syllabus
-
జేఈఈ మెయిన్ తప్పులతడక
సాక్షి, ఎడ్యుకేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ – మెయిన్. కొద్ది రోజుల క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలి దశ జేఈఈ మెయిన్(JEE Main 2025 exam)ను నిర్వహించింది.ఈ క్రమంలో ప్రశ్నల్లో లోపాలు, అనువాద దోషాలు, సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు అడగడం, తుది ఆన్సర్ కీలో తొలగిస్తున్న ప్రశ్నల సంఖ్య పెరగడంపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు చేస్తున్నారు. జేఈఈ–మెయిన్ – 2025 జనవరి సెషన్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్లో లోపాలపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. పన్నెండు ప్రశ్నల తొలగింపుజేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది.. పలు షిష్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో తొలగించిన ప్రశ్నల సంఖ్యే ఇందుకు నిదర్శనమని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది షిఫ్ట్లలో జేఈఈ మెయిన్ నిర్వహించగా.. ఏకంగా 12 ప్రశ్నలను తొలగించారు. ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు ఉంటే.. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీల నుంచి రెండు చొప్పున నాలుగు ప్రశ్నలు ఉన్నాయి.దీనికి సాంకేతిక లోపం, మానవ తప్పిదం కారణమని ఎన్టీఏ పేర్కొంది. జాతీయ స్థాయిలో జేఈఈ–మెయిన్తోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)–యూజీ, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్), తదితర పరీక్షలను నిర్వహిస్తున్న ఎన్టీఏ వాటిని సమర్థంగా నిర్వహించడంలో విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు రూపొందించే ఎగ్జామినర్స్ విషయంలోనూ, అదే విధంగా వాటిని పకడ్బందీగా పరిశీలించే విషయంలోనూ ఎన్టీఏ అప్రమత్తంగా ఉండట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి.గత కొన్నేళ్లుగా తప్పులే..జేఈఈ – మెయిన్ పరీక్ష తీరును పరిగణనలోకి తీసుకుంటే.. గత కొన్నేళ్లుగా ఏటా ప్రశ్నల్లో తప్పుల సంఖ్య పెరుగుతోంది. 2024 సెషన్–1లో ఆరు ప్రశ్నలు; సెషన్–2లో నాలుగు ప్రశ్నలు తొలగించగా.. 2023లో సెషన్–1లో నాలుగు ప్రశ్నలు, 2022 సెషన్–1లో నాలుగు, సెషన్–2లో ఆరు ప్రశ్నలు తొలగించారు. ఇలా తొలగించిన ప్రశ్నల విషయంలో అభ్యర్థులకు పూర్తి మార్కులు (4 మార్కులు) కేటాయిస్తామని ఎన్టీఏ పేర్కొంది. అయితే ఇలాంటి తప్పుల కారణంగా విద్యార్థులు పరీక్ష హాల్లో సమయం వృథా చేసుకోవాల్సి వస్తోందని, లోపాలు లేని ప్రశ్నలు ఇచ్చే విధంగా ముందుగానే ఎన్టీఏ పటిష్ట చర్యలు తీసుకోవాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్ పరిధిలో లేని ప్రశ్నలు..జేఈఈ – మెయిన్ విషయంలో ఎన్టీఏ నిర్లక్ష్యానికి నిదర్శనంగా.. సిలబస్లోని ప్రశ్నలు రావడాన్ని ఉదహరిస్తున్నారు. 2025 జనవరి సెషన్ పరీక్షలనే పరిగణనలోకి తీసుకుంటే మొత్తం పది షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో.. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ చాప్టర్కు సంబంధించి న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ నుంచి 22 ప్రశ్నలు, అదే విధంగా కార్నెట్ లా నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారని అంటున్నారు.అయితే గత ఏడాది నుంచి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ను, అంతకుముందు ఏడాది కార్నెట్ లాను సిలబస్లో తొలగించారని సబ్జెక్ట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇలా సిలబస్లో లేని ప్రశ్నలు అడగడం కారణంగా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ఫలితంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.రాధాకృష్ణన్ కమిటీ స్పష్టంగా..జాతీయ స్థాయిలో వివిధ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత కోసం పలు సిఫార్సులు చేసిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సైతం.. జేఈఈలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్టీఏపై ఉందని తేల్చిచెప్పింది. అన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండేలా ప్రశ్నపత్రం రూపొందించాలని స్పష్టం చేసింది. కానీ.. దీనికి భిన్నంగా ఎన్టీఏ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నీట్–యూజీపై ఆందోళన..జేఈఈ– మెయిన్లో తప్పుల నేపథ్యంలో.. మే 4న నిర్వహించనున్న నీట్–యూజీ నిర్వహణ విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు కూడా దాదాపు పది లక్షల మంది హాజరవుతారు. దీంతో ప్రశ్నల్లో తప్పులు, అనువాద దోషాలతో నీట్ – యూజీ అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని.. ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఎన్టీఏ ఇప్పటి నుంచే పకడ్బందీగా ప్రశ్న పత్రాల రూపకల్పనలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జేఈఈ మెయిన్ జనవరి సెషన్లో తొలగించిన ప్రశ్నల కోడ్ నంబర్లు..⇒ ఫిజిక్స్: 656445270, 7364751025, 656445566, 6564451161, 656445870, 7364751250, 564451847, 6564451917⇒ కెమిస్ట్రీ: 656445728, 6564451784⇒ మ్యాథమెటిక్స్: 6564451142, 6564451898డేటాను నిరంతరం సమీక్షించాలి..కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో.. ముందుగానే నిర్దిష్ట అల్గారిథమ్స్ రూపొందించి ప్రశ్నలు అడిగే వి«ధానాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే.. ఏదైనా ఒక చాప్టర్ నుంచి నాలుగు ప్రశ్నలు ఇవ్వాలనుకుంటే ఆ మేరకు ముందుగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మొదటగానే ఒక ప్రశ్న తప్పుగా ఉంటే అదే పునరావృతం అవుతుంది. దీనికి పరిష్కారంగా ఎప్పటికప్పుడు కొశ్చన్స్ డేటా బ్యాంక్ను సమీక్షిస్తుండాలి. పెన్ పేపర్ విధానంలో స్పష్టంగా రాసే వీలున్న స్క్వేర్ రూట్స్, ఇతర సైంటిఫిక్ సింబల్స్ కంప్యూటర్లో సరిగా ప్రతిబింబించవు. ఇది కూడా ప్రశ్నల్లో తప్పులకు కారణం అవుతోంది. మొత్తంగా 12 ప్రశ్నలను తొలగించడం అనేది అసాధారణ పరిణామమే. – ఆర్. వి. శ్రీధర్, జేఈఈ–మెయిన్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నిపుణులు -
సరికొత్తగా ‘డిగ్రీ’
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సులను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, సంప్రదాయ కోర్సుల్లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా సిలబస్ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలపై అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కమిటీ వేసింది.త్వరలో సిలబస్ను ఖరారు చేయబోతోంది. త్వరలోనే విధివిధానాలను వెల్లడిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి పూర్తి నైపుణ్యంతో ధైర్యంగా ఉపాధి కోసం వెళ్లేలా సిలబస్ ఉండబోతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. క్రెడిట్స్కే ప్రాధాన్యం.. ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానం క్రెడిట్ స్కోర్ ఆధారంగా నడుస్తోంది. టెన్త్, డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానం వల్ల ఇతర దేశాల్లోనూ ఉపాధి కోసం వెళ్లవచ్చని అధికారులు అంటున్నారు. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది.ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే నాలుగేళ్ల కోర్సులోనే ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు. ఆనర్స్కు కొత్త బోధనా ప్రణాళిక.. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకార మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూ డా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో వర్సిటీలు అందించే బ్రిడ్జ్ కోర్సు లు చేయటం తప్పనిసరి. నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించబోతున్నారు.మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టీఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా ఇస్తారు. మూడేళ్లు చది వితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ కోర్సులో చేరేందుకు అవకాశం ఇస్తారు. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.డిగ్రీలోనూ ఏఐ కోర్సులుడిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో సూచించింది. తెలంగాణలో నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చా రు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలు హానర్స్లో చోటు చేసుకోబోతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది.ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) లో చేరికలు కూడా ఆరేళ్లలోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్తో పాటు, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్లను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో ట్యాక్స్ నిపుణుల అవసరం రెట్టింపైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. -
నెల రోజుల్లో టెన్త్ సిలబస్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్ను జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సిలబస్ అయిన వెంటనే పునశ్చరణ చేపట్టాలని సూచించింది. టెన్త్ పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు ప్రతీ హెచ్ఎం శ్రద్ధ తీసుకోవాలని కోరింది. మంచి ఫలితాలు సాధించే స్కూళ్లకు ఈసారి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. ప్రైవేటు బడులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్య మని విద్యాశాఖ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా 11,062 మంది టీచర్ల నియామకం కూడా చేపట్టారని, పుస్తకాలు కూడా సకాలంలో అందించామని, ఫలితాలు తక్కువగా వస్తే స్కూల్ హెచ్ఎంలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 30 రోజుల పక్కా ప్రణాళిక.. మార్చి నెలలో టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ప్రభు త్వ స్కూల్ విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ఉదయం గంట, సాయంత్రం గంట ఇప్పటికే ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రివిజన్పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో సబ్జెక్టులో ముఖ్యమైన, కష్టమైన చాప్టర్లపై దృష్టి పెట్టాలని హెచ్ఎంలను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. 30 రోజుల పాటు ప్రణాళిక బద్ధంగా రివిజన్ చేయాలని తెలిపారు. బదిలీలు, పదోన్నతులతోనే కాలం పూర్తి.. జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయడం ఎలా సాధ్యమని పలువురు టీచర్లు ప్రశి్నస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లలో కొంతమేర టీచర్ల కొరత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు. కొన్ని పాఠశాలల్లో 40 శాతం మేర సిలబస్ మాత్రమే పూర్తయిందని డీఈవోలు ఇటీవల విద్యాశాఖకు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతానికి మించి సిలబస్ పూర్తవ్వలేదంటున్నారు.డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకూ అనేక చోట్ల టీచర్ల కొరత ఉంది. అక్టోబర్లో టీచర్లు వచి్చనా బోధన వెంటనే చేపట్టడం సాధ్యం కాలేదంటున్నారు. ఈ ఏడాది విద్యారంభంలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. దీంతో చాలా స్కూళ్లలో టెన్త్ బోధన ఆలస్యంగా మొదలైందని చెబుతున్నారు. జనవరి 10 నాటికే సిలబస్ పూర్తవ్వాలనే లక్ష్యం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వారంటున్నారు. -
సిలబస్ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది. ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు. వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మూడంచెల సన్నద్ధతవిద్యార్థుల్లో టెన్షన్ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్లో మెదక్, నాగర్కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూరాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలివిద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
సత్తా చాటేలా సిలబస్!
ఇంజనీరింగ్ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకొనేలా ఉండాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్లో ఈ మార్పు అనివార్యమని అంటోంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఏఐసీటీఈ నిపుణుల కమిటీ గతేడాది సరికొత్త సీఎస్సీ బోధనాంశాలను ప్రతిపాదించింది. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ... సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి బోధనాంశాలను కోర్సుల్లో చేర్చాలని సూచించింది. ప్రస్తుతం మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు చేస్తున్నప్పటికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్విద్యార్థికి గణిత శాస్త్రంపై పట్టు ఉండాలి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దీన్ని నాలుగు రెట్లు పెంచేలా బోధనాంశాలుండాలి. కానీ ఇప్పుడున్నసిలబస్లో ఈ నాణ్యతకనిపించట్లేదు. ఇంటర్లోని సాధారణ గణితశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలే కోర్సులో ఉంటున్నాయి. » రాష్ట్రవ్యాప్తంగా ఏటా 75 వేల మంది కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో చేరుతున్నారు. క్లిష్టమైన గణిత సంబంధ కోడింగ్లో 20 వేల మందే ప్రతిభ చూపుతున్నారు. సీఎస్ఈ పూర్తి చేసినా కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్ను అందుకోవడం వారికి కష్టంగా ఉంటోంది.» మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆల్జీబ్రా, అల్గోరిథమ్స్పై పట్టు ఉంటే తప్ప ఈ కోర్సుల్లో రాణించడం కష్టం. ఈ తరహా ప్రయత్నాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన.» ఇంజనీరింగ్లో కనీసం వివిధ రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పరిణతి చెందరు. ఈ మార్పును ఇంజనీరింగ్ కాలేజీలు అర్థం చేసుకోవట్లేదు. దీంతో డీప్ లెరి్నంగ్, అడ్వాన్స్డ్ లెరి్నంగ్ వంటి వాటిలో వెనకబడుతున్నారు. ఏఐసీటీఈ సూచించిన మార్పులేంటి? » ఇంజనీరింగ్ ఫస్టియర్లో గణిత విభాగాన్నివిస్తృతం చేయాలి. పలు రకాల కంప్యూటర్ కోడింగ్కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను కొత్తగా జోడించాలి. » కంప్యూటర్స్ రంగంలో వస్తున్న నూతన అంశాలగురించి విద్యార్థులు తెలుసుకొనేలా ప్రాక్టికల్ బోధనాంశాలను తీసుకురావాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్లలో ప్రాక్టికల్స్ నిర్వహించాలి. » ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్ అండ్అండర్స్టాండింగ్, హ్యూమన్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను కోర్సుల్లో చేర్చాలి.దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కూడా అలవడుతుంది. నాణ్యత పెంచాల్సిందే ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా మారుతోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అనివార్యం. భవిష్యత్ తరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో బోధన ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీల కోసం ఈ మార్పును ఆపడం ఎలా సాధ్యం? ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శిప్రత్యేక క్లాసులు తీసుకోవాలి కొత్త సిలబస్ను స్వాగతించాలి. స్థాయిని అందుకోలేని విద్యార్థులకు అదనపు అవగాహనకు తరగతులు నిర్వహించాలి. కాలేజీలే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన బోధనాంశాలు ఉండాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రొఫెసర్ డి.రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీసమస్యేంటి?రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 78 కాలేజీలు అటానమస్ హోదా పొందాయి. గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ అందించే సిలబస్లో 80 శాతాన్ని ఈ కాలేజీల్లో అమలు చేయాలి. మిగతా 20 శాతం సిలబస్ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. మారుతున్న సిలబస్ను ఈ కాలేజీలు స్వాగతిస్తున్నాయి. కానీ మిగతా కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కాలేజీల్లో లక్షపైన ర్యాంకు పొందిన విద్యార్థులు చేరుతున్నారని.. వాళ్లు అత్యున్నత బోధనా ప్రణాళిక స్థాయిని ఎలా అందుకుంటారని ప్రశి్నస్తున్నాయి. అయితే నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందని యూనివర్సిటీలు అంటున్నాయి. -
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
న్యూఢిల్లీ: సిలబస్ను కాషాయీకరణ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ స్పందించారు. ఆదివారం(జూన్16) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వాస్తవాలను తెలియజేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. చరిత్రను తెలియజేసే అంశాలను బోధిస్తామని, యుద్ధానికి మద్దతుగా బోధన ఉండదన్నారు. బాధ్యత గల పౌరులను మాత్రమే సమాజానికి అందించాలనుకుంటున్నామని దినేశ్ తెలిపారు. ‘పుస్తకాల ద్వారా చిన్నారులకు అల్లర్ల గురించి ఎందుకు బోధించాలి సమాజంలో నేరాలు, హింస ఎలా సృష్టించాలనే విషయాలను మన విద్యార్థులకు బోధించాలా ఇదేనా విద్య ముఖ్య ఉద్దేశం. అసలు అల్లర్ల గురించి చిన్న వయసులో పిల్లలకెందుకు. రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే దాన్ని పుస్తకాల్లో చేర్చకూడదా.. కొత్త పార్లమెంటును నిర్మిస్తే వాటి గురించి మన విద్యార్థులు తెలుసుకోవద్దా.. ఇటువంటి అంశాలనే సిలబస్లో చేర్చాం. చారిత్రక విషయాలతో పాటు సమకాలీన అంశాలను సిలబస్లో చేర్చడం మా బాధ్యత’అని సక్లానీ తెలిపారు. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్లో హిట్మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్లో హిట్మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్తో జరిగిన మ్యాచ్లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం
భావి తరాలకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, ప్రపంచంలో నంబర్వన్గా నిలవాలన్నా నాణ్యమైన విద్యే కీలకం. – ఐబీతో ఒప్పందంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్యా బోధన దిశగా కీలక ఘట్టం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బెగుయిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ ఈ కార్యక్రమంలో జెనీవా నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగంలో ఐబీని భాగస్వామ్యం చేయడం గొప్ప సంతృప్తినిస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైందని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమంగా అభివర్ణించారు. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా, ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ పరిస్థితి ఇక మారుతుంది: సీఎం జగన్ భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అత్యవసరమని, ఇప్పుడున్న విధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు. సాంకేతికత, పాఠ్య ప్రణాళిక తదితర అంశాలను అప్గ్రేడ్ చేయాలన్నారు. సమస్యా పూరణ సామర్థ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వినియోగం లాంటివి చాలా కీలకమని, ఐబీ ద్వారా ఇది సాధ్యమన్నారు. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైందని, రానున్న విద్యా సంవత్సరంలో టీచర్లకు, సిబ్బందికి ఐబీ విధానాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ఐబీ విద్య సంపన్నులకు మాత్రమే అనే పరిస్థితి ఇప్పుడు మారుతుందని వ్యాఖ్యానించారు. పేదలకు, అణగారిన వర్గాలకూ ఇకపై ఐబీ బోధన అందుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలై 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి పన్నెండో తరగతుల్లో ఐబీ బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ, ఐబీ భాగస్వామ్యంతో విద్యా బోధన కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. ఇతర దేశాలకు ఈ ఒప్పందం స్ఫూర్తి: ఓలి పెక్కా తమది లాభాపేక్ష లేని సంస్థ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై చాలా నిబద్ధతతో ఉన్నామని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలి పెక్కా హీనోనెన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. విద్య ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమమని, ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. దీనిద్వారా భారత్తో విద్యారంగంలో తమ సంబంధాలు మరింత మెరుగుపడతాయని, నాణ్యమైన విద్యకోసం ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య మంచి వాతావరణాన్ని కల్పించి సామర్థ్యాలను పెంచుతామన్నారు. పిల్లలు, స్కూళ్లు, తల్లిదండ్రులు, యూనివర్శిటీలతోనూ తమ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఏపీలో కొత్త తరహా విద్యా విధానంలో తొలుత ప్లే బేస్డ్ లెర్నింగ్ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. దీనివల్ల పిల్లల్లో కొత్త సామర్థ్యాలు అలవడతాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, సింగపూర్, ఎస్తోనియా, ఫిన్లాండ్, కెనడా దేశాల్లోని విద్యామంత్రులతో ఇటీవల నాణ్యమైన బోధన, అభ్యాసాలపై చర్చించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్.శోభిక, ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ భాగస్వామ్యంపై జీవో పాఠశాల విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుకు అనుగుణంగా ఎస్సీఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యంపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో నంబర్ 5 జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ సాంకేతికత, సిలబస్, బోధన, సదుపాయాలు తదితర అంశాలపై ఐబీ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. 21 మంది ఐబీ ప్రతినిధుల బృందం వచ్చే నెల రోజుల్లో 40 పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాలను పరిశీలించి అధ్యయనం నిర్వహిస్తుంది. ఎగ్జామినేషన్ విధానాలను సైతం పరిశీలించి మార్పుచేర్పులపై సూచనలు చేస్తారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శిక్షణ, సిలబస్పై సూచనలు ఇచ్చేందుకు ఎస్సీఈఆర్టీలోని 19 మంది నిపుణులతో పాటు ఐబీకి చెందిన 26 మంది నిపుణులు చర్చించనున్నారు. మొత్తం ప్రక్రియను 2025 మే నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధనను ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీలో భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్యే లక్ష్యంగా..: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ విద్య అమలుకు శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో SCERT, IB మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో శ్రీమంతుల పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ (ఐబీ) సిలబస్ పేద పిల్లలకు చేరువ కానుంది. ఐబీ సిలబస్ అమలుపై బుధవారం సాయంత్రం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో ఏపీ విద్యాశాఖతో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఐబీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్) డాక్టర్ అంటోన్ బిగిన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జెనీవా నుంచి వర్చువల్గా ఐబీ డైరెక్టర్ జనరల్ ఒల్లి పెక్కా హీనోనెన్ పాల్గొన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. ‘‘ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం నాకు గొప్ప సంతృప్తి నిస్తోంది. ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కాకు, ఆన్లైన్ ద్వారా హాజరైన వారితో పాటు ఇక్కడకు వచ్చిన ఐబీ ప్రతినిధులకు ధన్యవాదాలు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనది నేను భావిస్తున్నా. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం ఇది గొప్ప సంతృప్తినిచ్చే కార్యక్రమం. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తు తరాలు.. మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్ ప్రపంచంలో నెంబర్వన్గా నిలవాలన్నా భారత్ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరం. .. ఇప్పుడున్న విద్యావిధానాలను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య ప్రపంచంతో పోల్చిచూస్తే సాంకేతికత, పాఠ్యప్రణాళిక తదితర అంశాల్లో అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. సమస్యా పూరణ సామర్ధ్యం, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మోడల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని వినియోగం వంటివి చాలా కీలకం. ఐబీ ద్వారా ఇది సాధ్యమని విశ్వసిస్తున్నాం. ఐబీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐబీతో భాగస్వామ్యం ద్వారా ఒక ప్రయాణం ప్రారంభమైంది. ముందు టీచర్లకు, సిబ్బందికి కెపాసిటీని పెంచేలా శిక్షణ కార్యక్రమాలు రానున్న విద్యాసంవత్సరంలో అమలవుతాయి. సంపన్నులకు మాత్రమే అందే ఐబీ విద్య అన్న పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పదేళ్లలో 2035నాటికి పదోతరగతి, 2037 నాటికి పన్నెండు తరగతిలో ఐబీ బోధన మొదలవుతుంది. పేదలకు, అణగారిన వర్గాలకూ ఐబీ బోధన అందుతుంది. ఎస్ఈఆర్టీలో ఐబీ భాగస్వామ్యం కావడం వల్ల విద్యా బోధన, అభ్యాసాలు పరిణామం చెందుతాయి. ఇది కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ శిక్షణ ఉంటుంది. టీచర్లతో పాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బందికి ‘ఐబీ’పై అవగాహన, సామర్థ్యం పెంచేలా శిక్షణనిస్తారు. దీంతో వారంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగమవుతారు. 2025 జూన్ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్కు అంతర్జాతీయంగా గుర్తింపు సైతం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్(పాఠశాల మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ(మిడ్ డే మీల్స్) డైరెక్టర్ ఎస్.ఎస్. శోభికా, ఐబీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘అడ్వాన్స్డ్’ మోతాదూ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సిలబస్ తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దీనిపై త్వరలో స్పష్టత ఇచ్చే వీలుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ సిలబస్ ను తగ్గించారు. మేథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పది టాపిక్ల వరకూ తీసేశారు. ఇదే తరహాలో అడ్వాన్స్డ్లోనూ నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పె రుగుతోంది. అన్ని రాష్ట్రాలూ సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఏ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. నిపుణు ల నుంచి సలహాలు తీసుకున్నారు. సిలబస్లో ఏ తరహా మార్పులు చేయాలనే అంశంపై పలు దఫా ల చర్చలు జరిగినట్లు ఎన్టీఏ వర్గాల ద్వారా తెలిసింది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా 2020 నుంచి 2022 మధ్య బోధన పూర్తిస్థాయిలో సాధ్యపడనందున టె న్త్, ఇంటర్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గించారు. 2024లో జరిగే జేఈఈ పరీక్షకు ఈ విద్యార్థులే హాజరు కా నుండటంతో జేఈఈ మెయిన్స్ సబ్జెక్టుల్లో సిలబస్ తగ్గిస్తున్నట్లు ఎన్టీఏ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. విద్యార్థుల్లో ‘అడ్వాన్స్డ్’ఆందోళన... గత కొన్నేళ్లుగా జేఈఈ అడ్వాన్స్డ్పై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ అర్హు ల్లో టాప్లో నిలిచిన 2.5 లక్షల మందికే అడ్వాన్స్డ్ రాసే అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఐదేళ్లుగా అ డ్వాన్స్డ్ రాస్తున్న వారి సంఖ్య 1.60 లక్షలు దాట డం లేదు. దరఖాస్తు చేసిన వారిలో 15 శాతం మంది పరీక్షకే హాజరు కావట్లేదని ఎన్టీఏ గుర్తించింది. అడ్వాన్స్డ్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు లభిస్తున్నా అన్ని ఐఐటీలలో కలిపి సీట్లు 16 వేలకు మించి లేవు. ఇందులోనూ టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన వరకే అగ్రశ్రేణి ఐఐటీల్లో సీట్లు వస్తున్నాయి. అడ్వాన్స్డ్ పేపర్ కొన్నేళ్లుగా కష్టంగా ఉండటంతో విద్యార్థులు పోటీ పడేందుకు భయపడుతున్నారు. జేఈఈ ర్యాంకుతో ఎన్ఐటీల్లో సీటు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సిలబస్లో మార్పులు తేవాలని వివిధ రాష్ట్రా లు అడ్వాన్స్డ్ నిర్వాహక ఐఐటీలను డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్లో తొలగించిన టాపిక్స్ అడ్వాన్స్డ్లో కొనసాగించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. మేథ్స్లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు నిపుణుల కమిటీ ఇటీవల ఎన్టీఏకు అందించిన నివేదిక ప్రకారం గణితంలో కొన్ని టాపిక్స్ను తొలగించే వీలుందని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్, టాన్జంట్స్ అండ్ నార్మల్స్, ప్లాన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్, మేథమెటికల్ రీజనింగ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వంటి టాపిక్స్ ఉండకపోవచ్చని సమాచారం. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్లో జరిగే రెండో దశ మెయిన్స్కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్ను ఎంచుకుంటున్నారు. సిలబస్లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
పవన్కు ఎందుకంత కడుపుమంట?
