Repairs
-
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
స్తంభాలు, లైన్ల మరమ్మతులకు రూ.45 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రజల నుంచి వచ్చే విద్యుత్ స్తంభాలు, లైన్ల మరమ్మతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.15 కోట్లు చొప్పున రూ.45 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25 నుంచి 2024–29 మధ్య డిస్కంల ప్రసార (వీలింగ్)చార్జీలను నిర్ణయిస్తూ మండలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 33కేవీ, 11కేవీ, ఎల్టీ లైన్లను ఉపయోగించుకున్న వారి నుంచి డిస్కంలు వసూలు చేసేలా రూ.0.32 నుంచి రూ.2.14 వరకూ ఐదేళ్లకు వేర్వేరు చార్జీలను ప్రకటించింది. ఇన్నాళ్లూ కిలోఓల్ట్అవర్ (కేవీఏ) ప్రాతిపదికన వసూలు చేస్తున్న వీలింగ్ చార్జీలను ఇకపై ప్రతి యూనిట్ ప్రాతిపదికన వసూలు చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. అయితే ఈ చార్జీల్లో గృహాలు, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపింది. దానివల్ల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ సిస్టంలు ఏర్పాటు చేసేవారి సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏపీ ట్రాన్స్కోతో పాటు డిస్కంలు కూడా ఓల్టేజ్ నిర్వహణపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్థంభాలను సరి చేయడానికి తాము కేటాయించిన నిధులను వినియోగించాలని సూచించింది. మార్చి 31 నాటికి అన్ని పెట్టుబడుల వివరాలను కమిషన్కు తెలియజేయాలని, తర్వాతి ఆరి్థక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీలోపు ఖర్చుల వివరాలను సమర్పించి, ఆమోదం పొందాలని కమిషన్ స్పష్టం చేసింది.రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన ‘విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ప్లానింగ్ క్రైటీరియా 2023’ పత్రాన్ని అనుసరించాలని డిస్కంలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగుల ఖర్చుల్లో పెన్షన్, గ్రాట్యుటీ (పీఅండ్జీ) ట్రస్ట్లకు సంబంధించిన నిబంధనలను కమిషన్ అనుమతించింది. -
ఆటో రిపేర్కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్నగర్లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
‘బ్రహ్మపుత్ర’లో భారీ అగ్ని ప్రమాదం
ముంబై/న్యూఢిల్లీ: ముంబై డాక్ యార్డులో మరమ్మతుల కోసం ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనతో యుద్ధ నౌక పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోగా ఒక నావికుడు గల్లంతయ్యారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై డాక్యార్డులో రీఫిట్ పనులు జరుగుతున్న మలీ్టరోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని నేవీ తెలిపింది. సోమవారం ఉదయం కల్లా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చామని వివరించింది. అయితే, మధ్యాహ్నం నుంచి యుద్ధ నౌక పక్కకు ఒరిగిపోవడం మొదలైందని, నిటారుగా సరైన స్థితిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర పూర్తిగా పక్కకు ఒరిగి ఉందని తెలిపింది. ప్రమాదంపై విచారణ జరుగుతోందని, గల్లంతైన ఒక జూనియర్ నావికుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపింది. దేశీయంగా మొదటిసారిగా రూపొందిన బ్రహ్మపుత్ర క్లాస్కు చెందిన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఇది. 2000 ఏప్రిల్ నుంచి విధుల్లో ఉన్న ఈ షిప్పై 40 మంది అధికారులు, 330 మంది నావికులు విధుల్లో ఉంటారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
వానాకాలం పంటలకు కాళేశ్వరం నీళ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వానాకాలం సీజన్లో పంటలకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలు, సిఫార్సుల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని తెలిపారు. వానాకాలం ఊపందుకునేలోగా ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను, మరమ్మతు పనులను శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు.హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన మంత్రి.. తొలుత సుందిళ్ల వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని సందర్శించారు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారానికి చేరుకున్నారు. అక్కడి సరస్వతి బ్యారేజీ వద్ద మరమ్మతు పనులను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. లక్ష్మి బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పియర్లు, మరమ్మతు పనులను చూశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.ఎన్నికల కోడ్ ఉండటంతో ఇన్నిరోజులుగా పనులను ఇంజనీరింగ్ అధికారులే పర్యవేక్షించారని చెప్పారు. ఇకపై మరమ్మతు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. తాత్కాలిక మరమ్మతు పనులు అన్నారంలో 60శాతం మేర, మేడిగడ్డ వద్ద 80శాతం మేర పూర్తి కావొచ్చాయన్నారు. సుందిళ్లలో నత్తనడకన సాగుతున్న పనుల విషయంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశామన్నారు.బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సిందే..గత ప్రభుత్వం రూ.94 వేల కోట్ల ఖర్చు చేస్తే.. కేవలం లక్ష ఎకరాల ఆయకట్టు తయారైందని.. అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లింది. మా ప్రభుత్వం ఏర్పడ్డాక దీనిపై డ్యాం సేఫ్టీ అధికారులను సంప్రదించాం. వారు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. బ్యారేజీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మూడు బ్యారేజీలను గేట్లు ఎత్తి ఉంచాలని, అలా ఉంచితే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లదని చెప్పారు.ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నాం..’’ అని తెలిపారు. బ్యారేజీల కుంగుబాటుపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ కూడా జరిగిందని.. ఆ రిపోర్ట్ ప్రకారం మాజీ ఇరిగేషన్ చీఫ్ను విధుల నుంచి తప్పించామని వివరించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్ల కోసం ఆశపడ్డారే తప్ప సీరియస్గా ఏ ఒక్క పనీ చేయలేదని ఉత్తమ్ విమర్శించారు.తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తాంఅసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేసిన డీపీఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమి సాగులోకి వచ్చే ప్రాజెక్టులను త్వరగా చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్, ఇంజనీర్లు, అధికారులు ఉన్నారు.జియోట్యూబ్లతో నీటిని ఆపి, ఎత్తిపోయొచ్చు!తాత్కాలిక మరమ్మతు పనులు మేడిగడ్డ, అన్నారంలలో వేగంగా నడుస్తున్నాయని, సుందిళ్లలో కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయని ఈఎన్సీ అనిల్కుమార్ పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద 5 మీటర్లలో ఎత్తులో జియోట్యూబ్లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయవచ్చన్నారు. అదే అన్నారంలో 11 మీటర్ల ఎత్తులో, సుందిళ్లలో 9 మీటర్ల ఎత్తులో ఆపితే నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. -
కాళేశ్వరంలో నీటినిల్వకు సన్నద్ధం!
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీలో త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని నిల్వ చేయడానికి ఇంజనీరింగ్శాఖ అధికారులు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. అన్నారం బ్యారేజీలోని సీపేజీ లీకేజీలకు గ్రౌటింగ్ పనులను ఆదివారం అ«ధికారులు ప్రారంభించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇంజనీరింగ్ అధికారులు సీసీ బ్లాక్లు తొలగించి మళ్లీ అమర్చుతున్నారు. బ్యారేజీ క్రస్ట్గేట్ల ముందు, వెనుకాల ఉన్న ఇసుక మేటలు తొలగించారు. అక్కడి సీపేజీ లీకేజీలను సిమెంట్, ఇసుక మిశ్రమాన్ని 38వ పియర్ వెంట్ వద్ద గ్రౌటింగ్ ద్వారా నింపుతున్నారు.వర్షాకాలంలో అన్నారం బ్యారేజీ నింపి ఎగువన సుందిళ్ల పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి నీటిని తరలించడానికి ఈఎన్సీ జనరల్ అనిల్కుమార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అన్నారం బ్యారేజీకి ఎగువన పెద్దవాగు, మానేరు, గ్రావిటీ ద్వారా వచ్చే వరద నీరు కూడా వాడుకునే వీలుందని, ఈ నీటిని ఎగువన సుందిళ్లను తరలించడానికి యత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాక్లో కుంగిన పియర్లు 19, 20, 21ల దిగువన సీసీ బ్లాక్ల అమరిక, షీట్ఫైల్స్ దింపుతున్నారు. కాగా, ఆదివారం కురిసిన వర్షానికి అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పనులు నిలిచాయి. కొద్దిపాటి వర్షానికే అన్నారం బ్యారేజీగేట్ల ముందు భాగంలోకి నీరు చేరుతుందని ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన అత్యవసర మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ కోరింది. వర్షాకాలం రాకముందే అత్యవసర మరమ్మతులు చేయాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీటిపారుదల శాఖ రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్రెడ్డి ఈ నెల 14న ఎల్అండ్టీ–పీఈసీ జాయింట్ వెంచర్(మేడిగడ్డ బ్యారేజీ), అఫ్కాన్స్–విజేత–పీఈఎస్(అన్నారం బ్యారేజీ), నవయుగ(సుందిళ్ల బ్యారేజీ) సంస్థలకు వేర్వేరుగా లేఖలు రాశారు. అయ్యర్ కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికను నిర్మాణ సంస్థలకు పంపించి ఆ మేరకు పనులు నిర్వహించాలని కోరారు. ఒప్పందం మేరకే ‘మేడిగడ్డ’ చెల్లింపులు.. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణలో భాగంగా చేపట్టే పనులకు చెల్లింపులు చేయాల్సిందేనని కోరుతూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జేవీ’విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించి ఒప్పందంలోని నియమాలు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని, ఆ మేరకు చెల్లింపులు జరుపుతామని నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన మేరకు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాకులు, షట్టర్ల తొలగింపు, పగుళుæ్ల వచ్చిన పియర్లకు అదనపు భద్రతకు బ్రేసింగ్ చేయడం, బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను పూడ్చివేయడానికి గ్రౌటింగ్ చేయడం, ప్లింత్ స్లాబుకు మరమ్మతులు చేయడం, గేట్లన్నీ ఎత్తడం వంటి అన్ని పనులు చేయాలని నిర్మాణ సంస్థను కోరింది. బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. -
TS: ప్రజాభవన్లో రిపేర్లకు అంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్గా మారింది. ప్రజా సందర్శనకు అనుమతి ఇస్తూ.. వాటి ముందు ఉన్న బారికేడ్లను సైతం తొలగించారు. ఆపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ను కేటాయించారు. అయితే కేసీఆర్ హయాంలో దుబార జరిగిందని.. కాబట్టి హంగులు ఆర్బాటాలకు పోకుండా ఉంటామని ప్రకటించుకుంది రేవంత్ సర్కార్. కానీ, ప్రజా భవన్ రిపేర్ల కోసం చేస్తున్న ఖర్చుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రజా భవన్లో టాయిలెట్ల రిపేర్లు కోసం.. అలాగే దోమ తెరల కోసం రూ.35 లక్షలకు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినట్లు తెలుస్తోంది. మరో టెండర్లో భాగంగా జిమ్ రూంలో పొడుగు అద్దాలు, గన్మెన్ రూముల కోసం రూ.28.70 లక్షలకు టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతుల పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
యథాస్థితికి విద్యుత్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి. ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు. జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు. దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
గోదావరి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి మూసివేత
రాజమహేంద్రవరం సిటీ/కొవ్వూరు: గోదావరి నదిపై రాజమహేంద్రవరం–కొవ్వూరు పట్టణాల మధ్య ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేయనున్నారు. 1974 నవంబర్ 20న ఈ వంతెనను అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించారు. 49 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ వంతెన పూర్తిగా పాడైంది. సెంట్రల్ క్యారేజ్ వే, వయాడక్ట్ భాగం, అప్రోచ్లు సహా దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకూ ఈ బ్రిడ్జిని మూసివేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత ఆదివారం ప్రకటించారు. మరమ్మతు పనులకు, తక్షణ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ వంతెనపై అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. వయాడక్ట్ భాగం, అప్రోచ్లు సహా బీటీ క్యారేజ్వే పునరుద్ధరణ, 4.473 కిలోమీటర్ల పొడవున దెబ్బ తిన్న సెకండరీ జాయింట్ల వద్ద జియో గ్లాస్ గ్రిడ్ల ప్రత్యేక మరమ్మతులకు రూ.2.10 కోట్లు వెమరమ్మతుల స్తున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే మిల్లింగ్ మెషీన్తో బీటీ సర్ఫేస్ తొలగింపు తదితర పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జి మీదుగా తిరిగే వాహనాలను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ, రవాణా, ఆర్టీసీ అధికారులను కోరామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
99శాతం బాగున్నాయి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబ్ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్లో ఎస్డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. తల్లిదండ్రులపై భారం పడకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్లో 5,18,740 ట్యాబ్స్ను బైజూస్ కంటెంట్తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఎస్డీ కార్డు మార్చినవి కొన్నే.. కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్లోని ఎస్డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు. ఇకపై విద్యార్థులు ఎస్డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్లోడ్, డౌన్లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్స్కు పటిష్ట రక్షణ కల్పించారు. ఇకపై ట్యాబ్ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది. సక్రమంగా వినియోగించాలి.. విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది. సాఫ్ట్వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ -
ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
క్షిపణుల డిజైన్లో స్టార్టప్లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మతులేవి?
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లింకు–1 బ్యారేజీల వద్ద గత ఏడాది వచ్చిన భారీ వరదలతో కాంక్రీటు దెబ్బతింది. అయితే మళ్లీ వానాకాలం వచ్చినప్పటికీ దెబ్బతిన్న చోట్ల ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ, అన్నారంలోని (సరస్వతి) బ్యారేజీల వద్ద వరద తాకిడికి గేట్ల ముందు భాగంలోని కాంక్రీటు దిమ్మెలు కొట్టుకుపోయాయి. గత సీజన్లో ఇది జరిగితే ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతుల విషయంలో ఆలోచన చేయడం లేదని, ఖరీఫ్ సీజన్ ఆరంభం అవుతున్నా పనుల్లో జాప్యం చేస్తున్నారని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. గతేడాది ఉధృతంగా వరద గత ఏడాది కురిసిన భారీవర్షాలకు బ్యారేజీలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎగువ గోదావరి నుంచి సరస్వతీ బ్యారేజీ వద్ద 17.50 లక్షల క్యూసెక్కుల వరద జూలై 14–15 తేదీల్లో ఉధృతంగా ప్రవహించింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరద ఉధృతికి గేట్ల కింది భాగాన ఉన్న కాంక్రీట్ దిమ్మెలు లేచిపోయాయి. అలాగే గోదావరి వరదకు, ప్రాణహిత వరద తోడై మేడిగడ్డలోని లక్ష్మీబ్యారేజీ వద్ద 29 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో దిమ్మెలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. కాంక్రీటు దిమ్మెలు ఇలా.. బ్యారేజీల్లో గేట్లు ఎత్తినప్పుడు వరద తాకిడికి నేల కోతకు గురికాకుండా ముందు భాగంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతో కాంక్రీటు దిమ్మెలను అమర్చారు. 3 అడుగుల వెడల్పు, పొడవుతో దిమ్మెలను బ్యారేజీ పొడవునా గేట్ల కింద ముందు భాగంలో కాంక్రీటు చేశారు. వరద తాకి డి కి నేల కోతకు గురికాకుండా ఈ దిమ్మెలు అడ్డుకుంటాయి. కానీ గత ఏడాది వచ్చిన భారీ వరద తాకిడికి ఈ దిమ్మెలు విరిగి ఎక్కడికక్కడ చెల్లాచె దురుగా పడి కొట్టుకుపోయాయి. అప్పటి నుంచీ అక్కడ మరమ్మతులు చేయలేదని చెబుతున్నారు. డిజైన్స్ రాలేదని.. మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి) బ్యారేజీల వద్ద అమర్చిన దిమ్మెలు కొట్టుకుపోయి ఏడాది కావస్తున్నా.. డిజైన్స్ తయారు చేయలేదని ఇంజనీ రింగ్ శాఖ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మరమ్మ తులు చేయకుండానే మళ్లీ వర్షాకాలం ఆరంభమైంది. వర్షాలు ఏకధాటిగా కురిస్తే మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీల గేట్లు ఎత్తితే మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలకు ఇప్పటికే గేట్ల ముందుభాగంలో కోతకు గురై, భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. -
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
రిపేరు హక్కు ఉద్యమంలో భాగంగా ఏసీఎంఏ..
న్యూఢిల్లీ: వాహనాలను వినియోగదారులు ఎవరిదగ్గరైనా మరమ్మతు చేయించుకునే హక్కును సాధించుకునేందుకు అంతర్జాతీయంగా సాగుతున్న ఉద్యమానికి తాము కూడా మద్దతునిస్తున్నట్లు దేశీ ఆటో విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. వైర్లెస్ విధానంలో కనెక్టెడ్గా ఉంటున్న వాహనాల డేటా అంతా కూడా వాటి తయారీ సంస్థలకు చేరుతోంది. దీంతో వాటికి ఏమైనా రిపేర్లు వస్తే బైట వేరే వారి దగ్గర మరమ్మతు చేయించుకోనివ్వకుండా కంపెనీలు నిరోధించేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. ఫలితంగా వినియోగదారులు తాము కోరుకున్న చోట రిపేరు చేయించుకునే హక్కులకు భంగం కలుగుతోంది. తప్పనిసరిగా కంపెనీనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రిపేర్ హక్కుల ఉద్యమం తెరపైకి వచ్చింది. వారంటీ వ్యవధి ముగిసిపోయిన వాహనాలకు వచ్చే మరమ్మతుల్లో 70 శాతం భాగాన్ని స్వతంత్ర రిపేర్ షాపులే చేస్తున్నాయి. కొనుగోలు అనంతర సేవలకు సంబంధించిన ఆఫ్టర్మార్కెట్ విభాగం దేశీయంగా 10.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో వినియోగదారులు కోరుకుంటున్న రిపేర్ హక్కులకు మద్దతునిస్తున్న ఇతర అంతర్జాతీయ సంస్థలతో పాటు తామూ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఏసీఎంఏ తెలిపింది. రైట్ టు రిపేర్ కింద దేశీయంగానూ చట్టం తీసుకొస్తే భారత్లో ఆఫ్టర్మార్కెట్ విభాగం మరింతగా విస్తరించగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది. -
మెట్రోకు సమ్మర్ ఫీవర్.. పగుళ్లకు కోటింగ్..పట్టాలకు లూబ్రికేషన్!
