Tesla car
-
ట్రంప్ గెలుపుతో మస్క్ పంట పండింది!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో టెస్లా అధినేత ఇలాన్ మస్క్కు సిరుల పంట పండుతోంది. ట్రంప్ విజయం తర్వాత టెస్లా స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. దాంతో మస్క్ సంపద ఏకంగా 70 బిలియన్ డాలర్లు(రూ.5.8 లక్షల కోట్లు) పెరిగి నికరంగా సుమారు 340 బిలియన్ అమెరికన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) మార్కును దాటినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.యూఎస్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతిచ్చారు. దాంతోపాటు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పార్టీకి మస్క్ భారీగానే విరాళాలు అందించారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇలాన్ మస్క్కు సముచిత స్థానాన్ని కల్పిస్తానని చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక అనుకున్న విధంగానే ట్రంప్ కార్యవర్గంలో మస్క్కు కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా మస్క్, వివేక్ రామస్వామిలను నియమించారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?డొనాల్డ్ ట్రంప్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండబట్టే మస్క్ సంపద అధికమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ భవిష్యత్తులో తీసుకోబోయే కార్పొరేట్ నిర్ణయాల వల్ల మాస్క్కు లాభం చేకూరుతుందని, దాంతో కంపెనీకి మేలు కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మస్క్ కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దాంతో ఆయన సంపద పెరుగుతోంది. -
మస్క్ ఆవిష్కరణలు.. 2006 నుంచి 2024 వరకు (ఫోటోలు)
-
టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణ
టెస్లా సీఈఓ ఇలొన్మస్క్ ఐ రోబోట్ ఈవెంట్లో రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది.కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.టెస్లా కంపెనీ ఇప్పటివరకు కార్లను తయారు చేయడంలోనే నిమగ్నమైంది. కానీ ఇక నుంచి ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. ఈమేరకు సంస్థ వాహనాల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రోబోవ్యాన్లో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు.వ్యక్తిగత అవసరాలతోపాటు వాణిజ్య అవసరాల కోసం, పెద్ద మొత్తంలో రవాణా చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా టెస్లా వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకుంది. సైబర్ క్యాబ్ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు మస్క్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చాలా కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. అందులో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.గతంలో వార్షిక సాధారణ సమావేశంలో చెప్పిన విధంగానే కంపెనీ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఏఐలో విప్లవాత్మక మార్పు రాబోతుందని, భవిష్యత్తు అంతా ఏఐదేనని మస్క్ చెప్పారు. అందుకు అనుగుణంగా కంపెనీ ఏఐ ఉత్పత్తులను తయారు చేస్తుందని తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్క్యాబ్ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించారు. ఈవీల్లో బ్యాటరీలకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచి వాటి తయారీకి అయ్యే ఖర్చు తగ్గించేందుకు చాలా కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. -
టెస్లా రోబో కారు
‘ఐ రోటోట్’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్’ ఈవెంట్లో కంపెనీ సీఈఓ ఇలోన్మస్క్ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్ను ‘ఫ్యూచర్ వరల్డ్’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్లెస్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఆటోమేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్ తెలిపారు.Robovan seats 20 & can be adapted to commercial or personal use – school bus, RV, cargo pic.twitter.com/CtjEfcaoHI— Tesla (@Tesla) October 11, 2024ఈమేరకు రోబోవన్ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇందులో డ్రైవర్ క్యాబిన్ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్లో సైబర్ క్యాబ్ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్ క్యాబ్ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్మస్క్ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్క్యాబ్ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్లెస్ విధానంలో ఛార్జ్ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.Robotaxi pic.twitter.com/zVJ9v9yXNr— Tesla (@Tesla) October 11, 2024 -
‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.జీఓక్యూఐఐ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కంపనీ సీఈఓ గోండాల్ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్ 3 కారును ప్రీబుకింగ్ చేసుకున్నాను. ఏప్రిల్ 2016లో టెస్లా కారు భారత్లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ట్రక్ ఆర్డర్ల నిలిపివేత!ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్గరేజ్, బెంజ్, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
సైబర్ట్రక్ ఆర్డర్లను నిలిపేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్ట్రక్ బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్ట్రక్ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్ను ఆర్డర్ చేయాలని తెలిపింది.టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కలిగిన సైబర్ట్రక్ బేసిక్ వేరియంట్ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్ వస్తున్నట్లు సమాచారం. సైబర్ట్రక్ ప్రీమియం వేరియంట్ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్ చేసుకున్నారని ఇలాన్మస్క్ తెలిపారు. ఇందులో బేసిక్ వేరియంట్ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్ట్రక్ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్ను బుక్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్ పెరిగి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్ను ఆర్డర్చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది. ఇది యూఎస్లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్ట్రక్ను ఆవిష్కరించింది. బేసిక్ వేరియంట్ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్ మోటార్ వేరియంట్ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్ వేరియంట్ సైబర్బీస్ట్’ మోడల్ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
ఏడుసార్లు పల్టీ కొట్టిన టెస్లా కారు.. అయినా ప్రయాణికులంతా సేఫ్
కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఇటీవల టెస్లా కంపెనీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. టెస్లా వై మోడల్కు చెందిన కారు డ్రైవర్ అతి వేగం కారణంగా.. ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం కారు ఏడుసార్లు పల్టికొట్టింది. అయినప్పటికీ డ్రైవర్తో సహా కారులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చిన్న గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సమయంలో కారు గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం లేదా డ్రగ్స్ తీసుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారుటెస్లా కారు ప్రమాదంపై కంపెనీ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ప్రయాణికుల భద్రతే తమ కార్ల రూపకల్పనలో ప్రాథమిక లక్ష్యమని తెలిపారు. ప్రమాదంపై నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. టెస్లా తమ కస్టమర్ల గురించి చాలా శ్రద్ద వహిస్తుందని, ప్రయాణికుల భద్రతను వారు మరింత మెరుగుపరుస్తూ ఉన్నారని పేర్కొంటున్నారు.🚨TESLA FLIPPED 7 TIMES IN CRASH: NO ONE DIED!Footage of an accident showing a Tesla Model Y flying through the air after a crash at high speeds.In what looks almost miraculous, no one inside the car was seriously hurt. pic.twitter.com/pk0VdVuYAA— Mario Nawfal (@MarioNawfal) June 25, 2024Safety is our primary design goal— Elon Musk (@elonmusk) June 25, 2024 -
మస్క్కు జాక్పాట్ తగలింది.. రూ.4.5 లక్షల కోట్ల వేతనం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్!
న్యూయార్క్: టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ జాక్ పాట్ కొట్టేశారు. రూ.4.5లక్షల కోట్లు (56 బిలియన్ డాలర్లు) పారితోషికం ఇచ్చేందుకు ఆ సంస్థ వాటా దారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆనందానికి అవదుల్లేని మస్క్ తన డ్యాన్స్తో సందడి చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో వాటా దారులు మస్క్కు 56 బిలియన్ డాలర్ల భారీ వేతనం ఇవ్వాలా? వద్ద అన్న అంశంపై ఓటింగ్ జరిగింది. ప్రాథమిక ఓట్ల ఫలితాల ఆధారంగా మస్క్కు 56 బిలియన్ డాలర్ల పారితోషికం ఇచ్చేలా పెట్టుబడి దారులు మద్దతు ఇచ్చారని కార్పొరేట్ సెక్రటరీ బ్రాండన్ ఎర్హార్ట్ తెలిపారు.ఎలోన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. అయితే, మస్క్కు అధికంగా చెల్లించారంటూ వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన డెలావర్ కోర్టు ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా సీఈవోకి భారీ వేతనాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. తాజాగా, టెస్లా వాటాదారులు మస్క్కు అనుకూలంగా ఓటు వేయడంతో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోల్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. Elon Musk dance is 🔥. Tesla shareholders have spoken. pic.twitter.com/GiLWOtt8ZI— Tesla Owners Silicon Valley (@teslaownersSV) June 13, 2024 -
షావోమి కారు విడుదల ఎప్పుడంటే..
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షావోమీ కార్పొరేషన్ 2025 నాటికి తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించనుంది. కంపెనీ తన మొదటి మోడల్ ఎస్యూ7ను టెస్లా ఇంక్ మోడల్వై తరహాలో విపణిలోకి తీసుకురానుంది.కంపెనీ వచ్చే ఏడాది లక్ష యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. భవిష్యత్తులో డిమాండ్కు తగ్గట్టుగా అవుట్పుట్ని పెంచడానికి పని చేస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ వినియోగదారులను ఆకర్షించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..చైనాలో ఎస్యూవీ వాహనాలకు జనాదరణ ఉంది. అయితే షావోమి తయారుచేస్తున్న కారు స్పెసిఫికేషన్లు, ధరలు ఏమేరకు ఉంటాయో ఇంకా స్పష్టతరాలేదు. బీజింగ్లోని షావోమి అసెంబుల్ ఫ్యాక్టరీ రెండోదశ నిర్మాణాన్ని పూర్తి చేసినప్పుడు 2025 నాటికి కార్ల ఉత్పత్తి జరగుతుందని ఊహించలేదని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి పనులు వేగంగా జరిగాయని చెప్పింది. కంపెనీ తయారీప్లాంట్ నెలకు 10,000 యూనిట్లనే సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉంది. దాంతో ముందుగా లక్ష యూనిట్లు సిద్ధంగా ఉంచుకుని 2025 నాటికి కారును విపణిలోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్కు తగిన సరఫరా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. -
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
అమెరికన్ యూట్యూబర్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ తన ఫాలోయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. మిస్టర్ బీస్ట్గా పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్సన్ తన 26వ పుట్టినరోజు (మే 7) సందర్భంగా 26 టెస్లా కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. ఇందులో ఒక సైబర్ ట్రక్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. కండిషన్స్ అప్లయ్ అంటూ కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ కంటెంట్ విచిత్రమైన సవాళ్లతో తనకు తానే సాటి అని నిరూపించుకనే మిస్టర్ బీస్ట్ తాజాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. తన పోస్ట్ కింద కామెంట్ చేసి, ఇద్దరు ఫ్రెండ్స్ను ట్యాగ్ చేసిన 26 మందిని ఎంపిక చేసి, 26 కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. డ్రా తీసిన అనంతరం విజేతలకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తానని, వారం రోజుల్లో (మే 11న) ఎంపికైన వారి వివరాలను ప్రకటిస్తానని తెలిపాడు. అంతేకాదు రకరకాల పేర్లు, లేదా రీపోస్ట్లు లాంటి జిమ్మిక్కులు పనిచేయవని కూడా వెల్లడించాడు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్లో అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్ నికర విలువ రూ.4,175 కోట్లు (500 మిలియన్ల డాలర్లు)గా తెలుస్తోంది. 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో 6000 పేరిట తొలుత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, అలాగే ఒక దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రరోపీని నడుపుతున్నాడు. దీని ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను విరాళాలిస్తుంటాడు. -
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
గురుగ్రామ్లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్మార్క్ను వాడుకుంటోందని ఎలొన్మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్మార్క్ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్ ఇండియా.. టెస్లా ఇంక్ ట్రేడ్మార్క్ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్లాల్ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్ను పోలి ఉండే ట్రేడ్మార్క్తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం. -
టాప్ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన వాయిదా.. టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. మస్క్ భారత్లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్లో ప్రవేశించేందుకు లైన్క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. -
భారత్లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో తన మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భారత్లో టెస్లా ఇకో సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పియూష్ గోయల్ ప్రకారం..మస్క్ భారత్ ఆటోమొబైల్ రంగం లాభదాయకమైన మార్కెట్గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారే నమ్మకం తమకు ఉందన్నారు. తద్వారా అన్ని ప్రధాన కంపెనీలు భారత్లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశం సాధించిన పురోగతిని ప్రపంచం గమనించిందని ఉద్ఘాటించారు. -
మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే..
అమెరికాలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్లో పర్యటించనున్నారనే వార్తలు వైరల్గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు. భారతప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. మస్క్ పర్యటనకు డేట్ కూడా ఫిక్స్ అయిందని, ఏప్రిల్ 22న భారత్ రాబోతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది. ప్రధానితో భేటీలో భాగంగా భారత్లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మస్క్ భారత్లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. Looking forward to meeting with Prime Minister @NarendraModi in India! — Elon Musk (@elonmusk) April 10, 2024 ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాటు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. ఇదీ చదవండి: వాట్సప్, టెలిగ్రామ్ బాటలోనే ట్రూకాలర్.. కొత్త ఫీచర్ ప్రారంభం ఏం జరగబోతుంది.. కొత్త ఈవీ పాలసీ నిబంధనల ప్రకారం ఒకవేళ భారత్లో ఇన్వెస్ట్ చేస్తే స్థానికంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. కార్ల తయారీలో ముడిసరుకు అందిస్తున్న ఇండియన్ కంపెనీలకు కాంట్రాక్ట్లు వస్తాయి. ప్రధానంగా బ్యాటరీ తయారీ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, వైరింగ్ పరిశ్రమలోని కంపెనీలు, టైర్ సంస్థలు లాభపడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు టెస్లా భారత్లో తయారీ ప్లాంట్ పెట్టే యోచనలో ఉంటే ఏ రాష్ట్రంలో దాన్ని ప్రారంభిస్తారనే చర్చలు ఇప్పటికే సాగుతున్నాయి. ఏదేమైనా మస్క్ పర్యటనతో ఒక స్పష్టత రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. -
దేశంలో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం..!
-
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
ప్రపంచంలో వేగవంతమైన కారు ఇదే!.. లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయడానికి సిద్ధమైపోయింది. టెస్లా రోడ్స్టర్ (Tesla Roadster) పేరుతో కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు 0 నుంచి 60 కిమీ/గం వేగాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకుంటుందని సమాచారం.ఈ కారు గురించి టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) కొన్ని వివరాలను వెల్లడిస్తూ.. ఇది 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ కారుని టెస్లా, స్పేస్ఎక్స్ సహకారంతో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.Tonight, we radically increased the design goals for the new Tesla Roadster.There will never be another car like this, if you could even call it a car.— Elon Musk (@elonmusk) February 28, 2024టెస్లా లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు అత్యంత ఆకర్షణీయమైన కారుగా పేర్కొన్నారు. ఈ కారు డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్స్ కూడా చాలా వరకు అప్డేట్ పొందినట్లు తెలుస్తోంది. ఇది 4 సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ కారు. దీని గురించి మస్క్ 2017లోనే వెల్లడించారు.కంపెనీ టెస్లా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారును బుక్ చేసుకోవాలనుంటే 50000 డాలర్ల టోకెన్ మొత్తాన్ని వెచ్చించి బుక్ చేసుకోవచ్చు. నిజానికి 2021లో లాంచ్ కావలసిన ఈ కారు 2024 చివరి నాటికి లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారత యాప్స్పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్లో అవి మాయం!0-60mph < 1 secAnd that is the least interesting part— Elon Musk (@elonmusk) February 28, 2024 -
టెస్లా యూనిట్కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
టెస్లా కారును ఇలా కూడా వాడొచ్చా? మస్క్కు మతిపోయే వీడియో!
టెస్లా.. అమెరికాకు చెందిన ప్రసిద్ధ కార్ల కంపెనీ. మల్టీ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ఈ కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. అయితే టెస్లా కారుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో టెస్లా కారును చిత్రంగా మాడిఫై చేశారు. కారు నాలుగు చక్రాలను పీకేసి 10 అడుగుల బగ్గీ చక్రాలను అమర్చారు. దీంతో ఆ కారు అస్తవ్యస్తమైన రోడ్డుపైనా రయ్ అని దూసుకెళ్తోంది. అంతేకాదు కారు తలకిందులుగా కూడా నడుస్తూ ఆశ్చర్యపరుస్తోంది. నాన్ ఏస్తటిక్ థింగ్స్ (non aesthetic things @PicturesFoIder) పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ మారింది. గంటల వ్యవధిలోనే 1.37 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. యాజర్లు తమకు తోచినవిధంగా కామెంట్స్ చేశారు. మాడిఫై చేసిన రకరకాల కార్ల వీడియోలను, మీమ్స్ను జోడించారు. కాగా కారును మాడిఫై చేసి వీడియో రూపొందించింది ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. Man puts 10ft buggy wheels on a Tesla and drives it upside down pic.twitter.com/1jGkvsYEjT — non aesthetic things (@PicturesFoIder) December 26, 2023 -
20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?
అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్.. సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు. -
Tesla Cars: ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?
టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. ఈ మోడల్కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్ఫారమ్పై ఆధారపడుతుంది. ఈ క్రాస్ఓవర్ ఎస్యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది. టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్లో తయారీ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్మస్క్ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
మస్క్కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్ట్రక్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
మంత్రికి క్షమాపణలు చెప్పిన మస్క్.. కారణం ఇదేనా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్మస్క్కు చెందిన దిగ్గజ సంస్థ టెస్లా ప్లాంట్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సందర్శించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్లోని ఈ కేంద్రంలో విద్యుత్ కార్ల తయారీని మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే మంత్రి వెంట టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనిపించలేదు. దీనిపై ఎక్స్ వేదికగా మంత్రికి మస్క్ క్షమాపణలు చెప్పారు. మంత్రి తన సందర్శనను ఉద్దేశించి ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్లో ఉన్న టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ సీనియర్ హోదాలో పనిచేస్తోన్న భారత ఇంజినీర్లు, ఆర్థిక నిపుణులను కలవడం ఆనందంగా ఉంది. టెస్లా ప్రయాణంలో వారు అందిస్తోన్న సహకారం గర్వకారణం. టెస్లా తయారీలో ఇండియా నుంచి దిగుమతులు పెంచడం సంతోషంగా ఉంది. ఈ పర్యటనలో మస్క్ను మిస్ అవుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మంత్రి అన్నారు. మంత్రి ట్వీట్పై మస్క్ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శిచడం మాకు గొప్ప గౌరవం. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలో మీతో జరగబోయే భేటీకి ఎదురుచూస్తున్నాను’ అని టెక్ దిగ్గజం పోస్ట్ చేశారు. టెస్లా విద్యుత్ కార్లు త్వరలోనే భారత్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జరిగిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈవీ వాహనాల తయారీకోసం దేశంలోని కొన్ని నిబంధనలు సడలించనున్నట్లు సమాచారం. తాజా పర్యటనలో గోయల్-మస్క్ భేటీ జరుగుతుందని, భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటు, సుంకాల గురించి ప్రధానంగా చర్చిస్తారని వార్తలు వచ్చాయి. అయితే మస్క్ అనారోగ్యంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. Visited @Tesla’s state of the art manufacturing facility at Fremont, California. Extremely delighted to see talented Indian engineers & finance professionals working at Senior positions and contributing to Tesla’s remarkable journey to transform mobility. Also proud to see… pic.twitter.com/FQx1dKiDlf — Piyush Goyal (@PiyushGoyal) November 14, 2023 -
టెస్లాకు త్వరలో లైన్ క్లియర్.. భారత్లోకి ప్రవేశం!
ఎలాన్మస్క్కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది. జూన్లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్లో స్థానిక తయారీ యూనిట్ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది. ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్(ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే భారీగా రూ.1.30లక్షల కోట్లు ఆవిరైంది. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్కు సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో అక్టోబర్ 19న కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్ మస్క్ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. టెస్లా షేర్ విలువ అక్టోబరు 19న ఏకంగా 9 శాతం నష్టపోయింది. దాంతో మస్క్ సంపద కూడా అదే రీతిలో 16.1 బిలియన్ డాలర్లు(రూ.1.30 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇప్పటికి 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్ సంపద దాదాపు 70 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి. వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 18లక్షల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేస్తామని టెస్లా ప్రకటించింది. -
లాంచ్కి ముందే 'సైబర్ట్రక్' డ్రైవ్ చేసిన మస్క్ - ఫోటో వైరల్
ఎలాన్ మస్క్ గత కొంత కాలం నుంచి 'టెస్లా సైబర్ట్రక్' (Tesla Cybertruck) గురించి చెబుతూనే ఉన్నాడు. 2019లో ఈ కారుని ఆవిష్కరించినప్పటికీ.. ఇప్పటి వరకు లాంచ్ గురించి అధికారిక వివరాలు పంచుకోలేదు. అయితే గతంలో చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాగా ఇప్పుడు టెక్సాస్లోని గిగా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్-స్పెక్ సైబర్ట్రక్ డ్రైవ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోను మస్క్ షేర్ చేశారు. ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో మీరు గమనించినట్లయితే ఎలక్ట్రిక్ టెస్లా సైబర్ట్రక్ ప్రొడక్షన్-స్పెక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇది చూడటానికి డెల్టా ఆకారంలో ఉండే మిర్రర్స్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్లను కలిగి ఉంది. ఇప్పటికి మస్క్ ఈ సైబర్ ట్రక్ ఫోటోలను షేర్ చేయడం రెండవ సారి. అంటే ఇది త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సైబర్ట్రక్ కేవలం నేల మీద మాత్రమే కాకుండా నీటిలో కూడా బోట్ మాదిరిగా ప్రయాణిస్తుంది గతంలో మస్క్ వెల్లడించాడు. ఇదీ చదవండి: లాక్మే కంపెనీకి లక్ష్మీదేవికి సంబంధమేంటి? స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. ఇది వాటర్ ప్రూఫ్ కారు. కావున నీటిలో ప్రయాణించేటప్పుడు కూడా ఎలాంటి అవరోధాలు గురి కాకుండా ఉంటుంది. అంతే కాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ కారుకంటే కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఇండియాకు వస్తుందా? రాదా? అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. Just drove the production candidate Cybertruck at Tesla Giga Texas! pic.twitter.com/S0kCyGUBFD — Elon Musk (@elonmusk) August 23, 2023 -
టెస్లా కారులో ఈ సీక్రెట్ తెలుసుకోండి! లేకుంటే..