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ టోఫెల్ , ఐబీ సిలబస్ ఎందుకు? ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యున్నత సిలబస్ను అందించడంపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో రాష్ట్ర సిలబస్ను బోధిస్తున్నారు. దీని వల్ల సాంప్రదాయ విద్యాబోధన అందుతోంది. అయితే మారిన పరిస్థితులు, పోటీ ప్రపంచంలో భాగంగా ప్రైవేట్ స్కూళ్లు అన్నీ కొత్త సిలబస్ను ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూళ్లు ఎంచుకున్నాయి. ఇక మరికొన్ని కార్పోరేట్ స్కూళ్లు IB సిలబస్ అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్.. (దీన్నే లాటిన్ నామంలో The International Baccalaureate® (IB) గా పిలుస్తారు) ఎంచుకున్నాయి. సాధారణంగా.. డబ్బున్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు IB సిలబస్ను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంట్లో చదవడం ద్వారా విద్యార్థులకు ప్రపంచ అవగాహన కలగడంతో పాటు భవిష్యత్తులో సులభంగా అంతర్జాతీయ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందగలుగుతారు. అలాగే అక్కడి కరిక్యులమ్కు అనుగుణంగా సులభంగా మారిపోగలరు. దీని విశిష్టతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి IB సిలబస్ను ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్కేంటీ అభ్యంతరం పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తే.. ఆ కుటుంబ భవిష్యత్తుకు ఎంతో భరోసా. ఉన్నత చదువులు ఎక్కువ మంది చదువుకోగలిగితే.. సమాజం అభివృద్ధి చెందుతుంది. డబ్బున్నవాళ్లే కాదు.. పేదవాడు కూడా చదువుకోవడం.. ఇప్పుడు చాలా మంది ఓర్వలేకుండా ఉన్నారు. ఐబీ సిలబస్ను ఉచితంగా పేద విద్యార్థికి ఎలా అందిస్తారన్న కడుపు మంట ఈ వ్యాఖ్యల్లో బయటపడుతోంది. తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లకు మాత్రమే పంపే ఈ నియో రిచ్ నాయకులు.. పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు భాష మీద నెపం మోపుతారా? తెలుగు భాష అమ్మ అయితే ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న. మారిన ప్రపంచీకరణ వల్ల జీతం, జీవితం ఇంగ్లిష్పై ఆధారపడుతోంది. ఇటీవల ఐక్యరాజ్యసమితికి వెళ్లిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చూసి యావత్తు దేశం అబ్బురపడింది. అంతర్జాతీయ యవనికపై వారి భాష, ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం ఏపీ ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యకు అద్దం పట్టింది. ఇప్పుడు పిల్లలంతా చదువుకుని ప్రయోజకులయితే తమ సంగతి ఏంటన్న ఆందోళనలో పచ్చపార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హఠాత్తుగా వీరికి తెలుగుభాష మీద ప్రేమ పుట్టింది. తెలుగులో చదువుకోకపోతే ఎలా అంటూ దీర్ఘాలు తీస్తున్న వీరి అసలు ఉద్దేశ్యం మాత్రం కడుపు మంటే. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు.. చైనా విద్యాసంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరూ చేరకుండా చేశాడు. ఇప్పుడు పేదవాడు బాగుపడుతున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలకు మనమిచ్చే నిజమయిన ఆస్థి విద్య అని భావించిన సీఎం జగన్ ప్రభుత్వం 70 వేల కోట్లు ఖర్చు చేసింది. అందుకే ఐబీ అయినా టోఫెల్ అయినా ప్రతీ సామాన్యుడికి అందాలన్న ఆశయం దిశగా అడుగులేస్తోంది. -
సర్కారు బడుల్లో సిలబస్ తంటాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బడుల్లో సిలబస్ పూర్తవ్వకపోవడం విద్యాశాఖలో సరికొత్త వివాదానికి దారితీస్తోంది. దీనికి పాఠశాల హెచ్ఎంలు, సంబంధిత టీచర్లను బాధ్యులను చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ భావించడం కొత్త సమస్యను సృష్టిస్తోంది. ఈ పరిస్థితికి విద్యాశాఖ అధికారులే కారణమని ఉపాధ్యాయులు నిందిస్తున్నారు. నేరం తమపై మోపితే సహించేదే లేదని చెబుతున్నారు. సిలబస్ పూర్తికాని బడుల వివరాలను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల తెప్పించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో దసరా సెలవులలోపు 80 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉండగా, ఎక్కడా 40 శాతానికి మించి పూర్తవ్వలేదని డీఈవోలు చెబుతు న్నారు. కొన్ని చోట్ల 25 శాతం మాత్రమే అయిందంటున్నారు. ఇలాంటి బడుల హెచ్ఎంలు, టీచర్ల నుంచి వివరణ కోరాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలకు సూచించినట్టు తెలిసింది. దీంతో డీఈవోలు సంబంధిత బడుల హెచ్ఎంల నుంచి వివర ణ కోరేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక సమయమెక్కడిది? పాఠశాల విద్యశాఖ సూచించిన లక్ష్యం పూర్తవ్వకపోవడంతో, భవిష్యత్లో సిలబస్ సమగ్రంగా పూర్తి చేయడం అసాధ్యమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. స్కూళ్లు తెరిచిన రెండు నెలల వరకూ పాఠ్యపుస్తకాలు అందలేదని, ఈ కారణంగా బోధన చేపట్టలేదని టీచర్లు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతుల అంశాన్ని తెరమీదకు తెచ్చిం ది. దీంతో బోధన కొంతమేర కుంటుపడింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడంతో మరో రెండు నెలలపాటు టీచర్లు ఇదే హడావిడిలో ఉంటారు. చాలామంది పోలింగ్ విధులకు వెళ్లాల్సి ఉంటుంది. వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీటితో బోధన జరిగేందుకు వీలుకాని పరిస్థితి ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. అదీగాక, చాలాచోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ఇతర స్కూళ్ల నుంచి సర్దుబాటు చేయడంలో అధికారులు జాప్యం చేశారని టీచర్లు ఆరోపిస్తున్నారు. కాబట్టి వందశాతం సిలబస్ పూర్తి చేయడంపై వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలపై ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తమనే బాధ్యులను చేయడమేంటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. -
3 నుంచి ఎఫ్ఏ 2 పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను పరీక్ష జరిగే రోజు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులకు పంపిస్తారు. పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు ప్రశ్నాపత్రాలు పంపాలని ఇప్పటికే ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మ«ద్యాహ్నం పరీక్షలు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతుల విద్యార్థులకు ఉదయం ఒకటి, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీలోగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధులకు అందిస్తారు. అలాగే ఆన్లైన్ పోర్టల్లోనూ మార్కులు నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలని సూచించింది. కాగా, ఈ నెల 14 నుంచి 24 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. -
ఐబీ సిలబస్ అమలుపై అధ్యయనం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొదలైంది. ఇప్పటికే గుంటూరు, విజయవాడల్లోని ఐబీ స్కూళ్లలో సిలబస్ అమలును పాఠశాల విద్యా శాఖ పరిశీలించింది. అయితే, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ రెండేళ్లుగా అమలవుతోంది. ఈ క్రమంలో శనివారం పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం అక్కడి పాఠశాలలను పరిశీలించింది. ఐబీ సిలబస్ బోధిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాలు, విద్యార్థులకు బోధిస్తున్న విధానంపై అధ్యయనం చేసింది. ఏపీలో ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయుల శిక్షణ, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఆవశ్యకతను అర్థం చేసుకునేందుకు, విధివిధానాలను తెలుసుకునేందుకు ఢిల్లీ వెస్ట్ వినోద్నగర్లోని సర్వోదయ కన్య విద్యాలయ (ఎస్కేవీ)ను వీరు సందర్శించారు. ఒకటి, మూడు, ఐదో తరగతి విద్యార్థులతో మమేకమై వివిధ అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, ఐబీ సిలబస్ అమలుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ప్రభుత్వం ఇటీవల స్టీరింగ్ కమిటీని నియమించిన నేపథ్యంలో ఆ కమిటీ ఢిల్లీ స్కూళ్లను పరిశీలించింది. -
ఐబీ సిలబస్ అన్నది సవాల్తో కూడుకున్నది: సీఎం జగన్
-
ఐబీ సిలబస్ సవాల్తో కూడుకున్నది: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జగనన్న సర్కార్లో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు పడింది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు.. అందుబాటులోకి ఐబీ సిలబస్ రానుంది. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ఐబీ సంస్థతో ఎంవోయూ memorandum of understanding (MOU) జరిగిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ‘‘విద్యలో నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యం. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది మా ఉద్దేశం. ఐబీ సిలబస్ అనేది సవాల్తో కూడుకున్నది. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా పెద్ద సవాల్. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది లేదు. పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం. అవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటాయి. ఏపీలో పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి డిజిటలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నాం. అన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో బోధిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు. ఒకటో క్లాసుతో మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయి. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది. దిగువస్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది. ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాతే ఐబీ సంస్థతో ఎంవోయూ కార్యక్రమం జరిగింది. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఐబీ డైరెక్టర్ జనరల్ Olli-Pekka Heinonen, ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ Matt Costello పాల్గొని మాట్లాడారు. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానం, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ లాంటి నైపుణ్యాలు అలవడతాయి. ఓపెన్-మైండెడ్, ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పునకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారు. ఉన్నతా విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. -
ఏపీలోనే ఏఎన్ఎంలు ఎక్కువ
రోగులకు వైద్యసేవల కల్పన, వారి సంరక్షణలో కీలకపాత్ర పోషించే నర్సుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముఖ్యపాత్ర పోషించే ఏఎన్ఎంలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో సంబంధిత విద్యలో ఏపీ ముందంజలో ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2021–22 వార్షిక నివేదికను ఐఎన్సీ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. నర్సులు, జీఎన్ఎం, ఏఎన్ఎంల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. – సాక్షి, అమరావతి ఏపీలో 1.39 లక్షల మంది ఏఎన్ఎంలు.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అయితే, ఏపీలోనే అత్యధికంగా 1.39 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్లో 1.10 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 75వేల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కేవలం 10,219 మందితో 19వ స్థానంలో ఉంది. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి సచివాలయానికొక ఏఎన్ఎంను నియమించిన విషయం తెలిసిందే. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో అత్యధికంగా 3.32 లక్షల మంది ఉండగా, కేరళలో 3.15 లక్షల మంది, మూడోస్థానంలో ఉన్న ఏపీలో 2.62 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో ఉంది. కొత్త కోర్సులు.. సెమిస్టర్ విధానం నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పుల నేపథ్యంలో సిలబస్లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు.. డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పేషెంట్ సెంటర్డ్ కేర్ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాల్సి ఉంటుంది. నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి.. ♦ హెల్త్కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. ♦స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి. నర్సింగ్ విద్యలోనూ టాప్–5లో.. ఇక నర్సింగ్ విద్యలోను ఏపీ దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్లకు సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 19,860 సీట్లు ఉండగా, తమిళనాడులో 12వేలు, మధ్యప్రదేశ్లో 9వేలు, రాజస్థాన్లో 8,165 ఉన్నాయి. ఏపీ 8,030 సీట్లతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణ 4,980 సీట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఏఎన్ఎం విద్యకు సంబంధించి 910 సీట్లతో ఏపీ దేశంలో 12వ స్థానంలో, 455 సీట్లతో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మరోవైపు.. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 7,125 ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఇక ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో 31 ఉండగా, తెలంగాణలో 16 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. కర్ణాటకలో ఇవి అత్యధికంగా 520 ఉన్నాయి. -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
‘పది’ గట్టెక్కేదెలా?.. సిలబస్ పూర్తి కాని వైనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను గటెక్కించడం విద్యాశాఖకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహానగరంలోని సర్కారు బడుల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు సిలబస్ పూర్తి కాక పోవడం వంటివి తలకు మించిన భారంగా మారాయి. తాజాగా సర్కారు బడుల్లో మంచి ఫలితాల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షల అమలు ప్రశ్నార్థకంగా మారాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులో అభ్యసన సామర్థ్యాలు తగ్గడంతో పాటు సబ్జెక్టులపై కనీస పట్టులేకుండా పోయింది. వాస్తవంగా సబ్జెక్టు నిపుణుల కొరతతో ప్రధాన సబ్జె క్టుల్లో పాఠ్యాంశాల బోధన అంతంత మాత్రంగా తయారైంది. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోనే ప్రధానోపాధ్యాయులు బోధన కొనసాగిస్తున్నారు. కరోనా, ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కొత్త అడ్మిషన్లు బాగానే పెరిగాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు బడుల్లో వంద శాతం ఫలితాలు సాధించడానికి అధికారులు మాత్రం ఏటా మొక్కుబడిగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నా అందుకు అనుగుణంగా టీచర్ల ఖాళీల భర్తీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావడంతో మరింత వెనుకబాటు తప్పడం లేదు. సరికొత్త ప్రణాళిక ► సర్కారు బడుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను అధిగమించకుండా పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆరీ్ట) తొలిసారిగా ► సరికొత్త ప్రణాళిక రూపొందించింది. వాస్తవంగా పదవ తరగతి పరీక్షల నేప«థ్యంలో జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు, పరీక్షలపై ప్రణాళిక రూపొందించి అమలు చేసేవారు. ఆయితే సర్కారు బడుల్లో తగ్గుతున్న పదవ తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించడం విశేషం. 40రోజులు ప్రత్యేక తరగతులు.. ► పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టులపై మరింత పట్టు సాధించేందుకు 40 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి మార్చి 10వ వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పాఠశాల ప్రారంభ సమయం కంటే ముందు ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు, పాఠశాల సమయం అనంతరం ► సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టులో తరగతులు నిర్వహిస్తారు. రోజుకు రెండు సబ్జెక్టులు బోధిస్తారు. వాటిపైనే వారం వారం పరీక్షలు నిర్వహిస్తారు. 3 నుంచి వారాంతపు పరీక్షలు ► పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేవిధంగా ప్రతి ఆదివారం, రెండో శనివారాల్లో వారాంతపు పరీక్షలు జరుగుతాయి. ప్రతి వారం ఒకే రోజు రెండు పరీక్షలు ► ఉదయం 9 నుంచి11 గంటల వరకు ఒక పరీక్ష, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండో పరీక్ష నిర్వహించాల్సి ఉంది.. చదవండి: ఐటీ కారిడార్కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్.. -
కొత్త సిలబస్తో జేఈఈ అడ్వాన్స్డ్–2023
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2023 పరీక్షలు కొత్త సిలబస్తో జరగనున్నాయి. సిలబస్లో మార్పులు చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన జాయింట్ అడ్మిషన్ బాడీ (జేఏబీ) ఇప్పుడు కొత్త సిలబస్ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ jeeadv. ac.in లో పొందుపరిచింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మూడు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చింది. 2023 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ను అనుసరించాల్సి ఉంటుంది. పాత సిలబస్లోని కొన్ని అధ్యాయాలను తొలగించి, కొత్తగా కొన్ని చేర్చారు. జేఈఈ మెయిన్తో అనుసంధానంగా ఉండేలా నూతన సిలబస్ను రూపొందించారు. జేఈఈ అడ్వాన్స్డ్కు కోచింగ్ తీసుకోని విద్యార్థులు కూడా విజయం సాధించడం సిలబస్ మార్పు ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. మార్పులు ఇలా జేఈఈ అడ్వాన్స్డ్ గణితంలో కొత్తగా గణాంకాలు (స్టాటిస్టిక్స్)ను జోడించారు. దీనికి బదులుగా త్రిభుజం పరిష్కారం (సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్) అంశాన్ని తొలగించారు. భౌతిక శాస్త్రంలో సెమీకండక్టర్లు, కమ్యూనికేషన్ అంశాలను మినహాయించారు. వీటికి బదులుగా జేఈఈ మెయిన్లోని కొన్ని అంశాలు జోడించారు. మెయిన్లోని ఫోర్స్డ్ అండ్ డాంపడ్ ఆసిల్లేషన్స్, ఈఎమ్ వేవ్స్, పోలరైజేషన్ అంశాలను కొత్త సిలబస్లో చేర్చారు. అదే విధంగా కెమిస్ట్రీలోనూ మార్పులు చేశారు. సీబీఎస్ఈ విద్యార్థులకు సులువు కొత్త సిలబస్లో ఎక్కువగా సీబీఎస్ఈ అంశాలను చేర్చారు. దీనివల్ల సీబీఎస్ఈ విద్యార్థులకు కొంత సులువుగా ఉంటుందని, ఇంటర్మీడియట్ చదివే వారికి కొంత ఇబ్బందికరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్ విద్యార్థులు గతంలోకంటే ఎక్కువ సిలబస్ని అనుసరించాల్సి వస్తుందన్నారు. కొత్త సిలబస్ జేఈఈ మెయిన్కు అనుసంధానంగా ఉండేలా చేయడం వల్ల మెయిన్కి ప్రిపేర్ అయిన వారు అవే అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. సిలబస్ను పెంచినప్పటికీ, పరీక్ష సులువుగా మారే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెయిన్లోని అధ్యాయాలు అడ్వా న్స్డ్లో చేర్చినందున సిలబస్ పెరిగినట్లు పైకి కనిపించినప్పటికీ, అవే అంశాలు కనుక అంతగా భారం ఉండదని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు. ఐఐటీలలో వివిధ కోర్సులు చదవాలనుకొనే వారు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. పరీక్షలు ఇలా.. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీఈఈడీ), అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (యూసీఈఈడీ) కింద ఈ కొత్త పేపర్ నమూనా, సిలబస్ ప్రవేశపెట్టినట్లు జేఏబీ ప్రకటించింది. కొత్త విధానంలో ప్రవేశ పరీక్ష పార్ట్–ఎ, పార్ట్–బిలుగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్–ఎ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మూడు విభాగాలలో ప్రశ్నలు ఉంటాయి. న్యూమరికల్ ఆన్సర్ టైప్, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎన్ఏటీ, ఎంఎస్క్యూ, ఎమ్సీక్యూ) ఉంటాయి. పార్ట్–బి లో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్. పార్ట్ – బి లోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్పై కనిపించేలా ఇస్తారు. అభ్యర్థులు దానికి సమాధానాన్ని ఇన్విజిలేటర్ అందించిన జవాబు పుస్తకంలో మాత్రమే రాయాలి. ప్రశ్నలకు సంబంధించిన చిత్రాల డ్రాయింగ్ అందులోనే చేయాలి. -
ఇంటర్లో ఇక 100% సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి, ద్వితీయ పరీక్షల్లో ఇక నుంచి వందశాతం సిలబస్తో ప్రశ్నప త్రాలు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగానే విద్యార్థులు సిద్ధమవ్వాలని, కాలేజీ నిర్వాహకులు కూడా 100 శాతం సిలబస్ను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ ముందు వరకూ ఇదే విధానం కొనసాగింది. కోవిడ్ విజృంభణతో 2021లో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. అయితే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. 2021–22లో కూడా చాలాకాలం ఆన్లైన్ క్లాసులు నడిచాయి. ఈ సదుపాయం అన్ని ప్రాంతాలు వినియోగించుకోలేదన్న ఆందోళన సర్వత్రా విన్పించడంతో 70 శాతం సిలబస్నే అమలు చేశారు. తొలుత ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవని చెప్పినప్పటికీ ఆ తర్వాత నిర్వహించారు. ఈ పరీక్షల్లో 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 70 శాతం సిలబస్ కూడా సరిగా జరగలేదని విద్యార్థులు ఆందోళనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం అందరినీ కనీస మార్కులతో పాస్ చేసింది. 2022లో మేలో జరిగిన పరీక్షల్లో 70 శాతం సిలబస్తోనే పరీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం సకాలంలో మొదలవ్వడంతో వందశాతం సిలబస్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే మొదటి సంవత్సరం ప్రవేశాలు సెప్టెంబర్ వరకూ జరిగాయి. బోర్డు నిర్దేశించిన సిలబస్ కూడా పూర్తవ్వలేదని విద్యార్థులు అంటున్నారు. కాకపోతే 100 శాతం సిలబస్ ఉంటుందని ముందే చెప్పడంతో సిద్ధమవ్వడానికి కొంత వ్యవధి లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మోడల్ పేపర్ల తయారీపై బోర్డు దృష్టి పెట్టినట్టు లేదు. కోవిడ్కు ముందు ఇదే సిలబస్తో నమూనా ప్రశ్నపత్రాలు రూపొందించారు. వాటినే బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. -
Telangana: ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటర్ సిలబస్ను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ కళాశాలలను ఆదేశించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది. (క్లిక్: రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ) -
పాఠం స్పీడ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి సిలబస్ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పాఠశాల అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు గతంలో మార్చి, ఏప్రిల్లో జరిగేవి. కోవిడ్ కారణంగా పరీక్షలు ఆలస్యమయ్యాయి. మరో వైపు స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభం కావడం, మధ్యలో సెలవుల వల్ల సిలబస్ పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో మరో నెల పాటు స్కూళ్లకు సిలబస్ పూర్తి చేసే అవకాశం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది కూడా టెన్త్ సిలబస్ 70 శాతమే అమలు చేస్తున్నారు. అందులో ఇప్పటికీ 60 శాతం మించి సిలబస్ పూర్తి కాలేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. మిగిలిన సిలబస్ను క్షుణ్ణంగా చెప్పాలంటే కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని, అంత సమయం లేకపోవడంతో వేగంగా ముగించేందుకు ఉపాధ్యాయులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఫలితంగా విద్యార్థులకు అర్థమైనా, కాకపోయినా సిలబస్ పూర్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. బోధన సమయంలో పాఠం చెప్పిన తర్వాత విద్యార్థులతో నిశిత అధ్యయనం చేయించ డం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులు అంటున్నారు. విద్యార్థులే సొంతంగా ఎక్కువ సమయం కేటాయించి లోతైన అధ్యయనం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే ఈ విధానం పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇంత వరకూ లోతైన బోధన జరిగిందని, ఇప్పుడు పైపైన బోధన చేస్తే, వాటిల్లోనే విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తే సమాధానం ఇవ్వడం విద్యార్థులకు కష్టంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళికా బద్దంగా బోధన జరగకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే వీలుందంటున్నారు. ఇది కాకుండా రివిజన్కు సమయం ఉండే వీల్లేదని టీచర్లు అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన ఆన్లైన్ క్లాసులపై అవగాహన కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఉదయమో గంట.. సాయంత్రమో గంట
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అదనపు క్లాసులు మొదలుకాబోతున్నాయి. ఉదయం, సాయంత్రం గంట చొప్పున రోజూ రెండు గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్పబోతున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ కాలేజీల్లో ఈ తరహా ఏర్పాట్లు చేస్తామని బోర్డు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ తొలి, రెండో సంవత్సర పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదల చేయడం.. కరోనా వల్ల కొన్ని కాలేజీల్లో ఇంకా 50 శాతం కూడా సిలబస్ పూర్తవకపోవడంతో మార్చిలోగా సిలబస్ పూర్తి చేసేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 70% సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంటర్ విద్యార్థులకు సాధారణంగా జూలై, ఆగస్టులో క్లాసులు మొదలవ్వాలి. కరోనా వల్ల సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించారు. దాదాపు నెల పాటు ఆన్లైన్లోనే బోధన సాగింది. గత నెల కూడా థర్డ్ వేవ్ వల్ల 25 రోజులు క్లాసులు నిర్వహించలేదు. దీంతో సిలబస్ పూర్తి చేయలేకపోయామని అధ్యాపకులు అంటున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టుల బోధనలో విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఆప్షనల్ సబ్జెక్టుల విషయంలో సిలబస్ ఆశించిన మేర పూర్తవ్వలేదని ఇటీవల బోర్డు గుర్తించింది. ముఖ్యంగా గణితం, ఫిజిక్స్, హిస్టరీ, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో ఇప్పటికే 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉన్నా కొన్ని కాలేజీల్లో 50 శాతం కూడా పూర్తవ్వలేదని తెలిసింది. దీంతో ఈసారి కూడా 30 శాతం సిలబస్ను తగ్గించింది. మార్చి ఆఖరు కల్లా 70% సిలబస్ పూర్తి చేసేలా.. సాధారణంగా ఇంటర్ బోధన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇక ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సంబంధిత అధ్యాపకులు బోధించే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు 70 శాతం సిలబస్ పూర్తి చేసి వారం రోజులు రివిజన్ చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు అధ్యాపక వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ సిలబస్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ నెల 15 తర్వాత రివిజన్ చేపట్టేందుకు ఆ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులూ ఉన్నారు. ప్రత్యక్ష క్లాసుల వల్ల పోటీ పరీక్షల టైం మార్చుకోవాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. సరిపడా అధ్యాపకులున్నారా? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న లెక్చరర్ల సంఖ్య 725 మాత్రమే. అతిథి లెక్చర్లు 1,658, కాంట్రాక్టు లెక్చరర్లు 3,700, పార్ట్టైం, మినిమమ్ టైం స్కేల్ మరో 100 మంది ఉంటారు. అయితే గెస్ట్ లెక్చరర్ల సేవలను సెప్టెంబర్ నుంచి 5 నెలల పాటు తీసుకుంటూ గతంలో ప్రభుత్వ ఆదేశాలిచ్చింది. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పటివరకు వీరిని పొడిగించేందుకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రత్యేక క్లాసుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 317 జీవో అమలులో భాగంగా దాదాపు 78 మందికి స్థానచలనం జరిగి కొన్ని ఖాళీలేర్పడ్డాయి. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ విషయాలను బోర్డు దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
సిలబస్ టెన్షన్.. బుర్రకెక్కింది అంతంతే...