సాక్షి, సిటీబ్యూరో: వేసవిలో మెట్రో నిర్వహణ భారంగా మారింది. పలు మెట్రో స్టేషన్లకు ఏర్పడిన పగుళ్లు.. పట్టాలపై రైళ్లు పరుగులు తీసినపుడు మలుపుల వద్ద రణగొణ ధ్వనులు వెలువడుతుండడంతో తరచూ ఆందోళన వ్యక్తమౌతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టే అంశంపై ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దృష్టి సారించింది. ప్రమాణాల మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం మెట్రో ప్రాజెక్టులోని స్టేషన్లు, పిల్లర్లు తదితర సివిల్ నిర్మాణాలకు పగుళ్ల నివారణ, మన్నిక పెంచేందుకు ఇతర నిర్వహణపరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. నగరంలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు మార్గాల్లోని మొత్తం మెట్రో రైల్ నెట్వర్క్ పరిధిలో ఉన్న వయాడక్ట్ పారాపెట్స్ (పిట్టగోడలు)ను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు చోట్ల స్టేషన్లకు వెంట్రుకవాసి పరిమాణంలో ఏర్పడిన పగుళ్లకు ఎపాక్సీ పదార్థంతో కోటింగ్ వేసి సరిచేస్తున్నట్లు తెలిపారు. మూడు రూట్లలో నిరంతరాయంగా రైళ్లు పరుగులు తీస్తున్న నేపథ్యంలో మెట్రో మార్గం పలు కంపనాలకు గురవుతుండడం, వాతావరణ మార్పుల కారణంగా తరచూ పగుళ్లు ఏర్పడుతున్నట్లు వివరించారు. ఇది సాధారణ పరిణామమేనని స్పష్టంచేశారు. రణగొణ ధ్వనులు వెలువడకుండా చర్యలు... నగరంలో మెట్రో మార్గం పలు ములుపులు తిరిగి ఉంది. నగర భౌగోళిక స్ధితి కారణంగా దేశంలో మరే ఇతర మెట్రో రైల్ మార్గంలో లేని విధంగా వినూత్నమైన రీతిలో మలుపులు, ఎత్తుపల్లాలతో అలైన్ మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో మలుపుల వద్ద మెట్రో పట్టాలు, చక్రాల మధ్య రాపిడి కారణంగా కీచుమనే శబ్దాలు, అతిధ్వనులు అధికంగా వెలువడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించి..రణగొణ ధ్వనులను నివారించేందుకు పట్టాలకు ట్రాక్ లూబ్రికేషన్ చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వార కంపనాలు పెరిగిన సమయంలో శబ్ద స్థాయిలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా శబ్ద స్థాయిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల మేరకు శబ్దకాలుష్యం ఉందని తెలిపారు. విశ్వసనీయ ఇంజినీరింగ్ సంస్థగా, ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిలుస్తుందని..స్వల్ప పగుళ్లు, శబ్దకాలుష్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సంస్థ భరోసానిస్తుండడం విశేషం. చదవండి: ఆ కరెంటుతో షాకే.. -
రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిపై మరమ్మతులు
-
రావోయి విహారి.. బోటింగ్కు సిద్ధమోయి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన బోధిసిరి బోటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మరమ్మతుల పేరుతో మూడేళ్లపాటు పర్యాటకులకు దూరంగా ఉన్న ఈ డబుల్ డెక్కర్ క్రూయిజ్ వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. రూ.23 లక్షలతో మరమ్మతులు చేసిన బోధిసిరి ఇటీవల బెరంపార్క్లో బోటింగ్ పాయింట్ వద్దకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సర్వహంగులు ఏర్పాటు చేస్తూ తుదిమెరుగులు దిద్దుతున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులు ఇప్పుడిప్పుడే దర్శనీయ స్థలాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో బోధిసిరి బోటు నదీ విహారానికి సిద్ధమవడంపై హర్షం వ్యక్తమవుతోంది. బోధిసిరి బోటు వినియోగంలోకి వస్తే కృష్ణానదిలో విహరించేందుకు ఉత్సాహపడే పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడమేగాక ఏపీటీడీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. పోర్ట్ అధికారుల నిబంధనల మేరకు రూపుదిద్దిన బోధిసిరి బోటుకు పోర్ట్, ఇరిగేషన్ శాఖల అనుమతులు కూడా సులువుగానే లభించాయి. బోటులో నైట్ పార్టీ.. రెండు దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలందిస్తున్న బోధిసిరి బోటు 120 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. గరిష్టంగా 200 మంది వరకు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఈ బోటును ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కూడా అద్దెకు ఇస్తారు. ఈ భారీ బోటు పైభాగంలో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. దీనిమీద చిన్నపాటి వేదిక కూడా ఉంది. బోటు నదిలో విహరిస్తుండగా పార్టీలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బోటులో ఏర్పాటు చేసుకునే విద్యుత్ లైట్లతో అహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకొంటే ఆ మజానే వేరని అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇటువంటి ఫంక్షన్లతోపాటు అసోసియేషన్లు, మార్కెటింగ్ సంస్థలు వంటివాటి సమావేశాలకు కూడా అనువుగా ఉంటుంది. ఫంక్షన్కు లేదా సమావేశానికి వచ్చే అతిథులు భోజనాలు చేసేందుకు కింద ఏసీ సౌకర్యంతో సీటింగ్, టేబుల్స్తో పెద్ద హాల్ ఉంది. పైన ఆటపాటలతో కనువిందు చేస్తే కింద హాల్లో రుచికరమైన వంటకాలతో విందు భోజనం సిద్ధంగా ఉంటుంది. బోధిసిరి బోటులో నదిలో విహరించేందుకు గతంలో రెండు గంటలకు రూ.10 వేలు వసూలు చేసింది ఏపీటీడీసీ. కార్తికమాసం, పండుగలు, వారాంతపు సెలవుదినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బోధిసిరి బోటును వినియోగిస్తుంటారు. వారంలో బోటు విహారం బోధిసిరి బోటుకు సంబంధించిన పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు, స్టిక్కరింగ్, ప్లంబింగ్ పనులు మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయి. ఇప్పటికే బోటు ట్రయల్ రన్ పూర్తయింది. బోటుకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బోటు షికారు వారం రోజుల్లోనే ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కృష్ణానదిలో బోధిసిరి కనువిందు చేయనుంది. – సీహెచ్.శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజరు, ఏపీటీడీసీ -
16వ నంబర్ గేట్ వద్ద సాగుతున్న మరమ్మతు పనులు
-
పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరమ్మతులు
సాక్షి, గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు వద్ద అధికారులు మరమ్మతులు చేపట్టారు. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి నిపుణులు వచ్చారు. 35 మంది సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో సిబ్బంది ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో గురువారం తెల్లవారుజామున నీటిని దిగువకు విడుదల చేసేందుకు గేట్లు ఎత్తుతుండగా 16వ గేటు ప్రమాదవశాత్తు విరిగిపోయిన సంగతి తెలిసిందే. రెండు అడుగుల మేర గేట్లు ఎత్తడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా హైడ్రాలిక్ గడ్డర్ ఊడిపోవడంతో గేటు విరిగి వరద నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ప్రాజెక్టు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ నిన్న ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నిపుణుల బృందాన్ని రప్పించి మరమ్మతులు చేపట్టారు. -
తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు
సాక్షి, అమరావతి: తుపాన్లు, భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రెండు దశల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బీ శాఖ నిర్ణయించింది. తిత్లీ, నివర్ తుపాన్లు, భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని సీఎం జగన్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు రెండు దశల్లో రూ.540 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అందులో రూ.154 కోట్లతో 260 పనులను ఇప్పటికే ఆమోదించారు. త్వరలో మరో రూ.386 కోట్లతో పనులకు ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మొదటి దశలో రాష్ట్ర ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.74 కోట్లతో 50 పనులను ఆమోదించారు. వాటిలో 25 పనులను ప్రారంభించగా మరో 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల కోసం రూ.80 కోట్లతో 210 పనులను ఆమోదించారు. వాటిలో 55 పనులను ప్రారంభించగా 155 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఇక రెండో దశ పనులకు తుది ఆమోదం రాగానే పనులు మొదలుపెడతారు. చదవండి: సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి -
బ్రిటన్ రాణికి కరోనా కష్టాలు!
లండన్: కరోనా మహమ్మారి ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్–2పైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్ కుటుంబం 35 మిలియన్ పౌండ్ల(45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ చెప్పారు. ఎలిజబెత్ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్ ఖాతాలోకే చేరేది. కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్హమ్ ప్యాలెస్కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్ శిథిలావస్థకు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్ సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్ పౌండ్లు అధికం కావడం గమనార్హం. -
మెట్రో స్టేషన్లలో మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: అమీర్పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్అండ్టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్అండ్టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే మరమ్మతులు.. ప్రధానంగా బాలానగర్, పరేడ్గ్రౌండ్స్, రసూల్పురా, హైటెక్సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
చార్మినార్ మరమ్మతులకు ఆలయ స్థపతులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న చార్మినార్ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్ డిజైన్ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది. ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు చార్మినార్ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ స్కానర్ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు. -
సాఫీగా.. సేఫ్గా..
సాక్షి, సిటీబ్యూరో: ఎగుడుదిగుడు మ్యాన్హోళ్లను సరిచేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి నడుం బిగించాయి. ప్రమాదాలకు కారణమవుతున్న వీటిని రహదారులకు సమాంతరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సిటీజనులు రోడ్లపై సాఫీగా, సేఫ్గా వెళ్లేందుకు చర్యలు తీసుకోనున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపైనున్న మ్యాన్హోళ్లను అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాల మేరకు నిర్మించాలని, ఇందుకు ఒక్కో విభాగం రూ.10 కోట్ల చొప్పున వెచ్చించాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మ్యాన్‘హెల్స్’... కోటి జనాభా దాటిన మహానగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. దీని పరిధిలో సుమారు 9వేల కిలోమీటర్ల మార్గంలో రహదారులు ఉన్నాయి. వీటి కింద దాదాపు10వేల కిలోమీటర్ల మార్గంలో మంచినీరు, మురుగు, వరదనీటి పైప్లైన్లు, కాల్వలున్నాయి. ఈ రహదారులపై సరాసరి ప్రతి 30మీటర్లకు ఒకటి చొప్పున బల్దియా, జలమండలి విభాగాలకు చెందిన సుమారు 2.85లక్షల మ్యాన్హోళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రెండు వేల కిలోమీటర్ల మార్గంలో ప్రధాన రహదారులపైనున్న మ్యాన్హోళ్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. కొన్ని చోట్ల రహదారి స్థాయి కంటే ఎత్తయిన మ్యాన్హోళ్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది గ్రేటర్ పరిధిలో ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్త మ్యాన్హోల్స్ కారణంగా వందకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా సంఘటనల్లో 150 మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ప్రధాన నగరం, శివార్లు అన్న తేడా లేకుండా ఇదే దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్పేట్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎగుడుదిగుడు మ్యాన్హోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా, జలమండలి విభాగాలు సంయుక్తంగా మ్యాన్హోళ్లను ఆయా ప్రాంతాల్లోని రహదారులకు సమాంతరంగా తక్షణం పునరుద్ధరించడం, అపసవ్యంగా ఉన్న వాటిని సరిచేయడం, మిస్సింగ్ మ్యాన్హోళ్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అత్యంత లోతుగా ఉన్న వాటికి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం తదితర చర్యలు చేపట్టనున్నాయి. ఇవీ అనర్థాలు.. ♦ ప్రధాన రహదారులపై ఎగుడుదిగుడు మ్యాన్హోళ్లతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ♦ అపసవ్య మ్యాన్హోళ్లతో ఆయా రహదారులపై ప్రయాణించినప్పుడు కుదుపులకు వాహనదారుల వెన్నెముక దెబ్బతింటోంది. ♦ డ్రైనేజీ ఉప్పొంగినప్పుడు, వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని రహదారులను ముంచెత్తుతున్నాయి. ♦ తరచూ మ్యాన్హోళ్ల మూతలు మిస్సవుతుండడంతో స్థానికులు భయంభయంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సేఫ్ జర్నీ సాకారానికి... నగరంలోని ప్రధాన రహదారులపై సేఫ్ జర్నీని సాకారం చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తక్షణమే మ్యాన్హోళ్లను సరిచేయనున్నాం. దాదాపు 2వేల కిలోమీటర్ల మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, సాఫీ ప్రయాణానికి అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు ఈ పనులు చేపట్టనున్నాం. ఇందుకయ్యే వ్యయాన్ని జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు రూ.10 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నాయి. – ఎం.దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ -
కుతుబ్షాహీల సమాధులకు కొత్త లుక్
సాక్షి, హైదరాబాద్: మిరుమిట్లు గొలిపేలా కుతుబ్షాహీల సమాధులకు మరమ్మతులు సాగుతున్నాయి. ఐదొందల ఏళ్ల తర్వాత జిగేల్మనేలా మెరవనున్నాయి. గోల్కొండ సమీపంలోని వంద ఎకరాల పచ్చని బయళ్ల మధ్య పాలవర్ణంతో మహానగరానికే ఓ కొత్త ఐకానిక్గా మిగలనున్నాయి. గోల్కొండ రాజ్యం నాటి చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఈ సమాధులు ఓ ఆనవాళ్లు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఆగాఖాన్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా సాగుతున్న పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఇబ్రహీం కులీ సమాధి, మృతి చెందిన తరువాత రాజుల భౌతికకాయాలకు స్నానాలు చేయించే గదితోపాటు కొందరు రాజుల కుటుంబ సభ్యుల సమాధులకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇండో పర్షియన్, ఇరానియన్ శైలిలో నిర్మితమైన ఈ సమాధులను సాలార్జంగ్–3 హయాంలో వందేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఎలాంటి రసాయనాల వాడకుండా 500 ఏళ్ల క్రితం వాడిన ముడి పదార్థాలతోనే వన్నెలద్దుతున్నారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్కు మళ్లీ... వీలైనంత త్వరగా ఈ మరమ్మతులు పూర్తి చేసి యునెస్కో ప్రకటించే వరల్డ్ హెరిటేజ్ సైట్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపే దిశగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మానవ నిర్మితమై, చూసే వారికి అత్యద్భుతమనిపించే సైట్లనే వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా యునెస్కో ప్రకటిస్తుంది. గతంలో చార్మినార్, గోల్కొండ కోటలకు ఈ గుర్తింపునిచ్చే ప్రతిపాదనలు పంపినా వాటికి తుది జాబితాలో చోటు దక్కలేదు. తాజాగా కుతుబ్షాహీల సమాధులకు ఔరా అనే స్థాయిలో జరుగుతున్న మరమ్మతుల అనంతరం తప్పకుండా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమాధుల నవీకరణ పనులను ఎప్పటికప్పుడు యూఎస్, యూకే ప్రతినిధులు సైతం సందర్శిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుండటం విశేషం. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రావాలంటే... యునెస్కో ప్రత్యేక బృందం వరల్డ్ హెరిటేజ్ సైట్కు అధికారిక హోదానిస్తుంది. హోదా దక్కాలంటే నిర్దేశించిన పది పాయింట్లలో మెజారిటీ అంశాలపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆ కట్టడాలు మానవ నిర్మితమై ఉండాలి, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకుని ఉండాలన్న నిబంధనలున్నాయి. ఐతే, ఈ నిబంధనలకు లోబడే కుతుబ్ షాహీ సమాధులను సిద్ధం చేస్తుండటంతో ఈసారి తప్పక వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వస్తుందన్న విశ్వాసాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాధుల చరిత్ర ఇదీ 1518 –1687 మధ్య కాలంలో గోల్కొండను పాలించిన రాజుల సమాధులే ఇవీ. ఈ నిర్మాణాలు దేనికదే ప్రత్యేకం. గుండ్రని గోపురం, అష్టకోణ నిర్మాణంలోని సమాధిశాలలున్నాయి. సుల్తాన్ కులీ, జంషెడ్ కులీ, సుబాన్ కులీ, ఇబ్రహీం కులీ, మహ్మద్ కులీ, సుల్తాన్ అహ్మద్, అబ్దుల్లా కుతుబ్షా, అబుల్ హసన్ తానీషాలు గోల్కొండ రాజ్యాన్ని పాలించారు. వారు తమకు తామే సమాధి శాలలు నిర్మించుకోవటం విశేషం. ఇప్పటికే దేశంలో.. దేశంలో ఇప్పటికే 37 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. ఇందులో తాజ్మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా, హంపీ, ఖజరహో, హుమాయున్ సమాధి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హెరిటేజ్ సైట్లు అధికంగా ఇటలీలో 54, చైనాలో 53, స్పెయిన్లో 47, జర్మనీలో 44 కట్టడాలకు యునెస్కో గుర్తింపునిచ్చింది. -
అన్ ‘ఫిట్’
సాక్షి, అమరావతిబ్యూరో: ఎంతో మహోన్నత ఆశయంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కనీస మరమ్మతులు చేయించకుండా వాహనాలు తిప్పడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అత్యవసర సమయాల్లో బాధితులను రక్షించేందుకు ఏర్పాటుచేసిన 108 సర్వీసులే ప్రమాదాలకు లోనవుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ వాహనం ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన 104 పథకం అమలు సైతం దయనీయంగానే ఉంది. ప్రమాదకర వాహనాలు ప్రజల ప్రాణాలతోచెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఈ వాహనాల బాధ్యతలనుచూసే సంస్థలు వీటి నిర్వహణను గాలి కొదిలేయడంతోనే ఈ దుస్థితి నెలకొంది. ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) లేకపోయినా ఈ వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. జిల్లాలో 104కు చెందిన 24 వాహనాలుండగా ఒక్క అంబులెన్స్కు ఫిట్నెస్ కానీ, ఆర్సీ కానీ, పొల్యూషన్ సర్టిఫికెట్ కానీ లేవు. అదేవిధంగా మూడు 108 వాహనాలు కూడా ఎఫ్సీ లేకుండానే తిరుతున్నాయి. కలిదిండి, ఇబ్రహీంపట్నం, చాట్రాయి మండల కేంద్రాల్లో ఉన్న 108 వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు. అయినా వాటి నిర్వహణ బాధ్యతలు చూసే సంస్థలు ఆయా వాహనాలను రోగులను తరలించేందుకు పంపుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 104 వాహనం ఒక రోజు ఓ గ్రామానికి వెళ్లి వస్తే ఆ వాహనానికి రూ. 10 వేలు నిర్వహణ సంస్థ పీఎస్ఎంఆర్కు అందుతుంది. అందువల్లే ఆవి ఫిట్గా లేకపోయినా కాసులకు కక్కుర్తిపడి వాటిని రోజూ తిప్పుతున్నారని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇటీవల ఫిట్నెస్ లేని 104 వాహనం ప్రమాదానికి గురికాగా డ్రైవరుతో సహా ఎనిమిది నెలల గర్భిణి అయిన నర్సు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 104 సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇలాంటి వాహనాల్లో తాము పనిచేయమని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించి ఈ వాహనాలన్ని ఫిట్గా ఉండేలా మరమ్మతులు చేయిస్తామని ఈ ఏడాది మే 1వ తేదీన స్వయంగా ప్రకటించారు. మూడు నెలలు గడిచినా ఫలితం లేకపోవడం విచారకరం. గర్భిణనిని తీసుకెళ్తూ... జిల్లాలోని గరికిముక్కల గ్రామానికి చెందిన మేరికి పురిటి నొప్పులతో గత నెల 30వ తేదీన కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అత్యవసరంగా ఆమెను 108 వాహనంలో సమీప పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో గుర్వాయిపాలెం ఇటుకల బట్టీ వద్దకు రాగానే 108 వాహనం ముందు చక్రం విరిగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనానికి ఫిట్నెస్ లేనికారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. చాలా వరకు అంబులెన్స్లకు కాలం చెల్లడం. ఉన్నవి కూడా కండీషన్లో లేకపోవడం. పాడైపోయిన ఉపకరణాలు (స్పేర్పార్ట్స్) సరైన మరమ్మతులకు నోచుకోకపోవడంతో జిల్లాలో 108 వాహనాలు తరచూ షెడ్లకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఫిట్నెస్ లేని వాహనాల వల్ల అటు రోగులతోపాటు ఇటు సిబ్బంది సైతం ప్రాణాలను పణంగా పెట్టాల్సిరావడం విచారకరం. రాష్ట్రంలో మూలనపడ్డ అంబులెన్స్లను 15 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఫలితం లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ముక్కుతూ.. మూల్గుతూ..! జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 33 ఉన్నాయి. వీటిలో 20కిపైగా వాహనాలు తరచూ మరమ్మతుల కోసం మెకానిక్ షెడ్డుకు చేరుతున్నాయి. వీటి నిర్వహణ బాధ్యత చూసుకునే సంస్థ యాజమాన్యం వాహనాల మరమ్మతుల విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మెకానిక్ షెడ్డు నుంచి బయటకు వచ్చిన వాహనాలు వారం రోజులు తిరగక ముందే మళ్లీ అక్కడికే చేరుతుండటం గమనార్హం. అలాగే చాలా వాహనాల్లో సరైన సౌకర్యాలు ఉండడం లేదు. ఉదాహరణకు నూజివీడు 108 వాహనం తీసుకుంటే ఏదైనా తేలికపాటి వర్షం వచ్చినా ఈ వాహనంలో కూర్చోవడానికి వీలుండదు. వాహనం లోపలి ఉండే రోగులు కూడా ఈ బాధలు తప్పవు. వర్షం నీటితో వాహనం తడిసిపోయేది. ఒకవేళ వర్షంలో వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. వాహనం వైఫర్ బ్లేడ్స్ పనిచేయకపోవడం ఇందుకు కారణం. ఇలా జిల్లా మొత్తంగా 108 వాహనాల వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు మేల్కోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది. -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
కొమురం భీం ఆసిఫాబాద్: పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం నుంచి రద్దు చేసింది. పెద్దంపేట నుంచి మంచిర్యాల వరకు రైల్వే మరమ్మతులు జరుగుతుండటంతో ఈ నెల 8 వరకు రద్దు చేస్తున్నట్లు స్థానిక రైల్వే అధికారులకు ఉత్తర్వులు అందాయి. కరీంనగర్ నుంచి సిర్పూర్( రైలు నెంబర్ 77255), సిర్పూర్ నుంచి కరీంనగర్(77256), కాజీపేట్ నుంచి బల్లర్ష(77121), సిర్పూర్ నుంచి కాజీపేట్(57122), అజ్ని నుంచి కాజీపేట్(57135), కాజీపేట్ నుంచి అజ్ని(57136) మధ్యలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును కాజీపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు మాత్రమే నడుస్తుంది. -
పైపై పూత..నిధుల మేత!
