ని గోయల్ జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో బెంగళూరులో అద్దె ఇల్లు వెతుక్కోవడం, ఇంటి యజమానులు పెట్టే కండీషన్లు తలకు మించిన భారంగా మారాయి. దీంతో పెంచిన రెంట్ను చెల్లించేందుకు గోయల్ స్నేహితులు అంగీకరించారు. చివరికి చేసేది లేక తానుకూడా అంత పెద్ద మొత్తాన్ని భరించేందుకు సిద్ధమైన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. మళ్లీ కొత్త అపార్టెంట్ను వెతుక్కోవడం సమస్య కాబట్టి భూస్వామికి అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు’ అని గోయల్ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. My Landlord in Bangalore increased rent by 15,000 INR within one year whereas as per agreement the increase per year should have been 5%. The only option he gave was either to leave or pay the increased rent. — Arsh Goyal (@arsh_goyal) July 8, 2023 ఇల్లు మారొచ్చుకదా.. ఓ ప్రముఖ మీడియా సంస్థ జరిపిన ఇంటర్వ్యూలో, బ్రోకర్ ద్వారా ఈ ఫ్లాట్ను వెతకడానికి నెలరోజుల సమయం పట్టినట్లు గోయల్ వెల్లడించాడు. ప్రస్తుతం తాను ఉంటున్న ఫ్లాట్ను అందంగా తీర్చిదిద్దేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ఆఫీస్ దగ్గర, పైగా రోజువారీ ప్రయాణంలో ట్రాఫిక్ బాధల నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారి బాధల్ని దగ్గరుండి చూసినట్లు అర్ష్ చెప్పుకొచ్చాడు. దీంతో అర్ష్ గోయల్ తరహాలో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే -
ఇకపై రెంట్కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు!
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి? కన్న తండ్రిలా సంరక్షిస్తూ.. అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్హౌస్లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలను పట్టుకునేందుకు.. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్హౌస్కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్హౌస్లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. పిల్లల కోసం సౌకర్యాలు ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించింది. ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్స్టార్కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్మెంట్ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్మెంట్లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్కే ఫ్లాట్లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. వందేళ్ల నాటిది! ఈ వన్ బీహెచ్కే సాధారణ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్మెంట్కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు. -
అద్దెకు గోదాములు
సాక్షి, అమరావతి: ఆర్థిక పరిపుష్టి సాధించుకునే దిశగా మార్కెటింగ్ శాఖ అడుగులేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకివ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకుంటోంది. రాష్ట్రంలో 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,015 గోదాములు ఉన్నాయి. వీటితో పాటు 3,352 చోట్ల షాపులు, మరో 407 చోట్ల షాపులతో కూడిన గోదాములున్నాయి. ఇప్పటి వరకు కమిటీల పరిధిలో ఉన్న ఈ–చెక్పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయడం, వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయడం, గోదాములను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇవ్వడం వంటి కార్యకలాపాల ద్వారా మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరేది. ఇలా ఏటా రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఒకే దేశం– ఒకేమార్కెట్ విధానంతో సెస్ వసూళ్లను నిలిపివేయడంతో దాదాపు ఏడాది పాటు ఆదాయానికి గండి పడింది. 2021–22లో ఈ పన్నుల వసూళ్లను పునరుద్ధరించడంతో కాస్త గాడిలో పడినప్పటికీ ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా మార్కెటింగ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునే వారు. అలాగే బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వ కోసం పౌరసరఫరాల శాఖ, ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తుల నిల్వ కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రాష్ట్ర గోదాముల సంస్థ, మార్క్ఫెడ్లకు అద్దెకిచ్చేవారు. గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కూడా గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వీరికి అద్దెకివ్వడం ద్వారా మార్కెటింగ్ శాఖ అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు అద్దెకు 2,976 షాపులు ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి గోదాములను అద్దెకు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా అద్దెను నిర్ణయించి,konugolu.ap. gov.in ద్వారా టెండర్లు పిలుస్తున్నారు. అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా మార్కెట్ కమిటీలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,976 షాపులు, 367 షాపులతో కూడిన గోదాములు, 614 గోదాములు అద్దెకిచ్చారు. వీటి ద్వారా ఏటా రూ.24 కోట్లకు పైగా అదనపు ఆదాయం మార్కెటింగ్ శాఖ సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీగా ఉన్న షాపులు, గోదాములను కూడా అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇదెక్కడి డిమాండ్ మహాప్రభో.. డబుల్ బెడ్ రూం అద్దె రూ.50వేలు!
దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా మారింది. అమాంతం పెరిగిన అద్దె ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్ మార్కెట్’కు మంచి డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. -
గూగుల్ ఇంటర్వ్యూలో నెగ్గాడు.. కానీ అక్కడ మాత్రం!
కోవిడ్-19 తర్వాత మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. ఎంతలా అంటే? గూగుల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు..కానీ బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటూ అద్దెకోసం అన్వేషిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాల గురించి ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాకు ఎక్కిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఒప్పుకోవాలి. ఇంటర్వ్యూ పేరుతో వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకదు. అలా అద్దె ఇల్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న రీపు సోనారిక భడోరియా (Ripu Daman Bhadoria) తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. భడోరియా గత ఏడాది అమెరికా సియాటెల్ నుంచి బెంగళూరు వచ్చాడు. అక్కడ తన బడ్జెట్ తగ్గట్లు రెంట్కు ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇంటి ఓనర్స్ రకరకాల ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అలా ఓనర్ చేసిన తొలి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్లు బహదోరియా చెప్పుకొచ్చాడు. అప్పుడే బెంగళూరులో అద్దె ఇల్లును సొంతం చేసుకోవడం కంటే గూగుల్ (google) ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా సులభమని భావించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో మరో ఇంటి ఓనర్ చేసిన ఇంటర్వ్యూలో పాస్ అయినట్లు వివరించాడు. బహదోరియా గూగుల్ ఉద్యోగి. తాను గూగుల్ ఉద్యోగినని. సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం వల్లే తనకు అద్దె ఇల్లు దొరికిందని చెప్పాడు. గూగుల్లో పనిచేయడం విపత్కర పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఎప్పుడూ ఊహించలేదని లింక్డ్ ఇన్ పోస్ట్లో రాశారు. ఆ పోస్ట్కు స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. విసుగు తెప్పించడంలో బెంగళూరులో ఇంటి ఓనర్స్ అద్దె ఇంటి కోసం వెతికే వారికి తెగ విసుగు తెప్పిస్తుంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్ . 2016 లో అనుకుంటా. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తారా? మీ ఇంటికి మగ స్నేహితులు వస్తారా? అని ప్రశ్నించారు. నేను టీసీఎస్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అద్దె ఇల్లు దొరికింది. వేరే కంపెనీలో ఉన్న నా స్నేహితుడికి ఉండేందుకు 2 నెలలు పాటు అద్దె ఇల్లు దొరకలేదు. అప్పటి నుంచి బెంగళూరుకు దూరంగా ఉంటున్నా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి👉 హీరా గోల్డ్ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్ -
క్రెడిట్పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్ మస్క్.. కోర్టులో దావా
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అయినా ఆర్థిక కష్టాల్లో సతమతమవుతోంది. ఎంతలా అంటే చివరికి తమ కార్యాలయాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ట్విటర్ 1355 మార్కెట్ స్ట్రీట్లోని తన కార్యాలయాలకు డిసెంబర్ అద్దె 3.36 మిలియన్ డాలర్లు జనవరి అద్దెకు 3.42 మిలియన్ డాలర్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో భవన యజమాని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్ఎల్సీ, కోర్టును ఆశ్రయించింది. కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో దావా వేసింది. కార్యాలయాన్ని అద్దెకు ఇస్తున్న సమయంలో ట్విటర్ నుంచి శ్రీ నైన్ మార్కెట్ 3.6 మిలియన్ డాలర్ల ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ను పూచీకత్తుగా తీసుకుంది. ఇటీవల ట్విటర్ అద్దె చెల్లించకపోవడంతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అద్దె బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విటర్కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్ను సైతం 10 మిలియన్ డాలర్లకు పెంచేలా ఆదేశించాలని కోరింది. ట్విటర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సంస్థలోని సగం మంది సిబ్బందిని తొలగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఇతర కార్యాలయాల్లో అద్దెను నిలపడంతో పాటు జెట్, చార్టర్ వంటి కొన్ని బకాయి బిల్లులను చెల్లించేందుకు కూడా నిరాకరించాడు. మొత్తానికి గత బకాయిలను చెల్లించడానికీ అంగీకరించడం లేదు. చదవండి: ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్! -
వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... తండ్రీ కొడుకుల అరెస్ట్
బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్ను కోరారు. అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు. నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో.. ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది. (చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్) -
ఇదేందయ్యా ఇది: జైలులో గది అద్దెకు ఇస్తారంటా.. రెంట్ ఎంతో తెలుసా?
జైలులో ఎవరుంటారు.. ఈ ప్రశ్న చిన్నపిల్లలను అడిగినా వెంటనే చెప్పేస్తారు. జైలులో నేరస్తులు ఉంటారు అని. అయితే, ఉత్తరాఖండ్లోని జైలులో మాత్రం నేరం చేయకపోయినా.. అక్కడ ఉండొచ్చు. ఎన్ని రోజులైనా అక్కడ నివాసం ఉండవచ్చు. ఎలా అనుకుంటున్నారా?. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లోని హల్ద్ వానీ జైలులో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి జైల్లో నేరం చేయని వారు సైతం ఉండొచ్చు. అయితే, జైలులోని ఒక రూమ్లో ఉండేందుకు ఒక రోజు అద్దెగా రూ.500 చెల్సించాల్సి ఉంటుంది. కాగా, ఒక్క రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తూ ఎన్ని రోజలైనా జైలులో ఉండొచ్చు అని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే, ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, కొందరు వ్యక్తులు జాతకాలను బాగా నమ్ముతుంటారు. జాతకాల్లో దోషం కారణంగా పెళ్లిళ్లు కాకపోవడం, ఉద్యోగాలు సాధించకపోవడం, అనుకున్నది చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయని వారి నమ్మకం. ఇందుకోసం దోష నివారణ చేయడానికి కొన్ని పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే జైలుకు సైతం వెళ్లి రావాలని కొందరి జాతకాల్లో ఉంటుంది కదా.. అందుకోసం ఇలాంటి సమస్య ఉన్నవారి కోసం బంధన్ యోగ్ పేరిట ఇలా ప్రత్యేకంగా జైలులో రూమ్స్ అద్దెకు ఇస్తున్నట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు. Jail Tourism For ₹ 500 Per Night Uttarakhand Offers Real Jail Experience To Tourists https://t.co/ZJqPyoiwgN — JAS Sakulich (@JasSakulich) September 30, 2022 -
ఆశతో ఆడుకుంటున్న బిల్డర్ల.. బలవుతున్న సామాన్యులు, ఇన్వెస్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓ పక్క గృహ నిర్మాణాలలో ప్రీలాంచ్ విక్రయాలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న బిల్డర్లు.. పెట్టుబడిదారులనూ వదలడం లేదు. స్థలం కొనుగోలు చేయకుండానే, నిర్మాణ అనుమతులు రాకముందే కమర్షియల్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్ డిజైన్లు, అందమైన బ్రోచర్లతో ఆకర్షిస్తున్నారు. మా దగ్గర పెట్టుబడులు పెడితే బ్యాంక్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువే లాభం, వంద శాతం సొమ్ము ముందే చెల్లిస్తే సగం ధరకే వాణిజ్య స్థలం, ప్రాజెక్ట్ పూర్తయ్యాక రెట్టింపు అద్దె అంటూ అన్ని రకాల మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ చివరకు నట్టేట ముంచేస్తున్నారు. బాధితులు వేల సంఖ్యలో.. సాహితీ, ఫీనిక్స్, సీఎన్ఎన్ వెంచర్స్, సెన్సేషన్, గరోండా బిల్డర్స్, సంధ్యా కన్వెన్షన్ వంటి నిర్మాణ సంస్థలెన్నో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నామని జనాలను నమ్మించి సొమ్ము వసూలు చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రాంగూడ, కోకాపేట వంటి హైస్ట్రీట్ ఏరియాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి. బిల్డర్ల చేతిలో ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, రిటైర్డ్ పోలీసులు, ప్రవాసులూ చిక్కి విలవిల్లాడుతున్నారు. కట్టిన సొమ్ము వాపసు ఇవ్వాలని డెవలపర్ల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కానీ బిల్డర్లు బౌన్సర్లను నియమించుకుని కొనుగోలుదారులను కనీసం ఆఫీసు లోపలికి కూడా రానివ్వటం లేదని సత్యా టెక్నో పార్క్ బాధితుడు వాపోయారు. 10 ఏళ్ల పాటు ప్రతి నెలా అద్దె! సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ నానక్రాంగూడలో జీ+47 అంతస్తులలో హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. రూ.60 లక్షలకు 397 చ.అ., రూ.82 లక్షలకు 546 చ.అ. స్పేస్ను ప్రీలాంచ్లో భాగంగా విక్రయిస్తోంది. రూ.60 లక్షల పెట్టుబడిదారులకు రూ.14,500, రూ.82 లక్షల వాళ్లకు రూ.62 వేలు అద్దె ప్రతి నెలా కంపెనీయే చెల్లిస్తుందని మాయమాటలు చెబుతోంది. వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, 10 ఏళ్ల పాటు ఈ అద్దె అగ్రిమెంట్ ఉంటుందని నమ్మబలుకుతోంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవచ్చని లేదా కస్టమర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వల వేస్తోంది. ఇంతా చేస్తే ప్రాజెక్ట్ను నిర్మించే స్థలం సెన్సేషన్ కంపెనీ పేరు మీదే లేకపోవటం గమనార్హం. అంతా గోల్మాల్.. బోయిన్పల్లిలో 4 ఎకరాలలో ధనా మాల్ నిర్మిస్తామని సీఎన్ఎన్ వెంచర్స్ ప్రచారం చేసింది. 120 చ.అ. స్థలం రూ.10 లక్షల చొప్పున వందలాది మందికి విక్రయించింది. కానీ సంస్థకు నేటికీ నిర్మాణ అనుమతులు రాలేదు. ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో కట్టిన డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారులు రోజూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సంస్థ మాత్రం కిక్కురుమనడం లేదు. తాజాగా ఇదే సంస్థ బెంగళూరులోని చిక్కజల ప్రాంతంలో 7 ఎకరాలలో ధనా మాల్ పేరిట ప్రీలాంచ్ కింద కమర్షియల్ రిటైల్ షాపింగ్ స్పేస్ను విక్రయిస్తుండటం గమనార్హం. కమర్షియల్స్ను ప్రీలాంచ్లో విక్రయించకూడదు కమర్షియల్ ప్రాజెక్ట్లను కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేయకుండా విక్రయాలు చేయకూదు. నిబంధనలు అతిక్రమించిన డెవలపర్లకు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తాం. – కె.విద్యాధర్, టీఎస్ రెరా సెక్రటరీ -
Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!
చెన్నై మహానగరం పరిధిలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి.. యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా అద్దె మొత్తాన్ని పెంచేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు. అంత కట్టలేమంటే వెళ్లిపోమంటూ ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారుతోంది. సాక్షి, చెన్నై: పెరిగిన విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటిపన్నులతో సతమతం అవుతున్న నగరజీవికి ఇంటి అద్దె పెరుగుదల మోయలేని భారంగా మారుతోంది. చెన్నై మహానగరంలో ఉద్యోగం, విద్యా, వ్యాపారం కోసం వచ్చి స్థిర పడ్డ వారి సంఖ్య ఎక్కువే. వీరిలో మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి అవసరాలు ఇంటి యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చెన్నై శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలున్నాయి. ఇక్కడ ఉద్యోగ రిత్యా రాష్ట్రానికి చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఇటీవల ఉత్తరాది నుంచి వివిధ పనుల నిమిత్తం చెన్నై వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో చెన్నై, సెంట్రల్ చెన్నై, దక్షిణ చెన్నైతో పాటు శివారులలోని వేళచ్చేరి, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాలు, అంబత్తూరు, పూందమల్లి, రెడ్ హిల్స్, మాధవరం, ఆవడి, తాంబరం, పల్లావరం, క్రోం పేట, పెరుంగళ్తూరు, ముడిచ్చూరు పరిసరాలలో అద్దె ఇల్లు దొరకడం గగనంగా మారింది. సాఫ్ట్వేర్ వంటి పెద్ద సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమకు సౌకర్యవంతంగా ఉండే అపార్ట్మెంట్స్ను బాడుగకు తీసుకుంటున్నారు. వడ్డనతో భారం.. చెన్నై నగరంలో నెలసరి అద్దె అధికంగానే ఉంటోంది. చిన్న గది అయినా కనీసం రూ. 5 వేలు పైగా వెచ్చించాల్సిందే. సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.10 వేలు, మరి కాస్త పెద్దది కావాలంటే రూ. 15 వేలు, రూ. 20 వేలు, రూ. 25 వేలు వరకు అద్దె చెల్లించాల్సిందే. అన్నానగర్, అడయార్, తిరువాన్మీయూరు, ఈసీఆర్, ఓఎంఆర్ తదితర మార్గాల్లో కొంత సౌకర్యాలు కల్గిన ప్రాంతాల్లో రెట్టింపు అద్దె చెల్లించుకోక తప్పదు. ఇక, కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులకు మీటరుతో సంబంధం ఉండదు. ఇంటి యజమాని నిర్ణయించే మీటర్ రీడింగ్ చార్జీను చెల్లించక తప్పదు. పన్నులు పెంచితే చాలు.. అసలే కరోనా మిగిల్చిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజల్ని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. చెన్నై వంటి నగరాలలో ఆస్తిపన్ను, నీటి పన్ను ఇటీవలే అదనంగా వడ్డించారు. అలాగే, విద్యుత్ బిల్లుల మోత మోగింది. ఈ ప్రభావం ఇళ్ల యజమానులపై పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వారు అద్దెను అమాంతం పెంచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబరు నుంచి అనేక చోట్ల అద్దె పెంచుతూ యజమానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దెతో పాటు అదనంగా.. కొన్నిచోట్ల ఇంటి అద్దెతో పాటు విద్యుత్, తాగునీరు, మెయింట్నెన్స్ చార్జీలను పెంచేశారు. ఈ విధంగా కుటుంబ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఇంటి అద్దె రూపంలో చెల్లించడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ప్రస్తుతం లగ్జరీతో కూడిన అపార్ట్మెంట్లకు 13, 14 శాతం మేరకు, చిన్న చిన్న రూములు, సింగిల్ బెడ్ రూం, డబుల్బెడ్ రూం ఇళ్లకు 25 శాతం వరకు అద్దెను పెంచారు. దీంతో ఇది వరకు రూ. 5 వేలు చెల్లిస్తున్న వారు ప్రస్తుతం రూ. 7 వేల వరకు, రూ.10 వేలు చెల్లిస్తున్న వారు రూ. 13 వేల వరకు అద్దె భారాన్ని భరించాల్సిన పరిస్థితి చెన్నైలో నెలకొంది. నిబంధనలు దాటి ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా, ఆ దిశగా చర్యలు తీసున్న దాఖలాలు లేవు. ఇంటి బాడుగలను క్రమబద్దీకరించే విధంగా మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వారిలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండడం గమనార్హం. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా ‘రెంట్’
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ,చైతన్య ప్రియ ప్రధాల పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెంట్’. ‘నాట్ ఫర్ సేల్’ అన్నది ఉప శీర్షిక. ఈ రొమాంటిక్ థ్రిల్లర్కు రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై చందక రాజ్ కుమార్ - సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి మాట్లాడుతుతూ.. హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రెంట్ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి డి.ఎస్.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్గా, హజరత్ (వలి) డీవోపీగా పనిచేస్తున్నారు. -
'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే !
SS Rajamouli RRR Digital Premiere On Zee5 With TVOD Basis: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25న థియేటర్లలో విడుదలైన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి విడుదల అవుతుంది. మే 20న జీ5లో దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం జీ5 తాజాగా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను మే 20 నుంచి ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (టీవీవోడీ) పద్ధతిలో అందుబాటులో ఉంటుందని జీ5 తెలిపింది. అంటే మనం మూవీని చూడాలంటే కొంత మొత్తాన్ని చెల్లించి అద్దెకు తీసుకోవాలి. కొంత వ్యవధి వరకు ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో వీలు చూసుకుని మూవీని చూడొచ్చు. జీ5 ఓటీటీ 'జీప్లెక్స్' ద్వారా అద్దెప్రాతిపదికన సినిమాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను అద్దెకు తీసుకోవాలంటే అదనంగా రూ. 100 చెల్లించి మొత్తం రూ. 699 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి (సాధారణంగా జీ5 ఏడాది సబ్స్క్రిప్షన్ను రూ. 599తో అందిస్తుంది). ఇలా ఆర్ఆర్ఆర్తో కలిపి సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి సినిమా 7 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఇదివరకు సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్లు కూడా 'ఆర్ఆర్ఆర్' చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. ఈ పద్ధతి ఎన్నిరోజులు అమలులో ఉంటుందో తెలియదు. చదవండి: ఓటీటీలో సినిమాల జాతర.. ఈ శుక్రవారం 13 చిత్రాలు టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. Alluri Sitarama Raju aka Special Officer on Duty! All set for reporting to the World’s Biggest Digital Premiere - ONLY on #ZEE5 (Available on T- VOD) #RRRonZee5fromMay20 #RoarOfRRRonZEE5 #RRRPremieres20thMay@ssrajamouli @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/o8zQ4KVXT1 — ZEE5 Telugu (@ZEE5Telugu) May 15, 2022 -
పెళ్లికి ముందే ఇల్లు వెతికి పెట్టుకున్న అతియా- రాహుల్, అద్దె లక్షల్లోనే!
Athiya Shetty And KL Rahul Move Into A Rented Apartment In Mumbai: ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మూడేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారని బాలీవుడ్లో టాక్. ఈ జంట ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ జంట గురించి తాజాగా ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. అతియా శెట్టి, రాహుల్ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకుంటున్నారట. పింక్విల్లా కథనం ప్రకారం ఈ జంట ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్ రోడ్లో 4 బీహెచ్కే అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారని సమాచారం. ఈ అపార్ట్మెంట్ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఈ జంట వారి ప్రేమను తెలియజేసేందుకు సోషల్ మీడియాలో ఏమాత్రం వెనుకాడరు. ఇదివరకు కెఎల్ రాహుల్ బర్త్డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్డే' అని పోస్ట్ షేర్ చేసింది అతియా శెట్టి. చదవండి: త్వరలో పెళ్లి చేసుకోనున్న కేఎల్ రాహుల్-అతియా శెట్టి ! View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) చదవండి: క్యాన్సర్తో బాధపడుతున్న బుల్లితెర నటి.. ఎమోషనల్గా పోస్ట్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కార్ల చోరికి అలవాటు పడ్డ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్! అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు
లింగోజిగూడ: నకిలీ పత్రాలతో కార్లను అద్దెకు తీసుకుని నంబర్ ప్లేట్లు మార్చి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. భీమవరానికి చెందిన గుడాటి మహేష్ నూతన్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. భీమవరంలోనే మొబైల్ మెకానిక్గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సెల్ ఫోన్లను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ మకాం మార్చిన అతను స్నేహితుల గదుల్లో ఉంటున్నాడు. వారి గుర్తింపు కార్డులను తీసుకోవడంతో పాటు డ్రైవర్లు కావాలంటూ ప్రకటనలు ఇచ్చేవాడు. తనను సంప్రదించిన వారి గుర్తింపు కార్డుల జిరాక్స్ తీసుకునే వాడు. వాటితో వివిధ కారు రెంటల్ అన్లైన్ యాప్లలో కార్లను బుక్ చేసుకునే వాడు. ఆ తర్వాత వాటికి జీపీఎస్ ట్రాక్ సిస్టం తొలగించి రాష్ట్రం దాటిన తర్వాత నంబర్ ప్లేట్లను మార్చేవాడు. సదరు కారును కొద్ది రోజులు వాడుకుని తక్కువ ధరకు విక్రయించేవాడు. గత సంవత్సరం చైతన్యపురి పోలీస్టేషన్ పరిధిలో క్రెటా కారును చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మహేష్ను నిందితుడిగా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. అతడికి సహకరిస్తున్న షేక్ మున్వార్ అలియాజ్ మున్న, కొండ సాయి మదన్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా చెన్నై, బెంగుళూరు, కేరళ, పుణేలలో కార్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు నుంచి 5కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్రెడ్డి, చైతన్నపురి సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అద్దెకు ఫ్యామిలీ థియేటర్ ! హైదరాబాద్లో న్యూ బిజినెస్ !
కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేసినప్పటి నుంచి ఇంటి బయట కాలు పెట్టాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వైరస్ భయంతో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తామంటే మనసు రావడం లేదు. చిన్న చిన్న సరదాలకు కూడా దూరం కావాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది సినిమాకి వెళ్లి ఏళ్లు నెలలు దాటిన కుటుంబాలు ఉన్నాయి. ఇలాంటి వారి కోసమే ప్రైవేటుగా సినిమా చూసేందుకు వీలుగా ఫ్యామిలీ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈ కొత్త రకం ఫ్యామిలీ థియేటర్ బిజినెస్ ఊపందుకుంటోంది. అద్దెకు థియేటర్ కరోనా తెర మీదకు వచ్చిన తర్వాత వెండి తెర మీద సినిమాలు చూడటం చాలా అరుదైన విషయంగా మారింది. వందల మందితో కలిసి సినిమా చూడాలంటే భయపడే కుటుంబాల సంఖ్య పెరిగింది. వినోదం కోసం ఓటీటీ ఫ్లాట్ఫామ్ అందుబాటులో ఉన్నా థియేటర్లో చూసిన ఫీల్ అయితే మిస్ అవుతున్నారు. ఇలాంటి వారి కోసం కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా అత్యాధునిక సౌకర్యాలతో థియేటర్ను స్టార్ ట్రాక్ గ్రూప్ హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. థియేటర్ను అద్దెకు తీసుకుని నచ్చిన సినిమాను చూసేయోచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిలో స్టార్ట్రాక్ గ్రూపు థియేటర్లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే వీలుంది. ఈ థియేటర్లో 142 ఇంచెస్ ఆధునిక స్క్రీన్, మెయిన్ స్ట్రీమ్ థియేటర్కి ఏ మాత్రం తీసిపోని ఆడియో సిస్టమ్తో పాటు రిక్లెయినర్ చైయిర్లు అందుబాటులో ఉన్నాయి. థియేటర్ ఇంటీరియర్ సైతం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. థియేటర్ అనుభూతిని అందివ్వడంలో ఈ ఫ్యామిలీ థియేటర్ మల్టీప్లెక్స్కి ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించారు. కంటెంట్ మనదే ఈ రెంటెండ్ థియేటర్లో ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఆహా, హాట్స్టార్ తదితర ఓటీటీ కంటెంట్లపై వచ్చే సినిమాలను సైతం ఇక్కడ చూసే వీలుంది. ఈ రోజుల్లో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ ఫీల్ కావాలనుకునే వారు ఈ రెంటెండ్ థియేటర్లో కరోనా భయాలు లేకుండా సినిమాలను ఆస్వాదించవచ్చు. రోజుకి మూడు షోలు ఈ ఫ్యామిలీ థియేటర్ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. మార్నింగ్ , ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ సమయాల్లో ఇందులో ఫ్యామిలీతో సినిమాను చూసేయోచ్చు. షో టైమింగ్, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ. 1500ల నుంచి గరిష్టంగా రూ.1900ల వరకు రెంట్ తీసుకుంటారు. ప్రతీ షో తర్వాత థియేటర్ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్ చేస్తున్నారు. ఈ గ్రూప్కి చెందిన వెబ్సైట్కి వెళ్లి ముందుగా షోని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్కి తగ్గట్టుగా హైదరాబాద్ నగరంలో ఒకప్పటి సంగీత్ థియేటర్ మొదలు ఆర్టీసీ క్రాస్రోడ్లో సంధ్య థియేటర్స్ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిజైన్ చేయడంలో స్టార్ ట్రాక్ గ్రూపుకి మంచి రికార్డు ఉంది. ఈ గ్రూపు ఓనర్లు మూడు తరాలు నగరంలో దాదాపు 300ల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బ్రిటీష్ జమానాలో ఇంజీనింగ్లో గోల్డ్ మెడల్ పొంది బీకే మూర్తితో ఈ పరంపర మొదలైంది. ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టుగా రూపొందిన ఫ్యామిలీ థియేటర్ సికింద్రాబాద్, సర్థార్పటేల్ రోడ్లోని పైగా హౌసింగ్ కాలనీలో ఉంది. చదవండి: కింగ్డమ్ ఆఫ్ కిడ్స్.. హైదరాబాద్లో కొత్త స్టూడియో -
వాటిని కొనాలంటే కష్టం.. అద్దెకే ఇష్టం!
సాక్షి, హైదరాబాద్:భాగ్యనగర మనసు దోచిన డబుల్ డెక్కర్ బస్సుపై ఆర్టీసీ దోబూచులాడుతోంది. ఈ బస్సులను ఎలా తీసుకురావాలో అంతుచిక్కక తటపటాయిస్తోంది. ఒక్కో బస్సు ఖరీదు ఏకంగా రూ.70 లక్షలుగా కంపెనీ నిర్ధారించటంతో అంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అలవాటైన అద్దె విధానాన్ని దీనికీ వర్తింపచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సొంతంగా బస్సులను కొనడం కంటే అద్దెప్రాతిపదికన తీసుకోవడం మేలని భావిస్తూ భారీగా అద్దె బస్సులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వేల అద్దె బస్సులు వినియోగిస్తున్న ఆర్టీసీ ఇటీవలే మరో 70 బస్సులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇదే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది. అశోక్ లేలాండ్ ద్వారానే.. నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. ఈ బస్సులతో నష్టాలు భారీగా వస్తుండటంతో ఆ తర్వాత వాటిని ఉపసంహరించు కుంది. కానీ ఇటీవల ఓ నగరవాసి ఆ బస్సులను గుర్తు చేస్తూ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ స్పందించి.. మళ్లీ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపితే బాగుంటుందని రీట్వీట్ చేస్తూ దాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ట్యాగ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన పువ్వాడ.. కొత్త బస్సుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రయోగా త్మకంగా 20 బస్సులు తీసుకోవాలని నిర్ణయించిన ఆర్టీసీ అప్పట్లో టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కంపెనీని ఎల్–1గా ఎంపిక చేసింది. అది ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు కోట్ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవటం, మామూలు బస్సుల అవసరం బాగా ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులు కొనేబదులు సాధారణ బస్సులకు ఆ నిధులు వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో అద్దెప్రాతిపదికన డబుల్ డెక్కర్ బస్సులు తీసుకోవాలని భావిస్తూ, ఆ బాధ్యతను అశోక్ లేలాండ్ కంపెనీకి అప్పగించాలని చూస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను అద్దె పద్ధతిలో డబుల్ డెక్కర్ బస్సులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. మధ్యేమార్గంగా.. ప్రస్తుత పరిస్థితిలో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ సరికాదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇటీవలే టీఎస్ఆర్టీసీతో పాటు ముంబైలో కూడా డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు పిలిచారు. వంద బస్సులు తీసుకోవాలనుకోగా, అశోక్ లేలాండ్ టెండరే ఖరారైంది. కానీ అక్కడ కూడా బస్సులు తీసుకునేందుకు తటపటాయిస్తూ తాజాగా టెండర్ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. ముంబైలోనే వద్దనుకున్నాక, తీవ్ర నష్టాల్లో ఉన్న తాము వీటిని ఎలా నిర్వహించగలమన్న యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. మధ్యేమార్గంగా అద్దె విధానాన్ని తెరపైకి తెస్తోంది. -
అమితాబ్ ఇంట్లో అద్దెకు దిగిన కృతి సనన్.. రెంట్ వింటే షాకవుతారు?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో అద్దెకు దిగింది పరమ్ సుందరీ కృతి సనన్. ముంబై సౌత్ అంధేరిలో ఇటీవల కొనుగోలు చేసిన డుప్లెక్స్ ప్లాటును అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు అమితాబ్. బిగ్ బి నిర్ణయం వెలువడటం ఆలస్యం అనేక మంది సెలబ్రిటీలు ఆ ఇల్లు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు కృతి సనన్కి దక్కింది. అద్దె ఎంత ? బిగ్ బి తన డూప్లెక్స్ ప్లాట్కి అద్దెగా నెలకు రూ. 10 లక్షలు రూపాయలు తీసుకుంటున్నారు. దీనికి సెక్యూరిటీ డిపాజిట్గా ఇప్పటికే కృతి సనన్ రూ. 60 లక్షలు చెల్లించింది. వీరి మధ్య కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 2021 అక్టోబరు 16 నుంచి 2023 అక్టోబరు 15 వరకు ఈ ఇల్లు కృతి సనన్ ఆధీనంలో ఉంటుంది. 27వ అంతస్తులో అంధేరిలోని లోకండ్వాలా రోడ్డులో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్లో 27, 28వ అంతస్థులో అమితాబ్ ఇల్లు ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 5,184 చదరపు అడుగులు. ఈ ఇంటిని 2020 డిసెంబరులో అమితాబ్ రూ. 31 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. 2021 ఏప్రిల్లో ఇంటిని ఆయన హాండోవర్ చేసుకున్నారు. అద్దెకు మరిన్ని బాలీవుడ్లో మొట్టమొదటి యాంగ్రీయంగ్ మ్యాన్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమితాబ్కి ముంబైలో అనేక ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో జూహూలో ఉన్న వత్స, అమ్ము అనే బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అద్దెకు ఇచ్చారు అమితాబ్. వీటి నుంచి నెలకు రూ. 18.90 లక్షల అద్దెను పొందుతున్నారు అమితాబ్. ఈ అగ్రిమెంట్ పదిహేనేళ్ల కాలానికి ఉంది. సన్ని లియోన్ కూడా వెస్ట్ అంధేరిలో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్స్లో నివసించేందుకు సెలబ్రిటీలు మక్కువ చూపుతున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన అట్లాంటిస్లో కేవలం 24 అపార్ట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో సెలబ్రిటీలకు కావాల్సినంత ‘స్పేస్’ లభిస్తుంది. అందువల్లే ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అట్లాంటిస్లో మరో బ్యూటీ సన్ని లియోన్ సైతం 12వ అంతస్థులో ఓ అపార్ట్మెంట్ని రూ. 16 కోట్లకు కొనుగోలు చేసింది. చదవండి: బ్రాండ్ కా బాప్.. అమితాబ్ -
రండి బాబు రండి.. సరికొత్త స్కీమ్తో ఆర్టీసీ ‘పెళ్లి సందడి’
సాక్షి,నిర్మల్: కోవిడ్ అనంతరం ఆర్టీసీ లాభాల బాట పడుతోంది. జిల్లాలోని నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు సీజన్ వారీగా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పిస్తూ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. పెళ్లిళ్లకు బస్సుల అద్దెపై ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. వివాహాలకు బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ రద్దు... పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సంస్థ టార్గెట్ పెట్టుకుంది. పెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్ను రద్దు చేసింది. గతంలో మొత్తం చార్జీలో 20శాతం అ డ్వాన్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డిపాజిట్ను రద్దు చేయడంతో ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చార్జీలు తక్కువే... జిల్లాలో రెండు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇస్తున్నారు. అప్ అండ్ డౌన్ కలిపి గరిష్టంగా 200కిలో మీటర్ల దూరం ఉంటే బస్సులు కేటాయిస్తారు. 200కిలో మీటర్ల లోపు ఉన్న బస్లకు ఒకటిన్నర టికెట్ చార్జీ చేస్తున్నారు. అలాగే 200కిలో మీటర్ల పైన ఉన్న పల్లె వెలుగులకు 10శాతం మాత్రమే అదనంగా చార్జ్ చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏక్స్ప్రెస్ బస్సులకు 240 కిమీ మీటర్లకంటే ఎక్కువగా ఉంటే అదనపు చార్జీలు తీసుకోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను వివాహాలకు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్నా బస్సులను కేటాయిస్తారు. కనీస చార్జీ రూ.11,934 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం.. జిల్లాలోని నిర్మల్ ఆర్టీసీ డిపోలో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 49 బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చారు. తద్వారా రూ.9,25,880 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల చార్జీలు తక్కువ కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణం కోరుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి గతంలో బస్సుల అద్దె కోసం అడ్వాన్స్ ఉండేవి. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు రద్దు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. పెళ్లిళ్ల కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి. – ఆంజనేయులు, డిపో మేనేజర్, నిర్మల్ చదవండి: డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి ! -
వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ‘పెళ్లి సందడి’కి ముస్తాబైంది. నష్టాల బాట వీడి లాభాల కోసం తహతహలాడుతున్న టీఎస్ఆర్టీసీ, అందివచ్చే ప్రతి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్ను బాగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. పెళ్లిళ్లకు బస్సులను అద్దెకిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో బస్సులను అద్దెకు తీసుకొమ్మంటూ ముమ్మర ప్రచారం చేస్తోంది. నవంబరు నుంచి కనీసం రోజుకు వంద బస్సులు అద్దెకిచ్చేలా టార్గెట్ పెట్టుకుంది. పెళ్లివారిని ఆకట్టుకునేందుకు గాను, సెక్యూరిటీ డిపాజిట్ను రద్దు చేసింది. మొత్తం చార్జీలో 20 శాతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్నీ రద్దు చేయటంతో ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు పెళ్లింటివారు మొగ్గుచూపుతున్నారు. ఆదివారం నుంచి ఈనెల 31 వరకు ఉన్న పెళ్లిళ్లకు ఇప్పటికే 225 బస్సులు బుక్ అయ్యాయి. అద్దెకు ఇలా.. అప్ అండ్ డౌన్ కలిపి గరిష్టంగా 200 కి.మీ. దూరం ఉంటే పికప్ అండ్ డ్రాప్ పద్ధతిలో బస్సులు కేటాయిస్తున్నారు. ఇందుకు కేవలం పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వెళ్లాల్సిన ప్రాంతానికి ఉన్న బస్సు చార్జీకి 50 శాతం అదనంగా వసూలు (అన్ని సీట్లకు) చేస్తారు. వెళ్లి రావడం, డ్రాప్ మాత్రమే చేసి రావటం, పికప్ చేసుకోవటం.. ఇలా మూడు పద్ధతులకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీ వసూలు చేస్తారు. (చదవండి: Banswada: ‘మానవత్వానికి మతం అడ్డుకాదు. చందన నా మూడో కూతురు’ ) 100 కి.మీ. దూరం దాటి వెళ్లాల్సి వస్తే.. పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం నిర్ధారిత గమ్యానికి ఉన్న బస్సు చార్జీపై 10 శాతం మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తారు. ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్లగ్జరీ, రాజధాని, గరుడ బస్సులకు మాత్రం ఆ దూరానికి ఉన్న బస్సు చార్జీకి సమాన మొత్తాన్నే (అన్ని సీట్లకు) వసూలు చేస్తారు. నిర్ధారిత సమయాన్ని మించి బస్సు ఉండాల్సి వస్తే, ప్రతి గంటకు (దూరంతో సంబంధం లేకుండా) రూ.300 చొప్పున, ఏసీ బస్సులకు రూ.400 చొప్పున వెయిటింగ్ రుసుము వసూలు చేస్తారు. ప్రైవేటు బస్సుల కంటే తక్కువ చార్జీ.. ఆయా ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఉండే టికెట్ చార్జీ ఆధారంగా ఈ పెళ్లి బస్సుల రుసుములను ఆర్టీసీ వసూలు చేస్తోంది. ఈ మొత్తం ప్రైవేటు బస్సుల చార్జీ కంటే తక్కువగా ఉంటోంది. డిమాండ్ అంతగా లేని సమయంలో ప్రైవేటు బస్సులు చార్జీ తగ్గించి ఇస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రైవేటు బస్సు చార్జీలు ఆర్టీసీ చార్జీలను మించి ఉంటున్నాయి. ఆర్టీసీ ఎప్పుడూ నిర్ధారిత మొత్తాన్ని మాత్రమే వసూలు చేస్తోంది. చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో -
బ్యాంక్ లాకర్.. కాదా బేఫికర్?