Tesla Model Y: ప్రపంచ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కారుగా ప్రసిద్ధి చెందిన 'టెస్లా' (Tesla)లో అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఇరుక్కున్నారు. అప్పటి పరిస్థితుల్లో ఎంతో చాక చక్యంగా బయటపడినట్లు ఫీనిక్స్ టీవీ స్టేషన్ ద్వారా వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 73 సంవత్సరాల పియోరియా ప్రాంతానికి చెందిన 'రిక్ మెగ్గిసన్' అనే వ్యక్తి ఫీనిక్స్ టీవీ స్టేషన్లో మాట్లాడుతూ.. ఒక రోజు టెస్లా బ్రాండ్ కారు మోడల్ 'వై' లోపలు చిక్కుకున్నాడు. ఆ సమయంలో కారు డోర్స్ ఓపెన్ కాలేదు, ఆఖరికి విండోస్ కూడా కిందటికి దించలేక ఇబ్బంది పడినట్లు తెలిసింది. కారులోని సిస్టం (కంప్యూటర్) దెబ్బతినటం వల్ల గ్లోవ్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదని ఆసమయంలో లోపల చాలా వేడిగా ఉన్నట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: సంతకం చేయలేకపోయిన ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు! టెస్లా మోడల్ Yలోని 12 వోల్ట్స్ బ్యాటరీ కారునిలో డోర్స్, విండోస్ వంటి వాటికి పవర్ డెలివరీ చేస్తుందని, అందులో ఏర్పడిన సమస్య వల్ల ఆ రోజు లోపల సుమారు 20 నిముషాలు చిక్కుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటలు జరిగే అవకాశం ఉంది. కావున కంపెనీ దీనిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని వెల్లడించాడు. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! మెగ్గిసన్ కారులో చిక్కుకున్న తరువాత ఇందులోని ఎమర్జెన్సీ లాక్ గురించి తెలుసుకుని బయటపడినట్లు సమాచారం. నిజానికి టెస్లా కారులో ఇలాంటి సందర్భం ఎదురైతే వినియోగదారులు డోర్ కింది భాగంలో ఒక ఎమర్జెన్సీ లాక్ లాంటిది ఉంటుంది. అయితే దీనిని కనుక్కోవడం అంత సులభమేమి కాదు. ఇది వెనుక డోర్ దగ్గర ఉంటుంది. దీని గురించి తప్పకుండా వినియోగదారుడు తెలుసుకోవాలి. లేకుంటే అనుకోని ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. -
ఆ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఎలాన్ మస్క్ను భయపెడుతోందా?
ఈవీ కార్ల తయారీ విభాగంలో ఓ వెలుగు వెలుగుతున్న టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ను ప్రత్యర్ధి సంస్థ భయపెడుతోందా? కాబట్టే టెస్లా కార్లకు పోటీగా సదరు కంపెనీ ఉందని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? అంటే అందుకు సమాధానం అవుననే వినిపిస్తోంది. 2022లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అత్యదికంగా అమ్ముడు పోయిన బ్రాండ్ల జాబితాలో టెస్లా తొలిస్థానాన్ని దక్కించుకుంది. టయోటా, హోండాలాంటి దిగ్గజ కంపెనీల కార్లను సైతం వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ మస్క్ చైనాకు చెందిన ఓ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లు..టెస్లా కార్లకు, బ్రాండ్ను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని మస్క్ భావిస్తున్నారట? What do you think of BYD? Elon Musk starts laughing… have you seen their cars ? pic.twitter.com/aSvcqmOAo8 — Tesla Owners Silicon Valley (@teslaownersSV) May 27, 2023 మస్క్ అభిప్రాయం మారింది ఓ 12 ఏళ్ల (2011లో) క్రితం బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి ఎలాన్ మస్క్ను చైనా ఈవీ కార్ల తయారీ సంస్థ ‘బీవైడీ’ వాహనాల తయారీ, కార్ల డిజైన్ గురించి మస్క్ను ప్రశ్నించారు. ఆ కార్ల కంపెనీ గురించి తనని ప్రశ్నించడాన్ని మస్క్ జోక్గా తీసుకున్నారు. పెద్దగా నవ్వి ఊరుకున్నారు. అందుకు సదరు యాంకర్ ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా మీరు బీవైడీ కార్లు ఎలా ఉన్నాయో చూశారా? తన కార్లకు (టెస్లా) బీవైడీ కార్లు పోటీకాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బీవైడీ కార్లపై తనకున్న అభిప్రాయాన్ని మస్క్ మార్చుకున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉రికార్డ్ల రారాజు.. ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్ బీవైడీయే మా ప్రత్యర్ధి సంస్థ ఈ ఏడాది జనవరిలో టెస్లాకు అతిపెద్ద ఛాలెంజర్ ఏ కార్ల తయారీ సంస్థ అని అడిగినప్పుడు మస్క్ చైనా కంపెనీ అని మస్క్ పేర్కొన్నారు. కానీ ఆ కంపెనీ పేరు వెల్లడించలేదు. ‘వారు కష్టపడి, తెలివిగా పని చేస్తున్నారు. నేను ఊహించినట్లే చైనాకు చెందిన ఏదైనా కంపెనీ ఈవీ విభాగంలో టెస్లా తర్వాత రెండవ స్థానంలో ఉంటుందని చెప్పారు. ఆయన మాటల్ని ఊటంకిస్తూ ఎలాన్ మస్క్కు బీవైడీ కార్ల భయం పట్టుకుందంటూ పలు నివేదికలు సైతం వెలుగులోకి రావడం గమనార్హం ఎలాన్ మస్క్ మదిలో బీవైడీ కార్ల టెన్షన్ పదేళ్ల క్రితం బీవైడీ కార్లను జోక్గా తీసుకున్న మస్క్ ఇప్పుడు అదే కార్ల కంపెనీపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేయడం ఈవీ పరిశ్రమ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈవీ కార్ల అమ్మకాలతో పోలిస్తే టెస్లా కంటే బీవైడీ విక్రయాలు తక్కువే. అయినప్పటికీ స్టార్టప్గా ప్రారంభమై నేడు టెస్లాకు గట్టి పోటీ ఇచ్చిన సంస్థగా ఎదిగిన వైనంపై డ్రాగన్ సంస్థ ప్రశంసలందుకుంటుంది. ముఖ్యంగా హైబ్రిడ్, ఈవీ, న్యూఎనర్జీ వెహికల్స్ అమ్మకాలతో బీవైడీ అగ్రస్థానంలో నిలుస్తూ టెస్లాను వెనక్కి నెట్టేలా ఉందని ఈవీ నిపుణుల అంచనా కార్ల అమ్మకాలు పెరిగాయి 2022లో బీవైడీ ప్రపంచ వ్యాప్తంగా 1.85 మిలియన్ ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. వాటిలో 946,238 బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. అదే సమయంలో టెస్లా ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ను డెలివరీ చేసింది. చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
టెన్నిస్ స్టార్ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి
ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ తల్లికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆగంతకుడు బ్లాక్పాయింట్లో ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారును దొంగలించడం కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(ABC) వివరాల వెల్లడించింది. కిర్గియోస్ తల్లి నొర్లాలియా టెస్లా కారులో షాపింగ్కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె కారుకు ఒక దుండగుడు అడ్డు వచ్చాడు. కారు ఆపి ప్రశ్నించేలోపే దుండగుడు నొర్లాలియా తలకు తుపాకీ గురిపెట్టాడు. టెస్లా కారు తాళాలు ఇవ్వమని బెదిరించాడు. దీంతో నొర్లాలియా భయపడిపోయి పక్కకు తప్పుకోవడంతో సదరు దుండగుడు కారుతో ఉడాయించాడు. ఆ తర్వాత నొర్లాలియా పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న కిర్గియోస్ తల్లిని కలిసి జరిగిందంతా తెలుసుకున్నాడు. అయితే తన ఫోన్లో ఉన్న యాప్ సాయంతో కారు ఎక్కడుందో కనుక్కోగలిగాడు. సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకొని.. దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. The mother of Aussie tennis champion @NickKyrgios was left terrified after she was carjacked at gunpoint in Canberra, the thief stole her son's @Tesla. But in a fighting twist, Kyrgios then used the car's technology to stop the offender in his tracks. https://t.co/ywidXMpIlD pic.twitter.com/mXh0f2Ga0M — 7NEWS Sydney (@7NewsSydney) May 2, 2023 చదవండి: Serena Williams: రెండోసారి తల్లికాబోతున్న సెరీనా.. రెడ్ కార్పెట్పై బేబీ బంప్తో.. -
నాటు నాటు సాంగ్.. టెస్లా కార్లు డ్యాన్స్.. వీడియో వైరల్
ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆ పాటకు స్టెప్పులేయకుండా ఎవరు మాత్రం ఉండగలరు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై తెలుగోడి సత్తాను చాటింది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎలన్ మస్క్కు చెందిన కార్ల కంపెనీ టెస్లాలో నాటు నాటు సాంగ్ ఊర్రూతలూగించింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. టెస్లా కార్లకు ఉన్న లైట్లు నాటు నాటు స్టెప్పులతో సింక్ అయ్యేలా ప్రదర్శించారు. పాట లిరిక్స్కు అనుగుణంగా కార్ల లైట్స్ వెలగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతే కాకుండా పక్కన ఉన్న టెస్లా ఉద్యోగులు సైతం కాలు కదపకుండా ఉండలేకపోయారు. నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ లైట్ షో నిర్వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్, సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమం సక్సెస్ లో ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేసారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. .@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍 Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr — RRR Movie (@RRRMovie) March 20, 2023 -
ఎలాన్ మస్క్కు ఝలక్: లెవల్-3 అటానమస్ కార్ల తొలి కంపెనీ ఏదంటే?
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్కు షాక్ తగిలింది.సెల్ఫ్-డ్రైవింగ్ కార్లలో టెస్లాను బీట్ చేసింది మరో టాప్ కార్మేకర్ మెర్సిడెస్. అమెరికాలో లెవెల్-3 అటానమస్ సర్టిఫైడ్ కార్లను అందించిన తొలి కంపెనీగా అవతరించింది. తద్వారా ఇటీవలి కీలకమైన రేసులో మెర్సిడెస్ టెస్లాపై పైచేయి సాధించింది. లెవెల్-3 ఆటోమేషన్, కండిషనల్ ఆటోమేషన్గా పిలిచే ఈ రేసులో మెర్సిడెస్ దూసుకొచ్చింది. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (SAE) ద్వారా డ్రైవింగ్ ఆటోమేషన్ లెవల్-3గా వర్గీకరించింది. ఇది నిర్దిష్ట పరిస్థితులలో కారును స్వయంగా నడపడానికి అనుమతిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవాల్సిన, బ్రేక్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేకుండానే కారు నడిపవచ్చు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉంటూ, ఏ క్షణంలోనైనా కంట్రోల్లోకి తీసుకునేలా అలర్ట్గా ఉండాలి. లెవల్-3 ఆటోమేషన్ కోసం ప్రంపచవ్యాప్తంగా దిగ్గజ ఆటో కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఈ విషయంలో టెస్లా, దాని ఫుల్లీ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్ ముందంజలో ఉన్నప్పటికీ కానీ సమయానికి అవసరమైన ధృవపత్రాలను పొందలేకపోయినట్టు తెలుస్తోంది. అయితే నిబంధనల పరంగా లెవెల్-3 ఆటానమస్ అంతా ఆశాజనంగా లేకపోవడం గమనించదగ్గ విషయం. చాలా దేశాల్లో ఇంకా లెవల్-3 ఆటోమేషన్ వాహనాలకు నిర్దిష్ట నిబంధనలను కలిగి లేవు . అలాగే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్, కారు తయారీదారుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యతలపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మాత్రమే అనుమతి. "ఇన్నోవేషన్ పట్ల తిరుగులేని నిబద్ధతే మెర్సిడెస్-బెంజ్ను మొదటి నుండి నిలకడగా మార్గ నిర్దేశనం చేసిందనీ, దీన్ని కొనసాగించడతోపాటు, లెవల్-3 షరతులతో కూడిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ సర్టిఫికేట్ పొందిన తొలి ఆటోమోటివ్ కంపెనీ నిలవడం గర్వకారణమని మెర్సిడెస్ అమెరికా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్, సీఈవో హెడ్ డిమిట్రిస్ పిసిలాకిస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. లెవెల్-3 స్వయంప్రతిపత్తి సాంకేతికత అభివృద్ధి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రైవింగ్కు ప్రయాణంలో ఒక అడుగు మాత్రమే, ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, మెర్సిడెస్ సాధించిన లెవెల్-3 ఆటోమేషన్ విజయం ఆటో పరిశ్రమకు కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, లెవల్-3 నుంచి లెవల్-4,లెవల్-5 ఆటోమేషన్ ఉన్నత స్థాయి అటానమస్ డ్రైవింగ్ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ కార్లను రోడ్లపై దూసుకుపోయేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడాలి. -
సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్!
సాక్షి, బిజినెస్ డెస్క్: బిల్డ్ యువర్ డ్రీమ్స్.. మీ కలలను సాకారం చేసుకోండి. ఇదేదో ట్యాగ్లైన్ కాదు. ఓ చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ పేరు. సంక్షిప్త రూపం బీవైడీ. ఈ బీవైడీనే ఇప్పుడు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాను కలవరపెడుతోంది. అంతటి పెద్ద కంపెనీని కూడా డిస్కౌంట్ల బాట పట్టించింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీగా నిల్చింది. ఇప్పుడు భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ మరింతగా విస్తరిస్తోంది. రెండు దశాబ్దాలుగా.. ప్రాథమికంగా రీచార్జబుల్ బ్యాటరీల ఫ్యాక్టరీగా బీవైడీ కంపెనీని వాంగ్ చౌన్ఫు 1995లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆటోమొబైల్స్, మొబైల్ ఫోన్స్ పరికరాల విభాగాల్లోకి విస్తరించారు. ఆ క్రమంలోనే కార్ల తయారీ లైసెన్సు ఉన్న క్విన్చువాన్ ఆటోమొబైల్ కంపెనీని 2002లో కొనుగోలు చేసి దాన్ని 2003లో బీవైడీ ఆటో కంపెనీగా బీవైడీ మార్చింది. ప్రస్తుతం బీవైడీ కంపెనీలో బీవైడీ ఆటోమొబైల్, బీవైడీ ఎలక్ట్రానిక్ అని రెండు అనుబంధ సంస్థలు ఉన్నాయి. బీవైడీ ఆటోమొబైల్.. ప్యాసింజర్ కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ సైకిళ్లు వంటి పూర్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ), ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను (పీహెచ్ఈవీ) తయారు చేస్తోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టేందుకు గతేడాది మార్చి నుంచి పెట్రోల్ వాహనాలను నిలిపివేసింది. 2021 ఆఖరు నాటికి పీహెచ్ఈవీ, బీఈవీ విభాగంలో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద కంపెనీగా ఎదిగింది. 2022లో దాదాపు 19 లక్షల పైగా విద్యుత్ వాహనాలు (హైబ్రిడ్ కూడా కలిపి) విక్రయించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో ప్రపంచంలోనే నంబర్ వన్ సంస్థగా నిల్చింది. బఫెట్ పెట్టుబడులు.. మార్కెట్ క్యాప్పరంగా టెస్లా ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీగా ఉండగా.. అమ్మకాలపరంగా మాత్రం బీవైడీ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. టెస్లా మార్కెట్ వేల్యుయేషన్ 386 బిలియన్ డాలర్లుగా ఉండగా బీవైడీది సుమారు 100 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. లాభాలు, ఆదాయాలపరంగా టెస్లా ఇంకా గ్లోబల్ లీడర్గానే ఉన్నప్పటికీ బీవైడీ వేగంగా దూసుకొస్తోంది. యూరప్, ఆస్ట్రేలియా మొదలైన మార్కెట్లలోకి కూడా ఎగుమతులు మొదలుపెడుతోంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ .. టెస్లాలో కాకుండా చైనా కంపెనీ బీవైడీలో పెట్టుబడులు పెట్టారు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలతో పోలిస్తే బీవైడీకి ఓ ప్రత్యేకత ఉంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, ఎలక్ట్రిక్ కంట్రోల్ అనే మూడు రకాల ఎన్ఈవీలకు సంబంధించిన టెక్నాలజీల్లోనూ నైపుణ్యం ఉంది. ఇలా వినూత్న టెక్నాలజీల్లోనే కాకుండా ధరపరంగా కూడా టెస్లాకు బీవైడీ గట్టి పోటీ ఇస్తోంది. బీవైడీ కార్ల ధరలు చైనా మార్కెట్లో 30,000 డాలర్ల లోపే ఉంటుండగా, టెస్లా చౌకైన కారు మోడల్ 3 ప్రారంభ ధరే 37,800 డాలర్ల పైచిలుకు ఉంటోంది. 25,000 డాలర్ల రేంజిలో కారును కూడా తెస్తామంటూ టెస్లా ప్రకటించింది. భారత్లోనూ బీవైడీ జోరు.. 2030 కల్లా భారత్లో అమ్ముడయ్యే ప్రతి మూడు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్దే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మన మార్కెట్పై బీవైడీకి భారీ లక్ష్యాలే ఉన్నాయి. 2030 నాటికల్లా దేశీ ఈవీ మార్కెట్లో 40 శాతం వాటాను దక్కించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. 2007లోనే బీవైడీ ఇండియా విభాగం ఏర్పాటైంది. గతేడాది భారత్లో అటో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీలను ప్రవేశపెట్టింది. సీల్ పేరిట మరో కారును ఈ ఏడాది ప్రవేశపెడుతోంది. ఇప్పుడు విక్రయిస్తున్న కార్ల రేట్లు రూ. 29 లక్షల నుంచి ఉంటుండగా 700 కి.మీ. వరకు రేంజి ఉండే సీల్ రేటు దాదాపు రూ. 70 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. దిగుమతి సుంకాల భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రస్తుతం చెన్నైలోని ప్లాంటులో ఎలక్ట్రిక్ వాహనాలను సెమీ నాక్డ్–డౌన్ కిట్స్ (ఎస్కేడీ)లాగా అసెంబుల్ చేస్తోంది. రెండో దశలో డిమాండ్ను బట్టి పూర్తి స్థాయిలో ఇక్కడే అసెంబుల్ చేసే అవకాశాలనూ పరిశీలిస్తోంది. ప్రస్తుతం దాదాపు 20 డీలర్లు ఉండగా ఈ ఏడాది ఆఖరు నాటికి భారత్లో తమ డీలర్షిప్ల సంఖ్యను 53కి పెంచుకునే యోచనలో ఉంది. గతేడాది సుమారు 700 వాహనాలు విక్రయించగా ఈ ఏడాది ఏకంగా 15,000 పైచిలుకు అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు కనెక్షన్.. తెలుగు రాష్ట్రాల కంపెనీతో కూడా బీవైడీకి అనుబంధం ఉంది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్తో బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ సాంకేతికత సహకారంతో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇక భారత్లో సొంత ఉత్పత్తుల విస్తరణలో భాగంగా కంపెనీ హైదరాబాద్తో పాటు వైజాగ్, విజయవాడ తదితర ప్రాంతాల్లోనూ స్టోర్స్ ఏర్పాటు చేసింది. చదవండి: ShareChat Layoffs: ‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్ చాట్! -
భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..
టెస్లా కారులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన కుటుంబం కాలిఫోర్నియాలోని పెద్ద కొండపై నుంచి పడిపోయింది. ఐతే ఈ ఘటనలో ఆ కుటుంబ సభ్యులంతా ప్రాణాలతో బతికి బట్టగట్టగలిగారు. ఈ ప్రమాదం శాన్ మాటియో కౌంటీలోని డెవిల్స్ స్లైడ్ వద్ద జరిగింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందేనని నిర్థారించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ..హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకున్న కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ సిబ్బంది హెలికాప్టర్లతో అద్భుతంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టి బాధితులను రక్షించింది. ఐతే ఇది ఉద్దేశపూర్వకంగా జరిపిన హత్యా యత్నంగా అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు కుటుంబ యజమాని 41 ఏళ్ల ధర్మేష్ ఏ పటేల్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయనున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు పేర్కొన్నారు. అదీగాక కారు కొండపై నుంచి ఇంత నిటారుగా పడిపోతే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అన్నారు. చాలా అరుదైన సమయాల్లోనే ఇలా జరుగుతుందని అన్నారు. ఈ ప్రమాదంలో 4 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడికి చాలా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బాధితులు దాదాపు 250 నుంచి 300 అడుగులు కొండ దిగువున పడిపోయినట్లు పేర్కొన్నారు. బహుశా కారు సీట్లు పిల్లలను కాపాడి ఉండవచ్చని భావించారు. సదరు వ్యక్తి పటేల్ తన భార్య పిల్లలను చంపేందుకు ఇలా హత్యయత్నానికి ఒడిగట్టాడేమో అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. అతను కోలుకున్న తర్వాత శాన్ మాటియో కౌంటీ జైలుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. టాటా చైర్మన్కు లేఖ) -
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అరుదైన రికార్డులు
గతేడాది రికార్డ్ స్థాయిలో 1.3 మిలియన్ కార్లను విక్రయించినట్లు ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ప్రకటించింది. అయితే కంపెనీ విక్రయాలను దాదాపు ప్రతి సంవత్సరం 50 శాతం పెంచుతామని సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన దానికంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో 1.3 మిలియన్ కార్లను అమ్మగా..ఆ సంఖ్య 2021లో 936,000గా ఉంది. కంపెనీ నిర్ధేశించిన 50 శాతం కార్ల అమ్మకాలు ఇంకా 1.4 మిలియన్లు ఉన్నాయని తెలిపిన మస్క్..సంవత్సరానికి 40 శాతం అమ్మకాలు జరపగా, ఉత్పత్తి 47 శాతం పెరిగి 1.37 మిలియన్లకు చేరుకుందని అన్నారు. కంపెనీ అత్యధికంగా అమ్ముతున్న మోడల్స్ వై, 3 ధరల్ని టెస్లా 7,500 డాలర్లకు తగ్గించి అమ్మకాలు నిర్వహించింది. కానీ రెసిషన్ కారణంగా కార్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీనికి తోడు చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా షాంఘై ఫ్యాక్టరీలో టెస్లా ఉత్పత్తిని తగ్గించింది. -
ఎలాన్ మస్క్కు మరో దెబ్బ.. ఆ మోడల్ టెస్లా కారులో లోపాలు, చేసేదేమిలేక..