పాఠశాలలను సరస్వతీ నిలయాలు అంటారు. మరికొందరు దేవాలయాలతో సమానంగా భావిస్తారు. అలాంటి వాటి అభివృద్ధి పనుల విషయంలో కాసులకు కక్కుర్తి పడుతున్నారు అధికార పార్టీ నాయకులు. తూతూ మంత్రంగా పనులు చేపట్టి నిధులు మింగేస్తున్నారు. బనగానపల్లె :జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి, బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 377 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో చేపట్టాల్సిన పనులను బట్టి ఒక్కోస్కూల్కు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరమ్మతులు పూర్తి చేశాక గోడలకు రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి చదరపు మీటరుకు పెయింటింగ్ వేసేందుకు రూ.124.45, గోడను నునుపు చేసేందుకు రూ. 6.82 చొప్పున కాంట్రాక్టర్కు ఇస్తుంది. అయితే, ఆయా పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల మంజూరుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సంతకం అవసరం. అయితే, ఈనిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఈ పనులను రాష్ట్రమంత్రికి చెందిన సమీప బంధువు దక్కించుకోవడంతో ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించలేకపోతున్నారు. చాలా స్కూళ్లలో పగుళ్లిచ్చిన చోట మాత్రమే సిమెంట్ పూసి వదిలేస్తుండటంతో అవి కొద్దిరోజులకే ఊడిపోతున్నాయి. పెయింటింగ్ కూడా తూతూమంత్రంగా వేస్తున్నారు. దీనిపై కొందరు నిలదీసినా కాంట్రాక్టర్లు లెక్క చేయడం లేదని హెచ్ఎంలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అభివృద్ధి పనుల తీరుపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. పనులు సరిగ్గా చేయడం లేదు ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పెయింటింగ్, ఇతర అభివృద్ధి పనులు నిబంధనల మేర జరగడం లేదు. చేసిన పనులు కొద్ది కాలమైనా గుర్తుండాలి. ఈ విషయాన్ని సంబంధిత కాంట్రాక్టర్లు గుర్తించాలి. – గుండం నాగేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నేత,బనగానపల్లె మండలం. -
ఉపగ్రహాలకు రోబోలతో రిపేరు!
వాషింగ్టన్: అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు వీలుగా రోబో శాటిలైట్ల తయారీకి అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), అమెరికాæ రక్షణ పరిశోధనా విభాగం ‘డార్పా’ జట్టుకట్టాయి. ‘సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్స్’గా వ్యవహరించే వీటివల్ల కక్ష్యల్లోని ఉపగ్రహాల జీవితకాలం బాగా పెరగనుంది. ప్రస్తుతం ఉపగ్రహాల్లో తలెత్తే లోపాలు సరిచేసేందుకు చాలా ఖర్చవుతోంది. కానీ ఈ సర్వీస్ స్టేషన్ల ద్వారా ఖర్చు బాగా తగ్గే వీలుంది. అంతరిక్ష యుద్ధం తలెత్తితే శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా వీటికి ఉంటుంది. -
సుంకేసుల డ్యాం గేట్లకు మరమ్మతులు
జలమండలి ఎస్ఈ చంద్రశేఖరరావు సుంకేసుల(గూడూరు రూరల్): ప్రస్తుతం సుంకేసుల డ్యాంలో నీరు లేకపోవడంతో గేట్లను మరమ్మతులు చేయించనున్నట్లు జలమండలి ఎస్ఈ చంద్రశేఖర్రావు చెప్పారు. శనివారం ఆయన రిజర్వాయర్ను పరిశీలించారు. డ్యాం గేట్లు, కరకట్టల పటిష్టతను పరీక్షించారు. ఎగువ నుంచి డా్యంకు నీరు వచ్చేలోపు గేట్లకు మరమ్మతులు, పేయింటింగ్ వేయించడం, తులుపులకు గ్రీసు తదితర పనులు చేపట్టేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. కర్నూలు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జీడీపీ నీరు సరఫరా చేస్తామన్నారు. ఆయన వెంట జేఈ శ్రీనివాసులు, వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి ఉన్నారు. -
గుంతల దారులు
► సీఎం ఆదేశించినా ఫలితం శూన్యం ► వాహనదారులకు నిత్యం నరకయాతన ► ఇంకా కొనసాగుతున్న మరమ్మతులు ► వానలు పడితే పనులకు ఆటంకం సాక్షి, మెదక్: సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశించినా జిల్లాలో రహదారుల పరిస్థితి మెరుగుపడ లేదు. మరింత దారుణంగా మారాయి. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ, మున్సిపల్..ఏ రోడ్లను చూసినా పెచ్చులు లేచి, అడుగు లోతు గుంతలతో దర్శమిస్తున్నాయి. వాహనదారులకు నరకం చూపుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో పంచాయతీ రహదారులు 880 కిలోమీటర్లు, ఆర్ఆండ్బీ రహదారులు 676 కిలోమీటర్లు ఉన్నా యి. వీటితోపాటు మున్సిపల్, గ్రామాల్లో అంతర్గత రహదారులు మరో వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటాయి. జిల్లా గుండా తూప్రాన్ నుంచి రా మాయంపేట వరకు 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ రహదారుల నిర్వహణ లోపం కనిపిస్తోంది. సీఎం ఆదేశించినా గుంతల రోడ్లను మరమ్మతులు చేయటంలేదు. ఆర్ఆండ్బీ రహదారులు 97.25 కిలోమీటర్ల మేర గుంతలు, పెచ్చులు ఊడి పోయాయి. వీటిని మే 31లోగా మరమ్మతులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు 68 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతుండగా ఇంకా 29.25 కిలో మీటర్ల రహదారుల మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావచ్చని తెలుస్తోంది. భారీ వర్షా లు కురిసిన పక్షంలో మరమ్మతు పనులు మరింత జాప్యం కానున్నాయి. పంచాయతీరాజ్ రహదారుల శాఖ పరిధిలో మొత్తం 112 రోడ్లకు సం బంధించి 238.99 కిలో మీటర్ల మేర మరమ్మతు పనులు ఉన్నాయి. ఇందుకోసం రూ.51.58 కోట్ల నిధులు అవసరం. మరమ్మతు పనులకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కావటంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుబాటులో ఉన్న నిధులతో ప్రస్తుతం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దెబ్బతిన్న రోడ్లను సీఎం ఆదేశాల మేరకు పూర్తి చేయడం సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు స్వయంగా చెబుతున్నారు. మెదక్లో ప్రయాణం ప్రాణసంకటమే మెదక్ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు మరమ్మతుకు నోచుకోవటం లేదు. హవేళిఘణాపూర్ మండలంలోని సర్ధన–మెదక్ రోడ్డు పనులు ఏ డాది గడిచినా పూర్తి కావడం లేదు. రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఓవైపు తవ్విపెట్టి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం సాగడం లేదు. టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట, బొడగట్టు, కమ్మరకత్త, సూరంపల్లి, వెల్పుగొండ, ధన్నూర నుంచి కుసంగి, బర్దిపూర్, అచ్చన్నపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్లపై అడుగడుగునా గుంతలు దర్శనమిస్తాయి. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్, బహిరన్దిబ్బ, మందాపూర్, కొమటికుంట తండా, వెంక ట్రావ్పేట, జగిర్యాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పెద్ద శంకరంపేట నుంచి మెదక్కు వెళ్లేందుకు 2016 అక్టోబర్లో మంత్రి హరీశ్రావు మాడ్చెట్పల్లి వరకు రూ.3.75 కోట్లతో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను ప్రారంభించి మధ్యలోనే అపివేశారు. ఉన్న రహదారిని కూడా తవ్వేయడంతో ప్రయాణికులు తరుచూ ప్రమాదాలబారిన పడుతున్నారు. పాపన్నపేట నుంచి చిత్రియాల్ తండా వరకు ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు . రామాయంపేట మండల కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో దళితవాడ వద్ద అరకిలో మీట ర్ మేర రోడ్డు దెబ్బతిని ప్రయాణికులు ఇబ్బందులపాలవుతున్నారు. చిన్న శంకరంపేట మండలంలోని సంకాపూర్–ఖాజాపూర్ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రేగోడ్ మండలంలోని వట్పల్లి, చౌదరిపల్లి, ప్యారం, తాటిపల్లి, తిమ్మాపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలు పడి ప్రయాణి కులకు, వాహనదారులకు నరకాన్ని చూపుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ నుంచి తూప్రాన్ ప్రధాన రహదారిపై నర్సాపూర్ పట్టణ శివారులో రోడ్డుపై రెండు గోతులు పడి నెల రోజులు దాటినా అధికారులు మ రమ్మత్తులు చేయడం లేదు. నర్సాపూర్ నుంచి వెల్దురి మీదుగా తూప్రాన్ వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ. 49 కోట్లు మంజూరు కాగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి స్వంత మండలమైన కౌడిపల్లి నుంచి తిమ్మాపూర్ వరకు ఉన్న రోడ్డు మరమ్మత్తులకు పదేళ్లుగా నిధులు లేక గుంతలమయంగా మారింది. సంగారెడ్డి , మెదక్ జిల్లా కేంద్రాలను కలిపే రోడ్డుపై కొల్చారం మండల పరి ధిలో సంగాయిపేట నుంచి దుంపలకుంట క్రాస్రోడ్డు వరకున్న ఐదున్నర కిలో మీటర్ల రహదారి గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదు. నిధులు ఉన్నా ఏడాదిన్నర నుంచి పనులు చేయకపోడం గమనార్హం. తూప్రాన్లో ఇలా.... తూప్రాన్ డివిజన్ కేంద్రంలోని రహదారి మధ్యలో మురికి కాలువపై మూడేళ్ల క్రితం గోతిని తవ్వి వదిలేశారు. వెల్దుర్తి మండలం నెల్లూరు, కొప్పు లపల్లి గ్రామాల మద్యలో ఉన్న రోడ్డు మధ్యలో రెండు ప్రదేశాల్లో గుంతలు ఏర్పడ్డాయి. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీ నుంచి చేగుంట వేంకటేశ్వర దేవాలయం వరకు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా రోడ్డులో గుంతలు ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతు పను లు చేయలేదు. ముప్పిరెడ్డిపల్లి నుంచి కొండాపూర్ వరకు రోడ్డు ధ్వంసమై రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ముప్పిరెడ్డిపల్లి– కాళ్లకల్ కూ డలి వద్ద రోడు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. వర్షాలు కురిస్తే మరిన్ని ఇబ్బందులు వర్షాలు ప్రారంభం అయ్యాయి. రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యి. ఇది వరకే దెబ్బతిన్న రహదారులు వర్షాలతో మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనికితోడు వర్షాకాలంలో మరమ్మతు పనులు చేపట్టేందుకు అవకాశం తక్కువ. ఒక వేళ ప్యాచ్ వర్క్ చేసినా నాణ్యత లోపించి మళ్లీ రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో భారీ వర్షా లు కురియకముందే రహదారుల మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలు, వాహనదారుల కష్టాలు తీర్చాల్సిన అవసరం ఉంది. -
దిగువ మానేరు ఆయకట్టుకు ధీమా!
► కాకతీయ కాల్వను 0.50 మీటర్ లోతుకు తవ్వితే చాలు ► 8.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వొచ్చు ► 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 8 వేలైనా ఇవ్వొచ్చు ► నీటి పారుదల శాఖకు నిపుణుల కమిటీ నివేదిక ► దీనిపై పరిశీలన జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: దిగువ మానేరు డ్యామ్(ఎల్ఎండీ) పరిధిలో ఉన్న శ్రీరాం సాగర్ స్టేజ్–1, స్టేజ్–2 కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లందించే కార్యాచరణ ప్రణాళిక శరవేగంగా సిద్ధమవుతోంది. కాళేశ్వరం కింద నిర్దేశించిన కాల్వల ద్వారా నీటి తరలింపు ప్రక్రియ ఆలస్యమవుతున్న దృష్ట్యా, ఈలోగా ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నిళ్లిచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పదును పెడుతోంది. కాక తీయ కాల్వల సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి తేవడం ద్వారా నీళ్లివ్వొచ్చని ఇటీవల ప్రభు త్వం నియమించిన ఇంజనీర్లతో కూడిన నిపు ణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది. కాకతీయ ప్రధాన కాల్వ లోయర్ మానేరు డ్యామ్ గుండా వెళు తూ 146వ కిలోమీటర్ నుంచి 284వ కిలో మీటర్ వరకు ఎస్సారెస్పీ స్టేజ్–1 పరిధిలోని 4.93 లక్షల ఎకరాలకు, 284వ కిలోమీటర్ నుంచి 347వ కిలోమీటర్ వరకు ఎస్సారెస్పీ స్టేజ్–2లోని 3.70 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 8.63 లక్షల ఎకరాలకు నీళ్లిస్తుంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉన్న దిగువ మానేరు డ్యామ్ సామర్థ్యం 22 టీఎంసీలు కాగా, సొంతంగా 7.5 టీఎంసీలు దానికి నీటి లభ్యత ఉంది. మిగతా నీరు కాకతీయ కెనాల్ ద్వారా దీనికి చేరుతుంది. అయితే కాకతీయ కాల్వల పూర్తి ప్రవాహ సామర్థ్యం 8,500 క్యూసెక్కులు కాగా అందులో 50% కూడా ప్రవాహం ఉండ టం లేదు. గత ఏడాది మర మ్మతులతో 5 వేల క్యూసెక్కుల వరకు గరిష్ట ప్రవాహం సాధ్యౖ మెంది. అయినా ఈ ఏడాది రబీలో 4 వేల నుంచి 5 వేల క్యూసెక్కులు వదిలితేనే 4 చోట్ల గండ్లు పడి, కాల్వలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్లు బి.అనంతరాములు, పి.వెంకట రామారావు, జి.దామోదర్రెడ్డి, సీఈలు బి.శంకర్, అనిల్కుమార్, బంగారయ్యతో కలిపి కమిటీని నియమించింది. కాకతీయ కాల్వల పరిధిలో పర్యటించిన కమిటీ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాల్వను వెడల్పు చేయడం వంటి భారీ మరమ్మతులు అవసరం లేదని, కాల్వ బెడ్ను 0.50 మీటర్ లోతుగా తవ్వితే చాలని సూచించింది. అర మీటర్ లోతుగా తవ్వడం వల్ల 8 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు ఉంటాయని, లోతు తవ్వడం వల్ల ఎక్కడైనా స్వల్ప మరమ్మతులు అవసరమైతే చేసుకోవచ్చని సూచించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్పారెస్పీ కింది ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్నా, దానికి సమయం పడుతున్నందున, కాకతీయ కాల్వల ద్వారా నీళ్లివ్వడమే ఉత్తమమని తెలిపింది. ఈ నివేదికపై ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. అనంతరం దిగువ మానేరు ఆయకట్టుకు ధీమా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయనుంది. కాల్వల రిపేర్లకు రూ.96.50 లక్షలు కాకతీయ ప్రధాన కాల్వల పరిధిలో డీబీఎం–7బీ, డీబీఎం–13 డిస్ట్రిబ్యూటరీలో అత్యవసరమైన నిర్మాణాల మరమ్మతులు, లైనింగ్ పనులకు రూ.96.50 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. -
నగరంలో రేపు నీటి సరఫరా బంద్
ముంబై : నగరానికి నీటి సరఫరా చేసే వివిధ జల కేంద్రాలలో గురువారం మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీంతో పార్వతి, రా వాటర్ పంపింగ్, వడ్గావ్, లష్కర్, ఎస్ఎన్డీటీ, నవీన్ హోల్కర్ జల కేంద్రాల నుంచి నీరు విడుదలయ్యే ప్రాంతాలకు గురువారం పూర్తిగా నీటి సరఫరా కాదని కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తయిన తరువాత శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా అవుతుంది. దీంతో నగర ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి సరఫరా కాని ప్రాంతాలు దత్తవాడి, స్వార్ó ట్, పార్వతి దర్శన్, లోకమాన్య నగర్, డెక్కన్ పరిసరాలు, శివాజీనగర్ పరిసరాలు, ముఖుంద్నగర్, సహకార్ నగర్, సాతారా రోడ్, పద్మావతి, బిబ్వేవాడి, కాత్రజ్, ధనక్వాడి, ఇందరానగర్, ఎస్ఎన్డీటీ, లా కాలేజీ రోడ్, శివ్నేరి నగర్, భాగ్యోదయ్ నగర్, జ్ఞానేశ్వర్నగర్, సాయిబాబా నగర్, హింగణే, బోపోడీ, ఖడ్కి, చతుశృంగి, గోఖలేనగర్, రామ్బాగ్, గురు గణేశ్ నగర్, పుణే యూనివర్సిటీ, మహాత్మ సొసైటీ, అహిరేగావ్, ఔం«ద్, భావ్ధన్, సుతార్ వాడి, పుణే రైల్వే స్టేషన్ రోడ్, కోరేగావ్ పార్క్, సాడివాలా రాస్తా, రేస్ కోర్స్, వన్వాడీ, హడప్సర్, యేర్వాడ పరిసరాలు, విశ్రాంతివాడి, నగర్ రోడ్, కల్యాణీనగర్, మహారాష్ట్ర హౌసింగ్ బోర్డు కాలనీ, చందన్నగర్, షోలాపూర్ రోడ్, సాతవ్వాడి, విద్యానగర్, టింగరే నగర్, కలస్, ధానోరీ, లోహగావ్, విశ్రాంతివాడి, విమాన్నగర్ తదితర ప్రాంతాలున్నాయి. -
24 గంటలు మూసివేత
మాధవనగర్ రైల్వే గేటుకు మరమ్మతులు డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్, డిచ్పల్లి ప్రధాన రహదారిపై ఉన్న మాధవనగర్ రైల్వే గేటును మరమ్మతుల నిమిత్తం 24 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 8 గంటల నుంచి 21న ఉదయం 8 గంటల వరకు గేటును పూర్తిగా మూసి ఉంచనున్నట్లు రైల్వే ఏడీ రాము మంగళవారం తెలిపారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ నుంచి డిచ్పల్లి వైపు వెళ్లే ప్రయాణికులు బోర్గాం, మోపాల్, కులాస్పూర్, ముల్లంగి గ్రామాల మీదుగా లేదా బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. డిచ్పల్లి వైపు నుంచి నిజామాబాద్ వెళ్లే వారు ఇదే రూట్లలో వెళ్లాలన్నారు. -
దుభారం
గ్రామీణాభివృద్ధి శాఖకు అద్దె వాహనాలే ముద్దట తిరిగేది ఏడు మండలాల్లోనే... పరిధి తగ్గినా మారని అధికారుల తీరు వాహనం ఖర్చు నెలకు రూ.50 వేలు ఇద్దరు అధికారుల ఖర్చు ఒక్కరికే... వాహనం కోసం ప్రత్యేక అనుమతులు డీఆర్డీఏకు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. దీనికి నెలకు రూ.50 వేలు వెచ్చిస్తున్నారు. వరంగల్ : పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అన్ని శాఖల కార్యాలయాల పరిధి భారీగా తగ్గింది. అధికారుల పని భారం కూడా తగ్గింది. జిల్లా స్థారుు అధికారుల పరిధి తగ్గడంతో రవాణా ఖర్చులు తగ్గాలి. కానీ గ్రామీణాభివృద్ధి శాఖలో దీనికివిరుద్ధమైన పరిస్థితి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి చాలా తక్కువ. తగ్గిన పరిధి మేరకు రవాణా ఖర్చులు తగ్గాల్సి ఉండగా అలా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు జిల్లా అధికారుల రవాణా ఖర్చులు ఒక్క అధికారే చేస్తుండటం ఈ శాఖ ఉద్యోగుల్లోనూ చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వాహనాలు ఉన్నా అద్దె వాహనాల కోసం నిధులు వెచ్చిస్తున్న అధికారుల తీరుపై విమర్శలు పెరుగుతున్నారుు. ‘అద్దె’ కోసం అడ్డదారులు..! గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ)కు ప్రభుత్వం ఒక బొలేరో, ఒక టాటా సుమో వాహనాలను ఇచ్చింది. టాటా సుమో వాహనం అవసరం ఉన్నా ఇతర శాఖకు అప్పగించారు. మరో వాహనాన్ని మరమ్మతుల పేరిట షెడ్డుకు పరిమితం చేశారు. కేటారుుంచిన రెండు వాహనాలను ఇలా చేసి భారీ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం డీఆర్డీఏ వినియోగిస్తున్న అధికారి వాహనం అద్దె నెలకు రూ.24 వేలు. డీజిల్ ఖర్చులకు మరో రూ.20 వేలు, డ్రైవరు వేతనం రూ.6 వేలు... అన్ని కలిపి నెలకు రూ.50 వేలు ఉంటోంది. జిల్లా స్థారుు అధికారి వాహన నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.24 కేటారుుస్తోంది. వాహనం అద్దెకు ఇచ్చిన వారే 2,500 కిలో మీటర్లు ప్రయాణించే వరకు డీజిల్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. డీఆర్డీఏ పీడీ వినియోగిస్తున్న వాహనం నిర్వహణ కోసం ప్రతి నెల ఏకంగా రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పరిధి తగ్గినా... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ పరిధి 50 మండలాలు ఉండేది. మహిళా సంఘాల పనితీరు, సంక్షేమం వంటి ఎన్నో అంశాలు ఉండేవి. వరంగల్ అర్బన్ జిల్లాల్లోని ఏడు మండలాల్లో మాత్రమే గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలు ఉంటారుు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ధర్మసారగ్, వేలేరు, ఐనవోలు మండలాల్లో పూర్తిగా, హసన్పర్తిలో కొంత భాగం మాత్రమే డీఆర్డీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతారుు. ఈ శాఖ ఉన్నతాధికారులు మాత్రం 50 మండలాల స్థారుులోనే రవాణా ఖర్చుల కోసం కేటారుుస్తున్నారని విమర్శలు ఉన్నారుు. సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాలను వినియోగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నారుు. -
ఊగే పార్లమెంట్... సేమ్ అలాగే!
