sanjana
-
‘మెల్బోర్న్’ జ్ఞాపకాలు షేర్ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్! (ఫొటోలు)
-
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్షాపు లక్ష్యం. ఈ వర్క్షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
బుమ్రా లవ్ జర్నీ ఎలా మొదలైందంటే..
-
Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్లో కాని లేదా ఇంగ్లిష్లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన. -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్స్టిక్ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్స్టయిల్కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి .. ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడిప్పుడే మహిళా డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి మంచి దర్శకురాలిగా గుర్తింపు సాధించారు. అలాగే 2021లో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్గా రాణించారు. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంజన అన్నే కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు .కాగా.. సంజన అన్నే గతంలో నేనే రాజు నేనే మంత్రి, నీకు నాకు పెళ్లంట టామ్ టామ్ లాంటి చిత్రాల్లో నటించింది. -
'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్ రావు
బిగ్బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన నటించిన తాజా చిత్రం ‘ హి (హంట్స్ ఎవ్రివన్)’. అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ని తెలంగాణ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హి' చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘హి’లో హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం’అని చిత్రబృందం పేర్కొంది. -
అందాల పోటీల్లో మెరిసిన చంద్రగిరి సంజన..
చంద్రగిరి (తిరుపతి రూరల్): జాతీయ స్థాయి అందాల పోటీల్లో చంద్రగిరి యువతి మెరిసింది. ఈ నెల 16న జైపూర్లో జరిగిన ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’ పోటీలలో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది. కాగా, ఫైనల్స్లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఆ వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్ మనమరాలైన సంజన మోడలింగ్పై మక్కువ పెంచుకుంది. 2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్లో పాల్గొనగా.. ఫైనల్స్కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫైనల్లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది. ఇది కూడా చదవండి: మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్గా తెలుసుకునే విధంగా హ్యూమన్లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్లోని యూసీ డేవిస్లో పూర్తి చేసి హైదరాబాద్లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీతో టాలీవుడ్కు పరిచమైన బ్యూటీ సంజన ఆనంద్. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ నేపథ్యంలో సంజన ఆనంద్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా రెండేళ్లు జాబ్ కూడా చేశాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు మంచి జాబ్ వదులుకుని వెళ్లడం ఎందుకని మా పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను’ అని తెలిపింది. అలాగే ‘‘నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా నటన బాగుందని అందరు అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని కథలు నా దగ్గరికి వచ్చాయి. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం గ్లామర్ షోపై ఆమె స్పందిస్తూ.. కథకి అవసరమైనంత వరకు స్కిన్ షో చేయడానికి రెడీ కానీ, అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదని తేల్చి చెప్పంది. -
Miss India USA 2022: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్గా సంజన
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ): అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను శుక్రవారం పెనుగొండ మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు. (క్లిక్: ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ) చదవండి: (Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త) -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) -
ఇలాంటి చిత్రాలు భావితరాలకు అవసరం
‘‘ప్రజలను చైతన్యవంతులను చేయాలనే మంచి కాన్సెప్ట్తో తీస్తున్న ‘సాచి’ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరాలకు అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వివేక్ పోతిగేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సాచి’. సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతిగేని నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్ కొట్టారు. నిర్మాత రామ్మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్ పోతిగేని మాట్లాడుతూ– ‘‘ఖమ్మంలో జరిగిన వాస్తవ ఘటనతో ‘సాచి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు ఉపేన్ నడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: వి. భరద్వాజ్. -
నీరజ్ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్లో సంజన, నీరజ్ పన్వార్లు షంషీర్గంజ్లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్నుమాలోని షంషీర్గంజ్లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్నగర్లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
స్వల్ప బడ్జెట్తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!
అమ్మాయ్ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా.. ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది? మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది? కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్న నడుపుతూ స్వల్ప బడ్జెట్తో స్త్రీలకు లోకం చూపిస్తోంది. ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్ టూర్ టికెట్. కిచెన్లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా. ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా? ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది. ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా? ∙∙ దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్ ఆపరేషన్స్తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది. ‘మా నాన్న లారీ డ్రైవర్. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్రూమ్ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్ కొలిగ్స్తో ఒరిస్సా టూర్ ప్లాన్ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు. ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్బుక్లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్కి ప్లాన్ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్ ప్లాన్ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ. ∙∙ సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం. ‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్లో వెళ్లాలో పక్కా ప్లాన్ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ. అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్లతో టై అప్ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ. సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్బుక్ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్’ అని పోస్ట్ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్ ఓన్లీ టూర్లు ఆపరేట్ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు. రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ. -
Sanjana Chatlani: ఆ అక్షరాల రూపకర్త.. ఒకింత ఆశ్చర్యం, గర్వం!
రోలెక్స్, ది రిట్జ్ కార్ల్టన్, ఫ్యూచర్ గ్రూప్, గూచి, లూయీ వ్యుట్టన్, మిఖాయిల్ కోర్స్, జిమ్మీ చూ, గూగుల్ ఇండియా, ది వెడ్డింగ్ ఫిల్మర్, టాటా జోయా... ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు. ఈ పేర్లతోపాటు ఆయా కంపెనీల అక్షరరూపం కూడా కళ్ల ముందు మెదిలి తీరుతుంది. ఆ ఆక్షరాలకు ఓ రూపం పురుడు పోసుకున్నది మనదేశంలోనే. ఆశ్చర్యమే కాదు ఒకింత గర్వంగానూ ఉంటుంది మరి. ఈ అక్షరాల రూపకర్త పూనాకు చెందిన సంజన చత్లాని. ఆమె తన జీవితాన్ని అక్షరాలా అక్షరాలతోనే దిద్దుకుంది. తన కెరీర్ను తానే అందంగా రాసుకుంది. నిస్తేజం నుంచి ఉత్తేజం అది 2015 ఆగస్టు. సంజన చట్లాని కాలేజ్ నుంచి సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. మూడున్నరేళ్ల ఉద్యోగ జీవితం ఆమెకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. అంతటి నిస్పృహలోనూ ఆమెకు సాంత్వన చేకూరుతున్న విషయం ఒక్కటే. కుటుంబంతో యూఎస్కి వెళ్లినప్పుడు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కాలిగ్రఫీ క్లాసులకు హాజరైంది. అప్పుడు నేర్చుకున్న కాలిగ్రఫీలో తోచిన నాలుగు అక్షరాలు రాసుకున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటోంది. ‘తనను ఆనందంగా ఉంచని ఉద్యోగంలో కొనసాగడం కంటే తనకు సంతోషాన్నిస్తున్న కాలిగ్రఫీలోనే జీవితాన్ని వెతుక్కుంటే తప్పేంటి’ అనుకుంది సంజన. ఉద్యోగం మానేసి ముంబయిలో ఒక చిన్న గదిలో ‘ద బాంబే హ్యాండ్ లెటరింగ్ కంపెనీ’ సంస్థను స్థాపించింది. సాధనేలోకం సంజన సొంతంగా కంపెనీ స్థాపించిన తర్వాత ఆర్డర్ల కోసం ప్రయత్నించలేదు. అక్షరాలను అందంగా రాయడం అనే ప్రక్రియను సాధన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కాలిగ్రఫీ వర్క్షాపులకు హాజరయ్యేది. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియోలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ టైమ్ మర్చిపోయేది. అలా రోజుకు పన్నెండు గంటల సేపు స్టూడియోలోనే గడిపిన రోజులున్నాయి. ఆ అలవాటు ఆమె కెరీర్లో బిజీ అయిన తర్వాత అంత నిడివి స్టూడియోలో పని చేయడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆమె క్లయింట్ల జాబితాలో ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలున్నాయి. ఇంతగా పేరు వచ్చేసింది కదా అని కూడా ఆమె రిలాక్స్ కావడంలేదు. ఆర్డర్ల పని పూర్తయిన తర్వాత రోజుకు కనీసం మూడు గంటల సేపు అక్షరాలను కొత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మొదట్లో బిజినెస్ ఆర్డర్స్ లేని రోజుల్లో సంజన దీపావళి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ రాసి స్నేహితులకు, బంధువులకు పంపించేది. ఆ గ్రీటింగ్ కార్డులు అందుకున్న వారి ప్రశంస లు నోటిమాటగా ప్రచారం కల్పించాయి. ఇప్పుడు మనదేశంలో అత్యుత్తమ కాలిగ్రఫీ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. ఆటిజమ్కి ఔషధం సంజన ఇప్పుడు మనదేశంలో సామాన్యులకు కూడా కాలిగ్రఫీ గురించి తెలియచేయాలనే సంకల్పంతో పని చేస్తోంది. కాలిగ్రఫీ సాధన చేయడం ద్వారా ఆటిజమ్ నుంచి బయటపడవచ్చని, ఆటిజమ్ పిల్లలకు ఉచితంగా వర్క్షాపులు నిర్వహిస్తోంది. కాలిగ్రఫీ నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదని, ఎన్ని రకాలుగా సాధన చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయని చెప్తోంది. రానున్న ఏడాది జనవరిలో ఆమె యూకేలో మూడు నెలల అడ్వాన్స్డ్ స్టడీ కోసం వెళ్తోంది. అంతటి అంకితభావంతో పని చేస్తుంటే... విజయం వారిని నీడలా వెంటాడుతుంది. సంజన చట్లాని -
వైరల్ వీడియో: డాన్స్ బాగుంది సంజన.. బుమ్రా ఎక్కడ?
-
వైరల్: డాన్స్ బాగుంది సంజన.. బుమ్రా ఎక్కడ?
ముంబై: ఐపీఎల్-2021 వాయిదా పడటంతో స్పోర్ట్స్ ప్రజెంటర్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ‘‘మీరు బాగా డ్యాన్స్ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇక పెళ్లి కారణంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్కు దూరమైన బుమ్రా.. ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా తిరిగి మైదానంలో దిగాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు టోర్నీ వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక సంజన సైతం ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ ప్రజెంటర్గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్తో సిరీస్, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడేందుకు బుమ్రా ఇంగ్లండ్ పయనానికి సన్నద్ధమయ్యే క్రమంలో క్వారంటైన్లో ఉండగా, సంజన ఇలా ఒక్కరే డ్యాన్స్ చేస్తూ కనిపించడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్ ముందు క్వారంటైన్ రోజుల్ని కుదించాలన్న బీసీసీఐ విజ్ఞప్తికి ఈసీబీ సానుకూలంగా స్పందించింది. తద్వారా నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చదవండి: ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?! WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్దే గెలుపు! -
ఎన్నో మధుర జ్ఞాపకాలు.. నా గుండె తరుక్కుపోతోంది
సిడ్నీ: ‘‘థాంక్యూ ఇండియా.. నన్ను సొంత మనిషిలా ఆదరించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. దయార్ద హృదయం, ఇతరులపై కూడా ప్రేమను కురిపించే గల మంచి మనుషులు అక్కడ ఉన్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది’’అంటూ ఐపీఎల్-2021 ప్రజెంటర్, ఆస్ట్రేలియన్ నెరోలీ మెడోస్ భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. కోవిడ్-19తో పోరాడుతున్న భారత్కు సహాయం అందించాలనుకునే ఆస్ట్రేలియన్లు, యూనిసెఫ్ ఆస్ట్రేలియా ద్వారా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మహమ్మారి కరోనా ఉధృతి నేపథ్యంలో ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడటంతో ఐపీఎల్-2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టీవీ ప్రజెంటర్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే, భారత్ను ఇలాంటి పరిస్థితుల్లో విడిచి వెళ్లడం వేదనకు గురిచేసిందని ఇప్పటికే పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో నెరోలీ మెడోస్ సైతం.. భారత్లో ఉన్ననాళ్లూ అక్కడి ప్రజలు, సహచర ఉద్యోగులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధురాలిని అయ్యానంటూ అభిమానం చాటుకుంటున్నారు. ‘ఎన్నో మధుర జ్ఞాపకాలు.. ఇప్పటికీ నా బాగోగుల గురించి అడుగుతున్నారు. క్లిష్ట సమయంలోనూ నా మంచి గురించి ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ. స్టార్ స్పోర్ట్స్ ఇండియా, సంజనా గణేషన్, భావనా బాలక్రిష్ణన్ తదితరులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. నన్ను సొంత మనిషిలా జాగ్రత్తగా చూసుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేర్చారు. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని. ఇండియా త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నెరోలీ సంజనా గణేషన్, బ్రెట్ లీతో పాటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చదవండి: పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు.. -
సంజన బర్త్డే: బుమ్రా లవింగ్ పోస్ట్ వైరల్
సాక్షి,ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజన గణేశన్ పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు అంతకంటే లవింగ్ పోస్ట్ను ఇన్స్టాలో షేర్ చేశాడు. ‘‘ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా...నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఐ లవ్ యూ’’ అంటూ బుమ్రా 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన హృదయరాణికి విషెస్ తెలిపాడు. ఐపీఎల్ 2021 రద్దు కావడంతో ఈ ప్రేమ పక్షులకు కలిసి వచ్చిందంటూ ఫెండ్స్, ఇతర అభిమానులు కామెంట్స్ చేశారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అనేక ఊగాహానాలతో బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండింగ్లో నిలిచింది. చివరికి మార్చి 14న గోవాలో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఏకమై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
భార్య సంజనా ఫోటోకు బుమ్రా రియాక్షన్
ముంబై: గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్- టీమిండియా పేసర్ బుమ్రాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్ వారి అప్డేట్స్ను అందిస్తున్నారు. ఇటీవల సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని బుమ్రా తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు అంటూ ట్వీటర్ లో షేర్ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్, సుదీర్ఘమైన చర్చలు.. శాంతి’ అంటూ రాసుకొచ్చాడు. తాజాగా బుమ్రా-సంజనాల మరొకసారి సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరించారు. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సంజనా ఒక పోస్ట్ చేశారు. తను రీసెంట్ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. దానికి ‘ఒక మంచి లైట్. గ్రేట్ ఫోటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి రెండు హృదయాల ఎమిటికాన్స్ జత చేసి తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు బుమ్రా. పెళ్లి తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న ఈ జంట.. మళ్లీ తమ విధుల్లో బిజిబిజీగా ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజన.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను కవర్ చేస్తుండగా, ఆ లీగ్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు బుమ్రా. గతేడాది జరిగిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగా అందులో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ లీగ్లో బుమ్రా 27 వికెట్లు సాధించి ముంబై తరఫున అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్గా నిలిచాడు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) -
టీవీ బ్రేక్లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?