సాక్షి, హైదరాబాద్: మళ్లీ ఆన్లైన్ బోధన నేపథ్యంలో సిలబస్ పూర్తి కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు విద్యార్థుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్నత తరగతులకు సిలబస్ 40 శాతం మించలేదు. గురుకుల విద్యాసంస్థల్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో సిలబస్ కనీసం 20 నుంచి 30 శాతం మించలేదు. గత నెల రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం ప్రత్యక్ష బోధనపై తీవ్ర ప్రభావం చూపించింది. బుర్రకెక్కింది అంతంతే... ఈ విద్యా సంవత్సరం కూడా పాఠ్యాంశాలపై విద్యార్థులు పట్టు సాధించలేక పోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మొదటి మూడు నెలలు ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగగా, ఆ తర్వాత నాలుగు నెలల క్రితం విద్యా సంస్థలు పునఃప్రారంభమై ప్రత్యక్ష బోధనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నాటికి పూర్తయిన సిలబస్ ఆధారంగా గత నెలలో ఎస్ఏ– 1 పరీక్షలు నిర్వహించగా పాఠ్యాంశాలపై విద్యార్థుల పట్టు అంతంత మాత్రంగా బయటపడింది. కనీసం పదో తరగతి విద్యార్థులు సైతం పాఠ్యాంశాలపై పెద్దగా పట్టు సాధించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టులకే పరిమితం పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థులు పాఠ్యాంశాలకు బదులు ప్రాజెక్టులకు పరిమితమయ్యారు. పాఠ్యాంశాల బోధన పక్కనపెట్టి ప్రాజెక్టులు ఇవ్వడం సర్వసాధారణమైంది. వాస్తవానికి సిలబస్ 30 శాతం కూడా మించలేదు. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత రెండేళ్లుగా చదువులు సరిగా సాగకపోవడంతో విద్యార్థులు పాఠ్యంశాలపై పట్టు సాధించలేకపోయారు. ఇక ఆన్లైన్ తరగతులే.. ► కరోనా మూడో దశ ఉద్ధృతి నేపథ్యంలో విద్యా సంస్థలు మళ్లీ ఆన్లైన్ సిద్ధమయ్యాయి, సోమవారం నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపించాయి. తరగతుల షెడ్యూలు కూడా ప్రకటించాయి. (చదవండి: హైదరాబాద్లో ఊపందుకున్న రియల్టీ జోరు) ► సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియడంతో తాజా కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభంలో మొదట మూడు నెలల పాటు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగినా బోధన వైరస్ ప్రభావం తగ్గుదలతో గత నాలుగు నెలలక్రితం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో అప్పటి నుంచి ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. గత నెల చివరి అంకం నుంచి వైరస్ విజృంభిస్తుండటంతో ప్రత్యక్ష బోధన ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో ముందస్తుగా సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. వైరస్ ఉద్ధృతి తగ్గక పోవడంతో సెలవులు పొడిగిస్తూ ఆన్లైన్ తరగతులకు వెసులుబాటు కల్పించింది. (చదవండి: తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త చట్టం కోసం..) -
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్టీకి ఢిల్లీ, కోల్కతాల్లో క్యాంపస్లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
ఇంటర్ విద్యార్థులను తికమకపెడుతున్న త్రికోణమితి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా సిలబస్లో కోత పెట్టడం వల్ల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు తలనొప్పులు తప్పడం లేదు. మొదటి సంవత్సరంలో బేసిక్స్ (ప్రాథమికాంశాలు) వదిలేయడంతో రెండో ఏడాది కొన్ని పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనివల్ల పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. 70 శాతానికి కుదింపు కోవిడ్ వల్ల గతేడాది విద్యాసంస్థలు పనిచేయని విషయం తెలిసిందే. ఆన్లైన్ పాఠాలు కూడా చాలారోజులు జరగలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ఫస్టియర్ సిలబస్ను 70 శాతానికి కుదించారు. దీంతో విద్యార్థులు కొన్ని చాప్టర్ల జోలికి అసలుకే వెళ్లలేదు. వీటిల్లో పలు కీలక విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించే చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే తప్ప రెండో ఏడాదిలో పాఠాలు అర్థం కానివి కొన్ని ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు కాలేజీలు కుదించిన చాప్టర్లను కూడా విద్యార్థులకు బోధించినా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆన్లైన్ పాఠాలు అర్థం కాక, సిలబస్ కోతతో విద్యార్థుల పరిస్థితి, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఫస్టియర్లో చదవకపోతే కష్టమే.. ఫస్టియర్ గణితంలో త్రికోణమితి (ట్రిగొనమెట్రీ) చాప్టర్ను వదిలేశారు. రెండో ఏడాదిలో ఇది మరింత లోతుగా ఉంది. ప్రాథమిక అవగాహన ఉంటే తప్ప క్లిష్టమైన లెక్కలను చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. విశ్లేషణాత్మక గణిత సూత్రాలన్నీ ఫస్టియర్లో ఉన్నాయని, దాని కొనసాగింపు రెండో ఏడాది ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. మహబూబ్నగర్లోని ఓ ప్రభుత్వ కాలేజీలో త్రికోణమితిపై కాలేజీ అధ్యాపకులు పరిశీలన చేశారు. 60 మందిలో కనీసం 20 మంది కూడా ఓ మోస్తరు క్లిష్టమైన త్రికోణమితి లెక్కలు చేయలేని పరిస్థితి కన్పించింది. జంతుశాస్త్రంలో ప్రొటోజోవా గమనం, ప్రత్యుత్పత్తి చాప్టర్లను కూడా కోత మూలంగా విద్యార్థులు ముట్టుకోలేదు. కానీ రెండో సంవత్సరంలో ఈ చాప్టర్లు మరింత లోతుగా ఉన్నాయి. ప్రాథమిక అవగాహన మొత్తం మొదటి ఏడాదిలోనే ఉందని, అది లేకుండా రెండో ఏడాదిలో విద్యార్థులకు సబ్జెక్టు అర్థం కావడం లేదని జువాలజీ లెక్చరర్ ఒకరు తెలిపారు. బొద్దింక కోతకు సంబంధించి సబ్జెక్టు ఫస్టియర్లో ఉంది. దీన్ని తెలుసుకుంటేనే రెండో ఏడాది మానవుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన విషయాలు అర్థమవుతాయని లెక్చరర్లు చెబుతున్నారు. కుదింపు జాబితాలో ‘బొద్దింక’ ఎగిరిపోవడంతో రెండో ఏడాది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రసాయన శాస్త్రంలో మూల సూత్రాలన్నీ ఫస్టియర్లో ఉంటాయి. ఇవి తెలియకుండా రెండో ఏడాది కొనసాగింపుగా వచ్చే చాప్టర్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. హిస్టరీ, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పైగా ఈ ఏడాది రెండో సంవత్సరం వంద శాతం సిలబస్ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా పాఠాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలపైనా ప్రభావం భవిష్యత్తులో జేఈఈ, ఎంసెట్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల పాలిట కుదించిన చాప్టర్లు శాపంగా మారే అవకాశం కన్పిస్తోంది. తగ్గించిన 30 శాతం సిలబస్ నుంచి ప్రతి ఏటా గణితంలో 20 నుంచి 30 మార్కులు వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. అలాగని ఫస్టియర్ నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ అయిన విద్యార్థులు ఇప్పుడు కోత పెట్టిన పాఠాలపై దృష్టి పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. సాధారణంగా రెండో ఏడాది మధ్య నుంచే విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ఏడాది సిలబస్ పూర్తి చేయడమే కష్టంగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది 1,600 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని ఎలా అధిగమించాలో తెలియక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఆ చాప్టర్లపై అవగాహన కలిగించాలి ఫస్టియర్లో త్రికోణమితి బేసిక్స్ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో ఏడాదిలో ఈ పాఠం విద్యార్థులకు కష్టంగా ఉంది. బోధిస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. రెండో ఏడాదిలోనూ ఆ పాఠాలు తీసేస్తే బాగుండేది. ఫస్టియర్లో కోత పెట్టిన చాప్టర్లపై కొంత అవగాహన కల్గించాల్సిన అవసరం ఉంది. – రఘురాం, గణితం అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జడ్చర్ల -
యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ నెట్! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్! ఇందులో ప్రతిభ చూపి..మెరిట్ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్ జూన్–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ... పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్–2021 సెషన్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు సెషన్లకు సంయుక్తంగా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్–2020 సెషన్, జూన్–2021 సెషన్లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్–2020 సెషన్ వాయిదా పడింది. అలాగే జూన్–2021 సెషన్ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్–2020 సెషన్ అభ్యర్థులు కూడా జూన్–2021 సెషన్కు హాజరు కావొచ్చు. 81 సబ్జెక్ట్లలో పరీక్ష యూజీసీ నెట్ మొత్తం 81 సబ్జెక్ట్ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. అర్హతలు ► అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ► పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్సీఎల్, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ యూజీసీ–నెట్ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ► యూజీసీ–నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ► మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ► పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ► పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ► పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ► పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కనీస అర్హత మార్కులు ► యూజీసీ నెట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి. ► కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్పై గట్టి పట్టుండాలి. పేపర్1: ఆసక్తి, అవగాహన ► పేపర్–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2: సబ్జెక్ట్ ప్రశ్నలు పేపర్–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. యూజీసీ నెట్ 2021–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 5,2021 ► ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2021 ► ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 12 ► పరీక్ష తేదీలు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ► ప్రతి రోజు రెండు షిఫ్ట్ల్లో పరీక్ష (మొదటి షిప్ట్ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, మెడికల్.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం–గ్రూప్–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్ తర్వాత ఎంతో క్రేజ్ ఉండే పోలీస్ రిక్రూట్మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్లకు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశం ► జ్యాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్ ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్–1,2 సర్వీసులకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► పారా మెడికల్ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది. ► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా సెట్ స్కోర్ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది. సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్ను పరిశీలించి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ స్టడీస్ ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ స్టడీస్ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్ స్టడీస్లోని కోర్ టాపిక్స్తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంశాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు జనరల్ స్టడీస్తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. అకడమిక్స్ + సమకాలీన జాబ్ క్యాలెండర్లో పలు స్పెషలైజ్డ్ పోస్ట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్ స్టడీస్తోపాటు ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్గా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మాత్రం డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్ టేబుల్ ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఒకే అర్హతతో పలు పరీక్షలు ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్–ఎస్ఐ పోస్ట్లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తు ప్రణాళికే ముఖ్యం ఏపీ జ్యాబ్ క్యాలెండర్లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్కు ఉపక్రమించి.. టాపిక్వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. – జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు -
టెన్త్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
IIT JAM 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్–2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్తో ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్ మొదలు.. బీటెక్ ఉత్తీర్ణులు రాసే గేట్ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్డ్, లేదా గేట్ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్!! జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్నే సంక్షిప్తంగా జామ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్–2022 షెడ్యూల్ను ప్రకటించింది. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లు జామ్లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్డీ స్థాయి ప్రోగ్రామ్స్లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్పూర్, కాన్పూర్, ఖరగ్పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్లతోపాటు ఐఐఎస్సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. కోర్సులు ► జామ్లో సాధించిన స్కోర్తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు); జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్డీ; ఎమ్మెస్సీ–పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్లో ప్రవేశం పొందొచ్చు. ► వీటితోపాటు ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అందుబాటులో ఉంది. జామ్ స్కోర్ ఆధారంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్సీ బెంగళూరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఏడు పేపర్లలో పరీక్ష జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్;మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. మూడు విభాగాలు ► జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. ► సెక్షన్ ఏ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ► సెక్షన్ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ► సెక్షన్ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్ పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపు జామ్లో స్కోర్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. సిలబస్.. ప్రిపరేషన్ ఐఐటీ–జామ్లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్టోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్,క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పేపర్కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్లను అధ్యయనం చేయాలి. జియాలజీ ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్కు 40 శాతం, స్టాటిస్టిక్స్కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్లో.. మ్యాథ్స్కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. ఫిజిక్స్ మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. ఐఐటీ–జామ్ 2022 ముఖ్య సమాచారం ► ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2021 ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: జనవరి 4, 2022 ► జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022 ► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jam.iitr.ac.in -
TS EDCET 2021: ఎడ్సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్సెట్లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్సెట్కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్పై పట్టు సాధిస్తే ఎంట్రన్లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్సెట్కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
గుడ్న్యూస్: పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్
సాక్షి, ఎడ్యుకేషన్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం...స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ మొదలైనవి www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sakshieducation.com/TCLASS/Index.html -
టెన్త్కు రెగ్యులర్ తరగతులు!
