anantha venkatarami reddy
-
బడ్జెట్ ప్రసంగమా.. లేక.. బాబు, లోకేష్ భజన
-
పోసాని అరెస్ట్ పై అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
'జగన్ ' అంటే నమ్మకం కోల్పోయింది అధికారమే.. ప్రజాదరణ కాదు
-
రైతులకు మద్దతుగా జగన్ పర్యటిస్తే ఎలాంటి భద్రత కల్పించలేదు
-
ఆ ట్రోలింగ్ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
‘పవన్.. హామీల అమలు నీ బాధ్యత కాదా?’
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నాయకులు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. అలాగే, కక్ష సాధింపు చర్యలను మానుకుని హామీలను అమలు చేయాలని కూటమి నేతలకు హితవు పలికారు.అనంతరంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు పాలనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత తీసుకోరు?. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయరా?. టీడీపీ కూటమి.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ చంద్రబాబు జారుకునే యత్నం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియలేదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు తగదు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కొనసాగిస్తుంది. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. ప్రజల గొంతుకను అణచివేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. కక్షసాధింపు చర్యలు మానుకుని ఇచ్చిన హామీలను అమలు చేయండి అని హితవు పలికారు.వైఎస్సార్సీపీ నేత, ప్రభుత్వ విద్యా మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. హామీల అమలులో చంద్రబాబు, పవన్కు చిత్తశుద్ధి లేదు. వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. టీడీపీ కూటమి అరాచకాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటాం అని తెలిపారు. -
శైలజానాథ్ పార్టీలో చేరడంపై అనంత వెంకట్రామిరెడ్డి రియాక్షన్
-
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ఇబ్బందులు: అనంత వెంకట్రామిరెడ్డి
-
చంద్రబాబూ..ఇంత మోసమా!: అనంతవెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:ఇచ్చిన అన్ని హామీలను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అమలు చేశారని,నవరత్నాలను నిక్కచ్చిగా అమలు చేసిన ఘనత ఆయనదేనని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంతవెంకట్రారామిరెడ్డి అన్నారు. బుధవారం(జనవరి29) ఆయన మీడియాతో మాట్లాడారు.‘సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబుకు అవగాహన లేదా? సూపర్సిక్స్ హామీలకు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత వహించాలి.సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు. ప్రజలు అధైర్య పడొద్దు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది’అని అనంతవెంకట్రామిరెడ్డి తెలిపారు.గుమ్మనూరు జయరాం ఆగడాలు పెరిగిపోయాయి‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి.ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది.బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు.టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు’అని అనంతవెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. -
గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి మాస్ వార్నింగ్
-
విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం
-
చంద్రబాబు ప్రజలను మోసం చేశారు: వెంకట్రామిరెడ్డి
-
పోరాటానికి సిద్ధం.. చంద్రబాబుది అసమర్థత పాలన..
-
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి కౌంటర్
-
అక్రమ అరెస్ట్ లపై కూటమి ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి కౌంటర్
-
రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు
-
చంద్రబాబు రైతు ద్రోహి
-
పోలవరం ఎత్తు తగ్గింపు బాబు కుట్రే: అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు -
ఇకనైనా మేల్కొండి.. తినడం ఆపి...పాలించడం మొదలు పెట్టండి
-
ఆ విషయంలో ఎందుకు స్పందించరు?: అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం: రైతు భరోసా కింద ఒక్కొ రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ నిలదీశారు.‘‘కరవు రైతులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. హంద్రీనీవా, తుంగభద్ర జలాలను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్టుల్లో నీరున్నా ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడం దారుణం. రాయలసీమకు చెందిన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరు?. రైతుల సమస్యల కన్నా మద్యం, ఇసుక నుంచి కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్న ధ్యాసే ముఖ్యమా?’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల దోపిడీ
-
మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బీజేపీ, టీడీపీ నీచ రాజకీయం..
-
చంద్రబాబును ఏకిపారేసిన వెంకట రామిరెడ్డి
-
‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు పరిస్థితి ఉందని.. రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వంద రోజుల పాలన మోసం, దగా.. మాయమాటలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు గోబెల్స్ను మించిపోయారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే నవరత్నాలు అమలు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే నాటికి 7 వేల కోట్ల రూపాయలు ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!‘‘జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా పథకం అందేది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏ మోహం పెట్టుకుని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తారు’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు.తిరుపతి లడ్డూ: చంద్రబాబు ఒక మాట.. ఈవో మరో మాట‘‘కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. తిరుపతి లడ్డూల విషయం చంద్రబాబు ఒక మాట... ఈవో శ్యామలరావు మరో మాట మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం లో తిరుపతి లడ్డూల ప్రస్తావన ఎందుకు చంద్రబాబు?. లడ్డూలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు దిన చర్య’’ అంటూ అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
బాబుకు అనంత వెంకట రామిరెడ్డి వార్నింగ్
-
హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..