బ్రిటిష్ పార్లమెంట్ భవనానికి మరమ్మతులు వచ్చాయిట! చాలా పాత భవనం కదా... వచ్చే ఉంటాయి.. అయితే ఏంటి అంటున్నారా? ఈ మరమ్మతులు చేయాలంటే భవనాన్ని ఖాళీ చేయాలి కదా? ఇవి కాస్తా పూర్తయ్యేందుకు ఆరేళ్లకుపైగా సమయం పడుతుందట. మరి అప్పటివరకూ సమావేశాలు ఎక్కడ నడపాలి? అన్నది సందేహం. సరే... ఏదో ఒక భవనంలోకి మారిపోదామంటే బోలెడు ఖర్చు. పైగా అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉండేందుకు తగ్గ భవనం కూడా అందుబాటులో ఉండాలి. ఈ సమస్యకు జెన్స్లర్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ చూపుతున్న పరిష్కారమే... ఈ ఫొటోలు. ప్రస్తుతం పార్లమెంటు భవనమున్న ప్యాలెస్ ఆఫ్ వెస్ట్మినిస్టర్కు ఆనుకుని కేవలం పది మీటర్ల దూరంలో మాత్రమే ఉండే థేమ్స్ నదిపై ఓ తాత్కాలిక భవనాన్ని కట్టేస్తే సరిపోతుందని అంటోంది ఈ సంస్థ. ‘ప్రాజెక్ట్ పొసైడన్’ పేరుతో జెన్స్లర్ ప్రతిపాదిస్తున్న ఈ తేలియాడే పార్లమెంటు భవనం దాదాపు 8600 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుంది. దాదాపు 250 మీటర్ల పొడవు ఉండే ఈ తాత్కాలిక భవనాన్ని ఉక్కు, కలపల సాయంతో కడతారు. వెస్ట్మినిస్టర్ హాల్ (బ్రిటన్ పార్లమెంటు ఉన్న భవనం) పైకప్పు ఆకారాన్ని పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది జెన్స్లర్. అంతేకాదు... ఈ తేలియాడే తాత్కాలిక పార్లమెంటు భవనాన్ని బ్రిటన్లోని వేర్వేరు నౌకాశ్రయాల్లో ముక్కలు ముక్కలుగా నిర్మించి అన్నింటినీ థేమ్స్ నది ద్వారా తీసుకొచ్చి జోడిస్తారు. పార్లమెంటు భవనం మరమ్మతులు పూర్తయిన తరువాత దీన్ని ఇంకోచోటికి తరలించి మ్యూజియమ్గానో... ఇంకో ఇతర అవసరం కోసమో వాడుకోవచ్చునని అంటోంది జెన్స్లర్. తమ డిజైన్ను స్వీకరించాలని నిర్ణయిస్తే అది బ్రిటన్ ప్రభుత్వానికి దాదాపు 180 కోట్ల పౌండ్ల డబ్బు ఆదా చేస్తుందని, ఈ అంచనా కూడా బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ చేసిందేనని అంటోంది ఈ కంపెనీ. అన్నింటికీ మించి... థేమ్స్ నదిపై ఈ సరికొత్త పార్లమెంటు భవనం మరో టూరిస్ట్ అట్రాక్షన్గా మారినా ఆశ్చర్యం లేదు. పాత భవనం మరమ్మతులు అయ్యేవరకు, ఆ పక్కనే పార్లమెంటు సమావేశాలకోసం థేమ్స్ నదిపై నిర్మాణం కాబోతున్న కొత్త భవనం నమూనా. -
బాపూజీ సాక్షిగా..
జాతిపిత బాపూజీ జయంతిని పురష్కరించుకుని స్థానిక కార్ఖానగడ్డ చౌరస్తాలోని గాంధీ విగ్రహం సమీపంలో ప్రధాన రహదారిపై పడ్డ గోతిని పూడ్చారు. స్మార్ట్సిటీకి పోటీపడుతున్న నగరంలో ఇలా హడావుడి పనులతో అభాసుపాలవుతున్నారు. ఓ వైపు గాంధీ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ వస్తుండగా.. మరోవైపు హడావిడిగా గోతిని పూడ్చుతున్న సిబ్బంది కనిపించారు. – కరీంనగర్ -
విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం
* డిస్కమ్ సీఎండీ హెచ్వై దొర ఆదేశం * వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన గుంటూరు (నగరంపాలెం): జిల్లాలో భారీవర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సంస్ధ చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ హెచ్ వై దొర సంస్థ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. వర్షాల ధాటికి జిల్లాలో ఇప్పటివరకు 1750 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 387 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, 2180 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించటానికి అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేయాలని సూచించారు. బలమైన గాలి, వర్షం వున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా వుండాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపడడం జరిగితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ టోల్ఫ్రీ నంబరు 1800 425 155333 లేదా 1912 నంబరుకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో అన్ని సర్వీసులకు విద్యుత్ సరఫరా.. –ఎస్ఈ జయభారతరావు భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండురోజుల్లో అన్ని సర్వీసులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందిస్తామని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు బి.జయభారతరావు సీఎండీకి తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎక్కువ శాతం అంతరాయం ఏర్పడిన సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు, రెంటపాళ్ళ, క్రోసూరు మండలంలోని పీసపాడు, రాజుపాలెం మండలంలోని రెడ్డిగూడెం, గణపవరం, అంచుపాలెం గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. రాజుపాలెం, సత్తెనపల్లిలలో అదనంగా ఇద్దరు డీఈలు, సుమారు 200 మంది సిబ్బందితో, తగిన సామగ్రిని అందుబాటులో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామన్నారు. గత నాలుగు రోజులుగా రాజుపాలెంలోనే ఉండి పనులను స్వయంగాపర్యవేక్షిస్తూ వేగవంతం చేయడానికి సిబ్బందికి సహాయపడుతున్నామని వివరించారు. సీఎండీతో పాటు సీఈ కె.రాజబాపయ్య, డీఈఈలు ఆంజనేయులు, భాస్కర్బాబు, పిచ్చయ్య, వసంతరావు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది ఉన్నారు. -
రహదారుల మరమ్మతులకు రూ. 10 కోట్లు
* పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు గుంటూరు వెస్ట్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో 118 పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనులకు నష్టం వాటిల్లిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలోని పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలకు పంచాయతీ రోడ్లకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న పీఆర్ రోడ్లకు తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణానికి రూ.96 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆర్డబ్లు్యఎస్ శాఖకు సంబంధించి రూ.1.20 కోట్ల విలువైన సీపీడబ్లు్య స్కీమ్లకు నష్టం వాటిల్లిందని, వీటికి త్వరలోనే మరమ్మతులు చేపడతామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగుకు... గ్రామాలలో పారిశుద్ధ్యం క్షీణించి, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీనిపై క్షేత్రస్థాయిలో సర్పంచ్లు బాధ్యత తీసుకుని పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలని కోరారు. నీటిపైపులు ఎక్కడైనా లీకేజీలు అయినా, ఇతర నీటి సమస్యలు తలెత్తితే 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి తగిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 2400 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉండగా, 1000 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అనుమతించారని మంత్రి తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసి పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సెక్రటరీ పోస్టుల భర్తీలో అనేక లోపాలు జరిగాయని, వాటిని నివారించేందుకు డిగ్రీ అర్హతగా నిర్ధారించి వాటిని భర్తీ చేయనున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. పీఆర్ విభాగం అధికారులతో సమీక్ష.. పీఆర్ ఎస్ఈ జి.జయరాజ్, ఆర్డబ్లు్యఎస్ ఎస్ఈ పి.భానువీరప్రసాద్, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పీఆర్, ఆర్డబ్లు్యఎస్ ఇంజినీర్లతో మంత్రి అయ్యన్నపాత్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టపోయిన రోడ్లు, ఇతర పనులపై సమీక్షించారు. -
రైల్వే ట్రాకు పనులు వేగవంతం
నగరంపాలెం, రాజుపాలెం: వర్షానికి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. శుక్రవారం వరద నీరు తగ్గటంతో ట్రాకుపై నీరు చేరిన ప్రాంతాల్లో మరమ్మత్తులు నిర్వహించారు. ఐదు చోట్ల మాత్రం ట్రాకు కింద మట్టిపూర్తిగా కొట్టుకుపోయింది. సత్తెనపల్లి– రెడ్డి గూడెం మధ్యలో ఒక చోట 800 అడుగులు, ఒక చోట 1200 అడుగులు భారీగా మట్టి కొట్టుకుపోవటంతోపాటు రైల్వే ట్రాకు సైతం 15 మీటర్లుపైనే పక్కకు జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి, గుంటూరు వైపు నుంచి ట్రాకు ఉన్నంత వరకు కొండరాళ్లు, కంకర గూడ్స్ బోగిల్లో తరలించి అక్కడి నుంచి మనుషుల ద్వారా గండ్లు పడిన చోట్లకు తరలిస్తున్నారు. మట్టిని సరిచేయటానికి అన్ని ప్రదేశాల్లో కలిపి 20 పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు. జోన్ పరిధిలో రెస్కూ్యటీంలు, సుమారు 500 మంది వరకు కూలీలు ట్రాకు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీరింగ్ అధికారులతోపాటు డీఆర్ఎం విజయశర్మ డివిజను స్థాయి అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రికి రెడ్డిగూడెం– పిడుగురాళ్ల మధ్యలో మూడు ప్రదేశాల్లో ట్రాకు పునరుద్ధరించారు. కోనంకి రైల్వేగేటు వద్ద నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్ను బెల్లంకొండ స్టేషన్కు చేర్చారు. వాతావరణం అనుకూలంగా ఉంటే సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ట్రాకు అందుబాటులోకి రానుంది. -
రైల్వే ట్రాకు పనులు వేగవంతం
* ఐదు చోట్ల భారీగా కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు * పనులు పర్యవేక్షిస్తున్న జోన్స్థాయి అధికారులు నగరంపాలెం, రాజుపాలెం: వర్షానికి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. శుక్రవారం వరద నీరు తగ్గటంతో ట్రాకుపై నీరు చేరిన ప్రాంతాల్లో మరమ్మత్తులు నిర్వహించారు. ఐదు చోట్ల మాత్రం ట్రాకు కింద మట్టిపూర్తిగా కొట్టుకుపోయింది. సత్తెనపల్లి– రెడ్డి గూడెం మధ్యలో ఒక చోట 800 అడుగులు, ఒక చోట 1200 అడుగులు భారీగా మట్టి కొట్టుకుపోవటంతోపాటు రైల్వే ట్రాకు సైతం 15 మీటర్లుపైనే పక్కకు జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి, గుంటూరు వైపు నుంచి ట్రాకు ఉన్నంత వరకు కొండరాళ్లు, కంకర గూడ్స్ బోగిల్లో తరలించి అక్కడి నుంచి మనుషుల ద్వారా గండ్లు పడిన చోట్లకు తరలిస్తున్నారు. మట్టిని సరిచేయటానికి అన్ని ప్రదేశాల్లో కలిపి 20 పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు. జోన్ పరిధిలో రెస్కూ్యటీంలు, సుమారు 500 మంది వరకు కూలీలు ట్రాకు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీరింగ్ అధికారులతోపాటు డీఆర్ఎం విజయశర్మ డివిజను స్థాయి అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రికి రెడ్డిగూడెం– పిడుగురాళ్ల మధ్యలో మూడు ప్రదేశాల్లో ట్రాకు పునరుద్ధరించారు. కోనంకి రైల్వేగేటు వద్ద నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్ను బెల్లంకొండ స్టేషన్కు చేర్చారు. వాతావరణం అనుకూలంగా ఉంటే సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ట్రాకు అందుబాటులోకి రానుంది. -
600 మెగావాట్ల ప్లాంట్కు కొనసాగుతున్న మరమ్మతులు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజినీర్ల బృందం జనరేటర్కు మరమ్మతులు చేపట్టింది. జనరేటర్లో విద్యుదుత్పత్తి చేసే కోర్స్ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని రెండు భాగాలుగా విభజించారు. గత 25 రోజులుగా మరమ్మతులు కొనసాగుతున్నాయి. రిపేరింగ్ పూర్తికావడానికి మరో పది రోజులు పట్టొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. కేటీపీపీ సీఈ శివకుమార్ మాట్లాడుతూ.. ‘ కొత్తప్లాంట్కు మరమ్మతులు చేపట్టాం. వారం రోజుల్లో పనులు పూర్తి కావచ్చు’ అని తెలిపారు. -
యాద్గార్పల్లి రోడ్డుకు మరమ్మతులు
మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణం నుంచి యాద్గార్పల్లి వెళ్లే రహదారిని ఆర్ఎండ్బీ అధికారులు మరమ్మతులు చేసి శుక్రవారం రాకపోకలను పురుద్ధరించారు. ఈ నెల 13న కురిసిన భారీ వర్షం వల్ల యాద్గార్పల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయిన విషయం విధితమే. దీంతో యాద్గార్పల్లి, ఊట్లపల్లి, తడకమళ్ల, తక్కెళ్లపహాడ్, క్వాపల్లి గ్రామాలకు మిర్యాలగూడకు గతనాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న ఆర్ఎండ్ బీ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టారు. -
మూసీ కాల్వలకు మరమ్మతులు
సూర్యాపేటరూరల్ : ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా ఉన్న మూసీ కాలువలు కొన్ని రోజులుగా శుభ్రం అవుతున్నాయి. పిల్లలమర్రి గ్రామంతో పాటు చాలా గ్రామాల్లోని మూసీ కాలువలు ఉపాధిహామీ పథకం కింద కూలీలు చెత్తాచెదారం, కంపచెట్లను తొలగిస్తున్నారు. అన్ని గ్రామాల్లోని మూసీ కాలువలు శుభ్రం చేయడంతో పాటు తూములు మరమ్మతు చేస్తే మూసీ ప్రాజెక్ట్ ఆయకట్టు వరకు సాగునీరు అందుతాయని రైతులు పేర్కొంటున్నారు. కాలువలు శుభ్రం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డుకు మరమ్మతులు కరువు
పెద్దవూర : మండలంలోని ఊట్లపల్లి ఘాట్కు పుష్కర స్నానాలకు వెళ్లేందుకు గాను భక్తుల సౌకర్యార్థం పోతునూరు–పులిచర్ల రోడ్డు వెంట పెరిగిన కంపచెట్లను తొలగించి మట్టిపోశారు. కానీ రోలింగ్ మరిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వాస్తవానికి ఈ రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం పుష్కర నిధులు మంజూరు చేయలేదు. మండల కేంద్రంతోపాటు చాలా గ్రామాల ప్రజలకు ఊట్లపల్లి ఘాట్కు పోవటానికి పోతునూరు–పులిచర్ల రోడ్డు అనువైనది. దీంతో అధికారులు 14 ఫైనాన్స్ నిధుల నుంచి కంపచెట్లను తొలగించి రోడ్డును మరమ్మతులు చేయించాలని సర్పంచ్లను ఆదేశించారు. దీంతో పులిచర్ల, పోతునూరు సర్పంచ్లు రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోశారు. కాని మట్టిని రోలింగ్ చేయటం మరిచిపోయారు. అసలే సింగిల్ రోడ్డు. ఆపై ఎదురుగా వాహనం వస్తే తప్పనిసరిగా రోడ్డు వాహనం కిందికి దిగాల్సిందే. మట్టిని పోసి రోలింగ్ చేయకపోవడం వలన రోడ్డు దిగితే టైర్లు స్లిప్ అయ్యి కింద పడిపోతున్నాయి. వర్షాలు వస్తే ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపించటం ఖాయం. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు వెంట పోసిన మట్టిని రోలింగ్ చేయించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. -
ఆనకట్టకు మరమ్మతులు
సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని పెన్నానదిపై ఉన్న ఆనకట్టకు శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. గతంలో కురిసిన వర్షాల వల్ల ఆనకట్టపై పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఈ ఆనకట్ట కింద 2.75 లక్షల ఎకరాలు సాగులో ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇరిగేషన్శాఖ గుంతలు పడిన స్థానంలో కాంక్రీట్ పనులను ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రధాన రహదారులకు మరమ్మతులు
హాలియా : ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రధాన రహదారులకు ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. హాలియా–నాగార్జునసాగర్, హాలియా–మిర్యాలగూడ ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ప్యాచ్ వర్కులకు బీటీని వేసి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే హాలియా–పెద్దవూర, అలీనగర్–మిర్యాలగూడ తదితర రహదారులకు బీటీ వేశారు. పుష్కరాలు ప్రారంభమైతే సంబంధిత రహదారులు ట్రాఫిక్మయంగా మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తిర్మలగిరి, రంగుండ్ల, గాత్తండా, అల్వాల, చింతపల్లి తదితర రహదారులకు పనులు పూర్తిచేశారు. గాత్తండా నుంచి కుంకుడుచెట్టుతండా వరకు నూతనంగా బీటీ రహదారి పనులు పూర్తికావచ్చాయి. అల్వాల అడ్డరోడ్డు నుంచి తిర్మలగిరి వరకు బీటీ రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూరై్తనప్పటికీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన రహదారులపై ఉన్న రోడ్బండ్ల నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. తాత్కాలిక పనులు పూర్తిచేస్తాం .. కాకునూరి వెంకటేశం, ఏఈ ఆర్అండ్బీ పుష్కరాల సందర్భంగా పలుచోట్ల దెబ్బతిన్న ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. ట్యాంక్బండ్ల నిర్మాణ పనులు కూడా సకాలంలో పూర్తిచేస్తాం. అల్వాల అడ్డరోడ్డు–తిర్మలగిరి ప్రధాన రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ పనులు పుష్కరాల అనంతరం చేస్తాం. రహదారి వెంట గుంతలను పూడ్చివేయిస్తున్నాం. రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు. -
గండి.. ఎప్పటికి పూడ్చేనండి
సీతారామపురం (నూజివీడు) : రామిలేరుపై ఉన్న పోలవరం కుడికాలువ అండర్ టన్నెల్ వింగ్ వాల్కు పడిన గండి ఇప్పట్లో పూడ్చే పరిస్థితులు కనిపించట్లేదు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు రోజుల నుంచి పోలవరం కాలువపై మకాం వేసినప్పటికీ పోలవరం కాలువ అండర్ టన్నెల్కు పడిన గండి పూడ్చివేత పనులు ముందుకు సాగడం లేదు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున ఇక్కడ గండిపడిన విషయం తెలిసిందే. ఘటనాస్థలానికి చేరుకున్న మంత్రి ఉమా అప్పటి నుంచి రేయింబవళ్లు కాలువ వద్దే ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు కూడా గండిపడిన నాటి నుంచి రోజూ కాలువ వద్దే ఉంటున్నారు. గండిపడి నాలుగు రోజులు గడిచినా నేటికీ పూడ్చివేత పనులు ఊపందుకోలేదు. కాలువలో నీటి ప్రవాహం తగ్గడానికి రెండు రోజులు పట్టడంతో అప్పటి వరకు ఎలాంటి పనులు చేసేందుకు వీలుపడలేదు. నీరు తగ్గిన తరువాత గండి పడిన ప్రాంతానికి చుట్టూ రింగ్ బండ్ వేసేందుకు రెండు రోజులు గడిచింది. గండి పడడం వల్ల అండర్ టన్నెల్కు పొడిగింపుగా ఉన్న అప్రాన్ కూడా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో గండిని తాత్కాలికంగా పూడ్చి గోదావరి జలాలను విడుదల చేయాలా, లేక ఒక్కసారి శాశ్వత పనులు చేయాలా అనే దానిపై ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడిన మీదట ఎట్టకేలకు శాశ్వత పనులను ఎలాంటి హడావుడి లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, గురువారం సాయంత్రం వరకు కూడా గండి పూడ్చడానికి, అప్రాన్ నిర్మాణానికి కాంక్రీట్ వేసేందుకు అవసరమైన యంత్రాలు ఏవీ రాకపోవడంతో ఇంకా కాంక్రీట్ పనులు పూర్తికాలేదు. శుక్రవారం నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పెరుగుతున్న సందర్శకుల తాకిడి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘటనాస్థలిలోనే మకాం వేసి ఉండడంతో ఆ పార్టీ నాయకుల రాకపోకలు, హడావుడి ఎక్కువవుతోంది. మాములు సమయాల్లో మంత్రి బిజీగా ఉండటం, ఇతర జిల్లాల్లో పర్యటించడం తదితర కార్యక్రమాలతో జిల్లా నాయకులకు అందుబాటులో ఉండేవారు కాదు. దీంతో ఉమాను కలవాలంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు గండి పడిన ప్రాంతంలోనే ఆయన ఉండటంతో ఉమాను సులువుగా కలవవచ్చనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి వస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండంతో పనులకు అంతరాయం కలిగి జాప్యం జరుగుతోంది. పుష్కరాల నాటికి నీరు విడుదలయ్యేనా? వింగ్వాల్కు పడిన గండిని పూడ్చివేసే పనులతో పాటు అప్రాన్ నిర్మాణ పనులు కూడా రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత కాంక్రీట్ క్యూరింగ్ పీరియడ్ కనీసం ఐదారు రోజులైనా ఉండాలి. మొత్తంమ్మీద కనీసం ఎనిమిది రోజులకు పనులు పూర్తయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత పట్టిసీమలో పంపులను ఆన్ చేయనున్నారు. ఇదంతా జరిగే సరికి పుష్కరాలు ప్రారంభమయ్యే 12వ తేదీ రానే వస్తుంది. ఒకవేళ పట్టిసీమలో పంపులను ఈనెల 12న ఆన్ చేసినా అక్కడి నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరేసరికి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. వీటన్నింటిని బట్టి చూస్తే పుష్కరాల నాటికి గోదావరి జలాలు వచ్చే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
2న పలు ప్రాంతాలకు కృష్ణా నీళ్లు బంద్
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా మూడోదశ రింగ్మెయిన్–1 పైపులైన్లకు నిర్వహణపరమైన మరమ్మతుల కారణంగా..ఆగస్టు 2న(మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి.. మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పలు ప్రాంతాలకు కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. బాలాపూర్, రాజీవ్ గృహకల్ప,అల్మాస్గూడా, ఏఆర్సీఐ, మైలార్దేవ్పల్లి, మదుబన్, పీడీపీ, రాజేంద్రనగర్, హైదర్గూడా, కిషన్భాగ్, సులేమాన్నగర్, నందిముసలాయ్గూడా, అత్తాపూర్, ఆళ్లబండ రిజర్వాయర్, రెడ్హిల్స్,సెక్రటేరియట్, మెహిదీపట్నం, కాకతీయనగర్, విజయ్నగర్కాలనీ, మసాబ్ట్యాంక్, కార్వాన్, షేక్పేట్, టోలిచౌకి, లంగర్హౌజ్, ప్రశాసన్నగర్, జర్నలిస్ట్కాలనీ, ఫిల్్మనగర్, ఫిల్మ్నగర్ స్లమ్స్, రోడ్నెం.45, ఎస్పీఆర్హిల్స్, ఎన్ఆర్ఆర్పురం, శ్రీరాంనగర్, కార్మికనగర్, లింగంపల్లి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, లింగంపల్లి, హఫీజ్పేట్, చందానగర్, ఆర్సీపురం, మియాపూర్, కెపిహెచ్బి, ఇందు ప్రాజెక్ట్స్, మలేషియా టౌన్షిప్, బోరబండ రిజర్వాయర్, గాయత్రీనగర్, అల్లాపూర్, రామారావునగర్ ప్రాంతాలకు సరఫరా ఉండదని జలమండలి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి -
నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్ : గ్రీన్ల్యాండ్స్ సబ్ డివిజన్ ఐడీపీఎల్, ఆల్విన్, బేగంపేట్, హెచ్పీఎస్, బోరబండ, మోతీనగర్ సబ్స్టేషన్ల పరిధిలోని విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్నగర్ ఎస్ఆర్టీ, 2ఆర్టీ, 3ఆర్టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్ఎం కాలనీ, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్నగర్ మెయిన్రోడ్డు, అమీర్పేట్ కాకతీయ హోటల్, జీఎంఆర్ బిల్డింగ్, లీలానగర్, శాంతిబాగ్ అపార్ట్మెంట్, కలోరమ ప్రింటింగ్ ప్రెస్, బేగంపేట్ శ్యాంలాల్ బిల్డింగ్ గురుమూర్తి లైన్, బోరబండ స్వరాజ్నగర్, సాయిబాబానగర్, సైట్-3, స్నేహపురికాలనీ, మోతీనగర్, న్యూ అండ్ ఓల్డ్ సుల్తాన్నగర్, రామారావునగర్, గణేష్నగర్, ఆర్కే నగర్, శివాజీనగర్, బంజారానగర్, వినాయకరావునగర్, బాబా సైలానీనగర్, మూసాపేట్ హెచ్పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. -
ముసురేసిన సిటీ!