సాక్షి, అమరావతి: కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్పై ప్రతిపాదనలు అందించనున్నారు. రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు. -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్బుక్స్ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
ఇంటర్ సిలబస్ తగ్గింపు; ఈ ఏడాదికే
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యా సంవత్సరానికి (2020-21) గాను 30 శాతం తగ్గించారు. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలిగించిన పాఠ్యాంశాల వివరాలను ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలిగించామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు నెల క్రితమే 30 శాతం సిలబస్లో కోత విధిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం సహా ఇతర సబ్జెక్టుల సిలబస్పై నిపుణుల కమిటీలతో చర్చించి వాటి సిఫారసు ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఇక సిలబస్ తగ్గింపు అంశం ఈ సంవత్సరానికే వర్తిస్తుందని తెలిపారు. -
‘కుదింపు’ రాజకీయం
విద్యార్థులపై ప్రభుత్వాలు కరుణ చూపే సందర్భాలు గతంలో చాలా తక్కువుండేవి. ఏవో కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రభుత్వాలుగానీ, కేంద్రంగానీ వారి గోడు పట్టించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దేశంలో విద్యను ప్రైవేటుకు విడిచిపెట్టి, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు దశాబ్దా లుగా భారీ ఫీజులతో పీల్చిపిప్పిచేస్తున్నా నామమాత్రం చర్యలతో పాలకులు పొద్దుపుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని పరోక్షంగా తూట్లుపొడిచారు. ఈ విధానం ఇప్పట్లో మారుతుందో లేదోగానీ... కరోనా మహమ్మారి పుణ్యమా అని సిలబస్లో మాత్రం మూడో వంతు తగ్గిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. 2020–21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకూ వున్న సిలబస్లో 30 శాతాన్ని తగ్గిస్తూ బుధవారం ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ తరగతుల విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లోని స్పందనలు చెబుతున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలకు ప్రశ్న పత్రాలు రూపొందించేటపుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నదే వారి ఏకైక డిమాండు. ఇతర తరగతులవారు సైతం మా సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ వయసు పిల్లల్లో అత్యధికులు సిలబస్ భారం తగ్గిందంటే వేరే విధంగా స్పందిస్తారని అనుకోనవసరం లేదు. కానీ విపక్షాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి. ఈ నిర్ణయంలో దురుద్దేశాలున్నాయని ఆరోపిస్తు న్నాయి. సిలబస్ తొలగింపులో కాదు... విపక్షాల పాక్షిక దృక్పథంలోనే దురుద్దేశం వుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వాదన. అందుకాయన కొన్ని కారణాలు చెబుతున్నారు. ఒక్క సామాజిక శాస్త్రాల్లో మాత్రమే కాక సైన్స్, గణితం, ఇంగ్లిష్, హిందీ, హోంసైన్స్, జామెట్రీ వంటి వేర్వేరు సబ్జెక్టుల్లో కూడా సిలబస్ తొలగించారని ఆయన వివరణ. సిలబస్ తగ్గింపుపై రాజకీయం వద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల పర్యవసానంగా 190 సబ్జెక్టుల్లో సిలబస్ కుదించామని, ఇది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని అటు సీబీఎస్ఈ చెబుతోంది. ఈసారికి సిలబస్ తగ్గించాలన్న డిమాండు తొలిసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్ సిసోడియా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తొలగించిన అంశాలు చూశాక ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అన్నింటి మూలాలు రాజకీయాలతో ముడిపడిన వర్తమానంలో సిలబస్ కుదింపు అంశం వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటా సిలబస్ కుదించాం కదా అన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్ వాదన సరైందే కావొచ్చు. కానీ ఇతర సబ్జెక్టులకూ, సామాజిక శాస్త్రాలకూ చాలా వ్యత్యాసం వుంది. పరస్పరం సంఘ ర్షిస్తున్న సిద్ధాంతాలు, భావనలు సమాజంలో అనేకం వుంటాయి. ఏకీభావం కుదిరే అంశాల్లో సైతం భిన్న దృక్పథాలుంటాయి. వాటిని గురించి చర్చించేవి, వివరించేవి, విద్యార్థికి అవగాహన కలిగించేవి సామాజిక శాస్త్రాలు. కనుక సహజంగానే ఆ శాస్త్రాల్లో తొలగించిన సిలబస్పై ప్రశ్నలు తలెత్తుతాయి. ఫలానా అంశం కాకుండా ఇదే ఎందుకు తొలగించవలసివచ్చిందన్న సంశయం వస్తుంది. ఆ తొల గింపు వెనకున్న ప్రయోజనాలేమిటన్న ఆరా ఉంటుంది. విపక్షాలను సంతృప్తిపర్చడానికో, మరెవ రికో తలెత్తే అనుమానాలు తీర్చడానికో కాదు... విద్యారంగ నిపుణులనుంచి ఎలాంటి అభ్యంతరం రాకుండా వుండాలంటే సీబీఎస్ఈ అయినా, మరెవరైనా సిలబస్ తొలగింపు విషయంలో పారదర్శ కంగా వుండాలి. అసలు ఫలానా అంశం లేకపోయినా ఫర్వాలేదనో... తొలగించి తీరాలనో ఏ ప్రాతి పదికన నిర్ణయానికొచ్చారో, అందుకు అనుసరించిన విధానంలోని హేతుబద్ధత ఏమిటో చెప్పాల్సిన బాధ్యత సీబీఎస్ఈకి వుంటుంది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజం. ఉదాహరణకు పద కొండో తరగతిలో ప్రజాస్వామిక హక్కులు, పౌరసత్వం, ఫెడరలిజం, జెండర్, మతం, జాతీయ వాదం, లౌకికవాదం వంటి అంశాలు సిలబస్ కుదించాక ఎగిరిపోయాయి. ఇవన్నీ ఏ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకైనా అత్యంత ప్రాథమికమైనవి. మరోవిధంగా చెప్పాలంటే అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ అంశాల్లో సమాజం వైఖరి ఎలావుందన్నదాన్ని బట్టే ఆ సమాజం ప్రజాస్వామికమైనదా, కాదా అన్నది తేలుతుంది. సామాజిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఆ అంశాల జోలికిపోకుండా ప్రజాస్వామ్యం గురించి ఏం అవగాహన చేసుకుంటారు? పన్నెండో తరగతి సిల బస్లో ‘ఇరుగు పొరుగుతో భారత్ సంబంధాలు’, సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, సామాజిక ఉద్య మాలు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. మాయమైన ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు అనువుగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా విషయక క్యాలెండర్లో పొందుపరిచారు గనుక ఆందోళన పడొద్దని సీబీఎస్ఈ వివరిస్తోంది. కానీ ఈ అంశా లను లోతుగా అధ్యయనం చేయడం, చర్చించడం ఎలా సాధ్యం? ఈ కరోనా కాలం కొత్త అనుభవా లను కలిగిస్తోంది. ఎన్నడూ ఊహించడానికి శక్యంకానివి కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక ప్పుడు మోడరేషన్ కింద ఒకటి రెండు మార్కులు కలపాలంటే ఉద్యమాలు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు బడికి వెళ్లాల్సిన భారం లేకపోవడం, చదవకుండానే, పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, ఇప్పటికే ఫెయిలై సప్లిమెంటరీ రాయవలసినవారు కూడా పైతరగతులకు అర్హులు కావడం వంటివన్నీ జరిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గనుక, తొలగించిన అంశాలకు సంబంధించి బీజేపీకున్న దృక్పథమేమిటో తెలుసు గనుక సహజం గానే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిరుడు ఏప్రిల్లో కూడా సీబీఎస్ఈ కుల ఘర్షణలు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే సవాళ్లు, భిన్నత్వంవంటి అంశాలు తొలగించింది. విద్యార్థులకు సిల బస్ భారాన్ని తొలగించాలనుకోవడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆ పేరుతో అసలు ఆలోచించే భారాన్నే కుదించాలనుకోవడం మంచిది కాదు. ఈ కుదింపు తరచుగా వివాదాస్పదమవుతున్నది గనుక అందులో పారదర్శకతకు చోటీయడం ఉత్తమం. -
సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక్కసారి మాత్రమే.. 9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు. -
సిలబస్ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు. ప్రతి సబ్జెక్టులో 30 శాతం కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లోనూ పాఠశాలలు కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది. -
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదైన కొన్ని రోజులకే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఈ క్రమంలోనే అన్ని తరగతుల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది పాఠశాలలు తెరవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. (ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ) ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే కుదించిన సిలబస్ను కూడా టీచర్లు విద్యార్థులు చెప్పాలని, అయితే వాటిని పరీక్షలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్ కుదింపు విషయంలో కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. సిలబస్ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విద్యార్ధుల సిలబస్ 30 శాతం తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. (సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు) -
సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సకాలం లో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్, పని దినాలను కుదించేందుకు ఎంహెచ్ఆర్డీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు, పని దినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్–2020’ పేర అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంహెచ్ఆర్డీ ట్విట్టర్ ఖాతాకు లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచిం చారు. మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కసరత్తు ప్రారంభించింది. -
ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సిలబస్ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సెప్టెంబర్లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'సిలబస్ను ఆన్లైన్లో పూర్తి చేయండి'
సాక్షి, అమరావతి : కరోనాతో లాక్డౌన్ కారణంగా సిలబస్ పూర్తి కాకపోవటం, పరీక్షలు నిర్వహించలేకపోవటం తదితర అంశాలపై అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తికాని సిలబస్ను ఆన్లైన్ ద్వారా భోదన చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తికాని సెమిస్టర్లు ఆన్లైన్ ద్వారా పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు కూడా ఆన్లైన్లో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2020-21 విద్యా సంవత్సరంలో పనిదినాలు కోసం పండుగలు ఇతర సెలవుదినాలు కూడా పరిశీలించి మొత్తం పనిదినాలు 220కు తగ్గకుండా చూసుకోవాలన్నారు.క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న హాస్టల్, ఇతర విద్యాశాఖ భవనాలు తిరిగి వినియోగించుకునే ముందు సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులతో యూటిలైజేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు. వాటిని పూర్తి స్థాయి లో శుభ్రపరిచిన తరువాతే భవనాలు వాడుకునేలా చూడాలన్నారు. అన్ని అసోసియేషన్, అనుబంధ కళాశాలల్లో నిబంధనలకు లోబడి ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యా సంస్కరణలపై జీవో 63 అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం లో ఇతర దేశాలకు వెళ్లలేని విద్యార్థులు ఇక్కడ కళాశాలల్లో చేరేందుకు అవకాశాలు కోసం చూస్తారన్నారు. దీని వల్ల కోర్సులు, సీట్ల కొరత రాకుండా చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏఐ’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్లు, ఇతర సదుపాయాలు, సిలబస్ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్టీయూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభమైన కసరత్తు.. జేఎన్టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. -
పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. -
ఆ పాఠాలు ఉండవిక...
విద్యావిధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి లేని విద్య అందించే ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. బడి అంటే అదేదో బందిఖానాలా కాకుండా... ఆటపాటల నిలయంగా మార్చే యత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆనందలహరి... నో బ్యాగ్డే...అంటూ సంస్కరణలు తీసుకొచ్చిన సర్కారు తాజాగా పలు తరగతుల సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రణాళికను తాజాగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు, సరళీకృతమైన సమగ్ర విద్యాబోధనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పాఠశాలల్లో వివిధ తరగతులకు నిర్దేశించిన విద్యాప్రమాణాలను సాధించ డం ఉపాధ్యాయులకు తలకుమించిన భారమవుతోంది. సిలబస్ పూర్తి చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరం లేని పాఠాలను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు విద్యార్థి భవిష్యత్తుకు అవసరమయినవా కావా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బోధనలో ఉపయోగిస్తున్న కొన్ని పాఠ్యాం శాలను తొలగించాలని నిర్ణయించింది. వయోపరిమితిని అనుసరించి విద్యార్థుల సామర్థ్యాలు, వారి మానసిక స్థితిని బేరీజు వేసుకున్న విద్యా శాఖలోని ఎస్సీఈఆర్టీ(రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ) విభాగం మూడో తరగతి నుంచి 8 వ తరగతి వరకూ గల పాఠాల్లో పలు పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. ఆయా పాఠ్యాంశాల వివరాలను విద్యా శాఖకు పంపింది. ఆ పాఠాలను ఇప్పుడు విద్యార్థులు చదవనవసరం లేదనీ, వీటిని పుస్తకాల్లోంచి తొలగించాలని ఏపీ ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. గుర్తించిన పాఠ్యాంశాలపై పరీక్షలుండవని కూడా స్పష్టం చేసింది. తొలగించనున్న పాఠ్యాంశాలివే... మూడో తరగతి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం, లడ్డూ బాధ, పిల్లల మర్రి, చెట్టు కోరిక వంటి వాటితో పాటు ఇంగ్లిష్లో మూడు, లెక్కలులో రెండు, ఈవీఎస్లో నాలుగు, నాలుగో తరగతిలో తెలుగు నాలుగు పాఠాలు ఇంగ్లిష్ రెండు పాఠాలు లెక్కలులో మూడు ఇలా వరుసగా ఒక్కో తరగతిలోనూ రెండు నుంచి ఆరు వరకూ పాఠాలను అవసరం లేనివిగా గుర్తించారు. ఆరో తరగతిలో ఉర్దూ సబ్జెక్టులో ఆరు పాఠాలు అవసరం లేనట్టు గుర్తించారు. ఇలా ఎనిమిదో తరగతి వరకూ పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచే అమలు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వర కూ అన్ని సబ్జెక్టులలోనూ అవసరం లేని పాఠ్యాంశాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు చెప్పింది. 2019–20 నుంచి ఈ పాఠ్యాంశాలు అవసరం లేనివని వీటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. సామర్థ్యాలు పెరుగుతాయి దీని ప్రకారం వేలాది మంది విద్యార్థులు అవసరమయిన పాఠాలను ఆకళింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యాంశాలను వదిలి వేయడం వల్ల మిగతా ముఖ్యమైన పాఠాలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు పె రుగుతాయి. ఉపాధ్యాయులు కూడా కాస్త ఎక్కు వ సమయాన్ని మిగిలిన పాఠ్యాంశాలపై దృష్టి సా రించి బోధించేందుకు అవకాశం కలుగుతుంది. బోధన సరళీకృతమవుతుంది అవసరం లేని పాఠాలను తొలగించడం వల్ల బోధన సరళీకృతమవుతంది. దీని వల్ల విద్యార్థులు ము ఖ్యమైన పాఠాలపై ఏకాగ్రత పెంచుకుని చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. మరింత తొందరగా సిలబస్ను పూర్తి చేసి రివిజన్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. – జె.సి.రాజు, హెచ్ఎం, నారాయణప్పవలస -
‘అకాడమిక్’ అయోమయం..!
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం.. శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో గందరగోళం.. యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పరీక్షల తేదీని పొడగిస్తాం.. డిగ్రీ కోర్సుల్లో సిలబస్ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్ -
గ్రూప్–1 సిలబస్తో గుండె గుభేల్!
సాక్షి, అమరావతి: గ్రూప్–1 సిలబస్ను మార్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చినవీ సకాలంలో పూర్తి చేయకుండా ఇప్పటికే తమ తలరాతలు మార్చేస్తున్న ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్పుతో మరింత గందరగోళానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. కొత్త సిలబస్ ప్రకటనతో రూ.లక్షలు ధారపోసి తాము పొందిన అంతా శిక్షణ అంతా వృథా కానుందని వాపోతున్నారు. మెయిన్స్లో ఏడు పేపర్లు.. గ్రూప్–1 సిలబస్లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్లో గతంలో జనరల్ ఇంగ్లిష్తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్తోపాటు తెలుగు పేపర్ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్లో రెండు పేపర్లు.. ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. మార్పులతో కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. సిలబస్ రెట్టింపు.. –గతంలో మెయిన్స్లో ఇంగ్లీషుతో కలిపి ఆరు పేపర్లుండగా కొత్తగా తెలుగు చేర్చారు. ఇంగ్లిషు, తెలుగు రెండూ క్వాలిఫయింగ్ పేపర్లే. ఇంగ్లీషు సిలబస్ను కఠినం చేశారు. గతంలో మెయిన్స్లో ఒక్కో పేపర్కు 3 గంటల సమయం కేటాయించగా ఇప్పడు 2.30 గంటలకు తగ్గించారు. –మెయిన్స్ పేపర్–2 లో కొత్తగా ఇండియన్, ఏపీ జాగ్రఫీని 50 మార్కులకు చేర్చారు. పేపర్–3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బేసిస్ నాలెడ్జి ఆఫ్ లా’ అంశాలను అదనంగా 120 మార్కులకు చేర్చారు. సివిల్స్లో ప్రధాన పేపర్గా ఉన్న ఎథిక్స్లోని అంశాలను ఇక్కడ కేవలం ఒక సెక్షన్లో పెట్టారు. హిస్టరీ, ఎకనామిక్స్లు పాత సబ్జెక్టులే అయినా వాటి అంశాలను మరింత ఎక్కువ చేశారు. దాదాపు రెట్టింపు అయిన సిలబస్కు సన్నద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికే పాత సిలబస్లో గ్రూప్–1 కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఏడాదిన్నరగా తీసుకున్న కోచింగ్ అంతా వృథా అని వాపోతున్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద చెల్లించిందంతా వృథా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇదంతా పాత సిలబస్లోనే కొనసాగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రవేశపెట్టడంతో ఈ శిక్షణ అంతా వృథా కానుంది. సిలబస్ పెరగడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు మూడు రెట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్ను ప్రస్తుతం ఇవ్వనున్న నోటిఫికేషన్లకు కాకుండా తరువాత వెలువడే వాటికి వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల సివిల్స్ అభ్యర్ధులకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. మెయిన్స్లో ఏడు పేపర్లు గ్రూప్–1 సిలబస్లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్లో గతంలో జనరల్ ఇంగ్లిష్తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్తోపాటు తెలుగు పేపర్ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. -
ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘టాపర్’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్.కామ్ కో–ఫౌండర్ హేమంత్ గోటే టీ. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీ సీట్ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్లో స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్ అనే ఫోన్కామర్స్ స్టార్టప్లో ప్రిన్సిపల్ ఇంజనీర్గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్లో సహోద్యోగీ జీశాన్ హయత్తో కలిసి 2013 ఏప్రిల్లో కోటి రూపాయల ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్స్తో ముంబై కేంద్రంగా టాపర్ను ప్రారంభించాం. 50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు.. 5–12 తరగతి వరకు బోర్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, పోటీ పరీక్షల సిలబస్లు, మెటీరియల్స్ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్ఈఈ, బిట్శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్తో పాటూ ఆన్లైన్లోనే ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్, లైవ్ చాట్లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం.. ప్రిపరేషన్ మెటీరియల్స్ ఏడాది, ఐదేళ్ల సబ్స్క్రిప్షన్స్ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్స్క్రిప్షన్స్ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్పూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నాం. జోద్పూర్కు చెందిన ఈసీప్రిప్ను, ముంబైకి చెందిన మంచ్.. రెండు ఎడ్యుకేషన్ స్టార్టప్స్ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్లకూ విస్తరిస్తాం. రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్ ప్రిపరేషన్ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్ క్యాపటలిస్ట్లు ఆసక్తి చూపిస్తున్నారు. -
సిలబస్పై సమ్మెటివ్!
►సజావుగా సమ్మెటివ్ పరీక్షలు జరిగేనా? ►సకాలంలో సిలబస్ పూర్తికావడం కష్టమే ►ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ►సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న సమ్మెటివ్ పరీక్షలు ►సిలబస్ పూర్తయిన మేరకే ప్రశ్నాపత్రాలను తయారుచేయాలి ►ఉపాధ్యాయ సంఘాల వినతి కడప ఎడ్యుకేషన్ : అటు విద్యార్థుల్లోనూ, ఇటు ఉపాధ్యాయుల్లోనూ సమ్మెటివ్ పరీక్షల టెన్షన్ ఎక్కువైంది. మరో 20 రోజుల్లో పరీక్షలు ఉండటంతో సిలబస్పై భయం మొదలైంది. పరీక్షల నాటికి ఎట్లాగైనా సిలబస్ పూర్తిచేయాలని అధికారులు వెంటపడుతుండటంతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వరుస పండగలు, సెలవుల నేపథ్యంలో బోధన కదలని పరిస్థితి. సిలబస్ లక్ష్యం పూర్తిపై ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బోధన గాడితప్పడానికి బదిలీలే కారణమని సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలు ప్రారంభమైన జూన్ నెల నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ఉపాధ్యాయులు బదిలీల గొడవల్లో మునిగి తేలారు. బదిలీల కోసం దరఖాస్తులు ఎలా చేసుకోవాలి, ఎవరెవరికి ఏ పాఠశాల వస్తుంది, ఏ పాఠశాల అయితే బాగుంటుంది ఇలా తర్జనభర్జలలో అయ్యవార్లు బిజిబిజీగా గడిపారు. దీంతో జూన్ 12 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ జరిగిన అయ్యవార్ల బదిలీల గొడవలో విద్యార్థుల చదువులు అటకెక్కాయి. బదిలీల ప్రక్రియలో భాగంగా వరుసగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, ఎల్పీలు, ఎస్జీటీల స్థానచలనాలు మొత్తం ఈనెల 10వ తేదీ వరకు సాగాయి. వరుసగా సెలవులు మొదటగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఆగస్టు 1వ తేదీన వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. ఆతర్వాత ఎస్జీటీలు మిగతా ఉపాధ్యాయులు ఆగస్టు 11న తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరిపోయారు. తీరా విధుల్లో చేరిన వారం పదిరోజులకే మళ్లీ నాలుగు రోజులపాటు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. తర్వాత తిరిగి పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు నాలుగు రోజులు పాఠాలు చెప్పాగానే మళ్లీ ఆదివారం వచ్చింది. తిరిగి 21, 22 తేదీలలో ఉపాధ్యాయులకు టెలీ కాన్ఫరెన్సు పేరుతో రెండు రోజులు కాలాన్ని హరించేశారు. బోధనపై దృష్టిసారించేలోపు మళ్లీ శుక్రవారం రోజు వినాయక చవితి శనివారం అదివారం ఇలా రోజులన్నీ సెలవులతో ముగిసిపోనున్నాయి. మరేమో ఇచ్చేనెల 11వ తేదీ నుంచి 1 నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు సమ్మెటివ్ పరీక్షల నిర్వాహణ ప్రభుత్వం తేదీని ప్రకటించింది. సిలబస్ చూస్తే పదిశాతం కూడా పూర్తి కాని పరిస్థితి. బోధన అంతంతమాత్రమే. సమ్మెటివ్ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఈ 20 రోజులు సెలవులు లేకుండా బోధన సాగితేనే కొంతైనా విద్యార్థులు పరీక్షలు రాయగలరు. మరి ఉపాధ్యాయులు అంత బాధ్యతగా సిలబస్ పూర్తి చేస్తారా.. అనేది అనుమానామే. మరి అధికారులు ఏం చేస్తారో వేచిచూడాల్సిందే. కాగా పూర్తయినంత సిలబస్ మేరకే సమ్మెటివ్ ప్రశ్నపత్రాలను ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత జిల్లాలో ఇంకా కొన్ని పాఠశాలల్లో సజ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందులోభాగంగా హిందీకి సంబంధించి 28 మంది, తెలుగుకు 44 మంది, సోషల్కు 35 మంది, గణితానికి 15మంది, ఫిజికల్ సైన్సుకు ఐదుగురు, బయలాజికి 15 మంది చొప్పున ఉపాధ్యాయుల కొరత ఉంది. -
టెట్ సిలబస్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సిలబస్లో విద్యా శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అంశాన్ని టెట్ సిలబస్లో చేర్చింది. బోధన పద్ధతులు అంశంలో దీన్ని చేర్చింది. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అంశాలను ఇందులో పేర్కొంది. టెట్లో వీటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. -
స్కూల్ టీచర్లకూ అదే సిలబస్..!