-
జోరుగా ఎన్నికల ప్రచారం
-
అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ అసత్య ప్రచారం చేస్తున్నారు.
-
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం సభ ఉంటుంది: MLA వెంకట రామిరెడ్డి
-
సీఎం జగన్ పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్యే అనంత
-
సీఎం పదవి మీదే వారి ధ్యాస.. ప్రజా సమస్యలు వాళ్ళకి కనపడవు
-
అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు
దుష్ట శక్తులన్నీ గుంపులుగా చేరడం సహజం. ఇప్పుడు అనంతపురంలో అదే జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం రాజకీయ పార్టీల విధి. ప్రత్యర్థులైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అడ్డుకోరు. కాని ఏపీలో పచ్చ పార్టీ, దత్తపుత్రుడి పార్టీ, జాతీయ పార్టీ ముసుగేసుకున్న ఒక పచ్చ నేత కలిసి అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. రోడ్డు.. మోకాలడ్డు.! అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనంతపురం నగర అభివృద్ధిపై జగన్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించడంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. 300 కోట్ల రూపాయల ఖర్చుతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా నిర్మితమవుతున్న ఓ జాతీయ రహదారి అనంతపురం నగరం మీదుగా వెళ్తోంది. ఈ రోడ్డు పనుల్ని ఆపేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు ఏకమయ్యారు. ఆక్రమిస్తాం.. కేసులేస్తాం.! ప్రస్తుతం బీజేపీ నేతగా చెలామణి అవుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ లకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్డు విస్తరణలో భాగంగా సగానికి సగం వెళ్లిపోతాయి. జాతీయ రహదారి స్థలాన్ని ఆక్రమించి ఈ ఇద్దరు నేతలు అతిపెద్ద భవనాలను నిర్మించి కొన్ని సంవత్సరాలుగా కోట్ల రూపాయలు లబ్ది పొందుతున్నారు. ఆక్రమ కట్టడాలు తొలగించాలని, లేకపోతే తామే కూల్చేస్తామని వరదాపురం సూరీ, టీసీ వరుణ్లకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఎలాగైనా రోడ్డు విస్తరణ పనులను ఆపేయాలని ఆ ఇద్దరు ఎత్తుగడ వేశారు. కోర్టుల్లో ఇప్పటిదాకా 22 కేసులు వేశారు. రోడ్డు నిర్మాణం సరిగా జరగటం లేదంటూ ఎల్లో మీడియా ద్వారా వక్రీకరణ కథనాలు రాయిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా వీరితో జతకట్టినట్లు సమాచారం. బండారం బట్టబయలు పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ను కలిపే రహదారి పూర్తయితే అనంతపురం నగరం రూపురేఖలు మారిపోతాయి. ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి మంచి పేరు వస్తుందన్న అభద్రతా భావం విపక్ష నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి, బీజేపీ నేత వరదాపురం సూరీ, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ సంయుక్తంగా అనంతపురం అభివృద్ధిపై కుట్రలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి రోడ్డు విస్తరణలో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీంకు చెందిన నీమా ఆప్టికల్స్ కూడా పోతుంది. ఆయన షాపు పూర్తిగా తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మేయర్ మహమ్మద్ వాసీం యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తున్నారు. నగర మేయర్తో పాటు చాలా మంది వైఎస్సార్ సీపీ నేతలు.. మద్దతుదారులు రోడ్డు విస్తరణలో భాగంగా తమ భవనాలు తొలగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరి స్ఫూర్తి టీడీపీ, బీజేపీ, జనసేన నేతల్లో ఎందుకు కనిపించడంలేదని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రజల అవసరాల కంటే.. అనంతపురం నగర అభివృద్ధి కంటే.. అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాకులాడటం పట్ల అనంత వాసులు భగ్గుమంటున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
Anantapur: మూడు రాజధానులకు మద్దతుగా సత్యాగ్రహ దీక్ష
సాక్షి, అనంతపురం జిల్లా: ఏపీలో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకించే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అనంతపురం జిల్లాకు చెందిన మేధావులు, ప్రజా సంఘాలు హెచ్చరించాయి. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం నగరంలోని కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని వికేంద్రీకరణ చేస్తానని ముందుకు వస్తే.. దాన్ని అడ్డుకుని స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకోవడం క్షమించరాని నేరం అన్నారు. దశాబ్దాలుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోందని.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్కు రుణపడి ఉంటామని అనంతపురం మేధావులు స్పష్టం చేశారు. అధికార అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు అడుగడుగునా అడ్డుపడటం బాధాకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సత్యాగ్రహ దీక్ష చేపట్టిన వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానంటే.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయటం దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దీక్ష జరగడం అభినందనీయం అని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ద్వారా వికేంద్రీకరణకు బాటలు వేసిన సీఎం జగన్కు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేత కేవీ రమణ. కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం -
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి : అనంత వెంకట్రామిరెడ్డి
-
అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
-
అమ్మా.. రేషన్ కార్డు వచ్చిందా.. లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఫోన్..