బ్యాంకు లాకర్లో విలువైన వాటిని ఉంచేస్తే.. ఎటువంటి భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించొచ్చని భావించడం పొరపాటే. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత కూడా పరిమితమే. సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఇచి్చన ఆదేశాల నేపథ్యంలో ఆర్బీఐ ఇటీవలే లాకర్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. లాకర్లో ఉంచిన వాటిని దోపిడీ లేదా దొంగతనం చేస్తే? లాకర్ కీ కనిపించకుండా పోతే? లాకర్ అద్దె చెల్లించకపోతే? ఇలా ఎన్నో ప్రశ్నలకు జవాబులను లాకర్ హోల్డర్లు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈ వివరాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది.. లాకర్ అంటే? ఇది ఒక ఖాతా వంటిది. విలువైన వస్తువులు.. ఆభరణాలు, డాక్యుమెంట్లను ఇందులో ఉంచు కోవచ్చు. రెండు కీలు(తాళం చెవులు) ఉంటాయి. అందులో ఒక టి బ్యాంకు దగ్గర, రెండోది లాకర్ దారుని వద్ద ఉంటాయి. ఏదో ఒక కీ సాయంతో లాకర్ను తెరవడం సాధ్యం కాదు. రెండు కీలు ఉంటేనే అది సాధ్యపడుతుంది. బ్యాంకు ఉద్యోగి తొలుత తన దగ్గరున్న కీతో లాకర్ రూమ్ను తెరుస్తారు. ఆ తర్వాత లాకర్హోల్డర్ తన దగ్గరున్న కీ సాయంతో లాకర్ను వినియోగించుకోవడం సాధ్యపడుతుంది. బ్యాంకులు భద్రతాపరంగా అధిక నాణ్యతతో కూడిన లాకర్లను వినియోగిస్తుంటాయి. అందుకే వీటిని సేఫ్ డిపాజిట్ లాకర్లుగా పిలుస్తుంటారు. ఎవరైనా అర్హులే.. మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో లాకర్ సదుపాయాన్ని పొందొచ్చు. ఆ బ్యాంకు శాఖలో ఖాతా లేకపోయినా ఫర్వాలేదు. గతంలో తమ ఖాతాదారులకే బ్యాంకులు ఈ సదుపాయం అందించేవి. కానీ, ఎవరికైనా ఈ సేవలు అందించాలని ఆర్బీఐ 2021 ఆగస్ట్ 18 నాటి ఆదేశాల్లో పేర్కొంది. ఒకవేళ లాకర్ ఖాళీగా లేకుంటే.. దరఖాస్తుదారులతో ఒక వేచి ఉండే జాబితాను నిర్వహిస్తూ.. ఖాళీ అయిన వాటిని వరుస క్రమంలో జాబితాలోని వారికి తప్పనిసరిగా కేటాయించాలి. చట్టవిరుద్ధమైనవి, ప్రమాదకరమైన వాటిని లాకర్లో ఉంచనంటూ ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు లాకర్ అగ్రిమెంట్పై సంతకం చేయాలి. బాధ్యతలు, హక్కుల వివరాలు ఇందులో ఉంటాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయి. నూతన లాకర్ ఒప్పందంపై ప్రస్తుత లాకర్ హోల్డర్లు సైతం 2023 జనవరి 1 నాటికి సంతకం చేయాల్సి ఉంటుంది. అద్దె బ్యాంకులు లాకర్ అద్దెను వార్షికంగా ఒక సారి వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, లాకర్ కోసం డిపాజిట్ కూడా చేయాలని కోరుతుంటాయి. ఎందుకంటే లాకర్ అద్దె చెల్లించకపోతే.. డిపాజిట్ నుంచి మినహాయించుకునేందుకు అలా చేస్తాయి. మూడేళ్ల కాలానికి లాకర్ అద్దెతోపాటు, లాకర్ను తెరవాల్సి వస్తే అయ్యే చార్జీలను కలిపి ఆ మేరకు డిపాజిట్గా తీసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అధికారం కలి్పంచింది. ఇంతకుమించి డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరడానికి వీల్లేదు. అలాగే, లాకర్ కోసం డిపాజిట్ అన్నది తప్పనిసరి కాదు. బ్యాంకులో అప్పటికే కొన్నేళ్లుగా ఖాతా నిర్వహిస్తున్నట్టయితే మీ చరిత్ర ఆధారంగా బ్యాంకులు డిపాజిట్ నుంచి మినహాయింపును ఇవ్వొచ్చు. లాకర్ను స్వా«దీనం చేసేస్తే తిరిగి ఈ డిపాజిట్ను వెనక్కి పొందొచ్చు. ఇంటికి లేదా కార్యాలయానికి సమీపంలోని బ్యాంకు శాఖలో సౌకర్యం కోసం లాకర్ను తెరిచిన తర్వాత.. అనూహ్య కారణాలతో ఆయా బ్యాంకు శాఖను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచి్చనా.. లేదా వేరే బ్యాంకుతో విలీనం అయిన సందర్భాల్లో లాకర్ హోల్డర్లకు రెండు నెలల వ్యవధిని బ్యాంకులు ఇస్తాయి. లాకర్ను బ్యాంకుతోపాటే మార్చుకోవచ్చు. లేదా మూసేయవచ్చు. అద్దె చెల్లించకపోతే? వరుసగా మూడు సంవత్సరాల పాటు లాకర్ అద్దె చెల్లించకపోతే.. ఆయా లాకర్లను బలవంతంగా తెరిచేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. కాకపోతే దీనికంటే ముందు బ్యాంకు తన ఖాతాదారుకు ఇదే విషయమై సమాచారం (నోటీస్) కూడా ఇస్తాయి. ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సందేశం ఇస్తాయి. నోటీసును స్వీకరించకుండా, మెయిల్, ఎస్ఎంఎస్కు స్పందన రాకపోతే.. అప్పుడు దినపత్రికల్లో పబ్లిక్ నోటీస్ జారీ చేస్తాయి. తగినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ ఎవరి నుంచి స్పందన రాకపోతే.. బ్యాంకు అధికారి, ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్ను తెరుస్తారు. ఈ ప్రక్రియను వీడియో కూడా తీస్తాయి. భవిష్యత్తులో కోర్టుల్లో కేసులు నమోదైతే వీటిని సాక్ష్యాలుగా బ్యాంకు సమరి్పస్తుంది. నగదు సహా లాకర్లో ఉన్న వాటిని సీల్ చేసి భద్రంగా ఉంచుతాయి. నిర్వహణ ఖాతాదారులు లాకర్లను తెరిచి, చూసుకునే సమయంలో వారికంటూ గోప్యత ఉండేలా బ్యాంకులు చూడాలి. అంతేకాదు లాకర్ను వినియోగించుకున్న రోజు అందుకు సంబంధించి ఈ మెయిల్, ఎస్ఎంఎస్ అలర్ట్లను కూడా బ్యాంకులు ఇక మీదట తప్పకుండా పంపించాలి. తేదీ, సమయం వివరాలు అందులో ఉంటాయి. దీంతో ఒకవేళ తను కాకుండా, మరొకరు లాకర్ను యాక్సెస్ చేస్తే ఖాతాదారు అప్రమత్తం అయ్యేందుకే ఈ ఏర్పాటు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తెరిచే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఖాతాదారు ప్రమేయం లేకుండా లాకర్ యాక్సెస్ జరిగి ఉంటే.. అందుకు ఫిర్యాదుల పరిష్కార యంత్రంగా కూడా ఉంటుంది. లాకర్ దారులు వాటిని తెరిచి, మూసేసి వెళ్లిన తర్వాత బ్యాంకు కస్టోడియన్ ఆయా లాకర్లను విధిగా పరీక్షించాలి. ఏదైనా సందర్భంలో లాకర్ను తెరిచి, తిరిగి సరిగ్గా క్లోజ్ చేయకుండా వెళ్లి ఉంటే.. బ్యాంకు కస్టోడియన్ వాటిని క్లోజ్ చేయాలి. అదే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయడంతోపాటు.. ఖాతాదారుకు తెలియజేయాలి. లాకర్దారు మరణిస్తే..? లాకర్లకు సంబంధించి నామినేషన్, లాకర్ హోల్డర్ మరణానికి గురైతే.. లాకర్లలో ఉన్న వాటిని నామినీలకు అందించే విషయమైన ప్రతీ బ్యాంకు తగిన విధానాన్ని కలిగి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నామినీ సమరి్పంచినట్టయితే లాకర్లలో ఉన్నవాటిని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. నామినీ నమోదై లేకపోతే.. చట్టబద్ధమైన వారసులకు నిబంధనల మేరకు అందిస్తాయి. క్లెయిమ్తోపాటు అవసరమైన అన్ని పత్రాలు అందిన నాటి నుంచి 15 పనిదినాల్లో బ్యాంకులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. బ్రేక్ చేయొచ్చు.. ఖాతాదారు లాకర్ కీ పోయిందని అభ్యర్థన పెట్టుకున్నప్పుడు, లాకర్ జప్తునకు సంబంధించి కోర్టుల ఆదేశాలతో దర్యాప్తు అధికారులు బ్యాంకును సంప్రదించిన సందర్భాల్లోనూ లాకర్ను తెరుస్తారు. లాకర్దారు నిబంధనలను పాటించని సందర్భాల్లోనూ ఇదే చోటు చేసుకుం టుంది. లాకర్ల విషయంలో బ్యాంకుల బాధ్యత ప్రకృతి విపత్తుల వల్ల (భూకంపాలు, వరదలు తదితర) లాకర్లలోని వాటికి నష్టం కలిగితే బ్యాంకులు ఎటువంటి పరిహారాన్ని చెల్లించవు. ఖాతాదారుల నిర్లక్ష్యం వల్ల వాటిల్లే నష్టానికి సైతం చెల్లింపులు చేయవు. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కుప్పకూలిపోవడం, బ్యాంకు ఉద్యోగి మోసం వల్ల లాకర్లలోని వాటికి నష్టం వాటిల్లితే చెల్లింపుల బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. ఎందుకంటే చోరీలు, అగ్ని ప్రమాదాల నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మాత్రం తమకు సంబంధం లేదని బ్యాంకులు చెప్పడానికి లేదు. లాకర్కు వార్షికంగా వసూలు చేసే అద్దెకు గరిష్టంగా 100 రెట్ల పరిహారాన్ని బ్యాంకులు చెల్లించగలవు. ఉదాహరణకు లాకర్ అద్దె రూ.2,000 ఉందనుకుంటే రూ.2లక్షలు పరిహారంగా లభిస్తుంది. ఎందుకంటే లాకర్లలో ఏవి ఉంచుతున్నారు, తిరిగి ఏవి తీసుకెళుతున్నారు? ఇటువంటి వివరాలను బ్యాంకులు నమోదు చేయవు. ఖాతాదారుల గోప్యతకు భంగం కలగకుండా చూడడంలో భాగంగా ఈ పనికి దూరంగా ఉంటాయి. అటువంటప్పుడు ఫలానావి పోయాయని నిర్ధారించడానికి అవకాశం ఉండదు. కనుక లాకర్ అద్దెకు 100 రెట్లకే పరిహారాన్ని పరిమితం చేసింది ఆర్బీఐ. లాకర్లకు సంబంధించి బ్యాంకులు బీమా కవరేజీని కూడా అందించడం లేదు. లాకర్లలో భద్రత? బ్యాంకు లాకర్లను ఏర్పాటు చేసిన చోట తగినంత భద్రతా చర్యలు తీసుకోవడం బాధ్యతల్లో భాగమే. లాకర్ గది/వాల్ట్కు ఒక్కటే ప్రవేశం, వెలుపలి ద్వారం ఉండాలి. వర్షాలు, వరదలు వచి్చనాకానీ లాకర్లు దెబ్బతినకుండా చూడాలి. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని విధంగా.. ఆ రిస్క్ను తగ్గించే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. ఈ ప్రమాదాల రిస్్కను తగ్గించేందుకు బ్యాంకు ఉద్యోగులు నిపుణులతో కలసి ఇంజనీరింగ్/భద్రతా పరిస్థితులను సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు లాకర్లకు ఎప్పుడూ కూడా తగినంత రక్షణ కూడా ఏర్పాటు చేయాలి. లాకర్ ఆవరణలోకి వెళ్లి, వచ్చే వారిని కవర్ చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. 180 రోజుల సీసీటీవీ కెమెరా రికార్డులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. తన లాకర్ను తన ప్రమేయం లేకుండా ఓపెన్ చేశారని, లాకర్లో ఉంచినవి కనిపించడం లేదని ఖాతాదారు ఫిర్యాదు చేసిన సందర్భంలో దర్యాప్తునకు ఈ సీసీటీవీ కెమెరా రికార్డులు ఆధారంగా పనిచేస్తాయి. బ్యాంకులు ఏర్పాటు చేసే మెకానికల్ లాకర్లు భారత ప్రమా ణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్గా తెరిచే లాకర్లకు పూర్తి సైబర్ భద్రత ఉండాలి. కీ కోల్పోతే..? బ్యాంకు ఇచ్చిన లాకర్ కీని ఎక్కడైన పోగొట్టుకున్నట్టు అయితే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. కనిపించకుండా పోయిన కీ తిరిగి భవిష్యత్తులో ఎప్పుడైనా లభిస్తే బ్యాంకుకు స్వాధీనం చేస్తానంటూ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్ను బద్దలు కొట్టడం, తిరిగి కొత్త కీ ఏర్పాటు చేసేందుకు అయ్యే చార్జీలన్నింటినీ ఖాతాదారే భరించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను అంతా ఖాతాదారు సమక్షంలోనే బ్యాంకులు టెక్నీషియన్లతో నిర్వహిస్తాయి. ఎందుకంటే లాకర్లో ఉన్న వాటికి నష్టం వాటిల్లలేదన్న భరోసా ఖాతాదారుకు ఉండాలి కనుక. -
అద్దె రూపంలో భారీగా సంపాదిస్తున్న బచ్చన్ కుటుంబం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని జుహులో గల వారి వత్స, అమ్ము అనే రెండు బంగ్లా గ్రౌండ్ ఫ్లోర్ ను నెలకు రూ.18.9 లక్షల అద్దెతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాలుకు లీజుకు ఇచ్చినట్లు Zapkey.com పేర్కొంది. ఈ లీజు ఒప్పందాన్ని సెప్టెంబర్ 28, 2021న చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బంగ్లాలు ప్రస్తుతం బచ్చన్ కుటుంబం నివసిస్తున్న పక్కనే ఉన్నాయి. ఎస్బిఐ అద్దెకు తీసుకున్న ఈ ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు Zapkey పేర్కొంటుంది. అద్దె & డిపాజిట్ డాక్యుమెంట్ ప్రకారం, రెండు బంగ్లాలను నెలకు రూ.18.9 లక్షల అద్దెకు ఇచ్చారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచుకునే విధంగా ఒక నిబంధన కూడా చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత అద్దె రూ.23.6 లక్షలు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలుగా అద్దె ఉంటుందని డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి. 12 నెలల అద్దెకు సమానమైన రూ.2.26 కోట్ల డిపాజిట్ ను ఇప్పటికే బ్యాంకు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎస్బిఐ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ స్పందించలేదు. ఈ ప్రాంగణాన్ని ఇంతకు ముందు సిటీ బ్యాంక్కు లీజుకు ఇచ్చినట్లు బ్రోకర్లు తెలిపారు.(చదవండి: చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్) హెచ్ఎన్ఐ ప్రాంతం ఖాతాదారులకు సేవలందించే అనేక బ్యాంకులు హెచ్ఎన్ఐ ప్రాంతంలో ఉన్నాయని స్థానిక బ్రోకర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులు, వ్యాపార టైకూన్లు నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలో వాణిజ్య అద్దె చదరపు అడుగుకు రూ.450 నుంచి చదరపు అడుగుకు రూ.650 మధ్య ఉంటుంది. స్వతంత్ర బంగ్లాలు కొనాలంటే రూ.100 నుంచి 200 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది మేలో అమితాబ్ బచ్చన్ ముంబైలో టైర్-2 బిల్డర్ క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసిన అట్లాంటిస్ అనే ప్రాజెక్టులో రూ.31 కోట్ల విలువైన 5,184 చదరపు అడుగుల గల ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 2020లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.(చదవండి: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్) -
ఆయనో స్టార్ డైరెక్టర్.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..