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ వినియోగదారుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన 30 వేలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది. తమ వాహనాలలోని లోపాలు ఉన్న భాగాలను రిపేర్/రీప్లేస్ చేయడానికే టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోడల్ ఎక్స్ (Model X) కార్లలో ఎయిర్బ్యాగ్ అమరికలో లోపాలు ఉన్నాయని కంపెనీ గుర్తించింది. ఈ సమస్య వల్ల కారు ముందు కూర్చునే ప్యాసింజర్లకు ప్రమాద సమయల్లో గాయాలయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ మోడల్లోని 30 వేల కార్లను రీకాల్ చేసింది. ఈ సమస్యను ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ పరిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో.. కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా గుంతలలో ప్రయాణించేటప్పుడు మోడల్ ఎస్ (Model S), మోడల్ ఎక్స్ (Model X) కార్లలో పవర్ స్టీరింగ్ సమస్య ఏర్పడుతోందని, ఆ మోడల్లోని 40,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు టెస్లా షేర్లు దాదాపు 3 శాతం క్షీణించి రేండేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే ట్విటర్లోని పరిణామాలు మస్క్కి తలనొప్పిగా ఉంటే తాజాగా టెస్లా షేర్లు పతనం కావడం దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. చదవండి: భారత్లో వన్ అండ్ ఓన్లీ గుర్తింపు.. మారుతీ సుజుకీ సొంతం! -
చైనాలో టెస్లా కారు బీభత్సం.. రెప్పపాటులో ఎంత ఘోరం
చైనాలో ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా వై మోడల్ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపు తప్పిన కారు ఘోర ప్రమాదానికి కారణమైంది. నవంబర్ 5న దక్షిణ ప్రావిన్సీ గ్వాంగ్డ్వాంగ్లో జరిగిన ఈ ఘటనలో ఓ వాహనదారుడు, హైస్కూల్ బాలిక మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. కాగా టెస్లా కంపెనీకి చైనా రెండవ అతిపెద్ద మార్కెట్. ఐతే ఈ ప్రమాద ఘటనతో చైనా సోషల్ మీడియాలో టెస్లా కారులపై మిర్శలు ఒక్కసారిగా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించాల్సి ఉంది. అంతేగాక చైనాలోని టెస్లా కంపెనీ ఏజెన్సీ నుంచి ప్రమాదంపై వివరణ కోరారు. దీనిపై ఎలెన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మాట్లాడూతూ...దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మవద్దు త్వరలోనే అసలు కారణం బయటపడుతుందన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఘోర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియోలో వాహనం నియంత్రణ కోల్పోవడంతో డ్రైవర్ కారుని అదుపుచేయలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే కారు వేగంగా వెళ్తున్నప్పుడూ బ్రేక్ లైట్లు ఆన్ అవ్వలేదని, పైగా డ్రైవర్ బ్రేక్ వేసేందుకు యత్నిస్తున్నట్లు కూడా అనిపించలేదని కొందరూ చెబుతున్నారు. అయితే డ్రైవర్ బంధువు వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టెస్లా కంపెనీ కారులో బ్రేక్ సమస్య ఉంటుందని కారు డ్రైవర్ బంధువు ఒకరు చెప్పారు. ఈ మేరకు చైనీస్ కోర్టు టెస్లా కంపెనీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు ఉన్నాయని కారు డ్రైవర్కు చురకలు అంటించింది. మీడియా ఏమో బ్రేక్ ఫెలవ్వడం అని చెబితే తమరు మరోలా కథనం చెబుతున్నారని, వాస్తవాలకు విభిన్నంగా ఉందని మండిపడుతూ సదరు యజమానిని టెస్లా కంపెనీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతోపాటు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. This video of a Tesla trying to park and instead taking off at high speed, killing two people seems to keep getting deleted, weird! pic.twitter.com/SGEcZcx6Zq — Read Jackson Rising by @CooperationJXN (@JoshuaPHilll) November 13, 2022 (చదవండి: వైట్హౌస్లో పెళ్లి సందడి... జోబైడెన్ మనవరాలు పెళ్లి) -
ఆర్ధిక మాంద్యంపై ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆర్థిక మాంద్యంపై స్పందించారు. 2024 మార్చి వరకు ఆర్ధిక మాంద్యం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. చైనా, ఐరోపాలో తలెత్తిన ఆర్థికమాంద్యం కారణంగా టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్కు డిమాండ్ తగ్గిందంటూ మస్క్ పేర్కొన్నారు. అదే విషయంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 2024 వరకు మాంద్యం కొనసాగే అవకాశం ఉన్నట్లు తాను భావిస్తున్నానని మస్క్ అన్నారు. కాగా, టెస్లా కార్లకు గిరాకీ తగ్గిందన్న మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో టెస్లా కంపెనీ షేరు 6.6 శాతం తగ్గి 207.28 డాలర్లకు పడిపోయింది. చదవండి👉 భారత్తో ఎలాన్ మస్క్ చర్చలు.. ప్రధాని మోదీ అందుకు ఒప్పుకుంటారా? -
భవిష్ అగర్వాల్ మామూలోడు కాదు..ఎలాన్ మస్క్కే ఝలక్ ఇచ్చాడు
ఓలా అధినేత భవిష్ అగర్వాల్..టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు మరోసారి ఝలక్ ఇచ్చారు. టెస్లాకు ధీటుగా తక్కువ ధరకే ఖరీదైన కార్లను పోలి ఉండేలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. భారత్కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ అమెరికాకు చెందిన టెస్లాకు గట్టిపోటీ ఇస్తుంది. బిలియనీర్లు వినియోగించే పాష్ కార్లతో పోలి ఉండేలా ఓలా ఈవీ వెహికల్ను తక్కువ , సరసమైన ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. చీపెస్ట్ టెస్లా కారు ధర 50వేల డాలర్లు. అంత భారీ మొత్తంలో వెచ్చించి ఆ కారును కొనలేం. అందుకే ఈవీ మార్కెట్లో సరికొత్త రెవెల్యూషన్తో టెస్లా కార్ల ధరల్ని 1000డాలర్ల నుంచి 50వేల డాలర్ల మధ్య ధరలతో వివిధ వేరియంట్ల కార్లను మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు బ్లూంబెర్గ్ ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘ఓలా స్టార్టప్ ప్రయాణం అంత సులువు జరగలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాం. ఇప్పటికే భారత్ మార్కెట్లో వరల్డ్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. రానున్న పదేళ్లలో దేశీయ ఈవీ మార్కెట్ వ్యాల్యూ దశాబ్దం చివరి నాటికి 150 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నా. ఓలా ఇందులో పాత్ర పోషించడం ఖాయం. ఎందుకంటే గత డిసెంబర్లో కొనుగోలు దారులు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది ఓలా గురించి వ్యతిరేక ప్రచారం చేశారు. అయినా ముందు సాగే దిశగా ఓలా సామ్రాజ్యాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ ‘చవకైన ఈవీలను తయారు చేయడం మాత్రమే కాకుండా, 5జీ, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ మొబిలిటీలో గ్లోబల్ ఫుట్ప్రింట్ను పెంపొందించడం ద్వారా భారత్ ప్రత్యర్థులకు సవాల్ విసురుతుంది’ అని అన్నారు. చదవండి👉 ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెట్టింది.2024-2026 నాటికి మొత్తం ఐదు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 2024 చివరి నాటికి ఈవీ సెగ్మెంట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు భారీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో భారత్లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రాకు, ఎలాన్ మస్క్లను పోల్చుతూ మీమ్స్ చేస్తున్నారు. 😄 https://t.co/CH3E8hdlXQ — anand mahindra (@anandmahindra) August 15, 2022 ఓ ట్విట్టర్ యూజర్..ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఆనంద్ మహీంద్రాను..భారత్లో టెస్లా కార్ల అమ్మకాలు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాట్లను విరమించుకున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్ను ఉద్దేశిస్తూ ఓ మీమ్ చేశారు. అదే మీమ్పై ఆనంద్ మహీంద్రా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ యూజర్ అలేఖ్ షిర్కే 'టెస్లా నాట్ కమింగ్ టూ ఇండియా' అనే ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కు అమెజాన్ ప్రైమ్ 'మీర్జాపూర్' సిరీస్'లోని పంకజ్ త్రిపాఠీ "Chinta mat kariye. Hum prabandh karte hain (చింతించకు నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను)." అనే ఫేమస్ డైలాగ్ను యాడ్ చేశాడు.అంతే ఇప్పుడా ఆ మీమ్ ఆనంద్ మహీంద్రా అభిమానుల్ని నవ్వులు పూయిస్తుంది. అంతకాదండోయ్. ఆ మీమ్ నచ్చిన ఆనంద్ మహీంద్రా సైతం స్మైలీ ఎమోజీనీ యాడ్ చేసి రీ ట్వీట్ చేశారు. చదవండి👉 సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది! -
టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా కీలక మైలురాయిని అధిగమించింది. టెస్లా 3 మిలియన్ల కార్ ప్రొడక్షన్ మార్క్ను క్రాస్ చేసిందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు.ఈ సందర్భంగా టెస్ల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 3 మిలియన్ల కార్లను తయారు చేసినందుకు అభినందనలు గిగా షాంఘై! మొత్తంగా టెస్లా 3 మిలియన్లకు పైగా ఉత్పత్తి మార్క్ను దాటేసింది అంటూ మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. చైనాలో టెస్లా మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ. ఈ ఏడాది ప్రథమార్థంలో దాదాపు 2లక్షల వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేసింది. టెస్లా కార్లు ఇప్పటివరకు 40 మిలియన్ మైళ్లకు పైగా సాధించింది. ఈ ఏడాది చివరికి 100 మిలియన్ మైళ్లకు చేరాలని కంపెనీ భావిస్తోంది. రానున్న సంవత్సరాల్లో టెస్లా కనీసం 10 లేదా 12 గిగాఫ్యాక్టరీలను నిర్మించవచ్చని ఇటీవల ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 2019లో ప్రకటించిన, చాలాకాలంగా ఎదురుచూస్తున్న సైబర్ట్రక్ కూడా త్వరలో ఆవిష్కృత మవుతుందన్నారు. కాగా క్యూ2లో టెస్లా 16.93 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. బెర్లిన్ వెలుపల టెస్లా కొత్త ఫ్యాక్టరీ జూన్లో వారానికి వెయ్యి కార్లను దాటిందని మస్క్ వెల్లడించారు. Congrats Giga Shanghai on making millionth car! Total Teslas made now over 3M. pic.twitter.com/2Aee6slCuv — Elon Musk (@elonmusk) August 14, 2022 -
ఇండియా దగ్గర పప్పులుడకలేదు.. ఇప్పుడు ఇండోనేషియా అంట?
ఎలక్ట్రిక్ కార్లలో ప్రపంచ నంబర్వన్గా ఉన్న టెస్లా కంపెనీ ఇండియా విషయంలో మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఇతర దేశాలకు తరలిపోతామనేట్టుగా ఫీలర్లు వదులుతోంది. పరోక్షంగా ఇండియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్. అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ కార్ల తయారీ కోసం తొలిసారిగా గిగాఫ్యాక్టరీ కాన్సెప్టుతో భారీ తయారీ కర్మాగారాలను ఎలాన్ మస్క్ నిర్మించాడు. అమెరికా వెలుపల జర్మనీ, చైనాలో రెండు గిగాఫ్యాక్టరీలను నెలకొల్పాడు. చైనాలో తయారైన ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో విక్రయించేలా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఎలక్ట్రిక్ కార్ల నుంచి కాలుష్యం రాదు కాబట్టి తమ కార్లను ప్రత్యేకంగా పరిగణిస్తూ పన్ను రాయితీలు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరాడు. షరతులు వర్తిస్తాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు భారత ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను విధిస్తోంది. ముఖ్యంగా రూ.60 లక్షలకు పైగా విలువ ఉండే కార్లకు వంద శాతం పన్ను విధిస్తోంది. ఎలాన్ మస్క్ కోరిక మేరకు టెస్లాకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే.. స్థానికంగా ఉన్న ఇతర ఆటోమొబైల్ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఎలాన్ మస్క్ డిమాండ్లు నెరవేర్చాలంటే కొన్ని షరతులు భారత ప్రభుత్వం విధించింది. ఇండియాలోనే కార్ల తయారీ పరిశ్రమ నెలకొల్పితే పన్ను రాయితీల విషయం ఆలోచిస్తామంటూ తేల్చి చెప్పంది. రాజీ కుదరలేదు పన్నుల రాయితీలు, పరిశ్రమ స్థాపన విషయంలో ఇరు వర్గాల మధ్యన దాదాపు ఏడాది కాలంగా పలు మార్లు అంతర్గత చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో టెస్లా ఇండియా హెడ్గా ఉన్న మనూజ్ ఖురానా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇండియాలో టెస్లా కథ ముగిసినట్టే అనే భావన నెలకొంది. ఇండోనేషియా వంకతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద మార్కెట్ అయిన ఇండియాను వదులుకోవడానికి ఎలాన్ మస్క సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకే ఈసారి ఇండియాపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చే చర్యలకు పూనుకున్నాడు. అందులో భాగంగా టెస్లా పరిశ్రమను తమ దేశంలో నెలకొల్పాలని ఇండోనేషియా ప్రభుత్వం కోరుతున్నట్టుగా టెస్లా ప్రెసిడెంట్ జోకో విడోడో చేత ప్రకటన చేయించారు. తమతో పాటు ఫోర్డ్ ఇతర కంపెనీలను కూడా ఇండోనేషియా కోరినట్టు వార్తలు ప్రచారంలోకి తెచ్చారు. ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇండియాలో వ్యాపారం లాభసాటిగా లేదంటూ గతేడాది ఫోర్డ్ ప్రకటించింది. ఇండియా నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా చెబుతూ ఇక్కడ కార్ల అమ్మకాలను ఆపేసింది. ఆ సంస్థకు ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను అమ్మేందుకు సిద్ధపడింది. ఇండియాలో ఫోర్డ్ ప్రస్థానానికి టెస్లా వ్యవహరాలను ముడిపెడుతూ ఇండియాకు ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా ఉందనేట్టుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఎలాన్ మస్క్ ఉన్నారు. అయితే తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన రాలేదు. చదవండి: వెల్కమ్ టూ ఎలాన్ మస్క్.. షరతులు వర్తిస్తాయి.. -
వెల్కమ్ టూ ఎలాన్ మస్క్.. షరతులు వర్తిస్తాయి..
ఎలన్మస్క్కి భారత్ స్వాగతం చెబుతోందన్నారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నరేంద్రనాథ పాండే. మస్క్కి చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో నిరంభ్యంతరంగా అమ్ముకోవచ్చంటూ కూడా సెలవిచ్చారు. అయితే ఈ పనులు జరగాలంటే భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను అనుగుణంగానే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో టెస్లా ఇక భారత్లో అడుగుపెట్టడం కష్టమనే అభిప్రాయం నెలకొంది. కాలుష్య రహితమైన కార్లు అయినందున టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు పన్ను రాయితీ ఇవ్వాలంటూ 2021 ఆగస్టులో ఎలన్ మస్క్ భారత ప్రభుత్వాన్ని కోరారు. దీనికి భారత్ స్పందిస్తూ.. పన్ను రాయితీ కావాలంటే ఇండియాలో కార్ల తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. లేదంటే పన్నులు ఇతర లగ్జరీ విదేశీ కార్లకు ఏ విధంగా వర్తిస్తున్నాయో యథావిధిగా అవే అమలు అవుతాయంటూ తేల్చి చెప్పింది. పది నెలలు గడిచినా ఇరు వర్గాలు తమ వైఖరులను మార్చుకోలేదు. కాగా ఇటీవల టెస్లా కంపనీకి ఇండియా హెడ్గా నియమితుడైన మనుజ్ ఖురానా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇండియాలో టెస్లా అడుగు పెట్టే విషయం అనుమానంలో పడింది. ఈ సమయంలో కూడా భారత్ పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్టు మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. దీంతో ఇప్పుడప్పుడే టెస్లా కార్లు ఇండియన్ రోడ్లపై రయ్రయ్మంటూ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు. చదవండి: ఎలన్ మస్క్ నీ పద్దతి మార్చుకో..లేదంటే నీకే నష్టం! -
భారత్తో డీల్ జాప్యం.. టెస్లాకు భారీ షాక్
న్యూఢిల్లీ: భారత్లో తమ ఈవీ కార్ల ఎంట్రీకి బ్రేకులు వేసిన తరుణంలో.. టెస్లా కంపెనీకి ఇప్పుడు భారీ షాక్ తగిలింది. లాబీయింగ్లో ఇంతకాలం కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన టెస్లా కంపెనీ భారత ఎగ్జిక్యూటివ్ అసహనంతో కంపెనీ నుంచి వైదొలిగినట్లు సమాచారం!. భారత్లో రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో .. టెస్లా కంపెనీ మనుజ్ ఖురానాను పాలసీ & బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా నియమించింది టెస్లా. ఐఐఎం బెంగళూరుకు చెందిన మనుజ్ ఖురానాకు అప్పటికే మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో తొమ్మిదేళ్ల అనుభవం ఉంది. టెస్లాకు భారత్లో ఆయనే తొలి ఎంప్లాయ్ కూడా!. ఈ మేరకు మార్చి 2021లో ఆయన నియామకం జరిగింది. అప్పటి నుంచి టెస్లా తరపున మనుజ్ అండ్ టీం కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సూచనల మేరకు.. దిగుమతి సుంకం తగ్గించుకోవాలంటూ భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ముందుగా తక్కువ దిగుమతి సుంకంతో కార్లను అనుమతించాలని, ఇక్కడి మార్కెట్పై ఓ అంచనాకి వచ్చి కార్ల ఉత్పత్తిని మొదలుపెడతామని మనుజ్ విజ్ఞప్తి చేశారు. చైనా కూడా ఇదే తరహాలో టెస్లాకు అనుమతులు మంజూరు చేసిందని వివరించారాయన. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో అస్సలు తగ్గలేదు. దీంతో టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వెల్లగక్కుతూ వస్తున్నారు. అయినప్పటికీ మనుజ్ తన ప్రయత్నాలను ఆపలేదు. అయితే ముందుగా స్థానిక ఉత్పత్తిని ప్రారంభించాకే.. రాయితీల గురించి చర్చించాలని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామాలతో తాజాగా టెస్లా కంపెనీ భారత్ ఎంట్రీని తాత్కాలికంగా పక్కనపెట్టింది. ఇండోనేషియాతో పాటు థాయ్లాండ్ల పైనా దృష్టిసారించింది. అంతేకాదు భారత్లో షోరూంల కోసం వెతికే ప్రయత్నాలను నిలిపివేయడంతో పాటు ఇక్కడి టీంకు వేరే పనులను అప్పజెప్పింది. ఈ క్రమంలోనే.. మనుజ్ ఖురానా టెస్లాకు రాజీనామా చేశారు. భారత్లో రంగప్రవేశం విషయంలో టెస్లా వైఖరి వల్లే ఆయన కంపెనీని వీడినట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ కథనం ప్రచురించింది. దీనిపై ఆయన స్పందన కోరగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది. -
టెస్లాలో ఉంటే సేఫ్! కావాంటే మీరే చూడండి
మొబైల్ టెక్నాలజీలో యాపిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్లో టెస్లా కార్లు కూడా అదే ప్రభావం చూపించాయి. క్రమం తప్పకుండా టెస్లా కార్లు ఎంత గొప్పవో తెలుసా అనే వీడియోలు అందుకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ కోవలోకి చేరే మరో వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. చైనాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అంతకు ముందు బలమైన ఈదురు గాలులు వీచాయి. వాటి ధాటికి వందల ఏళ్ల నాటి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. ఇలా నేలవాలని ఓ భారీ వృక్షం సరాసరి టెస్లా కంపెనీకి చెందని మోడల్ 3 కారు మీద పడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద చెట్టు మీద పడితే కారు అప్పడం అయిపోతుందని అనుకుంటాం. కానీ టెస్లా తయారీలో చూపిన నాణ్యత కారణంగా కారు స్వల్పంగానే దెబ్బతిన్నది. పైగా అందులో ఉన్న డైవర్ సైతం చిన్న గాయాలతోనే సేఫ్గా బయటపడి అక్కడి నుంచి నడుచుకుంటు వెళ్లిపోయాడట. ఈ సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది. టెస్లా కారు తయారీలో ఉపయోగించిన గ్లాస్ రూఫ్ మెటీరియల్ ధృడత్వంపై మొదట్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ప్రపంచంలో ఇదే అత్యంత సేఫ్ కారు అంటూ అప్పట్లో ఎలాన్మస్క్ విమర్శకులకు జవాబు ఇచ్చారు. తాజాగా ఘటనను అప్పటి మస్క్ వ్యాఖ్యలతో ముడిపెట్టి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక తాజా ఘటనపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. అమెరికా చట్టాల ప్రకారం దీన్ని కేవలం గాయపడటం అంటారు అనుకుంటా అంటూ చమతర్కించారు. Meanwhile in China, massive tree falls onto Tesla Model 3 glass roof driver walks away uninjured. @elonmusk once said that @Tesla Model 3 is the safest car in the world. $TSLA pic.twitter.com/uIqj25hIkr — Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) June 10, 2022 చదవండి: -
మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్ మస్క్ మీదే వేశాడు పెద్ద పంచ్
వ్యంగంగా కామెంట్లు చేయడంలో భయపడకుండా మాట్లాడటంలో ఎవరైతే నాకేంటి అన్నట్టుగా ప్రవర్తించడంలో మనకు రామ్ గోపాల్ వర్మ్ ఫేమస్. కానీ ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఈలాన్ మస్క్ ముందు వరుసలో ఉంటాడు. తన సునిశిత విమర్శలు, ఛలోక్తులతో ఎంతటి వారినైనా ఆటపట్టిస్తుంటాడు. అలాంటి మస్క్ మీదే పంచ్ వేశాడు మన భవీష్ అగర్వాల్. టెస్లా కార్ల తయారీ యూనిట్ (గిగా ఫ్యాక్టీ)ని ఈలాన్ మస్క్ ఇండియాలో నెలకొల్పుతాడా? లేదా అనేది ఇన్నాళ్లు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈలాన్ పైకి ట్యాక్సుల పేరు చెబుతున్నా తప్పకుండా ఇండియాకు వస్తాడని చాలా మంది భావిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఓ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియాను ఈలాన్ మస్క్ వదులుకుంటాడని తాను భావించడం లేదన్నారు. మేం రాబోము ఇండియాలో ఎలక్ట్రిక్ వాహానాలను కేంద్రం భారీ ఎత్తున ప్రోత్సహిస్తోంది, మినహాయింపులు వర్తింప చేస్తోంది. దీంతో చాలా కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్పై ఫోకస్ చేశారు. ఇందులో ఓలా కూడా ఒకటి. ఇప్పటికే ఓలా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో దుమ్ము రేపుతుండగా త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్లు కూడా రానున్నాయి. అయితే ఓలా తరహాలోనే ఇండియన్ మార్కెట్పై ఫోకస్ చేసిన కంపెనీలకు టెస్లా ఇక్కడికి వస్తే ఎలాంటి పోటీ నెలకొంటుందనే సందేహాలు ఉన్నాయి. దీంతో ఈలాన్ మస్క్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మస్క్ ఏమన్నారు ఇటీవల ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈలాన్ మస్క్ బదులిస్తూ ‘టెస్లా కార్లు అమ్ముకునేందుకు పన్ను రాయితీలు ఇవ్వని దేశంలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించే ఉద్దేశం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈలాన్ మస్క్ ఇండియాకు రామని, ఇక్కడి మార్కెట్పై తమకు ఆసక్తి లేదన్నట్టుగా మాట్లాడారు. ఈలాన్ మస్క్ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవీష్ స్పందన మస్క్ తాజా నిర్ణయంపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈవో భవీష్ అగర్వాల్ చిత్రంగా స్పందించారు. థ్యాంక్స్, బట్ నో థ్యాంక్స్ అంటూ ఓలా సీఈవో ట్వీట్ చేశారు. ఇండియాకు రాను అని ప్రకటన చేసిందుకు పోటీ కంపెనీగా థ్యాంక్స్ చెబుతూనే అదే సమయంలో బట్ నో థ్యాంక్స్ అని కూడా అన్నారు. మొత్తంగా నువ్వు ఇండియాకు వస్తే ఏంటీ ? రాకుంటే ఏంటీ ? అన్నట్టుగా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. మేం రెడీ సహజంగా చిత్ర విచిత్రంగా కామెంట్లు చేసి ఎదుటి వాళ్లను ఆత్మరక్షణలోకి నెట్టడం ఈలాన్ మస్క్ స్టైల్. అచ్చంగా అతని స్టైల్లోనే మస్క్కి బదులిచ్చాడు భవీష్ అగర్వాల్. ఇండియా లాంటి పెద్ద మార్కెట్కు రాకుండా ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఒంటెద్దు పోకడలకు వెళ్తామంటూ అందుకు తగ్గట్టుగా తమకు వ్యూహాలు ఉంటాయని అర్థం వచ్చేలా చిత్రమైన ట్వీట్ చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా టెస్లాతో పోటీకి తాము సిద్ధమే అన్నట్టుగా సవాల్ విసిరారు భవీశ్. Thanks, but no thanks! 🙂🇮🇳 https://t.co/yeO4qI2gg2 — Bhavish Aggarwal (@bhash) May 28, 2022 చదవండి: Elon Musk: ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి.. -
ప్రపంచ కుబేరుడు.. పరమ పిసినారి..
ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. కోట్లకు కోట్ల రూపాయలు అతని బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నాయి. అయినా సరే ఆయనకు సంపాదనపై యావ తగ్గడం లేదు. ఇంకా ఇంకా డబ్బు కావాలంటూ అర్రులు చాస్తున్నాడు. ఆయనెవరో కాదు ఈలాన్ మస్క్. ట్విటర్ టేకోవర్ అంశంలో మైండ్ గేమ్ ఆడుతున్న ఈలాన్మస్క్ ఇండియా విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నాడు. టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టే విషయంలో పన్నులు తగ్గించాలంటూ గతంలో విధించిన కండీషన్లపై వెనక్కి తగ్గడం లేదు. ఈలాన్ ఎప్పుడొస్తున్నావ్ ఈలాన్ మస్క్కి చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్లింక్కు ఇండోనేషియా ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. దీంతో ఇండియాకు ఎప్పుడు స్టార్ లింక్ వస్తుంది అంటూ ప్రణయ్ పథోలే అనే ఈలాన్మస్క్ అభిమాని ప్రశ్నించాడు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామంటూ ఈలాన్ మస్క్ జాబిచ్చారు. ఇంతలో మరో యూజర్ వచ్చి టెస్లా సంగతేంటని ప్రశ్నించాడు. ఇండియాకు రాంరాం ట్విటర్లో టెస్లా అంశంపై ఈలాన్ మస్క్ స్పందింస్తూ ఇండియాలో ఎక్కడా టెస్లా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే ఆలోచన లేదంటూ కుండబద్దలు కొట్టాడు. తమ కార్లకు ఇండియాలో పన్ను రాయితీ ఇవ్వని కారణంగా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టే ఉద్దేశం లేదంటూ తేల్చి చెప్పాడు ఈలాన్మస్క్. Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars — Elon Musk (@elonmusk) May 27, 2022 కర్బణ ఉద్ఘారాల పేరు చెప్పి గతంలో తెలంగాణలో టెస్లా గిగా ఫ్యాక్టరీ పెట్టాలంటూ ఈలాన్మస్క్ను మంత్రి కేటీఆర్ కోరారు. ఆ వెంటనే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు రావాలంటూ మస్క్కి ఆహ్వానం పలికారు. అయితే అప్పుడు కూడా పన్నుల అంశంపైనే పేచీ పెట్టాడు ఈలాన్మస్క్. కర్బణ ఉద్ఘారాలు తగ్గిస్తున్నారనే మిష మీద పన్నులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపనలు ఉన్నాయి. పైగా మస్క్కు రాయితీలు ఇస్తే ఇతర కార్ల తయారీ కంపెనీలపై అది ప్రతికూల ప్రభావం చూపడం గ్యారెంటీ. అందుకే మస్క్ ఎంతగా రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నా కేంద్ర సర్కారు సంయమనంతో ఒకే మాటకు కట్టుబడి ఉంది. గిగా ఫ్యాక్టరీలు ఈలాన్ మస్క్కి చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రిక కార్ల తయారీ కంపెనీగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్లను అమ్మే యోచనలో ఉన్నాడు ఈలాన్ మస్క్. దీంతో అమెరికా, జర్మనీ, చైనాలో గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పి భారీ ఎత్తున కార్లను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో రెండో అతి పెద్ద మార్కెట్గా భారత్లోనూ కార్లను అమ్ముతానంటూ ప్రతిపాదనలు తెచ్చారు. ఇక్కడ తయారు చేస్తేనే ఇతర దేశాల్లో తయారైన కార్లను ఇండియాకి దిగుమతి చేసి అమ్మితే.. కారు ఖరీదులో సగం లేదా సమానంగా పన్నులు విధిస్తోంది భారత్. అయితే టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కాలుష్యరహిత కార్లయినందున తమ కార్లకు భారత ప్రభుత్వం పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోరాడు. దీనికి భారత ప్రభుత్వం ససేమిరా అన్నది. పన్ను మినహాయింపు కావాలంటే ఇండియాలో గిగా ఫ్యాక్టరీ పెట్టాలంటూ కోరింది. ముందుగా పన్ను రాయితీలు ఇస్తే ఆ తర్వాత ఫ్యాక్టరీ పెట్టే విషయం ఆలోచిస్తానంటూ మస్క్ బదులిచ్చాడు. ఫ్యాక్టరీ పెడతామంటేనే రాయితీ అంటోంది మన కేంద్ర సర్కారు. దాదాపు ఆర్నెళ్లు దాటినా ఈ విషయంపై రెండు వైపులా ఎవ్వరూ వెనక్కి తగ్గక పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. చదవండి: కుబేరుల కొట్లాట -
టెస్లాకి షాకిచ్చిన షాంఘై!
ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఈలాన్ మస్క్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి. ఏషియా మార్కెట్పై కన్నెసిన ఈలాన్ మస్క్ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నాడు. షాంఘై సమీపంలో బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇక్కడి నుంచి జపాన్, ఇండియా, ఇతర ఏషియా దేశాలకు ఎలక్ట్రిక్ కార్లు సప్లై చేయాలని భావించాడు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు విధిస్తోంది ఇండియా. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియా విషయంలో ఈలాన్ మస్క్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓ వైపు మార్కెటింగ్ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ లాక్డౌన్ అమలు చేసింది డ్రాగన్ ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూత పడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు ఈ గిగా ఫ్యాక్టరీ షట్డవున్ అయ్యింది. షాంఘైలో కొంత మేర పరిస్థితులు చక్కబడటంతో 2022 ఏప్రిల్ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కరోనా దెబ్బతో కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీ తెరిచినా కార్లు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక పోవడంతో మే 9న మరోసారి కర్మాగారానికి తాళం వేసింది టెస్లా. అయితే ఈ మూసివేతపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ఈలాన్మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు? -
ఈలాన్మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు?
ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ను ఇండియన్ ఎంట్రప్యూనర్ పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ పలు అంశాలపై సూటీగా ప్రశ్నించాడు. కీలక అంశాలపై సూచనలు చేశాడు. విజయ్ శేఖర్ శర్మ ప్రస్తావించిన అంశాలపై ఇంకా ఈలాన్ మస్క్ స్పందన రాలేదు. తాజ్ ఒక అద్భుతం ట్విటర్లో బిజీగా ఉండే ఈలాన్ మస్క్.. ఆగ్రా ఫోర్ట్ గురించి ఓ యూజర్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ... 2007 నాటి భారత పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను తాజ్ మహల్ను సందర్శించినట్టు.. నిజంగా అదొక అద్భుతం అంటూ కొనియాడారు. ఇండియాలో జాగ్రత్త ఈలాన్ మస్క్ ఇండియా టూర్పై పేటీఎం విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తూ.. తాజ్మహాల్ దగ్గర టెస్లా కారును ఎప్పుడు డెలివరీ చేస్తావ్ ఈలాన్ మస్క్ అంటూ ప్రశ్నించాడు. అంతేకాదు ఈలాన్ మస్క్ మానస పుత్రిక ఆటోపైలెట్ (ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు)ను ఇండియాలో ప్రవేశపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించు. ఇక్కడి రోడ్లు, ట్రాఫిక్ చాలా గందరగోళంగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా నువ్వు ఆటోపైలెట్ డిజైన్ చేయాల్సి ఉంటుందంటూ సూచనలు చేశారు అయితే దీనిపై మస్క్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. It is amazing. I visited in 2007 and also saw the Taj Mahal, which truly is a wonder of the world. — Elon Musk (@elonmusk) May 9, 2022 టెస్లా వివాదం టెస్లా కార్లను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టే అంశంపై ఈలాన్ మస్క్ ఆసక్తిగా ఉన్నాడు. అయితే విదేశాల్లో తయారు చేసిన కార్లను ఇండియాకి దిగుమతి చేస్తానని చెబుతున్నాడు. ఇలా దిగుమతి చేసే కార్లపై భారత ప్రభుత్వం భారీగా సుంకాలు విధించింది. వీటిని తగ్గించాలంటూ మస్క్ డిమాండ్ చేశాడు. దీనికి ప్రతిగా ఇండియాలో కార్లను తయారు చేయగలిగితే సుంకాలు తగ్గిస్తామని, ఇతర దేశాల్లో చేసిన కార్లు ఇక్కడ అమ్ముతామంటూ ఎటువంటి రాయితీలు ఇవ్వబోమంటూ తేల్చి చెప్పంది. దీంతో ఈ అంశంపై పీటముడి బిగుసుకున్నట్టైంది. చదవండి: -
నితిన్ గడ్కరీ..మాటంటే మాటే! ఎలన్మస్క్కు బంపరాఫర్!
న్యూఢిల్లీ: దేశీయంగా పెట్రోల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) చవకగా లభించే రోజు ఎంతో దూరంలో లేదని కేంద్ర రహదారులు, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మరోవైపు, అమెరికా విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా .. భారత్లోనే వాహనాలను ఉత్పత్తి చేస్తే ఆ సంస్థకూ ప్రయోజనకరంగా ఉంటుందని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఎలన్ మస్క్ సీఈఓగా ఉన్న టెస్లా తన ఈవీలను భారత్లోనే ఉత్పత్తి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చైనాలో తయారు చేసి, వాటిని ఇక్కడ అమ్ముతామంటేనే సమస్యని గడ్కరీ ఇప్పటికే స్వష్టం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇంజిన్ పరిమాణం, ఖరీదును బట్టి దిగుమతి చేసుకునే కార్లపై 60–100% సుంకాలు ఉంటున్నాయి. అంతిమంగా కారు ఖరీదులో 110% వరకూ దిగుమతి సుంకాల భారం ఉంటోందని, దీన్ని తగ్గించి భారత్లో విక్రయించుకునేందుకు అనుమతిస్తే..ఆ నిధులను దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇన్వెస్ట్ చేస్తామని టెస్లా చెబుతోంది. అయితే, టెస్లా కోసం నిబంధనలను మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. చదవండి👉 చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్మస్క్ - నితిన్ గడ్కారీ -
చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్మస్క్ - నితిన్ గడ్కారీ
టెస్లా కార్ల విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎప్పుడు చెప్పినా టెస్లా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో తమది ఒకే విధానమంటూ కుండ బద్దలు కొట్టారు. ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలంటే లాబీయింగ్ వ్యవహారం పనికి రాదని ఎలన్మస్క్కు తేల్చి చెప్పారు. కేంద్ర విదేశాంగ శాఖ ఈ రోజు నిర్వహించిన ది రైసినా డైలాగ్ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్లా కార్ల అంశంపై ఆయన మాట్లాడుతూ.. టెస్లా కంపెనీ ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుని ఇక్కడ తయారు చేసిన కార్లను దేశంలో అమ్మడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. అంతేకాని చైనాలో తయారు చేసిన కార్లను ఇండియాలో అమ్ముతాం. వాటికి పన్నులు తగ్గించాలంటే మాత్రం అంగీకరించబోమని వెల్లడించారు. ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో టెస్లా కార్లను ప్రవేశపెట్టాలని ఎలన్మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాలుష్య రహితమైన టెస్లా కార్లకు దిగుమతి సుంకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఢిల్లీలో భారీ ఎత్తున లాబీయింగ్ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఇండియాలో తయారీ యూనిట్ పెడితే పన్నుల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం ఏనాడో ప్రకటించింది. సమయం గడుస్తున్నా ఇండియా అదే విధానానికి కట్టుబడి ఉందని తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. చదవండి: వరుస ప్రమాదాలు.. ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన -
టెస్లా కారుకు సవాలు విసిరే వాహనం అదే...ఎలన్ మస్క్ను ట్యాగ్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల రేసులో ముందున్న ఆటోమొబైల్ సంస్థ ఏది అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది టెస్లా కార్లే..! ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అత్యంత ఆదరణను పొందాయి. కాగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయంలో ఎలన్మస్క్ను ట్యాగ్ను చేస్తూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ను ట్విటర్లో షేర్ చేశారు. చిల్లి గవ్వ అవసరం లేదు..! ఆనంద్ మహీంద్రా ట్విటర్లో ఎలన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ఎడ్ల బండి చిత్రాన్ని షేర్ చేశారు. చిల్లి గవ్వ అవసరం లేకుండా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యంతో ఇంకా గూగుల్ మ్యాప్స్ అవసరం లేకుండానే గమ్యస్థానాలకు చేర్చే ఒరిజినల్ టెస్లా వాహనం ఎద్దుల బండి అనే కాప్షన్ ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో టెస్లా చీఫ్ ఎలన్మస్క్ను ట్యాగ్ చేసి బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇప్పటికే 11 వేల లైక్స్ను సొంతం చేసుకుంది. కొంతమంది నెటిజన్లు టెస్లా కారుకు సవాలు విసిరే కారు ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే మాత్రమే అంటూ రాసుకొస్తున్నారు. BACK to the Future… @elonmusk pic.twitter.com/csuzuF6m4t — anand mahindra (@anandmahindra) April 24, 2022 ఇదిలా ఉండగా...గతంలో ఆనంద్ మహీంద్రా పునరుత్పాదక శక్తితో నడిచేకారు గురించి కూడా ఎలన్ మస్క్ను ట్యాగ్ చేయగా..అప్పుడు మస్క్ దానికి రిప్లై కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఎలాంటి రిప్లై ఇస్తారని ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు నెటిజన్లు. చదవండి: ఆ విషయం గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కూడా ఇలా చెప్పలేరు -
సంచలనం! ఎలన్ మస్క్కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు!
ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్కు ఎదురు దెబ్బ తగలనుంది. ఈవీ మార్కెట్లో టెస్లా కంటే మెర్సిడెజ్ బెంజ్ దూసుకొస్తుంది. మెర్సిడెజ్ బెంజ్కు చెందిన ఏజీ ఎలక్ట్రిక్ కార్ వెయ్యికంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్లో మార్కెట్కి పరిచయం కానుందని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ ఏజి ఈక్యూఎక్స్ఎక్స్ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జింగ్తో జర్మనీ నుండి ఫ్రెంచ్ రివేరాకు 1000 కిలోమీటర్ల (621 మైళ్ళు) పైగా ప్రయాణించిందని, ఈ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ టెస్లాను అధిగమించినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక హైలెట్ చేసింది. ఈక్యూఎక్స్ఎక్స్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారు జర్మనీ నుండి బయలుదేరి, స్విట్జర్లాండ్, ఇటలీ మీదుగా ఒకేసారి 12 గంటలు నాన్ స్టాప్ గా ప్రయాణించి, దాని బ్యాటరీ ప్యాక్ లో ఇంకా 140 కిలోమీటర్ల పరిధి ఉండగా ఫ్రాన్స్ కు చేరుకున్నట్లు మెర్సిడెస్ తెలిపింది. మెర్సిడెస్ ప్రకారం..ఫ్రాన్స్ చేరుకున్నప్పుడు బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ సుమారు 15శాతం. ఇది 140 కిలోమీటర్ల (87 మైళ్ళు) మిగిలిన పరిధికి సమానం. సగటు వినియోగం 100 కిలోమీటర్లకు 8.7 కిలోవాట్ (62 మైళ్లకు 7.1 కిలోవాట్ల) రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. "మేం సాధించాం. 1000 కిలోమీటర్లకు పైగా ఒకే బ్యాటరీ ఛార్జ్ పై తేలికగా, సాధారణ రోడ్లమీద ట్రాఫిక్ లో సైతం కేవలం 8.7 కేడ్ల్యూహెచ్ /100 కేఎం (ప్రతి 62 మైళ్లకు 7.1 కేడ్ల్యూహెచ్) మాత్రమే వినియోగించింది. విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ అని మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఎజి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ ఓలా కాల్లెనియస్ చెప్పారు. మెర్సిడెస్ 2026నాటికి 60 బిలియన్ యూరోలు (65 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసి టెస్లాను అధిగమించడానికి, దాని ప్రత్యర్థి బీఎండబ్ల్యూఎజి నుండి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ కార్ల తయారీదారు అనే బ్రాండ్ను తిరిగి పొందాలని చూస్తుంది. ఈ దశాబ్దం చివరి నాటికి సాధ్యమైనంత వరకు ఈవీలను మాత్రమే విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భాగస్వాములతో ఎనిమిది బ్యాటరీ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం యోచిస్తోంది. -
ఆటో పైలెట్ని నమ్ముకుంది.. ఇప్పుడు కష్టాలపాలయ్యింది ?
టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును మెల్బోర్న్ కోర్టు విచారిస్తుండగా నిందితురాలు ఆటో పైలెట్ అంశాన్ని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దృష్టిని ఆకర్షించింది. భారత సంతతి యువతి సాక్షి అగర్వాల్ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైంది. టెస్లాకి చెందిన మోడల్ 3 కారులో ప్రయాణిస్తున్న సాక్షి అగర్వాల్ రోడ్డుపై ట్రామ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తోన్న నికోల్ లాగోస్ అనే మహిళను కారుతో ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన కేసు మెల్బోర్న్ కోర్టులు విచారణకు వచ్చింది. కోర్టు విచారణలో నిందితురాలు సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. ట్రామ్ మరింత ముందుకు వెళ్లి ఆగుతుందని తాను భావించానని అందువలేల్ల కారును సకాలంలో అదుపు చేయలేకపోయానంటూ ఆమె తెలిపారు. పైగా ప్రమాదం జరిగినప్పుడు కారు ఆటో పైలెట్ మోడ్లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు తుది తీర్పును వెల్లడించలేదు. కేసు విచారణ దశలోనే ఉంది. A 23-year-old driver is accused of hitting an aged care worker in Melbourne - claiming her Tesla was on autopilot at the time. Police say the P-plater left the scene and returned hours later to speak to officers. @penelopeliersch #9News pic.twitter.com/U0xEqAPUkk — 9News Melbourne (@9NewsMelb) March 22, 2022 డ్రైవర్ సాయం లేకుండా కారు నడిపే టెక్నాలజీని టెస్లా కార్లలో అందుబాటులోకి తెస్తామంటూ ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో కాకపోయినా డ్రైవర్ నామమాత్రపు కంట్రోల్లో ఉండే ఆటోపైలెట్ ఆప్షన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమెరికాలో ఈ ఆటోపైలెట్ మోడ్పై అభ్యంతరాలు ఉన్నాయి. ఇంతలో ఆస్ట్రేలియాలో మరో కేసు వెలుగు చూసింది. -
ఎలన్ మస్క్ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఏం చేసినా క్రేజీగానే ఉంటుంది. అందులోనూ సామాజిక కట్టుబాట్లను నిరంతరం ప్రశ్నించే వ్యక్తి అయితే వచ్చే అటెన్షన్ వేరే లెవల్లో ఉంటుంది. వివాస్పద వ్యాఖ్యలు, చర్చలతో ఎప్పుడు వార్తల్లో ఉండే ఎలన్ మస్క్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. గిగాఫ్యాక్టరీ కాన్సెప్టుతో అతి పెద్ద ప్రొడక్షన్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాడు ఎలన్ మస్క్. తాజాగా జర్మనీలో టెస్లా కార్లకు సంబంధించిన గిగా ఫ్యాక్టరీని 2022 మార్చి 22న ఎలన్ మస్క్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా టెస్లా గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తైయిన మోడల్ వై కారు పక్కన నిల్చుని ఎలన్ మస్క్ డ్యాన్స్ చేశారు. ఒక్కసారిగా ఎలన్ మస్క్ డ్యాన్స్ చూసిన అక్కడి వారు కేరింతలు, చప్పట్లతో మరింత ఉత్సాహాపరిచారు. ఎలన్ మస్క్ మూవ్మెంట్స్ను క్యాచ్ చేసేందుకు వచ్చిన డ్రోన్ కెమెరాను చూసి మస్క్ మరింతగా రెచ్చిపోయారు. డ్రోన్ ముందుకెళ్లి మరీ చిందులాడారు. The best of Giga Berlin: Elon’s dance moves $TSLA #Tesla @elonmusk #elon #ElonMusk pic.twitter.com/FYfPcYNiYR — Lupe (@Lup3Garza) March 22, 2022 ఎలన్ మస్క్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది డ్యాన్స్ వీడియో క్లిప్స్లను షేర్ చేస్తున్నారు. మరికొందరు షాంగై గిగా ఫ్యాక్టరీ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేస్తూ.. రెండింటిలో ఏదీ బాగుందో చెప్పాలంటూ కోరుతున్నారు. Shanghai vs Berlin@elonmusk dance, which one is better? pic.twitter.com/WcioxBiWT1 — Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) March 23, 2022 -
సెకనుకు రూ.3కోట్ల ఆదాయం,మస్క్ ఆస్తులు కరిగిపోతున్నాయా!
