RP Thakur
-
ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
గుంటూరు, సాక్షి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్లపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదులో పేర్కొంది.ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లు టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారుల్ని బెదిరిస్తున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్లో కూర్చుని జిల్లా పోలీస్ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. -
ఆర్టీసీలో సౌర కాంతులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. తన ఆస్తులను మరింత సమర్థంగా సద్వినియోగం చేసుకునే వ్యూహంలో భాగంగా బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించింది. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పుతోంది. రెస్కో విధానంలో రాష్ట్రంలో 838 సోలార్ ప్లాంట్లను దశలవారీగా ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది. నాలుగు ప్లాంట్లు రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లను ఆర్టీసీ నెలకొల్పింది. మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కాకినాడలలో ఒక్కొక్కటి 100 కిలోవాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఒక్కో ప్లాంట్కు రూ.37 లక్షల వరకు వెచ్చించింది. ప్రతి ప్లాంట్ ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఏడాదికి రూ.14 లక్షల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. ఓపెక్స్, ఇన్సిడెంటల్ చార్జీలు కలుపుకుని ఆ సోలార్ ప్లాంట్ల స్థాపన వ్యయం నాలుగేళ్లలో వెనక్కి వస్తుంది. ఐదో ఏడాది నుంచి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున లాభాలొస్తాయని అంచనా వేస్తున్నారు. రెస్కో విధానంలో 838 ప్లాంట్లు ఇకపై రెస్కో విధానంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదట దశలో ఈ ఆర్థిక సంవత్సరంలో 400 ప్లాంట్లు నెలకొల్పేలా కార్యాచరణ సిద్ధం చేసింది. మిగిలిన 438 ప్లాంట్లను రాబోయే రెండేళ్లలో నెలకొల్పుతుంది. ఇందు కోసం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రెస్కో విధానంలో రాష్ట్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై మొత్తం 838 రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తుంది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించి కంపెనీని ఎంపిక చేస్తుంది. ఆ కంపెనీ ఆర్టీసీ భవనాలపై రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను నెలకొల్పి 25 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. ఆదా ఇలా.. ► ప్రస్తుతం బస్స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్కు రూ.10.15 చొప్పున, పారిశ్రామిక అవసరాల కిందకు వచ్చే గ్యారేజీలు, వర్క్ షాపులకు యూనిట్కు రూ.6.76 చొప్పున విద్యుత్ చార్జీలను ఆర్టీసీ చెల్లిస్తోంది. ► టెండర్ దక్కించుకున్న సంస్థ ఆర్టీసీకి 25 ఏళ్ల పాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం వెయ్యి కిలోవాట్ల ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ను యూనిట్కు గరిష్టంగా రూ.5గా సూత్రప్రాయంగా నిర్ణయించారు. భవిష్యత్లో ఆ రేట్లు ఇంకా తగ్గుతాయి. ► సోలార్ విద్యుత్ వల్ల బస్ స్టేషన్లు, వాణిజ్య సముదాయాలకు యూనిట్పై రూ.5 చొప్పున, గ్యారేజీలు, వర్క్షాపులకు యూనిట్కు రూ.3 వరకు ఆర్టీసీకి ఆదా అవుతుంది. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రణాళికలో భాగంగానే బస్ స్టేషన్లు, డిపోలు, గ్యారేజీల భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాం. ఆర్టీసీపై వ్యవస్థీకృత భారం పడకుండా ఉండేందుకు ఎన్ఆర్ఈడీసీఏపీ భాగస్వామ్యంతో రెస్కో విధానంలో ఈ ప్లాంట్లను నెలకొల్పుతాం. దీనివల్ల ఆర్టీసీ ఆస్తులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు విద్యుత్ చార్జీల భారం 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. – ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ -
‘ప్రమోషన్ కోసం ఠాకూర్ మమ్మల్ని ట్రాప్ చేశారు’
సాక్షి, విజయవాడ : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెప్పు కోసం ఆర్పీ ఠాకూర్ తమను ట్రాప్ చేసి అక్రమ కేసులు పెట్టారని బాధితులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్క్లబ్లో ఏసీబీ అక్రమ కేసుల బాధితుల మీడియా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధితుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఠాకూర్ డీజీ నుంచి డీజీపీ ప్రమోషన్ కోసం అక్రమంగా కేసులు పెట్టారని ఆయన వాపోయారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్యాయంగా కేసులు పెట్టిన వాటిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఠాకూర్ పెట్టిన అక్రమ కేసులకు మనస్తాపానికి గురై కొందరు ఉద్యోగులు ఆతహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి రీ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నామని వెంకటేశ్వరావు అన్నారు. మిగిలిన వారికి పోస్టింగ్ ఇవ్వాలి.. 3 ఏళ్లుగా అన్యాయనికి గురైన వారిలో కొందరికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏసీబీలో లోపాలను ఎత్తి చూపిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మా కృతజ్ఞతలు. ఠాకూర్ కేసుల బాధితులందరికీ న్యాయం చేయాలి. విచారణకు వెళ్లేముందు కేసులు పునర్ పరిశీలించమని కోరుతున్నాము. -బాధితుడు పయ్యావుల శ్రీనివాసరావు -
ఆర్పీ ఠాకూర్కు వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ఏసీబీ డీజీగా ఉన్న కాలంలో తమపై అక్రమ కేసులు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పదమూడు జిల్లాల నుంచి తరలివచ్చిన బాధితులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై ఠాకూర్ అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలకు సహకరించలేదని ఠాగూర్ తమపై పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని వారు కోరారు. టీడీపీకి తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఠాకూర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఠాకూర్ అక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని బాధితులు పేర్కొన్నారు. ఏసీబీలో ఇప్పటికీ చంద్రబాబు, ఠాకూర్ మునుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే తమపై పెట్టిన కేసులు పరిష్కారం కావటం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని.. వెంటనే బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. -
బాబు పాలనలో పక్షపాత దాడులు!
సాక్షి, అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాజకీయ ప్రేరేపిత దాడులకు ఉపకరణంలా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డీజీగా ఉండగా ఆయన్ను అడ్డు పెట్టుకుని మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు పక్షపాత దాడులకు ప్రేరేపించారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో ఏసీబీ సాగించిన దాడుల పూర్వాపరాలపై పునర్విచారణకు ఆదేశిస్తే అక్రమాల గుట్టు రట్టవుతుందని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు జమానాలో సొంత సామాజికవర్గం జోలికి పోకుండా అట్టడుగు వర్గాలు, గిట్టని అధికారులను ఏసీబీ ద్వారా టార్గెట్ చేసే వికృత క్రీడ యథేచ్చగా సాగింది. లంచం కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు టీడీపీ నేతలకు సెటిల్మెంట్లు సాగించే రాజకీయ దందాలుగా మారాయి. ఏసీబీ పక్షపాత దాడులపై కొన్ని ఉదంతాలు గమనిస్తే వాస్తవాలు ఏమిటో బోధపడతాయి. పక్షపాత దాడులకు ఇవిగో ఉదాహరణలు.. - టీడీపీ అధికారంలో ఉండగా గుంటూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ) డీఎస్పీ దుర్గాప్రసాద్ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడనే నెపంతో రాయపాటి సాంబశివరావు వర్గీయులు లోకేశ్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఏసీబీ దాడులు చేయించారు. గుంటూరు కన్నావారి తోటలోని దుర్గాప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఆయన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడం కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం. చంద్రబాబు, లోకేశ్ ఒత్తిడితో ఠాకూర్ దూకుడు పెంచి ఈ కేసులో మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇరికించేందుకు తీవ్రంగా యత్నించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఆళ్లను ఏసీబీ కేసులో ఇరికించేందుకు టీడీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. - ఓ సామాజికవర్గంపై కక్ష సాధింపు చర్యలకు ఏసీబీని వాడుకున్నారనేందుకు నంద్యాల డీఎస్పీ హరినాథ్రెడ్డిపై అక్రమ కేసుల ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన ఎస్సై నుంచి డీఎస్పీగా పనిచేసిన పోలీస్స్టేషన్లోనే టీడీపీ సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు చివరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించడం గమనార్హం. - విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ శోభన్బాబుపై జరిగిన ఏసీబీ దాడి కక్ష సాధింపులకు పరాకాష్ట. ఆయన లంచం తీసుకోవడం గానీ డిమాండ్ చేసినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు సాక్షాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఏసీబీ వైఖరితో తీవ్ర మనస్తాపం చెందిన సీఐ శోభన్బాబు కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వెలుగులోకి రావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఏసీబీ కక్షపూరితంగా దాడులు చేస్తోందని పేర్కొంటూ తన నిజాయితీని నిరూపించుకునేందుకు పోలీస్స్టేషన్ వద్ద సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని కోరుతూ శోభన్బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడటంతో ఉలిక్కిపడ్డ ఏసీబీ అప్పటికప్పుడు ఐదుగురు అధికారుల బృందాన్ని విమానంలో పంపించి ఆయన్ను బుజ్జగించి కేసును ఉపసంహరించుకుంది. - టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే, సొంత సామాజికవర్గానికి చెందిన అధికారులపై ఏసీబీ కన్నెత్తి చూసే సాహసం చేయలేదని చెప్పేందుకు చిత్తూరు జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామ్కుమార్ ఉదంతమే నిదర్శనం. ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతి భద్రతల సమన్వయ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్కు ఆయన ప్రియ శిష్యుడు. రామ్కుమార్ ఆదాయానికి మించి రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందినా ఎలాంటి సోదాలు చేయలేదు. నాడు మంత్రిగా ఉన్న లోకేశ్ రంగంలోకి దిగి రామ్కుమార్ జోలికి వెళ్లకుండా జీఏడీ నుంచి ‘నో పర్మిషన్ ఎకార్డెడ్’ ఉత్తర్వులు జారీ చేయించి కాపాడారు. పార్టీ ఫిరాయింపులతోపాటు ఇటీవల ఎన్నికల్లో రామ్కుమార్ టీడీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. టీడీపీ పెద్దల సెటిల్మెంట్లు గత మూడున్నరేళ్లుగా ఏసీబీ పెద్దఎత్తున దాడులు నిర్వహించింది. అవినీతి అధికారుల ఆట కట్టించడంపై ఎవరికీ అభ్యంతరాలు లేకున్నా టీడీపీ కక్ష సాధింపు చర్యలకు ఏసీబీ సహకరించడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో టీడీపీ పెద్దలే సెటిల్మెంట్లు చేసి కాసులు ఏరుకున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో చిక్కిన అధికారుల ఆస్తుల్లో 30 నుంచి 50 శాతం వరకు తమ పేర రాయించుకున్నట్టు సమాచారం. సెటిల్మెంట్ కేసుల్లో సలహాదారుగా వ్యవహరించిన హైదరాబాద్కు చెందిన ఆడిటర్ ఒకరు శాఖాపరమైన విచారణతో సరిపెట్టేలా చేశారనే విమర్శలున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలకు, విచారణ తదుపరి నమోదు చేసే డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్(డీఎఫ్ఆర్)లో పేర్కొన్న ఆస్తుల వివరాలకు భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రేరేపిత ఏసీబీ దాడుల్లో బలహీనవర్గాలే బాధితులుగా మారిన నేపథ్యంలో గత ఐదేళ్లుగా సాగిన ఏసీబీ దాడులు, కేసులపై పునర్విచారణ చేస్తే అక్రమాలు, అవినీతి, అవకతవకలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. -
‘సీఎం మెప్పు కోసం అల్లరిపాలు చేశారు’
సాక్షి, విజయవాడ : మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ కారణంగా అక్రమ కేసుల్లో ఇరుక్కున్న అధికారులపై నమోదైన కేసుల్లో పారదర్శక విచారణ జరిపించాలని దేవాదాయ శాఖ మాజీ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శుక్రవారమిక్కడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆర్పీ ఠాకూర్ బాధితుల సంఘం నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ..‘ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. మొదట సదరు అధికారులపై విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలి. అయితే ఆర్పీ ఠాకూర్ తన సొంత ప్రాభవం కోసం.. మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం నిబంధనలు పాటించలేదు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేసేవారు. సీఎం దగ్గర మెప్పు కోసం అధికారులను టార్గెట్ చేశారు. తనకు నచ్చిన మీడియాను తీసుకు వచ్చి ఆస్తుల విలువను పెంచి చూపేవారు. అధికారులను అల్లరిపాలు చేసేవారు. అక్రమాస్తుల కేసులలో సదరు వ్యక్తి పూర్వాపరాలు పరిశీలించకుండా, ఎవరు ఫిర్యాదు చేశారో కూడా పట్టించుకోకుండా చర్యలు తీసుకునేవారు’ అని ఆర్పీ ఠాకూర్పై ఆరోపణలు చేశారు. వాళ్లను టార్గెట్ చేసి.. ‘కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ ఇబ్బందులు పెట్టేవారు. వివిధ శాఖల్లో నెంబర్ 2 స్థాయిల్లో ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. సుప్రీంకోర్టు తీర్పు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటే 6 నెలల్లోగా తిరిగి నియామకం జరగాలి. కానీ ఆ తర్వాత కూడా పోస్టు ఇవ్వకుండా ఠాకూర్ అడ్డుతగిలేవారు.దీంతో సంవత్సరాలు గడిచినా ఆస్తులు ఆటచ్ అయ్యి, పోస్టులు లేక అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్పెషల్ కోర్టుల ఆక్ట్ ప్రకారం జప్తు చేసిన ఆస్తులను కేసు పరిష్కారమయ్యే వరకు.. ప్రభుత్వ అవసరాలకు ఆ ఆస్తులను వాడుకునే అవకాశం ఉంటుంది. చట్ట ప్రకారం అవినీతి అధికారులకు శిక్ష పడాలి. కానీ ఆర్పీ ఠాకూర్.. కింది స్థాయి అధికారులకు టార్గెట్లు పెట్టడం వలన తప్పు చేయని వారిపై కేసులు పెట్టారు. కాబట్టి నిజాయితీ గల అధికారులకు న్యాయం చేయాలి’ అని చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విఙ్ఞప్తి చేశారు. కాగా డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఠాకూర్ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. -
డీజీపీగా గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతారు. నలుగురు ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్ హెడ్క్వార్టర్స్కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ఇద్దరి తీరు వివాదాస్పదం ఎన్నికల ముందు నుంచి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వీరిద్దరూ పనిచేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వారు ఆయా పోస్టుల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో ఠాకూర్ను ఏసీబీ డీజీ పోస్టు నుంచి తప్పించి డీజీపీగా కొనసాగించేలా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి బదిలీ చేయడంతోపాటు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించేందుకు చంద్రబాబు ససేమిరా అన్నప్పటికీ కోర్టు జోక్యంతో తప్పనిసరి అయ్యింది. ఖాళీ అయిన ఏసీబీ డీజీ పోస్టులో ఏబీ వెంకటేశ్వరరావును చంద్రబాబు సర్కారు నియమించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు.. అస్సాంకు చెందిన గౌతమ్ సవాంగ్ అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ప్రా«థమిక విద్య అభ్యసించారు. గ్రాడ్యుయేషన్ చెన్నై లయోలా కాలేజీ, పీజీ ఢిల్లీ యూనివర్శిటీలో సాగింది. ఐపీఎస్ 1986 బ్యాచ్కు చెందిన సవాంగ్ ఏపీ కేడర్ అధికారి. ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినరోజే రాష్ట్ర పోలీస్ బాస్గా పూర్తి అదనపు బాధ్యతలు సవాంగ్కు దక్కడం విశేషం. సవాంగ్ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఏపీ గ్రేహౌండ్స్ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీగా సేవలందించారు. 2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్ రేంజ్ల్లో పనిచేశారు. ఏసీబీ, ఎస్ఐబీ వింగ్లో విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్పీఎఫ్ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేసి, తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2016 జూన్లో ఆయనకు డీజీగా పదోన్నతి వచ్చింది. సవాంగ్ను డీజీపీగా నియమిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సవాంగ్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. -