సినిమా ఇండస్ట్రీలో కథలు రాయడం, సినిమా రిలీజ్ సహా చాలా అంశాలు సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఈ క్రమంలో పంజాగుట్టలోని సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉండే ఓ చిన్న గదిలో అద్దెకు ఉండేవారు. నటుడు సునీల్, డైరెక్టర్ దశరథ్లతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కిడి నుంచే త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు కథలు అందించారు. స్వయంవరం, సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు ఆ ఇంట్లోనే ఉంటూ త్రివిక్రమ్ మాటలు అందించారు. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. అయినా తనకు మొదట ఆశ్రయం ఇచ్చిన ఆ అద్దె ఇల్లు అంటే త్రివిక్రమ్కు ఎంతో మమకారమట. అందుకే ఆ ఇంటిని వదులుకోలేక ప్రతి నెల ఐదు వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెంటిమెంట్గా ఇప్పటికీ కొన్ని సినిమాలకు అక్కడి నుంచే కథలు, మాటలు రాస్తారట. ప్రస్తుతం త్రివిక్రమ్కు సొంతంగా ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్నా నేటికీ ఆ అద్దె ఇంటిని సెంటిమెంట్గా భావించి అప్పుడప్పుడు అక్కడికి వస్తారని సమాచారం. చదవండి : కృష్ణాష్టమి: 'రాధే శ్యామ్' సర్ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ 'మహమ్మద్ ఖయ్యుమ్'గా సునీల్.. -
ఆఫీస్ కోసం టాయిలెట్ అద్దెకు ఇవ్వబడును.. వారానికి అద్దె..
గ్లాస్గో : ఖాళీగా పడుందని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ! ఏకంగా టాయిలెట్నే అద్దెకు ఇవ్వడానికి చూశాడో వ్యక్తి. అది కూడా ఆఫీసు కోసం. వివరాలు.. స్కాట్లాండ్, గ్లాస్గోలోని పాట్రిక్కు చెందిన ఓ వ్యక్తి గమ్ట్రీ అనే ప్రాపర్టీ సైట్లో కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్మెంట్ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టాయిలెట్ను అద్దెకు ఇస్తున్నానని.. వైఫై, రిఫ్రిజిరేటర్, టీ కెటిల్, బల్ల, కుర్చీ ఇలా కొన్ని రకాల వసతులు అందులో ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించాడు. ఓ వ్యక్తి ఆఫీసు నిర్వహించుకోవటానికి బాగుంటుందని పేర్కొన్నాడు. ఆ టాయిలెట్ వాడుకోవటానికి వారానికి 50 స్టెర్లింగ్ పౌండ్లు(5,070 రూపాయలు) చెల్లించాలని తెలిపాడు. తాను సోమవారం-శుక్రవారం.. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటానని, ఎక్కువ కాలానికి అద్దెకు తీసుకునే వాళ్లకు తాళం చెవులు కూడా ఇస్తానన్నాడు. ఈ ప్రకటనను చదివిన నెటిజన్లు సదరు వ్యక్తిపై సీరియస్ అయ్యారు. టాయిలెట్ను అద్దెకివ్వటమేంటి.. దానికి 50 స్టెర్లింగ్ పౌండ్ల అద్దేంటని మండిపడ్డారు. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి తన పోస్ట్ను డిలేట్ చేసేశాడు. చదవండి : ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో.. ఛీ అది కలిపావేంట్రా -
అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసిన యజమాని..
భైంసాలోని ఓవైసీ నగర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రానికి రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని శనివారం ఇలా ఇంటికి తాళం వేశాడు. సరుకులన్నీ బయటపెట్టడంతో అంగన్వాడీ టీచర్ లబ్ధిదారులకు ఆరుబయటే టీహెచ్ఆర్ పంపిణీ చేసింది. విషయం తెలుసుకున్న సీడీపీవో నాగలక్ష్మి, సూపర్వైజర్ రాజశ్రీ అక్కడికి చేరుకుని యజమానికి సర్దిచెప్పడంతో మళ్లీ తాళం తీశాడు.. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లాలోని పలు ప్రాజెక్టుల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలలో ఇదే పరిస్థితి. సకాలంలో అద్దె బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. భైంసాటౌన్(నిర్మల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తిప్పలు త ప్పడం లేదు. అద్దె భవనాలకు నెలనెలా బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. యజమానులు ప్రతినెలా కిరాయి చెల్లించాలంటున్నారని, అయితే తమకు ఏడాదికోసారి కూడా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. రూ.21.40లక్షల వరకు పెండింగ్లో.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో భైంసారూరల్, అర్బన్, కుభీర్, కుంటాల మండలాలు ఉండగా, వీటి పరిధిలో 205 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సంబంధించి ఆగస్టు 2020 నుంచి బిల్లులు రావాల్సి ఉంది. దాదాపు రూ.21.40 లక్షల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు సొంతంగా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. డబ్బులు సర్దుకాని సందర్భాల్లో కొన్నిచోట్ల యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. పట్టణంలోని ఓవైసీనగర్లో అద్దె భవనంలో ఉన్న సెంటర్ అద్దె చెల్లించకపోవడంతో యజమానికి తాళం వేసి, సరుకులన్నీ బయటపె ట్టాడు. దీంతో సూపర్వైజర్లు వచ్చి సర్దిచెప్పాల్సిన పరిస్థితి. గతంలో సైతం పులేనగర్లోని అంగన్వాడీ కేంద్రానికి సైతం అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. సొంత భవనాలుంటే... జిల్లావ్యాప్తంగా 363 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 3వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వర కు వీటికి అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఈ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని టీచర్లు చెబు తున్నారు. అయితే ఏటా రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం, సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెలనెలా చెల్లించాలి.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు ఏడాదికిపైగా బిల్లులు రావాల్సి ఉంది. మేం మాత్రం నెలనెలా చెల్లించాల్సి వస్తుంది. కేవలం రెండునెలల కిరాయి చెల్లించకపోవడంతో యజ మాని తాళం వేశాడు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు మంజూరు చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. – జయశ్రీ, అంగన్వాడీ టీచర్, భైంసా బిల్లులు పంపించాం.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల అద్దెలకు సంబంధించి బిల్లులు పంపించాం. ఆగస్టు 2020 నుంచి చెల్లించాల్సి ఉంది. యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. బడ్జెట్ కేటాయించగానే బిల్లులు చెల్లిస్తాం. – నాగలక్ష్మి, ఇన్చార్జి సీడీపీవో, భైంసా -
‘ఫర్నిచర్ స్టోరేజ్’కు కలిసొచ్చిన కరోనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనివాస్ ఐటీ ఉద్యోగి. హైదరాబాద్లో ఫ్యామిలీతో కలిసి అద్దెకుంటున్నాడు. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ ఆఫర్ ఇచ్చింది. పరిస్థితులు మాములుగా మారితే మళ్లీ రావొచ్చులే అనుకొని సొంతూరుకు వెళ్లిపోయాడు. ఏడాదిన్నర దాటినా సేమ్ సీన్. నగరంలో అద్దె భారం భరించలేక.. ఇంట్లోని ఫర్నిచర్ను తక్కువ అద్దె వసూలు చేసే స్టోరేజ్ గోడౌన్కు షిప్ట్ చేశాడు. హైటెక్సిటీలోని ఓ కంపెనీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలు అప్పగించింది. మరి, ఆఫీసులోని ఏసీలు, ఫ్యాన్లు, ఇతరత్రా ఫర్నిచర్ను అలాగే వదిలేస్తే నిర్వహణ భారమవుతుందని, స్టాఫ్ లేని ఆఫీసుకి అద్దె చెల్లించడం అనవసరమని ఫర్నిచర్ మొత్తాన్ని స్టోరేజ్ గోడౌన్కు తరలించింది.. ఇలా కరోనా నేపథ్యంలో ఫర్నిచర్ స్టోరేజ్ కంపెనీలకు గిరాకీ పెరిగింది. ఇల్లు, ఆఫీసుల్లోని ఫర్నిచర్ కోసం ప్రతినెలా వేల రూపాయల అద్దెను చెల్లించడం భారమైన ఉద్యోగులు, కంపెనీలకు ఫర్నిచర్ స్టోరేజ్ గోడౌన్ సర్వీసులు యూజ్ఫుల్గా మారాయి. అద్దెలో సగం కంటే తక్కువ ఖర్చుకే స్టోరేజీ, బీమా, భద్రత సేవలను అందిస్తున్నాయి. డిమాండ్ పెరిగింది.. ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్లు కొత్తమీ కాదు. గతంలో వినియోగదారులు, బిజినెస్ టూరిస్ట్లు హోమ్ రెనోవేషన్ లేదా కంపెనీలు రీలొకేషన్ సమయంలో ఫర్నిచర్ స్టోరేజ్ సర్వీస్లను వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు కరోనా, లాక్డౌన్తో సొంతూర్లకు వెళ్లినవారు రెండేళ్లయినా తిరిగిరాని పరిస్థితి. ఇక్కడ ఉన్నా లేకున్నా ఇంటి అద్దెలు చెల్లించాల్సిందే. చాలామంది రెంట్ భారం తగ్గించుకునేందుకు ఇళ్లను ఖాళీ చేసి సామాన్లను వేర్హౌస్లో పెడుతున్నారు. వస్తువులను బట్టి ధరలు ఉండటం, కాలపరిమితి లేకపోవటం, బీమా, భద్రత ఏర్పాట్లు ఉండటంతో డిమాండ్ ఏర్పడింది. కరోనా కంటే ముందు ఈ రంగం వృద్ధి ఏటా 20–30 శాతంగా ఉండేది.. ప్రస్తుతం 50–60 శాతంగా ఉంది. వస్తువులను బట్టి చార్జీలు.. స్టోనెస్ట్, సేఫ్స్టోరేజ్, స్టోర్గనైజ్ వంటి వందలాది కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సేవలను అందిస్తున్నాయి. శివారు ప్రాంతాలలో వేర్హౌస్లను ఏర్పాటు చేసి ఫర్నిచర్ను భద్రపరుస్తున్నాయి. స్టోనెస్ట్కు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే నాలుగు నగరాలలో కలిపి 5 లక్షల చదరపు అడుగు (చ.అ.)లలో, సేఫ్స్టోరేజ్కు 7.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో వేర్హౌస్లున్నాయి. 4 నగరాల్లో స్టోనెస్ట్కు 1000 కంపెనీలు, 10 వేల మంది కస్టమర్లున్నారు. సేఫ్స్టోరేజ్కు 300 కంపెనీలు, 12 వేల మంది యూజర్లున్నారు. వస్తువుల సైజ్ను బట్టి స్టోరేజీ ధరలుంటాయి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఏసీ, టీవీ, బెడ్, పరుపు, కప్బోర్డ్స్, అల్మారా, సోఫా, డైనింగ్ టేబుల్ వంటి పెద్ద సైజు ఫర్నిచర్లకు ఒక్కో దానికి నెలకు రూ.130, కుర్చీలు, వాటర్ప్యూరిఫయ్యర్, ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్లు వంటి మిడియం సైజ్ అప్లియెన్సెస్కు రూ.70, పాదరక్షలు, బట్టలు, బెడ్షీట్లు, గ్యాస్ స్టవ్, సీలింగ్ ఫ్యాన్లు, కుక్కర్, మైక్రోవేవ్ వంటి స్మాల్ అప్లియెన్సెస్కు రూ.35 చార్జీలుంటాయి. కంపెనీలకు చ.అ.లను బట్టి ధరలుంటాయి. నెలకు 300 చ.అ.లకు రూ.21 వేలు, 450 చ.అ.లకు రూ.28 వేలుగా ఉన్నాయి. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్లతో భద్రత.. ప్యాకింగ్, మూవింగ్, స్టోరేజ్ అంతా కంపెనీలే చూసుకుంటాయి. ఆర్డర్ రాగానే స్టోరేజ్ కంపెనీకి చెందిన బృందం కస్టమర్ల ఇంటికి వెళ్తుంది. కస్టమర్ రాలేకపోతే బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా కానీ షిఫ్టింగ్ టైమ్లో ఉండాలని చెప్తారు. ఎవరూ లేకపోతే కస్టమర్కు వీడియో కాల్ చేసి వారి చెప్పిన వస్తువులను ప్యాకింగ్ చేసి గోడౌన్కు తరలిస్తారు. అక్కడ కస్టమర్ పేరు రాసి సామన్లను భద్రపరుస్తారు. సీసీటీవీ కంట్రోల్లో ఉంచడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటారు. వస్తువులకు డ్యామేజీ జరిగితే రూ.3–5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. నెలకొకసారి పెస్ట్ కంట్రోల్ చేయడం, ఫర్నిచర్ ఫొటోలు, వీడియోలు తీసి కస్టమర్లకు పంపుతారు. కంపెనీల ల్యాప్ట్యాప్లు, డాక్యుమెంట్ల వంటి వాటిని ప్రత్యేకమైన గదులలో పెట్టి వాటికి బార్కోడ్ ట్రాకింగ్, బయోమెట్రిక్ సిస్టమ్తో యాక్సిస్ను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్లో రోజుకు 60–70 ఆర్డర్లు.. స్టోనెస్ట్కు కొంపల్లిలో 60 వేల చ.అ.లలో రెండు గిడ్డంగులున్నాయి. 2,500 మంది వ్యక్తిగత కస్టమర్లున్నారు. క్లౌడ్ఎరా, జెన్డెస్క్ వంటి 150 కంపెనీలు ఫర్నిచర్, ల్యాప్ట్యాప్స్ ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను నిల్వ చేసుకున్నాయని స్టోనెస్ట్ స్టోరేజ్ మార్కెటింగ్ హెడ్ రాహుల్ తెలిపారు. ప్రీ–కోవిడ్ సమయంలో 4 నగరాల్లో నెలకు 300–400 కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 800–1000 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో 150–200ల బుక్సింగ్ అవుతున్నాయి. హైదరాబాద్లో రోజుకు 60–70 ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఫర్నిచర్కు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఢిల్లీ, కోల్కత్తా నగరాలలో సేవలను ప్రారంభించనున్నాం. మార్కెట్ ట్రెండ్స్ను బట్టి ఆంధ్రప్రదేశ్లో సేవలను విస్తరిస్తామని తెలిపారు. -
మెట్రో రైల్ కోచ్లు అద్దెకు..
జైపూర్: కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయిపోయాయి. ఇందుకు అది ఇది అన్న మినహాయింపేమీ లేదు. దీంతో ఆర్థికంగా కోలుకునేందుకు ఆయా రంగాలు వినూత్న ఆఫర్లను తెరపైకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని జైపూర్ మెట్రో రైల్ అధికారులు సైతం ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు తమదైన శైలిలో సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చారు. తమ మెట్రో స్టేషన్లలో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని ప్రకటనలు వేసుకునేందుకు వారు అవకాశం కల్పించారు. తాజాగా బర్త్ డే, ఇతరత్రా వేడుకల కోసం మెట్రో రైల్ కోచ్లను అద్దెకు తీసుకోవచ్చని వారు ప్రకటించారు. గంటల ప్రకారం వీటిని అద్దెకు తీసుకోవచ్చని, అద్దెకు తీసుకొనే వారు గంటకు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయం మించితే, గంటకు అదనంగా రూ. 1000 ఛార్జీ వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో జైపూర్ మెట్రో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. -
నెలకు ఈ ఇంటి అద్దెంతో తెలుసా!