ఒక్కసెకనుకు మూడుకోట్ల ఆదాయం గడించే స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయా? ఆస్తులు కరిగిపోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఎలన్ మస్క్ మాజీ భార్య, ప్రముఖ కెనడీయన్ సింగర్ గ్రిమ్స్(క్లెయిర్ బౌచర్). ఇటీవల ఎలన్ మస్క్ మాజీ భార్య గ్రిమ్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎలన్ మస్క్ కొన్ని సార్లు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలన్ బిలియనీర్లాగా జీవించడు. కొన్ని సార్లు దారిద్య్ర రేఖకు దిగువన గడుపుతారు అంటూ లాస్ ఏంజెల్స్లో ఎలన్ మస్క్ తో గడిపిన రోజుల్ని గ్రిమ్స్ గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు తరువాత ఎలన్ మస్క్ ఆస్తులు ఎంత ఉన్నాయనే అంశంపై పలు రిపోర్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం..బెల్-ఎయిర్లోని లాస్ ఏంజిల్స్ పరిసరాల్లో తనకున్న మొత్తం ఏడు ఇళ్లను జూన్ 2020 నుంచి నవంబర్ 2021 మధ్య కాలంలో మొత్తం 127.9 మిలియన్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆస్తుల అమ్మకంపై ఎలన్ మస్క్ మే1,2020న ట్వీట్ చేశారు. భౌతిక ఆస్తులన్నీ అమ్మేస్తున్నాను. కానీ జీన్ వైల్డర్లో ఉన్న పాత ఇంటిని మాత్రం అమ్మదలుచు కోలేదంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఒక్కసెకనుకు మూడు కోట్ల ఆదాయం అవును మీరు వింటున్నది నిజమే ఎలన్ మస్క్ ఆదాయం ఒక్కసెకనుకు మూడు కోట్ల ఆదాయం. ప్రపంచ కుబేరుల్లో నెంబర్. అతని ఆదాయం ఒక్క సెకనుకు మూడుకోట్లు. నిమిషానికి 188కోట్లు. గతేడాది అక్టోబర్ 25 సోమవారం రోజు అతని ఆదాయం ఒక్కసారి 14.5శాతం పెరిగింది. దీంతో అప్పటి వరకు తనకు పోటీ ఇచ్చిన కుబేరుల్ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కి చేరుకున్నారు మస్క్. హెచ్గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ఒకేసారి 100 టెస్లా కార్లను కొనుగోలు చేస్తామని ఆర్డర్ ఇవ్వడంతో.. టెస్లా షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఎలన్ మస్క్ నికర సంపద 36.2బిలియన్ డాలర్లు ఉండగా ఇండియన్ కరెన్సీలో ఎలన్ ఆదాయం. 2.71లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. దీంతో ఎలన్ మస్క్ నాటి సంపద 289బిలియన్ డాలర్స్కు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో 21లక్షల 30వేల కోట్లు. ఇది భారత్లో ఒక్క ఏడాది వచ్చే రెవెన్యూ కంటే ఎక్కువ. -
ఎలన్ మస్క్కు ప్రధాని మోదీ బంపరాఫర్!! భారత్లో టెస్లా తయారీ యూనిట్లు?!
ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ విషయంలో కేంద్రం కాస్త యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఎలన్ మస్క్కు ఓ బంపరాఫర్ ఇచ్చినట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఎలన్ మస్క్ భారత్లో టెస్లా యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే టెస్లా యూనిట్లను ఏర్పాటు చేస్తే కేంద్రం తమకు టెస్లా కార్లపై దిగుమతి పన్ను, సుంకాలు తగ్గించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల్ని కేంద్రం ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తుంది. కానీ తాజాగా టెస్లా,కేంద్రాల మధ్య సయోధ్య కుదురుతున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ కోరినట్లు కేంద్రం టెస్లా యూనిట్లపై రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైందని, అదే సమయంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో 500 మిలియన్ డాలర్ల మేర భారత్లో తయారుచేసిన వాహన పరికరాలనే వాడాలని షరతు విధించిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారంటూ నేషనల్ మీడియా కథనాల్ని ప్రచురించింది. కార్ల తయారీకి ఉపయోగించే పరికరాల్ని మొదట భారత్ కు చెందినవే వినియోగించాలని, ప్రారంభంలో లోకల్ ప్రొడక్ట్ లు తొలుత 10-15 శాతం కొనుగోలు చేయాలని, ఆ తర్వాత కొనుగోళ్ల శాతాన్ని టెస్లా పెంచుకుంటూ పోయేందుకు అంగీకరించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన సంబంధిత శాఖ అధికారులు టెస్లాకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి కేంద్రం పెట్టిన ఈ షరతులకు ఎలన్ మస్క్ అంగీకరిస్తారో? లేదో?. ఒకవేళ ఎలన్ ఒప్పుకుంటే మాత్రం భారత రోడ్లపై టెస్లా కార్లు చక్కెర్లు కొట్టడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎలన్మస్క్.. మా పద్దతి ఇంతే.. ఇకపై నీ ఇష్టం..
టెస్టా కార్లు, ఎలన్ మస్క్ విషయంలో కేంద్రం మంత్రి నితిన్ గడ్కారీ కుండబద్దలు కొట్టారు. ఇండియాలో తయారీ యూనిట్ పెడితే రాయితీలు, ప్రోత్సహాకల గురించి ఆలోచిస్తామని మరోసారి వెల్లడించారు. అలా కాకుండా చైనాతో కార్లు తయారు చేస్తాం.. వాటిని ఇండియాలో అమ్ముతామంటే.. కుదురదని తేల్చిచెప్పారు. ఆ ప్రతిపాదనే మాకు డైజెస్ట్ కావడం లేదన్నారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి. బీఎండబ్ల్యూ, వోల్వో, ఫోక్స్వ్యాగన్, హ్యందాయ్, హోండా, రెనాల్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ తయారీ యూనిట్లను నెలకొల్పాయి. ఇప్పుడు కొత్తగా టెస్లాకు మేం రాయితీలు ఇస్తే.. పాత కంపెనీలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. అయినా చైనాలో ప్లాంటు పెడతాం.. అక్కడి వారికి ఉద్యోగాలు ఇస్తాం.. ఇండియాలో కార్లు అమ్ముకుని లాభాలు పొందుతాం అనే ధోరణి మాకు మింగుడుపడటం లేదన్నారు నితిన్గడ్కారీ. టెస్లా కార్లను ఇండియాలో అమ్మే లక్ష్యంతో గతంలో బెంగళూరులో టెస్లా కంపెనీ ఆఫీస్ రిజిస్టర్ చేసింది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ అయినందున పన్ను రాయితీలు ఇవ్వాలంటూ మెలిక పెట్టింది. ఇండియాలో తయారీ యూనిట్ స్థాపిస్తే రాయితీలు లేదంటే భారీ పన్నులు తప్పవంటూ కేంద్రం స్పష్టం చేసింది. అయితే అటు ఇండియా మార్కెట్ను వదులుకోలేక.. ఇటు ప్లాంట్లు పెడతానంటూ హామీ ఇవ్వలేక ఎలన్మస్క్ ‘ప్రభుత్వం సహాకరించడం లేదంటూ’ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. -
అంతకు మించిన బాధ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు - ఎలన్మస్క్
పర్సనల్ విషయాలు బయటపెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు టెస్లా ఓనర్ ఎలన్మస్క్. కానీ తన జీవితంలో చోటు చేసుకున్న ఓ విషాధ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇటీవల వెలుగు చూశాయి. టెస్లా మోడల్ ఎస్ కారును వేగంగా నడిపిస్తూ ఓ ప్రమాదంలో చిక్కుకుని చనిపోయారు ఇద్దరు అమెరికన్ టీనేజర్లు. 2018 మే 10న బారెట్రిలే, ఎడ్గర్మాన్సెరాట్ అనే ఇద్దరు టీజేజర్లు గంటకు 116 మైళ్ల వేగంతో మోడల్ ఎస్ కారును డ్రైవ్ చేస్తుండగా కారు క్రాష్ అయ్యింది. వెంటనే మంటలు చెలరేగి ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమదానికి సంబంధించి బారెట్రిలే తండ్రి జేమ్స్రిలేకి పలు ఈ మెయిళ్లు పంపారు ఎలన్మస్క్. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఎలన్మస్క్ ప్రస్తావించాడు. 2008లో ఎలన్మస్క్ మొదటి సంతానం నెవడా అలెగ్జాండర్ మస్క్ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషయాలను ఎలన్మస్క్ ప్రస్తావిస్తూ... పది వారాల వయస్సున్నప్పుడు నెవడా నా చేతిలోనే చనిపోయాడు. వాడు ఆఖరి శ్వాస తీసుకోవడం నేను చూశాను. నా చేతిలో ఉన్నప్పుడే వాడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మన కళ్ల ముందే పిల్లలు చని పోవడం కంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు అంటూ తన బాధని పంచుకున్నారు. ఈ రోడ్డు ప్రమాదం తర్వాత టెస్లా కారులో భద్రతపరమైన ఫీచర్లు పెంచారు ఎలన్మస్క్, మొబైల్ యాప్ ద్వారా కారు స్పీడును తల్లిదండ్రులు కంట్రోల్ చేసే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన కొద్ది కాలం తర్వాత టెస్లా కంపెనీకి వ్యతిరేకంగా మృతుల కుటుంబ సభ్యులు కోర్టులో కేసు నమోదు చేశారు. టెస్లా కారులో ఉన్న భద్రతపరమైన లోపాల కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. టెస్లా ఆటోపైలెట్పై అనేక సందేహాలు చుట్టుముట్టిన తరుణంలో ఈ కేసు వార్తల్లోకి రావడం ఎలన్మస్క్కి ఇబ్బందిగా మారింది. చదవండి:‘ఎలన్ మస్క్ నిజంగా ఓ పిచ్చోడు’.. ఇజ్జత్ తీసిపారేసిన టీనేజర్ -
టెస్లా కార్లలో కలకలం, 8లక్షల కార్లకు పైగా!!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం టెస్లాకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. టెస్లా కార్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా సుమారు 8.17లక్షల కార్లకు పై రీకాల్ చేయాలని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ సెడాన్, మోడల్ ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3, మోడల్ వై ఎస్యూవీ వాహనాల డ్రైవింగ్ సమయంలో సీట్ బెల్ట్ రిమైండ్ చేయడం సమస్య తెలత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్య కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుందనే కారణంతో సుమారు.8,17,000 కార్లను రీకాల్ చేయాలని ఎన్ హెచ్ టీఎస్ ఏ అధికారులు టెస్లాను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన టెస్లా కార్లకు సంబంధించిన లోపాల్ని సత్వరమే పరిష్కరించి వాహనదారులకు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. సిగ్నల్ పడినా దూసుకొని వెళ్తున్నాయ్ కొద్ది రోజుల క్రితం ఇదే టెస్లాకు చెందిన 54వేల కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెడ్ సిగ్నల్ పడినా టెస్లా కార్లు రయ్ మంటూ దూసుకెళ్లాయి. దీంతో టెస్లా కార్లలో భద్రత ప్రధాన సమస్యగా మారిందని, వెంటనే ఆ కార్లను రీకాల్ చేయాలని అమెరికా రక్షణ నియంత్రణ సంస్థ టెస్లా సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా, టెస్లా మాత్రం తమ కార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదని తెలిపింది. వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. -
బాబోయ్ అశ్లీల వీడియోలు! దుర్వినియోగం అవుతున్న కొత్త ఫీచర్? టెస్లా కారుకు కొత్త చిక్కులు
వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందిన టెస్లాకారులోని లేటెస్ట్ ఫీచర్లని కొందరు దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఊహించని విధంగా తలెత్తిన ఈ కొత్త సమస్యకి ఎలన్ మస్క్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటన టెస్లా బ్రాండ్ ఇమేజ్ని ఎమైనా ఎఫెక్ట్ చేస్తుందా అనే చర్చ సైతం మొదలైంది. టెక్నాలజీలో దూసుకుపోవడం అంటే ఎలన్ మస్క్కి ఇష్టం. అందుకే డీజిల్ కార్లు రాజ్యమేలుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆలోచించారు. అదే బాటలో ఇప్పుడు డ్రైవర్ లెస్ కారుని పరిచయం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇలా టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా నేవిగేషన్ మరింత సులువుగా ఉండేందుకు టెస్లా కార్లలో బిగ్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు ఎలన్ మస్క్. కానీ కొందరు ప్రబుద్దులు ఈ స్క్రీన్లను దుర్వినియోగం చేస్తున్నారు. టెస్లా బ్రాండ్కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టారు. టచ్ స్క్రీన్ ఉపయోగం టెస్లా కారులో డ్యాష్ బోర్డులో ఇన్ఫోంటైన్మెంట్ ఏరియాలో స్ట్రీరింగ్ పక్కనే టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్లో కారు ఎంత వేగంతో వెళుతుంది. ముందు, వెనుక భాగంలో వచ్చే వాహనాల వివరాలు, యాక్సిడెంట్ అలెర్ట్, మ్యాప్లతో నావిగేషన్, ఎయిర్ కండిషన్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కారు ప్రయాణిస్తున్న ఏరియాకు సంబంధించిన ప్రత్యేకతలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వివరాలను అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా ఆ టచ్ స్క్రీన్ తో డ్రైవింగ్ను కమ్యునికేట్ చేయడంతో పాటు ఇతర పనుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ టచ్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. దుర్వినియోగం ఇప్పుడు అదే స్క్రీన్ను కొందరు ప్రబుద్దులు అసాంఘీక కార్యకలాపాకు ఉపయోగించడంపై సరికొత్త చర్చకు దారి తీసింది. సౌత్ లండన్ ప్రాంతంలో ఓ వాహన దారుడు రూ.75లక్షల ఖరీదైన 'టెస్లా-ఎస్' ఎలక్ట్రిక్ కారు స్ట్రీరింగ్ పక్కనే ఉన్న టచ్ స్క్రీన్పై అశ్లీల వీడియోలు చూస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. డాన్ కిచెనర్ అనే మరో వాహనదారుడు టెస్లా కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి నీలిచిత్రాలు చూస్తుండడాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇలా అయితే ఎలా ? ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని డాన్ కిచెనర్ సోషల్ మీడియాలో వివరంగా తెలిపాడు... సౌత్ లండన్లో నేనుండే ఏరియా నుంచి నా కారులో ఆఫీస్కు వెళుతున్నా. అదే సమయంలో నా ముందున్న టెస్లా కారు టచ్ స్క్రీన్లో నీలిచిత్రాలు ప్లే అవ్వడాన్ని గమనించా. జాగ్రత్తగా చూస్తే డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కారును నడుపుతూనే పక్కన ఉన్న స్క్రీన్ను జూమ్ చేసి నీలి చిత్రాలు చూస్తున్నాడు. ట్రాఫిక్ను గమనించకుండా మరో లోకంలో ఉండిపోయి ఆ వీడియోలు చూస్తున్నాడు. ఇలా డ్రైవింగ్పై దృష్టి పెట్టకుండా నడిపితే జరిగే నష్టానికి బాధ్యులంటూ ప్రశ్నించాడు. మస్క్ ఏంచేస్తారో కిచెనర్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. టెస్లా కారులో మిస్ యూజ్ అవుతున్న టచ్ స్క్కీన్పై ఎలన్ మస్క్ ఎలా స్పందిస్తారు ? ఏదైనా కొత్త పరిష్కారం చూపిస్తారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు డ్రైవర్ను తిట్టి పోస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వివాదంపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. చదవండి: టెస్లా కంపెనీకి 19 ఏళ్ల కుర్రాడు సవాల్..! -
టెస్లా కంపెనీకి 19 ఏళ్ల కుర్రాడు సవాల్..!
కార్ల అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికీ టెస్లా కంపెనీ గురుంచి తెలియకుండా ఉండదు. ఈ కంపెనీకి చెందిన కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. మరి ఈ టెస్లా కంపెనీకి చెందిన కార్లు ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?.. ఆ కార్లు పూర్తిగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లు; అలాగే, ఇందులో ఏ ఆటోమొబైల్ కంపెనీ ఇంతవరకు వినియోగించని అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ ఉండటమే దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ వల్ల ఈ కార్లను కీ సహాయం లేకుండా మొబైల్ సహాయంతో స్టార్ట్ చేయడంతో పాటు వాటి డోర్స్ వాటంతట అవే ఓపెన్ కావడం, కార్లను పార్క్ చేయడం వంటివి చేయవచ్చు. మరి, ఇలాంటి అత్యాధునిక ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీని ఎవరైనా హ్యాక్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి ఈ సాంకేతికతను జర్మనీకి చెందిన 19 ఏళ్ల కుర్రాడు హ్యాక్ చేసి చూపించాడు. ఈ 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ డేవిడ్ కొలంబో తన జీవిత కాలంలో అతిపెద్ద లోపాన్ని కనుగొన్నాడు. కొలంబో ఒక ఫ్రెంచ్ కంపెనీ కోసం భద్రతా తనికీలు చేస్తున్నప్పుడు ఆ సంస్థ నెట్వర్క్లో సాఫ్ట్ వేర్ ద్వారా ఆ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వాడుతున్న టెస్లా కారుకి సంబంధించిన డేటాను హ్యాక్ చేశాడు. ఈ డేటాలో కారు ఎక్కడ ఎక్కడ తిరిగిందో పూర్తి చరిత్రను తెలుసుకోవడంతో పాటు ఆ క్షణంలో కారు ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నాడు. 25కి పైగా టెస్లా కార్లు అధీనంలోకి డేవిడ్ కొలంబో కేవలం ఈ ఒక్క కారును మాత్రమే హ్యాక్ చేయలేదు.. అనేక ఇతర టెస్లా కార్లను కూడా హ్యాక్ చేసినట్లు తను పేర్కొన్నాడు. ఆ కారు యజమానులకు తను కారుని హ్యాక్ చేసినట్లు చెప్పడానికి ఆ కారు హారన్ మోగించడం, డోర్స్ ఓపెన్ చేసినట్లు తెలిపాడు. యూరప్, ఉత్తర అమెరికా అంతటా ఉన్న 13 దేశాలలో 25కి పైగా టెస్లా కార్లలో ఈ లోపాలను కనుగొన్నానని తెలిపాడు. ఇలా చాలా కార్లలో ఇతర భద్రత లోపాలు ఉండే అవకాశం ఉన్నట్లు తను తెలిపాడు. (చదవండి: టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు) ఈ లోపాలు గురుంచి టెస్లా కంపెనీ మెయిల్ చేసినట్లు కొలంబో వివరించారు. ఆ కంపెనీకి చెందిన ఒక భద్రతా బృందం సభ్యుడు తనను సంప్రదించాడని, అతను తనతో సమాచారం పంచుకున్నట్లు కూడా పేర్కొన్నాడు. ఈ విషయం గురించి టెస్లాతో సంప్రదింపులు జరిగాయని, యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి కూడా తనను సంప్రదించినట్లు తెలిపారు. అయితే, ఈ లోపం గల సాంకేతికతను తృతీయపక్ష సాఫ్ట్ వేర్ కంపెనీ తయారీ చేసినట్లు తెలిసింది. ఇదే మొదటసారి కాదు... ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ఆటోమొబైల్స్ని హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో ఇద్దరు భద్రతా పరిశోధకులు రిమోట్ గా జీప్ చెరోకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక జర్నలిస్ట్ అమెరికాలోని హైవే పై గంటకు 70 మైళ్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఆ వాహనం ఇంజిన్ ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో సదురు కంపెనీ ఆ లోపాలను సరిదిద్దాడానికి వాహనలను రీకాల్ చేసింది. ఇలాంటి ఆటోనమస్ వెహికల్ టెక్నాలజీ వల్ల ప్రమాదం పొంచి ఉన్నట్లు కొలంబో తెలపడంతో పాటు ఇతరులు ఎవరైనా ఈ భద్రత లోపాన్ని కనిపెట్టి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది అని తెలిపారు. డేవిడ్ కొలంబో..? డేవిడ్ కొలంబోకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇంత భాద నుంచి బయటపడటానికి ఎక్కువ సమయం తను కంప్యూటరు కోడింగ్ మీద గడిపాడు. ఆ తర్వాత తన స్కూల్లో చెప్పే పాఠలా మీద ఆసక్తిపోవడంతో రోజుకి రెండు రోజులు మాత్రమే స్కూల్ కి వెళ్ళేవాడు. మిగతా సమయాన్ని సైబర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి కేటాయించాడు. ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం సాధించాక ఒక కంపెనీని కొలంబో టెక్నాలజీ పేరుతో స్థాపించాడు. (చదవండి: గ్యాస్ అయిపోయిందని టెన్షన్ వద్దు !.. అరగంటలో మరో సిలిండర్?) -
ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్ మస్క్ అంటే కథ వేరుంటది
టెస్లా సీఈఓ,స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ రోజురోజుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఇన్ని రోజులు యాపిల్ సంస్థ మీద, లేదంటే క్రిప్టో కరెన్సీలను ట్రోల్ చేసే ఎలన్ ఈ సారి రూటు మార్చాడు. మస్క్ అమెరికన్ ఆటోమేకర్ 'జనరల్ మోటార్స్' కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలపై ట్రోల్ చేశాడు. గతేడాది 4వ త్రైమాసికంలో జనరల్ మోటార్స్ కు చెందిన ఎలక్ట్రిక వెహికల్ అమ్మకాలపై 'టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్' అనే ట్విట్టర్ నిర్వాహకులు 'క్యూ4' 2021లో జనరల్ మోటార్స్ 26 ఎలక్ట్రిక్ వాహనాల్ని విక్రయించిందని ట్వీట్ చేస్తూ..ఆ ట్వీట్ను ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్కు ట్యాగ్ చేశారు. GM sold 26 electric vehicles in Q4’21. 🤯🤯🤯 @elonmusk — Tesla Silicon Valley Club (@teslaownersSV) January 4, 2022 అంతే వెంటనే ఆ ట్యాగ్పై ఎలన్ స్పందించారు. కేవలం 26 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించినందుకు ఎలన్ ప్రత్యర్థి ఆటోమేకర్ను ట్రోల్ చేస్తూ 'రూమ్ టు ఇంప్రూవ్' అని రిప్లయి ఇచ్చాడు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా,గతేడాది 4వ త్రైమాసికంలో 3,08,600 టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ను విక్రయించింది. ఇక జనరల్ మోటార్స్ 2021 చివరి త్రైమాసికంలో 5 బోల్ట్ ఈవీలను, ఈయూవీలను,ఒక హమ్మర్ ఈవీ పికప్ను విక్రయించినట్లు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
ఎలక్ట్రిక్ కార్లపై సబ్సీడీ, ఒక్క నెలలోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కార్లు!