ఆర్పీ ఠాకూర్ బదిలీ.. నూతన డీజీపీగా సవాంగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే అనేక మంది ఉన్నతస్థాయి అధికారులపై బదిలీ వేటు పడింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న ఆర్పీ ఠాకూర్ను గురువారం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సీనియర్ అధికారి గౌతం సవాంగ్ను డీజీపీగా నియమించింది. ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వర రావును కూడా బదిలీ చేసింది. వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆయన స్థానంలో ఏసీబీ డైరెక్టర్గా కుమార్ విశ్వజిత్ను నియమించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్ను, ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్ను నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైఎస్ జగన్తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ
-
వైఎస్ జగన్తో సీఎస్, డీజీపీ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్కు వీరు వివరించినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్ జగన్ను కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ మహేశ్ చంద్రలడ్డా కూడా జగన్ను కలిసి అభినందనలు చెప్పారు. మరోవైపు ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై కసరత్తును వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కౌంటింగ్కు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం
-
25,224 మందితో పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని, రాజకీయ పార్టీలకు చెందిన భారీ కాన్వాయ్లను కూడా అనుమతించబోమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16 ప్రాంతాల్లోని 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో నాలుగంచెల భద్రతా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మొదటి దశలో కౌంటింగ్ హాలు వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఉంటాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద రెండో దశలో ఏపీఎస్పీ సాయుధ పోలీసులు ఉంటారని, మూడో దశలో బాడీ వోర్న్ కెమెరాలు ధరించిన పోలీసులు కౌంటింగ్ కేంద్రం బయట ఉంటారని, నాలుగో దశలో ప్రత్యేక పోలీసు బృందాలు వాహనాల్లో గస్తీ తిరుగుతుంటాయని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు తగినంత పోలీస్ బలగం అందుబాటులో ఉందని డీజీపీ ఠాకూర్ చెప్పారు. 35 కంపెనీల కేంద్ర బలగాల్లో 3,325 మంది, 61 కంపెనీల ఏపీఎస్పీ బలగాల్లో 5,490 మంది, 118 స్పెషల్ పార్టీ టీమ్ల్లో 1,770 మంది, 67 ఏపీ ప్లాటూన్లలో 1,340 మంది సిబ్బంది, రాష్ట్రంలోని 21 మంది ఎస్పీలు, 31 మంది అదనపు ఎస్పీలు, 137 మంది డీఎస్పీలు, 379 మంది సీఐలు, 1,037 మంది ఎస్ఐలు, 2425 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 6,510 మంది కానిస్టేబుళ్లు, 2,759 మంది హోంగార్డులు ఎన్నికల లెక్కింపు సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా మొత్తం 25,224 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కౌంటింగ్ సందర్భంగా బందోబస్తు నిర్వహించే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్టు డీజీపీ చెప్పారు. అన్ని హంగులతో ఉండే ఐదు ఫాల్కాన్స్ వాహనాలు, 14,770 సీసీ కెమెరాలు, 1,200 బాడీ వోర్న్ కెమెరాలు, 68 డ్రోన్స్, 9 వేల కమ్యూనికేషన్స్ పరికరాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. వాటిని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలకు అనుసంధానం చేసి, కౌంటింగ్ సందర్బంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 144, 30 సెక్షన్లు అమలు ఓట్ల లెక్కింపు కేంద్రాలతోపాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సీఆర్పీసీ 144, పోలీస్ యాక్ట్ 30 సెక్షన్లు అమలు చేస్తున్నట్టు డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడటం, సమావేశాలు నిర్వహించడం నిషేధం. సెక్షన్ 30 అమలుతో కౌంటింగ్ కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువ మంది సమావేశం కావడం, మైక్లు వాడటం నిషేధం. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీస్ ఫోర్స్తో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీజీపీ చెప్పారు. ఇవి చెయ్యొద్దు... ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలపై నిషేధం అమలు చేస్తామని డీజీపీ తేల్చిచెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు జరపరాదన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు ఎటువంటి వాహనాలు, జన సమీకరణలు ఉండకూడదని సూచించారు. ముందస్తు చర్యలు అనుమానిత వ్యక్తులు, అల్లర్లు సృష్టిస్తారనుకునే వారిని ముందు జాగ్రత్తగా బైండోవర్ చేసినట్టు డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లు, అనుమానితులను కౌంటింగ్ రోజున పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను సమీక్షిస్తామన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశమున్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి ముందుజాగ్రత్తగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల జాబితాలు తమకు వచ్చాయని, వాటిని పరిశీలించి వారిలో నేర చరిత్ర ఉన్న వారిని, వివాదాస్పదంగా ఉండే వారిని గుర్తిస్తామన్నారు. వారి స్థానంలో ఇతరులను నియమించుకోవాలని రాజకీయ పార్టీలకు సూచిస్తామన్నారు. -
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
-
ఐబీ హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ సమీక్ష
సాక్షి, కాకినాడ: ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు తీరంలో ఉన్న ఆయిల్, గ్యాస్ కంపెనీల భద్రతపై ఏపీ డీజీపీ ఠాకూర్ ఆదివారం సమీక్షించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయన పోలీసులు అధికారులతో మాట్లాడారు. మరోవైపు ఏవీబీ బోర్డర్లో జరిగిన ఘటనలపై డీజీపీ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. ఇటీవల ఎన్నికల పోలింగ్లో జరిగిన ఘటనలు, కౌంటింగ్ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ భద్రతా కారణాలరిత్యా కొన్ని వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో గాడిమొగ రిలియన్స్ గ్యాస్ టెర్మినల్తోపాటుగా పలు చమురు క్షేత్రాల్లో ఆయన పర్యటించారు. ఘర్షణలపైనా సమీక్ష.. ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలపై సమీక్షించామని తెలిపారు. కేసుల నమోదు, చార్జ్షీట్లపై యంత్రాంగానికి సూచనలు చేశామని, కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించామని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ఒడిషాలోని నందాపూర్ మావోయిస్టు కమిటీ సభ్యులు విధ్వంసం సృష్టించేందుకు మన రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారని, ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి వెళ్తుండగా భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరిగిందని, ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపారు. -
ఏఓబీ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది : ఏపీ డీజీపీ
సాక్షి, కాకినాడ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తూర్పుగోదావరి జిల్లాలోని గాడిమొగ రిలయన్స్ టెర్మినల్తో పాటు పలు చమురు క్షేత్రాలను పర్యటించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై సమీక్షించారు. కేసుల నమోదు చార్జ్ షీట్లపై యంత్రానికి సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ భద్రతపై ఎటువంటి చర్యలు చేపట్టాలో అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా సహరిద్దు (ఏఓబీ) ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కౌంటింగ్ భద్రతకు అన్ని ఏర్పాటు చేశామని డీజీపీ పేర్కొన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, అమరావతి/గుంటూరు: శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి తీర ప్రాంత రాష్ట్రాలకు తీవ్రవాదులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పలు జిల్లాల పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ ఠాకూర్ బుధవారం ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రధానంగా విమానాశ్రయాలు, ఓడ రేవులు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సముద్రతీరాల్లో అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని మార్గనిర్దేశం చేశారు. విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలు, హోటల్స్, జనం ఎక్కువగా చేరే స్థలాల వద్ద బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రముఖ మసీదులు, చర్చిలు, ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కీలక ప్రాంతాలు, కేంద్ర సంస్థలు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వద్ద స్థానిక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో అలజడులు, అసాంఘిక శక్తుల కదలికలు ఉండే అవకాశం ఉందో గుర్తించాలని సూచించారు. ఆర్మ్డ్ కౌంటర్ యాక్షన్ పోలీస్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చాలా కేసుల్లో సీసీ కెమెరా ఫుటేజీలు కీలకంగా ఉపయోగపడతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బందోబస్తు పరంగా పలు ప్రాంతాల్లో ఉన్న వైఫల్యాలను గుర్తించి వాటిని నెల రోజుల్లో చక్కదిద్దుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందేలా ప్రజలతో పోలీసులు మంచి సంబంధాలు పెంచుకోవాలని సూచించారు. భద్రతా చర్యలపై నెల రోజుల్లో సమీక్ష: డీజీపీ వీడియో కాన్ఫరెన్సు అనంతరం డీజీపీ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లకు పలు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. మరో నెల రోజులు తర్వాత భద్రతాపరమైన చర్యలు ఏమేరకు తీసుకున్నారో అనే విషయాలను సమీక్షిస్తామని డీజీపీ చెప్పారు. సమావేశంలో డీజీపీతోపాటు శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఐడీ ఏడీజీ అమిత్గార్గ్, పీఅండ్ఎల్ ఏడీజీ హరీష్కుమార్ గుప్త పాల్గొన్నారు. రాజధానిలో హై అలర్ట్ ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తాత్కాలిక సచివాలయంతోపాటు, హైకోర్టు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. అక్కడకు వెళ్లే అన్ని రహదారుల్లోని ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. అనుకోని సంఘటన జరిగితే ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై మాక్డ్రిల్ను నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎయిర్ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర అధికారులతో మాట్లాడుతూ ఉగ్రవాద కదలికలపై ఆరా తీస్తున్నారు. మత పెద్దలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన గుంటూరు అర్బన్ పోలీసులు మసీదులు, చర్చిలు, దేవాలయాల వద్ద అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసేలా మత పెద్దలకు సూచిస్తున్నారు. లాడ్జిలు, హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
నిఘా వర్గాల హెచ్చరికతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
-
ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం
సాక్షి, విజయవాడ : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల కౌటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. -
ఆ ఘటన విచారకరం: డీజీపీ ఆర్పీ ఠాకూర్
విశాఖపట్నం: రుషికొండ రేవ్ పార్టీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ గురువారం స్పందించారు. ప్రశాంత విశాఖ నగరంలో రేవ్ పార్టీ, డ్రగ్స్ రావటం విచారకరమన్నారు. రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 50 మందిని గుర్తించి, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై రౌడీషీట్ తరహాలో హిస్టరీ షీట్ తెరుస్తామని వెల్లడించారు. డ్రగ్స్ మాఫియా అనుసరిస్తున్న పద్ధతిని బ్రేక్ చేసే యోచనలో పోలీస్ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. డ్రగ్స్ వినియోగం ఏ సంస్థలో జరిగినా, స్టార్ హోటల్ అయినా కూడా వారిపై కేసులు నమోదు చేయడానికి వెనకాడమన్నారు. డ్రగ్స్ కంట్రోల్పై గెజిటెడ్ స్థాయి అధికారి బృందం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా డ్రగ్స్పై తగిన సమాచారాన్ని వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే డ్రగ్స్ కంట్రోల్పై ప్రత్యేకించి టెలీఫోన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో శక్తి బృందాలను డీజీపీ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం శక్తి బృందాలు పని చేస్తాయని తెలిపారు. ఇప్పటికే విజయవాడలో శక్తి బృందాలు ప్రారంభించామని, త్వరలోనే తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో శక్తి బృందాలు ఏర్పాటుల చేస్తామని చెప్పారు. చదవండి: ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు! -
మే 23న కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 13 జిల్లాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ,సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ ఈ సందర్భంగా మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగినంత శిక్షణ లేకపోవడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో సరిపుచ్చడంతో పోలింగ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, కౌంటింగ్ సమయంలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం... జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉందని కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి అవపసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన టేబుల్స్, సీటింగ్ వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ రోజున లేదా కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన బలగాలు.. ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ... 2014తో పోలిస్తే తక్కువగా పోలీస్ ఫోర్సు ఉన్నా కలెక్టర్లు,ఎస్పీలు టీం వర్క్తో చిన్నపాటి సంఘటనలు మినహా ఎన్నికలను సజావుగా నిర్వహించారని వివరించారు. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలపై వాటికి బాధ్యులైన వారిని చాలా వరకూ అరెస్టు చేశామన్నారు. కౌంటింగ్ తర్వాత కూడా హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలీస్ బలగాలను తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లుతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు. కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో సీసీ టీవీలతో నిఘా సార్వత్రిక ఎన్నికల్లో 65శాతం పైగా దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోవడం, మారుమూల గిరిజన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైతం పోలింగ్ శాతం పెరగడం సిబ్బంది కృషికి నిదర్శనమని సీఈఓ ద్వివేది అన్నారు. రాష్ట్రంలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెల పటిష్టమైన బందోబస్తు ఉందని, సీసీ టీవీల నిఘాతో కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో నిరంతరం కొనసాగుతోందని, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఆర్వోలు రోజూ తనిఖీ చేసి నివేదికలు సమర్పిస్తున్నారని చెప్పారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని, ఎవరెవరు సందర్శిస్తున్నారనేది రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి మూడు దశల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం పరిధిలో మీడియా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేనందున వాటిని తీసుకుని భద్రపర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
పోలీసు అధికారుల పక్కచూపులు!