హాంగ్కాంగ్: సాధారణంగా ఓ ఇంటి అద్దె వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ దక్షిణ చైనాలో హాంగ్కాంగ్లోని ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే అందరూ కళ్లు తేలేయాల్సిందే. నెలకు ఈ ఇంటి అద్దె 1.26 కోట్ల రూపాయలు. ఇది వింటే ఇది అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అందరికి డౌట్ రావోచ్చు. కానీ ఇది అక్షరాల అద్దె. ఎందుకంటే అదే రేంజ్లో ఈ ఇంటిలో స్టార్ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయట. చూడటానికి ప్యాలేస్ను తలపిస్తున్న ఈ ఇళ్లు మొత్తం 10, 804 అడుగుల విస్తిర్ణంలో... విలాసవంతమైన గదులు, రకారకాల పూలతో కూడిన తోటతో నిర్మించారట. ఇక లోపల ఓ ప్రైవేటు గ్యారేజ్, అధునాతమైన సాంకేతికతతో తయారు చేయించిన లిఫ్టులు ఉన్నాయట. ఇక ఈ భవనం నుంచి బయటకు చూస్తే విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఈ ఇంటికి హాంగ్కాంగ్లో అన్నిటికంటే అధిక రెంటు ఉన్నట్లు నైట్ ప్రాంక్ ఎల్ఎల్పీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ థామస్ లామ్ పేర్కొన్నారు. హాంగ్కాంగ్లో గృహల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తక్కువ ఉండటం వల్ల అక్కడి శ్రీమంతులు ఈ ఇంట్లో రెంటుకు ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత -
పాపం సోము వీర్రాజు.. అడ్డంగా బుక్కయ్యాడు
సాక్షి, కృష్ణాజిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై విమర్శలు చేసి తానే అభాసు పాలయ్యారు. వీర్రాజుకాండ్రపాడు గ్రామంలో గురువారం బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. బీజేపీ కార్యాలయానికి ఇల్లు అద్దెకు ఇచ్చినందుకు ఆ ఇంటి యజమాని పెన్షన్ తొలగించారంటూ ఆరోపించారు. అయితే సోము వీర్రాజు ఆరోపణలో నిజం లేదని ఇంటి యజమాని రాయల బుల్లి తెలిపారు. ‘‘నెల రోజుల కోసమని ఇళ్ళు తీసుకొని ఎనిమిది నెలలైనా బీజేపీ నేతలు ఖాళీ చేయలేదు. నాకు ఇబ్బందిగా ఉంది ఖాళీ చేయమని చెప్పాను. దాంతో రాజకీయ స్వలాభం కోసం నా పెన్షన్కు ముడిపెట్టి ఆరోపణలు చేయటం బాధాకరం’’ అని రాయల బుల్లి ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఏం సాధించారని రథయాత్ర) -
సీఎం జగన్ ఆదేశంతో 108 కోట్లు మిగులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం 108 కోట్ల రూపాయలు ఆదా చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో మద్యం షాపులు రెంట్కు తీసుకున్నామని, ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఆయన మద్యం షాపులపై రివర్స్ టెండరింగ్ వేయాలని ఆదేశించారన్నారు. సీఎం జగన్ ఆదేశం మేరకు మద్యం దుకాణాలపై రివర్స్ టెండరింగ్ వేశామన్నారు. (చదవండి: డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు) ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బెల్టు షాపుల రెంట్పై దాదాపు 108 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలాయని వెల్లడించారు. 2019-20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించామని చెప్పారు. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21 ఏడాది కేవలం 562.2 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని తెలిపారు. అంటే దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామన్నారు. అంతేగాక మద్యపానం తగ్గించడం వల్ల రాష్ట్రంలో నేరాలు ప్రమాదాలు బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు) -
ఈ రాజభవనం అద్దె ఎంతంటే......
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘మాంటెసిటో మాన్షన్’ను గంటల ప్రాతిపదికన అద్దెకిస్తున్నట్లు రెంటల్ వెబ్సైట్ గిగ్స్టార్లో ఓ ప్రకటన వెలువడింది. 5.4 ఎకరాల విస్తీర్ణంలో 14,563 చదరపు అడుగుల్లో ఇటాలియన్ శైలిలో నిర్మించిన ఈ భవనాన్ని ‘ది చేత్యూ’ అని కూడా పిలుస్తారు. పాటలు, వీడియోలు, సినిమా షూటింగ్లతోపాటు మ్యూజియం కోసం దీన్ని అద్దెకు ఇస్తారని, గంటకు ఏడు వందల డాలర్లు (దాదాపు 51,500 రూపాయలు) చొప్పున కనీసం పది గంటలకు ఇస్తారు. లాస్ ఏంజెలిస్ నగరానికి దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో కలిగిన ఈ భవనం ఆవరణలో ఈత కొలను, టెన్నీస్ కోర్టు, టీ హౌజ్, చిల్డ్రన్ కాటేజీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనంలోనే ఓ గది నిండా వైన్ బాటిళ్లు ఉన్నప్పటికీ, వాటిని ఎవరూ తాకరాదు. బయటి నుంచి తీసుకొచ్చిన మద్యాన్ని కూడా ఈ భవనం లోపల తాగరాదు. చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడరాదు. ఎడల్ట్ వీడియో షూటింగ్లను కూడా అనుమతించరు. ఇంతకు ఈ భవనం యజమానులు ఎవరంటే బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ దంపతులు. 2003లో నిర్మించిన భవనాన్ని అమెరికా వచ్చినప్పుడు ఉండేందుకు హారీ దంపతులు 14,7 మిలియన్ డాలర్లు (దాదాపు 108 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారట. -
అద్దెకట్టలేదని కాల్పులు
బెంగళూరు: అద్దెకట్టకపోతే ఇంటి యజమాని ఏం చేస్తాడు.. ఇళ్లు ఖాళీ చేయమని బెదిరిస్తాడు. అప్పటికి కట్టకపోతే ఇంట్లోని సామాను తీసి బయటపడేస్తాడు. కానీ కర్ణాటకలోని ఓ ఇంటి యజమాని మాత్రం తుపాకీతో బెదిరించాడు. అద్దెకట్టడం లేదనే కోపంతో.. వారిని బెదిరించడానికి ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఊహించని ఈ ఘటనకి కిరాయిదారు బెదిరిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బెల్గామ్ జిల్లాలోని చిక్కోడి ఏరియాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇంటి అద్దె అడిగిన యజమానికి కిరాయిదారుడు డబ్బులు లేవని సమాధానం ఇచ్చాడు. దాంతో రెచ్చిపోయిన ఆ ఇంటి ఓనర్ తన జేబులోని రివాల్వర్ తీసి గాల్లోకి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిమాణంతో వణికిపోయిన కిరాయిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంటి యజమానిని అరెస్ట్ చేశారు. #WATCH Karnataka: A landlord fired shots in the air after a tenant failed to pay rent, in Chikkodi area of Belgaum district yesterday. The person was later taken into custody by the police. pic.twitter.com/8dxXA8ifcI — ANI (@ANI) June 15, 2020 -
అద్దె కోసం దంపతుల్ని కాల్చిచంపాడు
లక్నో : అద్దె చెల్లించలేదన్న కోపంతో దంపతులను కాల్చి చంపాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని అజామ్ఘర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహిరౌలాకు చెందిన సంజీవ్.. కోత్వాలీ సిటీలో ఆటో విడి భాగాలు అమ్మే షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడే రాకేష్ రాయ్ అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా షాపు తెరవక పోవటంతో చేతిలో డబ్బులేక సంజయ్ ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంటి యజమాని రాయ్ అతడ్ని అద్దె ఇవ్వాలని అడిగాడు. అతడు డబ్బులు లేవని చెప్పటంతో గొడవకు దిగాడు. ( నా చావుకి భార్య 'జల'నే కారణం ) ఇద్దరి మధ్యా కొద్దిసేపు మాటల యుద్దం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన రాయ్ తుపాకితో విచక్షణా రహితంగా సంజయ్, అతడి భార్యపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగుల్లో పడిఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తీవ్రంగా గాయపడటం కారణంగా వారు చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ( నువ్వులేని లోకం నాకెందుకని..!) -
అద్దె చెల్లించమని ఒత్తిడి..యజమానులపై కేసు నమోదు
ఢిల్లీ : అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు కాలేజీకి దగ్గర్లో ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్దె కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తొమ్మిది మంది ఇంటి యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద ఇంటి యజమానులపై కేసు నమోదైంది. దీని ప్రకారం వారికి ఒక నెల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇక దక్షిణ ఢిల్లీ ప్రాంతం కోట్ల ముబారక్పూర్లో అద్దె చెల్లించని కారణంగా విద్యుత్ కనెక్షన్లను తీసేశారు ఇంటి యజమాని. దీంతో పోలీసులను బాధితుడు ఆశ్రయించగా..ఇరు వర్గాల మధ్య పరిష్కారం కుదరడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. వలస కార్మికుల నుంచి ఒక నెల అద్దె వసూలు చేయవద్దని ఇంటి యజమానులను పోలీసులు ఒప్పించారు. అదే విధంగా విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ అద్దె వసూలు చెల్లించమని ఒత్తిడి చేయకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీసు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఇంటి అద్దెలు చెల్లించాలంటూ యజమానులు ఒత్తిడి చేయరాదంటూ ప్రభుత్వం విఙ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (కరోనా ఎఫెక్ట్ : ఇంటి కిరాయి మూడు నెలలు వాయిదా ) కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కిరాయిలు కట్టడం అంటే చాలా కష్టతరమైన విషయమని, దీంతో మూడు నెలలపాటు అద్దె వాయిదా వేసుకోవాలంటూ ప్రభుత్వం పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ఒత్తిడి చేసినా, ఇంటి నుంచి బయటకు పంపినా హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాల్సిందిగా సూచించింది. తదణుగుణంగా ఇంటి యజమానులపై జరిమానా విధించడంతో పాటు జైలు శిక్షను విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. (మూడు నెలలపాటు అద్దె వసూలు వాయిదా ) -
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు. లాక్డౌన్ పిటిషన్ తిరస్కరణ లాక్డౌన్లో ప్రభుత్వాధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం వంటి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఐపీసీ సెక్షన్ కింద నమోదై ఉంటే వాటిని కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 188 ప్రకారం ఏదైనా చర్య మానవ జీవితానికి హని కలిగిస్తే అతనికి రూ. 1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. దీన్ని జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. అసలు ఎఫ్ఐఆర్ ఉండకూడదని కోరుకుంటున్నారా అని సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయన్ను కోర్టు ప్రశ్నించింది. ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
వలస కార్మికులకు కేజ్రీవాల్ మరోసారి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళుతున్న విషయంపై కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసిందే. దీంతో వాటిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వలస కార్మికులను ఎక్కడికి వెళ్లవద్దని, ఉన్నచోటే ఆగిపొమ్మని ఢిల్లీ సర్కారు మరోసారి విజ్ఞప్తి చేసింది. మీకు సరైన వసతి సౌకర్యాలతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తామని, అవసరమైతే అద్దె చెల్లించేందుకు సిద్దమేనని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ వలస బాట పట్టిన కూలీలు ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి బాట పట్టి వారి కుటుంబీకులతోపాటు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. "చాలా రాష్ట్రాల్లో జనాలు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. వారికి చేతులు జోడించి అడుగుతున్నా.. ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఏం చెప్పారు. ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాలన్నారు. లాక్డౌన్ ముఖ్యోద్దేశం ఇదే. దీన్ని మనం పాటించకపోతే కరోనాతో పోరాడుతున్న మన దేశం ఓటమిని చవిచూడక తప్పదు. ఏ ఇద్దరికి కరోనా ఉన్నా అది అందరికీ వ్యాప్తిస్తుంది. దీనివల్ల ముందు నీకు ఆ వైరస్ సోకుతుంది. నువ్వు నీ గ్రామానికి వెళితే అక్కడ నీ గ్రామస్థులకు, అలా అది ఈ దేశమంతటా వ్యాపిస్తుంది. అప్పుడు దాన్ని నివారించడం మరింత కష్టతరమవుతుంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వలస కార్మికుల కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు స్కూళ్లను తాత్కాలిక వసతి సదుపాయాలుగా మార్చివేసే దిశగా అడుగులు వేస్తోంది. -
వక్ఫ్ కళ్లకు గంతలు..!
పాలమూరు పట్టణం నడిరోడ్డున... మహబూబ్నగర్–రాయచూర్ ప్రధాన రహదారిపై కోట్లాది రూపాయల విలువైన ‘వక్ఫ్’ కాంప్లెక్స్. అందులో 18 బ్లాకులు.. వాటి పరిధిలో అబ్బురపడే విధంగా మొత్తం 463 షాపులు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే బ్లాకులు..అక్కడి మార్కెట్ విలువ ప్రకారం నెలకు ఒక్కో షాపు కిరాయి రూ. 3వేల నుంచి రూ. 20వేలపైనే. సగటున రూ.5 వేల చొప్పున లెక్కేసుకున్నా ప్రతినెలా రూ.23.15లక్షలు ఉండాలి. కానీ అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆయా షాపుల నుంచి వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అందుతోన్న అద్దె కనిష్టంగా రూ.350. గరిష్టంగా రూ.10వేలు. ఇందులో సగటున రూ.3వేల చొప్పున లెక్కించినా.. ప్రతి నెల రూ. 13.89లక్షలు రావాలి. కానీ.. ప్రస్తుతం అందుతోంది కేవలం అక్షరాల రూ.4,43,308 మాత్రమే. మార్కెట్ విలువ ప్రకారం రావాల్సిన.. ప్రస్తుతం వసూలవుతున్న కిరాయిలను పరిశీలిస్తే ఆ కాంప్లెక్స్లో కొనసాగుతున్న అద్దె బాగోతం ఇట్టే తెలుస్తుంది. ప్రతి నెలా రూ.23.15లక్షల వరకు వసూలు కావాల్సిన అద్దె కేవలం రూ.4.43లక్షలు మాత్రమే ఎందుకు వసూలవుతుందో సమాధానం అధికారులే చెప్పాలి. వక్ఫ్ అధికారులు దుకాణాలపై నిర్ణయించిన అద్దెపై అనేక విమర్శలు వస్తున్నాయి. సాక్షి , మహబూబ్నగర్: పాలమూరు బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే కాంప్లెక్స్ను ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు గాలికొదిలేశారు. ఆ కాంప్లెక్స్లో అద్దె మాయాజాలంతో పాటు బినామీ బాగోతమూ వెలుగుచూసినా అటువైపు కన్నెత్తిచూడడం లేదు. అంతేకాదూ.. ఎనిమిది షాపులు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వెలువెత్తి, కాంప్లెక్స్కు చెందిన ఓ వ్యక్తిపై ఆరు నెలల క్రితమే పోలీసు కేసు నమోదైనా ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపాన పోలేదు. కాంప్లెక్స్లో జరుగుతోన్న అక్రమాల గురించి స్థానిక వక్ఫ్ ఇన్స్పెక్టర్ రాష్ట్ర శాఖకు నివేదించినా ఇంత వరకు ఎలాంటి అధికారుల తీరుపై పుర ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ నిబంధనల ప్రకారం.. లీజు పొందిన పదకొండు నెలల తర్వాత సదరు లీజుదారుడు మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అద్దె కూడా పదిశాతం పెంచాలి. అయితే ఈ నిబంధన కొన్నేళ్ల నుంచే అమలుకు నోచుకుంటోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంప్లెక్సేతర దుకాణాల అద్దె రూ.15వేల పైనే ఉండడం.. వక్ఫ్ కాంప్లెక్స్లో మాత్రం గరిష్టంగా రూ. 10వేలు కూడా దాటకపోవడం గమనార్హం. షాపు ఒకరిది.. నిర్వహణ మరొకరిది.. నిబంధనల ప్రకారం లీజుదారులెవరూ తమ దుకాణాలను సబ్ లీజుకు ఇవ్వకూడదు. అలా చేసిన వ్యక్తి లీజును రద్దు చేసే అధికారం వక్ఫ్ బోర్డు అధికారులకు ఉంది. కానీ స్థానిక కాంప్లెక్స్లో పలువురు తమ దుకాణాలను ఇతరులకు సబ్ లీజుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుమారు 300 దుకాణాలు సబ్ లీజుపై కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు లీజుదారులు దుకాణాల నిర్వహణ భారమైనందున తమ వ్యాపారంలో మరొకరిని కలుపుకున్నామని.. సబ్ లీజుకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి లీజుదారులు తమ పేరిట మంజూరైన దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి వారి నుంచి ప్రతి నెల రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అదే వక్ఫ్బోర్డుకు మాత్రం తాము వసూలు చేసిన దాంట్లో 30శాతం మాత్రమే అద్దె రూపంలో చెల్లిస్తున్నట్లు స్థానిక వక్ఫ్ అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపితేనే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరచాటున విక్రయాలు? అటు వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరును అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి తన పేరిట మంజూరైన ఎనిమిది షాపులను ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక వక్ఫ్ ఇన్స్పెక్టర్ ముహమ్మద్ గౌస్ గతేడాది జనవరిలోనే సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ విచారణలో అడుగు ముందుకు పడలేదు. ఇంత జరిగినా రాష్ట్రస్థాయి అధికారులెవరూ ఈ అక్రమ వ్యవహారంపై విచారణ చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా జరుగుతోన్న అక్రమాల వెనక రాష్ట్రాధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క సీఎం కేసీఆర్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధికారులకు నివేదించాం మహబూబ్నగర్లోని వక్ఫ్ కమర్షియల్ కాంప్లెక్స్లో జరుగుతోన్న అక్రమ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై ఇది వరకే విచారణ చేపట్టాను. ఇందులో పలు అక్రమాలు వెలుగుచూశాయి. వాటికి సంబంధించిన నివేదికను రాష్ట్ర వక్ఫ్బోర్డు అధికారులకు పంపించాను. వక్ఫ్ ఆస్తులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం. లీజుదారులు కూడా తమ దుకాణాలను సబ్ లీజుకు ఇవ్వకూడదు. – ముహమ్మద్ గౌస్, వక్ఫ్ ఇన్స్పెక్టర్ -
అద్దెకు తీసుకుని తాకట్టు పెడతాడు
సాక్షి, సిటీబ్యూరో: తేలికపాటి వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను అద్దెకు తీసుకుంటానంటూ యజమానులను నమ్మించి, అనంతరం వాటిని తాకట్టుపెట్టి జల్సాలు చేస్తున్న కేసులో ఓ యువకుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ఓఎల్ఎక్స్ ఆధారంగా దందాలు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన దాలె దుర్గాప్రసాద్ తన కారును అద్దెకు ఇస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన మహబూబ్నగర్ జిల్లా, బాలానగర్కు చెందిన నానావత్ సంతోష్, అతడి బంధువు పథకం ప్రకారం రంగంలోకి దిగారు. దుర్గాప్రసాద్ను సంప్రదించిన వారు వాహనం అద్దెకు కావాలని చెప్పారు. నెలకు రూ.18 వేల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దుర్గాప్రసాద్కు తన ఆధార్ కార్డు కాపీ, రెండు ఖాళీ చెక్కులు, రూ.50 బాండ్ పేపర్పై ష్యూరిటీ ఇచ్చారు. అడ్వాన్స్గా రూ.5 వేలు చెల్లించిన నిందితులు వాహనం తీసుకువెళ్లారు. ఆపై మిగిలిన మొత్తం, నెల వారీ అద్దె చెల్లించడం మానేశారు. తనకు రావాల్సిన డబ్బు కోసం దుర్గాప్రసాద్ ఫోన్లు చేస్తే బెదిరించడం మొదలెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏటీఎం టీమ్ ఇన్స్పెక్టర్ పి.ఆంజనేయులు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన ఎస్సై పి.శ్రీనివాసులు తదితరులు నిందితుల్లో ఒకరైన సంతోష్ను గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు తేలికపాటి వాహనాలు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో మరో తొమ్మిది మందిని మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వాహనాలను నిందితులు తాకట్టు పెట్టి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. -
హోటల్ గది అద్దె చెల్లించాలన్నందుకు..