- ‘గురుకుల’ పోస్టుల సిలబస్నే వర్తింపజేసే అవకాశం - రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన అధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల పోస్టులకు ప్రకటించిన సిలబస్నే పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకూ వర్తింపజేసే అవకాశం కనిపిస్తోంది. గురుకులాల్లోని పోస్టులతో పాఠశాలల్లో ఉన్న సమాన స్థాయి పోస్టులకు గురుకుల పోస్టులకు పేర్కొన్న సిలబస్నే వర్తింపజేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా శాఖ అధికారుల కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసినట్లు సమా చారం. ఉదాహరణకు గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టుల తో పాఠశాలల్లో సమాన పోస్టు స్కూల్ అసిస్టెంట్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీజీటీలకు పేర్కొన్న సిలబస్నే అమలు చేసే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండే పీఈటీ వంటి పోస్టులకు పేర్కొన్న సిలబస్ను వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటికితోడు టెట్ వెయిటేజీ యథాతథంగా అమలు చేయనున్నారు. గత ఏడాది ఇంగ్లిష్ మీడియంను ఒకటో తరగతిలో ప్రారంభించిన ప్రభుత్వం ఈసారి రెండో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా 150 మార్కులు ఉంటే ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్తోపాటు బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్లో 50 మార్కులకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. పేపర్లవారీ విధానాన్ని టీఎస్పీఎస్సీ ఖరారు చేయనుంది. టీఎస్పీఎస్సీ గురుకులాల తరహాలో పరీక్షా విధానం ఖరారు చేసినా, మరేవిధంగా చేసినా, క్లాస్ రూమ్ డెమో ఉండాలని విద్యాశాఖ అధికారుల కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసిన ట్లు తెలిసింది. క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యం కాదనే గురుకుల పోస్టుల్లో పెట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల టీచర్ పోస్టుల భర్తీ క్రమంలో క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యమా? అన్నది టీఎస్పీఎస్సీ, ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. -
మొగ్గల్ని చిదిమే అతి మోహం
సమకాలీనం ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి. ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెనుగులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడుతున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక. ఈ మధ్య నేనో మిత్రుడి ఇంటికి ఫోన్ చేస్తే, వాళ్లబ్బాయి ఫోన్ ఎత్తాడు. ‘నాన్నున్నాడా?’ అంటే, ‘ఏమో అంకుల్, చూడాల’న్నాడు. ‘కనుక్కొని చెప్పరా’ అంటే, ఒకింత విసుగ్గా ‘సెల్కి చెయ్యండంకుల్’ అని కర్తవ్యబోధ చేసి ఫోన్ పెట్టేశాడు. ఎంత ఇల్లని? రెండు పడగ్గదుల చిన్నిల్లు. కానీ, గదుల మధ్యే కాదు మనుషుల మధ్య కూడా గోడలు మొలిచి, ఎదిగి, దృఢపడు తున్న కాలమిది! ప్చ్!! ఒకే ఇంట్లో మనుషులు పరస్పరం మాట్లాడుకోవడం, మనసు విప్పుకోవడం, కదలికలు తెలియడం కూడా తగ్గిపోయిన విచిత్ర తర మనిపించింది. ఆ ఇల్లని కాదు... మా ఇంట్లో పరిస్థితీ అదే! చిన్న క్యూబికల్ కుటుంబాల నుంచి పెద్ద జన సమూహాల వరకు మానవ సంబంధాల్లోనే ఏదో లోపమొచ్చినట్టనిపిస్తోంది. ఈ వెలితికి మూలాలెక్కడున్నాయ్? ఈ ప్రశ్న నాటినుంచి మనసును తొలుస్తూనే ఉంది. బహిరంతర కారణాలు లీలగా కనిపిస్తూనే ఉన్నాయి. అస్పష్ట సమాధానం అక్కడక్కడ దొరికినట్ట నిపిస్తూనే జారిపోతోంది. నలభయ్యేళ్ల కిందటి మా బాల్యం, కౌమారం అలలు అలలుగా గుర్తొచ్చింది. మనిషి బుద్ధి కొద్ది, ‘అప్పుడు– ఇప్పుడు’ అంటూ పోల్చుకోవడం మామూలే కదా! ప్రస్తుతంలోకి పాత జ్ఞాపకాల దొంతర దొర్లింది. కాలమెంత మారింది? పిల్లల పెంపకంలోనే చెప్పలేనంత తేడా! ఆలోచనల్లోనే అంతరం! ఎంతో దూరం అక్కర్లే... గత శతాబ్ది అరవై, డెబ్బైలలో మేం పెరిగాం. ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్నారు. అక్షరాలే తేడా! పెరగటంలో కొన్ని లోపాలున్నా, పెంచడంలో ఉన్న లోపాలు వాటిని మించి పోయాయి. మనిషి ఎదిగే క్రమంలో వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే పటిష్ట పునాది పడటం లేదనిపిస్తోంది. బాల్యం కొంత వరకు నయమేమో కానీ, కౌమారం కర్కశంగా నలిగిపోతోంది. ఫలితంగా విశ్వాసం లోపించిన యవ్వనం భయం భయంగా మొదలవుతోంది. యుక్త వయసుకు ముందు సాగే కౌమార జీవన గమనంలో సహజత్వానికి బదులు కృత్రిమత్వం పెరిగి పోయింది. ఒత్తిడి వారిని నలిపేస్తోంది. మెదడు వికసించే దశలో పిల్లలు ప్రకృ తికి, సహజ వాతావరణానికి, పరిసరాల పరిశీలనకి, స్వతహాగా జనించే ఆలో చనా స్రవంతికి దూరమవడం కూడా ఈ వైకల్యానికి బలమైన కారణమేమో! తపన జడిలో తల్లిదండ్రులు బాల్యం నుంచి బతుకు ఒక్కపెట్టున నడివయసుకో, వృద్దాప్యంలోకో దుమి కితే..! అంతకన్నా దౌర్భాగ్యం మరోటుండదు. కానీ, అదే జరుగుతోంది. ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు...’ అని మహాకవి శ్రీశ్రీ అన్నది ఇలాంటి వాళ్లనుద్దేశించేనేమో! మనిషి జీవితంలో అత్యంత కీలకమైన కౌమా రదశ కర్కశంగా చిదిమివేతకు గురౌతోంది. కొందరి విషయంలో అసలది ఉందో లేదో తెలీట్లేదు. ఫలితంగా కొన్ని జీవితాల్లో యవ్వనం బలవంతపు బతుకీడ్పుగా మొదలవుతోంది. కల్లోల కడలిలో నావలా నడివయసు. ఎండకు, వానకు అల్లాడే పండుటాకులా ఏ ఆసరా లేని ముదిమి. సరళ జీవి తాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నాం. బాల్యం ముగిసి శారీరకంగా, మాన సికంగా ఎదుగుదల మొదలయ్యే పదో ఏటి నుంచి ఇరవయ్యో యేడు వరకు వయసును కౌమారం (అడులుసెంట్)గా పరిగణిస్తుంది సమాజం. ప్రపంచ ఆరోగ్య సంస్థా ఇదే లెక్క చెప్పింది. సరిగ్గా ఈ వయసులోనే ఆలోచనలు, దృక్పథాలు, ప్రవర్తనల్ని బలపరుచుకుంటూ మెదడు వికసిస్తుంది. ‘బాల్యం నుంచి పెద్దమనిషిగా ఎదుగుతూ, వ్యక్తిగా తాను నిర్వహించాల్సిన పాత్రను నేర్చుకునే సంధి దశ’గా కౌమారాన్ని ‘వికీపీడియా’ నిర్వచిస్తోంది. మొగ్గకు పువ్వుకూ మధ్యలోని దశ. ఇప్పటి పిల్లలు అనేకానేక కారణాల వల్ల సహజ మానవ సంబంధాలు, ప్రకృతి పరిణామాలు, సొంత ఆలోచన, వైవిధ్యా నుభూతులకు దూరమౌతున్నారు. అవి అనుభవంలోకి రాకుండానే ఆ దశను దాటేస్తున్నారు. ఫలితంగా ఎంతో కోల్పోతున్నారు. వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన గట్టి భూమిక ఏర్పడటం లేదు. బలవంతంగా వారిపై రుద్దుతున్న మన యాంత్రిక విద్యా విధానమూ కారణమే! పోటీ ప్రపంచంలో వారిని విజ్ఞానవంతుల్ని చేసి, మంచి స్థాయిలో ఉన్నతులుగా చూడాలని తల్లిదండ్రులు ఆశించడం సహజం. ఈ క్రమంలో తమకు తెలియకుండానే వారు తమ పిల్లలపై పెంచే ఒత్తిడి చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణం, ఎదుగు దలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అనారోగ్యకర పోటీ వాతావర ణమూ సమస్యను జఠిలం చేస్తోంది. ‘మా పిల్లలు అన్నిట్లో అగ్రభాగాన ఉండాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. ఏదడిగినా టక టకా చెప్ప గలగాలి’ ఇటువంటి కల తల్లిదండ్రులది. అందరూ తమ పిల్లలు ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలనో అమెరికా, యూకే వెళ్లి పుష్కలంగా సంపద కూడగట్టాలనో కలలు కంటున్నారు. అందుకే, అయిదారు తరగతుల నుంచే కాన్సెప్ట్ స్కూల్స్, ఫౌండేషన్ కోర్సులొచ్చాయి. ఏ సిలబస్ చదివి, ఎన్ని మార్కులు సంపాదించి, ఎంత ర్యాంకు తెచ్చుకున్నాడనేదే కొలమానం! ఎంత జీవితాన్ని చదివాడు? ప్రాపంచిక విషయాలెన్ని తెలుసు! నిజ జీవి తంలో ఓ సమస్య వస్తే గట్టిగా నిలబడి ఎదుర్కోగలడా? ఎలా అధిగ మిస్తాడు! అన్న స్పృహ వారికి తట్టడం లేదు. స్వేచ్ఛగా ఆలోచించే వెసులు బాటు లేకుండా, పరిశీలనా తత్వం అలవడకుండా, ప్రాపంచిక విషయాలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎలా ఎదుగుతారు? ఇవేవీ పెద్దలకు పట్టడం లేదు. అమ్మ ఎంత కష్టపడుతోంది? నాన్న ఎన్ని త్యాగాలు చేస్తున్నాడు? నేను ర్యాంకు తీసుకురాకపోతే వారికెంత అవమానం! అని తెలియకుండానే పిల్ల లపై పెరిగే ఒత్తిడి స్లోపాయిజన్ లాంటిదే! ఆశించిన ఫలితం రానప్పుడు అనుభవించే వారి మానసిక క్షోభకు లెక్కే లేదు. ఈ అపరాధభావన నుంచి పుట్టే అసహనం ఓ ఆత్మన్యూనతకు, అది అయితే చెడు సావాసాలకో, కాకుంటే ఆత్మహత్యా భావనకో పురికొల్పుతోంది. ఇక జీవితం దుర్భరం. సిలబస్ బయట నేర్వగల పాఠాలెన్నో! కౌమారంలో శారీరకంగా లింగవైవిధ్యం స్థిరపడేటప్పుడు మానసిక స్థితిలో కొంత అలజడి ఉంటుంది. ఏదేదో చేయాలని, ఉనికిని ధృవపరచుకోవాలనే సంక్షోభం వెన్నాడుతుంది. అప్పుడు సహజసిద్ధమైన స్వేచ్ఛలో కన్నా కృత్రిమ నిర్బంధంలో పొరపాట్లకు ఆస్కారమెక్కువ. ఈ తరం యువత ఎదు ర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. పిల్లల్ని ఏదేదో చేసేయాలనుకునే తల్లిదండ్రులు చూపే శ్రద్ధాసక్తులు, నిరంతర పరిశీలన–నిఘా, ప్రమేయాలు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వవు. అవి వారి స్వీయ ఆలోచనలపై ఆంక్షలుగా కనిపిస్తాయి. రెండువైపుల ఇష్టాయిష్టాల మధ్య ఓ సంఘర్షణ. గతంలో ఇదుండేది కాదు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? తాము నిర్దేశించిన తీరులో ఉన్నారా–లేరా? వంటి తలిదండ్రుల నిరంతర నిఘా అప్పట్లో ఇంత లేదు. ఒక్కొక్కసారి పెద్ద పట్టింపే ఉండేది కాదు. మేం ఆరేడు నుంచి పదో తరగతి వరకు ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్లు ఇప్పుడు గుర్తొస్తే ఆశ్చర్యమేస్తుంది. చేలు, పొలాల్లో పంట కాపలాకో, గ్రామ పొలి మేరల్లో ఆటలకో, దిగుడు బావుల్లో ఈదులాటకో... ఎక్కడెక్కడికో వెళ్లేది. సెలవుల్లో వారాల తరబడి సమీప బంధువుల ఊళ్లకెళ్లేది. ఆ రోజుల్లో మా వయస్కులైన అత్యధికుల అనుభవాలివే! అప్పుడు మా ఊళ్లో రెండు వేలకు మించని జనాభా! వేసవి రాత్రులు భోంచేసి పడుకోవడానికి ఆరుబయట అరుగులపైనో, వాకిళ్లలోనో పక్క పరచుకునేది. పెద్దోళ్లు ఇళ్లల్లో నిద్దరోయాక, పది–పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే టౌన్లో సెకండ్షో సినిమాకో, సురభి వారి నాటకానికో వెళ్లొచ్చేది. అయిదారుగురికి తగ్గకుండా గుంపుగా కూడి నడిచో, సైకిళ్లపైనో వెళ్లి ఆట చూసి వచ్చాక... ఏమీ జరగనట్టు/ ఎరుగనట్టు చఢీచప్పుడు లేకుండా పడుకోవడం ఓ వింత అనుభూతి. కృష్ణ లీలలు, మాయాబజార్, బాలనాగమ్మ, తోటరాముడు వంటి సురభి నాట కాలు ఇలా చూసినవే. బయటి ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని చూసేదో! ఇలా సిలబస్ పుస్తకాల్లో లేని బోలెడు పాఠాల్ని నేర్పేది జీవితం. గ్రామీణ వాతా వరణంలో ఉన్న ఈ వెసులుబాటు పట్టణ, నగర జీవితంలో చాలా వరకు కొరవడింది. పట్టణీకరణ పెరిగిన క్రమంలోనే విద్యార్జన స్వరూప స్వభా వాల్లో చాలా తేడా వచ్చింది. కౌమారానికి పట్టిన దుస్థితి పల్లెల్లో కన్నా పట్టణాలు, నగరాల్లో మరీ ఎక్కువ. తాజా దుస్థితికి దోషులెందరో! పిల్లల్లో సహజాతిసహజమైన అమాయకతను తల్లిదండ్రులు భరించలేని స్థితి వచ్చింది. ‘అయ్యో! మీ వాడికింకా ఫొటోల డౌన్లోడ్ రాదా...? మా వాడైతే, సెల్ పట్టాడంటే...!’ ఇదీ వరస!! చిన్న వయసులోనే పిల్లలకు అన్నీ తెలుసని, తెలియకపోతే అదో లోపమని పెద్దలు బడాయిపోయే రోజులివి. అనవసరపు పోలికలు, అశాస్త్రీయమైన పంథా! జ్ఞానానికి, పరిజ్ఞానానికి తేడా తెలియని ప్రవాహంలో తల్లిదండ్రులు, టీచర్లు కొట్టుకుపోతున్నారేమో అనిపిస్తుంది. ఫక్తు వ్యాపార పంథాలో సాగే విద్యా సంస్థలూ అలాగే తయారయ్యాయి. పిల్లల్లో జ్ఞానతృష్ణ పెరగడానికి బదులు తల్లిదండ్రుల జ్ఞానవాంఛ వారిని వాస్తవాల్ని తెలుసుకోనీకుండా చేస్తోంది. దీనికి తోడు పిల్లలకి అనేక విష యాలు నేర్పుతున్నామనో, వనరుల్ని అందుబాటులో ఉంచుతున్నామనో... ఏదేదో చేసేయడం వారికి రివాజయింది. తమ మాటల్లో, చేతల్లో దాన్నొక త్యాగంగా చూపిస్తుంటారు. ప్యూపా దశ నుంచి సీతాకోకచిలుక దశకు ఎదగడం సహజంగా జరగాలి. ఇందులో ప్రకృతి సిద్ధమైన శాస్త్రీయ సూక్ష్మత ఇమిడి ఉంది. గూడును చీల్చుకు వచ్చే దాని పెనుగులాట వల్ల రెక్కల్లోని రక్తనాళాలు తెరచుకొని, ప్రసరణ సవ్యంగా జరిగి అవి బలోపేతమౌతాయి. బయటకు వచ్చిన వెంటనే అది స్వతహాగా ఎగరగలుగుతుంది. కానీ, ఆ పెను గులాట చూసి జాలిపడి, గూడుని మనమే చీల్చి దానికేదో సహాయపడు తున్నామనుకొని బయటకు లాగితే... రెక్కలు బలపడక మట్టిలో పడి కొట్టుకు చస్తుంది సీతాకోకచిలుక. తెలిసో–తెలియకో పిల్లల కౌమారాన్ని నలిపి మన మదే చేస్తున్నాం. దీనికి తోడు బాధ్యతా రహితంగా తీసే చౌకబారు సిని మాలు, అర్థంపర్థంలేని కార్యక్రమాలతో సాగే నేలబారు టీవీ ప్రసారాలు ఒక తరం యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్నెట్ విచ్ఛిత్తి తర్వాత, మరీ ముఖ్యంగా ‘సామాజిక మాధ్యమాల’ విస్తృతి పెరిగాక సెల్ఫోన్ ఈ తరం పిల్లల్ని, యువతని భ్రష్టుపట్టిస్తోంది. సానుకూలంగా మార్చుకోవాల్సిన ఓ ఆధునిక సదుపాయం సరైన మార్గదర్శకత్వం లేక పెడదారి పట్టిస్తోంది. ఇప్పుడీ దేశంలో యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచే నాయకత్వం, వ్యక్తులు లేకపోవడం ఓ దురదృష్టకర సన్నివేశం! తగిన కృషి, ఆదరణ కొరవ డటం వల్ల తరం మారుతున్న కొద్దీ కళా–సాంస్కృతిక వారసత్వం కూడా బలహీనపడుతోంది. సెల్ఫోన్–నెట్ దుర్వినియోగం చూసినపుడు, మానవ సంబంధాల పరంగా వరం కావాల్సిన శాస్త్ర సాంకేతికత యువతకు శాపమైం దేమోనన్న సందేహం కలుగుతుంది.‘‘నాకో భయం, శాస్త్రసాంకేతికత మానవ సంబంధాలని దాటేసిన రోజు ఈ ప్రపంచంలో మూర్ఖుల తరమే మిగులు తుంది’’ అన్న అల్బర్ట్ ఐన్స్టీన్ మాటలు గుర్తొస్తాయి. మన అడుగులు అటే పడుతున్నాయేమోననే సందేహం. పిల్లల్ని సహజంగా పెంచాలి. ప్రకృతికి దగ్గరగా ఉంచాలి. స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి. సరైన వయసులో సమ గ్రంగా ఎదగనివ్వాలి. ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్త పడితేనే, భవిష్యత్ ఆలోచనల్ని, ఆచరణల్ని ప్రభావితం చేసే ప్రస్తుత తరం ‘కౌమారం’ ధృతరాష్ట్ర కౌగిలిలోకి జారకుండా నిలుపుకోగలుగుతాం. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
విద్యార్థులకు విషమ ‘పరీక్ష’
* సిలబస్ పూర్తవకుండానే.. నిర్వహిస్తారట * 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం * వాయిదా వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు గుంటూరు ఎడ్యుకేషన్: సిలబస్ పూర్తి కాకముందే త్రైమాసిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధన పూర్తికాక ముందుగానే ఈ నెల 21 నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కేలండర్లో పొందుపర్చారు. ఫలితంగా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. చదవని పాఠాలపై పరీక్షలు! విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ కేలండర్ను అనుసరించి మొదటి నిర్మాణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్–1) పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నిర్వహించాల్సి ఉంది. ఒకటో తరగతి నుంచి ఐదు తరగతి విద్యార్థులకు 24 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ ముగిసేందుకు మరో 10 రోజులు వ్యవధి ఉండగానే, నెల మొత్తానికి సంబంధించిన సిలబస్ను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవని పాఠ్యాంశాలను సైతం ప్రశ్నపత్రాల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం.. గతంలో ఏటా ఆగస్టు నెల వరకూ మూడు నెలల సిలబస్పై ప్రథమ యూనిట్ పరీక్షలు నిర్వహిస్తున్న విధానంలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు సైతం సిలబస్ను హడావుడిగా పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) తో 20 శాతం మార్కులను విద్యార్థుల ఆల్రౌండ్ ప్రతిభ ఆధారంగా లెక్కించాల్సి ఉన్న దృష్ట్యా వారి ప్రగతిపై ప్రభావం చేపే అవకాశముంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నాయి. దసరా సెలవుల తర్వాత నిర్వహించాలి... సమ్మెటివ్–1 పరీక్షలను అక్టోబర్లో దసరా సెలవుల తర్వాత నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సీవీఎస్ మణి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ పూర్తవకముందుగానే విద్యార్థులకు తెలియని పాఠ్యాంశాలపై ప్రశ్నపత్రాలను ఏ విధంగా రూపొందిస్తారని ప్రశ్నించారు. పరీక్షను వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కలవనున్నట్లు వారు చెప్పారు. -
గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు
-మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు, విభజన వలన ఏర్పడిన సవాళ్లు పేరుతో చేర్చారని పోటీ పరీక్షల బోధన నిపుణులు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అరం డల్పేటలోని గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్లో గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నూతన సిలబస్పై అవగాహన కల్పించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ దానిని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, విభజన చట్టంలోని అంశాలు, ఉద్యోగుల విభజన, స్థానికత సమస్యలు, నదీ జలాల పంపిణీ-సమస్యలు, విభజన నేప థ్యంలో మౌలిక వసతులు, పెట్టుబడుల అవసరాలు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-1లో ఒక చాప్టర్గా చేర్చారని వివరిం చారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి సిలబస్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. -
ఓ మాంచి లంచ్బాక్స్
బ్రేక్ బెల్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాపం పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. అందుకు మంచి లంచ్బాక్స్ కావాలి మరి! లంచ్బాక్స్ ఎలా ఉండాలి..? ఆహారం తాజాగా ఉండాలి... ఉదయం ఎప్పుడో బాక్స్లో పెట్టిన ఫుడ్ పిల్లలు తినేవరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందో లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాంటి మెటీరియల్తో తయారైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణంగా పిల్లలు వాళ్లకు నచ్చిన కార్టూన్ బొమ్మలు ఉన్నాయనో, రంగు నచ్చిందనో కొనమని అడుగుతారు. కానీ పేరెంట్స్ మాత్రం కొనుగోలు చేసే ముందు అందులో నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలి. లంచ్బాక్స్లోని ప్రతి భాగం శుభ్రపర్చేందుకు వీలుగా ఉందో లేదో చెక్చేసుకోవాలి. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఎన్ని విభాగాలుగా ఉంది..? కేవలం ఒక డబ్బా మాదిరి కాకుండా బాక్స్ లోపల పలు రకాలుగా విభజించి ఉంటే వీలైనన్ని ఐటమ్లను పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుంది. భోజనంతో పాటు సలాడ్స్, పండ్లు లాంటివి లంచ్బాక్స్లో పెట్టడానికి వీలున్న వాటిని ఎంపిక చేసుకోవాలి. సైజ్..? మరీ పెద్దదిగాను, మరీ చిన్నదిగానూ కాకుండా మీడియం సైజ్ ఉన్నవి అయితే పిల్లలు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి. వారి స్కూల్ బ్యాగ్లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్లు వద్దు.. వేడి వస్తువులను ప్లాస్టిక్ బాక్స్లలో పెడితే ఆ వేడికి అందులోని రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్కు దారి తీస్తుందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇతర ఆరోగ్య కారణాల రీత్యా కూడా ప్లాస్టిక్ బాక్స్ల వాడకం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ట్రై చేద్దామా? కూల్ బాక్స్లు.. పెట్టిన ఆహార పదార్థాలను ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచడం వీటి ప్రత్యేకత. దానికి మీరు చేయాల్సిందిల్లా వీటిని ముందు రోజు రాత్రంతా ఫ్రిజ్లో ఉంచాలి. ఆతర్వాత ఇందులో ఫుడ్ను ఉంచితే ఎప్పుడు తిన్నా సువాసనలు కూడా పోకుండా అప్పుడే వండిన పదార్థాలంత ఫ్రెష్గా ఉంటాయట. ఫ్యాషన్ బాక్స్లు.. చూసేందుకు ఫ్యాషన్ బ్యాగ్లాగా కనిపించే లంచ్ బాక్స్లు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ యువతను కూడా ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఆహారం తాజాగా ఉండటమే కాకుండా, వీటిని శుభ్రం చేయడం కూడా తేలిక. మంచి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తున్న వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యుమ్బాక్స్ పానినో.. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ ఉత్పత్తి చేస్తోంది. గత ఏడాది కాలంగా ఆన్లైన్లో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ బాక్స్ మొత్తం ఆరు భాగాలుగా విభజించి ఉంటుంది. వాటిలో ఒక భాగం కొంచెం పెద్దదిగా ఉండి, మిగిలిన ఐదు విభాగాలు చిన్నగా ఉంటాయి. చాలా తక్కువ బరువుండటంతో పాటు ఒక ఐటమ్తో మరో ఐటమ్ కలిసిపోకుండా ఉండేలా ఇందులో ప్రత్యేక ఏర్పాటు ఉంది. గో గ్రీన్ లంచ్బాక్స్.. ఇందులో ఎక్కువ ఆహార పదార్థాలు పట్టే ఖాళీ ఉండటం వల్ల పెద్ద తరగతులు, కాలేజీ విద్యార్థులకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది. చిన్నారులు సులువుగా ఓపెన్ చేసుకోవడంతో పాటు లీకేజ్ సమస్య లేకుండా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న వెరైటీ లంచ్బాక్స్లలో ఇదీ ఒకటి. - కర్రి వాసుదేవరెడ్డి -
సిలబసే కొంపముంచిందా?