టీవీలో బ్రేక్ వస్తే.. ఈ అమ్మాయి తప్పకుండా మీకు దర్శనమిస్తుంది. ఎందుకంటే, ఆ ఐదు నిమిషాల బ్రేక్లో పది యాడ్స్ వస్తే.. ఒక దానిలోనైనా సంజనా సంఘీ నటించి ఉంటుంది. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.. తండ్రి సందీప్ సంఘీ బిజినెస్మన్, తల్లి సుగాన్ హోమ్ మేకర్, అన్న సమీర్ గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదీ సంజన కుటుంబం. పదమూడేళ్ల వయసులో బాలీవుడ్ మూవీ ‘రాక్స్టార్’తో బాలనటిగా ఎంటర్ అయినా, నటిగా గుర్తింపు సాధించింది మాత్రం 2019లో ‘దిల్ బేచారా’ సినిమాతో. క్యాన్సర్ రోగిగా తను కనబరచిన నటన చాలా మందిని కంటతడి పెట్టించింది. ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ సంజనాకు. యోగాతోనే తన రోజు మొదలవుతుంది. కథక్ డాన్స్లో శిక్షణ తీసుకుంది. యాడ్స్, మూవీస్ అంటూ ఎంత బిజీగా ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్లో తను సాధించిన మార్కులకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసా పత్రం బహూకరించి, అభినందించారు. ఇక లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో గోల్డ్ మెడల్ పొందింది. అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం. మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం. సినిమా కంటే ముందు వాణిజ్య ప్రకటనలు ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. తన క్యూట్ ఫేస్తో కోకా కోలా, క్యాడ్బరీ, మింత్రా, ఎయిర్సెల్, డాబర్, తనిష్క్ వంటి సుమారు నూటాయాభై ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత ‘హిందీ మీడియం’, ‘ఫుక్రే రిటర్న్స్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్తో కలసి ‘ఓమ్’ సినిమాలో నటిస్తోంది. పుస్తకాలతో స్నేహం చేసే ఆమె.. కాలేజీ రోజుల్లోనే ‘యూత్ కీ ఆవాజ్’, ‘ది శాటిలైట్’ వెబ్సైట్స్కు ఫీచర్ రైటర్గా పనిచేసింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొద్దిరోజులు బీబీసీలో ఇంటర్న్షిప్ కూడా చేసింది. రాక్స్టార్ మూవీ షూట్లోనే నటిగా మారాలని నిర్ణయించుకున్నా.. అప్పటి వరకు నేను సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు - సంజనా సంఘీ చదవండి: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్ టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ -
బుమ్రా-సంజనాల ‘వన్ మంత్ ఆఫ్ లవ్’ సెలబ్రేషన్స్
ముంబై: గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్- టీమిండియా పేసర్ బుమ్రాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్ వారి అప్డేట్స్ను అందిస్తున్నారు. తాజాగా సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న వవిషయాన్ని బుమ్రా తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు అంటూ ట్వీటర్ లో షేర్ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్, సుదీర్ఘమైన చర్చలు.. శాంతి. ఇవి నా బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న తర్వాత మా నెల ప్రేమలో ముచ్చట్లు ’ అని బుమ్రా రాసుకొచ్చాడు. కాగా , కెరీర్ పరంగా టీమిండియా పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల బుమ్రా... ఇప్పటి వరకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 83, వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు అయిన సంజన, ఆ తర్వాత టీవీ ప్రజెంటర్గా అవతారమెత్తారు. ప్రపంచకప్, ఐపీఎల్ వంటి క్రికెట్ మెగా టోర్నీలు సహా ఇతర క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో భాగస్వామ్యమయ్యారు. బుమ్రాతో పెళ్లి తర్వాత భారత్-ఇంగ్లండ్తో సిరీస్లో సంజనా పాల్గొనగా, బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్తో బుమ్రా బిజీగా ఉన్నాడు. One month of love, belly laughs, silly jokes, long conversations and peace. One month of being married to my best friend.❤ pic.twitter.com/yraFiVTciM — Jasprit Bumrah (@Jaspritbumrah93) April 15, 2021 -
తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్
అనేక ఊహాగానాలకు తెరదించుతూ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మార్చి 15న జరిగిన ఈ వేడుకకు గోవా వేదికగా మారింది. ‘మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా, సంజనల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా వీరి వివాహానికి చెందిన ఓ వీడియో సోషల్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిని మంగళవారం వెడ్డింగ్ ఫిల్మర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ పోస్టు చేసింది. ‘‘నువ్వు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అని నేను అడిగాను. దానికి ‘ఎందుకంటే ఇప్పుడు తనే నా ప్రపంచం’ అని అతను బదులిచ్చాడు.’’అనే క్యాషన్తో షేర్ చేశారు.ఈ వీడియోలో పెళ్లికూతురుగా ముస్తాబైన సంజనను తన తండ్రి మండపం వద్దకు తీసుకు రావడంతో మొదలైన ఈ వీడియోలో వధూవరూలిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. పెళ్లి దండలు మార్చుకుంటూ బుమ్రా, సంజన ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీ జంట చూడముచ్చటగా ఉందంటూ మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్ అయిన అనుపమ బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు View this post on Instagram A post shared by Vishal Punjabi (@theweddingfilmer) -
అత్యంత అద్భుత క్షణాలు: బుమ్రా
ముంబై: ‘‘గడిచిన కొన్ని రోజులు జీవితంలో అత్యంత అద్భుత క్షణాలను మిగిల్చాయి. మాపై ప్రేమ కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న మీ అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా భార్య సంజనా గణేషన్తో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. కాగా స్పోర్ట్ట్ ప్రజెంటర్ సంజనా- బుమ్రా గోవాలో అత్యంత సన్నిహితుల సమక్షంలో మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బుమ్రా తాజాగా తమ వివాహానంతర వేడుకకు సంబంధించిన ఫొటోలు నెటిజన్లతో పంచుకున్నాడు. ఇక సంజన సైతం... ‘‘మీ విషెస్తో మా ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న మీకు థాంక్యూ’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశారు. ఇక ఈ ఫొటోల్లో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ధరించి ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న బుమ్రా- సంజూను చూసి.. ‘‘మీ జంట చూడముచ్చటగా ఉంది. మీరిలాగే కలకాలం సంతోషంగా ఉండాలి’’ అంటూ ఫ్యాన్స్ మరోసారి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. కాగా కెరీర్ పరంగా టీమిండియా పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల బుమ్రా... ఇప్పటి వరకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 83, వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు అయిన సంజన, ఆ తర్వాత టీవీ ప్రజెంటర్గా అవతారమెత్తారు. ప్రపంచకప్, ఐపీఎల్ వంటి క్రికెట్ మెగా టోర్నీలు సహా ఇతర క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో భాగస్వామ్యమయ్యారు. చదవండి: వైరల్: సంగీత్లో స్టెప్పులేసిన బుమ్రా- సంజూ! బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?! View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) Overwhelmed by all the love we’ve been showered with over the last few days. We’ve been reading all your messages & wishes with the biggest smiles on our faces! Thank you. pic.twitter.com/13ykcffi9Z — Sanjana Ganesan (@SanjanaGanesan) March 19, 2021 -
సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్ అయిన అనుపమ
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి అనుపమా పరమేశ్వరన్ మాత్రం బుమ్రా పెళ్లిపై హర్ట్ అయినట్లు ఉంది. దీంతో తన బాధను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంటూ..'నా నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ముక్కలైపోయిన నా గుండె నీకు గుచ్చుకొని నొప్పి పెట్టవచ్చు.. అయినా గాయం నయం కావోచ్చేమో గానీ వాటి తాలూకూ మచ్చలు అలాగే ఉండిపోతాయి' అంటూ అనుపమా రెండు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో అనుపమ మనసను గాయం చేసింది బుమ్రానే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఓ మలయాళం స్యాడ్ సాంగ్ని కూడా షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో పాపం అనుపమా.. అంటూ కొందరు ఆమెను ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న బుమ్రా పెళ్లాడబోతుంది హీరోయిన్ అనుపమా పరమేశ్వర్నే అంటూ పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. గతంలో బుమ్రా తన ఫేవరెట్ క్రికెటర్ అని అనుపమ ప్రకటించడం, ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్ను ఆమె సందర్శించిన ఫొటోలు షేర్ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి. అయితే వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను అనుపమ తల్లి కొట్టిపారేశారు. వారిద్దరి కేవలం స్నేహితులు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ను బుమ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) చదవండి : (బుమ్రా-సంజూ హనీమూన్; మాల్దీవ్స్ అయితే బెటర్) (అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి) -
వైరల్: సంగీత్లో స్టెప్పులేసిన బుమ్రా- సంజూ!
న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ వివాహానికి సంబంధించిన విశేషాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట సోమవారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆది నుంచి తమ బంధం గురించి ఎక్కడా బయటపడని ఈ సెలబ్రిటీ కపుల్.. ఏకంగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైనా, కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ హల్చల్ చేస్తున్నారు. వీరి పరిణయానికి సంబంధించిన ఏ చిన్న వీడియో దొరికినా తమ ఖాతాల్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా , బుమ్రా- సంజూ తమ సంగీత్లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి తన్మయత్వంతో స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వీడియో కన్నుల పండుగా ఉందంటూ యార్కర్ కింగ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక బుమ్రా ప్రాతినిథ్యం వహిస్త్ను ముంబై ఇండియన్స్ సైతం వీరి వెడ్డింగ్లోని మధుర జ్ఞాపకాలకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్ను గెలుచుకున్నారు. అదే విధంగా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్గా అవతారమెత్తిన సంజన, బుమ్రాను ప్రేమించి, ఇరు కుటుంబాల సమక్షంలో అతడిని పెళ్లాడారు. ఫొటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?! అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి And one moreeee here... 💐🎉🍾👸🤴🥳... Adorable 👀👀...#yorkerking#bumrahthegoat#JaspritBumrah#IndianCricketTeam#TeamIndia#MumbaiIndians#icc#bcci#INDvsENG#bumrahwedding#jaspritbumrahmarriage#jaspritbumrahwedding@Jaspritbumrah93@SanjanaGanesan pic.twitter.com/cOttQnPWeh — Jasprit bumrah.fc (@bumrahthegoat) March 16, 2021 View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్.. నా డైలీ మూడ్ ఒకేలా!
న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ను బుమ్రా పెళ్లి చేసుకోనున్నాడని మొదట్లో వార్తలు రాగా, ఆ తర్వాత స్పోర్ట్స్ కామెంటేటర్ సంజనా గణేషన్తో వివాహం జరగనుందని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ చదవండి: బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ ఆ సంగతి అలా ఉంచితే.. ఈ జనవరిలో .. బుమ్రా గురించి సంజనా గణేషన్ ఓ ట్వీట్ చేయగా, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బుమ్రా పలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగా, వీటిని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి మీ ఆదివారం బుమ్రా కంటే బాగా గడిచిందా అనే కామెంట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్పై స్పందించిన సంజన .. బుమ్రా ఆన్ ఫీల్డ్ మూడ్, నా డైలీ మూడ్ ఒకేలా స్వింగ్ అవుతాయంటూ కామెంట్ పెట్టారు. దాంతో వీరి పెళ్లి వార్తలపై చర్చకు తెరలేపారు నెటిజన్లు. దీనిలో భాగంగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. Jasprit Bumrah’s on-field moods & my daily mood swings look exactly alike. 🙊😋#AUSvIND https://t.co/e0kmWVNCHR — Sanjana Ganesan (@SanjanaGanesan) January 10, 2021 -
బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ
టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో నాలుగు టెస్టు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నాడని అందుకే అతడు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ వదులుకున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ లక్కీ గర్ల్ ఎవరని ఆరా తీశారు బుమ్రా అభిమానులు. గతంలో తన ఫేవరెట్ క్రికెటర్ బుమ్రా అని, అతడంటే ఇష్టమని దక్షిణాది భామ, ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బుమ్రా, అనపమాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వచ్చాయి. ఈ క్రేజీ రూమర్ కాస్తా నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్ స్పందించారు. మాలయాళ పోర్టల్తో మాట్లాడుతూ.. వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ‘తన కూతురు అనుపమ, బుమ్రాలు కేవలం స్నేహితులు మాత్రమే. వారిపై పెళ్లంటు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఒక తెలుగు సినిమా షూట్ కోసం అనుపమా గుజరాత్ వెళ్లింది తప్ప మరే కారణం లేదు’అని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక ఈ వార్తలు రావడంతో అనుపమ, బుమ్రాలు ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఒకరూ అన్ఫాలో చేసుకున్నారని కూడా చెప్పారు. ఓ మూవీ షూటింగ్ సమయంలో అనుపమా, బుమ్రాలు తొలిసారిగా ఓ హోటల్లో కలుసుకున్నారని అదే చివరిది అని పేర్కొన్నారు. కేవలం దాన్ని ఆధారంగా చేసుకుని వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సృష్టించడం సరైనది కాదని ఆమె అన్నారు. దీంతో తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్విల్లా సీజన్ 7 తో కెరీర్ ఆరంభించారు. అయితే ఇది ఎంతవరకు నిజమన్న దానిపై క్లారిటి లేదు. చదవండి: హీరోయిన్ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా! ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా? -
హీరోయిన్ కాదు: బుమ్రాను పెళ్లాడేది ఆమేనా!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న నాటి నుంచి టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ ఫాస్ట్బౌలర్ సెలవు తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బుమ్రాను వివాహమాడనున్న ఆ అమ్మాయి ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ను బుమ్రా వధువుగా పేర్కొంటూ ఇప్పటికే గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేసిన సంగతి తెలిసిందే. బుమ్రా తన ఫేవరెట్ క్రికెటర్ అని గతంలో ప్రకటించిన అనుమప.. ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్ను సందర్శించిన ఫొటోలు షేర్ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో యువతి పేరు తెర మీదకు వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్విల్లా సీజన్ 7 తో కెరీర్ ఆరంభించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం, పరిణయానికి దారి తీసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడని వినికిడి. అయితే వధువు ఎవరన్న విషయంపై మాత్రం ఇంతవరకు సస్పెన్స్ వీడటం లేదు! అయితే, హాలిడే మూడ్లో ఉన్నానంటూ అనుపమ, బుగ్గలకు పసుపు, కుంకుమ రాసుకున్న ఫొటో షేర్ చేయడంతో మెజారిటీ మంది అనుపమే ఆ లక్కీ గర్ల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ హీరోయిన్ని బుమ్రా పెళ్లాడబోతున్నాడా? Bumrah & Anupama ?? Something is Fishy 🐱#SarkaruVaariPaata @urstrulyMahesh pic.twitter.com/xdFXpYnfZk — Uday S V P 🔔 (@Udayvarma1882) March 4, 2021 Bumrah and Sanjana?? Reallyyy?? — ROSHNI✨ (@roshni45_) March 3, 2021 I'm following all family members of Kohli (his wife included obviously). Then by twitter logic I-😍🤡 — An (@art_chieverr) March 3, 2021 -
డ్రగ్స్ కేసు: బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారణ
సాక్షి, యశవంతపుర: శాండల్వుడ్ డ్రగ్స్ కేసులో జైలుపాలైన నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. ఇటీవల సంజనకు చెందిన 11 బ్యాంక్ ఖాతాల నుంచి నగదు వివిధ ఖాతాలకు బదిలీ అయిన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అన్ని ఖాతాలలో కలిపి 40 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. సంజన బ్యాంక్ ఖాతాకు విదేశాల నుండి నగదు బదిలీ అయిందా అనే కోణంలో సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరి ఖాతాల నుంచి ఆమె ఖాతాకు డబ్బులు వచ్చేవి, వెళ్లేవి అని ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. బెంగళూరులో ఐఎంఏ అధినేత మన్సూరుఖాన్ సంస్థలో తాను భారీగా డిపాజిట్లు కట్టి మోసపోయినట్లు సంజన ఈడీ ముందు చెప్పినట్లు తెలిసింది. గతేడాది ఐఎంఏ సంస్థ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది డిపాజిటర్లు మోసపోయిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలు ఇస్తారని స్నేహితుల మాట విని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు సంజన తెలిపారు. ముగిసిన వీరేన్ఖన్నా విచారణ డ్రగ్స్ కేసులో ముఖ్య నిందితుడు వీరేన్ఖన్నా పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. అతని నుంచి సీసీబీ పోలీసులు అనేక విషయాలను సేకరించారు. 2018లో బాణసవాడి పోలీసులు ప్రతీక్ శెట్టిని అరెస్ట్ చేసిన సమయంలో వీరేన్ఖన్నా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఖన్నాను 14 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించి డ్రగ్స్ రాకెట్లో కీలక అంశాలను సేకరించారు. తను పార్టీలను మాత్రమే నిర్వహించేవాడిని, డ్రగ్స్తో సంబంధం లేదని తెలిపాడు. రాగిణి, సంజన, రవిశంకర్ల ముఖం కూడా తాను చూడలేదని చెప్పాడు. విచారణ తరువాత జడ్జి ముందు హాజరుపరిచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. -
రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే
సాక్షి, కర్ణాటక: డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో రిమాండులోనున్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్ల విచారణను బెంగళూరు ఎస్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్పై సీసీబీ న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. రాగిణి బెయిల్ అర్జీపై 12 పేజీల అభ్యంతరాలలో ఎన్నో అంశాలను కోర్టుకు వివరించారు. నిందితులు బలమైనవారు విచారణకు ఆటంకాలు ఎదురవుతాయి, కాబట్టి బెయిల్ ఇవ్వరాదు, రాగిణి ఐదేళ్ల నుంచి బెంగళూరుతో పాటు వివిధ నగరాలలో జరిగిన డ్రగ్స్ పాలలో పాల్గొన్నారు. ఆంధ్ర, గోవా, ముంబైతో పాటు విదేశాల నుంచి డ్రగ్స్ను కోనుగోలు చేశారు. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసినప్పుడు సాక్ష్యాలను నాశనం చేశారు అని అందులో ఆరోపించారు. హోటళ్లు, రిసార్టులకు నోటీసులు శాండల్వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పార్టీలు నిర్వహించిన హోటళ్లు, పబ్లు, రిసార్ట్స్లకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అనేక ప్రతిష్టాత్మక హోటల్స్లో అర్ధరాత్రి వరకు నటి రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నాలు నిర్వహించినట్లు సీసీబీ గుర్తించారు. ఆ విందు వినోదాల సీసీ కెమెరాల చిత్రాలను తమకు అందజేయాలని హోటళ్లను పబ్లను కోరారు. సీసీబీ అరెస్ట్ చేసిన పలువురు నిందితులు ఏయే హోటళ్లు, పబ్లు, రిసార్ట్లలో మజా చేసిందీ వెల్లడించారు. (డ్రగ్స్ కేసు: సీసీబీ ఎదుట గ్లామర్జంట) కింగ్పిన్ శివప్రసాద్ ఎక్కడ డ్రగ్స్ బాగోతంలో ప్రధాన నిందితుడు, ఎ1గా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న శివప్రసాద్ కోసం సీసీబీ గాలిస్తోంది. ఇతని గురించి ఆసక్తికరమైన విషయాలను సీసీబీ సేకరించింది. రాగిణికి చాలా సన్నిహితుడు. అతడు దొరికితే కేసు మిస్టరీ అంతా వీడిపోతుందని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. విచారణ బాగా లేదు: లంకేశ్ కాగా, డ్రగ్స్ కేసు విచారణ తూతూ మంత్రంగా జరుగుతోందని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ అన్నారు. ఈ బాగోతంలో నటీమణులేకాదు. నటులు, రాజకీయనాయకుల పుత్రులు ఉన్నారు. కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస సుబ్రమణ్యన్ విచారణ బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తున్న శ్రీనివాస సుబ్రమణ్యన్ను పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్, వైభవ్ జైన్లతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలను అందజేశాడు. ఇక ఒక నటి అన్నా తమ్ముళ్లు, సంగీత దర్శకులను సీసీబీ విచారణకు పిలవనుంది. -
సెంట్రల్ జైలుకు నటి రాగిణి
సాక్షి, బెంగళూరు : శాండల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్ రంకా, లూమ్ పెప్పర్, నియాజ్లను వీడియో కాన్ఫరెన్స్లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. బెయిల్ కష్టం రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్ దొరకటం కష్టమని తెలిసింది. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ పేర్కొనగా, మరో 2 రోజుల పాటు వారి కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు ప్రశ్నించనున్నారు. అంతకుముందు నిందితులకు కేసీ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్గా వచ్చింది. ప్రముఖులతో నిందితుడు డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ బీబీఎంపీ కార్పొరేటర్ కేశవమూర్తి కొడుకు యశస్ కోసం ఎన్సీబీ పోలీసులు ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి గాలిస్తున్నారు. ఈ నెల 7న విచారణకు పిలవగా ఒకసారి వచ్చి వెళ్లాడు. తరువాత విచారణకు పిలవగా అదృశ్యమయ్యాడు. త్వరలో వీఐపీలకు నోటీసులు? రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను రూపొందించారు. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. విచారణకు రావాలని వారికి నోటీసులు పంపనున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించారు. నేను దొంగ అవుతానా: జమీర్ డ్రగ్స్ కేసులో తనను ఇరికించి రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతోందేమోనని కాంగ్రెస్ మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ఖాన్ ఆరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నిందితుడు ఫాజల్తో నాకు పరిచయం లేదు. ఒక దొంగ నాతో కలిసి ఫోటో తీయించుకుంటే నేను దొంగను ఎలా అవుతానని ప్రశ్నించారు. వీఐపీలతో రాహుల్ చెట్టాపట్టాల్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ రాహుల్తో రెవెన్యూశాఖ మంత్రి ఆర్.ఆశోక్, నిర్మాత కె.మంజు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులతో స్వీట్లు తింటూ దిగిన ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు ఉపేంద్ర, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీనగర కిట్టి, రఘు ముఖర్జీ, సంగీత దర్శకుడు గురుకిరణ్, నటీ ఐంద్రితా రై, ప్రియాంక, హర్షికా పూణచ్చ, ఒక రిటైర్డ్ ఐజీలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరితో ఇతనికి గల సంబంధాలు ఎలాంటివన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
డ్రగ్స్ కేసు: నటి సంజన అరెస్టు!