కాచిగూడ: ఫంక్షన్ చేసుకునేందుకు ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకుని బకాయి ఉన్న బిల్లు డబ్బులు చెల్లించాలని కోరినందుకు హోటల్ యాజమాన్యంపై దాడిచేసిన ఇద్దరు యువకులను నారాయణగూడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ ప్రాంతానికి చెందిన మచ్చ రోహన్ హైదర్గూడలో రాస్తా కేఫ్ నిర్వహిస్తున్నాడు. టిక్ టాక్ బృందం ఫంక్షన్ చేసుకునేందుకు శనివారం రూ.10 వేలకు ఒక గదిని అద్దెకు తీసుకోగా అడ్వాన్స్గా రూ.4 వేలు చెల్లించారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని అడగడంతో బృందం సభ్యులకు మచ్చ రోహన్కు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన హసీబ్ అహ్మద్ అన్సారీ, హఫీజ్ అహ్మద్ అన్సారీలతో పాటు మరో ముగ్గురు యువకులు మచ్చ రోహన్పై దాడి చేశారు. ఈ ఘటనలో రోహన్ కాలు విరిగింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ పుటేజీలో లభ్యమైన ఆధారాలతో ఇద్దరు యువకులను గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదిగో అద్దె గది
సికింద్రాబాద్ స్టేషన్లో బస్సు దిగిన కావ్య.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణంతో బాగా అలసిపోయింది. మాదాపూర్లో ఇంటర్వ్యూకి ఇంకా మూడు గంటల సమయం ఉంది. కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళితే బాగుంటుందనుకుంది. కానీ ఆమెకునగరంలో తెలిసిన వారెవరూ లేరు. మరెలా? అవినాష్ ఆఫీస్గచ్చిబౌలిలో ఉంది. వర్క్ కూడా అయిపోయింది. కాసేపట్లో తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి జూబ్లీహిల్స్ వెళ్లాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అవకుండా పార్టీకి వెళితే బాగుండదు. కానీ బోడుప్పల్లో ఉన్నఇంటికి వెళ్లి వస్తే పార్టీ సమయం దాటిపోతోంది ఇప్పుడెలా? సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొనేవే. ఇవే కాదు ఇలాంటి మరెన్నో ఇబ్బందులకు సమాధానం తమ ‘పోబైట్’ యాప్ (www.pobyt.co) చెబుతుందంటున్నారు నిఖిల్రెడ్డి. రంగారెడ్డి జిల్లా గుర్రాలకు చెందిన ఆయన అమెరికాలో ఉన్నత చదువు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ‘పోబైట్’ అని వెల్లడించారు. సింగపూర్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన నిఖిల్ సోదరుడు నిహాల్రెడ్డి, ఐఐటీ మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డ్యూయల్ డిగ్రీ చేసిన భార్య మేఘన కోలన్ కలిసి యాప్ ద్వారా అచ్చంగా క్యాబ్ బుకింగ్ తరహాలో తక్షణ అవసరాల కోసం హోటల్ రూమ్స్ అందిస్తుండడం విశేషం. అవసరమైన వెంటనే బుక్ చేసుకోగలగడంతో పాటు ఎంతసేపు వినియోగిస్తే అంత సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించేందుకు వీలుగా నిఖిల్రెడ్డి ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. నిఖిల్, నిహాల్ , మేఘన మారుతున్న అవసరాలకుఅనుగుణంగా.. రియల్ ఎస్టేట్ ధరల పుణ్యమాని సిటీలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది సిటీలో ఉద్యోగాలు చేస్తూ శివార్లలో నివాసముంటున్నారు. దీనివల్ల ఇంటి అద్దె భారం తగ్గినా ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రిలాక్స్ అవడానికో, రెస్ట్ కోసమో ఇంటికి, ఆఫీసుకి మధ్య కొన్నిసార్లు తాత్కాలిక బస అవసరం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాలతో, ఈవెంట్స్తో అలసిపోయాక పార్టీలకో, మరేదైన ముఖ్యమైన మీట్కో వెళ్లాల్సి ఉంటే కాసింత ఫ్రెష్ అవడానికి ఏదైనా రూమ్ దొరికితే బాగుండుననిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫ్రెండ్నో.. బంధువులనో అడగాలంటే సమయానికి వారు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఓ గంట.. రెండు గంటలు రెస్ట్ తీసుకునేందుకు గది దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా హోటల్కువెళితే మాత్రం ఫుల్ డే డబ్బులు చెల్లించాల్సిందే. కిలోమీర్కు ఇంత అని క్యాబ్కు చెల్లిస్తున్నప్పుడు.. గది అద్దె కూడా అలా చెల్లించే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా..! ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ‘పోబైట్’ యాప్. ‘నిమిషాల్లో క్యాబ్ని అందించగలుగుతున్నప్పుడు హోటల్ రూమ్ని ఎందుకు అందించలేం? అని ఆలోచించాం. కేవలం రిలాక్స్ అవడానికో, రెస్ట్ తీసుకోవడానికో మాత్రమే కాక ఏకాంతంగా ఉండే ప్రదేశంలో కొన్ని గంటల్లో పర్సనల్ కంప్యూటర్ ద్వారా పనులు చక్కబెట్టుకునేవారికి, దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తూ మధ్య ఏదైనా సిటీలో బ్రేక్ జర్నీ చేసేవారికి ఉపయోగపడేలా ఏదన్నా చేయాలనుకున్నాం. అదే ఈ యాప్ ద్వారా అందిస్తున్నాం’ అని చెప్పారు నిఖిల్. ఉభయులకుఅనుకూలంగా.. విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్, ఎయిర్ కండిషన్, వైఫై సేవలు, ఇంకా కావాలనిపిస్తే డ్రింక్స్, స్నాక్స్.. అన్నీ అందించే తాత్కాలిక బస అంటే హోటల్ రూమ్ని మించి ఏముంటుంది? ‘కనీసం 3 స్టార్ హోటల్స్ మా ప్రాధాన్యం’ అంటున్నారు నిఖిల్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒక లగ్జరీ బెడ్, బాత్టబ్ సహా అన్ని సౌకర్యాలను జేబులో పెట్టుకున్నట్టే అంటున్నారాయన. మరోవైపు చాలా నగరాల్లో హోటల్స్ నిర్వాహకులు కూడా రద్దీ సమయాల్లో తప్ప గదులు ఖాళీగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి తమ యాప్ ద్వారా ఆక్యుపెన్సీ, ఆదాయం రెండూ పెరుగుతాయని అంటోందీ బృందం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పలు హోటల్స్తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అధికారికంగా వినియోగదారులకు గైడ్ చేసేలా ఆటోవాలాలకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. -
రాజుగారి‘గది’!
హార్సిలీహిల్స్లోని సీడీసీఎంఎస్ భవనాల అద్దె విషయం పలు అనుమా నాలకు తావిస్తోంది. ఇక్కడ ఏడాది క్రితం సంస్థ నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కొన్ని పనులు అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఇప్పుడు వడివడిగా చేపడుతున్నారు. కొన్ని గదులు ఇష్టారాజ్యంగా అద్దెకిస్తున్నారు. సీడీసీఎంఎస్ చైర్మన్, టీడీపీ నేత శ్యామరాజు తన తనయుడి పేరుతో లీజుకు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. లీజు ఎంత.. ఎన్ని సంవత్సరాలు.. ఎవరిపేరుతో ఇస్తున్నారో తెలియని పరిస్థితి. అంతా రహస్యంగా సాగుతున్న ఈ ‘రాజుగారి గది’ చర్చనీయాంశమైంది. చిత్తూరు, బి.కొత్తకోట: అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను అనుభవిస్తున్న టీడీపీనేతల వ్యవహారాలు ఒక్కొక్కటికిగా వెలు గులోకి వస్తున్నాయి. తాజాగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్లో కోట్ల విలువైన చిత్తూరు జిల్లా సహకార మార్కెట్ సంస్థ (సీడీసీఎంఎస్) భవనాల లీజు వ్యవహారం గుప్పుమంటోంది. సంస్థకు జిల్లా వ్యాప్తంగా ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. హార్సిలీహిల్స్లో భవనాలు, వాణిజ్య సముదాయం ఉంది. వీటిని 2016లో సంస్థ నిధులతో ఆధునికీకరించే పనులు ప్రారంభించారు. ఏమైందో ఏమోగానీ.. ఏడాదిగా అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు మళ్లీ వీటి పనులు చేపట్టడం, భవనం పైఅంతస్తులోని గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు కేటాయిస్తుండడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీడీసీఎంఎస్ చైర్మన్గా శాంతిపురం మండలానికి చెందిన శ్యామరాజు వ్యవహరిస్తున్నారు. కొండపై ఉన్న భవనాలను లీజు పేరుతో కుమారుడికి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పాలకవర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఈ భవనాల ఆధునికీకరణ కోసం రూ.15 లక్షలతో పనులు చేయగా, ప్రస్తుతం భవనం గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో పనులు కొనసాగుతున్నాయి. చైర్మన్ కుమారుడు వీటిని పర్యవేక్షిస్తుండడం ప్రచారానికి బలం చేకూరుతోంది. ఈ పనులకు టెండర్లు పిలిచి అప్పగించారో లేదో తెలియడం లేదు. జరుగుతున్న పనుల విలువ రూ.10 లక్షలకుపైనేఉండవచ్చని అంచనా. గ్రౌండ్ ఫ్లోర్లోని గదుల్లో ఆధునికీకరణ పనులు సాగుతున్నా పైనున్న గదులను అతిథిగృహాలుగా మార్చి సందర్శకులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. అంతా రహస్యమే కొండపై భవనాల వ్యవహారంలో ఒక్క సమాచారం కూడా బయటకు పొక్కనీయకుండా అంతా రహస్యంగా సాగుతోంది. కోట్ల విలువైన భవనాలను లీజుకు అప్పగించే వ్యవహారంపై ఎన్నో అనుమానాలున్నాయి. లీజు అప్పగింత కోసం బహిరంగంగా ప్రకటించ లేదు. దీంతోపాటు ఎలాంటి ప్రాతిపదికన, ఎవరి పేరుతో, ఎన్ని సంవత్సరాలు లీజుకు ఇచ్చారో తెలియదు. లీజు అప్పగింతకు ఎంత చెల్లించాలి, లీజుకు అప్పగించే ముందు కలెక్టర్కు నివేదించి అనుమతి పొందారా..? అన్నదానిపై అధికారులు, చైర్మన్ నుంచి సరైన సమాధానం లేదు. భవనాల లీజు విషయం రహస్యంగా ఉంచినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆస్తులను లీజుకు అప్పగించే ముందు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనలు, నిర్ణయం తీసుకున్నాక తదుపరి చర్యలను చేపట్టాలి. ఇవేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా భవనాల ఆధునికీకరణ కోసం ఖర్చుచేసిన నిధులు ఎంత, ఏవిధంగా వాటిని ఖర్చు చేశారు..? అన్నది కూడా బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులకు చేస్తున్న ఖర్చు సంస్థ భరిస్తోందా లేక లీజుదారుడు భరిస్తున్నాడా..? అన్నది కూడా రహస్యమే. ఆదివారం వస్తా ఈ విషయమై ఫోన్లో చైర్మన్ శ్యామరాజును వివరణ కోరగా భవనాల లీజు విషయమై స్పందించ లేదు. ఒక్క ప్రశ్నకూ వివరణ ఇవ్వలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆదివారం తాను హార్సిలీహిల్స్ వస్తా మాట్లాడుతా.. అని చెప్పారు. ఇదే విషయమై సంస్థ మేనేజర్ శంకర్ మాట్లాడుతూ హార్సిలీహిల్స్లోని భవనాలు లీజుకు ఇచ్చామన్నారు. శ్యామరాజు కుమారుడికి లీజుకు ఇవ్వలేదన్నారు. చౌడేపల్లె మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చామన్నారు. నిధుల వ్యయం, లీజు నిబంధనలు, ఎప్పుడు లీజుకు నిర్ణయం తీసుకొన్నారు.. తదితరవాటికి సంబంధించిన వివరాలు తనకు తెలియదని దాటవేశారు. -
అద్దె ఇవ్వడం లేదని పోస్టాఫీస్కు తాళం
ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న సబ్పోస్టాఫీస్ భవనానికి సంబంధించిన అద్దె ఇవ్వడం లేదని భవన యజమాని మంగళవారం పోస్టాఫీస్కు తాళం వేశాడు. పోస్టుమాస్టర్ రవికుమార్ వివరాల ప్రకారం... ఎలిగేడులో సబ్పోస్టాఫీస్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. 2012– 17వరకు అగ్రిమెంట్తో రూ.2500 చెల్లిస్తున్నారు. 2018వరకు గ్రేస్పిరియడతో నడుస్తుండగా ఐదు నెలల క్రితం యజమాని అద్దెను 4500 పెంచి ఇవ్వాలని కోరాడు. విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించారు. ఇప్పటి వరకు ఎలాంటి అద్దె రాకపోవడంతో పాటు, పెంచిన అద్దెపై స్పష్టత ఇవ్వకపోవడంతో యజమాని మంగళవారం తాళం వేశాడు. దీంతో మంగళవారం విధులకు వచ్చిన సిబ్బంది బయటే నిరీక్షించారు. -
అద్దెకు బాయ్ఫ్రెండ్.. నాలుగు గంటలు మాత్రమే
ముంబై: నేటి తరం ఆలోచనలు కాస్త వింతగానే ఉంటున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు రూపొందించిన యాప్ కూడా అలాంటిందే. భారత్లో తొలిసారిగా ‘రెంట్ ఏ బాయ్ఫ్రెండ్’ (అద్దెకు స్నేహితుడు) పేరుతో కౌశిక్ ప్రకాశ్ ఈ యాప్ను తీసుకువచ్చారు. వినడానికి కాస్త అదోలా ఉన్న.. ఇది మంచి సేవలనే అందజేస్తుందని కౌశిక్ అంటున్నారు. కొన్ని దేశాల్లో ఈ విధానం ఆచరణలో ఉంది. కానీ భారత్లో ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయలేదు. ఒంటరి జీవితం గడిపే మహిళలకు, ఒత్తిడితో సతమతవుతున్నవారి జీవితాలకు భరోసా ఇచ్చేందుకు ఈ యాప్ను తీసుకువచ్చారు. ఇది శృంగారానికి సంబంధించిన యాప్ కాదు. పైగా అందరు పురుషులు ఇందులో సభ్యులుగా చేరలేరు. దీనికోసం కొన్ని పరీక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మాటతీరు, నడవడిక, బాడీ లాంగ్వేజ్, అతని శారీరక, మానసిక స్థితిగతులను పూర్తిగా పరీక్షించిన తరువాతే అతడిని ఎంపిక చేస్తారు. అలాగే ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకు సంబంధించిన వివరాలు కూడా ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా మహిళలు యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న అద్దెకు స్నేహితులు 3 నుంచి 4 గంటలపాటు వారితో ఉంటుంటారు. వీరికి గంటకు ఇంతా అని చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు వచ్చే స్నేహితుడి ఖర్చు మహిళలే చెల్లించాలి. ఒకవేళ ఎక్కువ సమయం కావాలనుకుంటే ముందుగానే యాప్లో తెలియజేయాల్సి ఉంటుంది. స్నేహితుడిగా ఉండాలనుకున్న వ్యక్తి సదరు మహిళను సంతోషపెట్టే పనులు మాత్రమే చేయాలి.. అంతేకాని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. ఒంటరితనంతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అద్దె కట్టలేదని.. రూ. 3 కోట్ల పుస్తకాలు కొట్టేశాడు!
సాక్షి, హైదరాబాద్ : అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు, లేదంటే ఏవైన ఖరీదైన వస్తువులను తాకట్టు పెట్టుకుంటారు. కానీ నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా అద్దెకున్న వ్యక్తి సామాగ్రిని దొంగతనం చేశాడు. అది కూడా ఏ టీవీనో, బైకో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే అతడు దొంగతనం చేసింది దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే పుస్తకాలను. వినడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వివరాల ప్రకారం నికెథన్ అనే వ్యక్తి పుస్తకాలు విక్రయిస్తుంటాడు. అమ్మకం కోసం తెచ్చిన పుస్తకాలను భద్రపరిచేందుకు నగరానికి చెందిన శ్రీనివాస రెడ్డికి సంబంధించిన గోదాంను అద్దెకు తీసుకున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదు. ఆగ్రహించిన శ్రీనివాస రెడ్డి నికెథన్కు సంబంధించిన దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను దొంగతనం చేశాడు. ఇలా దొంగతనం చేసిన పుస్తకాలను శ్రీనివాస రెడ్డి, బేగం బజార్ కి చెందిన పుస్తక వ్యాపారి రజీయుద్దీన్కి కిలోల చొప్పిన 17 లక్షల రూపాయలకు అమ్మేశాడు. రజీయుద్దీన్ ఆ పుస్తకాలను ముంబైకి చెందిన పుస్తక వ్యాపారి దాంజీకి 22 లక్షల రూపాయలకు విక్రయించాడు. పుస్తకాలు చోరి అయిన విషయం గుర్తించిన నికెథన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నికెథన్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాస రెడ్డిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో శ్రీనివాస రెడ్డి తాను, తన తండ్రి నరసింహారెడ్డితో కలిసి నికెథన్ పుస్తకాలను దొంగిలించామని ఒప్పుకున్నాడు. అనంతరం శ్రీనివాస రెడ్డి, అతని తండ్రి నరసింహారెడ్డిలతో పాటు పుస్తకాలు కొన్న రజీయుద్దీన్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం గురించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ ‘ఇంత ఖరీదైన పుస్తకాల దొంగను పట్టుకోవడం ఇదే ప్రథమం. గోదాం యజమని నరసింహా రెడ్డి , కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు రజీయుద్దీన్ను కూడా అరెస్ట్ చేశాం. వీరి వద్ద నుంచి 3.24 కోట్ల రూపాయల ఖరీదైన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నాం. వీటిలో ఇండియన్ హిస్టరీ, అట్లాస్ ఆఫ్ మై వరల్డ్ , అవర్ ఎర్త్ , స్పీరిట్ ఆఫ్ ఇండియా బుక్స్ ఉన్నాయి.ఈ పుస్తకాలు అన్ని అత్యంత ఖరీదైన పుస్తకాలుగా గుర్తించాం. వీటి విలువ ఒక్కటి 15 వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకూ ఉంటుంది. మొత్తం ఆరు లారీలు పుస్తకాలు ను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు. -
అద్దెకు భార్యలు!!