సిటీబ్యూరో: గత మూడు రోజులుగా ‘ముసురు’తున్న వర్షంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఎడతెగకుండా విడతలుగా కురుస్తున్న వర్షంతో శిథిల భవనాలు, పురాతన గోడలు, సెల్లార్ల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పైనుంచి వరదనీరు భారీగా వస్తుండటంతో హుస్సేన్సాగర్ లోతట్టు ప్రాంతాల బస్తీల ప్రజల్లో భయం పట్టుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ బస్తీలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలానికి ముం దస్తుగా ముంపు సమస్యల్లేకుండా తగు చర్యలు చేపట్టడంలో జీహెచ్ఎంసీ ప్రతియేటా విఫలమవుతోంది. నీటి నిల్వ ప్రాంతాలకు తగిన మరమ్మతులు చేసి, వాననీరు సాఫీగా వెళ్లేలా చేయలేకపోతోంది. దీంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నగర ప్రజలకు ఎప్పటిలాగే వాన కష్టాలు తప్పేలా లేవు. 165 బస్తీలకు పొంచి ఉన్న ప్రమాదం.. భారీ వర్షాలొస్తే గ్రేటర్ పరిధిలోని దాదాపు 165 బస్తీలు నీట మునిగే ప్రమాదం ఉంది. అధికారులకు కూడా ఈ విషయం తెలుసు. అయినప్పటికీ ముంపు నివారణ చర్యల్లో, ముందస్తుగానే నీరు నిల్వలేకుండా అవసరమైన పనులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈసారీ నగరంలోని పలు బస్తీలకు వరదముంపు పొంచి ఉంది. గతంలో చెరువులను తలపింపచేసిన అఫ్జల్సాగర్, నానల్నగర్, బతుకమ్మకుంట, నాగమయ్యకుంట, సబర్మతీనగర్, అమన్నగర్, సిద్దిఖీనగర్ తదితర బస్తీలకు ప్రమాదం పొంచి ఉంది. వరదలొస్తే ముంపు బారిన పడనున్న బస్తీలు.. అంబర్పేట మండలంలోని పటేల్నగర్, ప్రేమ్నగర్, నరసింహబస్తీ, సంజయ్గాంధీనగర్, శివానందనగర్, వెంకటేశ్వరనగర్, న్యూగంగానగర్, విజ్ఞాన్పురి, పద్మానగర్(మలక్పేట),న్యూశంకర్నగర్, బతుకమ్మకుంట వైభవ్నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్బాగ్ కాలాడేరా, కమలానగర్ మూసానగర్, ఇందిరానగర్ , మూసారాంబాగ్ తదితర బస్తీలు ముంపునకు గురవుతాయి. ఆసిఫ్నగర్ మండలంలోని అఫ్జల్సాగర్, లక్ష్మీనగర్, ఇంద్రానగర్, సర్వర్నగర్. బహదూర్పురా మండలంలోని బిలాల్నగర్, బండ్లగూడ మండలంలో పార్వతీనగర్, శివాజీనగర్, అరుంధతీనగర్, సదత్నగర్, మొగల్కాలనీ, చార్మినార్ మండలంలోని సిద్దిఖీనగర్, అమన్నగర్-బి, జహంగీర్నగర్, భవానీనగర్, అమన్నగర్-ఎ, ఇష్రాఫ్నగర్, రహ్మత్నగర్, మౌలాకాచిల్లా, గంగానగర్, ముర్తుజానగర్, చంద్రానగర్, ఫరత్నగర్, సయ్యద్ సాబ్కా బాడా, బాగ్ ఎ జహరాన్, గోల్కొండ మండలంలోని తాఖత్బౌలి, ధనకోట, హీరాఖాన్, సజ్జద్ కాలనీ, రాఘవమ్మ కంచ, సదత్నగర్, సాలేహ్నగర్, లక్ష్మినగర్, అంబేద్కర్నగర్లకు ముప్పు ఉంది. హిమాయత్నగర్ మండలంలోని అంబేద్కర్నగర్, దోమలగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్, రత్నానగర్, శాస్త్రినగర్, నెహ్రూనగర్, కృష్ణానగర్. నాంపల్లి మండలంలోని ఉస్మాన్గంజ్, ఖల్సావాడి, ఫీల్ఖానా, బేగంబజార్, ధూల్పేట, లక్ష్మీదాస్బాడ, దత్తానగర్, గౌలిగూడ, ఆగాపురా. సైదాబాద్ మండలంలోని శంకేశ్వర్బజార్, చంద్రయ్య హట్స్, లక్ష్మయ్య హట్స్. అమీర్పేట మండలంలోని వెంక్యాబస్తీ, శ్యామల కుంట. ఖైరతాబాద్ మండలంలోని రాజ్నగర్, ఖైరతాబాద్ మండలంలోని ఎంఎస్ మక్తా, మారుతినగర్, బ్రాహ్మణవాడి, దోబిఘాట్(పంజగుట్ట), మారేడ్పల్లి మండలంలోని చంద్రబాబునాయుడు నగర్, అంబేద్కర్నగర్, లాలాపేట వినోభానగర్, దూద్బావి. ముషీరాబాద్ మండలంలోని సబర్మతినగర్, అరుంధతినగర్. సికింద్రాబాద్ మండలంలోని ఇందిరమ్మనగర్, కట్టమైసమ్మ (రసూల్పురా), వెంగళ్రావునగర్ బస్తీ, అమ్ముగూడ. షేక్పేట మండలంలోని హకీంపేట బస్తీ, ఎండిలైన్స్ (టోలిచౌకి), నదీంకాలనీ, డా.బీఆర్. అంబేద్కర్నగర్, ఉదయ్నగర్ కాలనీ, బీజేఆర్నగర్ (ఫిల్మ్నగర్), తిరుమలగిరి మండలంలోని సీతారాంపురం, గణేశ్నగర్, శ్రీనివాసనగర్ కాలనీ, సాయిబాబా కాలనీ, తోకట్ట గ్రామం తదితరమైనవి కూడా ప్రమాదం అంచులో ఉన్నాయి. ప్రణాళికలు తప్ప పనుల్లేవు.. వరదముప్పు పొంచి ఉన్న ఈ లోతట్టు బస్తీలు జలమయం కాకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన వరదనీటి సంపులు నిర్మించాలని, పైప్ డ్రెయిన్లు వేయాలని, అవసరమైన ఇతరత్రా పనులు చేయాలని రెండేళ్ల క్రితమే భావించినప్పటికీ నేటికీ చేయలేదు. శిథిల భవనాలతో భయం .. భయం.. శిథిల భవనాలకు తగిన మరమ్మతులు చేయడమో, కూల్చివేయడమోచేయాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తున్నా వాటి యజమానులు పట్టించుకోవడం లేరు. తాజా సమాచారం మేరకు నగరంలో 1819 శిథిల భవనాలను గుర్తించి వాటిల్లో 1248 భవనాలను కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో జరిగిందని జీహెచ్ఎంసీ పేర్కొంది. మిగతావాటిల్లో 176 భవనాలకు సంబంధించి కోర్టు వివాదాలున్నాయి. 152 భవనాల స్ట్రక్చరల్స్టెబిలిటీ పరీక్షించాల్సిందిగా ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అయితే అది ఆ పని పూర్తిచేయలేదు. ఇప్పటి వరకు 32 భవనాలను కూల్చివేసినట్లు టౌన్ప్లానింగ్ విభాగం పేర్కొంది. నిర్మాణంలో ఉన్న భవనాల సెల్లార్ల తవ్వకాల్ని వర్షాకాలంలో ఆపివేయాల్సిందిగా అధికారులు ఆదేశించినా అమలవుతున్న దాఖలాల్లేవు. -
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హైదరాబాద్: విద్యుత్ ఫీడర్ల పరిధిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు బస్తీలలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్న చార్మినార్ సీబీడీ ఏడీఈ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జంజం హోటల్, గులాబ్ షా మజీద్, పర్దా గేట్, వట్టేపల్లి తదితర బస్తీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఫలక్నుమా, రైతుబజార్, బస్సు డిపో, ఇంజన్ బౌలి తదితర బస్తీలలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాతీమానగర్, గుంటల్ షా దర్గా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ వివరించారు. -
‘మిషన్’పై పర్యవేక్షణేది?
కొరవడిన అధికారుల పర్యవేక్షణ రూ.5.53 కోట్లతో 14 చెరువులు, కుంటల మరమ్మతులు కొనసాగుతున్న పనులు రెండోదశ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ జఫర్గఢ్: ఎన్నో ఏళ్ల నుంచి నిరాధరణకు గురైన చెరువులు, కుంటలను మరమ్మతు చేసి వాటికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆయా గ్రామాల్లో రెండో విడతలో చేపట్టిన చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. 14 చెరువులు, కుంటల మరమ్మతులకు గాను ప్రభుత్వం రూ.5.53 కోట్ల నిధులను మంజూరు చే సింది. వీటికి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య శంకుస్థాపన చేయగా సంబంధిత కాంట్రాక్టర్లు పనులను ప్రారంభించారు. మండలంలో మొత్తం 13 చెరువులు ఉండగా చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 88 కుంటలు ఉన్నాయి. వీటి పరిధిలో 950 హెక్టార్లపై పైగా పంట సాగు కావాల్సి ఉంది. కొన్నేళ్ల నుంచి చెరువులు, కుంటలు ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో పాటు పూర్తిగా నిరాధరణకు గురయ్యూయి. వీటితో పాటు ఆయా చెరువులకు నీరందించే వరదకాల్వలు కూడా ఎలాంటి మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో ప్రతి వర్షాకాలంలో కురిసిన కొద్ది పాటి నీరు కూడా చెరువులు, కుంటలలోకి రాక వృథాగా పోతున్నారుు. మొదటి దశలో ఒక్క తమ్మడపల్లి (ఐ) చెరువు మినహా అన్ని చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. ఇటీవల రెండోదశలో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులు సాగరం, కోనాయిచలం, వెంకటాపూర్ గ్రామాలు మినహా మిగతా 11 గ్రామాల చెరువుల పనులు ప్రారంభమయ్యూయి. పనులపై తనిఖీలు శ్యూం మిషన్ కాకతీయ పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పనులు జరుగుతున్న సమయంలో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాల్సిన అధికారులు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కాంట్రాక్టర్లే ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నీరుగారిపోయో ప్రమాదం ఉందని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. పనులను పర్యవేక్షిస్తున్నాం మండలంలో మిషన్ కాకతీయ ద్వారా 14 చెరువులు, కుంటల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు తమ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నాం. నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అగ్రిమెంట్ ప్రకారం 90 రోజుల్లోగా పూర్తి చేయాలి. - హరి, ఐబీ డీఈ -
వెలుగు చూస్తున్న అక్రమాలు
బీటలు పడిన ఎక్కెల పెద్ద చెరువు మత్తడి ఆఫ్రాన్ ‘మిషన్’ మొదటి దశలో నిర్మాణం నాసిరకం పనులే కారణమంటున్న రైతులు ఏటూరునాగారం : మండలంలోని ఎక్కె ల పెద్ద చెరువుకు కొత్తగా నిర్మించిన మ త్తడి ఆప్రాన్ పగుళ్లు బారింది. మిషన్ కాకతీయ మొదటి విడతలో ఈ చెరువు మరమ్మతులకు రూ. 22 లక్షలు మంజూ రయ్యాయి. ఈ నిధులతో పూడికతీత ప నులు, చెరువుకట్ట పటిష్టం, మత్తడి నిర్మాణాలు, తూముల మరమ్మతులు చేపట్టారు. ఇందులో మత్తడి ముందు నిర్మించిన అఫ్రాన్ పనులు పూర్తి కాక ముందే పగుళ్లు బారడం విశేషం. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడం వల్లనే ఆఫ్రాన్ పగుళ్లు బారిందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఆఫ్రాన్ నిర్మించిన అనంతరం 21రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉంది. కానీ రెండు మూడు రో జుల క్యూరింగ్ చేయడంతో సిమెంట్తో నిర్మించిన ఆఫ్రాన్కు పగుళ్లు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనుల్లో చిన్ననీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి పనులను పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాసిరకం పనులు చేశారని ఎక్కెల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగుళ్లు బారిన ఆఫ్రాన్ను తొలగించి మళ్లీ నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై చిన్ననీటి పారుదలశాఖ డీఈఈ వెంకటేశ్వర్లను వివరణ కోరగా పగుళ్లు బారిన నిర్మాణం స్థానంలో కొత్తది నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. ఇటీవల నిర్మించిన మత్తడి వద్ద పగుళ్లు రావడంతో నాలుగు కాలాల పాటు ఉండాల్సిన మత్తడి నాలుగు రోజులకే పోయే విధంగా ఉంది. కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. - చంద రాజు, ఆయకట్టు రైతు ఎక్కెల -
యంత్రాలు ఫర్ సేల్ ?
పీడబ్ల్యూడీ వర్క్షాపు యంత్రాలు ఘన చరిత్రకు గ్రహణం టీడీపీ హయాంలో నిర్లక్ష్యపు తుప్పు ప్రకాశం బ్యారేజీ భద్రతపై నీలినీడలు ఉద్యోగుల భవిష్యత్తూ ప్రశ్నార్థకమే తాడేపల్లి రూరల్: ఎంతో చరిత్ర కలిగిన సీతానగరం పీడబ్ల్యూడీ వర్కుషాపును మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు వంద కోట్ల రూపాయల ఖరీదు చేసే యంత్రాల విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. వర్కుషాపులో యంత్రాలు స్క్రాప్ రూపంలో ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా విక్రయించాలనే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు మరమ్మతు బాధ్యతలు... 2002 వరకు పీడబ్ల్యూడీ వర్కు షాపునకు చెందిన సాంకేతిక సిబ్బంది అనేక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు గేట్లు అమర్చేవారు. ఆ తరువాత అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భారీ నీటి పారుదలకు సంబంధించిన మరమ్మతులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ గేట్లను మార్చేటప్పుడు ప్రభుత్వం టెండర్ల ద్వారా రూ. 150 కోట్ల వ్యయంతో పనులను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. వర్కుషాపులో సిబ్బంది రూ. 90 కోట్ల వ్యయంతోనే నాణ్యమైన గేట్లను అందజేస్తామన్నా వినిపించుకోలేదు. 12 ఏళ్లకే తుప్పు పట్టిన యంత్రాలు... పీడబ్ల్యూడీ వర్కు షాపులోని సిబ్బంది 1955లో ప్రకాశం బ్యారేజీ ఆనకట్టకు 10.5 ఎత్తు ఉండేలా గేట్లను తయారు చేసి అమర్చారు. 2002 వరకు అవే గేట్లు వాడకంలో ఉండేవి. సుమారు 50 ఏళ్ల పాటు పని చేసే విధంగా గేట్లను డిజైన్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కాసులకు కక్కుర్తిపడి 2002లో ఏర్పాటు చేసిన గేట్లు 12 ఏళ్లు గడిచే సరికే తుప్పుపట్టాయి. తిరిగి కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు నిర్వహించాల్సి వచ్చింది. విలువైన యంత్రాలు... పీడబ్ల్యూడీ వర్కు షాపు పెన్ స్టాక్లో గేట్లను బెండింగ్ చేసే యంత్రం భారతదేశంలో మరెక్కడా లేదు. రెండు నుంచి ఏడు అంగుళాల మందం ఉన్న ఐరన్ షీట్లను సైతం ఎటు కావాలంటే అటు వంచే విధంగా ఆ యంత్రం పని చేస్తుంది. వీటితోపాటు డ్రిల్లింగ్ మిషన్లు, వెల్డింగ్ కట్టర్స్ వర్క్ షాపులోని ప్రత్యేకతలు. ఇప్పుడు అధికార టీడీపీ ఈ వర్కు షాపును తొలగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే చరిత్రాత్మక కట్టడమైన ప్రకాశం బ్యారేజీని ఎలా రక్షిస్తారో అర్థంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
24 గంటల పాటు నీరు బంద్
సిటీబ్యూరో: అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 19న (శుక్రవారం) ఉదయం 6 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. బోయిగూడ, రైల్ కళారంగ్, పద్మారావు నగర్, సీసీ నగర్, హమాలీబస్తీ, వెంకటాపురం, బోయిగూడ సెక్షన్, పాన్బజార్, ఓల్డ్బోయిగూడ, కుర్మబస్తీ, ఆవుల మంద, రంగ్రేజ్ బజార్, గ్యాస్ మండీ, నల్లగుట్ట సెక్షన్లకు మంచినీటి సరఫరా ఉండదని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. -
నేడు ఆలస్యంగా నీటి సరఫరా
సిటీబ్యూరో: పైప్లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం వివిధ ప్రాంతాలకు ఆలస్యంగా, అరకొరగా నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. హఫీజ్పేట్ పరిధిలోని తారానగర్ సాయి మారుతి, నవతా ట్రాన్స్పోర్ట్ లేన్, తుల్జా భవాని లేన్, శంకర్ నగర్, వేముకుంట, భిక్షపతి నగర్, గౌతంనగర్, చందానగర్ సెక్షన్, ఆర్.సి.పురం పరిధిలోని ఎస్.ఎన్ కాలనీ, సాయి కాలనీ, బాంబే కాలనీ, బీడీఎల్ కాలనీ, అశోక్నగర్లకు అరకొరగా, ఆలస్యంగా నీరు సరఫరా అవుతుందని తెలిపింది. -
ఫినిష్..!
ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ బోట్లు నిలిపేందుకు జెట్టీ లేక మత్స్యకారుల అవస్థలు అక్కరకు రాని అభివృద్ధి ఫలాలు రూ.80 లక్షల ప్రజాధనం వృథా అధికారులకు ముందుచూపు లేని ఫలితం మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృథా అయ్యేలా చేసింది. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల ఫలితం ఏడేళ్ల కిందట నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా మార్చింది. మత్స్యకారుల సౌకర్యం కోసమంటూ ఫిష్ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు, ఇప్పుడు అక్కడ బోట్లు నిలిపేందుకు అనువుగా లేదని, మరో చోట నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చావుకబురు చల్లగా చెబుతున్నారు. రేపల్లె: సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల నుంచి మత్స్యకారులు మరబోట్లలో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ ప్రాంతం నుంచి సుమారు 300 బోట్లు నిత్యం సముద్రంలోకి వెళ్తుంటాయి. వీరంతా వేటాడి ఒడ్డుకు చేర్చిన మత్స్య సంపదను అమ్ముకునే వరకు నిల్వ ఉంచడానికి.. ఉప్పు నిల్వలు, వలల మరమ్మతులు వంటి కార్యకాలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీరంలో ఫిష్ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సమీపంలో ఉన్న రేవులో బోట్లు నిలిపేందుకు వీలుగా జెట్టీ నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని గొంది సముద్రంలో రూ.80 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించారు. చుట్టూ ప్రహరీ, ఇనుప గేట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాకపోకలకు అనువుగా సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తతంగమంతా జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తోంది. నేటికీ ఆ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. బోట్లు నిలిపేందుకు జెట్టీ నిర్మించలేదు. ఏళ్ల తరబడి వినియోగంలో లేకపోవడంతో రాళ్లు లేచి రోడ్డు అధ్వానంగా తయారైంది. గేట్లు తుప్పు పట్టి విరిగిపోయాయి. కాంపౌండ్ లోపల పిచ్చిమొక్కలు మొలిచి అధ్వాన స్థితికి చేరింది. మత్స్యకారుల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం అక్కరకు రాకుండాపోయింది. జెట్టీ ఏర్పాటుకు వినతి.. కొత్తపాలెం పంచాయితీ పరిధిలోని బోట్లు ఆగేందుకు అక్కడ అనువుగా జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో నిలుపుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఫిష్లాండింగ్ భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని, దానికి అనువుగా రేవులో జెట్టీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు విన్నవిస్తున్నారు. మరోచోట భవనం ఏర్పాటు చేస్తాం.. గొంది సముద్రంలో బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా లేకపోవటం వల్ల అక్కడ జె ట్టీ నిర్మాణం చేపట్టలేదు. నక్షత్రనగర్లోని రేవు వద్ద బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా ఉంది. దీంతో అక్కడే జెట్టీ ఏర్పాటు చేసి దానికి అనువుగా ఫిష్ల్యాండింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - ఎ.రాఘవరెడ్డి, మత్యశాఖ అభివృద్ధి అధికారి, నిజాంపట్నం. -
దరిచేరని కృష్ణమ్మ
అలంకారప్రాయంగా పెలైట్ ప్రాజెక్టులు నిర్వహణ లోపంతో రూ.కోట్ల ప్రాజెక్టులు నిరుపయోగం మూడు నెలలుగా మరమ్మతుల ఊసెత్తని అధికారులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దాచేపల్లి మండల ప్రజలు దాచేపల్లి : ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన పెలైట్ ప్రాజెక్టులు అలంకార ప్రాయంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అవి కాస్తా మూలనపడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడు లేరు. దీంతో వేసవికి ముందే గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అప్పటి గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి దాచేపల్లి మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేశారు. కృష్ణా జలాలను గ్రామాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం తాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయి. మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రూ.1.50 కోట్లు, దాచేపల్లిలో రూ.4 కోట్లు, తంగెడలో రూ.75 లక్షలతో తాగునీటి పెలైట్ ప్రాజెక్ట్లను నిర్మించారు. వీటిని 2006లో ప్రారంభించారు. శ్రీనగర్లో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి శ్రీనగర్, రామాపురం, గామాలపాడు, శ్రీనివాసపురం గ్రామాలకు, జేపీ సిమెంట్స్ఫ్యాక్టరీ కాలనీకి నీరు సరఫరా చేయాలని, అదేవిధంగా దాచేపల్లి ప్రాజెక్ట్ నుంచి దాచేపల్లి, నడికుడి, యిరికేపల్లి గ్రామాలకు, తంగెడలో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి అదే గ్రామానికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టారు. పొందుగల గ్రామ సమీపంలోని కృష్ణానది నుంచి మోటర్ల ద్వారా నీళ్లు తోడి పైపుల ద్వారా శ్రీనగర్, దాచేపల్లి ప్రాజెక్ట్లకు పంపింగ్ చేస్తారు. అక్కడ ఫిల్టర్ చేసిన నీటిని గ్రామాలకు సరఫరా చే స్తారు. మరమ్మతులకు గురైన మోటార్లను పట్టించుకోకపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. మరమ్మతులు పట్టని అధికారులు.. శ్రీనగర్, దాచేపల్లి గ్రామాల్లోని పెలైక్ట్ ప్రాజెక్ట్లు పనిచేయటం లేదు. పొందుగల సమీపంలోని నదిలో నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ఐదు మోటర్లు మూడు నెలల క్రితం మరమ్మతులకు గురయ్యాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భూ గర్భజలాలు అడుగంటి పోవటంతో గ్రామాల్లోని బోర్ల నుంచి తాగునీరు రాకపోవటంతో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. తంగెడ గ్రామంలో నిర్మించిన పెలైక్ట్ ప్రాజెక్ట్ నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి మూడు రోజులకోసారి కృష్ణా జలాలను అందిస్తున్నారు. గ్రామంలోని కాలనీలకు పైపులైన్లు నిర్మించకపోవటం వల్ల నీరు సరఫరా కావడం లేదు. -
రైతు గుండెకు గండి
చెరువులను విస్మరించిన వైనం మరమ్మతుల జాడ లేదు ‘నీరు-చెట్టు’లో అత్యవసర పనులకు లభించని ప్రాధాన్యత మట్టి పనులకే పరిమితం ఫలితంగా భారీ వర్షం నీరంతా వృథా తిరుపతి: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలకు భారీగా చెరువులకు నీరు చేరింది. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వచ్చిన వెంటనే వృథాగా పోయింది. చెరువులపై పర్యవేక్షణ కొరవడటం,అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతుల పాలిట శాపంగా మారింది. తూములు,మరవలు,కట్టలతో పాటు పలు గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో వచ్చిన నీరు అంతా వృధాగా పోయింది. పలుచోట్ల చెరువులు తెగి, గ్రామాల్లోకి నీరు చేరడంతో పాటు, పంట పొలాలు కోతకు గురై అన్నదాతలకు ఆవేదనను మిగిల్చాయి. కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతంలో 50 శాతంకు పైగా చెరువులు నిండలేదు. వరుస కరువులతో తల్లడిల్లిన జిల్లా వాసులకు వర్షాలు ఉపశమనం ఇస్తాయనుకున్నా పాలకుల నిర్లక్ష్యంతో ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు. దాదాపు 200 చెరువులకు గండ్లు పడినీరు నిరుపయోగంగా పోయింది. కాళంగి రిజర్వాయర్ గేట్లు విరిగి పోవడంతో భారీగా వరద నీరు వచ్చినా ఫలితం దక్కలేదు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో 30టీఎంసీల నీటినినిల్వ చేసుకొనే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం గమనార్హం. కాళంగి రిజర్వాయర్ సామర్థ్యం 241 ఎంసీఎఫ్టీ కాగా ప్రస్తుతం అక్కడ కేవలం 18 ఎంసీఎఫ్టీ అడుగుల నీరు మాత్రమే పరిమితమైంది. పెద్దెరు నీటి నిల్వసామర్థ్యం 590 ఎంసీఎఫ్టీలుకాగా డ్యాంలో 443 ఎంసీఎఫ్టీల నీరు చేరింది.పీలేరు నియోజక వర్గంలో మేడికుర్తి ప్రాజెక్టుకు గండి పడటంతో డ్యాంలో నీరు కొద్ది మేర మ్రామే ఉన్నాయి. నీరు-చెట్టు పనులు సక్రమంగా చేసి ఉంటే... జిల్లాలో రూ.136 కోట్ల మేర 3079 నీరు-చెట్టు పనులకు అధికారులు అనుమతులిచ్చారు. ఇందులో 2670 పనులు పూర్తి కాగా రూ. 88 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులను అత్యవసర పనులకు వినియోగించి ఉంటే పలు చెరువుల్లోకి భారీగా నీరు చేరేది. రైతులకు లబ్ధి చేకూరేది. పలుచోట్ల చెరువు తూములు,మరువలు, సిమెంట్ కాంక్రీట్ పనులు చేయక పోవడం వల్లే నీరు వృథాగా పోయిందనిరైతులు ఆవేదన చెందుతున్నారు. నీరు-చెట్టు నిధులను కేవలం మట్టి పనులకు ఉవయోగించి అధికార పార్టీ నేతలకు లబ్ధి కలిగించారని ఆరోపిస్తున్నారు. వాటిని సక్రమంగా ఉవయోగించి ఉంటే సత్ఫలితాలు వచ్చేవని పలువురు రైతులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు నీరు వచ్చే కాలువలు, పంటకాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినా ఒక్క భూగర్భ జలాల విషయంలోనే మేలు జరిగిందనేది వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ప్రత్యేక నిధులు నీటిపాలు
ఓహెచ్ఆర్ల రిపేర్లకు రూ.1.57కోట్లు పనులన్నీ ఐదులక్షల లోపే అవసరం లేని చోటు వృథాగా ఖర్చు విశాఖపట్నం : రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని జిల్లాలకు కేంద్రం కేటాయించిన నిధులను కొన్నిశాఖలు అర్థంపర్థంలేని పనులకు కేటాయిస్తున్నాయి. రెండు విడతల్లో రూ.100 కోట్లు జిల్లాకు విడుదల కాగా..తొలివిడతలో మంజూరైన నిధుల్లో రూ.42 కోట్లు వివిధ శాఖలు ప్రతిపాదించిన పనులకు కేటాయించారు. ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధకశాఖ, డ్వామా, వ్యవసాయ, ఉద్యానవనశాఖలు కనీస అవసరం లేనిచోట్ల వృథాగా ఖర్చుచేసేందుకు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఎస్కు కేటాయించిన రూ.1.57కోట్లలో రూ.కోటి ఓహెచ్ఆర్ ట్యాంకుల మరమ్మతులకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. మూలనపడ్డ 13 పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.57.2 కోట్లు కేటాయించిన ఈ శాఖ శిథిలావస్థకు చేరిన 31 ఓహెచ్ఆర్ ట్యాంకుల మరమ్మతుల కోసమంటూ రూ.కోటి కేటాయించింది. ఒకటిరెండు పనులు మినహా మిగిలిన పనులకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలలోపే కేటాయింపులు జరిగాయి. డుంబ్రిగుడ మండలంలో ఏడు పీడబ్ల్యూఎస్ స్కీంల పునరుద్ధరణకు రూ.41 లక్షలు, పెదబయలు మండలంలో రెండు స్కీంలకు రూ.5.70 లక్షలు, కోటవురట్ల మండలంలో మూడు పథకాలకు రూ.5.50 లక్షలు, పాయకరావుపేట మండలం పాల్తేరు వద్ద నిరుపయోగంగా ఉన్న పీడబ్ల్యూఎస్ స్కీం పునరుద్ధరణకు రూ.5లక్షలు కేటాయించారు. ఇక ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకుల మరమ్మతుల పేరిట బుచ్చెయ్యపేట మండలంలో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనాతో మూడు పనులకు ప్రతిపాదించారు. రావికమతం మండలంలో రూ.8.20 లక్షలతో 4 పనులకు, దేవరాపల్లి మండలంలో రూ.5.50 లక్షలతో ఐదు పనులకు, పాడేరులో 8 పనులకు రూ.21లక్షలు, పెదబయలు మండలంలో ఆరులక్షలతో రెండు పనులకు, రూ.2.50 లక్షల అంచనాతో బుచ్చెయ్యపేట,నక్కపల్లి మండలాల్లో ఒక్కొక్కటి, పాయకరావుపేటలో మూడు, కోటవురట్ల, పరవాడ లలో ఒక్కొక్కటి,పెందుర్తి రెండుపనులకు ప్రతిపాదించారు. దాదాపుఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు లన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ట్యాంకులైతే కనీస మరమ్మతులకు సైతం నోచుకోని దుస్థితి. అలాంటి శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు సైతం ప్రత్యేక మరమ్మతుల పేరిట ఈ ప్రత్యేక నిధులు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. జర్మన్ టెక్నాలజీతో వీటిని తిరిగి వినియోగంలోకి తీసుకొస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నప్పటికీ వీటిలో చాలా వరకు కనీసమరమ్మతులకు పనికిరానిస్థితిలో ఉన్నాయి. రూ.లక్షలుపోసివీటికి పైపై మెరుగులు దిగ్గినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మళ్లీ కొద్దిరోజుల్లోనే శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జీర్ణావస్థలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు మరమ్మతుల పేరిట లక్షలు వెచ్చించే బదులు వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మేలన్న వాదన వినిపిస్తోంది. మరో పదేళ్లు ఢోకా ఉండదు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ జర్మన్ టెక్నాలజీ ద్వారా మరమ్మతులు చేయడం వల్ల కనీసం పదేళ్ల పాటు వినియోగంలోకి తీసుకురావచ్చు. జీర్ణావస్థలో ఉన్న ట్యాంకులోని ఇనుప ప్రేమ్లకు పోర్స్రాక్ మెటీరియల్, జియోబ్యాండ్ కెమికల్ను అప్లై చేసి తిరిగి రంగు, సిమ్మెంట్ పూత వేస్తే చాలు..పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుంది. సొమ్ములు వృధా కావు.. -తోట ప్రభాకరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
పూరి-చెన్నై రైలులో పొగలు
పూరి - చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడంతో.. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం స్టేషన్ సమీపంలో పావుగంట పాటు నిలిచి పోయింది. బ్యాటరీ బోగీ నుంచి పొగలు రావడం గమనించిన గార్డు అధికారులకు సమాచారం అందిచాడు. వారి సూచనల మేరకు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రైలును ఆపేశారు. మరమ్మత్తుల అనంతరం రైలు బయలు దేరింది. -
ఛిద్రం.. జర భద్రం
రోడ్లపై గుంతలు పొంగుతున్న నాలాలు ఏటా తప్పని కష్టాలు మేలుకోని అధికారులు ఇదీ విశ్వ నగర ‘చిత్రం’ అడుగడుగునా గుంతలు... మడుగులను తలపించేలా నీళ్లు... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... వెన్ను విరిగే ప్రమాదం... ఇదీ మహా నగర రహదారుణ చిత్రం. వాన దెబ్బతో ‘విశ్వ’నగరం అసలు రూపం మరోసారి బట్టబయలైంది. రోడ్లపై గోతులు గ్రేటర్ దుస్థితిని తెలియజెప్పాయి. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది. యంత్రాంగం పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ’సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్...జూబ్లీహిల్స్...బాలానగర్... ఎల్బీనగర్... ఏ మార్గమైనా ఒకటే రూపం. కాలు కింద పెడితే ఏ గోతిలో దిగిపోతామోననే భయం. వాహనం బయటకు తీస్తే ఏ గుంతలో పడి... ఎముకలు విరగ్గొట్టుకుంటామోననే భీతి. ఇదీ మహానగరంలో వర్షం వస్తే ప్రజల దుస్థితి. దారి పొడవునా గోతులు... నిలిచిపోయే నీళ్లు వాహనదారులకు, పాదచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. ఫ్లై ఓవర్ల వైపు చూస్తున్న అధికారులు...ప్రజాప్రతినిధులు నాలాలు, రహదారులపై దృష్టి సారించ డం లేదు. దీంతో నగర ప్రజలకు అవస్థలు తప్పడం లే దు. వానా కాలంలో సమస్యలు తలెత్తకుండా వేసవిలోనే చర్యలు తీసుకోవాలి. నాలాల్లో పూడిక తొలగింపు... లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన మరమ్మతులు చేస్తే చాలా వరకు సమస్యలు తలెత్తవు. కానీ ఈ దిశగా యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. షరా మామూలుగా నాలాలు సీజనల్ సమస్యల నుంచి బయట పడేందుకు చేపట్టాల్సినతాత్కాలిక పనులు కూడా లేకపోవడంతో ప్రజలకు కడగండ్లు తప్పడం లేదు. ఏటా నాలాల్లో పూడికతీత పనుల పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ... వర్షం వ స్తే నీరు వెళ్లే మార్గం లేదు. దీంతోఅవి పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది 749 కి.మీ. మేర పనులు చేపట్టాల్సి ఉంది. ఏ మేరకు జరిగాయో అధికారులకే తెలియాలి. నగరంలోని నాలాలు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించుకుపోయాయి. ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. 30 నాలాలున్నా వివరాల్లేవు.. గ్రేటర్లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప... కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. ఈ నాలాల వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది. కంకర తేలి... బంజారాహిల్స్: భారీ వర్షాలకు రోడ్లపైన తారు కొట్టుకుపోవడంతో కంకర తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లు అడుగడుగునా దెబ్బతిన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పది రోజుల క్రితమే బీటీ రోడ్డు వేశారు. నాలుగు రోజుల క్రితం పైప్లైన్ కోసం తవ్వి గాలికి వదిలేశారు. ఇటీవల వర్షాలకు రోడ్డంతా కొట్టుకుపోయి వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. అటు వె ళ్లాలంటే భయం దూలపల్లి: నర్సాపూర్ రాష్ట్ర రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బహదూర్పల్లి చౌరస్తా నుంచి గండిమైసమ్మ వరకు గల రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఈ రహదారి గుండా మెదక్, బోధన్, నిజామాబాద్లకు ఆర్టీసీ బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలతో వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయ పడుతున్నారు. వర్షం పడితే ఇక వారి ఇబ్బందులు చెప్పనలవి కాదు. రహదారులను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనల్లోనూ నాలాలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్యాచరణ మొదలు కాలేదు. అమలు ఎప్పుడో.. తొలి దశలో 350 కి.మీ. మేర నాలాలను అభివృద్ధి చేయాలని గత నవంబర్లో నిర్ణయించారు. దశల వారీగా పనులు చేయాలనుకున్నారు. దీనికి ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. కానీ వారెక్కడ పని చేస్తున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితులతో వానొచ్చిన ప్రతిసారీ నగర ప్రజలకు సంతోషం కంటే.. ఇంటి నుంచి బయటకు వెళితే...తిరిగి రాగలమా? అనే సందే హమే వేధిస్తోంది. వెన్నువిరుస్తున్న రహదారులు అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు... గత నాలుగైదు రోజులుగా కురిసిన వానతో మరింత దెబ్బతిన్నాయి. గుంతలు మరింత ఎక్కువై... కంకరతేలిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు. వాహనదారులు గోతుల్లో పడి వెన్ను విరగ్గొట్టుకుంటున్నారు. మెట్రో పనులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, కేబుల్ సంస్థలు రోడ్లను ఇష్టానుసారం తవ్వి పారేస్తున్నాయి. వర్షం పడినప్పుడు నీరు నిలిచి... ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. -