సాక్షి, అమరావతి: పోలీసుశాఖలో పలువురు అధికారుల పక్కచూపులు మొదలయ్యాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పలువురు కేంద్ర సర్వీసులవైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్తో పాటు పలువురు ఐపీఎస్లు సైతం క్యూ కడతారంటూ ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి పలువురు పోలీసు అధికారులు చంద్రబాబుకు వీరవిధేయులుగా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీ నాటికి పలువురు ఐపీఎస్లు కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విషయమై పోలీసుశాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి అఖిల భారత సర్వీసుకు చెందిన ఐపీఎస్, ఐఏఎస్ వంటి కీలక అధికారులు రాష్ట్రంలో పలు రాజకీయ వివాదాల్లో కూరుకుపోయారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారనే విమర్శలను మూటగట్టుకోవడం ఇబ్బందికరంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలోని కొందరు పోలీసు అధికారులు మరీ బాహాటంగానే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారంటూ ఫిర్యాదులొచ్చాయి. ప్రస్తుత డీజీపీ ఠాకూర్ గతంలో ఏ డీజీపీ కూడా ఎదుర్కోనన్ని ఆరోపణలను అతి తక్కువ సమయంలోనే మూటగట్టుకున్నారు. సదా చంద్రబాబు సేవలో.. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు అయితే అసలు విధులు వదిలి చంద్రబాబు కోసం రాజకీయ సర్వేలు, పార్టీ ఫిరాయింపులు వంటి అనేక కార్యకలాపాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు, పోలీస్ ప్రధాన కార్యాలయంలోని శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు యోగానంద్, మాధవరావులతో పాటు పలు జిల్లాల ఎస్పీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపరను కొనసాగించింది. రాష్ట్రంలో రాజకీయ చిత్రం మారనుందనే విషయం తెలుసుకున్న వారిలో ఆందోళన పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది.. కేంద్ర సర్వీసులకు వెళ్లిపోదామన్న ఆలోచనలతో పలువురు ఐపీఎస్లు పావులు కదుపుతున్నట్టు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
గత ఎన్నికలతో పోల్చితే హింసాత్మక ఘటనలు తక్కువ
సాక్షి, అమరావతి: గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు తక్కువేనని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల్లో ఆరుగురు మృతి చెందారని, ఈసారి ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. 2014లో హింసాత్మక ఘటనలు 276 జరుగగా, ఈసారి 84 హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపారు. గతంలో ఐదు ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈసారి ఆరు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల పర్యవేక్షణ, లైవ్ రిలే కోసం 140 డ్రోన్స్ ఉపయోగించామని, ఎన్నికల నిర్వహణను డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించామని పేర్కొన్నారు. బాడీవోర్న్ కెమెరాలను ఉపయోగించి నేరుగా ఎన్నికల సరళిని పరిశీలించినట్టు డీజీపీ తెలిపారు. ఈ ఎన్నికల్లో 100 సెంట్రల్ సాయుధ పారా మిలటరీ ఫోర్స్ కంపెనీల కొరత ఉన్నప్పటికీ..బందోబస్తును సమర్థంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఏపీ ఎన్నికలు జరగడంతో, ఆ రాష్ట్రానికి చెందిన 28,000 తెలంగాణ పోలీసు దళాలు వచ్చాయని, ఈసారి రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్నికల వల్ల ఆ రాష్ట్రం నుంచి బలగాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. తాము ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీజీపీ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. డీజీపీతో సీఎస్ అత్యవసర భేటీ.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం డీజీపీ ఠాకుర్తో అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు డీజీపీని తన వద్దకు రావాలని కోరితే విధులకు అంతరాయం ఏర్పడుతుందని భావించిన సీఎస్ నేరుగా ఆయనే పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. దాదాపు అరగంట పాటు డీజీపీతో సమావేశమైన సీఎస్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. -
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ను పోలీసు హెడ్ క్వార్టర్స్లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
సీఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆర్పీ ఠాకూర్..!
న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఈసీ కమిషనర్లు అశోక్ లావాస, సుళీల్ చంద్రతో భేటీ అయ్యారు. ఇంటలిజెన్స్ డీజీగా బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఠాకూర్ను ఈసీ వివరణ అడిగినట్టు తెలిసింది. ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహిరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఠాకూర్ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించి గట్టి హెచ్చరికలు పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏసీబీ ఏడీజీగా ఉన్న శంకబ్రత బాగ్చీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. (చదవండి : ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు) -
ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
-
ఏసీబీ బాధ్యతల నుంచి ఠాకూర్ తొలగింపు
అమరావతి: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. కొత్త ఏసీబీ డీజీగా బాగ్చికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా జీవో జారీ చేశారు. డీజీపీ కావడానికి ముందు ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ పని చేశారు. డీజీపీగా పదవి చేపట్టిన తర్వాత కూడా ఆర్పీ ఠాకూర్ ఏసీబీని తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు. చంద్రబాబు ఆదేశాలంతో ఏసీబీ డీజీగా కొనసాగుతూ చరిత్రలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరతీశారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంతో డీజీపీ ఠాకూర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఆర్పీ ఠాకూర్ను ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో ఏసీబీ బాధత్యల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ భేటీ అయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలిసింది. రేపు మరోసారి ఎన్నికల సంఘం ముందు డీజీపీ హాజరు కానున్నారు. -
ఏపీ డీజీపీకి ఎన్నికల సంఘం పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఈసీని కలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల అమలుని ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయం విదితమే. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివరణ తీసుకుంది. మరోవైపు ఏపీ ఇంటెలిఎన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదం వ్యవహారంపై డీజీపీని వివరణ కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసీతో పాటు కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లింది. మరోవైపు డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి...(డీజీపీ ఆర్పీ ఠాకూర్పై ఈసీకి ఫిర్యాదు) ఇంటెలిజెన్స్ డీజీపై వేటు -
డీజీపీ వాహన తనిఖీ హైడ్రామా!
సాక్షి, అమరావతి : రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాహన తనిఖీ హైడ్రామా కొత్త చర్చకు దారితీసింది. విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన శృంగవరపుకోట మండలం బొడ్డవర జంక్షన్ వద్ద మంగళవారం పోలీసులు డీజీపీ వాహనాన్ని తనిఖీ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అరకుకు డీజీపీ ఠాకూర్ ప్రైవేట్ వాహనంలో వెళ్లారు. ఆయన వాహనంతోపాటు ఆయన్ను అనుసరించిన వాహనాలను కూడా పోలీసులు సోదాలు చేశారు. సోదాలు నిర్వహించిన పోలీసులను అభినందించిన ఆయన రివార్డు ఇవ్వాలని విజయనగరం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసీ మరీ చెప్పారు. సీన్ కట్ చేస్తే డీజీపీ వాహన తనిఖీ వ్యవహారం అంతా హైడ్రామా అని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అసలు డీజీపీ ఆ దారిలో వెళ్తున్నారంటే ట్రాఫిక్ క్లియర్ చేయడం దగ్గర్నుంచి ఆయన ఆ ప్రాంతం దాటే వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. డీజీపీ ఏ వాహనంలో వచ్చినా మొబైల్, వైర్లెస్, వాకీ టాకీలలో స్పష్టమైన ఆదేశాలు ఉంటాయని, అలాంటిది ఆయనెవరో తెలియకుండానే కారు ఆపి తనిఖీలు చేసే సాహసం చేస్తారా? అంటూ పోలీసు వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. ఎందుకీ డ్రామా? ఈ ఎన్నికల్లో అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారంటూ డీజీపీ ఠాకూర్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా ఆయన వాహనంలోనే ప్రకాశం జిల్లాకు రూ.35 కోట్లు తీసుకెళ్లి టీడీపీ అభ్యర్థులకు ఇచ్చారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఠాకూర్ పనిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తప్పించాలని సీఈసీ ఇచ్చిన ఆదేశాల అమలులోనూ ఠాకూర్ జోక్యంపై ఈసీ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. విశాఖ జిల్లాలో డీజీపీ ఠాకూర్ పాడేరు: డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం విశాఖ ఏజెన్సీ అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం సాయంత్రం అనకాపల్లి పోలీస్ గెస్ట్హౌస్లో డీజీపీ ఠాకూర్, అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ నలినీ ప్రభాకర్ పోలీస్ అధికారులతో రహస్య మంతనాలు జరిపారు. -
డీజీపీ ఆర్పీ ఠాకూర్పై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేలా పోలీసు యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆర్పీ ఠాకూర్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు వాహనాల్లోనే డబ్బును నియోజకవర్గాలకు చేరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, విక్రాంత్ పాటిల్, కోయా ప్రవీణ్తో పాటు మరికొంత మంది ఐపీఎస్ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి కనుసన్నల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.(చదవండి : సీఈసీ ఆదేశాలు బేఖాతరు) అదే విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో అంశాన్ని కూడా వైఎస్సార్ సీపీ నేతలు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పసుపు-కుంకుమ పథకం కింద నేరుగా మహిళ ఖాతాల్లో టీడీపీ డబ్బు జమ చేస్తున్న వైనంపై కూడా ఫిర్యాదు చేశారు. కాగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఐబీ చీఫ్గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నంబరు 720 జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంటెలిజెన్స్ డీజీపై వేటు
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. తాజాగా సోమవారం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్బెంచ్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేటు పడిన ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రంలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పోలీస్ హెడ్క్వార్టర్కు రిపోర్టు చేయాలని ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది. సర్వం టీడీపీ సేవలోనే... ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనూరాధను అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారు. ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేసి, విజయవాడ పోలీసు కమిషనర్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. అప్పటి నుంచి ఆయన తన విధులను పక్కనపెట్టి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తుల కదలికలను కనిపెట్టడానికి ఉపయోగించాల్సిన సాంకేతిక పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చేలా పార్టీ ఫిరాయింపులకు ఆయన బేరసారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని, టీడీపీ కోసం సేవలు అందించేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన యోగానంద్, మాధవరావు వంటి అధికారులను ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించుకుని, కుల సమీకరణలకు తెరలేపారంటూ విమర్శలు వచ్చాయి. పలు కీలక అంశాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం వేటు వేయడం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వైఫల్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో విఫలమైన వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం జోలికి పోకుండా పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ చీఫ్ జోక్యం కారణంగా వైఎస్సార్సీపీపై, వైఎస్ కుటుంబ సభ్యులపై నెపం నెట్టే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు ఇదే దిశగా దర్యాప్తు చేపట్టి, అసలు కుట్ర కోణాన్ని వదిలేయడం పట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్దేవ్ వర్మపై వేటు వేసిన ఎన్నికల కమిషన్ ఆయనను పోలీస్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రూ.5 కోట్లు వదిలేసినందుకే.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం అధికార టీడీపీకి కొమ్ము కాస్తున్నారనే ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆయనపై వేటేసింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి వాహనంలో తీసుకెళ్తున్న రూ.5 కోట్లను తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలతో ఆ డబ్బును వదిలేశారనే ఫిర్యాదుతో ఎస్పీ వెంకటరత్నంపై ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు సమాచారం. నాన్కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటరత్నంను ఇటీవలే శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు. డీజీపీ అత్యవసర సమావేశం రాష్ట్రంలో ముగ్గురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ ముగ్గురు అధికారుల స్థానాల్లో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన సాగినట్టు సమాచారం. -
మాధవ్ రిలీవ్పై డీజీపీకి ఈసీ లేఖ
సాక్షి, అమరావతి/అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించి వెంటనే రిలీవ్ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం డీజీపీకి లేఖ రాశారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వీఆర్ఎస్ను ఆమోదించడంలేదని మూడు రోజుల కిందట గోరంట్ల మాధవ్ ఏపీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన ట్రిబ్యునల్.. గోరంట్ల మాధవ్ వీఆర్ఎస్ను వెంటనే ఆమోదించి నామినేషన్కు అడ్డంకులు లేకుండా రిలీవ్ చేయాలంటూ కర్నూలు డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, రెండ్రోజుల నుంచి కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్ అందుబాటులో ఉండడంలేదు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోరంట్ల మాధవ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ కుట్రతోనే తన వీఆర్ఎస్ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేని కేసులు ఉన్నట్లు చూపించి పెండింగ్ పెట్టారని.. దీనిపై ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాధవ్ ఎన్నికల అధికారికి వివరించారు. దీనిపై స్పందించిన ద్వివేది.. మాధవ్ను వెంటనే రిలీవ్చేసి నామినేషన్ దాఖలు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని డీజీపీ ఠాగూర్కు లేఖ రాశారు. (ఖాకీలే శత్రువులు !) సీఎం ఒత్తిడి మేరకే ఆ ఇద్దరి కుట్ర కాగా, తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారుల్లో ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తన వీఆర్ఎస్ ఆమోదం విషయంలో స్వయానా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఒత్తిడి మేరకే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డీజీపీని కలుస్తానన్నారు. -
టీడీపీ బెదిరింపులకు భయపడం..!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీకి వత్తాసు పలుకుతున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ను విధుల నుంచి తప్పించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలపై దాడులు చేయడం దారుణమన్నారు. హింసా రాజకీయాల ద్వారా టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బాబుతో కలిసి ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కొడికత్తి దాడి అని చంద్రబాబు వెకిలిగా మాట్లాడారని విజయ్ బాబు మండిపడ్డారు. ఓట్ల గల్లంతుపై ఓ ప్రైవేటు వ్యక్తిపై కేసుపెడితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేత పరిటాల రవి హత్య జరిగితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని, వైఎస్ వివేకానంద హత్యపై థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సీఎం వైఖరి చూసి ఏపీ ప్రజలంతా అసహించుకుంటున్నారని విజయ్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షంపై భౌతిక దాడులకు పాల్పడుతున్న టీడీపీ బెదిరింపుల చూసి ఎవ్వరూ బెదిరేదిలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అధికార యంత్రాంగం టీడీపీకి ప్రచారం దారుణమన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
డీజీపీ ఆర్పీ ఠాకూర్పై ఈసీకి ఫిర్యాదు
-
డీజీపీ ఆర్పీ ఠాకూర్పై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి : ఎన్నికలు పూర్తయ్యే వరకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. ఠాకూర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు. అనంతరం రామకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ‘ ఠాకూర్ డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరు. ఆయనపై నేను వేసిన పిల్ పెండింగ్లో ఉండగానే సీఎం.. ఠాకూర్ను డీజీపీగా నియమించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి సమయంలోనూ సానుభూతి కోసం దాడి చేయించుకున్నారంటూ డీజీపీ చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఈసీ ఫిర్యాదులో పేర్కొన్నా’ అని వ్యాఖ్యానించారు. ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే! జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని డీజీపీ ఠాకూర్ ఆక్రమించుకుని ఇల్లు నిర్మించి... అఖిల భారత సర్వీస్ అధికారుల రూల్స్ను అతిక్రమించారని రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. కాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్నగర్లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. -
డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలి?