స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది. పురాణాలు, ఇతిహాసాల్లో సైతం వారికి పెద్దపీటనే వేశాయి. అలాంటి ఈ దేశంలో నేడు స్త్రీ అంగడిలో ఆటబొమ్మగా, ఒక వస్తువుగా మారిపోయింది. ఎంతలా అంటే అద్దెకు అమ్ముడుపోయేంతగా. సమాజంలో అన్ని వస్తువులు అద్దెకు తెచ్చుకునే సంస్కృతి ఉంది. కానీ మధ్యప్రదేశ్లో సమాజం తలదించుకొనేలా మహిళలను అద్దెకు ఇస్తారు. ఇలాంటి దారుణాలు మధ్యప్రదేశ్తో పాటు, రాజస్థాన్, గుజరాత్లో తరచూ జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో దధీచ ప్రాత అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వొచ్చట. స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలబెడతారు. గుజరాత్కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. -
అన్న క్యాంటీన్లపై రభస
సాక్షి, కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు సంబంధించి పాలకవర్గ సభ్యులకు తెలియకుండానే కార్పొరేషన్ కార్యాలయంలో స్థల కేటాయింపు జరపడంపై రభస చెలరేగింది. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్ సురేష్బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి జన్మభూమి, నవనిర్మాణ దీక్షలకు ఖర్చు చేస్తున్నారని, అన్నక్యాంటీన్కు కార్పొరేషన్ స్థలాన్ని ఇస్తూ పాలకవర్గ సభ్యులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. దీనికి కమిషనర్ లవన్న స్పందిస్తూ ప్రభుత్వం అత్యవసరంగా చేయాలని చెప్ప డం వల్లే చేశామని, ఆ స్థలం ఎవరికీ ఇవ్వలేదని, కార్పొరేషన్ ఆధీనంలో నే ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచి పనిని తప్పుబట్టడం సరికాదని టీడీపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి సూచించగా, తప్పుబట్టడం లేదని సభ్యులకు సమాచారం ఇవ్వలేదనే అడిగామని పాకా సురేష్ వివరణ ఇచ్చారు. ఈ దశలో కో–ఆప్షన్ సభ్యుడు ఎంపీ సురేష్ అన్న క్యాంటీన్ల పనులన్నీ వైఎస్ఆర్సీపీ వారే చేస్తున్నారని అనడంతో ఆ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు కో–ఆప్షన్ సభ్యుడివి ఎలా అయ్యావు’ అనడంతో టీడీపీ సభ్యుడు విశ్వనాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. మేయర్ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. వీఎల్టీ ఫీజుల వసూలుపై ఆగ్రహం కార్పొరేషన్లో వీఎల్టీ పేరుతో 14 శాతం ఫీజు లు వసూలు చేయడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గానికి తెలియకుండా ప్రజలపై భారం వేసి చెడ్డపేరు తెస్తున్నారని బండిప్రసాద్, పాకా సురేష్, లక్ష్మయ్య మండిపడ్డారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల వివరాలను అసెస్మెంట్ రిజిస్టర్లో పొందుపరచాలని సభ్యులు సూచించగా మేయర్ అంగీకరించారు. రోడ్ల విస్తరణ, బుగ్గవంక సుందరీకరణ, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఎల్ఈడీ దీపాల నిర్వహణపై ఏది నిజం ఎల్ఈడీ దీపాల కోసం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చామని చెబుతోంది, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వమూ ఇచ్చామని చెబుతోంది, ఇందులో ఏది నిజమని పాకా సురేష్, మగ్బూల్ బాషా ప్రశ్నించారు. అన్ని నిధులు కార్పొరేషన్ జనరల్ ఫండ్లోంచి ఇవ్వాలని తీర్మాణం ప్రవేశపెట్టారు, అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఈడీ దీపాలకు నిధులేమీ ఇవ్వలేదా అని సూటిగా ప్రశ్నించా రు. అగ్రిమెంట్ చేసేటప్పుడు సభ్యులకు తెలపకుండా బిల్లులు చెల్లించాల్సి వచ్చేసరికి తీర్మాణం పెట్టడం సరికాదన్నారు. సంవత్సరం నుంచి అడుగుతున్నా తమ డివిజన్లో వీధిదీపాలు వేయలేదని సభ్యులు లక్ష్మయ్య, ఎంఎల్ఎన్ సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మేయర్ స్పందిస్తూ కార్పొరేటర్ల కమిటీ దీనిపై అధ్యయనం చేసి నిధుల విడుదలపై స్పష్టత ఇస్తుందని ప్రకటించా రు. కార్పొరేషన్లో ఒక్కొక్కరి వద్ద రూ.2లక్షలు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమిస్తున్నారని, ఇలా 29 మందిని నియమించారని పాకా సురేష్ ఆరోపించారు. వీరిని ఎవరి అనుమతితో తీసుకున్నారో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ 4 రోజు ల్లో నివేదిక ఇవ్వాలని కమీషనర్ను ఆదేశించారు. అమృత్ పథకానికీ మొండిచెయ్యేనా! అమృత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని సభ్యుడు పాకా సురేష్ విమర్శించారు. అమృత్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 20 శాతం భరించకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ బి.అరీఫుల్లా మాట్లాడుతూ మాచుపల్లె బస్టాండును చెత్తను తొలగించి ఆధునీకరించాలని కోరారు. మేయర్, ఎమ్మెల్యే కూ డా ఆ ప్రతిపాదనకు మద్దతు పలి కారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్ను తమ డివిజన్లలో ఖర్చు పెట్టకుం డా అన్యాయం చేశారని ఎస్ఏ షంషీర్, జమ్మిరెడ్డి, హరూన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జనరల్ ఫండ్ ఏఏ డివిజన్లలో ఎంత ఖర్చు చేశారో జాబితా రూపొందించి, ఖర్చుపెట్టని డివి జన్లకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన 23వ డివిజన్ కార్పొరేటర్ జేసీబీ పీటర్స్ మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఎస్ఈ ఉమామహేశ్వరరావు, అదనపు కమీషనర్ నిరంజన్రెడ్డి, డిప్యూటీ కమీషనర్ సుశీలమ్మ, ఈఈ కేఎం దౌలా, ఇరిగేషన్ ఈఈ కొండారెడ్డి పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు– మేయర్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందు కు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ సురేష్బాబు తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా గట్టెక్కామని, ఎల్ఈడీ వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ఉక్కాయపల్లె కంపోస్టు యార్డులో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేస్తామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయాలి–ఎమ్మెల్యే కార్పొరేషన్కు సంబంధించిన గదిని అనధికారికంగా లీజుకు ఇచ్చి బాడుగ వసూలు చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే అంజద్బాషా డిమాండ్ చేశారు. రూ.1000లు పింఛన్ డబ్బు దుర్వినియోగం అయ్యిందని ఉద్యోగులను సస్పెండ్ చేశారని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 29వ డివిజన్లో మేస్త్రిని మార్చడంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అంధకారంలో ఉన్నా, కాలువలు లేక దుర్వాసన చచ్చిపోతున్నా జనరల్ ఫండ్ లేదని చెప్పే అధికారులు అన్నక్యాంటీన్లు, నవనిర్మాణ దీక్షలకు ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. -
ఆర్టీసీపై అద్దె భారం
తిరుపతి సిటీ :తిరుపతి ఆర్టీసీపై టీటీడీ అద్దెల భారం మోపింది. ఉన్నపళంగా బస్టాండ్లు, పార్కింగ్ స్థలాల అద్దెలను పెంచేసింది. ఆర్టీసీపై నెలకు రూ.1.74 కోట్ల భారం పడనుంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు శుక్రవారం తిరుపతికి వస్తున్నారు. టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ను కలిసి ఈ విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల టీటీడీ అమాంతంగా పెంచిన అద్దెల విషయంతో పాటు, తిరుమల ఘాట్ రోడ్లలో అనధికారికంగా తిరుగుతున్న వాహనాలను నిలిపివేయాలనే అంశాలపై కూడా చర్చించనున్నారు. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు ఆర్ఎం కార్యాలయంలో డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో ఎండీ సమావేశం కానున్నారు. అందుకోసం ఆర్ఎంతోపాటు ఇతర అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నెలకు రూ. 1. 74 కోట్ల అద్దె టీటీడీ ఆధ్వర్యంలో గతంలో నడుస్తున్న రవాణా విభాగం 1975–80 మధ్య కాలంలో ఆర్టీసీలో విలీనం చేశారు. రవాణా విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన 120 మందికి పెన్షన్ రూపంలో రూ. కోటి 50 లక్షలు ప్రతి నెలా చెల్లించేలా ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ఆర్టీసీకి పెను భారంగా మారింది. అదేవిధంగా తిరుమలలో ఆర్టీసీ డిపో భవనాలు, బస్ స్టేషన్, గ్యారేజ్ స్థలం, అలిపిరి డిపో ఉన్న భవనాలు, బాలాజీ లింక్ బస్టాండు స్థలంతో పాటు విష్ణు నివాసం, శ్రీనివాసంలో కొన్ని స్థలాలకు కలిపి ప్రతి నెలా రూ. 24 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. దీంతో పాటు టీటీడీకి ప్రతినెలా చెల్లిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ డబ్బులు రూ. కోటి 50 లక్షలను తిరుపతి డివిజన్ పరిధిలో ఉన్న 7 డిపోలకు వాటాలు వేస్తారు. దీంతో ప్రతినెలా కోటి 74 లక్షలు అదనంగా టీటీడీకి చెల్లిస్తున్నారు. ప్రధానంగా అలిపిరి, తిరుమల, తిరుపతి డిపోల మీదనే ఈ అద్దెల భారం పడుతోంది. రూ. 23.33 కోట్ల నష్టం ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి రూ. 23.33 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలలో రూ.10 కోట్ల 33 లక్షలు, మార్చి నెలలో రూ. 17 కోట్ల నష్టం వాటిల్లింది. అదేవిధంగా మార్చిలో మంగళం డిపోకు రూ. 2 కోట్లు, తిరుపతి డిపోకు 3.85 కోట్లు, తిరుమల డిపోకు రూ. 3 కోట్లు, తిరుమల డిపోకు రూ. 5 కోట్ల చొప్పున నష్టం వచ్చింది. మాములుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితుల్లో నైనా అలిపిరి, తిరుమల డిపోలు లాభాల దిశగా నడిచేవి . కానీ ఈ ఏడాది జనవరి నుంచి ఆ రెండు డిపోలు కూడా నష్టాల బాట పట్టాయి. దీంతో ఆర్టీసీ అయోమయంలో పడింది. ఆర్టీసీ రాయితీల్లో కోత ? టీటీడీకి నెలవారిగా ఆర్టీసీ చెల్లిస్తున్న అద్దెలను తగ్గించని పక్షంలో టీటీడీ ఉద్యోగులకు ఆర్టీసీ ఇస్తున్న రాయితీ పాసులను తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. టీటీడీ ఈవోతో ఆర్టీసీ ఎండీ భేటీ అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే తిరుమలకు ప్రయివేట్ వాహనాలు, ట్యాక్సీలు, జీపులను తిరగకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టి ఆర్టీసీకి సహకరించాలని ఎండీ సురేంద్రబాబు ఈఓ ను కోరనున్నారు. విచ్చలవిడిగా ప్రయివేట్ వాహనాలు భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కలిగిన ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ, కొండకు ఎక్కువగా ప్రయివేట్ వాహనాలు, ట్యాక్సీలు, జీపులకు అనుమతి ఇస్తుండడంతో ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. కొన్ని ప్రయివేట్ వాహనాలు కండీషన్లో లేకపోయినప్పటికీ టీటీడీ, రవాణా శాఖ అధికారులు కొండకు అనుమతి ఇస్తున్నారు. అధికారులు, సిబ్బందికి ఆయా ప్రవేట్ ట్యాక్సీలు, జీపుల ద్వారా మాముళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీకి వస్తున్న నష్టాలను ఆర్ఎం, ఇతర అధికారులు ఎండీ సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎండీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుపతికి రానున్నారు. -
అక్కడ పెళ్లి ఓ మాయ!