‘స్మార్ట్’ జర్నీ
ప్రధాన మార్గాల్లో ‘వైట్ టాపింగ్’ 1000 కి.మీ.ల నిర్మాణం టాప్-20లో చోటుకు యత్నాలు సిటీబ్యూరో: ‘స్మార్ట్’ సిటీల జాబితాలో చోటు కోసం జీహెచ్ఎంసీ వడివడిగా అడుగులు వేస్తోంది. అందులోనూ టాప్-20లో ఉండాలని పోటీ పడుతోంది. ‘వైట్టాపింగ్’ రోడ్ల మీదుగా గమ్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెం.10లో ఇటీవల నిర్మించిన వైట్టాపింగ్తో మంచి ఫలితం కనిపించడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. గ్రేటర్లోని మొత్తం రహదారులు 8803 కి.మీ. కాగా... వీటిలో 4052 కి.మీ. బీటీ రోడ్లు. వీటి మరమ్మతులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ.250 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా అవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లోని దాదాపు 1000 కి.మీ. మేర దశల వారీగా వైట్టాపింగ్ నిర్మించాలని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీపైఅధిక భారం పడకుండా కాంట్రాక్టర్లకు దశల వారీగా బిల్లులు చెల్లించాలని అనుకుంటున్నారు. ఉదాహరణకు రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తే తొలుత రూ.200 కోట్లు చెల్లిస్తారు. ఏటా రూ.200 కోట్ల వంతున మరో నాలుగేళ్లు చెల్లిస్తారు. మొత్తం ఐదేళ్ల పాటు ఇలా చెల్లిస్తారు. వైట్టాపింగ్ రోడ్లు 20 ఏళ్లకు తగ్గకుండా... 30 ఏళ్ల వరకు మన్నికగా ఉంటాయి కాబట్టి... ఈ విధానం అనువైనదని భావిస్తున్నారు. ఎక్కడైనా నిర్మాణ లోపాలుంటే.. సరిచేశాకే బిల్లులు చెల్లిస్తారు. ఏటా 100 నుంచి 200 కి.మీ.ల మేర పనులు చేపట్టాలని యోచిస్తున్నారు. తొలిదశలో ఎంపికయ్యే స్మార్ట్సిటీల జాబితాలో గ్రేటర్కు స్థానం కోసం దీని ద్వారా కొంత స్కోర్ లభించే అవకాశం ఉందని అధికారుల అభిప్రాయం. ఎంపిక చేసిన మార్గాల్లో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పనులు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్మార్ట్సిటీలపై హెచ్ఐసీసీలో జరిగిన రీజినల్ వర్క్షాప్లో విలేకరులకు ఈ విషయం చెప్పారు. అందరిదీ అదే టార్గెట్ మొదటి దశలో ఎంపిక చేయనున్న 20 నగరాల్లో చోటు కోసం వివిధ రాష్ట్రాల వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వర్క్షాపునకు హాజరైన వారు తమ వంతుగా పోటీ పడుతున్నట్టు కనిపించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ, చండీగఢ్, అహ్మదాబాద్, గ్రేటర్ ముంబై, అమృత్సర్, చెన్నై, కోయంబత్తూరు, వారణాసి తదితర నగరాలు మొదటి దశ కోసం పోటీలో ఉన్నాయి. స్మార్ట్సిటీ లుగా ఎంపికైన వంద నగరాలకు డీపీఆర్ల కోసం రూ.2 కోట్ల వంతున కేంద్రం కే టాయించడంతో ఆ దిశగా వారు పనులు ప్రారంభించారు. పరుగులో హైదరాబాద్.. టాప్-20లో చోటు కోసం జీహెచ్ఎంసీ కూడా యత్నిస్తోంది. డీపీఆర్ల త యారీ కోసం కన్సల్టెంట్ల ఎంపికకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే ప్రారంభించిన ఈ-ఆఫీస్, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక యాప్, 24 గంటల కాల్సెంటర్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఈ లైబ్రరీలు, రెండు చెత్త డబ్బాల విధానం, డెబ్రిస్ రీసైక్లింగ్ , మెట్రో రైలు వంటివి స్మార్ట్సిటీగా ఎంపికకు కొంతవరకు ఉపకరిస్తాయి. ఇతర అంశాలపైనా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. డీపీఆర్ రూపకల్పనతోనే తొలిదశలో ఎంపికయ్యేందుకు వీలుండటంతో ఆ వివరాలు వెల్లడించడం లేదు. విద్యుత్, నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీరు, మల్టీమోడల్ రవాణా, సైబర్ కనెక్షన్, రహదారులు, ఎయిర్పోర్ట్, రైల్వేల కనెక్టివిటీ, హౌసింగ్, డిజాస్టర్, హెల్త్కేర్, వేగంగా సేవలు, నిఘా, భద్రత, పన్నులు, పారదర్శకత, జవాబుదారీతనం, స్కిల్ డెవలప్మెంట్, పౌర సలహా కమిటీలు వంటి వాటిపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా... జీహెచ్ఎంసీ ఏటా దాదాపు రూ.5 వేల కోట్ల బడ్జెట్ను ఆమోదిస్తున్నప్పటికీ అధ్వానపు రహదారులు.. వర్షం కురిస్తే రోడ్లపై వెలిసే చెరువులు.. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని సమస్యలు...అలాగే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదికి రూ. 100 కోట్లు కేటాయిస్తే నగరాలు స్మార్ట్గా మారతాయా? అంటే మారవనే అభిప్రాయపడుతున్నారు నిపుణులు. రాత్రికి రాత్రే నగర ముఖచిత్రం మారకపోయినా.. ఈ నిధులతో నిర్ణీత ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే... మరి కొంతమంది నుంచి తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ వస్తుందని భావిస్తున్నారు. దశల వారీగా నగరం మొత్తం అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏటా రూ.వంద కోట్ల వంతున ఐదేళ్లకుకేంద్రం రూ. 500 కోట్లు ఇస్తుంది. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయిస్తే రాబోయే రోజుల్లో స్మార్ట్గా మారేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 కి.మీ.ల పరిధి లేదా ఒక సర్కిల్ లేదా రెండు, మూడు డివిజన్లు.. ఒక నియోజకవర్గం ఇలా కొంత ప్రాంతాన్ని ‘స్మార్ట్’గా తీర్చిదిద్దితే క్రమంగా మిగతా ప్రాంతాలూ ఈ బాటలో నడిచే అవకాశం ఉందని అధికారుల యోచన. -
దారిద్య్రం
నగరంలో రోడ్ల విస్తీర్ణం 762.015 కి.మీ దెబ్బతిన్న రహదారులు 120.34 కి.మీ అడ్డగోలు తవ్వకాలతో ధ్వంసం పట్టించుకోని అధికారగణం ప్యాచ్ వర్కులతో సరి వర్షం పడితే మళ్లీ యథాతథ స్థితి ఊరు గతి ఇంతే.. రోడ్డు గతుకింతే.. రోడ్డున్న ఊరికీ సుఖము లేదంతే.. ..అని పాడుకోవాల్సి వస్తోంది నగర రోడ్ల దుస్థితిని చూసి. ఆర్ అండ్ బీ రహదారుల నుంచి డివిజన్లోని గల్లీ వరకూ మరమ్మతులకు నోచుకోని ఏ రోడ్డులో ప్రయాణించినా ఒళ్లు హూనం కావాల్సిందే. నిత్యం గుంతల రోడ్ల మీదుగా వెళ్లే అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా.. అనే అనుమానం సామాన్యుడికి కలగక మానదు. ముఖ్యమంత్రో, మంత్రులో వచ్చినప్పుడు మాత్రం మసిపూసి మారేడుకాయ చేసిన చందాన అప్పటికప్పుడు ప్యాచ్వర్క్లు పూర్తిచేసి కవరింగ్ ఇస్తారు. గట్టిగా వర్షం పడినా, లోడు లారీ ఆ రోడ్డుపై వెళ్లినా కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ అతుకుల గతుకుల రోడ్లపై నరకప్రాయమైన ప్రయాణం సంగతి అటుంచితే.. నడవడం కూడా కష్టమేనని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. విజయవాడ సెంట్రల్ : నగరంలోని ప్రధాన రహదారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. నిధులలేమి నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్యాచ్ వర్కులతో సరిపెడుతున్నారు. అవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ఫలితంగా గతుకుల రోడ్లపైనే ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. నగరంలో 762.015 కిలోమీటర్ల మేర కార్పొరేషన్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. శాఖల మధ్య సమన్వయలోపం, ముందస్తు ప్రణాళికలు కొరవడటంతో నిర్మించిన కొద్దిరోజులకే రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నగరంలో 120.34 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నది అం చనా. ఒకటి, రెండు సర్కిళ్ల పరిధిలో రోడ్లు ఎక్కువగా ఛిద్రమయ్యాయి. అంతంతమాత్రమే.. రోడ్ల నిర్మాణంలో నగరపాలక సంస్థ నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. నాసిరకం మెటీరియల్తో హడావుడిగా వర్కులు పూర్తిచేయడం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నీటిపైపులు, టెలిఫోన్, విద్యుత్ లైన్ల ఏర్పాటు.. ఇలా ఏదో ఒక కారణంతో రోడ్లను పగలకొడుతున్నారు. సంబంధిత శాఖల నుంచి లేదా ప్రయివేటు సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినప్పటికీ పనులు పూర్తయ్యాక రోడ్లను పూడ్చడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మ్యాన్హోల్స్ రోడ్డు కంటే ఎక్కువ లోతులో ఉండటం వల్ల గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి వాహనచోదకులు జారి పడిపోతున్నారు. ఇక వర్షం వచ్చినప్పుడైతే ప్రయాణం నరకమే. దెబ్బతీస్తున్న డ్రెయిన్లు నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రహదారులు తరచూ కోతకు గురవుతున్నాయి. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రహదారులపై పడుతోంది. హౌసింగ్ బోర్డులు, ఉడాలు నగరంలో కాలనీలు నిర్మించాయి. కొత్తగా కాలనీలు ఏర్పాటుచేసే సందర్భంలో మురుగు, వర్షపునీరు సక్రమంగా పోయేందుకు డ్రెయిన్లు, రోడ్లను తగిన ఎత్తులో నిర్మించాల్సి ఉన్నప్పటికీ అలా జరక్కపోవడంతో వర్షం వస్తే రోడ్లు నీట మునిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మాకు ఇచ్చేయండి : కార్పొరేషన్ ఏలూరు, బందరు కెనాల్, సీకే రెడ్డి, కేటీ రోడ్లను ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 70.12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు, ఆర్అండ్బీకి ఇటీవలే లేఖ రాశారు. విజయవాడ రాజధాని నగరంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ వచ్చి పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు మరమ్మతులకు గురైతే పనులు ఎవరు చేయాలనే దానిపై స్పష్టత కొరవడుతోంది. ఈ క్రమంలో ప్రధానమైన రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు కోరుతు న్నారు. రూ.30 కోట్లతో పనులు స్పెషల్ గ్రాంట్, 13వ ఫైనాన్స్ నిధులు రూ.30 కోట్లతో నగరంలో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో 200 రోడ్డు పనులు ఉన్నాయి. మరో నెలన్నరలో పూర్తవుతాయి. అప్పుడు రహదారి కష్టాలు తీరతాయి. స్వల్పంగా దెబ్బతిన్న రోడ్లకు నాలుగు నెలల క్రితమే ప్యాచ్ వర్కులు పూర్తిచేశాం. నైజాంగేటు వద్ద కల్వర్టు, డ్రెయిన్ల నిర్మాణానికి గానూ ఇటీవలే రైల్వేశాఖకు రూ.7.20 కోట్లు చెల్లించాం. పనులు జరుగుతున్నాయి. - ఎంఏ షుకూర్, చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ -
‘స్వచ్ఛ’మే లక్ష్యం
ఉత్సాహంగా ‘స్వచ్ఛ హైదరాబాద్’ మంత్రులు...అధికారుల నిమగ్నం సీఎం... మంత్రులు... అధికారులు... ఒక్కటిగా కదలి వస్తున్నారు. పరిశుభ్రతకే పరిమితం కాకుండా... బస్తీలు... కాలనీల్లో నెలకొన్న చిన్నపాటి సమస్యల పరిష్కారానికీ ప్రాధాన్యమిస్తున్నారు. ఇది జనాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ఉల్లాసంగా పాల్గొనేలా చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రివర్గం... అధికార యంత్రాంగం పాల్గొన్నారు. చెత్త కుప్పలు తొలగించడంతో పాటు మురుగు కాలువలు శుభ్రం చేయడం... రహదారులకు మరమ్మతుల వంటి పనులు చేపట్టారు. ఈ పనుల్లో స్థానికులూ మమేకమయ్యారు. తమ ప్రాంతాన్ని బాగు చేసుకునేందుకు ముందుకొచ్చారు. తరలించిన చెత్త: 438 టిప్పుల ద్వారా 1326 మెట్రిక్ టన్నులు. నిర్మాణ వ్యర్థాలు: 2706 ట్రిప్పులు 7020 మెట్రిక్ టన్నులు . రెండు కలిపి: 3144 ట్రిప్పులు ద్వారా 8346 మెట్రిక్ టన్నులు తరలించారు. రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేత సీసీ రోడ్లపై 1863 బీటీ రోడ్లపై 1832 పుట్పాత్రిపేర్లు 80 వర్షపు నీటి గుంతలు 224 వరద నీటి కాల్వల మరమ్మతులు 40 మురుగునీటి కాల్వలు 251 మొత్తం 4290 జలమండలి పనులు : 262 వీటికి అయిన ఖర్చు : రూ.1350.42 లక్షలు డ్రైనేజీ పనులకు అరుున ఖర్చు: రూ.3056.34 లక్షలు వరద కాల్వల పనులు: రూ.812.75 లక్షలు రోడ్ల మరమ్మతులు: రూ.5289.63 లక్షలు. పార్కులు ప్లే గ్రౌండ్స్ పనులు: రూ.419.84 లక్షలు కమ్యూనిటీ హాళ్లు, లైబ్రరీలు: రూ.6757.48 లక్షలు మొత్తం పనులు: 2310 మొత్తం ఖర్చు: రూ. 17,686.46 లక్షలు -
నిర్లక్ష్యపు తూట్లు
అమలాపురం : గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెస్తున్నట్టు ఉంది నాబార్డ తీరు. కొన్నేళ్ల కిందట నాబార్డ నిధులతో నిర్మించిన రహదారులు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. స్వల్ప మొత్తంతో మరమ్మతులు చేస్తే ఇవి మరి కొన్నేళ్లపాటు వినియోగంలో ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా నాబార్డు ఇందుకు నిధులు మంజూరు చేయడం లేదు. ఇటు ప్రభుత్వం కూడా వివక్ష చూపుతోంది. ఇదిలాగే కొనసాగితే ఈ రోడ్లు మరింత ధ్వంసమై, తిరిగి కోట్ల రూపాయలతో పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ప్రతి ఏటా రోడ్ల నిర్మాణానికి నాబార్డ నిధులు మంజూరు చేసేది. 2009 సెప్టెంబర్ నుంచి దీనిని నిలిపివేసింది. 2008-09లో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో జిల్లాలో కోట్లాది రూపాయలతో రహదారులు నిర్మించారు. జిల్లావ్యాప్తంగా ఒక్క 2009లోనే సుమారు రూ.50 కోట్లతో రోడ్లు నిర్మించింది. అమలాపురం పంచాయతీరాజ్ (పీఆర్) డివిజన్ పరిధిలోని అయినవిల్లి మండలంలోనే రూ.3.20 కోట్లతో ఎనిమిది రోడ్లు నిర్మించారు. దీనినిబట్టి ఆ ఏడాది నాబార్డ ఆధ్వర్యాన జిల్లాలో రహదారులు ఏ స్థాయిలో నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తరువాత నుంచి రోడ్ల నిర్మాణానికి నిధుల విడుదలను నాబార్డ నిలిపివేసింది. కొత్తగా ఎటువంటి నిర్మాణమూ చేపట్టలేదు. అదే సమయంలో తమ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు సైతం నిధులు విడుదల చేయడం లేదు. పీఆర్ ఆధ్వర్యంలో 20 మిల్లీమీటర్ల మందంతో బీటీ రోడ్లను నిర్మిస్తారు. వీటి ఆయుష్షు ఐదేళ్లు మాత్రమే. అదే ఆర్అండ్బీ ఆధ్వర్యంలో నిర్మించే తారు రోడ్డు మందం 50 మిల్లీమీటర్లు ఉంటుంది. వీటి జీవితకాలం పదేళ్లు. ఆర్అండ్బీ రోడ్లతో పోల్చుకుంటే పీఆర్ రోడ్లపై దమ్ము చక్రాల ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతూంటాయి. దీనివల్ల ఈ రహదారులు చాలా త్వరగా దెబ్బతింటున్నాయి. పెద్దపెద్ద గోతులు పడి రాళ్లు లేచిపోతున్నాయి. వాహనచోదకులు ఇక్కట్ల పాలవుతున్నారు.ఐదేళ్ల కాలం పూర్తయినందున నాబార్డ నిధులతో 2009లో నిర్మించిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. గోతులను పెద్ద మెటల్తో పూడ్చడంతోపాటు మరోసారి 20 ఎంఎం మందంతో చిన్న చిప్తో తారు వేయాలి. ఈ మేరకు నాబార్డకు పీఆర్ అధికారులు ప్రతిపాదనలు పంపినా అనుమతి రాలేదు. సింగిల్ లేయర్ తారు రోడ్డు నిర్మాణం చేయకుంటే రహదారి కిందిభాగంలోని బ్లాక్ మెటల్ కూడా లేచి మొత్తం రోడ్డును పునర్నిర్మించాల్సి వస్తుంది. సింగిల్ లేయర్ నిర్మాణానికి కిలోమీటర్కు రూ.8 లక్షల వరకూ అవుతుండగా, మొత్తం రోడ్డును పునర్నిర్మించాల్సి వస్తే కిలోమీటర్కు రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తుంది. ఒకవేళ పీఆర్ నిధులతో ఈ పనులు చేయాలనుకున్నా.. పుష్కరాలవంటి అత్యవసర పనులకే ప్రభుత్వం నుంచి ఈ శాఖకు నిధులు రాలేదు. ఇక రోడ్ల మరమ్మతులకు కేటాయింపులంటే అత్యాశే అవుతుంది. పరిస్థితిని గుర్తించి రహదారుల మరమ్మతులకు నాబార్డ నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
21,22 తేదీల్లో నీళ్లు బంద్
సిటీబ్యూరో: మంజీర ఫేజ్-2 పంపింగ్ మెయిన్కు మరమ్మతుల కారణంగా ఈ నెల 21,22 తేదీ(బుధ, గురువారాలు)ల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. కేపీహెచ్బీ, హైదర్నగర్, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్, భాగ్యనగర్ సెక్షన్, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, బొల్లారం ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. -
నత్తనడకన ‘మిషన్ కాకతీయ’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటలను ‘మిషన్ కాకతీయ’ పేరుతో మరమ్మతులు చేయాలనే ప్రభుత్వ సంకల్పం అంత త్వరగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. పనుల గుర్తింపు, అంచనా, టెండర్లు, పునరుద్ధరణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు ఈ కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరిపిన విష యం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంనాటికి ప్రతిపాదనలు సమర్పించి, నెలాఖరులో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు. అధికారులు, సిబ్బంది కొరత తదితర కారణాలు ఉన్నప్పటికీ, మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా 615 చెరువులను పరిగణనలోకి తీసుకున్నారు. వీటి అంచనాలు తయారు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి వరకు 460 చెరువులనే సర్వే చేసిన అధికారులు, బుధవారంనాటికి 257 చెరువుల పునరుద్ధరణకు సంబంధించి రూ.131.19 కోట్ల అంచనా తో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంకా 315 చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ నెలాఖరులో సాధ్యమేనా? ఆ తర్వాత మూడు నెలలలో పూర్తి కాకపోతే పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్యాచరణ ప్రణాళిక ఇదీ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 615 చెరువులు,కుంటల మరమ్మతులు,పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొం దించారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల లో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు వేశారు. అయితే, ఇప్పటి వరకు 460 చెరువులు, కుంటలను సర్వే చేసి అంచనాలను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మార్గదర్శకాల మేర కు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయా ల్సి ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ కారణాలతో అంచనాలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. రెండు నెలల వ్యవధిలో 257 చెరువులే టెండర్ల స్థాయికి చేరగా, మూడు నెలలలో మిగతా 358 చెరువుల పనుల అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం అవుతుందన్న చర్చ జరుగుతోంది. కబ్జాలపై ముందుకు సాగని ‘ఉమ్మడి పరిశీలన’ ఓ వైపు చెరువుల, కుంటల పునరుద్ధరణ కోసం అంచనాల తయారీలో జాప్యం జరుగుతోంది. మరోవైపు కబ్జాలకు గురైన శిఖములను స్వాధీనం చేసుకునేం దుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త తని ఖీలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ రెండు శాఖ ల మధ్యన సమన్వయం లేదన్న విషయంలో ‘‘రెవె న్యూ శాఖ తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తోం ద’’ని స్వయంగా మంత్రి హరీష్రావు వ్యాఖ్యానించారు. సత్వరమే కబ్జాలకు గురైన చెరువులు, కుంటల శిఖం భూములను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీపంలోని రామర్తి చెరువుతోపాటు, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయం మంత్రి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చాయి. ఆక్రమణలను తొలగించకపోతే ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్కాకతీయ’కు ప్రతి బం ధకాలు తప్పవన్న చర్చ కూడ జరిగింది. ఇంత జరిగి నా, ప్రజాప్రతినిధుల సహకారం లేక.. ఆక్రమణలపై ‘జాయింట్ ఇన్స్పెక్షన్’ సరిగా జరగక అంచనాల తయారీలో విపరీత జాప్యం జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం వేగం పెంచకపోతే చెరువులు, కుంటల పునరుద్ధరణ పనుల ప్రణాళిక మరింత నత్తనడకకు చేరే ప్రమాదం లేకపోలేదు. -