-
డీజీపీయే కబ్జాలు చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్ : చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా?.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణరెడ్డి పార్టీ కేంద్రకార్యలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ డీజీపీ ఇంటి అక్రమనిర్మాణంపై హైకోర్టు తీర్పును వైఎస్సార్సీపీ స్వాగతిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు అండగా ఉన్నారని ఠాకుర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2010లో డీజీపీ ఠాకుర్ ప్లాన్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, జీహెచ్ఎంసీ పర్మిషన్ రాకున్నా ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. అక్రమ నిర్మాణ నిర్మించడమే కాకుండా పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించారన్నారు. భారీ ఇంటి నిర్మాణ చేపట్టిన డీజీపీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ నిర్మాణం విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసులను డీజీపీ ఉల్లంఘించారన్నారు. డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. పసిపిల్లలు ఆడుకునే పార్క్ను కూడా అడ్డంగా కబ్జా చేస్తారా? అని నిలదీశారు. న్యాయాన్ని కాపాడుకునేందుకు మేం కోర్టుకు వెళ్లామని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఓ డీజీపీగా ఠాకుర్ ఉందా లేదా? అని ప్రశ్నించారు. అవినీతి చేస్తూ చట్టాలను కాపాడతామని అబద్ధాలు చెబుతున్నారని, పోలీస్ బాస్ అయితే ఆక్రమణలు చెల్లుతాయా? అని మండిపడ్డారు. ఇక హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్నగర్లో డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. -
ప్రశాసన్నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
ఏపీ డీజీపీ అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72 ప్రశాసన్నగర్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ (ప్లాట్ నం.149) జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను మంగళవారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ప్లాట్ నం–149ను ఆనుకుని ఉన్న పార్కును సదరు ఐపీఎస్ అధికారి రెండు వైపులా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా పార్కులోని ఇనుప దిమ్మెలతో అనధికారిక స్ట్రక్చర్ కూడా నిర్మించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోగా నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు అంతస్తులు నిర్మించారు. జీ ప్లస్–1 నిర్మాణానికి అనుమతి తీసుకున్న ఠాకూర్ ఇటీవల ఇంటి చుట్టూ సెట్బ్యాక్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అక్రమంగా ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో నిర్మించారు. పార్కు స్థలంలో కబ్జాలను కూల్చివేసిన అధికారులు.. అక్రమంగా నిర్మించిన అంతస్తులను కూడా తొలగించాలంటూ మంగళవారం తుది నోటీసులు జారీ చేశారు. 2017, జూన్ 4న ప్రశాసన్నగర్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ఠాగూర్ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసిందని, దీంతో అదే సంవత్సరం జూన్ 5న ఒకసారి, జూన్ 17న రెండోసారి నోటీసులు జారీ చేశామని అధికారులు చెప్పారు. స్పందన రాకపోవడంతో మంగళవారం మూడో నోటీసు జారీచేసినట్లు తెలిపారు. -
ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్ (ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్లోని ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనని జీహెచ్ఎంసీ న్యాయవాది ఎల్.వెంకటేశ్వరరావు హైకోర్టుకు నివేదించారు. తాము నోటీసు జారీ చేసిన తరువాత పార్కులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారని వివరించారు. అనుమతి పొందిన ప్లాన్ కు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంపై కూడా నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీహెచ్ఎంసీపై నిప్పులు చెరిగింది. పార్కును అక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నిం చింది. అనుమతి పొందిన ప్లాన్కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఎక్కడున్నారంటూ నిలదీసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుపట్టాల్సింది అవి చేపడుతున్న వారిని కాదని, చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకలకు చుట్టుకుంటుందని అనుకున్నప్పుడే స్పందించడం జీహెచ్ఎంసీ అధికారులకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణా ల విషయంలో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కాకుండా ఉందంది. 24 గంటల్లో ఆక్రమణలను తొలగించాలని, లేకుంటే కూల్చివేస్తామంటూ చెప్పడం అలవాటుగా మారిందంది. నోటీసు ఇచ్చినప్పుడు దానికి స్పందిం చేందుకు వారం రోజు ల గడువునివ్వాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని గుర్తు చేసింది. ఈ కేసులో కూడా డీజీపీ ఠాకూర్కు 24 గంటల సమయం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథస్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై ఆళ్ల పిల్... ప్రశాసన్నగర్లో ఆర్పీ ఠాకూర్ జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించుకుని, అనుమతి పొందిన ప్లాన్కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని.. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపాల్సి ఉంది. అయితే సీజే అకస్మాత్తుగా సెలవు పెట్టారు. దీంతో ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని ఠాకూర్ తరఫు న్యాయవాది వి. పట్టాభి మంగళవారం ఉదయం జస్టిస్ చౌహా న్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారు? పిటిషనర్ తరఫు న్యాయవాది పి. సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, డీజీపీ ఠాకూర్ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పారు. 2017లో అక్ర మ నిర్మాణాలను చేపట్టిన ఠాకూర్, ఈసారి పార్కునే ఆక్రమిం చి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్ఎంసీ వివరణ అడిగింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది ఎల్.వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసు జారీ చేశామని, సమాధానం రాకపోవడంతో మరో నోటీసు జారీ చేశామన్నారు. ఈ నోటీసులపై ఆయన కింది కోర్టుకెళ్లి, ఇన్జంక్షన్ ఉత్తర్వులు పొందారని తెలిపారు. కింది కోర్టు ఇటీవల ఆయన పిటిషన్ను కొట్టేసిందని చెప్పారు. దీంతో మళ్లీ ఈ నెల 2న తుది నోటీసు జారీ చేసి, 24 గంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశామని చెప్పారు. ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారు.. నోటీసు ఇచ్చినప్పుడు, దానికి స్పందించేందుకు గడువు ఏడు రోజులు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఠాకూర్కు 24 గంటలే గడువునివ్వడం సరికాదంది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామంది. కూల్చివేత విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం జీహెచ్ఎంసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరో గుచ్చినప్పుడు కోమా లో నుంచి బయటకు వచ్చి హడావుడి చేస్తుంటారని మండి పడింది. ఈ పిటిషన్ దాఖలు కాకుండా ఉంటే, ఆ పార్కు సంగతి ఏమిటని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ కేసులో ఠాకూర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 2 వారాల గడువు కావాలని పట్టాభి కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఏపీ డీజీపీ ఆక్రమణ.. జీహెచ్ఎంసీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్ ఆక్రమించిన పార్క్ స్థలాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ప్రశాసన్ నగర్లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి : ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు ఏపీ డీజీపీ పార్క్ భూమిని ఆక్రమించుకున్నారు -
ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు
-
ఏపీ డీజీపీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు హైకోర్టులో చుక్కెదురైంది. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయవల్సిందిగా ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు తొలగించుకున్నామని డీజీపీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇంటి నిర్మాణం కూడా అక్రమమే అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వివరణ కోరింది. దీంతో రెండు వారాల సమయం కావాలని డీజీపీ ఠాకూర్ తరపున న్యాయవాది కోరారు. అయితే సమయం ఇవ్వడం కుదరదన్న న్యాయస్థానం.. ఈ నెల 11వరకు ఇంటి అక్రమ నిర్మాణంపై కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. చదవండి : ఏపీ డీజీపీ పార్క్ భూమిని ఆక్రమించుకున్నారు -
డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకెలాంటి సమాచారం లేదని, ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను అపహరించినట్లు తాజాగా వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం. టీడీపీ యాప్లోకి ఓటర్ల మాస్టర్ డేటా.. ఓటర్ల మాస్టర్ డేటా ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటా టీడీపీ సేవామిత్ర యాప్లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా ఆధార్ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్ డేటాలోనే ఆధార్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్లో ఆధార్ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. చదవండి: డేటా చోర్.. బాబు సర్కార్ -
ఏపీ డీజీపీ పార్క్ భూమిని ఆక్రమించుకున్నారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే ఆర్పీ ఠాకూర్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రశాసన్నగర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిందని రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆర్పీ ఠాకూర్ కూడా ప్లాట్ నంబర్ 149లో 502 చదరపు గజాల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించారని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు. 2008లో ఆ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించుకున్నారు. 2017లో మరోసారి అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారు... 2017లో మరోసారి అక్రమ నిర్మాణాలను చేపట్టారని, ఈసారి జీహెచ్ఎంసీ పార్కును ఆక్రమించి మరీ ఈ నిర్మాణాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకటి నుంచి మూడో అంతస్తుకు మెటల్ ఫ్రేమ్ సాయంతో ఓ బ్రిడ్జిగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనిపై పొరుగునే ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్.ఎస్.గోయల్ ఫిర్యాదు చేశారని, సమాచార హక్కు చట్టం కింద కూడా సమాచారం తీసుకున్నారని, ఠాకూర్ చేపడుతున్న నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్పారన్నారు. ఠాకూర్ అక్రమ నిర్మాణాలపై ప్రశాసన్నగర్ హౌసింగ్ సొసైటీ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు వివరణ కోరినా ఠాకూర్ స్పందించలేదన్నారు. అధికారులను అడ్డుకున్నారు... పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న విషయంపై కూడా గోయల్ ఫిర్యాదు చేశారని, దీనిపై వాస్తవాలను తేల్చేందుకు ఠాకూర్ ఇంటి వద్దకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లగా, ఠాకూర్ మనుషులు ఆ అధికారులను అడ్డుకున్నారని తెలిపారు. ఆ తరువాత ఠాకూర్ దీనిపై సివిల్ కోర్టుకెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని, ఆ తరువాత కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసిందన్నారు. ఈ పిటిషన్లో ఠాకూర్ ఎక్కడా కూడా తన హోదా గురించి ప్రస్తావించలేదని తెలిపారు. వాస్తవాలను దాచి పెట్టి ఆ పిటిషన్ దాఖలు చేశారన్నారు. పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని, అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసినా కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఠాకూర్పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఠాకూర్ చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేసేలా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాలని కోరారు. -
పిడిగుద్దులు గుద్దాను.. చనిపోయాడు!