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్వుడ్ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!) అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్వుడ్లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు. విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. -
సంజనపై రియా కామెంట్స్: నటి ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సీబీఐ విచారణ మొదలైన నాటి నుంచి అతడి గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. జూన్ 8న తాను బాంద్రా ఫ్లాట్ నుంచి వచ్చేశానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెబుతున్నారు. అంతేగాక సుశాంత్ ఎప్పటి నుంచో డ్రిపెషన్లో ఉన్నాడని, అతడి మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గురువారం ఇండియా టుడేతో మాట్లాడిన రియా చక్రవర్తి.. ‘దిల్ బేచారా’ హీరోయిన్ సంజనా సంఘీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్పై వచ్చిన మీటూ ఆరోపణలపై స్పష్టతనివ్వడంతో సంజన ఆలస్యం చేసిందని, ఈ పరిణామాలు అతడిని కుంగదీశాయని చెప్పుకొచ్చారు. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు: రియా) లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా సుశాంత్ మానసికంగా బలహీనపడిపోయాడని, ఆ ఎపిసోడ్ తనను పూర్తిగా నాశనం చేసిందని పేర్కొన్నారు. ‘‘మీటూ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేశారు? ఈ విషయంపై విచారణ జరగాలి. నెలన్నరగా నేనెందుకు మౌనంగా ఉన్నానని ప్రశ్నించిన వాళ్లు ఈ విషయంపై దృష్టి సారించాలి’’అంటూ రియా వ్యాఖ్యానించారు. ఇక రియా వ్యాఖ్యలపై సంజన సంఘి తీవ్రంగా స్పందించారు. కాస్మోపాలిటన్ ఎడిటర్తో మాట్లాడుతూ.. ‘‘ఓ మహిళగా నేనేం ఏం చెప్పాలో అంతా చెప్పాను. జరిగిన దాని గురించి పూర్తిగా వివరించాను. మళ్లీ కొత్తగా ఇలా మాట్లాడితే అస్సలు సహించేది లేదు’’రియాపై ఫైర్ అయ్యారు. (చదవండి: సుశాంత్, రియా కోసం ఎంత ఖర్చు చేశాడంటే..) లాక్డౌన్ కారణంగా షూటింగ్లు లేక సతమతమవుతుంటే.. తనను వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. సహ నటిగా సుశాంత్ గురించి తాను కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకోగలిగాని, ఒకరి జీవితంలో తలదూర్చే ప్రయత్నం చేయనని చెప్పుకొచ్చారు. దిల్ బేచారాకు ముందు తానెన్నడూ సుశాంత్ను కలవలేదని, అయితే సెట్లో తనను గమనించిన దాన్నిబట్టి ఎంతో మంచి వ్యక్తి చెప్పగలనన్నారు. ఇక సుశాంత్ మృతి తన మనసును కలచివేసిందన్న సంజన.. అతడికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయకూడదని పరోక్షంగా రియాను ఉద్దేశించి చురకలు అంటించారు.(చదవండి: దిల్ బేచారా మూవీ రివ్యూ) కాగా ‘దిల్ బేచారా’ సినిమాలో సుశాంత్, సంజన జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో(2018) సుశాంత్ ఆమెను లైంగికంగా వేధించాడంటూ వదంతులు వ్యాపించాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ సంజనతో తాను చేసిన చాట్ను బహిర్గతం చేసిన సుశాంత్, తనతో హుందాగా ప్రవర్తించానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నెలరోజులకు ఈ విషయంపై స్పందించిన సంజన..‘‘యూఎస్ ట్రిప్ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్ చేశారు. -
ఫేవరెట్ మూమెంట్ అదే: హీరోయిన్
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 24న ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అద్భుతమైన రేటింగ్తో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యానీ పాత్రలో ఒదిగిపోయిన సుశీ.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడంటూ సెలబ్రిటీలు, సహచర నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సినిమాలోలాగే తన జీవితం విషాదంగా ముగిసిపోవడం బాధాకరమంటూ అతడితో ఉన్న జ్ఞాపకాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో దిల్ బేచారాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంజనా సంఘీ సైతం సుశాంత్తో తనకు ఉన్న బెస్ట్ మూమెంట్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.(దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్) ‘‘ఉదయం 4:30 : తారే గిన్ షూట్లో మ్యానీ ఓ కునుకు తీశాడు. తన భుజాన్ని అరువిచ్చిన కిజీ.. ఎప్పటిలాగే ఆలోచనల్లో మునిగిపోయింది’’అంటూ సినిమాలోని తమ పాత్రల పేర్లు, స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఫొటోను షేర్ చేశారు. మూవీ సెట్లో తాను గడిపిన అద్భుతమైన క్షణాలు ఇవేనని పేర్కొన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన సంజన.. సుశాంత్ ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాక్డౌన్ కారణంగా అవకాశాలు లేకపోవడంతో ఇటీవల ఆమె ముంబైని వీడి స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.(బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) ‘మరోసారి నా హృదయం ముక్కలైంది’ View this post on Instagram 4:30AM : Manny takes a power nap during a night shoot for Taare Gin, as Kizie lends her shoulder, lost in thought as she always was. #FavouriteMomentsFromSet A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jul 26, 2020 at 10:31pm PDT -
దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్
టైటిల్: దిల్ బేచారా నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్పుత్ , సంజనా సంఘి, సైఫ్ అలీఖాన్(అతిథి పాత్ర), స్వస్థికా ముఖర్జీ తదితరులు దర్శకుడు: ముఖేశ్ చాబ్రా నిర్మాణ సంస్థ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంగీతం: ఏఆర్ రెహమాన్ విడుదల: డిస్నీ- హాట్స్టార్ (జూలై 24) సుశాంత్ సింగ్ రాజ్పుత్.. సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులను శోక సంద్రంలో ముంచి దివంగతాలకేగిన ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడి అంతులేని ఆవేదనను మిగిల్చిన సుశీ.. ఆఖరి సినిమాను వెండితెరపైనే చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే కరోనా మహమ్మారి కట్టడికై విధించిన లాక్డౌన్ కారణంగా‘దిల్ బేచారా’ను ఓటీటీ వేదికగా విడుదల చేయాల్సి వచ్చింది. సుశాంత్ బలవన్మరణాన్ని జీర్ణించుకోలేక సన్నిహితులు, అభిమానులు అతడి జ్ఞాపకాలతో రోజులు గడుపుతున్న భావోద్వేగ సమయంలో శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ ట్రైలర్స్లో అత్యధిక లైకులతో ఆల్టైమ్ రికార్డు సాధించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ : కిజీ బసు(సంజనా సంఘీ)కు థైరాయిడ్ క్యాన్సర్. జంషెడ్పూర్లో ఉంటుంది. క్యాన్సర్ కారణంగా ఊపిరి తిత్తులు పాడైపోయిన కిజీకి ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే. అందరు అమ్మాయిల్లాగే తనకూ సాధారణ జీవితం గడపాలని ఉన్నా.. మహమ్మారి కారణంగా తరచుగా ఆస్పత్రికి వెళ్లడం, చెకప్లకే సగం రోజులు గడిచిపోతూ ఉంటాయి. క్యాన్సర్ ఏదో ఒకరోజు తనను బలితీసుకుంటుందనే విషయం కిజీకి బాగా తెలుసు. అందుకే తను వెళ్లిపోయిన తర్వాత తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు, స్నేహితులు ఎలా ఫీలవుతారో తెలుసుకునేందుకు పరిచయం లేని వాళ్ల అంత్యక్రియలకు హాజరవుతూ ఉంటుంది. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) ఇలాంటి సమయంలో తనకు ఓ రోజు కాలేజీలో ఇమాన్యుయేల్ రాజ్కుమార్ జూనియర్- మ్యానీ(సుశాంత్ సింగ్ రాజ్పుత్) పరిచయమవుతాడు. ఆ తర్వాత క్యాన్సర్ సపోర్టు గ్రూపులో మరోసారి కనిపిస్తాడు. కిజీలాగే మ్యానీ కూడా క్యాన్సర్ పేషెంట్. ఆస్టియోసర్కోమా తనను పీడిస్తూ ఉంటుంది. నటనను ప్రాణంగా ప్రేమిస్తూ, తలైవా రజనీకాంత్ను ఆరాధిస్తూ ఎంతో చలాకీగా ఉండే మ్యానీ వ్యక్తిత్వం కిజీకి బాగా నచ్చుతుంది. అలా కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడతుంది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా మన్నీ తనకు ‘పూర్తిగా’ దగ్గరవకుండా ఉండటం కోసం కిజీ.. అతడికి దూరదూరంగానే ఉంటుంది. కానీ దగ్గరవొద్దంటే దూరంగా ఉండే రకం కాదు మ్యానీ.. నీ దూరం నీది.. నా దగ్గర నాది అన్నట్లుగా ఆమెతో బంధం పెనవేసుకుంటాడు. అలా నిస్సారంగా.. సాదాసీదాగా సాగిపోతున్న కిజీ జీవితంలో ప్రవేశించిన మ్యానీ ఆమెకు ఎలాంటి అనుభూతులు పంచాడు? కిజీ ప్రేమను ఎలా పొందగలిగాడు? చివరికి వారి జీవితాలు ఎలాంటి ముగింపు తీసుకున్నాయనేదే ఈ సినిమా కథ. (ఆ పెయింటింగ్.. ఆ పోస్టు.. ముందే చెప్పావా సుశాంత్?) భావోద్వేగ కథనం.. చివరికి? జంషెడ్పూర్లో కిజీ బసు, ఆమె కుటుంబ పరిచయంతో సినిమా మొదలవుతుంది. కాన్సర్ పేషెంట్గా ఎలాంటి సంతోషాలకు నోచుకోకుండా గడుపుతున్న కిజీ లైఫ్లోకి వచ్చిన మ్యానీ ఒక్కసారిగా.. ఆమె లోకాన్ని రంగులమయం చేస్తాడు. ఎప్పుడూ గుంభనంగా ఉండే ఆమె ముఖంపై నవ్వులు పూయిస్తాడు. కిజీ కూడా మ్యానీ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే కిజీ తల్లికి మాత్రం కూతురు.. ఇలా ఓ అబ్బాయితో కలిసి తిరగుతుండటం కాస్త ఆందోళన రేకెత్తిస్తుంది. ఓ సాధారణ తల్లిగా కొన్ని భయాలు ఆమెను వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో తన స్నేహితుడు జగదీశ్ పాండే తీస్తున్న షార్ట్ ఫిలింలో హీరోయిన్గా నటిచేందుకు కిజీని ఒప్పిస్తాడు మ్యానీ. ఇదిలా ఉండగా.. సంగీత ప్రియురాలైన కిజీకి తన అభిమాన సింగర్ అభిమన్యు వీర్(సైఫ్ అలీఖాన్) రాసిన పాట ఎందుకు అసంపూర్తిగా ఉందో తెలుసుకోవాలనే ఆలోచన వెంటాడుతుంది. ఈ విషయాన్ని మ్యానీతో పంచుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వీర్ను కలిసేందుకు ఫారిన్ వెళ్తారు. ఇక అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కిజీని నిరాశకు గురిచేసినా... పాట పూర్తి చేయాలనే తన కోరికను మన్నించడంతో కాస్త సంతోషపడుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే విషాదకర పరిణామాలతో ముగిసే ఈ సినిమా దర్శక దిగ్గజం మణిరత్నం ‘గీతాంజలి’ని తప్పక గుర్తు చేస్తుంది.(సుశాంత్ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) ఎవరెలా నటించారంటే.. ఈ సినిమాకు హీరోహీరోయిన్ల నటనే ప్రాణప్రతిష్ట చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మ్యానీ పాత్రలో ఒదిగిపోయిన సుశాంత్ తన సహజమైన నటనతో కట్టిపడేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో అందరి చేతా కంటతడి పెట్టించాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంజన కూడా కిజీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే హాలీవుడ్ సినిమాకు దిల్ బేచారా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కథ సింపుల్గానే ఉన్నా భావోద్వేగ కథనంతో ఆద్యంతం ఎమోషనల్గా ప్రేక్షకులను మూవీలో లీనం చేయడంలో దర్శకుడు ముఖేశ్ చాబ్రా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కథకు సుశాంత్ లాంటి ప్రతిభ ఉన్న నటుడిని ఎంపిక చేసుకోవడం బాగా కలిసి వచ్చింది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్కు తీసుకువెళ్లింది. సుశాంత్ అద్భుత నటన, భావోద్వేగ కథనం, మనసును తాకే డైలాగ్స్, శ్రావ్యంగా సాగే సంగీతం అన్నీ వెరసి దిల్ బెచారాకు ప్రేక్షకుల మదిలో స్థానం కల్పిస్తుందనడంలో సందేహం లేదు. చివరగా... ‘జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు. ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది’ అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా సుశాంత్కు గొప్ప నివాళిగా మిగిలిపోయింది. ‘‘నా జీవితంలోకి వచ్చాడు.. నవ్వడం నేర్పాడు.. నా జీవితమే తాను అయిపోయాడు.. చివరకు మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్లి పోయాడు’’అంటూ హీరోయిన్...‘‘మ్యాని మొహాన్ని, చిరునవ్వును చూడని ఈ కళ్ళు లేకపోవడమే మంచిది’’ అని కళ్లు కోల్పోయిన హీరో స్నేహితుడు చెప్పే డైలాగ్స్ మనసును మెలిపెడతాయి. ఇక చిచోరే సినిమాలో ఆత్మహత్యలను వ్యతిరేకించే అనిరుద్ పాత్రలో స్ఫూర్తిదాయక నటన కనబరిచి, దిల్ బెచారాలో కాన్సర్ పేషెంట్గా కంటతడి పెట్టిస్తూనే.. బతికున్ననాళ్లు ఎంత సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యమని చెప్పే మ్యానీ పాత్రలో జీవించిన సుశీ.. యాధృచ్ఛికమో, దైవ నిర్ణయమో తెలియదు గానీ సినిమా విడుదలకు ముందే ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం విచారకరం. -
బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్
‘‘బై.. ముంబై. నిన్ను దర్శించడానికి నాకు నాలుగు నెలలు పట్టింది. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. నీ వీధులన్నీ చాలా కొత్తగా, వింతగా కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్నాయి. బహుశా నా గుండెలోని బాధ వల్లే నా చూపు అలా మారిందేమో! లేదంటే నువ్వు కూడా బాధలో ఉన్నావేమో.. త్వరలోనే మళ్లీ కలుస్తాం.. లేదంటే కలవలేకపోవచ్చు’’ అంటూ బాలీవుడ్ నటి, ‘దిల్ బేచారా’ ఫేం సంజన సాంఘి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను ముంబైని వీడి స్వస్థలం ఢిల్లీకి వెళ్తున్నట్లు బుధవారం వెల్లడించారు. ముంబై ఎయిర్పోర్టులో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంజన ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. కాగా 2011లో విడుదలైన ‘రాక్స్టార్’ సినిమాతో సంజన బాలీవుడ్లో అడుగుపెట్టారు. రణ్బీర్ కపూర్, నర్గిస్ ఫక్రీతో ఆ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. (ముందుకు సాగిపోవాలి అంతే: జెనీలియా) ఈ క్రమంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా తెరకెక్కిన ‘దిల్ బేచారా’ సినిమాలో తొలిసారి హీరోయిన్గా అవకాశం దక్కించుకున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లలో విడుదలకు నోచుకోని ఈ సినిమా.. ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్నీ, హాట్స్టార్ జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఇక సుశాంత్ నటించిన చివరి సినిమా కావడంతో దీన్ని థియేటర్లోనే విడుదల చేయాలని అతడి అభిమానులు నిర్మాతలను డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిత్రబృందం నిర్ణయంతో తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. (‘గత నెల సుశాంత్ 50 సిమ్లు మార్చాడు’) కాగా ప్రస్తుతం సంజన పోస్టు చూస్తుంటే ఆమె సైతం నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. కథానాయికగా వెండితెరపై కనిపించే అవకాశం చేజారిందనే బాధ ఓవైపు.. లాక్డౌన్ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడప్పుడే లీడ్రోల్ దక్కదనే ఆవేదన మరోవైపు ఆమెను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసిన తర్వాత సంజన ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. సుశాంత్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కాలం గాయాలను మాన్పుతుందని ఎవరు అన్నారో కానీ అది అబద్ధం. ఆ గాయం మళ్లీ మళ్లీ మనసును గాయపరుస్తుంది. బాధ పెరుగుతూనే ఉంటుదంటూ ఇన్స్టాలో వేదాంత ధోరణిలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.(సుశాంత్ ఆఖరు సినిమా కూడా ఓటీటీలోనే..) View this post on Instagram Whoever said time helps heal all wounds, was lying. Some feel like they’re being ripped open, again and again, and bleeding - Of moments that now will forever remain memories, Of laughs together that were but will never again be, Of questions that will remain unanswered, Of disbelief, that only keeps growing But these wounds also contain a film, a gift that everyone is yet to see, Wounds that contain dreams, plans, and desires for our country’s children, their education and their future that will be fulfilled, Wounds that contain a passion for an endless creative zest for every artist there is, Wounds that contain the hope for a world that promises to uphold honesty, integrity, kindness and embraces individuality - rid of all toxicity, I vow that I will do everything to make sure each of these dreams are fulfilled, like you always wanted me to. Except, you’d promised we’d do it all together. . . . #SushantSinghRajput #ThinkingOfYou A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jun 20, 2020 at 12:55pm PDT -