మారుతున్న కాలానికి అనుగుణంగా మన అభిరుచులు మారాలి. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి పోతాం. అందుకే వాహనదారులు ప్రస్తుతం వినియోగిస్తున్నఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు మొగ్గుచూపుతున్నారు.దీనికి తోడు ఆయా ప్రభుత్వాలు సబ్సీడీని అందిస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీస్థాయిలో జరుగుతున్నాయి. చైనా పాసింజర్ కార్ అసోషియేషన్ (సీపీసీఏ) ప్రకారం.. చైనాకు చెందిన ప్లగ్-ఇన్ కార్ల అమ్మకాలు ఈ ఏడాదిలో 5.5 మిలియన్లు దాటుతాయని సీపీసీఏ ప్రతినిధులు చెబుతున్నాయి. ఇదే సంస్థకు చెందిన కమర్షియల్ వెహికల్స్, బస్సుల అమ్ముకాలు ఇదే స్థాయిలో జరిగితే 6 మిలియన్లు దాటడం ఖాయమని అంటున్నారు. గతేడాది 11నెలల కాలంలో 14.3 శాతంతో ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ కార్లు 2.7 మిలియన్ల అమ్ముడవ్వగా.. ఒక్క డిసెంబర్ నెలలో 3 మిలియన్లకు పైగా అమ్ముడవ్వడం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదిలో ప్లగ్-ఇన్ కారు అమ్మకాలు 6 మిలియన్లు దాటుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం రాయితీలు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం..2021 నుంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు 30 శాతం రాయితీలు ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణే టెస్లా కార్లేనని రిపోర్ట్లు పేర్కొన్నాయి. నాటి మార్కెట్ ధరలకు అనుగుణంగా టెస్లా కారు ధర రూ.1,85,334.61 ఉండగా 30శాతం రాయితీతో రూ.1,29,464.71 కే అందించినట్లు రిపోర్ట్లు ప్రధానంగా హైలెట్ చేస్తున్నాయి.రాయితీలు ఇస్తున్న సమయంలో మార్కెట్ గణనీయంగా దాదాపు రెండింతలు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సబ్సిడీ 2023 వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత రాయితీల్ని తీసివేస్తారని చైనా కార్ల అసోసియేషన్ తెలిపింది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? -
ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్ కొరత వేధిస్తున్నా..ఎలన్ మస్క్ మాత్రం టెస్లాకార్ల అమ్మకాల జోరును పెంచుతున్నారు. బ్లూమ్బెర్గ్ 4వ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. క్యూ4 (అక్టోబర్,నవంబర్,డిసెంబర్)లో వరల్డ్ వైడ్గా 308,600 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో టెస్లా వన్ ట్రిలియన్ మార్కెట్ వ్యాల్యూ కంపెనీల జాబితాలో చేరింది ఊహించిన దానికంటే ఎక్కువే 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. చెప్పిందే చేస్తున్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ మల్టీ ఇయర్ పిరియడ్ (రెండు లేదా మూడు సంవత్సరాలు)మొత్తం కాలంలో కార్ల డెలివరీ 50 శాతం వార్షిక పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ వైడ్గా సెమీకండక్టర్ తిరోగమనం మధ్య వరుసగా ఏడవ త్రైమాసికంలో టెస్లాకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఎలన్ మస్క్ ప్రతి త్రైమాసికంలో టెస్లా కార్ల డెలివరీలను పెంచుతూనే ఉన్నప్పటికీ, 2021లో సప్లయ్ చైన్ అంశాన్ని ఓ పీడకలగా అభివర్ణించారు. ఇక ఇతర ప్రయోజనాల కోసం చిప్లను ఉపయోగించేలా సాఫ్ట్వేర్లను తయారు చేయడంలో టెస్లా ఇంజినీర్లు ప్రయత్నాలు చేయడంతో ఇతర వాహన తయారీదారుల కంటే టెస్లా కంపెనీ మెరుగైన ఫలితాల్ని రాబడుతోంది. టెస్లాకు తిరుగులేదని టెస్లా కార్లలో ఆటో పైలెట్ ఫీచర్పై వివాదాలు, రియర్ వ్యూ కెమెరా, ట్రంక్లో సాంకేతిక లోపాలు, టెస్లా కారు రిపేర్కి లక్షల ఖర్చు అవుతుందని ఆ కారు ఆనవాళ్లు లేకుండా 30 కేజీల డైనమెట్తో బ్లాస్ట్ చేశారని వార్తలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పతాక స్థాయిలో టెస్లా వైఫల్యం గురించి కథనాల్ని ప్రచురించినా ఆ కార్ల హవా తగ్గడం లేదు సరికాదా రోజు రోజుకీ ఆ కార్ల అమ్మకాలు పెరగడంతో ఎలక్ట్రిక్ కార్లలో టెస్లాకు తిరుగులేదని ఎలన్ మస్క్ మరోసారి నిరూపించినట్లైంది. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా?
మనుషుల విజయాలు, వైఫల్యాలు, చర్యలే కాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ ఫలితాలే.. అనుకూలమైనా, ప్రతికూలమైనా నమోదవుతాయి. ఆ నమోదే రాబోయే తరాలకు చరిత్రగా కనపడుతుంది.. వినపడుతుంది. అలా ఈ ఏడు అంటే 2021ని కూడా చాలామంది వ్యక్తులు తమ విజయాలతో, విషయాలతో ప్రభావితం చేసి ఆ కాలాన్ని చరిత్రగా మలచి.. ఆ పుటల్లో అధ్యాయాలుగా కనిపించబోతున్నారు. వారిలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఒకరు. ఎవరినైనా ఎలన్ మస్క్ గురించి అడిగితే ఏమని చెబుతారు ప్రపంచాన్ని మార్చే ఐరన్మ్యాన్, 8 కంపెనీలకు అధినేత, ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. వేలకోట్లకు అధిపతి ఇలా ఆయన సాధించిన విజయాలు గురించి మాట్లాడతారు. ఇదంతా నాణేనికి ఒకవైపే .. అదే రెండోవైపు చూస్తే అన్నీ విషాదాలే. ఇప్పుడు మనం ఎలన్ మస్క్ గురించి ప్రపంచానికి తెలియని రహస్యాల గురించి తెలుసుకుందాం. ►టెక్ యుగంలో ఈ ఏడాది ప్రఖ్యాత ‘టైమ్స్’ మేగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021’గా ‘స్పేస్ ఎక్స్’ అధినేత ఎలన్ మస్క్ నిలిచారు. మస్క్ తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత కెనడాలో, అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. టెస్లా సంస్థ అధిపతిగా ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. ► ఈ ఏడాది ఎలన్ ట్యాక్స్ పే చేయబోతున్నట్టు ట్విట్టర్లో ప్రకటించారు. అయితే ఆయన ట్యాక్స్గా చెల్లించబోయే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 11 బిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో ఇది ఏకంగా రూ. 83,697 కోట్ల రూపాయలుగా ఉంది. ఇంత పన్ను చెల్లిస్తున్నాడంటే ఎలన్మస్క్ దగ్గర ఎంత సంపద ఉందంటే రమారమీ 335 బిలియన్ డాలర్లు. ఇటీవల ప్రపంచ కుబేరులు జెఫ్ బేజోస్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు ఎలన్మస్క్. స్పేస్ ఎక్స్ ప్రయోగాలు విఫలం కావడం, టెస్లా బుల్లెట్ ఫ్రూఫ్ కారు పగిలిపోవడం, ఇలా అనేక ప్రతికూల పరిస్థితులను మస్క్ ఎదుర్కొన్నాడు. వీటి కారణంగా మస్క్ దివాళా తీసే పరిస్థితికి చేరాడు. కానీ పట్టుదలతో పోరాడి గెలిచాడు. నిలిచాడు. ►ఎలన్ మస్క్ చాలా భయస్తుడు. పబ్లిక్ లో స్పష్టంగా మాట్లాడలేరు. అందుకు కారణం ఎలన్ మస్క్ కు ఆటిజం సమస్య ఉంది. సాటర్డే నైట్ అనే షోలో తనకు అస్పెర్జర్ సిండ్రోమ్ ఉందని చెప్పాడు. "ఆ సమస్యవల్ల ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తా. ఒక్కోసారి నేను సోషల్ మీడియాలో వింత పోస్ట్లు పెట్టే విషయం గురించి నాకు తెలుసు. కానీ, నా మెదడు అలాగే పనిచేస్తుంది అన్నారు. నా వల్ల ఎవరైనా నొచ్చకుని ఉంటే, వారికి నేను ఎలక్ట్రిక్ కార్లను కొత్తగా కనిపెట్టానని, రాకెట్ ద్వారా మనిషిని అంగారక గ్రహంపైకి పంపించబోతున్నానని మళ్లీ చెప్పాలనుకుంటున్నా. నేను సాధారణ వ్యక్తినని మీకు అనిపిస్తోందా" అని మస్క్ ప్రశ్నించారు. ►ఎలన్ మస్క్ కు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. అతని తమ్ముడు కింబాల్ మస్క్ అమెరికాలో కిచెన్ రెస్టారెంట్ గ్రూప్ కు యజమాని, చెల్లెలు తోస్కా చిత్రనిర్మాత. ►ఎలన్ మాస్క్ వాటర్క్లూఫ్ హౌస్ ప్రిపరేటరీ స్కూల్, బ్రయాన్స్టన్ హై స్కూల్, ప్రిటోరియా బాయ్స్ హై స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. క్లాస్ లో అందరికంటే ఎలన్ మస్క్ చాలా పొట్టిగా ఉండేవాడు. ఆటిజం, హైట్ కారణంగా స్కూల్లో తన తోటి స్నేహితులు వేధించేవారు. ఓసారి స్నేహితులు కొట్టడం వల్ల ఆస్పత్రిపాలయ్యాడు. ఫలితంగా 15 సంవత్సరాల వయసులో కరాటే, జూడో, కుస్తీ నేర్చుకున్నాడు. ►టెస్లా పేటెంట్ రైట్స్ దక్కించుకునేందకు మస్క్ చాలానే కష్టపడ్డాడు. పేటెంట్ రైట్స్ హక్కులను పొందలేకపోతే, మస్క్.. టెస్లా కంపెనీకి బ్రిటిష్ సైంటిస్ట్ మైఖేల్ ఫెరడే పేరునే టెస్లాకు నామకరణం చేశాడు. ►మస్క్ జిప్ 2, పేపాల్, స్పేస్ఎక్స్, టెస్లా, హైపర్లూప్, ఓపెన్ఐఐ, న్యూరాలింక్ ,ది బోరింగ్ కంపెనీ ఇలా మొత్తం ఎనిమిది సంస్థల్ని స్థాపించారు. ►అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంస్థలో మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్ ఇనిషియేటివ్, స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరమ్లో పనిచేసేందుకు మస్క్ అంగీకరించారు. కాని వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం నుండి యూఎస్ ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ మస్క్ ట్రంప్ తో పనిచేసే అవకాశాన్ని తిరస్కరించారు. ►మస్క్ కాలేజీ చదివే రోజుల్లో డబ్బుల కోసం చాలా ఇబ్బందిపడ్డాడు. తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు రోజూవారీ ఖర్చుల కోసం స్థానికంగా ఉండే ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈస్టర్ ఎగ్స్ ను అమ్మేవారు. అలా వచ్చిన కొద్ది మొత్తాన్ని బన్, ఆరెంజ్ ఫ్రూట్స్ తిని కడుపు నింపుకునే వాడు. మిగిలిన మొత్తాన్ని కాలేజ్ ఫీజు కట్టుకునేవాడు. ►మస్క్ 2000 లో సైన్స్ ఫిక్షన్ రచయిత జస్టిన్ విల్సన్ ను వివాహం చేసుకున్నాడు. 2002లో వారి మొదటి కుమారుడు నెవాడా ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ తో 10 వారాల వయస్సులో మరణించాడు. ►మస్క్కు ఏడుగురు పిల్లలు ఉన్నారు, వీరంతా అబ్బాయిలే. వారిపేర్లు ఎక్స్ ఏఈ ఏ-12 మస్క్, నెవాడా అలెగ్జాండర్ మస్క్, గ్రిఫిన్ మస్క్, జేవియర్ మస్క్, డామియన్ మస్క్, సాక్సన్ మస్క్, కై మస్క్ వీళ్లంతా కృత్తిమంగా పుట్టారు. ► లాస్ ఏంజిల్స్ మంచి టూరిస్ట్ స్పాట్. హాలీవుడ్ సినిమా నిర్మాణాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. సినిమా, టెలివిజన్ రంగానికి కేంద్రబిందువు. ఇక్కడే హాలీవుడ్ పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలైన పారా మౌంట్ పిక్చర్స్, యూనివర్సిల్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు ఉన్నాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య తలెల్తేది. 2016 డిసెంబర్ 17న ఎలన్ మస్క్ కారులో వెళుతుండగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అంతే ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు భూగర్భంలో పెద్ద సొరంగ మార్గాల్ని ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ది బోరింగ్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ► ఎలన్ మస్క్ కు తన తండ్రి ఎర్రోల్ మస్క్ అంటే అస్సలు నచ్చదు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీరక సుఖ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మస్క్ తల్లి మేయల్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత మేయల్కు విడాకులిచ్చి అప్పటికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వయస్సు వ్యత్యాసం 40ఏళ్లు. ఎర్రోల్-జానా దంపతులకు 2018లో బాబుకు జన్మనిచ్చారు. ► ఎలన్ మస్క్ తల్లి మేయే మస్క్. మోడల్, ప్రముఖ డైటీషియన్, ఆథర్ ఇలా అన్నీ రంగాల్లో రాణించారు. చదవండి: రూ.83,697 కోట్ల పన్ను కట్టబోతున్న వ్యక్తి ఎవరో తెలుసా ? -
ఆటోపైలట్ మోడ్లో ఉండగా... టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!
న్యూఢిల్లీ: ఒక్కొసారి చాలా అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. ఇంతవరకు బాత్రుంలో మహిళ ప్రసవించడం (లేదా) విమానంలో ఒక మహిళకు నొప్పులు తీవ్రమైతే వెంటనే సమీపంలోని విమానాశ్రయంలో ఆపడం తదితర ఘటనలు గురించి విన్నాం. అయితే అచ్చం అలానే యూఎస్ మహిళ కారులో ప్రయాణిస్తున్నప్పుడూ నొప్పులు మొదలవుతాయి. అయితే అత్యధునిక టెక్నాలజీ కలిగిన టెస్లా కారు సాయంతో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని యిరాన్ షెర్రీ (33) నిండు గర్భిణీ. ఒక రోజు ఆమె తన భర్త కీటింగ్ షెర్రీ (34) తో కలిసి తమ మూడేళ్లు కొడుకును ఫ్రీ స్కూలుకి తీసుకువెళ్లే నిమిత్తం టెస్లా కారులో పయనమయ్యారు. అయితే యిరాన్ షెర్రీ (33)కి అనుకోకుండా నొప్పులు రాగా, దీంతో ఆ దంపతులు వెంటనే సమీపంలో ఆసుపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రికి చేరుకోవడం కష్టమైంది. దీంతో ఆమె భర్త కీటింగ్ షెర్రీ కారుని ఆటో పైలెట్ మోడ్లో పెట్టి(అంటే కారుదానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లుతుంది) ఆస్పత్రికి తీసుకువెళ్లమని ఆర్డర్ చేస్తాడు. అంతే కారు జీపీఎస్ నేవిగేషన సిస్టమ్ ఆసుపత్రికి వెళ్లడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుందని చెబుతుంది. దీంతో అతను ఒక చేయిని స్టీరింగ్ పై వేసి మరో చేత్తో భార్యను ఓదారుస్తాడు. మరోవైపు ట్రాఫిక్ కారణంగా కారు వేగంగా వెళ్లే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె కారు ఫ్రంట్ సీట్లో బిడ్డకు జన్మనిచ్చింది. అలా టెస్లా కారు ఆటో పైలట్ మోడ్లో ఉండగా పుట్టిన తొలి పాపగా ఆ బిడ్డ రికార్డ్ సృష్టించింది. దీన్ని అధికారికంగా గుర్తించారు. అయితే కారు ఆస్పత్రికి చేరేటప్పటికే బిడ్డ పుట్టేసింది. అంతేకాదు కారులోనే బిడ్డ నుంచి తల్లి పేగును కట్ చేశారు డాక్టర్లు. ఈ మేరకు తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆ దంపతులు కూడా ఆ పాపకు టెస్లా అని పేరు పెట్లాలని భావించారు కాని నిర్ణయం మార్చుకొని మాయెవ్ లిలీ అని పెట్టారు. ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగానే తన భార్యకు సురక్షితంగా ప్రసవం అయ్యిందని ఆటోపైలట్ మోడ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి ఇచ్చినందుకు టెస్లా కార్ల ఇంజినీర్లకు సదరు మహిళ భర్త కీటింగ్ షెర్రీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి) -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
30 కేజీల డైనమెట్తో బ్లాస్ట్.. కారు ఆనవాలు లేకుండా పాయే!
Tesla Car Exploding Broken Down Video: టెస్లా.. ప్రపంచంలోనే ఆటోమొబైల్ దిగ్గజంగా పేరున్న అమెరికన్ కంపెనీ. ముఖ్యంగా ఈవీ సెక్టార్ ఆవిష్కరణలతో, కొత్త సాంకేతికతను ప్రొత్సహిస్తూ ఆటో సెక్టార్లో సంచలనాలకు నెలవైంది. అలాంటి కంపెనీ ఆసియాలో అతిపెద్ద మార్కెట్ చైనాలో అడుగుపెట్టగా.. ఇప్పుడు భారత్పై కన్నేసింది. అయితే ఈ కంపెనీ కార్లు రకరకాల సమస్యలతో వార్తల్లోకి కూడా ఎక్కుతుంటాయి. ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా వాహనాలకు ఎంత మంచి ఫీడ్ బ్యాక్ ఉంటుందో.. ఒక్కోసారి అంతే వరెస్ట్ ఫీడ్బ్యాక్ కూడా వాహనదారుల నుంచి వస్తుంటుంది. తాజాగా ఓ టెస్లా వాహనదారుడు ఒకరు ఏకంగా టెస్లా కారును పేల్చేశాడు. అదీ 30 కేజీల డైనమైట్ సాయంతో. అందుకు కారణం దానిని రిపేర్ చేయించుకునే స్తోమత అతనికి లేకపోవడమే!. ఫిన్లాండ్ దక్షిణ ప్రాంతానికి చెందిన కైమెన్లాక్సో రీజియన్లో జాలా అనే చిన్న ఊరు ఉంది. మంచుతో కప్పబడిన ఈ ప్రాంతంలో తాజా ఘటన చోటు చేసుకుంది. టెస్లా మోడల్ ఎస్(2013)కు ఓనర్ టువోమాస్ కటాయినెన్. 1500 కి.మీ. తిరిగిన తర్వాత కారు కోడ్లో ఎర్రర్లు రావడం మొదలైంది. దీంతో సర్వీస్ స్టేషన్కు తరలించగా.. రిపేర్ తమ వల్ల కాదని, మొత్తం బ్యాటరీ సెల్ను మార్చేయాలని సూచించారు. అందుకు 20 వేల యూరోలు(మన కరెన్సీలో 17 లక్షలపైనే) ఖర్చు అవుతుందని చెప్పారట. దీంతో కారును బాగు చేయంచడం కంటే.. నాశనం చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు టువోమాస్. ఊరికి దూరంగా మంచుకోండల్లోకి తీసుకెళ్లి.. కారును పేల్చేసే ప్లాన్ చేశాడు. ఇందుకు స్థానిక ప్రభుత్వ సిబ్బందితో పాటు యూట్యూబ్ ఛానెల్ పొమ్మిజట్కట్(Pommijatkat) సాయం చేసింది. డైనమైట్లను అమరుస్తున్న టైంలో ఇంతలో పైన ఓ హెలికాఫ్టర్ వచ్చింది. దాని నుంచి ఓ దిష్టిబొమ్మను కిందకు దించారు. అది టెస్లా సీఈవో ఎలన్ మస్క్ దిష్టిబొమ్మ. ఆ బొమ్మను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి, సిబ్బంది అంతా దూరంగా పరిగెత్తి.. బంకర్లో దాక్కున్నారు. కాసేపటికే ఆ కారు భారీ విస్పోటనంతో పేలి ముక్కలైపోగా.. ఆనవాలు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రకరకాల యాంగిల్స్లో, ఎఫెక్ట్స్తో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ బ్లాస్ట్తో అక్కడున్నవాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు. బహుశా ప్రపంచంలో టెస్లా కారును ఇలా ముక్కలు చేసిన తొలి ఘనత టువోమాస్కే చెందుతుందేమో!. దీనికి మస్క్ స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి. హెచ్చరికేనా?.. ఈ మధ్యకాలంలో టెస్లా కారులు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఘటనలో ఏకంగా ఎలన్ మస్క్ దిష్టిబొమ్మను పెట్టిన పరిణామం.. వాహన దారుడిలో ఎంత మంట పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియోపై ఎలన్ మస్క్కు టెక్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈవీ వెహికిల్స్ మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ఇబ్బందులు.. కొత్త వాహనదారులను వెనకడుగు వేసేలా చేస్తుందని, ఆ సమస్యల పరిష్కారానికి తగు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. చదవండి: ఎలన్మస్క్కు ఊహించని దెబ్బ -
కార్ డ్రైవ్ చేస్తూ వీడియో గేమ్ ! ఎలన్ మస్క్ ఏమైంది నీకు?