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి : సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. అతడిని శిఖాచౌదరి ప్రియుడే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న శిఖాచౌదరి ప్రియుడు రాకేష్రెడ్డి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇతడిపై కూకట్పల్లి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హత్యకు గురయిన జయరామ్ భార్య పద్మశ్రీ.. మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ దుయ్యబట్టారు. తన అక్క నుంచే ప్రాణహాని ఉందని గతంలో తనకు జయరాం చెప్పారన్నారు. ఆయన భారత్కు వచ్చాక ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని ఆమె వాపోయారు. వ్యాపార లావాదేవీల సమావేశం నిమిత్తమే అమెరికా నుంచి భారత్కు వచ్చారని పద్మశ్రీ తెలిపారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు ఎన్నారై జయరామ్ను శిఖాచౌదరి ప్రియుడే హత్య చేశాడని నిర్ధారణకు వచ్చిన కృష్ణాజిల్లా పోలీసులు.. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి? ఎలా చేశాడు? ఎవరు సహకరించారు? అనే విషయాలు అతడి నుంచి రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. విచారణలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ‘జయరామ్కు మెదక్లో టెక్ట్రాన్ పాలీలెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఉద్యోగులు జీతం అందక గొడవ చేస్తున్న సమయంలో రెండేళ్ల కిందట నా వద్ద రూ. 4.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలోనే జయరామ్ మేనకోడలు శిఖాచౌదరి పరిచయం అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ బంధం బలపడడంతో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆమె కోసం నేను చాలా డబ్బు ఖర్చు పెట్టా. శిఖా చౌదరిని వదిలేయాలని జయరామ్ నన్ను కోరాడు. నాకు ఇవ్వాల్సిన 4.50 కోట్లతో పాటు శిఖాకి ఖర్చు పెట్టిన కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తానని చెప్పాను. అందుకు సరే అన్న జయరామ్ ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు. జనవరి 29న జయరామ్ అమెరికా నుంచి వచ్చినట్లు తెలిసి డబ్బులు అడగడానికి వెళ్లా. నాపైనా ఒత్తిడి ఉంది. ఎంత అడిగినా జయరామ్ డబ్బులు ఇవ్వకపోయే సరికి తీవ్రస్థాయిలో బెదిరించాను. దీంతో 31వ తేదీన ఉదయం అతడు ఒంటరిగా మా ఇంటికి వచ్చాడు. నా ఇంట్లో నుంచే పలువురికి జయరాం ఫోన్ చేసి డబ్బు సర్దుబాటు చేయమని కోరాడు. చివరకు కోస్టల్ బ్యాంక్లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ద్వారా రూ. 6 లక్షలు నా స్నేహితులకు అందజేశాడు. రూ.5.5 కోట్లకు గానూ కేవలం 6 లక్షలు ఇవ్వడమేంటని జయరామ్తో వాదనకు దిగాను. అది తీవ్రస్థాయికి చేరింది. దాంతో జయరాంపై పిడిగుద్దులు గుద్దాను. జయరామ్ హార్ట్ పేషెంట్ కావడంతో ఆ దెబ్బలకే చనిపోయాడు. అప్పుడు ఏంచేయాలో తెలియక మృతదేహాన్ని సాయంత్రం వరకు ఇంట్లో ఉంచుకుని అనంతరం కారులో తీసుకెళ్లి నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద కారు వెనుక సీటులో ఉన్న అతడిని బయటకు తీసి స్టీరింగ్ సీటులో కూర్చోపెట్టే ప్రయత్నం చేశా. అది కుదరకపోవడంతో అతడి చేతిలో బీరు సీసా ఉంచి.. మరో బీర్ను రోడ్డుపై పడేశా.. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేశా.’అని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. నిందితుడు రాకేశ్తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ఫైల్) శిఖాచౌదరి ప్రియుడి నేర చరిత్రపై ఆరా.. చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడు శిఖాచౌదరి ప్రియుడి నేరచరిత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు వెల్లడవుతున్నాయి. గతంలో ఓ హీరోయిన్ వ్యభిచారం కేసులో అతడు పట్టుబడినట్లు గుర్తించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.80 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో అనేక మోసాలు, దందాల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతోనూ సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్లు ఇప్పించే విషయంలోనూ భారీ లాబీయింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుమారుడినంటూ సినిమా ఆరిస్టులతో పరిచయాలు.. హీరోయిన్లతో పార్టీలు పెట్టి పనులు చక్కదిద్దడంలో అతడు దిట్టని తెలుస్తోంది. ఇదిలా ఉండగా..శిఖాచౌదరి స్నేహంతో తమ కుమారుడు ఇంటికి రావడమే మానేశాడని, ఆమె పరిచయంతోనే అతడిలో మార్పు వచ్చిందని రాకేష్రెడ్డి తండ్రి చెబుతున్నారు. గతంలో అతడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, జయరాం కేసులో తన కుమారుడిని అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయన మీడియా వద్ద వాపోయారు. ఇంత దూరం ఎందుకురావాల్సి వచ్చింది? కోపంతో జయరామ్ను చంపేసిన చాలా గంటలపాటు మృతదేహాన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత మృతదేహాన్ని నందిగామ తీసుకొచ్చి.. ప్రమాదంగా చిత్రికరించి బస్ ఎక్కి వెళ్లిపోయానని శిఖాచౌదరి ప్రియుడు విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అప్పటికే నేరాలు చేయడంలో ఆరితేరిన అతడు ఇంతదూరం ప్రయాణించి సీసీ టీవీ నిఘా ఉండే టోల్గేట్లు దాటుకుంటూ నందిగామ సమీపంలోని ఐతవరం వరకు ఎందుకు రావాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఒకవేళ జయరామ్ మృతి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించదలచుకుంటే హైదరాబాద్ శివారు దాటగానే ఆ పనిచేసి ఉండవచ్చు. కానీ నింపాదిగా కారులో ప్రయాణం చేసి నందిగామ వచ్చాక రాత్రి 10.20–10.41 నిమిషాల మధ్య పాతబస్టాండు సమీపంలోని విజయా బార్లో రెండు బీర్లు కొనుగోలు చేసినట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. ఇంత ఘోరంగా చంపుతారనుకోలేదు: పద్మశ్రీ తన భర్త హత్య కేసులో అతని తరఫు బంధువులపైనే అనుమానాలున్నాయని జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపించారు. కేసు విచారణలో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం. 2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరామ్ తనతో చెప్పేవారని తెలిపారు. సొంత అక్కతోనే ప్రాణహాని ఉందని జయరామ్ చెప్పేవారని పద్మశ్రీ వెల్లడించారు. మేనకోడలు శిఖా చౌదరి ప్రమే యం ఎక్కువ అవ్వడంతో ఆమెను చానల్ బాధ్యతల నుంచి తప్పించినట్లు పోలీసులకు చెప్పారు. అమెరికా నుంచి భారత్కు వచ్చాక ఇంత ఘోరంగా చంపుతారని ఊహించలేదని పద్మశ్రీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. జయరామ్ హత్య కేసులో ఎవర్ని తప్పించేది లేదు: డీజీపీ కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఎవరిని తప్పించే అవకాశంలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. జయరామ్ హత్య కేసులో కీలక వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలను పలువురు మీడియా ప్రతినిధులు సోమవారం డీజీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ కేసులో నిందితులు అందర్నీ కచ్చితంగా అరెస్టు చేస్తామని వెల్లడించారు. జయరామ్ హత్య కేసులో విచారణ దాదాపు పూర్తి అయ్యిందని అన్నారు. కేసు విచారణకు ఆరు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. జయరాంను హైదరాబాద్ లో హత్య చేసి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చినట్టు తేలిందన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కృష్ణా జిల్లా పోలీసులు త్వరలోనే మీడియాకు వెల్లడిస్తారని డీజీపీ తెలిపారు. -
టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో సర్వేల పేరుతో ఇళ్లకు వెళ్తున్న సర్వే బృందాలు టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నాయని, వారిని పట్టుకుని అప్పగిస్తే అరెస్టు చేయాల్సిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల్ని నిర్బంధించి దౌర్జన్యం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు సచివాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని, మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. సర్వే చేయడానికి వచ్చిన ఎన్నికల కమిషన్ ఉద్యోగులమంటూ టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిమానులుగా పేర్కొన్న వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగిస్తున్నారని ద్వివేది దృష్టికి తెచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో ఉద్యోగులుగా చెప్పుకుంటూ సర్వేలు చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని ట్యాబ్లను ఆయనకు అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఓట్లు తొలగించే టీడీపీ సర్వే బృందాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న యువకులను పట్టుకుని అప్పగిస్తే పోలీసులు వదిలేశారని డీజీపీ దృష్టికి తెచ్చారు. డీజీపీకిచ్చిన ఫిర్యాదులో.. విజయనగరం జిల్లాలో సర్వే బృందాలు చేస్తున్న అక్రమాల వివరాలు, జరిగిన ఘటన, పోలీసుల తీరు తదితర అంశాలను బొత్స డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలో టీడీపీకి చెందిన గొల్లు కృష్ణ్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తు దేముడు అనే యువకులు ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారని వివరించారు. వారు ట్యాబ్లు తీసుకొచ్చి అందులో ఓటర్ల జాబితాలు ఉంచుకుని ఎవరికి అనుకూలంగా ఉంటారు? ఏ పేపర్ చదువుతారు? ప్రభుత్వ పథకాలు బాగున్నాయా? అధికార పార్టీకి వ్యతిరేకమా? అనుకూలమా? అని ఓటర్ల నుంచి సమాధానాలు రాబట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేపై అనుమానం వచ్చిన గ్రామస్తులు కొందరు వైఎస్సార్సీపీ నేతల్ని పిలిచి చెప్పారని, నేతలు ఆ యువకులను ప్రశ్నించడంతో వారు తడబడ్డారని తెలిపారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో సర్వే చేస్తున్నవారు టీడీపీకి చెందినవారేనని, ఇంటింటికీ తిరిగి అభిప్రాయాలు అడిగిన తర్వాత ఓటర్ల లిస్ట్లో వారి ఓట్లు మాయమవుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సర్వే చేస్తున్న యువకులను పోలీసులకు అప్పగించగా పోలీసులు ఆ యువకులను పంపేశారని, ఆ ట్యాబ్లలో ఏముందో విచారించాలని కోరినా వినకుండా ఆ ట్యాబ్లను తమకు అప్పగించారని డీజీపీ దృష్టికి తెచ్చారు. విజయనగరం పోలీసులు అర్ధరాత్రి సమయంలో పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఇతర నేతల్ని అక్రమంగా నిర్బందించి ఆ ట్యాబ్లను యువకుల వద్ద నుంచి లాక్కున్నారంటూ అక్రమ కేసులు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. అక్రమాలను అడ్డుకుంటాం ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని కలిసిన తర్వాత పార్టీ నేత బొత్స మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు ఇలాంటి అడ్డదారులు తొక్కడం దారుణమని, వీటిని అడ్డుకుంటామని అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దిన్సోతవమని.. అదే రోజున ఇలాంటివి జరగడం దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులుగా చెప్పుకుంటూ గ్రామాల్లో సర్వేలకొస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీకి అనుకూలురైనవారి ఓట్లను ట్యాబ్లో ఓటర్ల జాబితాలో మార్కు చేసుకొని, ఆ వివరాలను పైకి చేరవేస్తున్నారని చెప్పారు. విజయనగరంలో వీటిని అడ్డుకున్న తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ అక్రమాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఇలా సర్వేల ద్వారా గుర్తించిన వారి ఓట్లను 30 వేల దాకా అక్రమంగా తొలగించారని మండిపడ్డారు. ఇలా సర్వేల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు వినియోగిస్తున్న ట్యాబ్లపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీ హామీ ఇచ్చారన్నారు. డీజీపీ తీసుకునే చర్యలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలతోపాటు లీగల్ సెల్ ప్రతినిధులు కోటంరాజు వెంకటేశ్వర శర్మ, సుజాతశర్మ, బి.సతీష్, పార్టీ సంయుక్త కార్యదర్శి అడపా శేషు ఉన్నారు. -
డీజీపీగా ఠాకూర్ నియామకంపై నీలినీడలు!