ఫైనల్లో సంజన
సాక్షి, హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు క్వాలిఫయింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సంజన సిరిమల్ల విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న రొలాండ్ గారోస్ వైల్డ్ కార్డు టోర్నీ బాలికల సింగిల్స్ విభాగంలో సంజన ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో సంజన 6–4, 7–5తో టాప్ సీడ్ రేష్మా మారూరి (కర్ణాటక)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో వైష్ణవి ఆడ్కర్ (మహారాష్ట్ర)తో సంజన ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన వారు పారిస్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తారు. ఆ టోర్నీలో మెక్సికో, బ్రెజిల్, చైనా దేశాల నుంచి అర్హత సాధించిన క్రీడాకారిణులతో ఆడతారు. క్వాలిఫయింగ్ టోర్నీ విజేతకు మే–జూన్లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ సెమీఫైనల్స్లో టాప్ సీడ్ దేవ్ జవియా 6–2, 6–1తో నితిన్ సింగ్పై, మూడో సీడ్ చిరాగ్ 6–1, 6–0తో మోహిత్పై గెలుపొందారు. -
నలుగురు కుర్రాళ్ల కథ
హరీష్, వినోద్, కార్తీక్, వెంకట చరణ్ హీరోలుగా, గీత్ షా, సంజన, లాస్యశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పంక్చర్’. చంద్రుడు క్రియేష¯Œ ్స సమర్పణలో శ్రీలక్ష్మి ప్రొడక్ష¯Œ ్స పతాకంపై శ్రీరంగం శేషశ్రీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో శ్రీరంగం శేషశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇది నా మొదటి సినిమా. నలుగురు కుర్రాళ్ల మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలోనే కథ ఉంటుంది. చక్కటి హాస్యంతో నిండిన కథతో రూపొందుతోంది’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడేలా మా సినిమా ఉంటుంది’’అన్నారు సమర్పకులు రాజు రాళ్లబండి. ‘‘ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అర్జున్. ‘‘వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు రచయిత సాయినాథ్. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్. శ్రీనివాస్. -
సంజన వర్సెస్ వందన
సాక్షి, బెంగళూరు : బహుభాషా నటి సంజనా గల్రాని, ప్రముఖ నిర్మాత వందన జైన్ల మధ్య క్రిస్మస్ ముందు రోజు జరిగిన గొడవ తారాస్థాయికి చేరింది. ఇద్దరు పరస్పర ఆరోపణలతో పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి బెదిరించుకునే స్థాయి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరి రచ్చ శాండిల్వుడ్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే... క్రిస్మస్ పండగకు ముందు రోజు నగరంలోని ప్రముఖ పబ్లో జరిగిన ఓ పార్టీ లో సంజన, నిర్మాత వందన జైన్లు పాల్గొన్నారు. మద్యం మత్తులో ఇద్దరు పరస్పరం గొడవపడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సంజనా ఏకంగా బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శనివారం సంజన మీడియాతో మాట్లాడుతూ...వందనకు రూ. 200 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ నాయకులు, క్రికెటర్ల నుంచి వందన జైన్ అక్రమ దందాలు చేసినట్లు ఆరోపించారు. ఇదే విషయంపై నిర్మాత వందన జైన్ మాట్లాడుతూ... తనను ప్రశ్నించటానికి సంజన ఎవరిని, తాగిన మైకంలో తనపై దాడి చేయడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంజన విషయాలు తనకు అన్నీ తెలుసని, అవి బయటపెడితే రోడ్డున పడుతుందని వందన అన్నారు. సంజన మద్యం బాటిల్తో తనపై దాడి చేసిన దృశ్యాన్ని అందరూ చూశారని, తనను సంజన హత్య చేస్తానని బెదిరిస్తున్నారని అన్నారు. తనకు బెంగళూరులో స్నేహితులు ఉన్నారని, నగరానికి వచ్చిన ప్రతిసారి వారిని కలుస్తానని, క్రిస్మస్ ముందురోజు స్నేహితులతో ఉండగా సంజన తనపై మద్యం బాటిల్తో దాడి చేసిందని వందన ఆరోపించారు. నటి సంజనపై ఫిర్యాదు నటి సంజనా తనపై దాడి చేశారని బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న బెంగళూరులోని ఒక పబ్లో సంజన తనపై దాడి చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదుపై సంజన వివరణ ఇచ్చారు. తాను ఎవరిపైనా దాడి చేయలేని స్పష్టం చేశారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం తన స్నేహితులతో వాగ్వాదం జరిగిందన్నారు. -
పబ్లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్లోని ఆర్టిస్ట్రీ పబ్లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
మరోసారి పోలీస్ స్టేషన్కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్లో గల ఆరిస్ట్రీ పబ్కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు
సాక్షి, హైదరాబాద్ : వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఖండించారు. నోవాటెల్ హోటల్కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్ గౌడ్ చెప్పారు. మరోవైపు ఆశీష్ గౌడ్ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి...మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ గౌడ్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్లోని నోవాటెల్లో గల ఆరిస్ట్రీ పబ్లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్లోని ఆర్టిస్ట్రీ పబ్కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్కు పంకజ్తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు. -
నా పంచ్ పవర్ చూపిస్తా
చేతికి గ్లౌజులు తొడుక్కుని తన పంచ్ పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నారు సంజన. ఈ పంచ్లు ఎవరి మీద పడతాయో వేచి చూడాలి. అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాక్సర్’. వివేక్ కణ్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంజన హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ బాక్సర్స్గా కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు సంజన. ‘‘ఇందులో నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర నాది. ఇంతకు ముందు సినిమాల కోసం నేర్చుకున్న గుర్రపు స్వారీ, నా ఫిజిక్ ఈ సినిమాకి అవకాశం వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో నా పాత్రను చూసి కచ్చితంగా షాక్ అవుతారు. సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాను’’ అన్నారు సంజన. ఈ సినిమా కాకుండా రెండు కన్నడ చిత్రాలు, ఓ తమిళ వెబ్ సిరీస్తో సంజన బిజీగా ఉన్నారు. -
నేను నేనే!
‘‘సినిమాల్లో మనం కాని పాత్రను పోషించడం బావుంటుంది. మన పాత్రనే మనం పోషించడం ఇంకా క్రేజీగా ఉంటుంది’’ అంటున్నారు కన్నడ భామ సంజన. ‘ముత్తుకుమార’ అనే కన్నడ సినిమాలో సంజన తన రియల్ లైఫ్ క్యారెక్టర్లోనే కనిపించనున్నారు. ధనుష్, సంచితా పదుకోన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సంజన కీలక పాత్ర చేస్తున్నారు. ఈ విషయం గురించి సంజన మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ హీరోయిన్ పాత్రలో నేను కనిపిస్తాను. హీరో ఆశయం నెరవేరడానికి నేను సహాయం చేస్తాను’’ అన్నారు. ప్రస్తుతం సంజన ‘స్వర్ణ ఖడ్గం’ అనే టీవీ సీరియల్, ‘ఐవర్’ అనే తమిళ వెబ్ సిరీస్, ‘మాతే మాతే’ అనే కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు. -
మిర్రర్స్ సెలూన్
-
అనగనగా...
చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు తమ మనమ సంతానానికి కథలు చెప్పాలంటే ‘అనగనగా ఓ రాజకుమారుడు’ ఉండేవాడట అని ప్రారంభించేవారు. ఇప్పుడు అదే టైటిల్తో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై పి.వి. రాఘవులు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా రాజకుమారుడు’. నవీన్ బాబు, సంజన జంటగా నటిస్తున్నారు. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటలను తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు విడుదల చేశారు. షేర్ మాట్లాడుతూ– ‘‘చిన్న మెసేజ్తో పాటు యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్తో మా చిత్రం ఉంటుంది. హీరో హీరోయిన్లు చక్కగా నటించడంతో పాటు రాఘవులుగారు రాజీ పడక పోవడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చే సినిమాను తీశాం. దర్శకుడు చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు రాఘవులు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు తంత్ర
వంశీ, ఆర్తి, తపస్వి, ఐశ్వర్య, విజయ్, సంజన ముఖ్య తారలుగా మేడం శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నా పేరు తంత్ర’. ప్రసాద్ ల్యాబ్స్లో ఎడిటింగ్ విభాగంలో పలు చిత్రాలకు పని చేసిన జగన్ (జె.డి) నిర్మాతగా మారి పరమశివ ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ (జెడి) మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతోన్న చిత్రమిది. గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఉంది. అందుకే 30 మంది గ్రాఫిక్స్ నిపుణులు మా సినిమా కోసం పనిచేస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది’’ అన్నారు. ‘‘టైటిల్కు తగ్గట్టుగా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్. షాయాజీ షిండే, ‘ఛత్రపతి’ శేఖర్, సుమన్ శెట్టి, ప్రాబ్స్, ముక్తార్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: జాక్ పొట్ల, కెమెరా: చక్రి. -
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
ఫైనల్లో సంజన, ప్రపూర్ణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, వేదరాజు ప్రపూర్ణ ఫైనల్కు చేరారు. అజీజ్నగర్లోని లేక్వ్యూ టెన్నిస్ అకాడమీలో గురువారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ సెమీస్లో టాప్ సీడ్ సంజన 2–6, 7–6, 6–1తో రేష్మ (కర్నాటక)పై గెలుపొందగా, ప్రపూర్ణ 6–3, 1–6, 6–3తో యానా ధమిజ (హరియాణా)ను ఓడించాడు. డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి ఆరే (తెలంగాణ)– పావని పాథక్ (మహారాష్ట్ర) జంట 6–1, 6–2తో హర్షాలి– భూమిక (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు అండర్–14 విభాగంలో ఏపీకి చెందిన అనంత్ మణి తుదిపోరుకు అర్హత సాధించాడు. బాలుర సింగిల్స్ సెమీస్లో అనంత్ (ఏపీ) 4–6, 6–2, 6–3తో మోనిల్ లోట్లికార్ (కర్నాటక)ను ఓడించాడు. -
స్టార్ యోగ
సినిమా స్టార్లు బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటే మైండ్ అండ్ బాడీ అంత ఫ్రెష్గా ఉండాలి. ఫీల్డ్ అలాంటిది. అందుకే కాజల్, రాశీఖన్నా, అదాశర్మ, సంజన.. తమ డైలీ లైఫ్లో యోగాకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు యోగా. ఆ తర్వాతే మిగతా షెడ్యూల్స్. ఎక్కడికెళ్లినా యోగా మ్యాట్: కాజల్ చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే, ఐ హేట్ పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్. కానీ మార్చ్ ఫాస్ట్ అంటే ఇష్టంగా చేసేదాన్ని. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫిట్నెస్ మీద అవగాహన ఏర్పడింది. ఫస్ట్ నేను ఏరోబిక్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. తర్వాత జిమ్కు వెళ్లటం స్టార్ట్ చేశాను. ఓసారి యోగా ట్రై చేశాను. అంతే.. అప్పటినుండి యోగా నా జీవితంలో భాగమైపోయింది. బేసికల్లీ నేను ఫుడ్ లవర్ని. ఎంత ఇంట్రెస్ట్గా తింటానో ఫిట్నెస్ కోసం అంతే ఇష్టంగా వర్కవుట్ చేస్తాను. యోగా చేస్తే చాలు.. కేలరీలు ఇట్టే కరిగిపోతాయి.యోగా చేయడానికి ఎక్విప్మెంట్స్ ఏవీ అవసరంలేదు. అది అందరికీ తెలిసిందే. మనకు కావాల్సింది జస్ట్ ఒక్క యోగా మ్యాట్ మాత్రమే. నేను ఎక్కడికెళ్లినా నాతో పాటు యోగా మ్యాట్ని కంపల్సరీ తీసుకెళతాను. సో.. నో బ్రేక్ ఫర్ యోగా. వారానికి మూడు రోజులు రోజుకు గంటన్నర చొప్పున తప్పనిసరిగా యోగా చే స్తాను. వారంలో మరో మూడు రోజులు వెయిట్ బ్యాలెన్స్ ట్రైనింగ్ చేస్తాను. సూర్య నమస్కారాలు బెస్ట్. నేను రోజూ ఏ ఆసనం వేసినా వేయకపోయినా సూర్య నమస్కారాలు మాత్రం మానను. 150 సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేస్తాను. నా ఫిట్నెస్ సీక్రెట్స్లో యోగాకి ఫస్ట్ ప్లేస్. టీనేజ్ నుంచే: రాశీ ఖన్నా యోగా గొప్పదనం గురించి నా టీనేజ్లోనే నేను తెలుసుకున్నాను. నేను యోగా చేయడం మొదలుపెట్టినప్పుడు నా వయసు9 16. అప్పటినుంచి ఇప్పటివరకూ యోగా చేస్తున్నాను. యోగా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనసు, శరీరం రెంటికీ మంచిది. నిజానికి యోగా అంటే బరువు తగ్గడానికి అని చాలామంది అనుకుంటారు. అయితే అది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.సూర్య నమస్కారాలు నా ఫేవరెట్ ఆసనం. ఈ అసనంవల్ల శరీరంలో అన్ని కండరాల్లో కదలిక వస్తుంది.యోగా వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అంత త్వరగా దేనికీ హర్ట్ అవ్వం.ఆ మధ్య నేను కొంత బరువు తగ్గాను. దానికి ముఖ్య కారణం యోగా. ఆ టైమ్లో వాకింగ్ కూడా బాగా చేశాన.నాది నైట్ టు ఫైవ్ జాబ్ కాదు. కొన్నిసార్లు రోజుకి 12, 13 గంటలు షూటింగ్ చేస్తుంటాను. అప్పుడు కూడా నాకు అలుపు అనిపించదు. దానికి ఒక కారణం యోగా. ఉదయం ఓ గంట సేను చేసే యోగా రోజంతా ఎనర్జిటిక్గా ఉంచుతుంది. నా గురువు మా అమ్మగారే: అదాశర్మ నాకు యోగాను పరిచయం చేసింది మా అమ్మగారే. నా చిన్నప్పుడు మా అమ్మగారు రోజూ యోగా చేయడం చూశాను. మెల్లిగా నాకూ అలవాటు చేశారు. నా యోగా గురువు మా అమ్మగారే.యోగాతో పాటు నేను వేరే ఎక్సర్సైజులు కూడా చేస్తాను. అయితే అవి చేసే ముందు యోగా చేస్తాను.నేను సూర్య నమస్కారాలు బాగా చేస్తాను. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించేది. అలవాటైన తర్వాత సూర నమస్కారాలు చేయని రోజున చాలా వెలితిగా ఉంటుంది.యోగాలో మెడిటేషన్ ఓ భాగం. ధాన్యం చేసి చూడండి. ఏకాగ్రత పెరుగుతుంది.నేను వెజిటేరియన్ని. అంతకు మించిన హెల్దీ ఫుడ్ లేదని నా ఒపీనియన్.ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా మైండ్ చాలా బ్యాలెన్డ్స్గా ఉంటుంది. దానికి కారణం యోగానే.ప్రతి రోజూ ఉదయం యోగా చేయడానికి ట్రై చేయండి. రోజంతా ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. మనసు శరీరం బాగుంటాయి: సంజన యోగా నా జీవితం. యోగా వల్లే నేను సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. అంతా బాగున్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. బాధలో ఉన్నప్పుడు కూడా నాకు సంతోషం ఇచ్చేది యోగానే.యోగా చేసేవారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే.. ఎప్పుడూ చాలా ధైర్యంగా ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్గా ఉంటారు. మానసికంగా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిచేయటానికి ఎక్కువ ధైర్యం ఉంటుంది.నా జీవితంలో యోగా అన్నది ఓ పెద్ద పార్ట్. నాకు సొంత యోగా అకాడమీ (అక్షర్) ఉంది. బెంగళూర్లో మూడు యోగా అకాడమీలతో స్టార్ట్ చేసి, ఇప్పుడు మొత్తం 20 అకాడమీలు నిర్వహిస్తున్నాం. ప్రతి అకాడమీలో 500 నుంచి 600 మంది క్లైంట్స్ ఉన్నారు. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్, ఇలా పాజిటివ్ కోర్స్లతో ఎంతోమందికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాం. మా ‘అక్షర్’ యోగాకి ఇప్పుటికి పదేళ్లు అయింది. యోగా అనేది నాకు డబ్బు సంపాదన కాదు. నా జీవితం నడవడానికి, డబ్బు సంపాదించటానికి సినిమాలు చేస్తాను కానీ, యోగా మాత్రం నా ఆత్మతృప్తి కోసం చేస్తా. మనవల్ల ఎంతో మంది బాగుండాలనే ఒక మంచి మనసుతో యోగా అకాడమీ పెట్టాను. యోగా పట్ల నాకు ఎంత ప్రేమ, భక్తి ఉన్నాయో నేను వేసే ఆసనాలను గమనిస్తే అర్థమవుతుంది. నేను చేసే అసనాలకు సంబంధించిన ఫొటోలు చూసి, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అయితే అలాంటి ఆసనాలు ట్రైనర్ లేకుండా ఇంట్లో ట్రై చేయకూడదు అనుభవం సంపాదించుకునేంతవరకూ ట్రైన్ సమక్షంలో చేయడమే బెటర్.యోగా చేస్తున్నవాళ్లు ఎప్పటికీ కంటిన్యూ చేయండి. చేయనివాళ్లు ఈరోజు నుంచి మొదలుపెట్టండి. మనసు, శరీరం రెండూ బాగుంటాయి. -