గట్టెక్కనున్న ‘వారధి’
⇒రోడ్డు కం రైలు వంతెనకు విరగడ కానున్న దశాబ్దాల దుస్థితి ⇒ పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు ⇒కోల్కతా నుంచి వచ్చిన మెట్ కో అధికారుల బృందం ⇒వారి నివేదిక ఆధారంగా రూపొందనున్న అంచనాలు సాక్షి, రాజమండ్రి : అరుదైన వారధిని దశాబ్దాలుగా పీడిస్తున్న గడ్డు సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదారమ్మకు చూడముచ్చటైన వడ్డాణంలా కనిపించే రోడ్డు కం రైలు వంతెన దుస్థితిని రాబోయే పుష్కరాలు గట్టెక్కించనున్నాయి. వాహనాలు ఏవైనా నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని ప్రయాసభరితంగా, చేదు అనుభవంగా మారుస్తున్న ఈ వంతెనకు ఆ పాడు కాలం విరగడ కానుంది. రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించడానికి ఆర్అండ్బీ శాఖ మార్గాన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైల్వే, ఆర్అండ్బీ శాఖల అభ్యర్థన మేరకు కోల్కతా నుంచి మెట్ కో అనే కంపెనీ ఉన్నతాధికారుల బృంద ం శుక్రవారం రాజమండ్రి వచ్చింది. వంతెన పరిస్థితిని ఈ బృందం రెండు రోజులు పరిశీలించి, నివేదికను ఆర్అండ్బీ శాఖకు అందచేస్తుంది. అనంతరం ఆ శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. నేటివరకూ తాత్కాలిక మరమ్మతులే.. రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలంటే ప్రత్యేకంగా స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేసి, రోడ్డు భాగాన్ని పటిష్ట పరిచే చర్యలు చేపట్టాలి. కానీ అదనంగా గడ్డర్లు వేసేందుకు గతంలో రైల్వే శాఖ విముఖత వ్యక్తం చేసింది. 2005లోనే గడ్డర్లు వేసి మరమ్మతులు చేసేందుకు రూ.2.97 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కొత్తగా గడ్డర్లు వేసేందుకు రైల్వే శాఖకు రూ.75 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు సిద్ధం అయ్యారు. కానీ రైల్వే శాఖ ఇందుకు నిరాకరించింది. దీంతో అప్పట్లో రూ.1.83 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కానీ అవి ఫలించలేదు. వంతెన 1974లో ప్రారంభం అయిన త ర్వాత 1995లో తొలిసారి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తాత్కాలిక మరమ్మతులకే రూ.2.78 కోట్ల వరకూ ఆర్అండ్బీ అధికారులు వెచ్చించారని ఆ శాఖ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. కాగా గత ఐదేళ్లుగా వంతెన పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్డు భాగం పూర్తిగా పాడైపోయింది. దీంతో వంతెనపై ప్రయాణం నరక ప్రాయంగా తయారైంది. జాయింట్ల నడుమ ఎత్తుపల్లాలతో సమస్య వంతెనపై 35 క్రొకడైల్ జాయింట్లు ఉన్నాయి. వీటి మధ్యలో 400 సెకండరీ జాయింట్లు ఉన్నాయి. ఈ జాయింట్ల మధ్య ఎత్తుపల్లాలు ఏర్పడి వంతెనపై కుదుపులు పెరిగిపోతున్నాయి. కుదుపులకు లారీల భారం తోడై కాంక్రీటు భాగం రంధ్రాలు పడడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. కోల్కతాకు చెందిన మెట్ కో వంతెనలకు గడ్డర్లు పంపిణీ చేయడంలో అనుభవమున్న కంపెనీగా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కంపెనీతో పరిశీలన చేయించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో ముందుగా ఆ సంస్థ ఎరెక్షన్ ఇంజనీర్ రంజిత్ రాయ్, స్ట్రక్చర్ డిజైన్ ఇంజనీర్ నీల్కమల్ సర్కార్ వంతెనను పరిశీలిస్తున్నారు. అదనంగా గడ్డర్లు ఎలా అమర్చాలి, అవి ఎటువంటి డిజైన్తో ఉండాలి, వాటిని వంతెన కింద రోడ్డు కాంక్రీటు భాగంలో ఎలా అమర్చాలి అనే విషయాలను వీరు పరిశీలిస్తున్నారు. అలాగే కొత్తగా గడ్డర్లు లేకుండా కూడా శాశ్వత మరమ్మతులు చేయవచ్చా అనే అంశంపై కూడా వీరు దృష్టి సారిస్తారు. మూడు మాసాలు పడుతుంది.. మెట్ కో బృందం శుక్ర, శనివారాలు వంతెన పరిస్థితిని పరిశీలించి ఆర్అండ్బీ అధికారులకు నివేదిక ఇస్తుంది. గడ్డర్ల పరిమాణం, వాటి ధరలను అధికారులకు నివేదిస్తుంది. దీని ఆధారంగా అంచనాలు వేస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే పనులు చేపట్టిన మూడు నెలల్లో వంతెనపై గడ్డర్ల అమరిక పూర్తి కావచ్చని ఎస్ఈ మూర్తి పేర్కొన్నారు. రైల్వే శాఖ రోజుకు నాలుగు గంటలు మాత్రమే రైళ్లను గరిష్టంగా నిలుపు చేసేందుకు సమ్మతించిందని, దీంతో ఆ సమయాలతో తాము సమన్వయం చేసుకుని పనులు చేయాల్సి ఉంటుందన్నారు. -
సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం సచివాలయంలో జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలను మరో ఐదు రోజులు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, వివిధ శాఖలకు కేటాయించిన పద్దులు, బిల్లులు, డిమాండ్లు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును కూడా ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వాటర్గ్రిడ్, ఇసుక విధానం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపెట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించడంపై మంత్రివర్గం తీర్మానించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత కేబినెట్ సమావేశాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లుగా మంత్రులకు సమాచారం అందింది. కానీ, అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుండడంతో ఆ లోపు భేటీ సాధ్యంకాదని అభిప్రాయం వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. -
కాటేసిన కరెంట్ తీగలు
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి దేవనకొండ: పొలంలో విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేసేందుకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం ఐరన్ బండ సెంటర్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు రాజు తనకున్న పొలంలో వ్యవసాయ బోరు చెడిపోవడంతో విద్యుత్ మోటార్ను పైకి తీసి మరమ్మతులు చేయిస్తున్నాడు. ఇందులో భాగంగా బోరులో పైపులను దింపే పనులు చేస్తున్నారు. విద్యుత్ మోటార్ను రెండు ఇంచుల పైపులకు కింది భాగాన అమర్చి బోరులోనికి దింపడం మొదలు పెట్టారు. దాదాపు నాలుగు పైపులను బోరులోనికి దించేశారు. వారు ఇలా చేస్తున్న సమయంలో పైపులకు పైభాగాన విద్యుత్ తీగలు(11 కేవీఏ విద్యుత్ తీగలు) వెళ్లిన విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో వారు దించుతున్న ఇనుప పైపులు ఒక్కసారిగా ఈ తీగలను తాకాయి (పైపులు 14 అడుగుల పైభాగంలో ఉన్నాయి). దీంతో పైపులను గట్టిగా పట్టుకున్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు. ఈ ఘటనలో మెకానిక్ దస్తగిరి, పొలం యజమాని రైతు రాజు, కూలీ పనికి వచ్చిన వడ్డే సుంకన్న అక్కడిక్కడే మృతిచెందారు. మిగతా కూలీలైన నాగరాజు, షఫీ, రామాంజనేయులు, రామదాసు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి. పొలం యజమాని రైతు రాజు ఈ మధ్యనే ఉల్లి గడ్డలను అతి తక్కువ ధర (క్వింటం రూ.500)కు అమ్మి తీవ్ర బాధలో ఉన్నాడు. ఎలాగైనా విద్యుత్ మోటార్కు మరమ్మతులు చేయించి ఈసారైనా వేరుశనగను పండించి అప్పుల నుంచి గట్టెక్కాలనుకున్నాడు. అంతలోనే ఆయనను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. మృతిచెందిన మెకానిక్ దస్తగిరి, రైతు రాజు, కూలీ పనికొచ్చిన వడ్డే సుంకన్నలకు ముగ్గురు చొప్పున సంతానం. విషయం తెలుసుకున్న దేవనకొండ ఎస్ఐ మోహన్కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. మృతులను దేవనకొండ విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వారి కుటుంబ సభ్యులకు తెలపారు. గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ట్రాక్టర్ కొంటున్నారా.. సరే చదవండి
- మరమ్మతులు విస్మరించొద్దు - నిర్వహణపై అవగాహన అవసరం - నిత్యం చెక్ చేయాలి జగిత్యాల అగ్రికల్చర్ : పంటలసాగులో ట్రాక్టర్ల పాత్ర ఇప్పుడు కీలకం. కూలీల కొరత, సమయం ఆదా.. ఖర్చు తక్కువ, పంట పంటకు మధ్య తక్కువ వ్యవధి ఉండటం దీనికి కారణాలు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు సైతం ట్రాక్టర్లను కొంటున్నాడు. కానీ వాటి నిర్వహణలో, చిన్న సవుస్యలను విస్మరిస్తూ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ట్రాక్టర్ల నిర్వహణ, పనితీరుపై పొలాస వ్యవసాయ కళాశాల ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. పద్మ పలు విషయూలు వివరించాడు. నిర్వహణలోపంతో 25 శాతం డీజిల్ వృథా రైతులు కొనే ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలి. ట్రాక్టర్ను ఏ రీతిలో వాడాలో, సక్రమంగా నడిపిందుకే ఏ ఏ పనులు చేయూలో చదువుకునేందుకు వీలుగా చిన్నపుస్తకాన్ని ఇస్తారు. అందులోని అంశాలను పాటించాలి. ట్రాక్టర్ నిర్వహణ సరిగ్గా లేకపోతే దాదాపు 25 శాతం డీజిల్ వృథా అవుతుంది. ట్రాక్టర్ల నిర్వహణ ► ట్రాక్టర్ భాగాలను అప్పుడప్పుడు పరీక్షిస్తూ అవసరమైన వుర వ్ముతు చేయిస్త్తే వురింత కాలం వున్నికగా పనిచేస్తాయి. ►ట్రాక్టర్తో నిరంతరం పనిచేయించే సమయంలో ప్రతి 10 గంటలకోసారి రేడియేటర్ను నీటితో నింపాలి. ► తగిన లెవల్వరకు ఆయిల్, టైర్లలో తగినంత గాలి ఉండాలి. ►అన్ని బోల్టులను, నట్లను గట్టిగా బిగించాలి. ►వారానికోసారి బ్యాటరీలోని ఆసిడ్ వుట్టం సరిచూడాలి. ప్యాన్ బెల్టు బిగవుగా ఉండాలి. ►నెలకోసారి అన్ని గ్రీజు నిప్పల్స్లో గ్రీజు నింపాలి. ప్యూయుల్ ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్ వూర్చాలి. ►ఏడాదికోసారి ముందు, వెనుక చక్రాల ఆక్సిల్ బేరింగ్లను తీసి శుభ్రపరిచి తిరిగి అవుర్చాలి. ►రేడియేటర్ నుంచి నీటిని తీసేసి, శుభ్రంగా కడిగి తిరిగి నీటితో నింపాలి. ►ఇంజిన్ వాల్వులు సరిగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి బావెట్ క్లియురెన్స్ సరిచేయాలి. సరైన గ్రేడ్ ఇంజినాయిల్ వాడాలి. ►ఆయిల్ పంపులో తగినంత ఆయిల్ ఎప్పుడూ ఉంచాలి. ►స్టార్టరు స్విచ్ సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షించాలి. ►ఆయిల్ గేజ్, టెంపరేచర్ గేజ్, స్పీడోమీటర్, బ్యాటరీ చార్జింగ్ గేజ్ సరిగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలి. ఎదురయ్యే సమస్యలు ► ట్యాంకులో డీజిల్ లేకపోవడం లేదా ఇంధనం గొట్టంలో దూళి, వులినపదార్థాలు చేరి లేదా ఫ్యూయుల్ఫిల్టరులో వుట్టిచేరి ఇంజిన్ స్టార్ట్ కాదు. ►అందుకే గొట్టాలను.. ఫిల్టరును విడదీసి శుభ్రపరచాలి. ►గేర్ బాక్స్లో ఆయిల్ తక్కువ ఉండటం లేదా సరైన గేజ్ ఆయిల్వాడకపోవడం వల్ల లేదా గేర్లు అరిగిపోవుటం వల్ల గేర్లు మారిస్తే శబ్దం వస్తుంది. కొత్తగేర్లు, సరైన గ్రీజ్ ఆయిల్ వాడాలి. -
విద్యుత్ ఉండగానే మరమ్మతులు!
ఇది హాట్లైన్ సిబ్బంది ప్రత్యేకత!! సీలేరు : విద్యుత్ ఉండగా వైర్లను ఎవరైనా ముట్టుకుంటారా? అలా తాకితే బతికి బట్టకడతారా? కానీ వీరు మాత్రం విద్యుత్ సరఫరా అవుతున్న తీగలతోనే గడుపుతారు. అయినా ఆ విద్యుత్ వీరిని ఏమీ చేయదు! వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం!! ఆ కథాకమామిషూ ఏమిటంటే.. జెన్కో హాట్లైన్ విభాగం సిబ్బంది విజయవాడకు విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చేయడంలో దిట్టలు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్కేంద్రాల్లో తయారయ్యే విద్యుత్ను 220 కేవీ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే లైన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో రెండ్రోజులుగా విద్యుత్ లైన్లను బాగు చేస్తున్నారు. కళ్లు మాత్రమే కనిపించేలా ఒంటి నిండా రబ్బరుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరించారు. చేతులకు గ్లౌజుల్లాంటివి వేసుకున్నారు. గురువారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గాజువాక, కొంబూరు సబ్స్టేషన్లకు సరఫరా అయ్యే 220 కేవీ విద్యుత్ లైన్ను మరమ్మతులు చేపట్టారు. విజయవాడ హాట్లైన్ సిబ్బంది విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చే శారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నా అవలీలగా తీగల వెంబడి పాకుతూ, నిలబడుతూ ప్రాణాలకు తెగించి మరమ్మతు పనులు చేస్తుండడాన్ని చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
బాబు వస్తున్నారని...
తాత్కాలిక మర మ్మతులతో హడావుడి పీఎన్కాలనీ: పట్టణమంతా ఒకటే హడావుడి.. ఎక్కడ చూసినా మరమ్మతులు పనులు చకచకా సాగి పోతున్నాయి. వీధి లెట్లు, ప్రధాన రోడ్లకు మరమ్మ తులు, వీధులు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య నిర్వ హణ, డివైడర్లు, రోడ్ల పక్క ఉన్న పిచ్చి మొక్కలు తొల గించడం, కలుపును తీయడం ఒక్కటేమిటి.. అడగక్క ముందే అన్నీ చేస్తున్నారు. ఇది చూసిన పట్టణ ప్రజలు ఔరా! ఇదేమిటి అనుకుంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ హడావుడి అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండడంతోనే అని తెలుసుకుని ఔరా అని అనుకుంటున్నారు. వర్షం కురిస్తే చాలు పట్టణంలో పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా కనిపి స్తుంది. సమస్యలతో పట్టణ ప్రజలు నిత్యం కొట్టు మిట్టాడుతున్నా అధికారులో చలనం కూడా కనిపించేదికాదు. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం వస్తున్నారంటే మాత్రం ఇప్పు డు చక చకా పనులు వాయువేగంగా చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో చిన్నపాటి వర్షం కురిసినా పట్టణమంతా జలమయం అవుతుంది. ఎక్కడిక్కడే గోతులు ఏర్పడి వర్షం పడితే ప్రజల గుండెల్లో ైరె ళ్లు పరిగెడతాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేక, మరికొన్నిచోట్ల లైట్లు ఉన్నా వెలగక అంధకారంలో ఉన్నా పట్టించుకోని అధికారులు మాత్రం సీఎం వస్తున్నారని మెహర్బాణీ కోసం విద్యుత్ వెలుగులు విరజిమ్మే విధంగా చర్యలు చేపడుతుం డడంతో పట్టణ వాసుల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రధానరోడ్లలో డివైడర్ల మధ్య ఇప్పుడుమాత్రం నాయకుల మెప్పు కోసం చకచకా మరమ్మతు పనులు చేస్తున్నారు. పట్టణంలో పలు కాలనీల రోడ్లు, కాలువల్లో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకు పోయిన విషయాన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడుమాత్రం చెప్పకుండానే పారిశుద్ద్య పనులు సకాలంలో చేపడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టణాన్ని పరిశుభ్రం చేసేం దుకు రోజు పనిచేసే కార్మికులకు అదనంగా పారిశుద్ధ్య కార్మికులను తెచ్చి మరీ పనులు చేపడుతున్నారు. ఇదే తాపత్రయం ఎల్లవేలలా ఉంటే ఇప్పుడు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం వచ్చేది కాదని పలువురు పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు నాయకుల మన్ననలు పొందాలని ఉన్నంత తాపత్రయం ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అంత ‘అటాచ్మెంట్’ వద్దు
ఖైరతాబాద్ రైల్వే గేటును ఢీకొన్న వాహనం విరిగిపడిన గేటు కొత్తది అమర్చిన పోలీసులు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే గేటు వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఇటీవల రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. గేటు వేసిన సమయంలో రాకపోకలు సాగనివ్వకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాలి నడకన వెళ్లే వారికీ అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా... బుధవారం మధ్యాహ్నం రైలు వెళ్లగానే గేటును తీశారు. ఆ సవ యంలో ఖైరతాబాద్ నుంచి సాదాన్ కళాశాల వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని డ్రైవర్ బాల్రాజ్ హడావుడిగా ముందుకు కదిలించాడు. కుడి వైపు నుంచి దాటాల్సిన వాహనాన్ని హడావుడిగా ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో డీసీఎం వెనుక భాగం గేటును బలంగా తాకింది. ఒక్కసారిగా గేటు విరిగి పక్కకు పడిపోయింది. ఆ పక్కనే ఉన్న గేట్ జామ్ (ఇనుప బారికేడ్లపై) విరిగిన గేటు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఖైరతాబాద్ వినాయకుని వైపు వెళ్తున్న వాహనాలు అక్కడే నిలిచి ఉన్నాయి. గేట్ జామ్ లేకపోయి ఉంటే వాహనదారుల తలపై గేటు పడి, ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ గేట్జామ్ పైన అది పడడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గేటు విరిగిన విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వాహనదారులను పట్టాలపై నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా మరో గేటును అమర్చారు. ఈ సంఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గతంలో పలుమార్లు గేటు విరిగిన సంఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరో గేటును సిద్ధంగా ఉంచారు. దీన్ని వెంటనే అమర్చడంతో రైళ్ల రాకపోకలకు తక్షణమే పునరుద్ధరించగలిగామని సిబ్బంది తెలిపారు. ఇరువైపులా అక్రమ నిర్మాణాలు రైల్వేగేటుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాల కారణంగా అక్కడి స్థలం ఇరుకుగా మారింది. గేటు వేసిన సమయంలో మనుషులు కూడా నిలబడేందుకు వీలులేకుండా తోపుడుబండ్లు, ఇతర సామగ్రిని కొందరు అడ్డుగా పెట్టారు. ఇలాంటి బండ్లను, కట్టడాలను తొలగిస్తే గేటు వద్ద రాకపోకలకు సులువుగా ఉంటుందని స్థానికులు తెలిపారు. ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించరూ ఖైరతాబాద్ రైల్వేగేటు మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ర ద్దీగా ఉండే ఈ క్రాసింగ్ వద్ద నిత్యం 108 సార్లు రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వేగేటు వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించుకన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖైరతాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.