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా వెల్లడించిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకంపై నీలినీడలు అలుముకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు డీజీపీ ఠాకూర్ నియామకం చట్ట విరుద్ధమేనని తేటతెల్లమైంది. తమ సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకానికి అనుమతించాలని కోరుతూ పంజాబ్, హరియాణా, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ జోక్యంతోపాటు ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకునే రాష్ట్రాల సొంత చట్టాల ద్వారా డీజీపీ నియామకం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని జస్టిస్ రంజన్ గొగోయ్ గుర్తుచేశారు. అలాగే యాక్టిం గ్ డీజీపీ నియమాకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదని పేర్కొన్నారు. యాక్టింగ్ డీజీపీ పేరుతో వారి పదవీ కాలాన్నీ ఏళ్ల తరబడి పొడిగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం భావ్యం కాదని తేల్చిచెప్పారు. రాష్ట్రాల డీజీపీ నియమాకానికి సీనియారిటీ మేరకు వారి సర్వీసులోని అంశాలను జోడించి ముగ్గురు పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కు(యుపీఎస్సీ) పంపించాల్సి ఉందని, అందులో నుంచి ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని, అలా ఎంపిక చేసిన వ్యక్తిని డీజీపీగా రాష్ట్రాలు నియమించాల్సి ఉంటుందని జస్టిస్ రంజన్ గొగోయ్ తన తీర్పులో వెల్లడించారు. చంద్రబాబు సొంత చట్టం 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు యూపీఎస్సీ ద్వారానే డీజీపీని నియమించాల్సి ఉంటుంది. యూపీఎస్సీకి మూడు పేర్లు పంపిస్తే తనకు కావాల్సిన వారిని, రాజకీయంగా ఉపయోగపడే వ్యక్తిని డీజీపీగా నియమించుకోవడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అందుకే డీజీపీ ఎంపిక ప్రక్రియను యూపీఎస్సీ నుంచి తప్పించేందుకు ఏకంగా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. రాష్ట్ర సొంత చట్టం మేరకే డీజీపీని నియమించాలని నిర్ణయించారు. 2018 జూన్ 30వ తేదీన యాక్టింగ్ డీజీపీగా పనిచేస్తున్న మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసే చివరి నిమిషం వరకూ కొత్త డీజీపీ ఎవరనేది చంద్రబాబు తేల్చలేదు. చివరి నిమిషంలో ఐదుగురు పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించినట్లు కథ నడిపించారు. గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, కౌముది, సురేంద్రబాబు, అనూరాధ పేర్లతో సీనియారిటీ జాబితా రూపొందించామని, అందులో నుంచి ఆర్పీ ఠాకూర్ను డీజీపీగా నియమించినట్లు తెలిపారు. వాస్తవానికి గౌతమ్ సవాంగ్ డీజీపీ అవుతారని అందరూ భావించారు. ఆయన రాజకీయంగా ఉపయోగపడరనే ఉద్దేశంతోనే ఆర్పీ ఠాకూర్ వైపు చంద్రబాబు మొగ్గుచూపినట్లు సమాచారం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీజీపీగా ఠాకూర్ నియమాకం చట్ట విరుద్ధమే అవుతుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. డీజీపీనా.. రాజకీయ నాయకుడా? డీజీపీ ఆర్పీ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, డీజీపీ అనే విషయాన్ని మరిచిపోయి రాజకీయ నేతగా మాట్లాడుతున్నారని అధికార యంత్రాంగం చెబుతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యక్తి డీజీపీగా కొనసాగితే వచ్చే సాధారణ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు అన్నారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసిన డీజీపీలను ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నికల విధుల నుంచి తప్పించి, కొత్తవారిని నియమించిందని ఆయన గుర్తు చేస్తున్నారు. -
ఏపీలో ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయి: డీజీపీ
-
ఏపీలో ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయి: డీజీపీ
సాక్షి, విజయవాడ : గతేడాదితో పోలిస్తే 2018లో రాష్ట్రంలో నేరాలు 3.5 శాతం తగ్గాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. 2017లో ఏపీలో మొత్తం 1.23 లక్షల కేసులు నమోదు కాగా... ఈ ఏడాది 1.11 లక్షల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2018లో రైల్వే నేరాలను గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 9.09 శాతం తగ్గాయని తెలిపారు. హత్యలు, కిడ్నాప్ వంటి నేరాలను నియంత్రినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆర్థిక నేరాలు 29.22 శాతం పెరగగా...సైబర్ నేరాలు కూడా 25.67 శాతం పెరిగినట్లు వెల్లడించారు. 323 మంది మహిళలను రక్షించాం ఆర్థిక నేరాలు, బ్యాంక్ లావాదేవీల సమయంలో ఉపయోగించే ఓటీపీల ద్వారా 185 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండటం వల్లే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని... ఇటువంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. 323 మంది మహిళలను అక్రమ రవాణా నుంచి రక్షించామన్నారు. అగ్రిగోల్డ్ కేసులో 77 కోట్ల ఆస్తులను కోర్టు అటాచ్ చేసినట్లు తెలిపారు. -
సర్వేయర్ ఆస్తులు రూ.25 కోట్లు!
పెనమలూరు/దేవరాపల్లి(మాడుగుల): ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనమలూరు మండల సర్వేయర్ కొల్లి హరిబాబు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. బుధవారం ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో.. రూ.25 కోట్ల విలువ చేసే ఆస్తులతోపాటు నగదు, ఆభరణాలు లభించాయి. దీంతో ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని పామర్రు మండలం కనుమూరుకు చెందిన హరిబాబు(52) 1993లో సర్వేయర్గా చేరారు. గన్నవరం, విజయవాడ, పెనమలూరు ప్రాంతాల్లో సర్వేయర్గా విధులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం తెల్లవారుజామున విజయవాడ రామచంద్రనగర్ ప్రాంతం మహాలక్ష్మీ నిలయం అపార్టుమెంట్లో ఉంటున్న హరిబాబు ఇంట్లో, ఇంకా రామచంద్రపురం, పెనమలూరుతోపాటు మరో ఐదుచోట్ల సోదాలు చేశారు. తనిఖీల్లో హరిబాబు పెద్ద ఎత్తున ఆస్తులు కూడపెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబు భార్య పద్మజ పేరున విజయవాడ రామచంద్రనగర్లో 1,450 చదరపు అడుగుల విస్తీర్ణంతో విలువైన అపార్టుమెంట్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విజయవాడ కార్మెల్నగర్లో 243 చదరపు గజాలు, నాగార్జుననగర్లో 206 చదరపు గజాలు, గన్నవరం బహుబలేంద్రునిగూడెంలో 822.6 చదరపు అడుగుల స్థలం, నూజివీడు గొల్లపల్లెలో 375 చదరపు గజాల స్థలం, విజయవాడ క్రీస్తురాజపురంలో 135 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుమార్తె హారిక పేరున పోరంకిలో 252 చదరపు గజాల స్థలం, మరో కుమార్తె హర్షిత పేరున 252 చదరపు గజాల స్థలాన్ని సైతం గుర్తించారు. ఇవిగాక బ్యాంకు బ్యాలెన్స్ రూ.11 లక్షలు, ఇంట్లో 49 వేల నగదు, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఏసీబీకి చిక్కిన మరో సర్వేయర్ ఇదిలా ఉండగా విశాఖ జిల్లా దేవరాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఎల్.శామ్యూల్ లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భూమి సర్వే రిపోర్టుకోసం రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.3వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెదనందిపల్లికి చెందిన రైతు నుంచి ఆ సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
‘మేము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తాం’
విజయవాడ: తాము ఏం చేసినా చట్టప్రకారం చేస్తామని, ఏసీబీలో సొంత నిర్ణయాలు ఉండవని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. విజయవాడలోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో ఏసీబీ డీజీ హోదాలో ఠాకూర్ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఓ అధికారి అవినీతి గురించి గత నెల 28న లోకేష్ అనే వ్యాపారి నుంచి సీబీఐకి ఫిర్యాదు అందింది. అంతకు ముందే గత నెల 22న ఈ ఫిర్యాదును లోకేష్ విజయవాడ ఏసీబీ డీఎస్పీకి ఇచ్చారు. ఏసీబీకి ముందుగానే లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం సీబీఐ తెలియదు. మమ్మల్ని సీబీఐ సహకరించమని కోరే సమయానికే ఏసీబీ ఆ అధికారిపై ట్రాప్ సిద్ధం చేసింద’ ని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ సమాచారం మాకు ఎవరిచ్చినా వారి పేర్లు బయటపెట్టం. కేంద్ర ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తుంటే ఏసీబీ మౌనంగా కూర్చోవాలా..?. ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగితే ఏసీబీనే చర్యలు తీసుకుంటుంది. ఏపీలో అవినీతి నిర్మూలనకు అందరి సహకారం తీసుకుంటాం. అయేషా మీరా కేసుని సీబీఐకి అప్పచెబుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామ’ని ఆర్పీ ఠాకూర్ వ్యాఖ్యానించారు. జాయింట్ ఆపరేషన్ కోరితే సీబీఐ ముందుకు రాలేదు : అనురాధ అవినీతి అధికారిపై జాయింట్ ఆపరేషన్ చేద్దామని కోరితే సీబీఐ ముందుకు రాలేదని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ పేర్కొన్నారు. సీబీఐ ఆరోపణలపై స్పందించిన అనురాధ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం సీబిఐ ఎస్పి నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారి అవినీతిపై తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. సీబీఐపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సీబీఐ అధికారికి వివరించినట్టు అనురాధ పేర్కొన్నారు. సీబీఐ ఉమ్మడి దాడికి అంగీకరించకపోవడం వల్లే ఏసిబి సొంతగా చర్యలు తీసుకుందని తెలిపారు. ఇకనుండి ఏపీలో అవినీతికి సంబంధించిన అన్ని కేసులను ఏసీబీనే దర్యాప్తు చేస్తుందని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటంలో సీబీఐతో సహా ఏ ఇతర దర్యాప్తు సంస్ధలతో పనిచేయడానికి ఏసీబీ సిద్దంగా ఉందని అనురాధ వివరించారు. -
చంద్రబాబుతో డీజీపీ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడితో డీజీపీ ఆర్పీ ఠాకూర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతాలు సమావేశం అయ్యారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు వారాల్లోగా నోటీసులకు సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ కేసులో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సంబంధిత కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేయవద్దని కూడా పోలీసులకు స్పష్టం చేసింది. -
జగన్కు భద్రత పెంచుతాం: డీజీపీ
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ తప్పుదిద్దుకునే చర్యల్లో పడ్డారు. విజయవాడలో ఓ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. వైఎస్ జగన్ భద్రత గురించి, నిందితుడు శ్రీనివాసరావు కస్టడి గురించి మీడియా ఆడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. భద్రత కల్పించడమనేది డీజీపీగా తన బాధ్యతని గుర్తుచేశారు. ఈ ఘటన నేపథ్యంలో వైఎస్ జగన్కు భద్రత పెంచుతామని వివరించారు. నిందితుడు శ్రీనివాసరావు విషయంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుంచి ఎటువంటి నోటీసులు తమకు రాలేదని తెలిపారు.. శ్రీనివాస్ పోలీసు కస్టడీ నేటితో ముగిసిందని, మరికొన్ని రోజులు గడువు కావాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టును ఆడుగుతారని వివరించారు. అయితే ఈ కేసును తాను ఇన్వెస్టిగేషన్ చేయటం లేదని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా వైఎస్ జగన్ను రెండుసార్లు వివరణ ఇవ్వమని అడిగామని.. మరోసారి అడుగుతామని పేర్కొన్నారు. -
తెలంగాణలో తిరిగితే తప్పేంలేదు..