బిగ్బాస్2 : సంజనా అవుట్
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్ సీజన్ 2లో తొలి ఎలిమినేషన్ జరిగింది. సామాన్యుల కోటాలో ఎంట్రీ ఇచ్చిన సంజన అన్నే ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారు. బిగ్బాస్ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్బాస్ హౌజ్లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు తెలిపారు. వచ్చిన రోజు నుంచే సంజనా దురుసుగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు సంజనాను తొలి వారం ఎలిమినేషన్కు నామినేట్ చేశారు. ఓటింగ్లో ప్రేక్షకుల నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో హౌస్ నుండి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ బాబు గోగినేని, తేజస్విల మీద విమర్శలు చేశారు. బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని చెప్పింది. అది కేవలం తన అభిప్రాయమేనంటూ తెలిపారు. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలని, అందరిని సమానంగా చూస్తే బాగుంటుందని సూచించారు. ఎలిమినేట్ అయిన కంటెస్టంట్ సంజనకు బిగ్బాస్.. బిగ్ బాంబ్ ఒకరిపై ప్రయోగించే అవకాశం ఇవ్వగా, బాబు గోగినేనిపై ప్రయోగించింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా, బాబు గోగినేని వారికి అందివ్వాలి. ఎలిమినేట్ అయిన సంజన స్థానంలో నందిని రాయ్ ఎంట్రీ కానుంది. -
విజేతలు సంజన, రెనీశర్మ
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ సిరీస్లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రెనీ శర్మ విజేతలుగా నిలిచారు. కొంపల్లిలోని సురేశ్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–16 విభాగంలో రెనీశర్మ, అండర్–18 విభాగంలో సంజన టైటిళ్లను సాధించారు. శనివారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన రాధిక మహాజన్పై రెనీశర్మ విజయం సాధించింది. అండర్–18 కేటగిరీలో తెలంగాణకే చెందిన బిపాసా మోహన్పై సంజన నెగ్గింది. బాలుర విభాగంలో అఖిల్ కుమార్ (తెలంగాణ) విజేతగా నిలవగా, అశ్విన్ భట్ (కర్నాటక) రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ కృష్ణం రాజు, స్పాన్సర్ ప్రవీణ్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ సురేశ్కృష్ణ, మేనేజర్ రతన్ రావు పాల్గొన్నారు. -
సంజన శుభారంభం
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రోహన్ కుమార్ శుభారంభం చేశారు. కొంపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో రోహన్ (తెలంగాణ) 6–1, 6–4తో కుశ్ ఆర్జీ రాయ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. అండర్–18 బాలికల విభాగంలో సంజన సిరిమల్ల (తెలంగాణ) 6–2, 6–1తో రేచల్ ఏంజిల్స్ (తెలంగాణ)పై నెగ్గింది. ఇతర బాలుర మ్యాచ్ల్లో ప్రసాద్ ఇంగ్లే (మహారాష్ట్ర) 6–1, 6–1తో మోహిత్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ)పై, హితేశ్ (తెలంగాణ) 6–1, 6–0తో అనీశ్ రెడ్డి (తెలంగాణ)పై, సిద్ధార్థ్ (మహారాష్ట్ర) 6–3, 6–1తో రత్నవ్ (తెలంగాణ) పై గెలుపొందారు. బాలికల మ్యాచ్ల్లో చరిత (తెలంగాణ) 6–3, 6–3తో శ్రేష్ట (తెలంగాణ)పై, అనీష (ఆంధ్రప్రదేశ్) 6–3, 7–6తో రాధిక మహాజన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. -
క్వార్టర్స్లో సంజన
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఆలిండియా టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ముంబైలో జరుగుతోన్న ఈ టోర్నీలో అన్సీడెడ్గా బరిలోకి దిగిన సంజన క్వార్టర్స్కు చేరింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సంజన 6–3, 6–3తో పదో సీడ్ రీని సింగ్లా (హరియాణా)పై అద్భుత విజయాన్ని అందుకుంది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో 6–2, 6–0తో అమీక్ బట్ (ఒడిశా)పై, రెండో రౌండ్లో 4–6, 6–0, 6–2తో ఆరోసీడ్ బేలా టంహాంకర్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ టోర్నీలో రాష్ట్రం నుంచి 15 మంది క్రీడాకారులు బరిలోకి దిగగా... సంజన మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. -
కట్ చేస్తే...
అవును... లాంగ్ హెయిర్ని కట్ చేస్తే బాయ్కట్ అవుతుంది. గర్ల్స్ కొంతమంది ఈ బాయ్కట్ని ఇష్టపడతారు. హీరోయిన్లయితే ఇష్టం ఉన్నా లేకున్నా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే హెయిర్ కట్ చేసేస్తారు. మరి.. సంజనకు బాయ్కట్ ఇష్టమో లేదో చెప్పలేదు కానీ, పొడవాటి జుత్తుని కత్తిరించేశారు. ఇదంతా తన తాజా సినిమా కోసమే. ఇప్పటివరకూ కనిపించిన సంజన వేరు.. ఇప్పుడు కనిపించబోతున్న సంజన వేరు అన్నట్లుగా ఈ సినిమాలో ఆమె లుక్ ఉంటుందట. బాయ్ కట్లో ఆమె చాలా అందంగా ఉన్నారు కదూ! (ఇన్సెట్) ఇంతకీ ఆ సినిమా గురించి కొంచెం చెప్పమ్మా? అంటే.. ‘ఇప్పుడే చెప్పనమ్మా’ అంటున్నారు సంజన. వివరాలన్నీ సీక్రెట్గా ఉంచాలని చిత్రబృందం డిసైడ్ అయ్యారట.. మరి.. రహస్యం ఎన్నాళ్లు దాగుతుందో చూద్దాం. ఈ మూవీ తన కెరీర్లో స్పెషల్గా నిలిచిపోతుందనే నమ్మకంతో సంజన ఉన్నారట. -
గోవాలో రాజకుమారుడు
నవీన్బాబు హీరోగా సంజన, అమృత హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. హాస్యనటుడు సుమన్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షెరాజ్ దర్శకత్వంలో రమాదేవి సమర్పణలో పీవీ రాఘవులు నిర్మిస్తోన్న ఈ చిత్రం గోవాలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షెరాజ్ మాట్లాడుతూ – ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ ఉంటుంది. త్వరలో హైదరాబాద్లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టి, పాటలు, మిగతా సన్నివేశాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా–ఎడిటింగ్: ఏకరీ లక్కీ, సంగీతం–స్క్రీన్ప్లే–దర్శకత్వం: షెరాజ్. -
తెలుగులో భారీ జానపద సీరియల్
-
బాహుబలి నిర్మాతల భారీ సీరియల్
తెలుగు సినిమాగా తెరకెక్కి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా మార్కెట్ వందకోట్లు దాటడమే కష్టంగా ఉన్న సమయంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ.. తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ బుల్లితెర మీద సంచలనాలకు తెర తీసింది. బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు. వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ కోసం సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
సీరియల్ కోసం స్వారీ!
ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ టు స్మాల్ స్క్రీన్కి వెళ్లినంత మాత్రాన తారలు తక్కువైపోరు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఇవాళ టీవీ లేని ఇల్లు ఉందా? చెప్పండి. బిగ్ బి నుంచి మన చిన్న ఎన్టీఆర్ వరకూ ఫామ్లో ఉన్న స్టార్స్ అందరూ టీవీ షోస్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సంజన స్మాల్ స్క్రీన్కు అరంగేట్రం చేయనున్నారు. బుజ్జిగాడు మేడిన్ చెన్నై, సత్యమేవ జయతే, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ‘స్వర్ణ ఖడ్గం’ అనే సీరియల్లో నటించనున్నారు. ‘‘ఇండియన్ ఎపిక్ ‘బాహుబలి’ని నిర్మించిన ‘ఆర్కా మీడియా’ సంస్థ ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ సీరియల్ను నిర్మించనున్నారు. టెలివిజన్ టాప్ డైరెక్టర్ యాతా సత్యనారాయణగారు దర్శకుడు. ‘బాహుబలి’కి పని చేసిన వీఎఫ్ఎక్స్ మరియు సీజీ టీమ్ ఈ సీరియల్కు పని చేస్తున్నారు. ‘‘ఇది పీరియాడిక్ సీరియల్ కాబట్టి గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. హీరోయిన్ సెంట్రిక్ సీరియల్. 100కు పైగా ఎపిసోడ్లు ఉన్న ఈ మెగా సీరియల్లో నేను నా డ్రీమ్ రోల్ చేస్తున్నా’’ అని ‘సాక్షి’తో సంజన చెప్పారు. -
ఆసియా టెన్నిస్ చాంప్ సంజన
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ అండర్–14 చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో జరిగిన ఈ టోర్నీలో 13 ఏళ్ల సంజన చాంపియన్గా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల తుది పోరులో సంజన 6–2, 6–2తో కుంకుమ్ నీల (తెలంగాణ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్లో సంజన 6–1, 4–6, 6–0తో హిత్వీ చౌదరి (గుజరాత్)పై గెలుపొందింది. -
సెమీస్లో సంజన
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్గఢ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆమె సెమీస్కు చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సంజన 6–2, 6–3తో సుర్యాన్షి తన్వర్ (చండీగఢ్)పై గెలుపొందింది. -
సినిమాలో క్రైమ్ నడుస్తుంది..
ప్రపంచ సినిమాలో రియల్ క్రైమ్ ఇన్సిడెంట్స్ని తీసుకుని, సీక్వెల్స్గా బిల్డ్ చేసి, పెద్ద హిట్స్ అందుకున్న సంస్థలు ఉన్నాయి. యూనివర్శల్, ఫాక్స్స్టార్ వంటివి. సినిమాలో క్రైమ్ కాకుండా క్రైమ్ని సినిమాగా చూపించడం అనే శ్రీనివాసరాజు ఎక్స్పరిమెంట్ మూడు సీక్వెల్స్తో క్లోజ్. ఇది భారత సినిమాలో ‘క్రైమ్ రాయి’. ఆడవాళ్లూ జాగ్రత్త... మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారా? ఒక లేడీ తలుపు తట్టి, మంచినీళ్లు అడిగిందా? నీళ్లు ఇవ్వడానికి మీరు లోపలికి వెళితే ఘోరం జరుగుతుంది. మీ వెనకాలే ముందు ఆమె, ఆ తర్వాత ఆమె గ్యాంగ్ ఇంట్లోకి చొరబడతారు. ఇంటిని, మీ మానాన్ని దోచుకుంటారు. చివరికి మిమ్మల్ని కిరాతకంగా చంపేస్తారు. అందులో ఒకడు మరీ ఘోరమైనవాడు. పీక కోసి చంపుతాడు. పీకలోంచి రక్తం వస్తున్నప్పుడు వచ్చే శబ్దం అతనికి ఇష్టం. అక్కడ చెవి ఆన్చి, శబ్దం వింటూ ఆనందంలో మునిగిపోతాడు. ‘దండుపాళ్యం’ సినిమా గుర్తొస్తోంది కదూ! కర్నాటకలోని దండుపాళ్యకి చెందిన గ్యాంగ్ ‘దండుపాళ్య’. దోపిడీలు, హత్యలు, మానభంగాలు... ఇవే ఆ గ్యాంగ్ పని. ఈ గ్యాంగ్ పేరు వింటే అక్కడి వాళ్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2012లో దర్శకుడు శ్రీనివాసరాజు ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా తీసిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘ఇలాంటి మనుషులు ఉంటారా?’ అనుకోకుండా ఉండలేకపోయారు. ఆ తర్వాత ‘దండుపాళ్యం–2’ వచ్చింది. ఈ నెల ‘దండుపాళ్యం–3’ రాబోతోంది. ‘‘ఈ సిరీస్లో ఇదే లాస్ట్ పార్ట్. యాక్చువల్గా ఐదు పార్ట్స్ తీయాలనుకున్నాను కానీ, మూడింటితోనే ముగిస్తున్నా. రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా క్రైమ్ నేపథ్యంలో మూడు భాగాలుగా ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ ఇది’’ అన్నారు శ్రీనివాసరాజు. మూడో భాగాన్ని రజనీ తాళ్ళూరి నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ‘‘దండుపాళ్యం’ని 26 రోజుల్లో తీశాను. ఆడిందా? ఓకే! లేకపోతే? కష్టాలు తప్పవు. అందుకే రిలీజయ్యాక నా అసిస్టెంట్ని థియేటర్కి పంపించి, అసలు జనాలు ఉన్నారో లేదో చూడనమన్నాను. థియేటర్ నుంచి ఫోన్... హౌస్ఫుల్ అని. ఆ తర్వాత నేను థియేటర్కి వెళితే అక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తి ‘50 రూపాయల టికెట్ ఒక్కటే ఉంది. 150 సార్’ అన్నాడు. థియేటర్ మేనేజర్ నన్ను గుర్తుపట్టి, లోపలికి తీసుకెళ్లారు. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ పార్ట్ హిట్టవ్వడంతో సెకండ్ పార్ట్ మీద చాలా క్రేజ్ పెరిగింది. అది ఓకే అనిపించుకుంది. బోలెడన్ని అంచనాల మధ్య ఇప్పుడు థర్ట్ పార్ట్ రెడీ అయింది. ఇందులో ఏం ఉందో ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. డైరెక్టర్గా మంచి కథ చెప్పాలి కానీ, క్రైమ్ బేస్ట్ రియల్ స్టోరీని ఎందుకు తీసుకున్నారు? టికెట్స్ తెగడానికా? అసలు న్యూడ్ సీన్స్ చూపించాల్సిన అవసరం ఏంటి? అనడిగితే – ‘‘ఏ సినిమాకైనా స్టోరీ ఇంపార్టెంట్. అల్లిన కథతో తీస్తారు. లేకపోతే రియల్ స్టోరీతో తీస్తారు. నేను రెండోది సెలెక్ట్ చేసుకున్నా. రియల్ స్టోరీ తీస్తున్నప్పుడు రియల్గా జరిగినవి తీయాలి కదా’’ అన్నారు. ఏం చెప్పి పూజా గాంధీ, సంజనాలతో నగ్న దృశ్యాల్లో నటింపజేశారు? అనడిగితే – ‘‘కథ నచ్చినా న్యూడ్ సీన్స్ ఉన్నాయని పూజా గాంధీ ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ సినిమా చేయడానికి మరో నటి రమ్య ఆసక్తిగా ఉందని తెలిసి, పూజా వదలుకోకూడదనుకుంది. ‘మా అమ్మకు కథ చెబుతారా’ అనడిగింది. తల్లీకూతుళ్లిద్దరూ కథ విన్నారు. ‘ఈ సినిమా మిస్సయితే నటిగా నువ్వు చాలా కోల్పోయినట్లే’ అని తల్లి చెప్పడంతో పూజా గాంధీ ఈ సినిమా చేసింది. సెకండ్ పార్ట్లో సంజన కూడా సీన్ డిమాండ్ మేరకు చేసింది. ఆ సీన్స్ అలా తీయకపోతే సినిమా పండదు. రియల్గా జరిగినవే కాబట్టి, కాంప్రమైజ్ కాకూడదనుకున్నా. ఇలాంటి సీన్స్ తీసేటప్పుడు లొకేషన్లో తక్కువమంది ఉండేలా చూసుకుంటారు. కానీ, నేను మాత్రం యూనిట్ అంతా ఉంటారు. మీకిష్టమైతేనే చేయండి అని క్లారిటీగా చెప్పాను. వాళ్లూ చేసారు. ఈ సీన్స్ చేయాల్సిందేనని నేనెవర్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే ఇష్టపడి చేశారు’’ అని చెప్పారు. త్వరలో విడుదల కానున్న థర్డ్ పార్ట్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు –‘‘ఫస్ట్, సెకండ్ పార్ట్ కన్నా థర్డ్ పార్ట్ బీభత్సంగా ఉంటుంది. టికెట్స్ తెగుతాయనీ, కావాలనీ ఏ సీనూ పెట్టలేదు. జరిగిందే చూపించా. ఈ సిరీస్లో చివరి పార్ట్ ఇదే. ఆల్రెడీ రెండు పార్ట్స్ బాగా ఆడటంతో థర్ట్ పార్ట్కి చాలా క్రేజ్ వచ్చింది. ఈ పార్ట్తో నా ‘దండుపాళ్యం’ జర్నీ కంప్లీట్ అవుతుంది. అయితే, కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని జర్నీ ఇది’’ అని శ్రీనివాసరాజు అన్నారు. ‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, సంజన, మకరంద్ దేశ్పాండే, రవి కాలే ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: వెంకట ప్రసాద్. -
బుల్లితెర నటుల రచ్చ రచ్చ...