♦ నిరాశపరిచిన ‘టెట్’ ♦ సగానికిపైగా అనుత్తీర్ణత ♦ ఆందోళనలో అభ్యర్థులు నిజామాబాద్అర్బన్ : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు అభ్యర్థులను నిరాశపరిచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉత్తీర్ణత నమోదవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. టెట్పై స్పష్టత కరువవడం, సిలబస్లు కొంపముంచాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22వ తేదీన టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా టెట్ పేపర్-1కు సంబంధించి 8,595 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,910 మంది(57.13 శాతం) అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పేపర్-2కు 19,930 అభ్యర్థులు హాజరుకాగా 4,500 మంది(22.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 77.42 శాతం అనుత్తీర్ణులవ్వడం గమనార్హం. టెట్ ఉత్తీర్ణులు కాకపోవడంతో డీఎస్సీకి అర్హత సాధించలేకపోయారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్పై గందరగోళం.. టెట్లో తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడానికి సిలబస్తోపాటు, పరీక్ష తరచూ వాయిదా పడుతూ రావడం కారణంగా తెలుస్తోంది. ఏడాది కిందట టెట్కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి పరీక్ష తేదీ ప్రకటన వరకు ఎలాంటి సిలబస్ విధివిధానాలు ప్రకటించలేదు. మరోవైపు కోచింగ్ సెం టర్లు సైతం ఎవరికి తోచిన సిలబస్ను వారు బోధిం చారు. చాలా మంది మార్కెట్లో లభించిన పోటీ పరీక్ష ల పుస్తకాలు కొనుగోలు చేసి చదివారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సిలబస్ ఉంటుందని భావించి పలువురు బోల్తాపడ్డారు. సిలబస్ ఎలా ఉంటుందో తెలియకపోవడం, పరీక్ష తేదీ తరయచూ వాయిదా పడుతూ రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కోచింగ్లతో ఫలితమేమి? జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో కలిపి పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లు 36 ఉన్నాయి. డీఎస్సీ, టెట్కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే బ్యాచ్లు నిర్వహించారు. నోటిఫికేషన్ ఇచ్చాక బ్యాచ్ల జోరు పెరిగింది. వేలాది మంది ఆయా కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ సెంటర్లు ఒక్కో అభ్యర్థినుంచి కనీసం రూ. 5 వేలు వసూలు చేశాయి. ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నాలుగు కోచింగ్ సెంటర్లు వెలిశాయి. అభ్యర్థులను ఎక్కువ మొత్తంలో చేర్చుకున్న పలు కోచింగ్ సెంటర్లు.. స్థలం సరిపోక కళ్యాణ మండపాలు, కుల సంఘాలు, ఇతర భవనాలను అద్దెకు తీసుకొని మరీ కోచింగ్ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. వేలాది రూపాయలు బూడిదలో పోసినట్తైదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలి టెట్ -2లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. సెలబస్పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. డీఎస్సీకంటే ముందే మరోసారి టెట్ -2 నిర్వహించాలి. - కె.శ్రీనివాస్, టెట్-2 అభ్యర్థి -
సిలబస్లో లేని సబ్జెక్టులకు మార్కులా?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి 1983లో మోదీకి జారీ చేసిన మాస్టర్ డిగ్రీ మార్కుల జాబితాలో పేర్కొన్న సబ్జెక్టులేవీ కూడా అసలు సిలబస్లోనే లేవని అప్పటి యూనివర్శిటీ ప్రొఫెసర్ జయంత్ పటేల్ తాజాగా ఫేస్బుక్లో ఆరోపించారు. ఆయన 1969 నుంచి 1983 వరకు యూనివర్శిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. నరేంద్ర మోదీకి ఎంఏ సెకండ్ ఇయర్లో పొలిటికల్ సైన్స్లో 64 మార్కులు, యూరోపియన్ అండ్ సోషల్ పొలిటికల్ థాట్స్లో 62, మోడరన్ ఇండియా, పొలిటికల్ అనాలసిస్లో 69, పొలిటికల్ సైకాలోజిలో 67 మార్కులు వచ్చినట్లు మార్కుల మెమోలో పేర్కొన్నారని, తనకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఇంటర్నల్ పరీక్షలకుగానీ, ఎక్స్టర్నల్ పరీక్షలకుగానీ ఈ సబ్జెక్టులేవీ లేవని జయంత్ పటేల్ తెలిపారు. అసలు ఎన్నడూ కాలేజీకి సరిగ్గా రాని మోదీకి పరీక్షల్లో ఇన్ని మార్కులు ఎలా వచ్చాయో తనకు ఆశ్చర్యంగా ఉందని అదే యూనివర్శిటీలో పనిచేసి రిటైరైన మాజీ ప్రొఫెసర్ ఒకరు మొన్ననే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. జయంత్ పటేల్ చేసిన తాజా ఆరోపణలను గుజరాత్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహేళ్ పటేల్ ఖండించారు. మార్కులు పేర్కొన్న షీట్లు 30 ఏళ్ల క్రితం తయారు చేసినవని, అందులో పేర్కొన్న సబ్జెక్టులు మాత్రం ఆ సమయంలో సిలబస్లో ఉన్నవేనని ఆయన వివరించారు. నరేంద్ర మోదీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపిస్తున్న ఢిల్లీ డిప్యూటి ముఖ్యమంత్రి సిసోడియా వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు గురువానం జాయింట్ తనిఖీ కోసం ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ యోగోష్ త్యాగికి ఓ సుదీర్ఘ లేఖ రాశారు. మోదీ సర్టిఫికెట్ల గురించి యూనివర్శిటీలో సంయుక్తంగా తనిఖీ చేసి, వాటి వివరాలను యూనివర్శిటీ వెబ్సైట్లో వెల్లడిద్దామని ఆ లేఖలో సిసోడియా కోరారు. ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి తమ యూనివర్శిటీలో చదువుకుంటే ఏ యూనివర్శిటీ అయినా గొప్పగా ఆ విషయాన్ని చాటుకుంటుందని, కానీ మోది సర్టిఫికెట్లపై వివాదం ఏర్పడినప్పుడు కూడా వాస్తవాలతో ముందుకు రావాల్సిన ఢిల్లీ యూనివర్శిటీ ఎందుకు వెనకడుగు వేస్తోందని సిసోడియా మీడియా ముందు ప్రశ్నించారు. -
5 మినిట్స్ రిలీఫ్
ఎగ్జామ్ టిప్స్ ఏడాది మొత్తం సిలబస్ ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేయాలన్న ఆలోచన తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. సిలబస్ను పూర్తిచేయలేక, పరీక్షలు ఎలా రాస్తామో అనే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ముందు నుంచే సిలబస్ని ప్లాన్ ప్రకారం విభజించి దానికి అనుగుణంగా పిల్లలు చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియెట్ ఆపై తరగతుల విద్యార్థులు రాత్రిళ్లు మేల్కొని చదువుతుంటారు. నిద్ర రాకుండా ఉండటానికి కాఫీ, టీలు ఎక్కువగా సేవిస్తుంటారు. హఠాత్తుగా పెరిగే కాఫీ, టీల వల్ల తలనొప్పి వస్తుంది, ఒళ్లు భారంగా తయారవు తుంది. ఇలాంటి సమయాల్లో నొప్పి నివారణ అంటూ ఏవేవో ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుంది. అందుకని కాఫీ, టీలకు బదులుగా వేడి నీళ్లు, చల్లటి మజ్జిగ, సూప్లు తాగడం రిలీఫ్ ఇస్తుంది. చదువుతున్న సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు లేచి అటూ ఇటూ తిరగడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంలాంటి టెక్నిక్స్ వల్ల శరీరానికి సత్వర స్వాంతన లభిస్తుంది. తలనొప్పిభారం తగ్గుతుంది. మందులతో అవసరం పడదు. -
వినయాన్ని నేర్చుకోవడానికి సిలబస్ ఉంటుందా!
విద్య - విలువలు గురువు తాను తెలుకున్న విషయాలను తన విద్యార్థులకు, తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించడానికి ఎంతో కిందకు దిగివచ్చి తేలికైన ఉపమానాలతో వివరిస్తాడు. అవతలివాడికి అర్థం కావాలని, వాడూ తనతో సమాన స్థాయికి ఎదగాలని ఏ విధమైన స్వార్థమూ లేకుండా బోధిస్తాడు. అలా చేయడం త్యాగం. అందుకే గురువు బోధనలను వర్షపుధారలతో పోలుస్తారు. ఈ విత్తనం మొలకెత్తాలి, ఇది మొలకెత్తకూడదన్న వివక్ష వర్షపుధారకు ఉండదు. అది అన్నింటిపైనా సమానంగా కురుస్తుంది. కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని మొలకెత్తవు. రాతినేల మీద ఉన్న విత్తనం మొలకెత్తే అవకాశం ఉండదు. మట్టిలో ఉన్న విత్తనానికి తడి తగిలితే చాలు, మొలకెత్త్తేస్తుందంతే. అలాగే శిష్యుడిలో కూడా ఆర్ద్రత అనేది ఉండాలి. తడి తగలాలి. అంటే గురువుగారి నోటి వెంట వచ్చిన మాటలను ప్రయోజనాత్మకంగా మలచుకోగలిగిన శక్తి శిష్యుడిలో ఉండాలి. అది లేనప్పుడు రాతినేల మీది విత్తనంలాగా నిష్ప్రయోజనం అవుతుంది. ఇలా మొలకెత్తడానికీ, మొలకెత్తకపోవడానికీ మధ్యలో వచ్చిన సమస్య ఏమిటి? అని అంటే... వినయం లేకుండుట అని చెప్పాలి. ఎప్పుడు గురువుగారి దగ్గరకు వెళ్లినా, అది పాఠశాల, కళాశాల, వేదాధ్యయనం... ఏదైనా కావచ్చు. ఎక్కడైనా కావచ్చు. మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవలసింది...‘గురువు ముందు నేను లఘువును’ అని. అంటే ‘ఆయన కంటే నేను చిన్నవాడిని, ఆయన అన్నీ తెలిసున్నవాడు, సర్వజ్ఞుడు, ఆయన మాట్లాడతాడు, నేను వింటాను’ అన్న స్పృహ. అంతే తప్ప గురువుగారి దగ్గరకు వెళ్లి తాను అవసరానికి మించి మాట్లాడటం గానీ, ఆయన విజ్ఞానం ఏ పాటిదని అర్థం వచ్చేటట్లుగా ఆయనను తేలిక చేస్తూ ప్రవర్తించడం గానీ ఎన్నడూ పనికిరాదు. గురువు ఎంత రాగద్వేషాలు లేకుండా, ఎంత పక్షపాత రహితుడై ఉంటాడంటే విజ్ఞానాన్ని అందించడంలో తరతమ భేదాలు పాటించడు. ద్రోణాచార్యులవారు గురుకులాన్ని నిర్వహిస్తున్న కాలంలో... ద్రోణాచార్యుడిని సంహరించగలిగిన కొడుకు కావాలని ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ వాటికలోంచి పుట్టాడు ధృష్టద్యుమ్నుడు. ఆయనకు విలువిద్య నేర్పించవలసి వచ్చింది. గురువుగా తన స్థానానికి ఏ పక్షపాతం లేకుండా చూడడం కోసం తనని చంపడమే లక్ష్యంగా పెట్టుకుని శిష్యుడిగా వచ్చినవాడికి విద్యనంతటినీ ద్రోణాచార్యుడు బోధించాడు. తన సొంత కొడుకైన అశ్వత్థామకు కూడా నేర్పని బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని, ఉపసంహారాన్ని ఆయన అర్జునుడికి నేర్పించాడు. ఒకప్పుడు ప్రపంచం మొత్తంమీద విద్యాభ్యాసానికి ఆలవాలమైన భూమి ఒక్క భారతదేశం మాత్రమే. పతంజలి దగ్గర వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు నర్మదా నదిని దాటి దక్షిణదేశానికొచ్చి ఆయన దగ్గర ఉండి ఆరోగ్య సూత్రాలు, బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నారని పతంజలి చరిత్ర చదివితే తెలుస్తుంది. అలా చదువుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మొట్టమొదటగా గురుశిష్యుల మధ్య ఉండాల్సినది వినీత-వినీయ సంబంధమే. గురువు దగ్గర మొదట వినయం నేర్చుకుంటాడు. వినయం నేర్చుకోవడానికి సిలబస్ అంటూ ఏదీ ఉండదు. పాఠ్యాంశాలుండవు. వినయంగా ఉండాలనుకుంటేనో, అహంకారంతో ఉండకూడదకుంటేనో వినయం రాదు. వినయం రావడానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది. ఎన్ని తెలిసి ఉన్నవాడైనా ‘నాకు తెలిసినది ఏపాటి?’ అన్న మనస్తత్త్వం ఉన్నప్పుడు వాడంత వినయశీలి లోకంలో మరొకడుండడు. వాడు నిరంతర విద్యార్థి. నాకు తెలియనిది ఏముంది? అన్నాడనుకోండి. అంతే. ఇక పాత్రత ఉండదు. అహంకారం విస్తృతంగా పైకి లేచిపోతుంది. దాన్ని తొక్కేయడమే వినయానికి పాత్రత. ‘నాకు తెలిసినదేపాటి!’ అని మనస్సాక్షిగా ప్రకటించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ‘నేను తప్ప రామాయణం మీద ఇంత బాగా ఎవరు ప్రవచనం చేయగలరు’ అన్నాననుకోండి! మరుక్షణంలో నాలో అహంకారం ప్రబలుతుంది. శ్రీరామాయణంలో ఒక శ్లోకంలోని ఒక పాదంలో ఉన్న ఒక పదానికి వ్యాఖ్యానం చేస్తూ, దర్శనం చేస్తూ తరించిపోయిన మహాపురుషులున్నారు. ‘శ్రీరామ’ అని మూడుసార్లు అనవలసిన అవసరమేముంది. ఒక్కసారి చాలు’ అని సిద్ధాంతీకరించినవారున్నారు. అలాంటి వారి ముందు నాకు తెలిసున్నదేపాటి. 24 వేల శ్లోకాలు నాకేం కంఠగతం కావు. ఎంత పెద్ద భారతం, తెలుగు, సంస్కృతాలలో ఎన్ని భారతాలు, ఎన్ని పద్యాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటికి భాష్యాలు, నాలుగు వేదాలు... ఇవన్నీ చదువుకోవడానికి నా జీవితకాలం ఎక్కడ సరిపోతుంది! నాకేం తెలుసని అహంకరించను! అన్నీ తెలిసినవాళ్లు మేం ఎంతటివాళ్లం అని నిలబడ్డారు. శంకరభగవత్పాదుల కన్నా జ్ఞాని ఎవరూ లేరు. అన్నీ తెలిసున్నా, ఆయన ‘ఈశ్వరా! నేను పశువును. నీవు పశుపతివి. చాలదా మనకు ఈ సంబంధం’ అన్నారు. అంతటి శంకరులే నాకేం తెలుసని అంటుంటే... ఏదో తెలిసున్న ఒక చిన్న విషయాన్ని పట్టుకుని, ఏదో సిలబస్ చదువుకుని, పేరు పక్కన మూడు నాలుగు అక్షరాలు వచ్చి చేరగానే నాకన్నా గొప్పవాళ్లు లేరనుకోవడం హాస్యాస్పదమౌతుంది. అందుకే ఎప్పుడూ స్మరించ వలసింది... ‘నాకు తెలిసినది ఎంత కనుక!’ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన
వీలైతే ఆ వెంటనే.. లేదంటే ఎల్లుండి వెబ్సైట్లో అందుబాటులోకి పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు మరింత సమయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ను కమిషన్ సోమవారం ప్రకటించనుంది. ఆ సిలబస్ను వీలైతే ఆ వెంటనే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి తేనుంది. లేదంటే మంగళవారం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సోమవారం సాయంత్రం పూర్తిస్థాయి సిలబస్ను స్వయంగా ప్రకటించనున్నారు. ప్రధాన పోటీ పరీక్షల సిలబస్ను ముందుగానే ప్రకటించాలని, ఆయా పరీక్షలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషన్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు జోడించారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంపైనా గ్రూప్-1, గ్రూప్-2లో ప్రత్యేకంగా పేపర్లను పెట్టారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధం కావాల్సిన కొత్త సిలబస్కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ప్రకటించేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది. పూర్తి సిలబస్ ఇవ్వనున్న ప్రధాన కేటగిరీలు, అంశాలివే.. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఇంగ్లిష్: తప్పనిసరిగా క్వాలిఫై కావలసిన పరీక్ష పేపర్-1 (జనరల్ ఎస్సే): సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; ఆర్థిక అభివృద్ధి న్యాయపరమైన అంశాలు; భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి; విద్య, మానవ వనరుల అభివృద్ధి అంశాలు. పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ): భారత దేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం (1757-1947); తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ. పేపర్-3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన): భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; భారత రాజ్యాంగం; పరిపాలన . పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; అభివృద్ధి, పర్యావరణ సమస్యలు. పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ; డేటా ఇంటర్ప్రిటేషన్): శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; విజ్ఞాన శాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు; డేటా ఇంటర్ప్రిటేషన్- సమస్య పరిష్కారం. పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. గ్రూప్-2: పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, ప్రజా విధానాలు. పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ: వివిధ అంశాలు- సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి; అభివృద్ధి, మార్పు. పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014). గ్రూప్-3 పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు. పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; అభివృద్ధి, మార్పు. గ్రూప్-4 గ్రూప్-4లో జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్లో అడిగే అంశాలు. -
పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్లోకి తెచ్చే ఏర్పాట్లు చేసింది. పోటీ పరీక్షల కోసం ఇన్నాళ్లు కోచింగ్లకు వెళ్లినా.. మార్పు చేసిన పరీక్షల విధానం, సిలబస్ కారణంగా అకాడమీ రూపొందించే పుస్తకాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్కు అనుగుణంగా జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన పుస్తకాలను రాయించి ముద్రించింది. వాటితోపాటు జనరల్ స్టడీస్ పుస్తకాలను తెచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో మరిన్ని పుస్తకాలను ప్రొఫెసర్లతో రాయిస్తోంది. త్వరలోనే మరిన్ని పుస్తకాలను తీసుక వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల పేపర్లు, అందులో వచ్చే వివిధ అంశాలపై ప్రత్యేక దృష్టిసారించి ఈ కసరత్తు చేపట్టింది. గతంలోనే తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన తెలుగు అకాడమీ.. ఇప్పుడు తెలంగాణ చరిత్ర-సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాలను రాయిస్తోంది. వీటితోపాటు భూగోళ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు సాహిత్యం, భౌగోళిక విజ్ఞాన శాస్త్రం, భూసంస్కరణలపై క్వశ్చన్ బ్యాంకులు రూపొందిస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 లక్ష్యంగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పోటీ పరీక్షలే ప్రధాన లక్ష్యంగా, వాటి సిలబస్ ఆధారంగా పుస్తకాల రచనకు అకాడమీ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి సిలబస్ వచ్చిన వెంటనే ఆయా అంశాలతో కొత్త పుస్తకాలను సరిచూసుకొని ముద్రించి మార్కెట్లోకి తేనుంది. ఇప్పటికే జాతీయ స్థాయి అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజ్యాంగం, ప్రభుత్వ పాలన శాస్త్రం, భౌతిక, భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర తదితర పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక చరిత్ర వంటి పుస్తకాల్లో... తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమని సుల్తాన్లు, కుతుబ్షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలను పొందుపరుస్తోంది. ఉపయుక్తంగా ఇంటర్, డిగ్రీ పుస్తకాలు ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్మీడియెట్, డిగ్రీలోని పాఠ్య పుస్తకాలను పోటీ పరీక్షల కోసం సిలబస్కు అనుగుణంగా తీసుకొచ్చాయి. సిలబస్లోని అంశాలపై ప్రత్యేకంగా పాఠాలు ఉన్నాయి. దీంతో పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ పుస్తకాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వాటిని పునర్ ముద్రించే పనిలో పడింది. తెలంగాణ చరిత్ర, భూగోళం, ఆర్థికశాస్త్రం, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీలు, జేఏసీల పాత్ర, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై పాఠ్యాంశాలు ఉన్నాయి. ఇంటర్ పుస్తకాల్లోని ఈ అంశాలు అభ్యర్థులకు ఉపయోగపడనున్నాయి. అలాగే, తెలంగాణకు అనుగుణంగా మార్పు చేసిన డి గ్రీ పుస్తకాల ముద్రణ పైనా తెలుగు అకాడమీ దృష్టి పెట్టింది. -
సిలబస్ మార్పు సరే.. పుస్తకాలేవీ?