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలన ఆపరేషన్లలో భాగమైన ఏపీ పోలీసు సిబ్బంది తెలంగాణలో సంచరించడం చట్ట వ్యతిరేకం కాదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఒకవేళ విధులతో సంబంధం లేకుండా ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలుంటే వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి, మంచిర్యాలలో ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే నిర్వహిస్తూ పట్టుబడిన ఉదంతాలపై వివరణ కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్ జారీ చేసిన నోటీసులకు ఏపీ డీజీపీ సమాధానమిచ్చారు. ఈ ఘటనలపై విచారణ జరిపించామని, ధర్మపురి, మంచిర్యాలలో పట్టుబడింది తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బందేనని తెలిపారు. తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లను వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన రహస్య పనిపై నియమించామన్నారు. ఈ కానిస్టేబుళ్లు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వారి వద్ద డబ్బు కూడా లేదని వెల్లడించారు. వారిని స్థానికులు చట్ట విరుద్ధంగా అటకాయిస్తే వారే స్థానిక పోలీసుల జోక్యాన్ని కోరారని తెలిపారు. విచారణ తర్వాత ఎలాంటి తప్పు కనిపించకపోవడంతో పోలీసులు వారిని విడిచిపెట్టారన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన వ్యక్తులు, ఆస్తుల పరిరక్షణ కోసం తమ రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించిన పలు విభాగాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు తమ విభాగాలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైతం మోహరించామన్నారు. ఎన్నికల సర్వే కోసమే..: రాష్ట్ర డీజీపీ శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది ధర్మపురి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థుల గెలుపోటమలపై సర్వే నిర్వహిస్తూ పట్టుబడ్డారని తమ విచారణలో తేలిందని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పట్టుబడిన ఉదంతంపై సీఈఓ రజత్కుమార్కు ఆయన నివేదిక సమర్పించారు. పట్టుబడిన సిబ్బంది వద్ద గుర్తింపు కార్డులు లేవని, వారి ఫోన్ నంబర్లు ఏపీ అదనపు డీజీపీ పేరు మీద రిజిస్టరై ఉన్నాయని వెల్లడించారు. వారి వద్ద నుంచి ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదన్నారు. ధర్మపురి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జాడి బాల్రెడ్డి స్థానిక టీటీడీ సత్రంలో ఆరు మందికి వసతి కల్పించారని, మూడు బైకులను సైతం సమకూర్చారని తదుపరి విచారణలో తేలిందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మహాకూటమి తరఫున ధర్మపురిలో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తే టీడీపీ ఇన్చార్జి బాల్రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి లక్ష్మణ్కుమార్ల గెలుపునకు ఉన్న అవకాశాలపై సర్వే చేసేందుకే ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది వచ్చినట్లు డీజీపీ మహేందర్రెడ్డి తేల్చారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంచిపెట్టినట్లు ఏ ఆధారాలు లభించలేదన్నారు. ఈసీ చర్యలెంటో? రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది డబ్బులు పంచిపెడుతూ పట్టుబడ్డారని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది సర్వే జరుపుతూ పట్టుబడ్డారని తెలంగాణ డీజీపీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకోనున్న చర్యలపై ఆసక్తి నెలకొంది. -
‘టీడీపీ పెద్దలను కాపాడటానికి డీజీపీ అష్టకష్టాలు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసు నుంచి టీడీపీ పెద్దలను కాపాడటానికి రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఈ ఘటన వెనుక చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ.. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే తమపై కేసులు నమోదు చేశారని తెలిపారు. తనతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన మరో 58మందిపై కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం తమపై కక్షసాధింపుకు పాల్పడుతోందని విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరగక ముందు, జరిగిన తరువాత, జరిగే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు, డీజపీ ఆర్పీ ఠాకూర్ కాల్ డేటాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్విర్యమైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. -
విశాఖ పోలీసుల హైడ్రామా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించే క్రమంలో డీజీపీ ఠాకూర్ అల్లిన కట్టుకథలను నిజం చేసేందుకు విశాఖ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం సీపీ, ఏసీపీ ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడడంతో పోలీసుల నిజాయితీపై సందేహాలు ముసురుకుంటున్నాయి. విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో గురువారం మధ్యాహ్నం దుండగుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్పై కత్తితో హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు కనీస ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అమరావతిలో డీజీపీ ప్రకటన చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే.. కేవలం సంచలనం సృష్టించేందుకే దాడికి దిగారు’.. అని ఆయన ప్రకటించడంపై ప్రజలు, రాజకీయ పక్షాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి డీజీపీ ఆ ప్రకటన చేసే సమయానికి శ్రీనివాసరావును ఏపీ పోలీసులు తమ అదుపులోకి కూడా తీసుకోలేదు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని ఎయిర్పోర్టులోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో నిందితుడ్ని ఎయిర్పోర్ట్ స్టేషన్ పోలీసులకు అప్పజెప్పారు. ఈలోగానే డీజీపీ చేసిన ప్రకటనను అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబునాయుడు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హత్యాయత్నం ఘటనపై ఇష్టారాజ్యంగా మాట్లాడారు. అభిమానే దాడి చేశాడంటూ చులకనగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో కనీస వాస్తవాలు తెలియకుండా, ఘటనపై ప్రాథమిక విచారణ కూడా జరపకుండా డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విశాఖ నగర పోలీసులకు సంకట స్థితిని తెచ్చాయి. ఆయన మాటలను నిజం చేసేందుకు వారు గురువారం సాయంత్రం నుంచి తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. పొంతనలేని పోలీసుల మాటలు కాగా, నిందితుడు శ్రీనివాసరావు 9 ఫోన్ సిమ్లు వాడాడని ఏసీపీ అర్జున్ గురువారం వెల్లడించారు. రెండు రోజుల కిందటే ఓ సిమ్ తీసుకున్నాడని కూడా ఆయన తెలిపారు. అయితే, శుక్రవారం నగర సీపీ లడ్హా అందుకు విరుద్ధంగా మాట్లాడారు. నిందితుడు ఈ మధ్యకాలంలోనే 9 ఫోన్లు వాడాడని, సిమ్లు కాదని చెప్పారు. అలాగే, శ్రీనివాసరావు ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్లో వెయిటర్గా పనిచేస్తున్నాడని గురువారం చెప్పిన పోలీసులు శుక్రవారం కుక్గా చేస్తున్నాడని వెల్లడించారు. ఇలా పొంతన లేని మాటలు, దాటవేత సమాధానాలతో రాష్ట్ర పోలీసుల విచారణ సందేహాల మధ్య సాగింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం శ్రీనివాసరావును సీఐఎస్ఎఫ్ నుంచి తమ అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్టు పోలీసులు రాత్రంతా ఏసీపీ లంకా అర్జున్ కార్యాలయంలో ఉంచారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం నిందితుడ్ని విచారించే విషయమై నగర పోలీస్ కమిషనర్ మహేష్చంద్ర లడ్హా, డీసీపీ ఫకీరప్ప హైడ్రామాకు తెరలేపారు. అందులో భాగంగా.. శుక్రవారం ఉ.9 గంటల సమయంలో శ్రీనివాసరావును ఎయిర్పోర్ట్ స్టేషన్కు తరలించారు. సా.4.30 గంటల వరకు నానా హడావుడి చేశారు. అప్పటికప్పుడు పోలీస్స్టేషన్కు సీసీ కెమెరాలు బిగించి విచారణ నేరుగా డీజీపీ వీక్షించేలా వెబ్ కాన్ఫరెన్స్ను ఏర్పాటుచేశారు. విచారణలో సంచలన విషయాలు బయటికొస్తాయని మీడియాకు లీకులిచ్చారు. – కానీ, సా.4.30గంటల సమయంలో లడ్హా అదే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టలేకపోయామని చెప్పారు. అదుపులోకి తీసుకుని 24గంటలైంది.. ఏకబిగిన ఇన్ని గంటలు విచారించారు.. కనీసం అతని నుంచి వివరాలేమీ సాధించలేకపోయారా.. తెర వెనుక ఎవరున్నారు.. అతను ఎవరి ప్రోద్బలంతో చేశాడు.. అని మీడియా ప్రశ్నిస్తే.. ‘అతను నోరు విప్పడంలేదు.. నిన్న చెప్పిన విషయాలే చెప్పుకొస్తున్నాడు.. మరింత సమాచారం రాబట్టడం కోసం పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామ’ని సీపీ తాపీగా తెలిపారు. -
బాబు చెప్పేవన్నీ అబద్ధాలనీ మరోసారి రుజువైంది
-
ఎయిర్పోర్టులోకి నిందితుడు కత్తితో ఎలా వచ్చాడు?
-
ఏపీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ వాదులాట
-
డీజీపీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్పై దాడి జరిగిన వెంటనే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్తోపాటు పార్టీ నాయకులు వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్, యార్లగడ్డ వెంకట్రావు, మల్లాది విష్ణులు మంగళగిరిలోని డీజీపీ ఆర్పీ ఠాకూర్ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ జగన్పై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్ జగన్కు భద్రత పెంచాలని డీజీపీని కోరారు. అయితే వైఎస్ జగన్పై జరిగిన దాడిపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు అభ్యతంరం వ్యక్తం చేశారు. విచారణ జరపకుండానే ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారనే వైఎస్సార్ సీపీ నేతల ప్రశ్నలకు డీజపీ సమాధానం దాటవేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. -
‘అప్పుడేలా పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చారు?’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై దాడి ప్రచారం కోసం జరిగిందని డీజీపీ చెప్పడం దారుణమని మండిపడ్డారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగింది వాస్తవమా, కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడైన అభిమాని ఇష్టమైన నాయకునిపై దాడి చేస్తాడా అని నిలదీశారు. డీజీపీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. విచారణ చేయకుండానే డీజీపీ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఎవరి ఒత్తిడితో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు. తొలుత డీజీపీ, ఆ తర్వాత మంత్రి నక్కా ఆనంద్బాబు, విశాఖ ఏసీపీలు విచారణ జరపకుండానే వైఎస్ జగన్పై హత్యాయత్నం ప్రచారం కోసం జరిగిదంటూ మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. పలువురు ఏపీ మంత్రులు మాట్లాడుతూ.. ఎయిర్పోర్ట్ కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వారు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎయిర్పోర్ట్ కేంద్రం ఆధీనంలో ఉందని మాట్లాడుతున్నవారికి.. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్ను పోలీసులు ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి వ్యక్తే ఈ విధంగా మాట్లాడితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నటుడు శివాజీ చెప్పినట్టుగా జరిగితే ముందు అతన్ని అరెస్ట్ చేసి విచారించాలని అన్నారు. కోడి పందాలలో వినియోగించే కత్తి చాలా పదునైనదని.. అది కొద్దిగా అటు ఇటు అయితే ప్రాణలే పోతాయని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ జగన్ క్షేమంగా ఉన్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడు సెల్ఫీ పేరుతో వైఎస్ జగన్పై దాడికి ప్రయత్నించిన సమయంలో కత్తి మెడకు తగిలితే ఏమై ఉండేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెబుతున్నారని తెలిపారు. ఎయిర్పోర్ట్లో భద్రత ఉన్నా అలాంటి కత్తులు ఎలా తీసుకువచ్చారో అర్ధం కావడం లేదని అన్నారు. ఎయిర్పోర్ట్ లోపల జరిగిన ఘటనతో తమకు సంబంధం లేదని మంత్రులు చెప్పడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటనను వైఎస్సార్ సీపీ ఎక్కడ రాజకీయాలకు వాడాలనుకోలేదని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి మనం మనుషులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు చోటుచేసుకోవడంపై మండిపడ్డారు. వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు అందుకే ఇలాంటి వాటిని పట్టించుకోకుండా హైదరాబాద్ బయలుదేరి వచ్చారని తెలిపారు. క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి ఇలా చేస్తే రేపు పాదయాత్రలో ఏం జరుగుతుందనే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ జగన్కు భద్రత పెంచాలని కోరారు. చంద్రబాబుపై దాడి జరిగితే వైఎస్సార్ నిరసన తెలిపారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన దాడిని తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహారించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుపై ఇలాంటి దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వెంటనే వెళ్లి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ సినీ నటుడు చెప్పినట్టు అంతా జరిగితే.. అతన్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు, టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. చదవండి: వైఎస్ జగన్పై హత్యాయత్నం: లైవ్ అప్డేట్స్ వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల వైఎస్ జగన్పై హత్యాయత్నం; మోహన్బాబు స్పందన -
మీదే బాధ్యత.. కాదు మీదే బాధ్యత!
సాక్షి, విశాఖపట్నం: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జననేతపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు మాత్రం బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. రక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని దోబూచులాడుతున్నాయి. భద్రతా వైఫ్యలమే లేదన్నట్టుగా బీరాలు పలికారు. మాకు సంబంధం లేదు: డీజీపీ విమానాశ్రయంలో భద్రత పర్యవేక్షణ అంతా సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎయిర్పోర్టు లోపల తమకు పని లేదని, అక్కడ ఏం జరిగినా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని అన్నారు. విమానాశ్రయంలోని కత్తిని ఎలా తీసుకెళ్లారనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. సీఐఎస్ఎఫ్ రిపోర్ట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మాకేం పట్టింది: సీఐఎస్ఎఫ్ డీజీ సీఐఎస్ఎఫ్ డీజీ సీవీ ఆనంద్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తమ వైఫల్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. తమ సిబ్బంది ప్రయాణికుల గుర్తింపు కార్డులు, టిక్కెట్లు మాత్రమే పరిశీలిస్తారని చెప్పారు. లగేజీ చెక్ చేయరని అన్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రత తమ పరిధిలోకి రాదని, చెక్ ఇన్ ఏరియాకు ఎవరైనా వెళ్లొచ్చని వివరించారు. ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఏఈపీ పాస్ ఉంటుందని, వీరిని చెక్ చేయమని వెల్లడించారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని, దీనిపై ఏవివేయన్ సెక్యురిటీ సెమినార్లోనూ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆనంద్ తెలిపారు. పోలీసుల ద్వంద్వ వైఖరి పోలీసులు, సీఐఎస్ఎఫ్ కప్పదాటు వైఖరిపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరు సరిగా లేదని మండిపడుతున్నారు. వైఎస్ జగన్పై ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం తమ పరిధిలోనికి రాదని చెబుతున్న డీజీపీ.. గతంలో ప్రత్యేక హోదా ర్యాలీ కోసం విశాఖపట్నం వెళ్తున్నప్పుడు వైఎస్ జగన్ను ఎయిర్పోర్టు రన్వే పోలీసులు అడ్డుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అని నిలదీస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా డీజీపీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి సూత్రధారులను కోర్టు బోనెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సంబంధిత కథనాలు: వైఎస్ జగన్పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. వైఎస్ జగన్పై హత్యాయత్నం; లోతైన దర్యాప్తు పథకం ప్రకారమే వైఎస్ జగన్పై హత్యాయత్నం! ‘ఎయిర్పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
డీజీపీ మాటలు టీడీపీ మాటల్లా ఉన్నాయి: ధర్మాన
శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ వ్యాఖ్యలు టీడీపీ మాటల్లా ఉన్నాయని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ..విచారణ పూర్తి కాకుండానే పబ్లిసిటీ కోసం చేసిన ఘటన అని డీజీపీ ముందస్తుగానే తేల్చి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇంటరాగేషన్లో భిన్నమైన వాస్తవం గుర్తించినా దిగువస్థాయి పోలీసు అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు - వైఎస్ జగన్ మోహన రెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీలు తీశాయి. శ్రీకాకుళంలో ఏడు రోడ్ల జంక్షన్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. - పాలకొండలో కోటదుర్గ గుడి నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు ఎమ్మెల్యే వి.కళావతి, రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. - పాతపట్నం వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. - రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్లో కొవ్వొత్తులతో మానవహారం, నిరసన ప్రదర్శన చేపట్టారు. - రణస్థలంలో జాతీయ రహదారిపై ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. - టెక్కలిలో వైఎస్ఆర్ జంక్షన్ వద్ద పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. - ఆమదాలవలసలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -నరసన్నపేటలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో, కాశీబుగ్గ బస్టాండ్ వద్ద పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో, కవిటిలో రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ తీశారు. -
వైఎస్ జగన్ బలమైన, ధైర్యం ఉన్న నాయకుడు
-
‘అప్పుడేలా పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చారు?’