బెంగళూరు : కన్నడ బుల్లితెర నటులు ప్రథమ్, భువన్ మధ్య చెలరేగిన గొడవ రచ్చకెక్కింది. ఇటీవల నిద్రమాత్రలు మింగి నానా హంగామా చేసిన ప్రథమ్ తాజాగా సహ నటుడు భువన్ తొడను కొరికి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ‘నంజు మత్తు నాను’ టీవీ సీరియల్ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై భువన్ ఆదివారం రాత్రి తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నటి విషయంలో వారిద్దరు గొడవపడుతున్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. భువన్ను ఓ సీరియల్ నుంచి తొలగించడం వల్లే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ప్రథమ్ తెలిపారు. భువన్కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఆదివారం షూటింగ్ ముగిసిన తర్వాత గదిలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అక్కడ సంజన, భువన్ ఉన్నారని తనను చూసిన అతడు ఆగ్రహంతో దూషించాడని ప్రథమ్ తెలిపారు. ఓ విషయంలో భువన్ను సీరియల్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. కన్నడ బిగ్బాస్ 4 విజేత అయిన ప్రథమ్ గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. తన స్నేహితుడు లోకేశ్తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నానంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రథమ్ను సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. -
హీరోయిన్ సంజన వీడియో లీక్!
బెంగళూరు : బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ సోదరిగా నటించిన సంజన ...పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించినా అనుకున్నంతగా ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఆమె తన సొంతగడ్డపై దృష్టి సారించింది. అయితే ఒక్కసారిగా హీరోయిన్ సంజన సోషల్ మీడియాలో హాట్టాఫిక్గా మారింది. బందిపోటు దొంగల ఇతివృత్తంతో కన్నడ సినిమా ‘దండుపాళ్యం 2’ లో ఆమెపై పూర్తిగా నగ్నంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. కాగా సెన్సార్ బోర్డు ఆ సీన్స్ను కట్ చేసినప్పటికీ, కొన్ని దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దండుపాళ్యం పేరు వింటే చాలు అతి భయంకరమైన దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు దానికి సీక్వెల్ గా దండుపాళ్యం-2 తెరకెక్కింది. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా శాండిల్వుడ్లో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని, హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా శుక్రవారం (జూలై 21న) తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సంజన దండుపాళ్యం ముఠాలో సభ్యురాలిగా నటించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణలో భాగంగా సంజన దుస్తులు తొలగించి చిత్రహింసలు పెట్టే దృశ్యాలు ఆ వీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే చిత్ర దర్శకుడు శ్రీనివాస్రాజు మాత్రం ...ఆ వీడియో రియల్ కాదని, అసలా దృశ్యాలు సినిమాలోనే లేవని తెలిపారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న నటి సంజన కాదని తెలిపారు. అయితే ఈ వీడియో లీక్ వ్యవహారంపై సంజన మాత్రం పెదవి విప్పలేదు. -
నా అందానికి అదే కారణం: నటి
వైట్ఫీల్డ్(బెంగళూరు): అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుపులు మెరిపించే బహుభాష నటి సంజన అందానికి కారణమేమిటో తెలుసా.. ఆశావహ దృక్పథమేనట. నగరంలో ఒక చికెన్ ఫ్రై ఔట్లెట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె కోడిమాంసాన్ని ఆరగించారు. మీడియాతో మాట్లాడుతూ తనకు చికెన్ అంటే ఇష్టమని తెలిపారు. అయితే గ్లామర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఎంత తిన్నా ఉదయం ఎక్సర్సైజ్లు కచ్చితంగా చేస్తానన్నారు. ఆశావాద ధృక్పథం తన సౌందర్య రహస్యమని చెప్పారు. -
టైటిల్ పోరుకు సంజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 టెన్నిస్ టోర్నమెంట్లో సంజన ఫైనల్లోకి అడుగు పెట్టింది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఈ టోర్నీ జరుగుతోంది. సెమీఫైనల్లో 12 ఏళ్ల సంజన 6–3, 6–2తో టాప్ సీడ్ భక్తి షాపై సంచలన విజయాన్ని సాధించింది. ఈ టోర్నీలో క్వాలిఫయర్స్ ఆడి మెయిన్స్కు అర్హత సాధించిన సంజన తొలి రౌండ్లో 9–4తో పూర్వ రెడ్డిపై, రెండో రౌండ్లో 6–3, 6–0తో నాలుగో సీడ్ వుదులా రెడ్డిపై, క్వార్టర్స్లో 6–3, 6–3తో మూడో సీడ్ కిరణ్ రాణిపై గెలుపొందింది. -
అంతకు మించి...
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో ‘దండుపాళ్యం’కు సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ‘దండుపాళ్యం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ సూపర్హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలను రిసీవ్ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ‘దండుపాళ్యం 2’ ఓ కొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య. -
పిల్లల్ని కనడానికి లైసెన్స్ ఉండాలి
పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన అభిప్రాయపడ్డారు. తమిళం, తెలుగు, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ భామ కోలీవుడ్కు కాదల్ సెయ్వీర్ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తమిళంలో పాపులర్ అయిన నటి నిక్కీగల్రాణి సోదరి అయిన సంజన అందరిలాగా తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేశారు. తనేమంటున్నారో చూద్దాం. మోటార్ వాహనాలు నడపడానికి లైసెన్స్ ఉంటుంది. వస్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం. చాలా మంది తల్లులు పిల్లల్ని కని వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని చంకనేసుకొని అడుక్కుంటున్నారు. మరి కొందరు మహిళలు పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొందరు సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలాంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో మార్పురాదు. మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవశ్చవాల్లా పడిఉన్న అలాంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. ఇలా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అలాంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమలవ్వాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలని, అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విదించాలి అని వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొన్నారు. -
సెమీస్లో శశిధర్, సంజన
ఆసియన్ జూనియర్స్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియన్ జూనియర్స్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో కోట శశిధర్, సంజన క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన బాలుర క్వార్టర్స్లో శశిధర్ 6-2, 6-3తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొందాడు. బాలికల విభాగంలో సంజన సిరిమల్ల 6-0, 6-1తో తనీషా ప్రాంజల్పై విజయం సాధించింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్లో మనన్- ఆర్నవ్ ద్వయం 6-2, 6-2తో కార్తీక్- క్రిష్ పటేల్ జోడీపై నెగ్గగా... బాలికల విభాగంలో సృజన- ముషత్ర్ ద్వయం 6-1, 6-4తో ధమిజ- శ్రీచంద్రకళ జోడీపై గెలుపొందింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ల ఫలితాలు బాలుర సింగిల్స్: కృషన్ హుడా 6-4, 6-2తో ఆర్నవ్పై, లిస్టన్ 6-0, 6-1తో అభిజ్ఞన్పై, భూపతి శక్తివేల్ 6-0, 6-0తో దేవ్ పటేల్పై గెలిచారు. బాలికల సింగిల్స్: ధమిజ 7-6 (3), 6-2తో స్మృతి బాసిన్పై, శాంభవి 6-3, 6-2తో రిధిపై, మలైకా 6-3, 6-4తో సృజనపై విజయం సాధించారు. బాలుర డబుల్స్: ఆదిత్య- కార్తీక్ సక్సేనా ద్వయం 6-1, 6-3తో యశ్ అగర్వాల్- లోకాదిత్య వర్ధన్ జోడీపై, జై గొల్లపూడి- సిద్ధార్థ్ ద్వయం 6-4, 5-7, 10-1తో శ్రీశరణ్- అభిషేక్ జోడీపై, కృషన్- భూపతి ద్వయం 6-2, 6-4తో దేవ్- లిస్టన్ జోడీపై గెలుపొందింది. . బాలికల డబుల్స్: అభిలాష- తనీష ద్వయం 6-3, 6-4తో సారుు దియా- స్మిత జోడీపై, సృ్మతి బాసిన్- శాంభవి ద్వయం 6-0, 6-1తో ఐశ్వర్య- ఖుషీ విశ్వనాథ్ జోడీపై, అదితి- సాగరిక ద్వయం 6-4, 6-0తో స్టీషా- శైలా ఖట్టర్ జోడీపై విజయం సాధించాయి. -
ఇక్బాల్, సంజనలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: చాంపియన్షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సంజన, ఇక్బాల్ విజేతలుగా నిలిచారు. బోయిన్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇక్బాల్ మొహమ్మద్ ఖాన్ (తెలంగాణ) 6-3, 6-3తో అద్వైత్ అగర్వాల్(మహారాష్ట్ర)పై గెలుపొందగా, బాలి కల ఫైనల్లో సంజన (తెలంగాణ) 6-4, 6-3తో మృదుల పళనివేల్ (తమిళనాడు)పై నెగ్గింది. బాలుర డబుల్స్లో అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర)- యశోధన్ నక్రే (తెలంగాణ) ద్వయం 7-2తో తారకేశ్ అశోకన్ - నితిన్ అదిత్ (తమిళనాడు) జంటపై గెలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అమూల్య - ఆర్ని రెడ్డి (తెలంగాణ) ద్వయం 7-4తో మృదుల- రితిక (తమిళనాడు) జోడీపై నెగ్గి టైటిల్ను దక్కించుకుంది. -
ఆస్పత్రి నుంచి సంజన డిశ్చార్జ్
-
పాక్ నటులపై నిషేధం సబబే
సమర్థించిన శాండల్వుడ్ నటులు బెంగళూరు : ఉరీలో భారత సైనిక శిబిరంపై పాక్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ నటులను బాలీవుడ్ సినిమాల్లో నిషేధించడంతో మిశ్రమ స్పందన లభిస్తోంది. కాగా ఈ విషయంపై శాండల్వుడ్ నటీనటులు కూడా పాక్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు. కళ కంటే దేశం గొప్పది... మొదట మనమందరం భారతీయులం ఆ తరువాతనే కళాకారులం పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదేనని కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ తెలిపారు. డెరైక్టర్ పవన్ ఒడెయార్ మాట్లాడుతూ... దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులను ప్రతి ఒక్కరు మద్దుతుగా నిలబడాలని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాక్పై కఠిన చర్యలు తీసుకోవాలని, పాక్ నటులపై నిషేధం సబబేనని అన్నారు. దేశం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. పాక్ నటులపై నిషేధించడం ద్వారా సైనికులకు మద్దతు తెలపడమే మన కర్తవ్యమని ప్రముఖ హీరోయిన్ సంజన తెలిపారు. అదేవిధంగా మరో హీరో చేతన్, నిర్మాత ఎం.ఎస్.రమేశ్ తదితరులు పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని సమర్థించారు. -
మెరుగుపడుతున్న సంజనా ఆరోగ్యం
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని కామినేని వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని సంజనా తల్లిదండ్రులు గురువారం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్పేట వద్ద రోడ్డు దాటుతున్న సంజనతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడుపుతున్న యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సంజనాతోపాటు ఆమె తల్లీ తీవ్రంగా గాయపడింది. దీంతో వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు యువకులు బెయిల్ పై విడుదలయ్యారు. దాంతో వారి బెయిల్ రద్దు చేయాలని హయత్ నగర్ పోలీసులను సంజనా తల్లిదండ్రులు కోరారు. -
మెరుగవుతున్న సంజన ఆరోగ్యం
పెద్దఅంబర్పేట్ వద్ద ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజన క్రమంగా కోలుకుంటోంది. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజనకు బుధవారం వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు కృత్రిమ శ్వాస అవసరం లేదని చెప్పారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తల్లి శ్రీదేవి ఆరోగ్యం కూడా మెరుగవుతోందని డాక్టర్లు వెల్లడించారు. -
క్రమంగా కోలుకుంటున్న సంజనా
హైదరాబాద్ : పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని కామినేని వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆమె ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్పేట వద్ద సంజనాతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడిపి... యువకులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంజనాతోపాటు ఆమె తల్లీ కూడా తీవ్రంగా గాయపడింది. వీరు ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సంజనాను కారు ఢీకొట్టడంతో ఆమె తాతయ్యకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఇంకా విషమంగానే సంజన ఆరోగ్యం: వైద్యులు
-
విషమంగానే సంజన ఆరోగ్యం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆమెకు వెంటిలేటర్పైనే చికిత్స కొనసాగిస్తున్నట్లు కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె తల్లి శ్రీదేవి పరిస్థితి మెరుగవుతున్నట్లు వెల్లడించారు. -
వెంటిలేటర్పైనే చిన్నారి సంజన
-
వెంటిలేటర్పైనే చిన్నారి సంజన
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి సంజనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు కామినేని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, సంజన తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రమాదం ఏమీ లేదు కానీ, పక్కటెముకలు విరగటంతో ఆమె ఇబ్బంది పడుతోందని వెల్లడించారు. త్వరలోనే ఆమె కోలుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం తల్లీబిడ్డకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
సంజన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ : ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన బ్రెయిన్ డెడ్ కాలేదని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్లో సంజన, ఆమె తల్లి శ్రీదేవికి సంబంధించిన ఆరోగ్యంపై కామినేని ఆసుపత్రి వైద్యులు బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సంజన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. వెంటిలేషన్పై వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సంజనకు ఎంఆర్ఐ స్కాన్ తీశామాని చెప్పారు. వచ్చిన నివేదికలో బ్రెయిన్లో రక్తం చేరిందన్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పాలేమని వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ ప్రత్యేక కోటాలో సంజన, ఆమె తల్లీ శ్రీదేవికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అయితే తల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రమాదం ఏమీ లేదన్నారు. -
సంజనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలై కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికూతుళ్లు... శ్రీదేవి, సంజనలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన తాతయ్య నరేందర్ను కూడా సీతారాములు పరామర్శించారు. సంజన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. యువకులు తప్పతాగి వాహనం నడుపుతూ సమయంలో రోడ్డు దాటుతున్న తల్లీకుమార్తెలు శ్రీదేవి, సంజనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంజనకు తీవ్ర గాయాల వార్త విన్న ఆమె తాతయ్య గుండె నొప్పితో కుప్పకూలారు. దీంతో ఆయన్ని కూడా కామినేని ఆసుపత్రికి తరలించారు. -
ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్యం
-
విషమంగానే సంజన ఆరోగ్యం
ప్రమాద వార్త తెలిసి ఆమె తాతకు గుండె నొప్పి హైదరాబాద్: ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్లోని పెద్దఅంబర్పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లి శ్రీదేవిని కూడా మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. మనవరాలిని, కుమార్తెను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేక శ్రీదేవి తండ్రి నరేందర్ ఛాతీలో నొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. ఇక సంజన పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పలేమని, శ్రీదేవికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు శ్రీదేవి భర్త శివానంద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వీరిద్దరికీ ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. కాగా ఆక్సిడెంటుకు కారణమైన నిందితులకు పూచీకత్తుపై బెయిల్ లభించింది. మరో ఇద్దరి అరెస్ట్: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్లను మంగళవారం హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటరమణను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మిగతా ఇద్దరూ వెంకటరమణను మద్యం తాగేందుకు ప్రేరేపించి ప్రమాదానికి కారణమయ్యారని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