సందర్భం విద్యార్థుల జీవితాల తో పాలకులు చెలగా టం ఆడుతున్నారు. అధునాతన చరిత్రను విద్యార్థులకు అందిం చాల్సిన విషయం మం చిదే. కాని విద్యా సంవ త్సరం ప్రారంభమైన ప్పటికీ నేటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పుస్తకాలను ముద్రించ లేదు. ప్రతి ఏటా సిలబస్ మార్చటం. సరైన సమ యంలో పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అంది వ్వకపోవడం ఇంటర్ బోర్డుకు పరిపాటిగా మారింది. జూనియర్ కాలేజీలు ప్రారంభమై నెలా 10 రోజులు గడిచిపోయినప్పటికీ ద్వితీయ సం వత్సరం ఇంటర్ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్ఈసీ) ఇంటర్ కామర్స్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించలేక కాలం వెళ్లదీస్తున్నారు. 2015-16 విద్యా సంవత్సరానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలను మార్చు తున్నట్లు 8 నెలల ముందుగానే ప్రకటించారు. పౌరనీతి, అర్థశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, చరిత్ర భూగోళశాస్త్రం, మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) వంటి పాఠ్యపుస్తకాలను మార్చుతున్నట్లు 2014 లోనే ప్రకటించారు. కానీ వెంటనే పాఠ్య పుస్తకా లను ముద్రించటం ఎందువల్లనో మరిచిపో యారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ను 2014-15 సంవత్సరంలో మార్చారు. అప్పుడు 6 నెలలు గడిచాక, విద్యార్థులు, తల్లిదండ్రులు గొడవ చేశాక పుస్తకాలను మార్కెట్కు విడుదల చేశారు. తాజాగా మొదటి సంవత్సరం ద్వితీయ భాష సిలబస్ మారిందని సమాచారం అందిం చారు. దీంతో ఇంటర్ చదివే విద్యార్థులు గందర గోళంలో పడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వాల ఆదేశాల ప్రకారం జూన్ మొదటి తేదీ నుండే పాఠాలు బోధించాల్సి ఉంది. కాని మారిన సిలబస్కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించక పోవడం వల్ల రెండు రాష్ట్రాల్లోని 12 లక్షల మంది విద్యార్థులు ‘పరేషాన్’ అవుతున్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఇది అమూల్యమైన సమయం. పైగా ఏఏ పా ఠ్యాంశానికి ఎంత వెయిటేజీ ఇస్తారో తెలియరావ టం లేదు. అత్యధిక మార్కుల కోసం శ్రమించే ద్వితీయ సంవత్సరం విద్యార్థుల గొంతులో వెల క్కాయ పడినట్లు తయారైంది వ్యవహారం. సిల బస్ కమిటీ ఉంటుంది. ముద్రణ కమిటీ ఉంటుం ది. పాఠ్య పుస్తకాల పంపిణీకి కమిటీలు ఉంటా యి. అన్ని రకాల కమిటీలు, అధికారుల సమీక్షలు ఉంటాయి. అన్ని చర్యలు తీసుకుంటారు. అయి నా అంగట్లో అన్నీ ఉన్నా ‘ఇంటర్ బోర్డు’ నోట్లో శని ఉంది అనే ప్రచారం విద్యార్థులు వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ఇంటర్ అధికారులు మారిన పాఠ్యపుస్తకాల సిలబస్ను తక్షణమే ప్రకటించాలి. మారిన ఇంటర్ పాఠ్యపుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయాలి. ఆలస్యానికి కారకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. - రావుల రాజేశం, వ్యాసకర్త లెక్చరర్ జమ్మికుంట మొబైల్: 9848811424 -
పదికి పదిలమే
ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి నూతన సిలబస్పై అవగాహన పెంచుకోవాలి అప్పుడే పదికి పది పాయింట్లు సాధ్యం మరి కొద్ది రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సిలబస్ అందునా సీసీఈ మోడల్ పరీక్ష విధానం మొదటి సారిగా అమలు చేయనున్నారు. దీంతో విద్యార్థులో కాస్త భయం, ఎలా ప్రిపేరవ్వాలా అన్న ప్రశ్న వేధిస్తున్నాయి. సరైన ప్రణాళి కతో చదువుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ పది పాయింట్లు సాధించొచ్చని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. - లబ్బీపేట తెలుగులో మార్కులు సులువే ► ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదివి, ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. ►ప్రతిపదార్థాలు చదివేటప్పుడు నక్షత్రం గుర్తుగల పద్యాలను ఎక్కువగా చదవాలి. ► పద్య పూరణలు చేసేటప్పుడు ప్రాస అక్షరాలను సరిచూసుకోవాలి. ► అపరిచిత పద్యగద్యాలను చదవి అర్థం చేసుకుంటే మార్కులు ఎక్కువ పొందొచ్చు. ►వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు సామెతలు గానీ, జాతీయాలు గానీ వాడితే ఎక్కువ మార్కులు వస్తాయి. ►ఉపవాచకంలో సంఘటనలను వరుసక్రమంలో రాసేందుకు క్షుణ్ణంగా ఉపవాచక పఠనం చేయాలి. ► ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే పార్ట్-బీ విషయంలో తగిన శ్రద్ధ వహించాలి ►వాక్యాలు, వానిలోని రకాలు అన్నింటిలోను ప్రాక్టీసు చేయాలి. ► సంస్కృతం చదివేటప్పుడు, రాసేటప్పుడు సారాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ► శబ్దధాతువులను ఎక్కువుగా సాధన చేయాలి. హిందీపై ఆందోళన అనవసరం ► హిందీలో పది పాయింట్లు సాధించడానికి పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన ఉండేలా సాధన చేయాలి. పాఠ్యపుస్తకాలను చదవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే పూర్తిసామర్థ్యంతో సారాంశం రాయగలుగుతారు. ► వ్యాకరణంలో కూడా 25 కి 25 మార్కులు సాధించే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకంలోని భాషను ఉపయోగించి ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఏ విధంగా ప్రశ్నను అడిగినా సమాధానం రాయగలిగేలా సాధాన చేయాలి. ►ప్రతి వాక్యాన్ని అర్థవంతంగా రాయాలి. ప్రతి ప్రశ్నకూ కవిని పరిచయం చేస్తూ సమాధానం రాయాలి. దీని వల్ల పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ►పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా మన సమాధానం ఉండాలి. ► లేఖ రాసేటప్పుడు ఒక్క పేజీలోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ► వ్యాసం రాసేటప్పుడు ముఖ్యాంశాలను పరిచయం చేస్తూ, సైడ్ హెడ్డింగ్ రాస్తూ పేరాలుగా విభజించాలి. ► పాఠ్యపుస్తకంలోని ప్రతిపాఠం వెనుక ఇచ్చిన వ్యాకరణాన్ని తప్పకుండా చదివి సాధన చేయాలి. ఇంగ్లిషులో మార్కులు ఎంతో ఈజీ ► మొదట ఇచ్చిన పశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి ► సమాధానాలను వరుసక్రమంలో రాయాలి. ►ఇంగ్లిష్లో ప్రశ్నలకు మూడు విధాలుగా మార్కులు కేటాయిస్తారు. ఒక మార్క్, రెండు మార్కులు, పది మార్కులు విభాగాలు ఉంటాయి. ► రెండు మార్కుల విభాగంలో రెండుకు రెండు మార్కులు వచ్చే విధంగా పది వ్యాక్యాలకు తగ్గకుండా సమాధానాలు రాయాలి. ► ఒక మార్కు ప్రశ్నలకు 3, 4 వాక్యాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ముఖ్యమైన వాక్యాలను అండర్లైన్ చేయాలి. ► టెక్ట్స్బుక్ ఒకేబులరీని తప్పనిసరిగా వాడాలి. వ్యాక్యాలు సమాధానానికి సంబంధించినవిగా ఉండాలి. ► పేపర్-2లో ఉండే పది మార్కుల ప్రశ్నలకు రైటింగ్ స్కిల్స్ అండ్ లెటర్ రైటింగ్ రెండు పేజీలకు తగ్గకుండా టాఫిక్కు సంబంధించిన పదాలను వాడుతూ సమాధానాలను రాయాలి. ► లెటర్ రైటింగ్లో ఫార్మెట్ను ఫన్క్చ్యుయేషన్ సహా పాటించాలి. మంచి పదాలను ప్రయోగించాలి. గణితమంటే భయమొద్దు ► గణితంపై భయం వీడాలి. భావనలు, పద్ధతులను ఉపయోగించి లెక్కల సాధన రోజూ చేయాలి. ► సూత్రాలను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఉదాహరణ సమస్యలను అవగాహన చేసుకోవాలి. ► సమస్యలో ఉన్న గణిత భావనలను అవగాహన చేసుకుని లెక్క చేసే పద్ధతిని తెలుసుకోవాలి. ► వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, ప్రోగ్రేషన్స్, ప్రాబబులిటీ, కో ఆర్డినెట్ జామెట్రీ, మెన్సురేషన్, సంఖ్యాకశాస్త్ర అంశాలపై దృష్టి సారించాలి. ► లెక్కల సాధనకు అన్ని సూత్రాలను నేర్చుకోవాలి. ► పార్ట్-బీ కోసం ఎక్కువ బిట్స్ను సాధన చేయాలి. వీలైనన్ని నమూనా ప్రశ్నా పత్రాలు సాధన చేయాలి. ► ఒక్క మార్కు ప్రశ్నల కోసం అన్ని అధ్యాయాలందు ఉన్న నిర్వచనాలు, ఫజిల్స్, పదసమస్యలు, పట సమస్యలను సాధన చేయాలి. సాంఘికశాస్త్రంలో బిట్లు, మ్యాపులు కీలకం ► ప్రస్తుత సిలబస్ని అనుసరించి ప్రతి విద్యార్థి పాఠ్య పుస్తకంపై పూర్తి అవగాహన పొందాలి. ► సాంఘికశాస్త్రంలో పది పాయింట్లు రావడానికి ముఖ్యమైన అంశంగా బిట్స్ మ్యాప్ పాయింటింగ్పై పూర్తి అవగాహన ఉండాలి. ► ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులను విద్యార్థి అవగాహన చేసుకుంటే మంచి మార్కులు పొందవచ్చు. ► ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో ఏ విధంగా ప్రశ్న అడిగినప్పటికీ సరైన సమాధానం రాసేలా సాధన చేసి సిద్ధంగా ఉండాలి. ► పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా నేర్చుకుని వాటిపై పట్టు సాధించాలి. ► ఆయా పాఠ్యాంశాలు, ప్రశ్నలకు సంబంధించిన కాలం(సంవత్సరాలు), వ్యక్తుల పేర్లపై పూర్తి అవగాహన పొందాలి. ► పాఠ్య పుస్తకంలో ఇచ్చిన బార్ గ్రాఫులను, వెన్, డయాగ్రామ్స్, టైమ్ లైన్ చార్ట్స్ను అర్థం చేసుకుని రాయగలిగితే పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఫిజికల్ సైన్స్.. పాఠ్యపుస్తకాలను చదవాలి ► విషయ పరిజ్ఞానం కోసం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. ► అకడమిక్ స్టాండర్డ్స్ మార్కుల వెయిటేజీ గురించి అవగాహన ఉండాలి. ► కెమిస్ట్రీలో ఉన్న ఈక్వేషన్స్ను బాలెన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ►పాఠ్యపుస్తకంలోని బొమ్మలు, వాటి భాగాలను సరైన విధంగా గుర్తించేటట్లుగా సాధన చేయాలి, భాగాల విధులను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ►పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు, బిట్స్కు ప్రధాన్యత ఇవ్వాలి. సమ్స్(సాల్వ్డ్, అన్సాల్వ్డ్)ను సాధన చేయాలి. ►డు యు నో దిస్, ట్రై దిస్, అడిషనల్ ఇన్షర్మేషన్, థింక్ అండ్ డిస్కస్, బిల్డ్ అప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మాటిక్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఇన్టెక్ట్స్ క్వశ్చన్స్ వంటి వాటిని హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్(హాట్స్)గా అడగవచ్చు. ►కేటాయించిన మార్కులను బట్టి సమాధానాలు హెచ్చుతగ్గులు లేకుండా రాయాలి. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయాలి. ► ప్రతి లెసన్కు మైండ్ మ్యాపింగ్ ఫార్మెట్ను తయారు చేసుకుని దానిని సాధన చేయాలి. నేచురల్ సైన్స్లో.. విశ్లేషించి జవాబులు రాయాలి ► పాఠ్యపుస్తకాలను అనుసరించి విషయ పరిజ్ఞానం పొందడంతో పాటు, దానిలోని అన్ని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ప్రశ్నలన్నింటినీ విశ్లేషించి సమాధానాలు రాయాలి. ►రాసిన సమాధానాలను పుస్తక పరిభాషను అనుసరించేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిత్రాలు గీసేటప్పుడు చెక్కినట్లుగా అర్థవంతంగా గీయాలి. అన్ని భాగాలను సరిగా గుర్తించాలి. ►దైనందిన జీవితంలో జరిగే విషయాల గురించి అవగాహన ఉన్నచో సమాధానాలు సులువుగా రాయగలుగుతారు. ► అన్నింటికంటే మంచి ఆరోగ్యం, {పశాంతమైన మనస్సు ఎంతో అవసరం సరిగా ప్రజెంట్ చేయడం ముఖ్యం మనం ఎంతకష్టపడి చదవినా దానిని సరిగా ప్రజెంట్ చేయలేకపోతే అనుకున్న ఫలితాలు రావు. అందమైన చేతిరాత, మార్జిన్లు కొట్టడం, కొట్టివేతలు లేకుండా జాగ్రత్త పాటించడం ముఖ్యం. పేజీకి 18 నుంచి 20 వాక్యాలు ఉండేలా రాయాలి. సైడ్ హెడ్డింగ్స్కు తప్పనిసరిగా అండర్లైన్ చేయాలి. బ్లూ, బ్లాక్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. స్కెచెస్, షేడ్పెన్స్ వాడకూడదు. పరీక్ష సమయానికి అర్ధగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరాలి. పరీక్ష రాసేటప్పుడు పూర్తి ఏకాగ్రత, సమయపాలన పాటించాలి. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే పదిలో పదికి పది పాయింట్లు తేలిగ్గా సాధించవచ్చు. - మురళీకృష్ణ, ఏజీఎం, శ్రీ చైతన్య స్కూల్స్ ఒత్తిడిని దూరంచేయాలి పదో తరగతి విద్యార్థులు తొలిసారిగా కామన్ పరీక్షలు రాస్తున్నారు. అందునా ఈ ఏడాది కొత్త సిలబస్ ఎలా ఉంటుందోనని ఆందోళన సహజం. అయితే ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా కచ్చితంగా సమాధానం రాయగలమనే సానుకూల దృక్పథంతో పరీక్ష హాలులోకి వెళ్లాలి. ఎటువంటి ఒత్తిడికి తావివ్వకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే చదివిన ప్రశ్నలు కూడా సమాధానం రాయలేని స్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో ముందుగానే ఎలా ప్రశ్నలు సమాధానాలు రాయాలి. మంచి మార్కులు పొందడం ఎలా అనే అంశంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంతో పరీక్షకు ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాలి. ఒకేవేళ్ల ట్రాఫిక్లో చిక్కుకుని పరీక్షకు ఆలస్యంగా వెళ్తే ఆ ఒత్తిడిలో సరైన సమాధానాలు రాయలేరు. అందుకే కేర్ఫుల్గా ఉంటే మంచి మార్కులు పొందవచ్చు. - డాక్టర్ టి.ఎస్.రావు, సైకాలజిస్ట్ -
10వతరగతి సిలబస్తో ప్రత్యేక యాప్!
-
‘పరీక్షల్లో’ మార్పులు కొన్నే...
టీఎస్పీఎస్సీకి సమీక్షా కమిటీ నివేదిక ప్రస్తుత పరీక్ష విధానంపై సిఫార్సులు ఒక్క ఏడాదికే వర్తింపజేయాలని సూచన గ్రూప్-1లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వద్దని సలహా సిలబస్లో తెలంగాణ అంశాలతో మార్పులు ఇక తుది నిర్ణయం సర్కారుదే సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చే స్తూ గత ంలో వెలువడిన ఉత్తర్వుల అమలు విషయంలో నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పరీక్షల విధానంపై ఏర్పాటైన సమీక్ష కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఆ ఉత్తర్వుల అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. పోస్టుల విలీనంపై 2013లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పారు. పైగా అందులో స్పష్టత లేనందువల్ల ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. పోటీ పరీక్షల విధానంపై సమీక్ష కమిటీ సిఫారసులతో కూడిన నివేదికను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణికి హరగోపాల్, కోదండరాం గురువారం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పరీక్షల విధానంలో కొద్దిపాటి మార్పులనే సూచించినట్లు చెప్పారు. నిరుద్యోగులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ఒక్క ఏడాదికి మాత్రమే వర్తించేలా మార్పులను సిఫారసు చేశామన్నారు. ఆ తర్వాత అవసరమైన మార్పులను కమిషన్ చేసుకోవచ్చన్నారు. సిలబస్లో మాత్రం తెలంగాణకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక స్థితిగ తులు, చరిత్ర, రాజకీయ అంశాలను సిలబస్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. పాలనాయంత్రాంగంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు పాలుపంచుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు సూచించామన్నారు. గ్రూప్-1 ఐదో పేపరులో మార్పుల విషయంలో నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. తమది సలహా కమిటీ మాత్రమేనని, సిఫారసులను టీఎస్పీఎస్సీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల్లో పేర్కొనే అంశాలే అమల్లోకి వస్తాయని వివరించారు. ఉద్యోగాలకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఏ దశలోనైనా మార్పులు: చక్రపాణి ప్రస్తుతం కమిటీ చేసిన సిఫారసులపై కమిషన్లో చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, ఆ తర్వాతే ఉత్తర్వులు జారీ అవుతాయని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల్లో ఏ దశలోనైనా మార్పులు జరుగవచ్చన్నారు. అయితే భిన్న రంగాలకు చెందిన మేధావులతో కూడిన ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులను యథాతధంగా ఆమోదించే అవకాశముందన్నారు. వయోపరిమితి పెంపు, ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉందన్నారు. సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష మేలు: హరగోపాల్ రాష్ట్ర స్థాయిలో సివిల్ సర్వీసెస్ విధానం ఉంటే మంచిదేనని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పరీక్షా విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వేర్వేరు పరీక్షలు కాకుండా సివిల్స్ తరహాలో ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందన్నారు. ప్రస్తుతం గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్గా రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికయ్యే వారు మాత్రమే ఐఏఎస్ హోదాకు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. కర్ణాటకలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ కేడర్ ఉందని, దానికి ఎంపికైన వారికి సీనియారిటీ ఆధారంగా ఐఏఎస్ హోదా కల్పిస్తున్నారని, అలాంటి విధానం తెలంగాణలోనూ ఉంటే బాగుంటుందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. -
‘సమస్య’ తీరుతోంది!
గ్రూప్1లో ‘డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’కు మంగళం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్లో మార్పులు రాబోతున్నాయి. పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. సిలబస్లో మాత్రం మార్పులు తీసుకురావాలని సమీక్ష కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులకు ‘సమస్య’గా మారిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశానికి ప్రాధాన్యత తగ్గించాలని భావిస్తోంది. గ్రూప్-1 ఐదో పేపర్గా ఉన్న ఈ అంశం స్థానంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టాలని... ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ను 50 మార్కులకు కుదించాలని యోచిస్తోంది. దీనిపై 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ నాలుగో, ఐదో పేపర్లతో పాటు గ్రూప్-2లో పేపర్-2 సెక్షన్ 1లో, పేపర్-3 సెక్షన్-2లో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పుచేస్తూ గతంలో ఉన్న ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తేనే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయనుంది. ఈ పరీక్షల్లో మార్పులకు సంబంధించిన సిఫారసుల నివేదికను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించాక అమల్లోకి వస్తాయి. చరిత్ర, రాష్ట్ర వివరాలు:గ్రూప్-2 రెండో పేపర్లోని సెక్షన్-1లో ఉన్న ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర స్థానంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సిలబస్ను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో శాతవాహనులు, కాకతీయులు, నిజాంల పాలన, ఆది హిందూ ఉద్యమం, నిజాం రాష్ట్ర జన సంఘం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక వికాసం తదితర అంశాలను చేర్చబోతోంది. అలాగే పేపర్-3లో ఏపీ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు స్థానంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు అంశాన్ని చేర్చేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఇందులో వ్యవసాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రణాళిక, వ్యవసాయం, నీటి పారుదల రంగం, ఆదాయ స్థితిగతులు, రవాణా, పర్యాటక రంగాల స్థితిగతులు తదితర అంశాలు ఉంటాయి. ప్రధాన మార్పులు వీటిలోనే.. గ్రూప్-1లో ఒకటో పేపర్గా ఉన్న ‘జనరల్ ఎస్సే’లో తెలంగాణకు సంబంధించిన అంశాలతో సిలబస్ను మార్చుతారు. రెండో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్లో వివిధ సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర’ స్థానంలో ‘తెలంగాణలో వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, వారసత్వం, భౌగోళిక స్థితిగతు’లను చేర్చనుంది. మూడో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్రం తరువాత సామాజిక మార్పులు, భూ సంస్కరణలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బలాలు-బలహీనతలు’ స్థానంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, భూ సంస్కరణలపై సిలబస్’ను పొందుపరుస్తారు. ఇండియన్ పాలిటీ, సమాజం, పాలన తదితర అంశాలను కూడా దీనిలోనే చేర్చనుంది. నాలుగో పేపర్లో ఇప్పటి వరకు ఉన్న ‘భారతదేశ అభివృద్ధి సైన్స్, టెక్నాలజీ పాత్ర దాని ప్రభావం, లైఫ్ సెన్సైస్లో ఆధునిక పోకడలపై సాధారణ అవగాహన, పర్యావరణ సమస్యలు, అభివృద్ధి’ తదితర అంశాల్లోని ప్రధాన అంశాలను ఐదో పేపర్లోకి మార్చనుంది. నాలుగో పేపర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ఇందులో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంశాలను చేర్చనుంది. గత 15 ఏళ్లలో ఐదారు దఫాలుగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్లో చాలా మంది అభ్యర్థులు మొదటి నాలుగు పేపర్లలో మంచి మార్కులు సాధించినా... ఐదో పేపర్ అయిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’లో వెనుకబడి... ఇంటర్వ్యూకు వెళ్లలేకపోతున్నారని సమీక్ష కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో ఐదో పేపర్లో ప్రస్తుతం ఉన్న ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ను ప్రవేశపెట్టబోతోంది. లైఫ్ సెన్సైస్లో ఆధునిక పోకడలు తదితర అంశాలు ఉండనున్నాయి. అయితే ఈ పేపర్లోని 150 మార్కుల్లో 100 మార్కులను వీటికి కేటాయించి... మిగతా 50 మార్కులను ‘డాటాఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశాలకు కేటాయించే లా సిఫారసులను కమిటీ సిద్ధం చేసినట్లు తెలిసింది. -
పోటీ పరీక్షలపై నిపుణుల కమిటీ
ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్గా 27 మందితో ఏర్పాటు ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య తదితరులకు చోటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధి విధానాల్లో మార్పులు, చేర్పులపై అధ్యయనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కమిటీని ఏర్పాటు చేసింది. 27 మంది నిపుణులతో కూడిన ఈ కమిటీకే సిలబస్ మార్పుల అంశాన్నీ అప్పగించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. పోటీ పరీక్షల విధి విధానాలతో పాటు సిలబస్లో మార్పులను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుందని.. అయితే ముందుగా పరీక్ష విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని చక్రపాణి తెలిపారు. సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కమిషన్ దానిని పరిశీలించి ఈ నెలాఖరులో ప్రభుత్వ ఆమోదానికి పంపుతుందని వెల్లడించారు. కమిటీలో సభ్యులు వీరే: కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్, రమా మేల్కొటే, జీబీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, న్యాక్ మాజీ డెరైక్టర్ వీఎస్ ప్రసాద్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ లింగమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, బీనా, భూపతిరావు, సెస్ నుంచి డాక్టర్ ఇ.రేవతి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ భారత రీజియన్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, ఏపీ సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.గణేష్, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధిఖీ, డాక్టర్ కనకదుర్గ, అంబ్కేదర్ వర్సిటీ ప్రొఫెసర్ సి.వెంకటయ్య, ఐఐటీ హైదరాబాద్కు చెందిన నిశాంత్ డోంగరి, రిటైర్డ్ లెక్చరర్ నందిని సిధారెడ్డి, సెంట్రల్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజశేఖర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ భద్రూనాయక్, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ జె.మనోహర్రావు, కాకతీయ వర్సిటీ నుంచి డాక్టర్ టి.శ్రీనివాస్, గజ్వేల్ జీఎంఆర్ పాలిటెకి ్నక్ విభాగాధిపతి డాక్టర్ భైరి ప్రభాకర్, నల్సార్ నుంచి డాక్టర్ ఎన్.వసంత్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు. -
టీపీఎస్సీ సిలబస్ రూపకల్పనకు కమిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ఈ కమిటీలో 25 మంది నిపుణలను నియమించారు. సభ్యులుగా నాగేశ్వర్, చుక్కా రామయ్య, కోదండరాం, రమామెల్కోటె, నందిని సిద్ధారెడ్డి తదితరులున్నారు. పోటీ పరీక్షల కోసం ఈ కమిటీ సిలబస్ను రూపొందించనుంది. -
సిలబస్ మార్పులపై కమిటీ
పోటీ పరీక్షల విషయంలో టీఎస్పీఎస్సీ కసరత్తు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల సిలబస్లో మార్పులపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) దృష్టిసారించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పరీక్షల సిలబస్లో చేయాల్సిన మార్పులను సూచిస్తూ ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. అందులోని సిఫారసులను పరిశీలించిన తర్వాత సిలబస్ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ఫైలును ప్రభుత్వామోదం కోసం పంపించాలని కమిషన్ భావిస్తోంది. ప్రస్తుత సిలబస్లో గ్రూప్-1లో 25 శాతం వరకు, గ్రూప్-2 తదితర పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే ఉన్నట్లు సమాచారం. ఈ సిలబస్ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఏపీకి సంబంధించిన చాలావరకు సమాచారం అవసరం లేదని, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చరిత్రకు సంబంధించిన అంశాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివరాలనే సిలబస్లో పెట్టాలని భావిస్తోంది. తద్వారా ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నష్టం ఉండదని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా నోటిఫికేషన్ల తర్వాత విద్యార్థులకు కొంత సమయం ఉంటుంది కనుక వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సంబంధిత ఐటీ విభాగం అధికారులతో కమిషన్ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్లో(ఏపీపీఎస్సీ) పని చేస్తున్న తెలంగాణ సిబ్బందిని తెలంగాణకు కేటాయించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తప్పని జాప్యం! రాష్ట్ర విభజనలో భాగంగా వివిధ శాఖల్లో సిబ్బంది విభజనే పూర్తి కానందున కొత్త నోటిఫికేషన్ల జారీపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వ శాఖలు తమ అవసరాల మేరకు ఉద్యోగ నియామకాల కోసం ఇండెంట్లు(ప్రతిపాదనలు) ఇస్తే తప్ప నోటిఫికేషన్లు జారీ చేయడం టీఎస్పీఎస్సీకి సాధ్యం కాదు. శాఖలవారీగా ఖాళీ పోస్టులు, కేడర్లవారీగా అర్హతల వివరాలను ఆయా శాఖలే కమిషన్కు అందజేయాలి. అలాగే ఆయా పోస్టుల భర్తీకి సర్ప్లస్ మ్యాన్పవర్ సెల్(ఎస్ఎంపీసీ), ఆర్థిక శాఖలు అనుమతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏ శాఖలోనూ ఉద్యోగుల విభ జన పూర్తి కాలేదు. అది పూర్తయితేనే శాఖలవారీ అవసరాలపై స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు టీఎస్పీఎస్సీలోనూ చైర్మన్, ముగ్గురు సభ్యులు, కార్యదర్శి మినహా మరే సిబ్బంది లేరు. కమిషన్లో పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ పోస్టుల్లోకి ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న సిబ్బంది రావాల్సి ఉంది. ఉద్యోగుల విభజన పూర్తయితేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది. అప్పటివరకు ఇతర అంశాలపై కమిషన్ దృష్టి సారించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు మరింతకాలం వేచి చూడక తప్పదు. కమిషన్కు పోస్టుల మంజూరు టీఎస్పీఎస్సీకి 121 పోస్టులను సృష్టిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదనపు కార్యదర్శి స్థాయి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు పోస్టులను మంజూరు చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీపీఎస్సీ నుంచి కమిషన్కు వచ్చే ఉద్యోగులు మినహా మిగతా పోస్టులను భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషన్కు అదనపు కార్యదర్శి-1, డిప్యూటీ కార్యదర్శి-2, అసిస్టెంట్ సెక్రటరీ-6, అసిస్టెంట్ సెక్రటరీ(అకౌంట్స్)-1, సెక్షన్ ఆఫీసర్-26, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-26, జూనియర్ అసిస్టెంట్-26, ష్రాఫ్-1, రికార్డు అసిస్టెంట్-5, రెనో ఆపరేటర్-2, జామేదార్-1, దఫేదార్-2, డ్రైవర్-2, ఆఫీస్ సబార్డినేట్-20 పోస్టులు కొత్తగా వచ్చాయి. -
‘టెన్’షన్..