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ప్రపంచ నబంర్ వన్గా ఉన్న టెస్లా కంపెనీ సరికొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ ప్రియులకు ఈ ఫీచర్ పట్ల ఇంట్రస్ట్ చూపిస్తున్నా మిగిలిన అన్ని వర్గాల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. ఆటో పైలెట్తో మొదలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్కి చెందిన టెస్లా కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తుంది. అయితే ఈ కంపెనీ ఓనర్ ఎలన్మస్క్కి లేటెస్ట్ టెక్నాలజీ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే డ్రైవర్ లెస్ కారుని తెస్తానంటూ ఎప్పటి నుంచో ప్రకటనలు ఇస్తున్నాడు. ఆటోపైలట్ ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతున్నా ఇంత వరకు ఈ లోప రహితమైన ‘ఆటో పైలెట్’ అందుబాటులోకి రాలేదు. అప్డేట్తో అందుబాటులోకి ఓ వైపు ఆటోపైలెట్ టెక్నాలజీ పరిశోధనల దశలో ఉండగానే వీడియో గేమ్ ఫీచర్ని కారులో అందుబాటులోకి తెచ్చింది టెస్లా. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టెస్లా కార్లు అన్నింటికీ ఓవర్ ది ఎయిర్ ద్వారా ఈ వీడియో గేమ్ అప్డేట్ అందించారు. దీని ప్రకారం కారు డ్యాష్బోర్డు సెంట్రల్లో ఉన్న టచ్ స్క్రీన్ మీద వీడియో గేమ్స్ ఆడుకునే వెసులుబాటు వచ్చింది. డ్రైవర్తో పాటు కారులో ప్రయాణించే వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. హెచ్చరిక డ్రైవింగ్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడే ఫీచర్ అందుబాటులోకి తేవడం పట్ల నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టెక్నాలజీకి వ్యతిరేకం కానప్పటికీ... డ్రైవర్ దృష్టి మళ్లించే వ్యవహరాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ సుతి మెత్తని హెచ్చరికలు జారీ చేసింది. ఆటోపైలెట్ ఫీచర్ వల్ల టెస్లా కార్లు గతంలో చేసిన ప్రమాదాలపై ఇప్పటికే ఎన్హెచ్టీఎస్ఏ విచారణ చేపడుతోంది. అలా అయితే ఓకే వీడియో గేమ్ ఫీచర్ పట్ల వస్తున్న మిశ్రమ స్పందన పట్ల టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కొందరు యూజర్లు ఈ ఫీచర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు గతంలోలాగా కారు ఐడిల్లో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు కానీ నడుస్తున్నప్పుడు ఈ ఫీచర్ వల్ల ఇబ్బందులు వస్తాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భారత్ దెబ్బకు..దారికొచ్చిన ఎలన్ మస్క్..! -
రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. 70 ఏళ్ల వయస్సు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, ఇద్దరూ 70 ఏళ్లు పైబడిన వారు. కొద్ది రోజుల క్రితం ఎలన్ సెటైర్లు వేసిన సెనేటర్ సాండర్స్ వయస్సు 80 సంవత్సరాలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎలన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Let’s set an age limit after which you can’t run for political office, perhaps a number just below 70 … — Elon Musk (@elonmusk) December 2, 2021 ఎలన్ మస్క్ అమెరికా నేతల్ని పరోక్షంగా కర్ర కాల్చి వాత పెడుతున్నారు. నవంబర్ 13న వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్బర్గ్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అదే సమయంలో అమెరికా సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్ చేయాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్పై ఎలన్ తనదైన స్టైల్లో సాండర్స్ పై సెటైర్లు వేశారు. ‘‘ సాండర్స్ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను..ఇప్పుడేమంటావ్.. నేను మరింత స్టాక్ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్ మస్క్ విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఎలన్ చేసిన 'ఎలిమినేట్' వ్యాఖ్యలకు కారణం సెనెటర్లు బిలియనీన్లు పన్నులు కట్టాలని సెనెటర్లు చేసిన డిమాండ్లేనని తెలుస్తోంది. బిలియనీన్లు పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఎలన్..టెస్లాలోని తన శాతం షేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో లక్షకోట్లుకు పైగా నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని తట్టుకోలేకనే ఈ బిలియనీర్ 70ఏళ్లకు పై బడిన వారిని రాజకీయాల్లో పదవులకు పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తించాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం అమెరికాలో చర్చాంశనీయం కాగా..ఆ వ్యాఖ్యల ప్రభావం ఎలన్పై భారీగా ఉండొచ్చనేది విశ్లేషకులు చెబుతున్నమాట. చదవండి: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1 -
లైంగిక వేధింపులు, ఎలన్ మస్క్కు మరో ఎదురుదెబ్బ
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరో ఎదురుదెబ్బ తగిలింది. టెస్లా కంపెనీలో లైంగిక వేధింపులు ఎక్కువైతున్నాయంటూ ఆ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దీంతో వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎలన్కు మరో ఎదురు దెబ్బతగిలినట్లైందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లోని టెస్లా ఫ్యాక్టరీలో టెస్లా మోడల్ 3లో పనిచేసే మహిళా ప్రొడక్షన్ అసోసియేట్ కోర్ట్లో దావా వేశారు. వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులకు గురైనట్లు దావాలో పేర్కొన్నారు. దాదాపు 3ఏళ్ల పాటు లైంగిక వేధింపులకు గురైనట్లు, ఆ వేధింపులు ఇంకా ఎక్కువ కావడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆవేధన వ్యక్తం చేశారు. నా శరీరం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు. తరుచూ తోటి ఉద్యోగులు దాడికి పాల్పడుతున్నారని ఆరోపించింది. 'ది వెర్జ్' తో ఆమె ఇలా చెప్పింది.' దాదాపు 3ఏళ్ల నుంచి ప్రతిరోజూ నా మహిళా సహోద్యోగులు బెదిరించే వారు. అసభ్య పదజాలంతో దూషించే వారు. ఆఫీస్లో పనిచేయాలనే ఉద్దేశంతో అనేక దాడుల్ని ఎదుర్కొన్నాను. నిరంతరం లైంగిక వేధింపులకు గురికావాల్సిన అవసరం లేదు. నా కుటుంబం కోసమే అన్నీ భరించాల్సి వచ్చింది. ఇకపై భరించే ఓపిక నాలో లేదు. నన్ను, నా కుంటుంబాన్ని ఆదుకోవాలని వ్యాఖ్యానించింది. చదవండి: ఎలన్మస్క్ ఎందుకిలా జరుగుతోంది? -
ఎలన్మస్క్ ఎందుకిలా జరుగుతోంది? టెస్లా కార్లలో సాంకేతిక సమస్యలు
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచ రారాజుగా ఉన్న టెస్లాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా టెస్లా కారు ఓనర్లు చిక్కులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కారు యజమానులు టెస్లా యజమాని ఎలన్మస్క్ని డిమాండ్ చేస్తున్నారు. పని చేయని యాప్ టెస్లా కంపెనీ నుంచి మార్కెట్లో మోడల్ 3 వై, మోడల్ ఎస్, ఎస్ ప్లెయిడ్ కార్లు మార్కెట్లో విపరీతంగా అమ్ముడయ్యాయి. యూరప్, అమెరికా మార్కెట్లో టెస్లా కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ప్రయత్నంలో భాగంగా టెస్లా కార్లకు మొబైల్యాప్ రూపంలో డిజిటల్ కీస్ని అమర్చారు. అంటే టెస్లా యాప్ ద్వారా కారును డోర్స్ ఓపెన్ చేయడం, కారును స్టార్ చేయడం తదితర కంట్రోల్స్ అన్నీ ఈ మొబైల్ యాప్ ద్వారానే కంట్రోల్ చేయోచ్చు. ఇబ్బందులు గత కొంత కాలంగా ఈ యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. తరచుగా యాప్ మోరాయిస్తోంది. దీంతో యూజర్లు టెస్లా కారును వినియోగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కారు పక్కనే ఉండి గంటల తరబడి డోర్ ఓపెన్ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ట్రాఫిక్ వల్లే మొదట ఈ సమస్య కెనడాలో ఎక్కువగా కనిపించగా ఆ తర్వాత అమెరికాలోనూ ఈ సమస్య వెలుగు చూసింది. ఇటీవల మొబైల్యాప్కి అప్డేట్ని టెస్లా రిలీజ్ చేసింది. అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నమైనట్టు యూజర్లు అంటున్నారు. మరోవైపు నెట్వర్క్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ సమస్య వచ్చిందని త్వరలో పరిష్కరిస్తామని టెస్లా తరఫున ఎలన్మస్క్ బదులిచ్చారు. చదవండి:ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్! -
ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకోవడంతో పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. అయితే, ఒక కంపెనీ తీసుకొచ్చిన మొదటి వాహనం అప్పుడే అవార్డు గెలుచుకుంది. కాలిఫోర్నియాలోని నెవార్క్ కేంద్రంగా పనిచేస్తున్న లూసిడ్ మోటార్స్ తన మొదటి లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును గత నెలలో డెలివరీ చేసింది. "మోటార్ ట్రెండ్" నవంబర్ 15న లూసిడ్ మోటార్స్ సంస్థకు ఎయిర్ సెడాన్ "కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును ప్రదానం చేసింది. ఈ కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం అప్పుడే అవార్డు గెలుచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియాలోని నెవార్క్ కేంద్రంగా పనిచేస్తున్న లూసిడ్ మోటార్స్ ఇటీవల నేర్సా గ్రాండే, అరిజోనా, అసెంబ్లీ ప్లాంట్ నుంచి కార్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. లూసిడ్ మోటార్స్ నాస్ డాక్ లో ట్రేడింగ్ ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఈ కంపెనీ ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత విలువైన ఆటోమేకర్లలో ఒకటిగా $72 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. సీఈఓ పీటర్ రాలిన్సన్ కొన్ని సంవత్సరాలు టెస్లా కంపెనీలో పనిచేశారు. (చదవండి: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్ శేఖర్ శర్మ!) 840 కిమీ రేంజ్ ఆ కంపెనీలో అతను మోడల్ ఎస్ కారు రూపకల్పనలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. అతను రూపకల్పన చేసిన టెస్లా మోడల్ ఎస్ కారు 2012లో మోటార్ ట్రెండ్ "కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది. లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ వాహనాలు "కొత్త బెంచ్ మార్క్"ను క్రియేట్ చేశాయి. లూసిడ్ మోటార్స్ ఎయిర్ సెడాన్ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 520 మైళ్లు(840 కిమీ) వరకు ప్రయాణిస్తుంది. మోటార్ ట్రెండ్ సమీక్షకులు దాని మొత్తం పనితీరు చూసి ఆశ్చర్యపోయారు. ఈ కారు 1100 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా కారులో అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ను ఏర్పాటు చేయడంతో కేవలం 20 నిమిషాల ఛార్జింగ్ చేస్తే కారు 482 కిలో మీటర్లు ప్రయాణిస్తోందని లూసిడ్ వెల్లడించింది. ఈ కారు 2.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ 113కేడబ్ల్యూహెచ్ బ్యాటరీను అమర్చారు. ఈ కారులో డ్యూయల్ ఆక్టివ్ కోర్ మోటార్ను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా కారులో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకుగాను సెమి ఆక్టివ్ సప్సెన్షన్ను వాడారు. 2021 పోర్స్చే టేకాన్, 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్, 2022 టయోటా జీఆర్86, 2022 హోండా సీవిక్, 2021 హ్యుందాయ్ ఎలాంట్రా కార్లను పనితీరు, రేంజ్ పరంగా ఇతర కంపెనీలను లూసిడ్ ఎయిర్ ఓడించింది. దీని ధర సుమారు $77,400గా ఉంది. (చదవండి: అదిరిపోయిన ఎలక్ట్రిక్ కారు.. 700 కి.మీ రేంజ్, ధర కూడా తక్కువే!) -
ఎలన్ మస్క్ చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి, ఆయన ప్రతిభాపాటవాలు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు అంతరిక్షంపై మానవుని మనగడ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు ఎలక్ట్రిక్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చాపకింద నీరులా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్గారాలను తగ్గించేందుకే మనం ఇప్పటి వరకు రోడ్లపై తిరిగే ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను, బస్సులను మాత్రమే చూసుంటాం. కానీ ఇకపై ఎలక్ట్రిక్ సెమీ ట్రక్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ సందడి చేయనున్నాయి. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రముఖ బెవరేజెస్ కంపెనీ పెప్సికో'కి తొలిసారి టెస్లా సెమీ ట్రక్లను తయారు చేశారు. త్వరలోనే సెమీ ట్రక్లను ఈవీ మార్కెట్కు పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెప్సికో సీఈఓ రామన్ లగుర్టా సీఎన్బీసీతో మాట్లాడుతూ..పెప్సికో సంస్థ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయత్నాల్లో భాగంగా ఎలక్ట్రిక్ 2017లోనే సెమీ ట్రక్లను తయారు చేసే ప్రాజెక్ట్ను టెస్లాకు అప్పగించినట్లు వెల్లడించారు. 2017లోనే 100 సెమీ ట్రక్లకు ఆర్డర్ ఎలన్ మస్క్ సంబంధించి బయటి ప్రపంచానికి కేవలం ఎలక్ట్రిక్ కార్ల గురించి మాత్రమే తెలుసు. కానీ తొలిసారి సెమీ ఎలక్ట్రిక్ ట్రక్లను తయారు చేయడంలో 2017నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017లోనే పెప్సికో కంపెనీ ఎలన్ మస్క్కు 100 సెమీ ఎలక్ట్రిక్ ట్రక్లను తయారు చేసే బాధ్యత అప్పగించినట్లు రామన్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు టెస్లా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్లను తయారు చేసిందని, వాటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి తమకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఎలన్ మాట తప్పాడు ఎలన్ మస్క్ ఈ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్లను 2020 నాటికే పెప్సికోకి అందిస్తామని మాటిచ్చారు. కానీ బ్యాటరీతో పాటు, సప్లయి చైన్ సంబంధిత రంగాల్లో మార్కెట్ డిమాండ్ కారణంగా సెమీ ట్రక్లను అందించే విషయంలో ఎలన్ మాట తప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ట్రక్లను విడుదల తేదీలను వాయిదా వేసిన మస్క్ ఈ ఏడాది జులైలో మరోసారి ప్రకటించారు. 2022 సెమీ ట్రక్లను లాంఛ్ చేస్తామని ప్రకటించారు. పెప్సీకో మాత్రం ఈ ఏడాది చివరి నాటికి కనీసం 15 ఎలక్ట్రిక్ ట్రక్లను టెస్లా నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తుండగా.. టెస్లా ట్రక్ల కొనుగోలు కోసం మరికొన్ని దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి. క్యూ కడుతున్న కంపెనీలు ఎలన్ మస్క్ తయారు చేస్తున్న సెమీ ఎలక్ట్రిక్ 150,000 డాలర్ల నుంచి 180,000 మధ్యలో ఉంది. అయితే వీటిని కొనుగోలు కోసం వాల్మార్ట్, ఫెడ్ఎక్స్, అన్హ్యూసర్ బుష్ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
ఎలన్ మస్క్ సంచలనం: వెహికల్స్ ఎన్ని ఉన్నా, టెస్లా కార్ల తర్వాతే ఏదైనా
వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్).. ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న హాట్ టాపిక్. అడ్డగోలుగా పర్యావరణానికి తూట్లు పొడిచి మనం నిర్మించుకున్న నగరాలు, పరిశ్రమలు, వాహనాలు, లగ్జరీలు ఇప్పుడు ధరిత్రికే కాదు... మానవాళి మనుగడకే ముప్పుగా మారాయి. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) దెబ్బకు ఈ శతాబ్దం చివరికల్లా ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలను సముద్రాలు ముంచెత్తనున్నాయని పర్యావరణవేత్తలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. మరోపక్క పెట్రోలు, డీజిల్ రేట్లు ‘సెంచరీ’ కొట్టి జేబు గుల్ల చేస్తున్నాయి. కట్ చేస్తే... ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఆగమేఘాలపై ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్’ రాగం అందుకున్నాయి. పెట్రోలు, డీజిల్ ఇతరత్రా శిలాజ ఇంధనాల కాలుష్యానికి చెక్ చెప్పేందుకు ప్రభుత్వాలు, ప్రపంచ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల బాట పట్టాయి. చకచకా తమ ప్లాంట్లను ‘ఎలక్ట్రిక్’ వేగంతో కొత్త టెక్నాలజీ వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు... ప్రజల్లో వీటికున్న ఆదరణ... కంపెనీలు, ప్రభుత్వాల ప్రణాళికలు వంటి సంగతులను తెలుసుకోవడానికి ఓ లాంగ్ డ్రైవ్ చేద్దాం!! కార్లు, స్కూటర్లు, బైక్లు, విమానాలు, ట్రక్కులు, నౌకలు ఇలా ఒకటేంటి ప్రపంచ వాహన, రవాణా రంగం మొత్తం ‘ఎలక్ట్రిక్’ మయం అయ్యే రోజు మరెంతో దూరంలో లేదా? ఈ రంగంలో పెను విప్లవం చోటుచేసుకోబోతోందా? అంటే కచ్చితంగా అవుననే అంటున్నారు విశ్లేషకులు. క్లైమేట్ చేంజ్ భయాలకు తోడు పెట్రోలు, డీజిల్ ధరలు అంతకంతకూ ఎగబాకుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇటీవలి కాలంలో టాప్ గేర్లో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోళ్లను ప్రోత్సహించే విధంగా తీసుకొస్తున్న పాలసీలు, చట్టాలు, సబ్సిడీలు కూడా ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే 2030 నాటికి మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఈవీల వాటా 40 శాతానికి చేరుకోవచ్చనేది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ అంచనా. 2016లో ప్రపంచవ్యప్తంగా 13 లక్షల ఈవీలు అమ్ముడవగా, 2020లో ఈ సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. మొత్తం ప్రపంచ లైట్–డ్యూటీ వెహికల్ మార్కెట్ (కార్లు, వ్యాన్లు ఇతరత్రా తక్కువ లోడ్ గల వాహనాలు)లో ఇది దాదాపు 5 శాతానికి సమానం. కాగా, 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య ఒక కోటి మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 6 లక్షలు, ట్రక్కులు 31,000 మార్కును అందుకున్నాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచ కార్ల అమ్మకాలు 16 శాతం క్షీణించినప్పటికీ ఈవీ కార్ల సేల్స్ 41% ఎగబాకడం విశేషం. ప్రపంచ ఈవీ మార్కెట్లో ఇప్పటికీ చైనాదే అగ్రస్థానం. టార్గెట్ 2030... అగ్ర దేశాలతో పాటు భారత్ వంటి పలు వర్ధమాన దేశాలు ఈవీలపై గట్టిగా దృష్టి సారించడంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈవీల ఉత్పత్తి, అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నాయి. 2030 నాటికి దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలకు పూర్తిగా అడ్డుకట్టవేసి (నెట్–జీరో), మొత్తం ఈవీల విక్రయాలే ఉండాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా బ్రిటన్ 2030, ఫ్రాన్స్ 2040 ఏడాదిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే 10–30 ఏళ్లలో నెట్–జీరో లక్ష్యాలను ప్రకటించిన దేశాలు 2020 చివరి నాటికి 20కి పైగానే ఉన్నాయి. మరో 130 దేశాలు సైతం కొన్ని దశాబ్దాల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించాయి. కంపెనీల మెగా ప్లాన్స్.... ఈవీల డిమాండ్కు అనుగుణంగా, ప్రపంచంలోని టాప్–20 వాహన తయారీ సంస్థలు ఈవీ వాహన మోడళ్ల సంఖ్యతో పాటు ఉత్పత్తిని కూడా భారీగా పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇక హెవీ–డ్యూటీ ఈవీల (బస్సులు, ట్రక్కులు ఇతరత్రా) తయారీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ఆల్–ఎలక్ట్రిక్ సంకేతాలిచ్చాయి. 2020లో ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల వ్యయం 120 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ప్రభుత్వాలు కూడా ఈవీలకు మద్దతుగా 14 బిలియన్ డాలర్లను ఈవీ కొనుగోళ్లపై వెచ్చించాయి. కాగా, ఐఈఏ అంచనాల ప్రకారం 2030 నాటికి నార్వే, ఫిన్లాండ్ మొత్తం వాహన అమ్మకాల్లో 75 శాతం పైగా ఈవీలే ఉండనున్నాయి. ఇక ఆస్ట్రేలియా, అమెరికా, చైనాల్లో కూడా 2030 నాటికి అమ్మకాల్లో ఈవీల వాటా 50–60 శాతానికి చేరే అవకాశం ఉంది. భారత్ విషయానికొస్తే, ఇది 20–30 శాతానికి చేరుకోవచ్చని అంచనా. భారత్లో ఈవీల జర్నీ ఇలా... ►1993 – దేశంలో మొదటి రెండు సీట్ల ఎలక్ట్రిక్ కారు ‘లవ్బర్డ్’ ఆవిష్కరణ. ►1996 – తొలి ఎలక్ట్రిక్ త్రీవీలర్ (ఆటో) ‘విక్రమ్ సాఫా’ను స్కూటర్స్ ఇండియా ప్రవేశపెట్టింది. ►1999 – మహీంద్రా అండ్ మహీంద్రా ‘బిజిలీ’ పేరుతో ఎలక్ట్రిక్ త్రీవీలర్ను తీసుకొచ్చింది. ►2000 – బీహెచ్ఈఎల్ 18 సీట్ల ఎలక్ట్రిక్ బస్సును రూపొందించింది. ►2001 – బెంగళూరుకు చెందిన మైనీ గ్రూప్ రెండు సీట్ల ‘రేవా’ కారును విడుదల చేసింది. వాణిజ్యపరంగా భారత్లో అత్యంత విజయవంతమైన ఎలక్ట్రిక్ కారు ఇది. ►2006 – ఎలక్ట్రిక్ టూవీర్లను తొలిసారిగా వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన కంపెనీ గుజరాత్కు చెందిన ఎలక్ట్రోథర్మ్ ఇండియా. 