'నా కూతురు విషయంలో న్యాయం జరగలేదు'
హైదరాబాద్: పెద్దఅంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీదేవి, సంజనలను చిన్నారి రమ్య వెంకటరమణ పరామర్శించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన కూతురు విషయంలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చట్టాలు తేవాలని ఆయన డిమాండ్ చేశారు. జులై 1న కొంతమంది యువకులు మద్యం మత్తులో కారు నడిపి బంజారాహిల్స్ లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యతో పాటు ఆమె తాత, బాబాయ్ల మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న నిందితుడు శ్రావిల్కు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంజన కుటుంబానికి కష్టాలు
-
సంజన కేసులో మరో ఇద్దరి అరెస్టు
హయత్నగర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు దాటుతున్న చిన్నారి సంజనను, ఆమె తల్లిని మృత్యుముఖంలోకి నెట్టేసిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు కారులో ఉన్న యాదిరెడ్డి, శ్రీనివాసరెడ్డిని కూడా మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కాగా, చిన్నారి సంజన, ఆమె తల్లి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
-
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
♦ మద్యం మత్తులో తల్లీకూతుళ్లను ఢీకొట్టిన యువకులు ♦ గాంధీ జయంతి రోజున హైదరాబాద్లో దారుణం ♦ బ్రెయిన్డెడ్ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సంజన ♦ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న తల్లి శ్రీదేవి ♦ నిందితుల్లో ఒకరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ మరో కుటుంబంలో చీకట్లు నింపింది. గాంధీ జయంతి రోజునే తప్పతాగి కారు నడుపుతున్న కొందరు యువకుల సరదా ఐదేళ్ల చిన్నారికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడగా.. చిన్నారి బ్రెయిన్డెడ్ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వారిలో ఒకరిని సోమవారం రాత్రి అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొందరు యువకులు మద్యం మత్తులో వాహనం నడిపి బంజారాహిల్స్లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యను బలి తీసుకున్న ఉదంతం పూర్తిగా మరువకముందే ఈ దుర్ఘటన జరగడం విషాదకరం. పుట్టింటికని వెళుతూ.. సికింద్రాబాద్లోని మౌలాలి ప్రశాంత్నగర్లో నివసించే ఎస్వీ శివానంద్ స్థానికంగా బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య శ్రీదేవి, కుమార్తెలు ప్రవళిక, సంజన. దసరా సెలవులు రావడంతో శ్రీదేవి ఆదివారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలతో పసుమాములలో కళానగర్లోని పుట్టింటికి బయలుదేరింది. పెద్ద అంబర్పేట వద్ద రాత్రి 9 గంటల సమయంలో వారు బస్సు దిగారు. శ్రీదేవి సంజనను ఎత్తుకుంది, పక్కన ప్రవళికతో కలసి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన సాంత్రో కారు (ఏపీ29 ఎన్ 5799) వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీదేవి, సంజన తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా రోడ్డు దాటిన ప్రవళిక త్రుటిలో తప్పించుకుంది. వారిని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటపడి ఆపారు. కారు తాళం చెవులు లాక్కుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ హడావుడిలోనే కారులోని ముగ్గురు యువకులు తప్పించుకుని పారిపోయారు. స్థానికులు శ్రీదేవి, సంజనలను హయత్నగర్లోని సన్రైజ్ ఆసుపత్రిలో చేర్చారు. సంజన పరిస్థితి విషమంగా మారడంతో ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఒక నిందితుడు అరెస్టు కారులో ఉన్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మత్తులో ఉండడమే కాదు.. కారు నడుపుతూ సైతం వారు మద్యం తాగినట్లు గుర్తించారు. ఆ కారులో మద్యం కలిపిన నీళ్ల బాటిల్తో పాటు తినుబండారాలు, గ్లాసులు లభించాయి. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిం దితుల్లో ఒకరైన వెంకటరమణ (38)ను హయత్నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హయత్నగర్లోని భాగ్యలత కాలనీలో నివాసముండే వెంకటరమణ మాదాపూర్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను కొత్తపేట్లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహించే యాదిరెడ్డి, ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్లతో కలసి కారులో బాటసింగారం పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ముందుగా కొని పెట్టుకున్న మద్యం సీసాలను తమ వెంట తీసుకెళ్లారు. రాత్రి వరకు అక్కడే గడిపిన వారు.. తిరిగి వచ్చే ముందు, కారులోనూ మద్యం తాగారు. ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తుండగా రాత్రి 9 గంటలకు పెద్ద అంబర్పేట్ వద్ద తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 109లతోపాటు మోటార్ వెహికిల్ యాక్ట్ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ భాస్కర్గౌడ్ తెలిపా రు. మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కారులో దొరికిన సీసాలను ల్యాబ్కు పంపించి పరీక్షిస్తామని చెప్పారు. బ్రెయిన్డెడ్ స్థితిలో చిన్నారి ఈ దుర్ఘటనలో సంజనకు తల, తుంటి, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సంజన బ్రెయిన్డెడ్ స్థితికి చేరిందని, పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక కడుపు, ఛాతీ, తలకు తీవ్ర గాయాలైన శ్రీదేవి సన్రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులంతా ఆవేదనలో మునిగిపోయారు. సంజనకు చికిత్స నిమిత్తం రోజుకు రూ.30 వేలకుపైగా అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. నిరుపేదలైన చిన్నారి తల్లిదండ్రులు అంత సొమ్ము చెల్లించలేరని బంధువులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. -
తరుణ్, సంజనలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్షిప్ సిరీస్ టోర్నమెంట్లో తరుణ్, సంజన విజేతలుగా నిలిచారు. బోయిన్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో సోమవారం జరిగిన అండర్-16 బాలుర ఫైనల్లో తరుణ్ కర్ర (డీఎఫ్) 5-4 (7/3), 4-1తో సాహిల్పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో సంజన (డీఎఫ్) 4-2, 5-3తో సుజనను ఓడించి టైటిల్ను దక్కించుకుంది. మరోవైపు బాలుర డబుల్స్ విభాగంలో తరుణ్- సుహిత్ ద్వయం 7-0, 2-4 (10/3)తో ఆదిత్య-యశోధన్పై విజయం సాధించగా... బాలికల విభాగంలో అమూల్య- తనూజ జోడి 7-7 (8-6)తో ఆర్ని రెడ్డి- వేద ప్రపూర్ణ జంటపై నెగ్గి విజేతలుగా నిలిచారు. -
ఆ రోజు ఏం జరిగింది?
సంజన ప్రధాన పాత్రలో శ్రీనందన్ మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘హ్యాపీ బర్త్డే’. శ్రీధర్, జ్యోతీసేథీ, శ్రవణ్ ఇతర ముఖ్య పాత్రలు చేశారు. పల్లెల వీరారెడ్డి దర్శకత్వం వహించారు. సంతోష్ రెడ్డి స్వరపరచిన ఈ చిత్రం పాటల విడుదల వేడుకలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ గువ్వల బాలరాజు, దర్శకుడు బి.గోపాల్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని మేయర్ బొంతు రామ్మోహన్ విడుదల చేశారు. ‘‘మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటారని భావిస్తున్నాం’’ అని నటుడు శ్రీధర్ అన్నారు. ‘‘యథార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఓ ఇంట్లో రాత్రి పుట్టినరోజు జరుపుకున్న జంటకు ఎదురైన సంఘటనలతో రూపొందించాం’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘కథా కథనం ఆసక్తికరంగా ఉంటాయి’’ అని నిర్మాత మహేశ్ కల్లె అన్నారు. -
ఆ గ్యాంగ్తో పెట్టుకుంటే అంతే సంగతి!
వాళ్లు మొత్తం తొమ్మిది మంది. ఆడ, మగ ఉన్న ఆ గ్యాంగ్ అంటే అందరికీ హడల్. ఊరి మీద పడి, కంటికి నచ్చిన ఆడవాళ్లను రేప్ చేయడం, ఆ తర్వాత చంపడం, దొంగతనాలు చేయడం మగవాళ్ల డ్యూటీ. వీళ్లకి దీటుగా గ్యాంగ్లో ఉన్న ఆడవాళ్లు దోపిడీలు చేస్తుంటారు. కర్ణాటకకు చెందిన ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం ‘దండుపాళ్యం 2’. సినిమాలో కీలక తారల పాత్రలన్నీ డీ-గ్లామరైజ్డ్గానే ఉంటాయి. ఆల్రెడీ మొదటి భాగంలో పూజా గాంధీని చూసినవాళ్లు ఆశ్చర్యపోయారు. రెండో భాగంలో ఈమెతో పాటు ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ ఫేం సంజన కూడా నటిస్తున్నారు. ఇప్పటివరకూ చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపించిన సంజన ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా డీ-గ్లామరస్గా కనిపించనుండటం విశేషం. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్లో చిత్రీకరించిన సీన్స్ హైలైట్గా నిలుస్తాయి. ఇది సీక్వెల్ సీజన్ అనిపిస్తోంది. ‘బాహుబలి-2’, ‘రోబో’ సీక్వెల్ రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సినిమా సీక్వెల్ కూడా రూపొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ ఉత్కంఠగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. -
తాను లేకున్నా.. ఐదుగురికి ప్రాణం పోసింది
బెంగళూరు: ఇంజనీర్ కావాలని కలలు కంది. కల సాకారం కాకుండానే చిన్న వయసులోనే కనుమూసింది. ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తాను ఈ లోకంలో లేకున్నా అవయవదానం చేయడం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చి సజీవంగా బతుకుతోంది కర్ణాటకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని సంజన (18). బ్రెయిన్ డెడ్ అయిన సంజన అవయవాలను తల్లిదండ్రుల అనుమతితో దానం చేశారు. సంజన గుండెను కోయంబత్తూరుకు చెందిన శివన్ (30) అనే వ్యక్తికి అమర్చారు. సంజన గుండెను బెంగళూరు నగరంలో కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బొమ్మసంద్ర నారాయణ హెల్త్ సిటీకి తీసుకెళ్లడానికి పోలీసు అధికారులు సహకరించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో కేవలం 28 నిమిషాల్లో 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండెను సురక్షితంగా చేర్చారు. శివన్ కు గుండెను దానం చేయకుంటే మరో పది రోజులు మాత్రమే బతికేవాడని వైద్యులు తెలిపారు. సంజన కళ్లు, కాలేయం, కిడ్నీలను మరో నలుగురు రోగులకు దానం చేశారు. బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల మహిళకు కాలేయం, కిడ్నీ దానం చేశారు. మరో పేషెంట్కు ఇంకో కిడ్నీ, మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు. హసన్కు చెందిన సంజన ఈ నెల 21న మైసూర్ కేఆర్ఎస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హాసన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజన అవయవాలను దానం చేయాలని వైద్యులు ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. వైద్యుల సలహా మేరకు ఆమెను బెంగళూరులోని కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. సంజన మరణించినా ఆమె అవయవాలను దానం చేయడంతో మరో ఐదుగురి రూపంలో బతికే ఉంటుందని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైస్ చైర్మన్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ కే వెంకటరమణ అన్నారు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన సంజన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన హసన్ డాక్టర్లకు, బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు. -
సినీతారల డైరీ సీక్రెట్స్
పొద్దుటి నుంచి పొద్దెక్కే దాకా సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఒక్కసారి రోజులో మనం చేసిన విషయాలన్నీ తీరిగ్గా కూర్చొని గుర్తు చేసుకుంటూ సరిగ్గా సమీక్షించుకుంటే.. మరుసటి రోజు నుంచి మనలో వచ్చే మార్పు మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. తప్పనిసరిగా మన తప్పుల్ని తగ్గిస్తుంది. దీనికి మనం పెద్దగా ఏం చేయాల్సిందేమీ లేదు. డైరీ రాస్తే చాలంటున్నారు నిపుణులు. అందుకేనేమో కొత్త ఏడాది ప్రారంభమవుతుందంటే చాలా మంది ఆలోచించే కొత్త విషయాల్లో డైరీ రాయడం కూడా ఒకటి అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో డైరీ రైటింగ్ గురించి సినిమా సెలబ్రిటీలు ‘సాక్షి’తో పంచుకున్న స్వీయానుభవాలివి. - శిరీష చల్లపల్లి... రాసేస్తే రిలీఫ్ చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటుంది. ఇప్పటికీ రోజూ డైరీ రాసేందుకు ఇష్టపడతాను. అయితే పాత డైరీలు దాచుకోను. ఏడాది గడిచాక డైరీ ఒక్కసారి చదువుకొని పడేస్తాను. ఎందుకంటే అవి నాకు కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. స్కూల్ ఏజ్లో నేను డైరీ రాయడంలో అంత ఆనెస్ట్గా ఉండేదాన్ని కాదు. కానీ ఏళ్లు గడిచే కొద్దీ డైరీతో నిజాయతీగా ఉండటం అలవాటు చేసుకున్నాను. మూడ్ బాగోలేనప్పుడు నాకు డైరీ చాలా రిలీఫ్ ఇస్తుందని రియలైజ్ అయ్యాను. అందుకే ఇప్పటికీ అప్పుడప్పుడు డైరీ రాస్తుంటాను. మనం ఇతరులతో షేర్ చేసుకున్న విషయాలైనా కొంత వరకు మరచిపోతాం... కానీ, డైరీలో రాసుకున్న ప్రతి విషయం మనకు గుర్తుంటుంది. అవి గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఐ లవ్ రైటింగ్ డైరీ. - అర్చన( వేద) డిజైన్ చేసేదాన్ని... ఆరో తరగతి నుంచి పర్సనల్ డైరీ రాయడమంటే నాకొక క్రేజ్ లాంటిది. ఆ ఏజ్లో పెద్దగా దాచిపెట్టుకోవాల్సిన సీక్రెట్స్ ఏవీ లేకపోయినా అదో ఫ్యాషన్గా ఫీల్ అయ్యేదాన్ని. క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఫొటోలు కట్ చేసి అతికించి వాళ్ల గురించి నాకున్న ఫీలింగ్స్ వాటి కింద రాసి గ్లిట్టేర్ పెన్స్, ఫర్ఫ్యూమ్ పెన్స్తో డిజైన్లతో పేజీని అందంగా డెకరేట్ చేసి చూసుకొని మురిసి పోయేదాన్ని. ఆ డైరీలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ఎప్పుడైనా సరదాగా వాటిని తీసి చూసుకొని మురిసి పోతుంటాను. స్కూల్ గర్ల్ ఏజ్ నుంచి డ్రీమ్ గర్ల్ ఏజ్కు రాగానే ఫ్రెండ్స్తో, అమ్మతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అప్పుడు కొన్ని రోజులు రిస్క్ ఎందుకులే అనిపించి రాయడం మానుకున్నాను. - సంజన కంటిన్యూగా రాయలేను.. చిన్నప్పుడంటే స్కూల్ డైరీ రాసేవాడిని. ఆ తర్వాత సీరియస్గా అయితే డైరీ రాసే అలవాటు లేదు. ఎక్కువగా ఫీలింగ్స్, డైలీ షెడ్యూల్స్ రాసుకోవడానికే కదా డైరీ. కానీ చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ రాత్రి కనీసం గంట సేపయినా ఫ్యామిలీతో కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేసి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోవడం అలవాటు. అందుకేనేమో ఇప్పటివరకు డైరీ రాసే అవసరం రాలేదు. కానీ ఎవరైనా డైరీ ఇంపార్టెన్స్ గురించి బాగా చెబితే అప్పటికప్పుడు ఇన్స్పైర్ అయిపోయి.. వెంటనే కొత్త డైరీ తెచ్చుకొని అర్జంటుగా అన్నీ గుర్తు తెచ్చేసుకొని మరీ డైరీలో నింపేస్తుంటా. అయితే అది రెండు మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత అది పెట్టిన చోటే ఉండి పోతుంది. మళ్లీ ఎప్పడో అది తవ్వకాల్లో బయట పడినప్పుడు చదువుకొని మురిసిపోతాను. మంచో, చెడో.. ఎవరిదైనా పర్సనల్ డైరీ పొరపాటున నాచేతిలో పడితే చదివేస్తాను. ఫోన్ మెసేజ్లు కూడా అంతే. టకటకా చదివేస్తాను. అలా తెలిసినా కానీ ఎవరినీ టీజ్ చేయను. ఫన్ లవింగ్ గాయ్ని అయినా ఇట్లాంటి విషయాల్లో ఫీలింగ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో.. అందులోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కామ్గా చదివి, వాళ్లను ఆ విషయాలను ఎప్పుడూ అడగకుండా, నాకు ఆ విషయం తెలుసని వాళ్లకు తెలియకుండా.. వారు ఎప్పుడైనా ఆ విషయాలు షేర్ చేస్తారా అని ఎదురు చూస్తానంతే. - నందు -
సంజనకు పవన్కళ్యాణ్ గోల్డెన్ఆఫర్
-
ఆ క్రెడిట్ టాలీవుడ్దే..