-
ప్రతి పోలీసుకూ పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుళ్లు ఒక్క పదోన్నతి కూడా లేకుండానే రిటైర్ అవుతున్నారని, అలా కాకుండా ప్రతీ పోలీసుకు విధి నిర్వహణలో కనీసం ఒక ప్రమోషన్ వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు కుటుంబాల సంక్షేమం బాధ్యత తనదని, ప్రజల సంరక్షణ బాధ్యత పోలీసులదని అన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ను ఆధునిక సౌకర్యాలతో మోడల్గా మారుస్తామని ప్రకటించారు. అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు. పోలీసులకు ఇళ్లు, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసులు కన్పించకూడదని (విజిబుల్ పోలీస్), పోలీసింగ్ మాత్రమే కన్పించాలని (ఇన్విజిబుల్ పోలీసింగ్) అన్నారు. అలాగే.. రాష్ట్రంలో రౌడీలు ఉండకూడదని, వారంతా ఏపీ బయట ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, మొదటిస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. కాగా, పోలవరం భూసేకరణను అడ్డుకోవడం, రాజధానిలో చెరుకుతోట దగ్థం, తిత్లీ తుపాను బాధితులను రెచ్చగొట్టడం వంటివి రాజకీయ ముసుగులో జరుగుతున్నాయని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి సంఘటనలను అడ్డుకోవడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి పోలీసులు ప్రజలను కాపాడుతున్నారని.. వీరి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం: డీజీపీ పోలీసులు తమ కుటుంబాలకంటే ప్రజాసేవకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని డీజీపీ ఆర్పీ ఠాకుర్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగే తమ లక్ష్యమని, చేరువ కార్యక్రమం ద్వారా ప్రజలను పోలీస్ కుటుంబంలో భాగం చేస్తున్నామని చెప్పారు. అనంతరం.. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు సీఎం, ఉపముఖ్యమంత్రి, డీజీపీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ ఎం. మాలకొండయ్య, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. కాగా, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పోలీసు సంక్షేమ నిధికి రూ.15కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం చేసిన ప్రకటనపై పోలీసులు పెదవి విరుస్తున్నారు. -
‘మావోయిస్టులు హింస విడనాడాలి’
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల తర్వాత ప్రజాప్రతినిధులకు రక్షణ మరింత పెంచామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. విశాఖపట్నంలో ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ..మావోయిస్టులు హింసను విడనాడి..ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. గంజాయి సాగు, రవాణా చట్టవ్యతిరేకమని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ఏవోబీలో ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు అంగీకరించారని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
బెదిరింపులు వస్తున్నాయి.. భద్రత పెంచండి!
సాక్షి, గుంటూరు : వరుసగా బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో తనకు భద్రతను పెంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళవారం ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు లేఖ రాశారు. ఈ మేరకు లేఖను స్వయంగా తీసుకెళ్లి డీజీపీకి ఆర్కే అందజేశారు. అనేకమంది తనను టార్గెట్ చేశారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనకు గతంలోనే బెదిరింపు లేఖలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, ముఖ్యమంత్రి అక్రమ నివాసం, సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తాను న్యాయపోరాటాలు చేస్తున్న నేపథ్యంలో తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని ఆయన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎమ్మెల్యే ఆర్కేకు వన్ ప్లస్ వన్ గన్మెన్ సెక్యూరిటీ అందజేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాల మీద ఎమ్మెల్యే ఆర్కే న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్కాల్స్ ఆయనకు వచ్చాయి. మావోయిస్టుల పేరిట కూడా ఇటీవల బెదిరింపుల లేఖలు వస్తున్న నేపథ్యంలో తన భద్రతను పెంచి.. కనీసం టూ ప్లస్ 2 (2+2) గన్మెన్ సెక్యూరిటీ అందజేయాలని ఆయన లేఖలో కోరారు. -
అరకు దాడి ఆధారాలు దొరికాయ్ : డీజీపీ
సాక్షి విశాఖపట్నం : విశాఖ మన్యం, అరకు లోయలో మావోయిస్టుల కదలికలు తగ్గిపోయినట్టు పోలీసు వర్గాలు ఎప్పుడూ చెప్పలేదని ఆంద్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం డుంబ్రిగూడ మండలం లిపిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యకు గురైన ప్రదేశాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. కాల్పుల్లో పాల్లొన్న వారి ఆధారాలు దొరికాయనీ, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు (ఏఓబీ)లో సమస్యలున్నాయనీ, ఈ ఘటనపై ఒడిషా డీజీపీ ఆర్పీ శర్మతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో డీజీపీ ఇంటలిజెన్స్, విశాఖ జిల్లా ఎస్పీ ఉన్నారు. -
ఎన్నారై పెట్టుబడిదారులకు రక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్నారైలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘ఏపీ పెట్టుబడుల భద్రత, పరిరక్షణ విభాగం (ఏపీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటి సెల్)’, ఏపీ ప్రవాస భారతీయ ఫిర్యాదుల పరిష్కార విభాగం(ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ సెల్)’ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నారై సెల్ పనితీరుపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 25 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారని, వారిలో చాలా మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2014–15లో 8.39 శాతం ఉన్న జీఎస్డీపీ 2017–18 కి 11.39 శాతానికి చేరిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ ఏదైనా పెద్దఎత్తున జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ముఖ్యమని డీజీపీ అన్నారు. ఎన్నారైలకు తగిన నమ్మకం, భద్రత కల్పించేలా సీఐడీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. వారి ఆస్తుల రక్షణ, కిడ్నాప్, బెదిరింపులు, పెళ్లి వివాదాలు, ఆస్తి సమస్యలు, వీసా, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు తదితర అంశాలను ఈ ప్రత్యేక సెల్ పర్యవేక్షించి పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీ సెల్ ఛైర్మన్ వేమూరి రవికూమార్, ఏపీ సీఐడీ ఏడీజీ అమిత్గార్గ్, శాంతిభద్రతల ఏడీజీ హరీష్కుమార్గుప్త తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల భద్రత, పరిరక్షణ విభాగం పనితీరు... ‘ఏపీ పెట్టుబడుల భద్రత, రక్షణ విభాగం’ మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఏపీ సీఐడీ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు, ఐటీ, ఫార్మా, పరిశ్రమల ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య సమాఖ్య (చాంబర్ ఆఫ్ కామర్స్) ప్రతినిధులు, తెలుగు ప్రవాస భారతీయ (ఎన్ఆర్టీ) ప్రతినిధులతో కూడిన సలహా మండలి ఉంటుంది. అలాగే ప్రవాస భారతీయులు రాష్ట్రంలో పెట్టుబడులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఏపీ ప్రవాస భారతీయుల ఫిర్యాదుల పరిష్కార విభాగం పనిచేస్తుంది. ఎన్నారైలకు సంబంధించిన ఏ ఫిర్యాదులైనా ఆన్లైన్ (వెబ్సైట్) ద్వారానే స్వీకరిస్తారు. ‘సిఐడిఅట్జిమెయిల్ డాట్ కామ్’, 9440700830 నెంబర్ వాట్సాప్, మొబైల్ హెల్ప్లైన్ నెంబర్కు, 1800 300 26234 ట్రోల్ ఫ్రీ నెంబర్(కాల్ సెంటర్)కు ఫిర్యాదులు చేయవచ్చు. -
ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయి
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20శాతం సైబర్ నేరాలు పెరిగాయని ఏసీబీ డీజీపీ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికవరీ శాతం కూడా స్వల్పంగా పెరిగిందని తెలిపారు. దోపిడీలు, డెకాయిటీల కంటే సైబర్ నేరం పెద్దదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 ప్రాంతాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు, లాబ్లు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి సైబర్ లాబ్ను విజయవాడ, రెండవది వైజాగ్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే రాజమండ్రి, కర్నూల్, తిరుపతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాబ్లో ఎనలిస్ట్లకు కిట్లు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం సైబర్ ఇన్వెస్టిగేషన్ లాబ్లో ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలు, ఒక హెచ్సీ, 13 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. త్వరలో సిబ్బంది సంఖ్య పెంచుతామన్నారు. సైబర్ నేరగాళ్ల శైలి మారుతోందని అన్నారు. సైబర్ నేరాలపై పోలీసులు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఆన్ లైన్ జాబ్స్, వన్ టైం పాస్ వర్డ్, ఏటీఎం నేరాలు పెరిగాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
డీజీపీని కలిసిన అయేషా మీరా తల్లిదండ్రులు
విజయవాడ: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ని న్యాయవాదులతో కలిసి అయేషా మీరా తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదనే అభిప్రాయాన్ని డీజీపీ ముందు వ్యక్తం చేశారు. అయేషా కేసును తక్షణమే సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సిట్లో ఉన్న అధికారులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. దోషులు ఎవరనేది అందరికీ తెలుసునని, కానీ ఎందుకు వారిని సమగ్రంగా విచారణ చేయడం లేదో అర్ధంకావడం లేదన్నారు. 11 సంవత్సరాలు అయినా మాకు న్యాయం జరగకపోవడం బాధగా ఉందన్నారు. కేసు స్టడీ చేసి న్యాయం చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారని అయేషా తల్లి పేర్కొన్నారు. 2007 డిసెంబర్ 27న బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా విజయవాడలోని హాస్టల్లో హత్యకు గురయింది. హాస్టల్ బాత్రూం వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం పక్కనే ఓ లేఖ కూడా లభ్యమైంది. తన ప్రేమను తిరస్కరించడంతోనే అయేషాను అత్యాచారం చేసి, చంపేసినట్లు నిందితుడు లేఖలో పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయేషా మీరా హత్య కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కొన్న సత్యం బాబు హైకోర్టులో నిర్దోషిగా విడుదల అవడంతో కేసు కొలిక్కి రాలేదు. -
ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ నెల్లూరు జిల్లా రాపూరు స్టేషన్ ఘటనపై స్పందించారు. పోలీసులపై దాడి చేయటం బాధాకరమన్నారు. ఆ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన సూచించారు. ఆదివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. కర్నూలు క్వారీ ఘటన, సీమలో ఫ్యాక్షన్ నివారణ, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు జిల్లాల పరిధిలో మైనింగ్ క్వారీలపై తనిఖీలు చేపడతామని అన్నారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఫైర్ శాఖ సహాయంతో తనిఖీలు చేస్తామన్నారు. అక్రమ లైసెన్స్ కలిగి ఉన్నట్లయితే కఠిన చర్యలతో పాటు క్వారీలను మూసివేస్తామని హెచ్చరించారు. -
‘పోలీసులైనా, ప్రజలైనా చర్యలు తప్పవు’
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అదే సమయంలో చింతలపూడి వసతి గృహం బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ చేపడతామన్నారు. ఈ కేసుల్లో పోలీసుల తప్పు ఉందని తేలితే ఎలాంటివారినైనా ఉపేక్షించమని ఠాకూర్ తెలిపారు. అసలు పోలీసులు పని చేసేది ప్రజల కోసమేనని, రౌడీయిజం, రోడ్డు ప్రమాదాలు, నేర నిరోధకంపై జిల్లా యంత్రాంగానికి సూచనలిచ్చామన్నారు. శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పశ్చిమలో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ పనితీరు బాగానే ఉందని కితాబిచ్చారు. నూతన టెక్నాలజీతో మరింత వేగంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్, ఫోరెన్సిక్ యూనివర్శిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ.. పెరుగుతున్న సైబర్ క్రైమ్లు నిరోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది సంతృప్తిగా ఉంటేనే పోలీసు శాఖలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లా రావూరుపాడు పోలీస్ స్టేషన్పై దాడి ఘటన చాలా విచారకరమన్న డీజీపీ ఠాకూర్.. తప్పు ఎవరిదైనా లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, అది ప్రజలైనా, పోలీసులైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
‘కేసుల పరిష్కారంతో వెయ్యికోట్ల ఆదాయం’
సాక్షి, అమరావతి: ఏసీబీలో నమోదైన కేసులన్నీ పరిష్కరించగల్గితే ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏసీబీ అర్ధవార్షిక సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్పషల్ కోర్టు యాక్ట్ అందుబాటులోకి తెచ్చామనీ, 2016 అనంతరం నమోదైన కేసులు దీని పరిగణలోకి వస్తాయని వెల్లడించారు. అవినీతిని నిర్మూలించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సిబ్బంది నియామకానికి కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నామని అన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ నిందితులు తప్పించుకోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఏసీబీ కార్యాలయాలను చక్కటి వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని వెల్లడించారు. -
గౌతమ్ సవాంగ్ బదిలీ
సాక్షి, అమరావతి : విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన సవాంగ్కు భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సవాంగ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. డీజీపీగా ఠాకూర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. శనివారం సాయంత్రం సవాంగ్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బదిలీపై సీపీ సవాంగ్ తీవ్ర అసంతృప్తి
-
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపవద్దు..!
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. -
గౌతమ్సవాంగ్ తీవ్ర మనస్తాపం
సాక్షి, విజయవాడ : విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్ నియమితులయ్యారు. అప్పటినుంచి సవాంగ్ విధులకు దూరంగా ఉంటున్నారు. డీజీపీగా ఠాకూర్ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. సోమవారం హోంగార్డుల ఆత్మీయ సమ్మేళనానికి సైతం సవాంగ్ గైర్హాజరయ్యారు. డీజీపీ నియామకంపై సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాటకపోవడంపై సవాంగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కాగా, సవాంగ్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతారంటూ రాష్ట్ర పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంగళవారం కూడా సవాంగ్ కార్యాలయానికి హాజరకాలేదు. -
డీజీపీ నియామకంపై సవాంగ్ అసంతృప్తి