2006లో తొలిసారి ఇది ‘యో బైక్స్’ పేరుతో తీసుకొచ్చింది. ►2007 – ఈవీ స్కూటర్ల రంగంలోకి హీరో ఎలక్ట్రిక్ (అప్పట్లో అల్ట్రా మోటార్స్) భారీ స్థాయిలో అడుగుపెట్టింది. ► 2013 – టయోటా భారత్లో ప్రియస్ ఈవీని ప్రవేశపెట్టింది. అలాగే ‘క్యామ్రీ హైబ్రిడ్’ కారును తెచ్చింది. ► 2015 – కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా స్కీమ్ను ప్రవేశపెట్టడం, భారీగా సబ్సిడీలను ఆఫర్ చేయడం వంటివి మళ్లీ ఈవీలు జోరందుకున్నాయి. మారుతీ స్మార్ట్ హైబ్రిడ్ సియాజ్, ఎర్టిగా మోడల్స్ను ప్రవేశపెట్టింది. ► 2020 – భారత్లో తొలి హైడ్రోజన్ ఎఫ్సీఈవీ ప్రోటోటైప్ వాహనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), కార్పొరేట్ దిగ్గజం కేపీఐటీ కలసి విజయవంతంగా పరీక్షించాయి. ► 2020 – భారత్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రపంచ ఎలక్ట్రిక్ దిగ్గజం టెస్లా ప్రకటించింది. ► 2021 – ఫేమ్–2 స్కీమ్ రాయితీని కేంద్రం భారీగా పెంచింది. మరోపక్క, పెట్రోలు టూవీలర్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ఎలక్ట్రిక్ టూవీలర్లపై జీఎస్టీ 5 శాతమే. అంతేకాదు రోడ్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఈవీల కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై చెల్లించే వార్షిక వడ్డీపై రూ.1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపును కూడా ప్రకటించింది. ►2021 – ఉత్పత్తి ఆధారిత రాయితీ (పీఎల్ఐ) స్కీమ్ను ఈవీ పరిశ్రమకూ కేంద్రం ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ప్యాసింజర్ ఈవీ, హైబ్రిడ్ వాహన రంగంలో టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా ఎలక్ట్రిక్, టయోటా, ఒలెక్ట్రా గ్రీన్టెక్, హ్యుందాయ్, అశోక్ లేలాండ్, ఎంజీ మోటార్స్, జేబీఎం మోటార్స్, వోల్వో, ఆడి తదితర కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను విక్రయిస్తున్నాయి. హీరో ఎలక్ట్రిక్, ఎలక్ట్రోథర్మ్ (యో బైక్స్), ఎథర్ ఎనర్జీ, ఒకినవా, ప్యూర్ ఈవీ, సింపుల్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్ తదితర కంపెనీలు ఈ–స్కూటర్లను విక్రయిస్తున్నాయి. రివోల్ట్ ఈవీ బైక్లను విక్రయిస్తోంది. ఫేమ్ స్కీమ్, వివిధ రాష్ట్రాల సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుని చూస్తే వీటి ధరలు రూ.70,000 నుంచి రూ.1.13 లక్షల మధ్యనున్నాయి. బీహెచ్ఈఎల్, సన్ మొబిలిటీ, ఎక్సైడ్, కైనటిక్ ఇంజినీరింగ్, టాటా పవర్ వంటివి దేశీయంగా లిథియం ఆయాన్ బ్యాటరీల తయారీ, ఇంకా పబ్లిక్ చార్జింగ్ సర్వీసులకు సంబంధించి భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నాయి. ఈవీ... పాస్ట్ అండ్ ఫ్యూచర్! ►1832: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని స్కాట్లాండ్కు చెందిన రాబర్ట్ ఆండర్సన్ రూపొందించారు. ►1889: అమెరికాలో ఎలక్ట్రిక్ కార్లు రోడ్డెక్కాయి. పదేళ్ల పాటు వీటికి ప్రాచుర్యం లభించింది. ►1901: ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్ వాహనాన్ని (పెట్రోలు, విద్యుత్ రెండింటితో నడిచేది) విఖ్యాత జర్మనీ ఆటోమోటివ్ ఇంజినీర్ ఫెర్డినాండ్ పోర్ష్ (లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్ వ్యవస్థాపకుడు) కనుగొన్నారు. ►1920–35: తక్కువ ధరల్లో పెట్రోలు, డీజిల్ కార్లు హల్చల్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు జనాదరణ కరువైంది. 1935 నాటికి మార్కెట్లో ఇవి పూర్తిగా మాయమయ్యాయి. ►1972: జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ►‘1602ఈ’ మ్యూనిక్ ఒలింపిక్స్లో ఆవిష్కృతమైంది. అయితే, వాణిజ్యపరంగా మాత్రం ఇది ఉత్పత్తికి నోచుకోలేదు. ►1974: అమెరికాలో సెర్బింగ్–వ్యాన్గార్డ్ తయారు చేసిన వ్యాన్గార్డ్ సిటీ కార్ గొప్ప సక్సెస్ సాధించింది. 2,300 కార్లు అమ్ముడయ్యాయి. ►1996: అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) ఎలక్ట్రిక్ కారు ప్రియుల కోసం ప్రత్యేకమైన ‘ఈవీ1’ కల్ట్ కారును విడుదల చేసింది. ►1996: ప్రపంచంలో తొలిసారి వాణిజ్యపరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ప్యూజో స్కూటెలెక్’ను ఫ్రాన్స్ వాహన కంపెనీ ప్యూజో విడుదల చేసింది. ►1997: కొత్త జనరేషన్ హైబ్రిడ్ కారు (పెట్రోలు, ఎలక్ట్రిక్) ‘ప్రియస్’ను జపాన్ దిగ్గజం టయోటా మార్కెట్లో ప్రవేశపెట్టింది. వాణిజ్య పరంగా మంచి విజయం సాధించింది. ►2008: స్టార్టప్ కంపెనీ టెస్లా మొట్టమొదటి లగ్జరీ ఈవీ ‘రోడ్స్టర్’ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన బీవైడీ ఆటో కూడా ఎఫ్3డీఎం పేరుతో ప్రపంచంలోనే మొదటి ప్లగ్–ఇన్ హైబ్రిడ్ను విడుదల చేసింది. ►2010: జపాన్ కంపెనీ నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు ‘లీఫ్’ను ప్రవేశపెట్టింది. ►2014: అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో టెస్లా గిగా ఫ్యాక్టరీ 1 పేరుతో అత్యంత భారీ బ్యాటరీ, ఈవీ ప్లాంట్కు తెరతీసింది. ►2016: క్లైమేట్ చేంజ్పై ‘ప్యారిస్ ఒప్పందం’ అమల్లోకి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ కాలుష్యానికి చెక్ చెప్పాలని అంగీకరించడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు జోష్ మొదలైంది. జీఎం తన తొలి ఫుల్ ఎలక్ట్రిక్ కారు ‘షెవీ బోల్ట్’ను విడుదల చేసింది. ►2017: భారత్, యూకే ప్రభుత్వాలు 2030 నాటికి దేశంలో పూర్తిగా ఈవీల విక్రయం మాత్రమే జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించాయి. ఫ్రాన్స్ 2040 టార్గెట్గా పేర్కొంది. ►2020: ఏడాదికి 10 లక్షల ఈవీ విక్రయాలను టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ 2040 నాటికి తమ రవాణా అవసరాలన్నింటికీ ఈవీలనే వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► 2021: పెట్రోలు, డీజిల్ వాహనాల ఉత్పత్తిని 2030 నాటికి పూర్తిగా నిలిపేస్తామని, కేవలం ఈవీలనే విక్రయిస్తామని స్వీడన్ దిగ్గజం వోల్వో ప్రకటించింది. ►2021: అమెరికాలో మూడు బ్యాటరీ ప్లాంట్లు, ఒక ఈవీ తయారీ ప్లాంట్ నిర్మాణం కోసం 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఫోర్డ్ ప్రకటించింది. ►2025: జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్ 2025 నాటికి ఏటా 20 నుంచి 30 లక్షల ఈవీ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. బీఎండబ్ల్యూ కూడా అమ్మకాల్లో 20 శాతం ఈవీలే ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ►2030: ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ఈవీలు రోడ్లపై పరుగులు తీస్తాయని అంచనా. ►2040: మొత్తం ప్రపంచ వాహన విక్రయాల్లో 32 శాతం ఈవీలే ఉంటాయని అంచనా. టెస్లా.. సంచలనం ఎలక్ట్రిక్ వాహన రంగంలో, ఆ మాటకొస్తే ప్రపంచ ఆటోమొబైల్ రంగంలోనే టెస్లా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఒక స్టార్టప్ కంపెనీగా 2003లో సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టిన టెస్లా... కేవలం 15 ఏళ్ల కాలంలోనే ప్రపంచ వాహన రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. 2008లో మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ‘రోడ్స్టర్’ను విడుదల చేసింది. ఇన్వెస్టర్గా కంపెనీలోకి అడుగుపెట్టి 2008లో సీఈఓగా మారిన ఎలాన్ మస్క్.. హయాంలో మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్ కార్లను ప్రవేశపెట్టింది. పెట్రోలు, డీజిల్ కార్లకు సమాన సామర్థ్యంతో ఈ ఎలక్ట్రిక్ కార్లు పరుగులు పెట్టడం, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 375 నుంచి 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండటంతో వీటికి డిమాండ్ జోరందుకుంది. మరోపక్క, సోలార్, బ్యాటరీలు, ఈవీల ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీల పేరుతో టెస్లా అత్యంత భారీ ప్లాంట్లను నెలకొల్పుతూ వస్తోంది. 2016లో మొదటి గిగా ఫ్యాక్టరీ అమెరికాలోని నెవాడాలో నెలకొల్పింది (ప్రస్తుతం 4 ఉన్నాయి). జర్మనీ ఇతరత్రా దేశాల్లో (భారత్ సహా) మరిన్ని గిగా ఫ్యాక్టరీలను నెలకొల్పే యత్నాల్లో ఉంది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ దాదాపు 800 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.60 లక్షల కోట్లు). టయోటా, ఫోక్స్వ్యాగన్, చైనా దిగ్గజం బీవైడీ, జనరల్ మోటార్స్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలన్నింటి మార్కెట్ విలువ కంటే టెస్లాదే ఎక్కువ కావడం ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకు నిదర్శనం. అంతేకాదు, ప్రపంచ కుబేరులందరినీ వెనక్కి నెట్టి, మస్క్ ప్రపంచంలోకెల్లా అపర కుబేరుడిగా (ప్రస్తుత సంపద 200.4 బిలియన్ డాలర్లు) అవతరించడం కూడా ఎలక్ట్రిక్ చలవే!! అంకెల్లో... 5,20,000.. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 జూలై నాటికి దేశంలో రిజిస్టర్ అయిన మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య. ఇందులో దాదాపు 4–5 లక్షల వరకూ టూ, త్రీ వీలర్లే. మిగిలిన వాటిలో కార్లు, బస్సులు ఉన్నాయి. 2020–21లో భారత్లో మొత్తం 2,38,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో అత్యధికం స్కూటర్లు, ఆటోలే. రూ.12.5 లక్షల కోట్లు.. 2030 కల్లా భారత్ ఈవీ లక్ష్యాల కోసం వాహనాల ఉత్పత్తి, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం అవసరమయ్యే పెట్టుబడి మొత్తం. 4,00,000.. దేశంలో 2026 నాటికి అవసరమయ్యే పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు. ప్రస్తుతం 2,000 చార్జింగ్ పాయింట్లున్నాయి. 63 లక్షలు.. 2027 నాటికి భారత్లో వార్షిక ఈవీ అమ్మకాల సంఖ్య అంచనా. 14 కోట్లు.. ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై తిరగవచ్చని అంచనా వేస్తున్న ఈవీల (టూ, త్రీవీలర్స్ మినహా) సంఖ్య. 38 కోట్లు.. ఐఈఏ అంచనా ప్రకారం 2030 నాటికి చేరుకోనున్న మొత్తం టూ, త్రీవీలర్ ఈవీల సంఖ్య. 13 లక్షలు.. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల సంఖ్య. వీటిలో 30 శాతం ఫాస్ట్ చార్జర్లు. 29 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి అవసరమయ్యే ఈవీ చార్జింగ్ పాయింట్ల సంఖ్య. లిథియం అయాన్ బ్యాటరీలదే హవా... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీల హవా కొనసాగుతోంది. ఈవీ ధరలో 40–50 శాతం వరకు వ్యయం బ్యాటరీదే. గడచిన పదేళ్లుగా దేశంలో లిథియం అయాన్ బ్యాటరీ రేట్లు వార్షికంగా 20 శాతం మేర దిగొస్తున్నాయి. 2026 నాటికి ఈవీ బ్యాటరీ మార్కెట్ మొత్తం విలువ 166 బిలియన్ డాలర్లను చేరే అవకాశం ఉంది. కాగా, 2020లో లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి 160 గిగావాట్–అవర్స్ (జీడబ్ల్యూహెచ్)కు ఎగబాకింది. 2030 నాటికి ఇది 1,300 జీడబ్ల్యూహెచ్కు దూసుకెళ్లొచ్చని బ్లూమ్బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ (బీఎన్ఈఎఫ్) నివేదిక పేర్కొంది. కాగా, ప్రపంచ ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో చైనా 70 శాతం వాటాతో టాప్లో ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల్లో గ్రాఫైట్, నికెల్, అల్యూమినియం, లిథియం, కోబాల్ట్ ఇంకా మాంగనీస్లను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇందులో లిథియం మైనింగ్ అనేది అత్యంత క్లిష్టతరం కావడం, ఈ లోహపు లభ్యత పరిమితం కావడం కూడా బ్యాటరీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. 100% కాలుష్య రహితం కాదా? ఎలక్ట్రిక్ వాహనాలు నిజంగానే 100% పర్యావరణహితమైనవి కావా... ఇవి కూడా కాలుష్యానికి ఎంతో కొంత కారణమవుతాయా? దీనికి అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను చార్జింగ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ ఉత్పత్తి వల్ల భారీగా కర్బన ఉద్గారాలు విడులవుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 29 శాతమే. అంటే 71% ఉత్పత్తి కాలుష్యకారకమైనదే. అదేవిధంగా ఈవీల తయారీ ప్రక్రియ కూడా గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ పెట్రోలు/డీజిల్ కారు తయారీతో పోలిస్తే ఈవీ ఉత్పత్తిలో 15 శాతం అధిక కర్బన ఉద్గారాలు విడుదలవుతాయని అంచనా. ఈవీల లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో వాడే లోహాల కోసం జరిపే గనుల తవ్వకం ఇతరత్రా ప్రక్రియల రూపంలో భారీగా వాతావరణంలోకి కాలుష్యం విడుదలవుతుంది. అయితే, ఒక్కసారి ఈవీలు తయారయ్యాక వాటి జీవితకాలంలో నెట్–జీరో కాబట్టి కాలుష్య ప్రభావం అనేది పాక్షికమేననేది పరిశ్రమవర్గాల మాట. చార్జింగ్ స్పీడ్ పెరగాలి... ఎలక్ట్రిక్ వాహనాలను ఇంట్లో సాధారణ ప్లగ్ సాకెట్ (13 లేదా 15 యాంప్)తో కూడా చార్జ్ చేసుకోవచ్చు. అయితే పూర్తి చార్జింగ్కు కనీసం 6–12 గంటలు పడుతుంది. అదే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లో అయితే డీసీ ఫాస్ట్ చార్జర్లతో 60–110 నిమిషాల్లో, ఏసీ స్లో చార్జర్లతో 6–7 గంటల్లో ఫుల్ చార్జ్ చేసుకోవచ్చు. సగటున ఫాస్ట్ చార్జర్లతో నిమిషానికి 1.5–3 కిలోమీటర్ల రేంజ్ చార్జింగ్ అవుతుంది. అయితే, ఈ చార్జింగ్ వ్యవధి భారీగా దిగొస్తే ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆటోమేషన్ రంగంలో ప్రపంచ దిగ్గజం ఏబీబీ తాజాగా అల్ట్రా ఫాస్ట్ చార్జర్ ‘టెరా 360’ని విడుదల చేసింది. దీంతో 100 కిలోమీటర్ల రేంజ్ వరకు కార్ బ్యాటరీని చార్జ్ చేయడానికి కేవలం 3 నిమిషాలే పడుతుంది. అంతేకాదు ఎలాంటి ఎలక్ట్రిక్ కారునైనా 15 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేసేయొచ్చని కంపెనీ ప్రకటించింది. దీంతో ఏక కాలంలో 4 కార్లను చార్జ్ చేయొచ్చని కూడా అంటోంది. -
చేతిలో చిల్లిగవ్వ లేదు, షేర్లను అమ్మేస్తా..! మీరేమంటారు?
Elon Musk Propose Selling My Tesla Stock on Twitter Poll: స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి తన ట్వీట్తో చర్చాంశనీయంగా మారారు. నా దగ్గర డబ్బులు లేవు. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు' అంటూ ట్వీట్లో నెటిజన్ల అభిప్రాయాన్ని కోరారు. అందుకు 54శాతం నెటిజన్లు అవునని 876,189 ఓటింగ్ వేశారు. Much is made lately of unrealized gains being a means of tax avoidance, so I propose selling 10% of my Tesla stock. Do you support this? — Elon Musk (@elonmusk) November 6, 2021 ఇటీవల వాషింగ్టన్లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ లాంటి బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి చేశారు. దీంతో ఎలన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా కంపెనీ స్టాక్స్లో 10 శాతం విక్రయించాలా' అంటూ ట్వీట్ చేశారు. కొంతమంది డెమోక్రాట్లు బిలియనీర్లు స్టాక్స్ ధర పెరిగినప్పుడు, వారు ఎటువంటి షేర్లను విక్రయించకపోయినా పన్నులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నేను నా టెస్లా స్టాక్లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నాను. దీనికి మీరు మద్దతు ఇస్తున్నారా?అని ఎలన్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన రెండుగంటల్లోపే మొత్తం 876,189మంది ఓటింగ్ ద్వారా అవనని సమాధానం ఇచ్చారు. మస్క్ సంపదన ఎక్కువ భాగం టెస్లా షేర్లలో ఉంది. అందుకే నా వద్ద స్టాక్ మాత్రమే ఉంది, కాబట్టి నేను వ్యక్తిగతంగా పన్నులు చెల్లించడానికి ఏకైక మార్గం స్టాక్ విక్రయించడం" అని ట్వీట్లో పేర్కొన్నాడు. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..! -
భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్న టెస్లా కారు!
త్వరలో భారత్లో ప్రముఖ ఎలక్ట్రిక్ టెస్లా కార్లు రయ్ రయ్ మంటూ రోడ్లపై సందడి చేయనున్నాయి. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టెస్లా-3/టెస్లా-Y మోడల్ కార్లను ఈ ఏడాది చివరి నాటికి భారత్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ కార్లతో ప్రపంచ దేశాల్ని ఆకర్షిస్తున్న టెస్లా భారత్ మార్కెట్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో టెస్లా మోడల్ వై కారును హిమాచల్ ప్రదేశ్ రోడ్లపై టెస్ట్ ట్రయల్స్ నిర్వహిస్తూ కనిపించింది. టెస్లా మోడల్ 3 కారు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కారును పరీక్షించింది. ఈ విషయం గురుంచి మొదట టీమ్-బిహెచ్ పీ నివేదించింది. విలాసవంతమైన తన కార్లను భారతీయులను అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో షోరూంలను, డీలర్షిప్లను ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతోంది. ఇప్పటికే బెంగళూరు (కర్ణాటక) కేంద్రంగా టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ పేరుతో రిజిస్టర్ చేయించింది. దీంతో పాటు ముంబై హెడ్ ఆఫీస్ గా.. కొన్ని ప్రధాన నగరాల్లో డీలర్షిప్లను ఏర్పాటు చేసి ఈ ఏడాది చివరి నాటికి కార్లను విడుదల చేసేందుకు సంస్థ ప్రతినిథులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. టెస్లా మోడల్ వై, మోడల్ 3 ఆధారంగా రూపొందించారు. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 487 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. మోడల్ వై ధర రూ.70 లక్షల నుంచి(ఎక్స్ షోరూమ్) అమ్మకానికి వస్తుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సిడీలు ఇస్తున్న ఒరిస్సా) -
ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారారు. స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో 2008 లో టెస్లా కార్ల గురించి ఎలన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా. అనుకుంటే ఏదైనా చేస్తావ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అధఃపాతాలానికి పడిపోతున్నాడంటూ.. 2003లో ఎలన్ మస్క్ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్లను రూపొందించాలనే ఉద్దేశంతో టెస్లా సంస్థను ప్రారంభించారు. 2008 నాటికి ఆ సంస్థకు ఎలన్ సీఈఓ అయ్యారు. ఆ సయమంలో ఈ బిజినెస్ టైకూన్ తన ఆస్తి మొత్తాన్ని టెస్లా కార్ల మీద ఇన్వెస్ట్ చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎలన్ ప్రయత్నాలపై పలు మీడియా సంస్థలు ఎలన్ ఆకాశం నుంచి అథఃపాతాళానికి పడిపోతున్నారని రాసుకొచ్చాయి. ఆ కథనాలపై ఎలన్ తనదైన స్టైల్లో స్పందించారు. భారీ పెట్టుబడులు పెడితేనే తక్కువ ధరకే ప్రొడక్ట్లను అందించగలం కొత్త టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారంటే దాన్ని అందిపుచ్చుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం టెస్లా విషయంలో ఇదే జరుగుతుంది. కనీస వేతనాలతో దాదాపుగా వాలంటీర్లా పనిచేస్తున్నాం. 'ఇక్కడ మరో క్లిష్టమైన విషయం తక్కువ ధరకే కార్లను అందించాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు ల్యాప్ట్యాప్లు. తొలిసారి ల్యాప్ట్యాప్ లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ల్యాప్ట్యాప్లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే 2008లో ఎలన్ చేసిన వ్యాఖ్యల వీడియోల్ని టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్ అనే ట్విట్టర్ అకౌంట్ వీడియోని షేర్ చేసింది.@elonmusk 2008లో ఎలక్ట్రిక్ వాహనాల గురించి చర్చించారంటూ ఎలన్కు ట్యాగ్ చేసింది. ఆ వీడియో క్లిప్ను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై ఎలన్ కూడా స్పందించారు. అయితే ఈ వీడియోలపై చాలా మంది నెటిజన్లు మస్క్ స్ఫూర్తిని కొనియాడారు. ఎప్పటికీ మా ఇన్స్పిరేషన్ మీరేనంటూ ప్రశంసించారు. ఆయ దూరదృష్టిని కొనియాడారు. 75 లక్షల కోట్లు దాటింది .@elonmusk discussing electric vehicles in 2008 as tesla was nearly out of cash. pic.twitter.com/q41Tw9bfx9 — Tesla Silicon Valley Club (@teslaownersSV) October 26, 2021 ఆటోమొబైల్ రంగంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ అరుదైన ఫీట్ను సాధించారు. వందల ఏళ్లకు పైగా ఆటోమొబైల్ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలకు షాకిచ్చారు. ఎలన్ మస్క్ అమెరికాలో రెంటల్ కార్ సర్వీసులు అందించే హెర్జ్ కంపెనీతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు. ఆ బిజినెస్ డీల్ 4.4 బిలియన్ డాలర్లగా ఉందని తెలియడంతో మదుపర్లు టెస్లా షేర్లపై భారీగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లు రివ్వున దూసుకెళ్లాయి. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో 13ఏళ్ల క్రితం టెస్లా కార్ల గురించి ఎలన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. చదవండి: టిమ్ కుక్ ను..ఎలన్ తిట్టినంత పనిచేస్తున్నారు?! -
'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్ మస్క్
సోషల్ మీడియాలో ఏదైనా ప్రాడక్ట్ల గురించి రివ్యూ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సదరు కంపెనీ నుంచి న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి టెస్లా 'చెత్త కారు', 'టెస్లా రోగ్ కంపెనీ' అంటూ సోషల్ మీడియాలో నెగిటీవ్ ప్రచారం చేశాడు. దీంతో సదరు వ్యక్తి పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన 'హాన్ చావో' అనే వ్యక్తి 2019 లో టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన మూడు నెలల తరువాత టెస్లా కారు పనితీరు మందగించింది. దీంతో తన కారును రిప్లేస్ చేసి కొత్త కారు ఇవ్వాలని చైనాలో ఉన్న టెస్లా కార్ల సంస్థను అడిగాడు. కానీ అందుకు టెస్లా ప్రతినిధులు ఒప్పుకోలేదు. ఏం చేయాలో పాలు పోని హాన్ చావో సోషల్ మీడియాలో టెస్లా కారుపై నెగిటీవ్ ప్రచారం చేశారు. టెస్లా చెత్త కారు, టెస్లా రోగ్ కంపెనీ అంటూ ప్రచారం చేశాడు. అంతేకాదు పరువునష్టం దావా కింద తనకి వన్ మిలియన్ యువాన్ చెల్లించాలని కంపెనీని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..హాన్ చావో పై టెస్లా న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. హాన్ ఆన్లైన్, ఆఫ్లైన్ లో టెస్లా గురించి నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ప్రజల్లో టెస్లా కారు గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. అందుకే హాన్చావో పై చర్యలు తీసుకునేందుకు టెస్లా సిద్ధంగా ఉందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. చదవండి: Tesla, Apple: భారత్లో..ఆపిల్,టెస్లాలకు బ్రేక్..ఈ ఏడాది లేనట్లే!