సంజన.. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా వయ్యారాలు పోయిన ఈ భామ.. కన్నడలో బిజీ నటిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను అడపాదడపా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఓ ఇంటిదయ్యింది. అలాగని ఇల్లాలయిపోయిందని ఫిక్సయిపోకండి. ఓ అందమైన ఫ్లాట్కు ఓనర్ అయిందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సంజన తన మూవీ ముచ్చట్లు, కొత్తింటి అచ్చట్లు సీటీప్లస్తో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. - శిరీష చల్లపల్లి మాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్గా కనిపించాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్ ఫీల్డ్లోకి ఎంటరయ్యాను. సినిమాల్లోకి రాకముందు జాన్ అబ్రహంతో ఫాస్ట్ట్రాక్ గ్లాసెస్ యాడ్లో నటించాను. ఆ యాడ్ చూసి పూరి జగన్నాథ్ నన్ను పిలిపించారు. తను తీయబోయే ‘బుజ్జిగాడు’లో మంచి రోల్ ఉందని చెప్పారు. అందులో ‘త్రిష చెల్లిగా నువ్వయితేనే కరెక్ట’ని ఆఫర్ చేశారు. వెంటనే ఓకే చెప్పేశాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ సెవెంటీన్. ఆ సినిమా కోసమే నేను మొదటిసారి హైదరాబాద్కు వచ్చాను. అప్పటికీ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. పూరి గారు నాకు కొత్త లోకాన్ని పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే నాకో కొత్త లైఫ్ అందించారు. అంతకుముందు తమిళం, కన్నడంలో కొన్ని సినిమాలు చేసినా.. బుజ్జిగాడు మంచి బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్లో సక్సెస్ తర్వాత శాండిల్వుడ్లో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ కన్నడలో ప్రధాన నటి కావడానికి కారణం టాలీవుడే. మై డ్రీమ్ హోమ్.. ఈవెంట్స్, ఇనాగరేషన్స్, మూవీస్.. ప్రస్తుతం బిజీగానే ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్నీ ఫాలో అవుతున్నాను. అందుకే బెంగళూరూలో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యే అందులోకి వెళ్లాం. చిన్నప్పటి నుంచి నాకో డ్రీమ్ హోమ్ ఉండేది. న్యూ ఫ్లాట్లో కూడా ఫర్నిచర్, ఆర్కిటెక్చర్.. ఇలా ప్రతిదీ నా ఊహాసౌధాన్ని మరపించేలా ప్లాన్ చేసుకున్నాను. నేను రోజూ వెళ్లే యోగా సెంటర్, జిమ్ సెంటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గర. ప్రజెంట్ నా డ్రీమ్ హోమ్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాను. షాపింగ్స్.. హ్యాంగౌట్స్. పేరుకు బెంగళూరువాసినైనా.. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. తర చూ ఈ సిటీ విజిట్ చేస్తుంటాను. వచ్చిన ప్రతిసారీ కనీసం రెండుమూడ్రోజులు స్టే చేస్తాను. ఫ్రెండ్స్తో కలసి సరదాగా షాపింగ్, హ్యాంగౌట్స్కి వెళ్తుంటాను. ప్రస్తుతం కన్నడలో 5 సినిమాలు చేస్తున్నాను. తెలుగులో అవును-2 సినిమాలో నటిస్తున్నాను. -
సంజన పదనిస
సినీ నటి సంజన జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 36లో సందడి చేసింది. ఫ్యాషన్రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్న నగరంలో... కొత్తగా ఏర్పాటైన ‘శాప్హైర్’ స్పాను ఆమె శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బ్యూటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సేవలందిస్తూ.. హైదరాబాద్ మెట్రో నగరాలకు దీటుగా నిలుస్తోందన్నారు.నేటి బిజీ లైఫ్లో సాంత్వన పొందడానికి స్పాలు ఎంతో ఉపయోగపడతాయని, గ్లామర్ ప్రపంచంలో అందంగా కనిపించడానికి బ్యూటీ సెలూన్స్, స్పాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. -
లిమ్కా బుక్లో సంజన!
వంద గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కగలుగుతారా? అనడిగితే చేతులెత్తేసేవాళ్ల జాబితానే ఎక్కువగా ఉంటుంది. మరి.. అన్నేసి గంటలంటే మాటలా? కంటిన్యూస్గా గంటసేపు తొక్కితేనే నీరసపడిపోతాం. బాగా సత్తా ఉన్నవాళ్లనుకోండి... ఇంకొన్ని గంటలు తొక్కగలుగుతారు. కానీ, 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కడం అంటే సాహసమే. కన్నడ భామ సంజన ఆ సాహసం చేశారు. అయ్యో.. గులాబీ బాలకు ఎందుకీ కష్టం అని ఆమె అభిమానులు అనుకోవచ్చు. కానీ, సంజన సవాల్గా తీసుకుని రంగంలోకి దిగారు. ఓ సైక్లింగ్ గ్రూప్తో కలిసి ఆమె ఈ సవాల్ని స్వీకరించారు. 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించడం కోసమే సంజన ఈ సైకిల్ ప్రయాణం చేశారు... అనుకున్నది సాధించారు. -
అనిల్కపూర్తో ఓ సెల్ఫీ...
అదేదో సినిమాలో హీరో ‘కంచుకట్ల వారి పట్ల’తో భామలను తన వెంట తిప్పుకుంటాడు. శాండల్వుడ్ భామ సంజన వరస చూస్తుంటే అలానే ఉంది. హీరోలను బుట్టలో వేసుకొనే కిటుకులు అమ్మడికి బాగా తెలిసినట్టున్నాయి. నిన్న గాక మొన్న హీరో తమిళ హీరో శింబును అతని పుట్టిన రోజు సందర్భంగా ‘ట్వీట్స్’తో ఆకాశానికెత్తేసిన సంజన... నేడు బాలీవుడ్ స్టార్ అనిల్కపూర్తో ఓ సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులే కాదు... ఇండస్ట్రీ పీపుల్ కూడా కాస్తంత ఆశ్చర్యపోయారు. అసలు అనిల్ను ఎందుకు కలిసిందన్నది చెప్పలేదు గానీ... ‘లెజండ్ అనిల్ కపూర్తో కప్పు కాఫీ... కాసిన్ని కబుర్లు పంచుకున్న అద్భుతమైన మార్నింగ్’ అంటూ ట్వీటిందీ చిన్నది! -
కల్లు తాగుతూ కెమెరాకు చిక్కిన హీరోయిన్
హీరోయిన్ సంజన గుర్తుందా? ‘బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సంజన ఓ విషయంలో హాట్ టాపిక్ అయింది. సంజన కల్లు తాగుతున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె కల్లు ఎంతో ఇష్టంగా తాగుతున్నట్లు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది. సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించే కల్లు కాబట్టి హెల్త్కి మంచిదే అని తన సన్నిహితులతో చెబుతోందట. ప్రస్తుతం ఆమె తెలుగులో శివ కేశవ్, వన్స్ అపానె టైం, సరదా, అవును 2 చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలో రెబల్, బెంగులూరు 23, మళయాలంలో ఓ సినిమా చేస్తోంది. -
ఏదో ఒకటి లేమ్మా!
వచ్చిన అవకాశాలేవీ వదులుకొనేలా లేదు ముద్దు గుమ్మ సంజన. తెలుగువారికి పరిచితురాలైన ఈ అమ్మడు.. ఇప్పుడు కన్నడ చిత్రం ‘మై డార్లింగ్’లో సెక్సీ ఐటెమ్ గాళ్గా చేయబోతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో గౌరీష్ అక్కీ దీన్ని నిర్మిస్తున్నాడు. సంజన ఇందులో సినిమా హీరోయిన్గా చేస్తోందన్న రూమర్లు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ.. తనది ఐటెమ్ గాళ్ రోల్ అంటూ చెప్పింది సంజన. అయితే పాత్ర ఎంతో హుందాగా, మలైకా అరోరా ఖాన్ కెరీర్కు దగ్గరగా ఉంటుందని తెలిపింది. -
అద్దంలో అందగత్తె
కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు మిస్సవుతున్న నటి సంజన కొత్తగా బిజెనెస్ రంగంలోకి కాలుపెట్టింది. హెయిర్ స్టైల్స్, మేకప్, సౌందర్య సేవలందించే సెలూన్ వ్యాపారంలో అడుగిడింది. ప్రముఖ సెలూన్ సంస్థ మిర్రర్లో భాగస్వామ్యం తీసుకుని వ్యాపార విస్తరణలో మునిగిపోతోంది. మిర్రర్ బ్యూటీ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ మెరిపించింది. ఈ సందర్భంగా కాసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘తెలుగు అంటే చాలా ఇష్టం. ఇక్కడి పరిశ్రమ ఎంతో ప్రోత్సహించింది. టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. కన్నడ, మళయాళంలో హిట్లున్నాయి. త్వరలో తెలుగులో ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో సరదా సినిమాలో నటించబోతున్నా. ఎప్పటికీ తెలుగు పరిశ్రమను వదలిపెట్టను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తా. బ్యూటీ అనేది క్రియేటివిటీకి అవకాశం ఉన్న రంగం. నాకు చాలా ఆసక్తి. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు రాబిన్ స్లేటర్ వద్ద బ్యూటీ టిప్స్ నేర్చుకున్నా. ఆ స్థాయి నిపుణులు మనకు అవసరం. -
‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు
అగ్రజ యూనిట్పై నటి సంజన మండిపాటు సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్వుడ్ నటుడు జగ్గేష్ నటించిన అగ్రజ సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైన రోజునే సినిమా వివాదం సృష్టించింది. అగ్రజ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్ర యూనిట్ చూపించిందని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని హీరోయిన్గా కనిపించిన సంజన పేర్కొన్నారు. వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్లో సంజన పేర్కొన్నారు. ఇక సంజన ఆరోపణలపై అగ్రజ సినిమా దర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ...‘చిత్రకథ, ఇందులో సంజనపై చిత్రించనున్న దృశ్యాలు తదితర అన్ని వివరాలు చెప్పే చిత్రీకరించాం. ఇందులో మేం ఎలాంటి మోసానికి పాల్పడలేదు’ అని పేర్కొన్నారు. -
‘ఆ’ సన్నివేశాల్లో ఉన్నది నేను కాదు
అగ్రజ యూనిట్పై నటి సంజన మండిపాటు బెంగళూరు : ప్రముఖ శాండల్వుడ్ నటుడు జగ్గేష్ నటించిన అగ్రజ సినిమా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే విడుదలైన రోజునే సినిమా వివాదం సృష్టించింది. అగ్రజ సినిమాలోని కొన్ని అశ్లీల సన్నివేశాల్లో ఉన్నది తానే అన్నట్లుగా చిత్ర యూనిట్ చూపించిందని, అయితే ఆ సన్నివేశాల్లో ఉన్నది తాను కాదని హీరోయిన్గా కనిపించిన సంజన పేర్కొన్నారు. వేరొకరితో ఆ సన్నివేశాలు చిత్రీకరించి, అందులో ఉన్నది తానేనన్నట్లుగా చూపించడం ఎంతగానో బాధించిందంటూ తన ట్విట్టర్ అకౌంట్లో సంజన పేర్కొన్నారు. ఇక సంజన ఆరోపణలపై అగ్రజ సినిమా దర్శకుడు శ్రీనందన్ స్పందిస్తూ...‘చిత్రకథ, ఇందులో సంజనపై చిత్రించనున్న దృశ్యాలు తదితర అన్ని వివరాలు చెప్పే చిత్రీకరించాం. ఇందులో మేం ఎలాంటి మోసానికి పాల్పడలేదు’ అని పేర్కొన్నారు. -
ఫైనల్లో సంస్కృతి, సంజన
ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ జింఖానా, న్యూస్లైన్: ఆస్టర్ మైండ్స్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-12 బాలికల విభాగంలో సంస్కృతి, సంజన ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో సంస్కృతి 8-0తో ప్రాచిపై గెలుపొందగా, సంజన 8-2తో శ్రీహర్షితపై నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. అండర్-14 బాలికల విభాగంలో సంస్కృతి 6-2తో సృజనపై నెగ్గి సెమీస్కు చేరుకుంది. మరో మ్యాచ్లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-1తో అర్చిత రెడ్డిపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో శశిప్రీతమ్ 7-6 (7/5)తో వరుణ్ కుమార్పై గెలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాడు. తనతో పాటు చెన్నాడి సాహిల్ 7-4తో అర్జున్ రెడ్డిపై, తనిష్క్ 7-6తో సుహిత్ రెడ్డిపై నెగ్గి సెమీస్కు చేరుకున్నారు. అండర్-12 బాలుర విభాగం క్వార్టర్ఫైనల్లో అన్నే ఆకాశ్ 7-5తో శశిధర్పై, కార్తీక్ నీల్ 7-2తో అనికేత్పై, తన్మయ్ 7-6తో కౌషిక్ కుమార్ రెడ్డిపై గెలిచారు. అండర్-10 విభాగంలో కార్తీక్ నీల్ 7-2తో ముకుంద్ రెడ్డిని ఓడించగా, సిద్ధార్థ్ రెడ్డి 7-0తో జయ్ కృష్ణపాల్పై గెలిచాడు. రుషికేశ్ 7-0తో యశ్వంత్ చౌదరిని, వర్షిత్ కుమార్ 7-6తో ప్రతినవ్ను ఓడించారు. -
క్లబ్బులో ‘సంజన’
-
నిర్మాత నాగరాజు 'అసంబద్ధ కోరికలు' కోరారు: సంజన
టాలీవుడ్ హీరోయిన్ సంజన మరో వివాదానికి తెరతీసింది. తాజాగా తాను నటిస్తున్న శివ కేశవ్ సినిమా నిర్మాత తనను కొన్ని 'అసంబద్ధమైన కోరికలు' కోరారని ఆమె ఆరోపించింది. ఇటీవల జరిగిన శివకేశవ్ ఆడియో ఫంక్షన్కు కూడా సంజనను నిర్మాతలు ఆహ్వానించలేదని తెలిసింది. అయితే, నిర్మాత తనను కోరిన కొన్ని 'అసంబద్ధ కోరిక'లను తాను తీర్చనందుకే తనను పిలవలేదని సంజన ఆరోపించింది. ఈ ఆరోపణలను చిత్ర నిర్మాత నాగరాజు ఖండించారు. అయితే.. నిర్మాత కోరినట్లు చెబుతున్న ఆ 'అసంబద్ధ కోరికలు' ఏంటో స్పష్టంగా తెలియకపోయినా, సంజనకు సన్నిహిత వర్గాలు మాత్రం ఈ విషయాన్ని పలువురి దృష్టికి తెచ్చయి. ''వాళ్లు ఏం కోరారన్న విషయాన్ని బయటపెట్టే మూడ్ సంజనకు లేదు. ఆమె సాధారణంగా ఎక్కడికెళ్లినా ఆమె తల్లి కూడా తోడు ఉంటుంది, అయితే ఈసారి మాత్రం కొంత సమస్య ఉన్నట్లు తెలిసి తన తండ్రిని సెట్ మీదకు తోడు రావాల్సిందిగా ఆమె కోరింది. ఆ తర్వాతి నుంచి నిర్మాత ఆమెను కనీసం ఆడియో ఫంక్షన్కు కూడా ఆహ్వానించలేదు. అతడి డిమాండ్లు కొన్నింటిని ఆమె అంగీకరించకపోవడం వల్లే ఇలా జరిగింది'' అని సంజన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది కేవలం తనకొక్కదానికే ఉన్న సమస్య మాత్రమే కాదని, చాలామంది నిర్మాతలు, దర్శకులు చాలామంది హీరోయిన్లు, ఇతర నటీమణులను ఇలా లైంగికంగా వేధిస్తున్నారని సంజన బాంబు పేల్చింది. సినీ పరిశ్రమలో కొంతమంది దర్శకులు, నిర్మాతలు తమను బానిసల్లా చూస్తున్నారని వాపోయింది. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' చిత్రంలో హీరోయిన్గా ఈమె కెరీర్ ప్రారంభించింది. ఆమె అసలుపేరు అర్చనా గల్రానీ. మోడల్గా జీవితం ఆరంభించి, అక్కడి నుంచి సినీరంగంలోకి ప్రవేశించింది. నిర్మాతలు, దర్శకులు నటీమణులను తమ సొంత సొమ్ముగా భావిస్తారని, కేవలం ఆ సినిమాలో పాత్ర ఇచ్చినందుకే వాళ్లిలా ప్రవర్తిస్తున్నారని సంజన అంది. అయితే.. ఇప్పుడు మాత్రం చిత్ర నిర్మాతలు తనకు క్షమాపణ చెప్పినందున సినిమా ప్రమోషన్కు తాను అంగీకరించానని అంది. సినిమా కోసం చాలా కష్టపడ్డానని, ఇక ముందు కూడా కష్టపడతానని ఆమె చెప్పింది. అయితే, శివకేశవ్ చిత్ర నిర్మాత నాగరాజు మాత్రం సంజన ఆరోపణలను ఖండించారు. ఆడియో ఫంక్షన్కు అందరినీ పిలిచారో లేదో చూడటం తన డ్యూటీ కాదని, అందరినీ పిలవాల్సిందిగా తన మేనేజర్కు చెప్పానని ఆయన అన్నారు. ఒకవేళ సంజనను పిలవకపోయినా, ఇది ఆమె సినిమా అనుకుంటే ఆమె తప్పకుండా రావాలని, ఆమె చెబుతున్న 'అసంబద్ధ కోరికలు' ఏంటో తనకు అర్థంకాలేదని, ఇవన్నీ ఆధారరహితమైన ఆరోపణలని ఆయన అన్నారు. సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్ పోలీస్, యమహో యమ, నేనేం.. చిన్న పిల్లనా లాంటి చిత్రాల్లో సంజన నటించింది. ప్రస్తుతం జయంత్, రేణు శర్మ, నాగబాబు, శ్వేతా బసు ప్రసాద్లతో కలిసి శివ కేశవ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో దివంగత నటుడు శ్రీహరి కూడా నటించారు. ఈ చిత్రానికి ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తుండగా బానూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ నిర్మాత పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.