మందమర్రి : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 25వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్ని పరీక్ష పత్రాలో తెలియకుండా.. పూర్తికాని సిలబస్.. సబ్జెక్ట్ కొరత నేపథ్యంలో విడుదలైన పరీక్షల షెడ్యూల్తో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు ఎలా రాసేదని మదనపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 417 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి అదనంగా ఏడు మోడల్ హై స్కూల్స్ పని చేస్తున్నాయి. ఆయా ఉన్నత పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్న వారున్నారు. 37 వేల మంది రె గ్యులర్ విద్యార్థులు పదో తరగతి చదువుతుం డగా మరో ఎనిమిది వేల మంది ప్రైవేట్ వారున్నారు. వీరంతా మార్చి నెలలో జరిగే పబ్లిక్ ప రీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వాస్తవానికి డి సెంబర్ నెలాఖరులోగా అన్ని సబ్జెక్టుల్లో సిలబ స్ పూర్తి కావాల్సి ఉంది. జనవరి నుంచి రివిజన్ తరగతులు బోధించాలి. కానీ.. కొత్త పాఠ్యాంశాలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 70 హైస్కూళ్లలో అయోమయం... జిల్లాలోని మొత్తం 424 ఉన్నత పాఠశాలల్లో చాలా వాటిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ము ఖ్యంగా గణితం, ఇంగ్లిష్, సామాన్యశాస్త్రం బో ధించే ఉపాధ్యాయులు లేరు. దాదాపు 70 నుం చి 80 ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాచారాన్ని బట్టి తె లుస్తోంది. కేవలం సబ్జెక్టు టీచర్లు ఉన్నచోటే సి లబస్ పూర్తి కావొచ్చే దశలో ఉంది. వీరు లేనిచో ట పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్ప టికే ఆరు నెలల బోధన సమయం గడిచిపోయింది. మొన్నటి వరకు కామన్ కాంప్రినెన్స్ ఎ వాలేషన్(సీసీఈ)పై సమగ్ర శిక్షణ, స్పష్టత లే కుండా పోయింది. దేనికి ఎన్ని మార్కులు వే యాలన్నదీ తెలియని పరిస్థితి. ఎలాంటి క్లారిటీ లేక ఇటు సిలబస్ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సైతం సతమతమవుతున్నారు. తుస్సుమన్న జీవో 6.. రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేపట్టాల్సి ఉంది. ఇందుకు జీవో నంబర్ 6ను ప్రభుత్వం విడుదల చేసింది. కా నీ.. ఎక్కడా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది లేదు. పర్యావసానంగా పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు. జీవో అమలు కాకపోయినా కనీసం స్కూల్ అసిస్టెంట్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేకపోయింది. పైగా అకాడమిక్ ఇన్స్పెక్టర్ల(ఏఐ)ను ఇస్తామన్న ప్రభుత్వం వారి ఊసే ఎత్తలేదు. అసలే పుస్తకాలు మారాయి. మారిన పుస్తకాలపై ఉపాధ్యాయులకు కనీసం శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఏదో మొక్కుబడిగా నవంబర్ నెలలో నామమాత్రపు శిక్షణ ఇచ్చారు. మరోవైపు ఏఐల నియామకం లేదు. దీనికితోడు గతంలో మాదిరి విద్యవాలంటీర్ల నియామకాన్ని చేపట్టే వీలే లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీవీలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు లేదని ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా మారింది. ప్రశ్నాపత్రాలపై గందరగోళం.. అసలే టీచర్ల కొరతతో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తంటాలు పడుతుంటే మరోవైపు ప్రశ్నాపత్రాలపై గందరగోళం నెలకొంది. గతంలో 11 ప్రశ్నాపత్రాలు ఉన్న సంగతి తెలిసిందే. 11 పేపర్లు కాకుండా ఏడు పేపర్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం తొమ్మిది పేపర్లకు నిర్ణయం మార్చుకుంది. ఇలా 15 రో జులకోమారు 9, 7, 11 పేపర్లు అంటూ ప్రకట నలు చేస్తుండడం విద్యార్థులను గందరగోళానికి దారితీసింది. ఎట్టకేలకు 11 పేపర్లు అన్నది స్పష్టం అయినా నేడు సిలబస్ సమస్యగా పరిణమించింది. ప్రాజెక్టు మార్కులెలా వేసేది..? పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులతోపా టు ఇటు ఉపాధ్యాయులకు సైతం ప్రహసనం గా మారాయి. ప్రధానంగా ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదని వారు తలలు పట్టుకుంటున్నా రు. కొత్తగా చేపట్టిన విధానంతో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు మార్కులను ఉన్నతాధికారులు రూ పొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు ఉపాధ్యాయులే వేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టు వారిగా ప్రాజెక్టు పని పూర్తి చేసిన విద్యార్థులకు సదరు మార్కులు వేయాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రాజెక్టులు తయారు చేసేందుకు అనుకూ ల వాతావరణం లేదు. ముఖ్యంగా సైన్స్ సబ్జె క్టు విషయానికొస్తే ల్యాబ్ తప్పనిసరి. ఈ సౌకర్యం పాత ఉన్నత పాఠశాలల్లో తప్ప మరెక్కడా లేదు. కేవలం 20 శాతం ఉన్నత పాఠశాలలకే ల్యాబ్లు ఉన్నాయి. ప్రాజెక్టు ఇచ్చినా, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించిన వారు లేరు. ఈ తరుణంలో 20 మార్కులు ఎలా వేసేదని ఉపాధ్యాయులే జుట్టు పీక్కుంటున్నారు. జనవరి వరకు పూర్తి చేయొచ్చు... - కె.సత్యనారాయణరెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ పదో తరగతి విద్యార్థులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. జనవరి 30వ తేదీ వరకు సిలబస్ పూర్తిచేయొచ్చు. సబ్జెక్టు టీచర్లు లేని మాట వాస్తవమే. దీన్ని అధిగమించేందుకు డి ప్యూటేషన్పై కొందరిని నియమిస్తున్నాం. అదేవిధంగా బీఈడీ పూర్తి చేసి ఉన్న వారితో బోధిం చేందుకు చర్యలు తీసుకుంటున్నం.ప్రాజెక్టులకో సం బాధ లేదు. అన్ని పాఠశాలల్లో మెటీరియల్ ఉంది. ల్యాబ్లు ఉండాల్సిన అవసరం లేదు. పది పరీక్షలు కష్టమే - టి.ఇన్నారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు కష్టమే. ఉపాధ్యాయులు, పిల్లలు సత మతమవుతున్నారు. ప్రాజెక్టు మార్కులు ఎలా వేసేదో తెలియడం లేదు. ప్రాజెక్టు చేయకుండా విద్యార్థిని ఎలా అంచనా వేస్తాం. మార్కులెలా వేస్తాం. ఈ ఏడాదికి ప్రాజెక్టు విధానం తీసేయాలని ఉన్నతాధికారులను కోరాం. పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని సూచించిన ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తానికి పరీక్షలు ప్రశ్నార్థకంగానే మారాయి. -
మన తెలుగు వాచకం
తెలంగాణ మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. అమ్మభాషతో తెలంగాణ తెలుగువాచకాలు తయారవుతున్నాయి. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సంస్కతీ సంప్రదాయాలు, విశిష్టమూర్తుల విశేషాలను సిలబస్లో చేర్చే బృహత్తర పని మొదలైంది. ప్రజల ఆకాంక్షలను ప్రజా ఉద్యమంగా మలచటంలో, ఆ లక్ష్యం నెరవేరే వరకు తుదికంటా క్రియాశీల క పాత్ర పోషించి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికరంగం నిలిచి గెలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తన పలుకుబళ్లతో తన భాషలో, తనయాసలో స్వేచ్ఛగా పాఠ్యప్రణాళికలను రచించుకుంటుంది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని అపూ ర్వంగా ఆవిష్కరించుకునే అరుదైన సందర్భమిది. తన మట్టిభాష పాఠ్య ప్రణాళికలలో పాఠ్యాంశంగా మారబోతుంది. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ లోటును పూడ్చటానికి కొత్త పాఠ్యపుస్తకాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పుస్తకాల సిలబస్లు కొత్తగా రచిస్తున్నారు. తెలంగాణ అమ్మభాషతో తెలంగాణ తెలుగు వాచకాలు తయారవుతున్నాయి. మన విస్మృత సాహిత్యం విశ్వవేదికపై ఆవిష్కరించబోతున్న సందర్భమిది. తెలంగాణ లోని చారిత్రక ప్రదేశాలన్నీ ప్రపంచానికి తెలియ చేసేందుకు సిలబస్లో చేర్చే బృహత్తర పని మొద లైంది. మన సంస్కృతి, మన పండుగలు, మన ఆటలు, వినోదాలు, మన భాష, మన నుడికారం, మన భావజాలం, మన ఉద్యమం, మన పోరాట వారసత్వం, తెలుగు సాహిత్య చరిత్ర పేజీల్లోకి ఎక్కించే పనికి శ్రీకారం చుడుతున్నారు. తెలంగా ణలో ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలున్నాయి. పాన గల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఆలంపూర్లో ప్రఖ్యాత ఆలయం, పిల్లలమర్రి శివాలయం, బాసర సరస్వతి దేవాలయం, రామప్ప దేవాల యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేయిస్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ జాతర, భద్రాచలం రామాలయం లాంటి ఎన్నెన్నో చారిత్రక ప్రదేశాలు సిలబస్లోకి చేర్చేపని ముమ్మరంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ, దసరా, పీర్ల పండుగలు, మన ఏడుపాయల జాతరలు, జానపాడు సైదులు, దురాజ్పల్లి జాతరలు ప్రత్యేకంగా పిల్లలకు బోధనాంశాలవుతున్నాయి. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, కళారంగాల్లో ప్రతిభావంతులైన మన తెలంగాణ మహనీయుల చరిత్ర పిల్లలకు బోధించే విధంగా సిలబస్ తీర్చిదిద్దబడుతుంది. 1 నుంచి 10 తరగతుల పిల్లలకు ఆయా తరగతుల స్థాయిని బట్టి పాఠాలు చెబుతారు. ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అవతరించాక తెలుగు భాషలో పాఠ్యాం శాలను ప్రవేశపెట్టటమే పెద్దమార్పుగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుం టుంది. తెలంగాణ పద్య సాహిత్యంలో మన పాల్కురికి, మన పోతన, కొరవి గోపరాజు, కందుకూరి రుద్రకవి, మల్లినాధసూరి, సురవరం ప్రతాపరెడ్డి, బి.ఎన్.శాస్త్రి, కపిలవాయి లింగ మూర్తి, హీరాలాల్ మోరియా, జమలాపురం కేశవరావు, చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ లాంటి ఎందరెందరో తెలంగాణ సాహిత్య మణిరత్నాల చరిత్ర పిల్లలకు పాఠాలుగా ముందుకు రాబోతు న్నాయి. కాకతీయుల కాలం నాటి సమ్మక్క, సారలమ్మల చరిత్రతోపాటుగా ఆ కాలం నాటి తెలంగాణకు ప్రాణాధారమైన జీవధార గొలుసు కట్టు చెరువులు సిలబస్లోకి ఎక్కుతున్నాయి. స్థానికత నేపథ్యంలో బాలసాహిత్యం ప్రవేశపెట్టే పని మొదలైంది. తెలంగాణకు పోరువారసత్వం ఎంతో బలమై నది. ప్రపంచపటంలో తెలంగాణకున్న గుర్తింపు పోరాట వారసత్వమేనన్నది మరువ రాదు. చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం, దొడ్డి కొమరయ్య భూమికోసం పోరాటం, బండి యాదగిరి ఉద్యమపాట, సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా అన్న పాట అంతర్జా తీయ మానవతాగీతం, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, నల్లా నర్సింహులు, ఉప్పల మలుసూరు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, 4,000 మంది నేలకొరిగిన పోరువీరుల చరిత్రను భావితరాలకు తెలియ జేయటం విధిగా జరగాలి. వేరు తెలంగాణ పోరుకు ఊపిరిలూదిన 1969 ఉద్యమకారుల చరిత్ర దగ్గర నుంచి నేటి ఉద్యమ సాఫల్యం వరకు కీలక ఘటనలను పాఠాలుగా బోధించాలి. కాళోజీ, ప్రొ॥జయశంకర్ లాంటి వాళ్ల చరిత్రను ప్రవేశపెట్టాలి. నిజాం కాలం నాటి అనుకూల, ప్రతికూల పరిస్థితులను నిష్కర్షగా ఉన్నది ఉన్నట్లుగా పాఠ్యాంశాలలో చేర్చగలగాలి. నిజాం కాలం నాటి సంస్కరణలు, మంచి పనులు చెప్పటాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ ఆనాటి మట్టి మనుషులు చేసిన మహత్తర పోరాటాన్ని కూడా చెప్పాలి. నిజాం కాలంలో ఆనాటి ప్రజలు ఏ రకం గా అణిగిపోయారన్న చరిత్రను కూడా కళ్లకు కట్టిన ట్లు చెప్పాలి. త్రివేణి సంగమమైన మట్టిపల్లి లక్ష్మీనర్సింహ స్వామి, కృష్ణా, గోదావరి, మూసీ నదులు శాత వాహనుల కోటిలింగాల చరిత్ర, బొమ్మలమ్మగుట్ట, సంగారెడ్డి దగ్గరున్న అనంత పద్మనాభస్వామి, మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరలాంటి తెలంగాణ తరతరాల వారసత్వ సంపదను కొత్తతరాలకు అందించాలి. ప్రధానంగా తెలుగు వాచకంలో మన తెలంగాణ భాషను ఎలా వ్యక్తీకరిస్తామో చెప్పగలగాలి. ప్రాచీన తెలంగాణ సాహిత్యం దగ్గర నుంచి ఇటీవల ఎవరెస్టు శిఖరం అధిరోహించిన జాతీయ సాహసబాలల చరిత్ర వరకూ సిలబస్లోకి ఎక్కాలి. తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకవచ్చి సామాజిక విప్లవాలకు సాక్ష్యాలుగా నిలిచిన శ్రీశ్రీ, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, జాషువా, కందుకూరి కృష్ణశాస్త్రి, ఆరుద్ర లాంటి కవులు, రచయితల సాహిత్యాన్ని తెలంగాణ నేల ఎప్పటికీ మరిచిపోలేదు. భిన్నభావాల, భిన్న అస్తిత్వాల, భిన్న పోరాటాల, విభిన్న చైతన్యాలకు నిలయమైన తెలంగాణ తనను తాను రాసుకుంటూ కొత్త చరిత్రకు ద్వారాలు తెరువ బోతుంది. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
డిగ్రీ ‘చరిత్ర’లో మార్పులకు కమిటీ
దక్కన్ చరిత్ర, తెలంగాణ ఉద్యమంపై పాఠాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ స్థాయిలో ఉన్న చరిత్ర పుస్తకాల సిలబస్లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఫుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డిగ్రీ చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పులపై బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, వివిధ వర్సిటీల చరిత్ర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలబస్ మార్పుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు మనోహర్రావు, అర్జున్రావు, సుదర్శన్, వరలక్ష్మి, సదానందం, 8 మంది డిగ్రీ లెక్చరర్లు ఉంటారు. ఇవీ మార్పులు: దక్కన్ చరిత్రకు మార్పుల్లో పెద్ద పీట వేస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై పాఠ్యాంశాలు ఉంటాయి. అంతేకాక హుస్సేన్సాగర్, రామప్ప, లక్నవరం వంటి చెరువులు, వాటిని తవ్వించిన రాజులు, అప్పటి పాలన విధానం, వారి ప్రాధాన్యాలపై పాఠ్యాంశాలు ఉంటాయి. వాటితోపాటు కాకతీయులు, సమక్క-సారలమ్మ, నాటి పరిస్థితులపై పాఠాలుంటాయి.చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి తెలంగాణ యోధులు, 1969 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం, అందులో వివిధ రంగాల పాత్ర, తెలంగాణ భాష, సంస్కృతిపై పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు. -
ఎడ్యు న్యూస్
యంగ్ సైంటిస్ట్లకు 50 శాతం పెరిగిన రీసెర్చ్ స్కాలర్షిప్స్ దేశంలో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలో ్ల రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ అసోసియేట్స్కు ప్రస్తుతం ఇస్తున్న ఫెలోషిప్లను దాదాపు 50 శాతం మేర పెంచుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు విభాగాల్లో దాదాపు లక్ష మంది రీసెర్చ్ స్కాలర్స్ లబ్ధి పొందనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం.. రీసెర్చ్ అసోసియేట్-3 కేటగిరీలో ప్రస్తుతమున్న రూ. 24 వేల ఫెలోషిప్ రూ. 46 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-2 కేటగిరీలో రూ. 23 వేల నుంచి 42 వేలకు; రీసెర్చ్ అసోసియేట్-1 కేటగిరీలో రూ. 22 వేల నుంచి రూ. 38 వేలకు పెరుగుతుంది. అదే విధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తం కూడా రూ. 16 వేల నుంచి రూ. 25 వేలకు పెరిగింది. ఏఐసీటీఈలో మార్పులపై కమిటీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్.. దేశంలో సాంకేతిక, ప్రొఫెషనల్ విద్యా సంస్థలను పర్యవేక్షించే సంస్థ. సిలబస్, ఇతర బోధన విధి విధానాలను రూపొందించే నియంత్రణ వ్యవస్థ. ఏఐసీటీఈ విధానాల కారణంగా సాంకేతిక విద్య లో విద్యార్థులకు.. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలు లభించట్లేదనే వాదనల నేపథ్యంలో.. దిద్దుబాటు చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏఐసీటీఈని పునర్వ్యవస్థీకరించి.. సాంకేతిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు దీటుగా సాంకేతిక విద్యా విధానాన్ని రూపొందించేందుకు రివ్యూ కమిటీని నియమించింది. కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ కార్యదర్శి ఎం.కె.కా నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ ఆరునెలల్లోపు నివేదిక అందించనుంది.