మన సమాజంలో పెళ్లి అంటే ఏడడుగులతో.. వేదమంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలసి మెలసి తోడూనీడగా ఉండాలని కోరుకుంటారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకొంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి కూడా కమర్షియల్ పుంతలు తొక్కుతోంది. అంటే అన్నీ రెడీమేడ్గా దొరికేస్తున్నాయి. అయితే వస్తువుల వరకు సరే కానీ.. పెళ్లి కొడుకు.. బంధువులు.. అందరూ అద్దెకు దొరికితే.. ఏంటీ పెళ్లి కొడుకును కూడా అద్దెకు తీసుకుంటారా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా నిజమే కానీ మన దగ్గర కాదులెండి.. వియత్నాంలో! ఇప్పుడు నకిలీ పెళ్లి అక్కడ పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతోంది. ఇలా ఎందుకు చేసుకుంటారంటే అక్కడి యువతులు పెళ్లి కాకముందే గర్భం దాల్చడం సర్వసాధారణం. అందుకే వారు అబార్షన్ చేసుకుంటారు. అలా వియత్నాంలో ఏటా 3 లక్షలకు పైగా అబార్షన్లు జరుగుతాయట. వాటిలో 20 నుంచి 30 శాతం అబార్షన్లు పెళ్లికాని వారే చేయించుకుంటారట. అయితే ఆ బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని వారు మాత్రం అబార్షన్ చేయించుకోరు. ఇక్కడే ఉంది ట్విస్ట్. అలా పెళ్లి కాకముందు బిడ్డను కనడం మాత్రం సమాజం ఒప్పుకోదట. దీంతో ఏదో ‘పెళ్లి జరిగింది’ అనిపించేందుకు ఓ పెళ్లి చేసుకుంటారట. నకిలీ పెళ్లి కొడుకులతో పాటు బంధువులు.. ఏర్పాట్లన్నీ సంబంధిత సంస్థలకు డబ్బులు ముట్టజెపితే చేసిపెడతాయి. అంతేకాదు భవిష్యత్తులో ఏవైనా చుట్టాల పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే ఆ ‘భర్త’లను తిరిగి నియమించుకోవచ్చు. దీనివల్ల యువతులకు పెళ్లి అయిందనే ఒకరకమైన సంతృప్తి కలుగుతుందని వారి నమ్మకం. -
హౌస్ ఫర్ సేల్
‘పురపాలికల్లో ఇళ్ల కోసం అధికారులను మాత్రమే సంప్రదించాలి. మధ్యవర్తులు, ఇతరులను సంప్రదించవద్దు’.. ఆదివారం విజయనగరంలో పురపాలక మంత్రి నారాయణ పేదలకిచ్చే ‘హౌస్ ఫర్ ఆల్’ పథకంపై స్వయంగా చెప్పిన మాటలు.. పై చిత్రం చూశారా.. బొబ్బిలి మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన కార్యాలయంలో కంప్యూటర్ల ముందు కూర్చున్నవారు అధికారులు కారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు. హౌస్ ఫర్ ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం.. అర్హులంటూ తమ వారిని ఎంపిక చేసుకోవడం వారి పని. మొత్తంగా ఇళ్ల ఎంపిక బాధ్యతను వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఇటీవల వారం రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాల్లోనే తిష్ట వేసి లబ్ధిదారుల పేర్లు, కొత్త దరఖాస్తులు చేస్తున్నారు. కేవలం అధికారులే చేయాల్సిన పనిని వీరు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లతో చేయించుకోవడం గమనార్హం. ఈ విషయం తెల్సినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మరికొందరు అధికారులు సహకరిస్తున్నారు. బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తోంది. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా.. అన్నింటిలోనూ రాజకీ య వివక్ష చూపుతోంది. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ చోటా నాయకులతో అవినీతి చేస్తోంది. పథకానికి ఓ రేటు చొప్పున దందా చేస్తోందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజా ధనంతో అమలుచేసే పథకాలు అర్హులకు అందడం లేదని వాపోతున్నారు. పట్టణాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తమ వారికే ఇళ్లు కేటాయించేలా జాబితాలు రూపొంది స్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదలు బతకడం కష్టం గా మారిందని, పనులు మానుకుని ఇంటిళ్లపాదీ నేతల సేవ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అందేలా లేవంటూ మదనపడుతున్నారు. టీడీపీ పాలనా తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. దగ్గరుండి జాబితాల రూపకల్పన.. పట్టణ పేదల కోసం కేటాయించిన హౌస్ ఫర్ ఆల్ పథకం.. హౌస్ ఫర్ టీడీపీగా మారింది. ఓ పక్క అర్హులను కొర్రీలు వేసి తొలగిస్తూనే.. కొత్త దరఖాస్తులంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని తమ వారి జాబితాలు రూపొందిస్తున్నారు. అధికారుల్లా కార్యాయాల్లో ని కంప్యూటర్ల ముందు కూర్చొని జాబితాలు సిద్ధం చేస్తున్నా రు. అన్నింటా తామై ఉండి నడిపించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో కంప్యూటర్ల ముందు కౌన్సిలర్ల పెత్తనమే కనిపిస్తున్నా కిమ్మనడంలేదు. ఎవరికి దరఖాస్తు చేయాలి? మరెవరిని అనర్హులు గా చూపించాలనే విషయంలో అధికారమంతా అధికార పార్టీ కౌన్సిలర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఇక్కడి అధికార విభాగం లోపభూయిష్టంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఉన్న నిరుపేదలు, ఎటువంటి ఆసరా లేని వారికోసం ఈ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయాలని సంకల్పించారు. ఇప్పుడు కౌన్సిలర్లకు అధికారం ఇవ్వడంతో అర్హులను వివిధ కారణాలతో తొలగి స్తున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎవరికోసం ఈ ఇళ్లు? జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు ము న్సిపాలిటీల్లో ఈ ఇళ్లను నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి ప్రాంతా ల్లో స్థలాలను కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల్లో సొంత ఇల్లు లేనివారు, సొంత ఇంటి స్థలం లేనివారిని గుర్తించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే నివసిస్తున్న వారు అర్హులు. అలాగే, సంవత్సరాదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గతంలో ఎటువంటి గృహరుణం పొంది ఉండకూడదు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం యంత్రాలతో మట్టి నమూనాలు సేకరిస్తున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగా సిబ్బంది నియామకం.. వార్డుల్లో మున్సిపల్ సిబ్బందిని అర్హుల ఎంపికకు నియమిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం నామమాత్రంగానే వీరిని నియమించారని, వార్డుల్లో ఇళ్ల గురించి చెప్పేది మాత్రం కౌన్సిలర్లేననీ, సంబంధిత అధికారులు ఎవరూ రావడం లేదని వార్డువాసులు చెబుతున్నారు. చాలా వార్డుల్లో నియమించిన మున్సిపల్ సిబ్బందిని వార్డుల్లోకి రావద్దని కౌన్సిలర్లు ముందే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి ఉన్న వారి సంఖ్య సుమారు 20 వేలకు పైగానే ఉంది. రుణాలిచ్చేదుందా? హౌస్ ఫరాల్ పథకంలో రుణాలు, డిపాజిట్లు ముఖ్యం. కేటగిరీల ప్రకారం ఒకటో కేటగిరీలో రూ.2.65లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.15 లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.65 లక్షల రుణం బ్యాంకులు ఇవ్వాలన్నది పథక నిర్ణయం. దీంతో ఈ రుణాలు నిజంగా బ్యాంకులు ఇస్తాయా అని జనం నోరెళ్లబెడుతున్నారు. దీంతో పాటు నిరుపేదలంతా మూడు కేటగిరీల్లోనూ రూ.500, 50,000, 100,000 వంతున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డిపాజిట్ల చెల్లింపుతో పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. దీంతో ఈ గృహ నిర్మాణాలపై నమ్మకం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. రైల్వే శాఖ అనుమతిస్తేనే ఇళ్ల నిర్మాణం.. బొబ్బిలిలో నిరుపేదల కోసం అందరికీ ఇళ్లు పథకంలో ప్లాట్లు నిర్మించేందుకు గ్రోత్ సెంటర్ పక్కన 34 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి లేదు. రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అధికారులు ఇప్పుడు డీఆర్ఎంకు లేఖ రాస్తున్నారు. ఇక్కడ గేటు వేయడం లేదా ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అవసరం. గేట్లను ఇప్పటికే రైల్వే శాఖ తొలగిస్తున్నది. దీంతో ఓవర్బ్రిడ్జి తప్పనిసరి. ఇదంతా అయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు ఎదురుగా ఉన్న స్థలం చూపించిన అధికారులు దానిని ఎందుకు మార్చాతో తెలియడంలేదు. దారిలేని చోటును ఎందుకు కేటాయించారో వారికే తెలియాలి. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థల సేకరణ జరిగాక నిర్మాణాలు ప్రారంభిస్తామని టెండర్ దక్కించుకున్న సంస్థ చెబుతుండగా.. ముందుగా అర్హులను తేల్చేందుకు కౌన్సిలర్లు ఉబలాట పడుతుండటం కొసమెరుపు. బొబ్బిలి పట్టణంలోని ఆరో వార్డులో గెంబలి కవిత అనే మహిళ ఉంది. అదే పేరుతో ఐదో వార్డులో మరో మహిళ ఉంది. ఇద్దరూ ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. ఇందులో గెంబలి కవిత పేరున ఇల్లు మంజూరై ఉందని మరొకరి దరఖాస్తును తిరస్కరించారు. కాదు బాబోయ్ అంటున్నా అటు హౌసింగ్, ఇటు మున్సిపల్ కార్యాలయానికి తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. వీరే కాదు పట్టణంలోని హౌస్ఫర్ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 30 శాతం ఇళ్లున్నాయని, ఇక్కడి వారు కాదని తిరస్కరిస్తున్నారు. మా పేరు గల్లంతైందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని ప్రశ్నిస్తున్న కవిత ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఈశ్వరరావు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుమ, కుమార్తె హారికలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోనే రూ.1500 నెలకు అద్దె చెల్లిస్తున్నాడు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇటువంటి వారికి ఇల్లు మంజూరు చేస్తారనే సరికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనికి ఆధార్ లింక్ కావడం లేదని జాబితా లోంచి పేరు తొలగించారని ఆవేదన చెందుతున్నాడు. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
చంచల్గూడ: జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన వస్తోందని, తద్వారా ఖైదీలు లేక జైళ్లు ఖాళీ అవుతున్నాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గ్రాండ్ విజన్ 2025 లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు. నేరాల తగ్గింపు, సమాజిక సేవ, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక సేవలో జైళ్ల శాఖ ఒక కొత్త ఆధ్యయాన్ని సృష్టించిందన్నారు. యాచకరహిత హైదరాబాద్లో భాగంగా జైళ్ల ప్రాంగణంలో ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 3749 యాచకులను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో 3526 మంది తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారన్నారు. జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణల కారణంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ల అద్దెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఆనందాశ్రమాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అంధులు, మానసిక రోగులకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 సబ్ జైళ్లను మూసివేశామని, త్వరలో మరో 5 సబ్ జైళ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తే నేరాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య, అధికారులు సంపత్, శ్రీమాన్రెడ్డి తదితరులున్నారు. -
అద్దె చెల్లించలేదని..అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
-
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్కు వచ్చారు. -
పిల్లలకు ఏం కావాలన్నా... అద్దెకే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, బైకులు అద్దెకు తీసుకోవడం మనకు తెలుసు. ఈ మధ్య ఇంట్లోకి కావాల్సిన బెడ్లు, వాషింగ్ మిషన్, టీవీ, ఎలక్ట్రానిక్స్ వంటివీ అద్దెకిస్తున్నారు. కానీ, పిల్లల ఉత్పత్తులు, వృద్ధుల ఉపకరణాలు ఎవరైనా అద్దెకిస్తున్నారా? ఇదిగో... ‘రెంటికిల్’ పని ఇదే. పిల్లల మంచాలు, పరుపులు, ఆట వస్తువులు, బ్యాగులు.. వృద్ధులకవసరమైన చేతికర్రలు, వీల్ చెయిర్ల వంటివి అద్దెకిచ్చేందుకు రెడీ అవుతోందీ సంస్థ. మరిన్ని వివరాలు రెంటికిల్ కో–ఫౌండర్ వినీత్ చావ్లా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ముంబై వర్సిటీలో ఎంబీఏ చేశాక ఒరిఫ్లేమ్ కాస్మొటిక్స్లో మార్కెటింగ్ డైరెక్టర్గా చేరా. తర్వాత గోద్రెజ్, వర్ల్పూల్, ఫ్యూచర్ గ్రూప్స్ల్లో వివిధ హోదాల్లో పనిచేశా. తరవాత హాంకాంగ్కు చెందిన వినాలైట్ గ్రూప్కు ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించా. అన్నిచోట్లా నాకు ఎదురైన అనుభవమే రెంటికిల్ స్టార్టప్కు పునాది వేసింది. ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో, దేశాల్లో ఉండేటపుడు ప్రతిచోటా ఇంట్లోకి వస్తువులు కొనడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి శ్రమతో పాటూ డబ్బూ వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగానే అమిత్ సోదితో కలిసి రూ.30 లక్షల పెట్టుబడితో 2015 నవంబర్లో గుర్గావ్ కేంద్రంగా రెంటికిల్.కామ్ను ప్రారంభించాం. 150 రకాల కేటగిరీల్లో ఉత్పత్తులు.. ప్రస్తుతం లైఫ్ స్టయిల్, హోమ్ అప్లియెన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి 150 విభాగాలకు చెందిన ఉత్పత్తులున్నాయి. పడక మంచాలు, పరుపులు, వార్డ్రోబ్, డ్రెస్సింగ్, డైనింగ్ టేబుల్, లైట్లు, సోఫా, టీవీ, ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్ ఇలా ఇంటికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువూ అద్దెకు తీసుకోవచ్చు. వీటిలో ఫర్నీచర్ను మేమే సొంతగా ఢిల్లీలోని మా కేంద్రంలో తయారు చేస్తున్నాం. గృహోపకరణాల్ని కొని నిల్వచేస్తున్నాం. మిగిలిన ఉత్పత్తుల కోసం సంబంధిత తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మార్చి నాటికి పిల్లలు, వృద్ధులకు అవసరమైన ఉత్పత్తులతో పాటు, జిమ్ ఉపకరణాలను కూడా అద్దెకిస్తాం. రూ.26 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడాలో సేవలందిస్తున్నాం. అక్కడ గిడ్డంగులూ ఉన్నాయి. వచ్చే నెలలో బెంగళూరులో... ఈ ఏడాది ముగిసేలోగా ముంబై, పుణె నగరాల్లో సేవలు ఆరంభిస్తాం. ఇప్పటివరకు 10 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు. ‘ఓయో’ రూమ్స్లో వాడే వస్తువులన్నీ మా దగ్గర అద్దెకు తీసుకున్నవే. ప్రస్తుతం నెలకు 1,500 ఆర్డర్లు, రూ.5 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. 60 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల క్రితం ఈక్విటీ రూపంలో రూ.26 కోట్ల నిధులను సమీకరించాం. సింగపూర్కు చెందిన వీసీ సంస్థ థింక్యూవేట్, సీఎక్స్ పార్టనర్కు చెందిన అజయ్ రెలాన్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది చివర్లో మరో విడత నిధులను సమీకరిస్తాం’’ అని చావ్లా వివరించారు. హైదరాబాద్ వాటా 30 శాతం.. రెంటికిల్ వెబ్సైట్లోకి లాగినయ్యాక.. కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ నంబర్లతో పాటూ బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలివ్వాలి. కేవైసీ పూర్తయ్యాక.. 5–7 రోజుల వ్యవధిలో ఉత్పత్తులు ఉచితంగా ఇంటికి డెలివరీ అవుతాయి. రిటర్న్స్ కూడా అంతే! అద్దె నెలకు సంబంధిత వస్తువు ధరలో 2–3 శాతం వరకుంటుంది. మా మొత్తం వ్యాపారం, ఆర్డర్లలో హైదరాబాద్ వాటా 30 శాతం వరకూ ఉంది. -
రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ!
చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ రజనీ సతీమణి లత నేతృత్వంలో నడుస్తున్న విషయం తెలిసిందే. గిండీలోని పాఠశాల భవనానికి పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పడటంతో బుధవారం ఉదయం సీజ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ స్కూల్లో చదువుతున్న 300మంది విద్యార్థులను వెలచెరిలోని ఐసీఎస్ఈ స్కూల్ (ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్ అనుబంధ సంస్థ)కు తరలించారు. కాగా భవనం యజమాని వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రే స్కూల్కు తాళం వేసినట్లు తెలుస్తోంది. 2002లో భవనాన్ని అద్దెకు ఇచ్చామని, అయితే సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో 2013లోనూ ఖాళీ చేయాలని స్కూల్ మేనేజ్మెంట్ను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పదికోట్లు చెల్లించాలంటూ బిల్డింగ్ యజమాని కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమంటూ స్కూల్ యాజమాన్యం తరఫు న్యాయవాది కేవలం రూ.2కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తుంది. అప్పటి నుంచి మిగతా బకాయిలు చెల్లించెకపోవడమే కాకుండా, లతా రజనీకాంత్ నుంచి కూడా ఎలాంటి సమాధానం రాకపోవడంతో స్కూల్కు తాళం వేసినట్లు సమాచారం. -
జిల్లాలో 20 కస్టమ్ హైరింగ్ సెంటర్లు
కాకినాడ సిటీ : రైతులకు అద్దె విధానంలో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలోని 18 మండలాల్లో 20 కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం రాత్రి కలెక్టరేట్లో జరిగింది. కూలీల సమస్య నివారణ, ఉత్పాదక వ్యయం తగ్గింపుతో సాగును లాభదాయకం చేసేందుకు యంత్రాలు వాడేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగా యంత్రాలను అద్దెకు ఇచ్చే కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయన్నుట్టు చెప్పారు. నారుమడి నుంచి కోత, నూర్పుల వరకూ ప్రతి దశలో ఉపకరించే అన్ని యంత్రాలూ ఈ సెంటర్లలో అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలో కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎస్కార్ట్స్, కొబాటా సంస్థల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ సంస్థలకు ప్రభుత్వం యంత్రాలపై 50 శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. తదుపరి సమావేశంలో వివిధ యంత్రాలకు అద్దెలను ఖరారు చేస్తామన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, డీడీ లక్ష్మణరావు, మార్టేరు వ్యవసాయ శాస్త్రవేత్త జె.కృష్ణప్రసాద్, యంత్ర సంస్థల ప్రతినిధులు జాకబ్, రవీంద్ర, అభ్యుదయ రైతులు విశ్వనాథం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పట్టణ పేదలకోసం కొత్త రెంటల్ పాలసీ
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదల కోసం మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. 100 స్మార్ట్ నగరాల్లో న్యూ రెంటల్ పాలసీని ప్రారంభించనుంది. ఆ ప్రణాళిక మొదటి భాగం వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి అమల్లోకి తేవచ్చని తెలుస్తోంది. గత 3 సంవత్సరాలుగా దీనిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తేనుందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ప్రధానమంత్రి హైసింగ్ పథకంలో భాగంగా అందరికీ గృహ సదుపాయం లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో త్వరలోనే కేబినోట్ ను తయారు చేయనుందని పేర్కొంది. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంచినట్టు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నివేదించింది. ప్రాథమికంగా 100 స్మార్ట్ నగరాలలో పట్టణ పేద లక్ష్యంగా ప్రారంభించబోతున్న ఈ సంక్షేమ పథకానికి రూ.2700కోట్లను కేటాయించింది. వలస కార్మికులకు, పట్టణ పేదలకు దీనికి సంబంధించిన రెంటల్ వోచర్లను పంపిణీ చేస్తుంది. స్థానిక ప్రజా సంస్థల ద్వారా వీటిని లబ్దిదారులకు అందించనున్నారు. అలాగే ఆయా పేదల అద్దె గృహాల అద్దెతదితర వివరాలను ఈ లోకల్బాడీలే నిర్ణయిస్తాయట. నిర్దేశిత వోచర్లకు విలువకు మించి అద్దె చెల్లించాల్సి వస్తే.. మిగిలిన నగదును అద్దెదారుడే భరించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ అధికారి వివరించారు. -
పునరావాస కేంద్రంలో పాఠశాలకు తాళం
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గిరిజనుల కోసం రామయ్యపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారికి అద్దెలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో రామయ్యపేట పునరావాస కేంద్రంలోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలకు సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని పాఠశాల తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను రోడ్డు పాలు చేశారు. దీంతో పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 45 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ బాధలు చెప్పుకోవడానికి రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ ఎం.ముక్కంటి అందుబాటులో లేకపోవడంతో సమీపంలో ఉన్న ఎంఈవో టి.కృష్ణ విద్యార్థులను మండల విద్యాశాఖ కార్యాలయంలో కూర్చొబెట్టారు. అక్కడే ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. గతంలో సోయెం రామారావు ఇంట్లో పాఠశాల నిర్వహించే వారు. అతనికి 5 నెలల అద్దె చెల్లించకపోవడంతో రామారావు పాఠశాల ఖాళీ చేయించాడు. అప్పటి నుంచి బండారు పాప అనే మహిళకు చెందిన ఇంట్లో పాఠశాల నిర్వహిస్తున్నారు. ఆమెకు కూడా 5 నెలల అద్దె బకాయి పడటంతో మంగళవారం విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపించి ఇంటికి తాళాలు వేసింది. పాఠశాల సమస్యను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కరించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, అద్దెలను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన అధికారులు 10 నెలలు గడిచినా అద్దె చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఇదిలావుంటే.. నిర్వాసితులు పునరావాస కేంద్రానికి తరలివచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు పాఠశాల భవన నిర్మాణం పూర్తికాలేదు. -
పీఓకేలో భూమికి అద్దె కడుతున్న ఆర్మీ!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో కొంత భూభాగాన్ని భారత ఆర్మీ అద్దెకు తీసుకుందా?. గత పదహారేళ్లుగా పీఓకేలో అద్దెకు తీసుకున్న కొంత మొత్తం భూభాగానికి భారత ఆర్మీ అద్దెను చెల్లిస్తోంది. కొంతమంది ఆర్మీ అధికారులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ) కేసు నమోదు చేసింది. భూమికి సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించిన వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖాస్రా నెంబర్లు 3000, 3035, 3041, 3045లలో గల భూమిని భారత ఆర్మీ అద్దెకు తీసుకున్నట్లు పత్రాలు లభ్యమయ్యాయని కేసును విచారిస్తున్న ఓ అధికారి చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ లక్షలాది రూపాయల డబ్బును అద్దె కింద ఆర్మీ ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పత్రాల్లో పేర్కొన్న భూమి ఓనర్ అసలు ఉన్నాడా? లేదా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ చంద్రవంశీ(సబ్-డివిజినల్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, రాజౌరి), ఖంబా గ్రామ పట్వారీ దర్శన్ కుమార్, రాజేష్ కుమార్ అనే మరో వ్యక్తికి కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.