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్నగర్లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్కార్డు వచ్చిందని, పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు. బాధ్యతగా సేవలందించండి అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు. ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్నగర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. -
టీడీపీ పార్టీపై మండిపడ్డ ఎమ్మెల్ల్యే అనంత వెంకటరామిరెడ్డి
-
ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి
సాక్షి, అనంతపురం: ప్రాణవాయువు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8-9 గంటల మధ్యన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన రోగులకు ఆక్సిజన్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని తెలిపారు. లోపాలు సరిదిద్దాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తెలిపారు. చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం చదవండి: అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు -
ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదు
శ్రీకాకుళం : 'అమరావతి నీకు..నీ చుట్టూ ఉన్న కోటరికి అవసరం. అమరావతి కంటే వెనుకబడిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా నీకు గుర్తులేదా' అని డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై మండిపడ్డారు. విశాఖపట్నం రాజధాని దేనికి అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, ఉత్తరాంధ్ర అంటే జగదాంబ సెంటర్ కాదని ధర్మాన ఫైర్ అయ్యారు. 'ఉత్తరంధ్రాలో సాగునీరు లేక ఏండిన పొలాలను ఏనాడైనా చూశావా?నీ ఐదేళ్ళ పాలనలో వంశధార ప్రాజెక్టును పూర్తి చేయ్యగలిగావా? గిరిజన గ్రామాల్లో రహదారులు లేక వైద్యం కోసం అల్లాడిన పేదలు భాధలు ఏనైడా ఆర్ధమయ్యాయా?నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడవనే ప్రజలు నీకు 23 సీట్లకు పరిమతం చేశారు. ఆ భగవంతుడే నిన్ను శిక్షించాడు' అని డిప్యూటీ సిఎం ధర్మాన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసుకుని... వికేంద్రీకరణ ద్వార మూడు రాజధానులు పెట్టిన గొప్ప మనసున్న నాయకుడు సిఎం జగన్ అని ప్రశంసించారు. అనంతపురం: మున్నిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం ఖాయమని ఎమ్మెల్యే అనంత వెంటరామిరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ ఫలితాలు ఈ ఎన్నికల్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమికి కారణాలు వెతుక్కుంంటున్నారని, వరుస ఓటములతో చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ పతనావస్థకు చేరిందని, జగన్ అద్భుతమైన పరిపాలనకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. 140 కోట్ల రూపాయల తో రోడ్లు నిర్మించామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, అనంతను స్మార్ట్ సిటీగా మార్చబోతున్నామని తెలిపారు. చదవండి : (ఎంపీ కేశినేనిని దూరంపెట్టిన చంద్రబాబు..) (మహిళపై చేయిచేసుకున్న అశోక్ గజపతి రాజు) -
1న ‘అనంత’కు సీఎం వైఎస్ జగన్
అనంతపురం సెంట్రల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 1న అనంతపురానికి రానున్నట్టు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ కోసం అందజేస్తున్న వాహనాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 1వ తేదీన ఉదయం 10 గంటలకు నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కాగా బుధవారం సాయంత్రం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. -
పండ్ల తోటల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలి
సాక్షి, అనంతపురం: కిసాన్ రైల్లో తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిసాన్ రైలుతో రైతులకు మార్కెటింగ్ సౌకర్యం పెరిగిందన్నారు. పండ్ల తోటల రైతులు దీన్ని సమృద్ధిగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: కిసాన్ రైలు రవాణాపై 50 శాతం చార్జీల తగ్గింపు) ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి రైతుల పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషివల్లే అనంతపురానికి కృష్ణా జలాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ నీటితోనే రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. (చదవండి: ‘అనంత’ ఫలసాయం హస్తినకు..) -
ప్రధాని మోదీ, సీఎం జగన్లకు కృతజ్ఞతలు
సాక్షి, అనంతపురం: కిసాన్ రైలు ద్వారా రైతులు తరలించే పంట ఉత్పత్తులకు రవాణా చార్జీలను 50 శాతం తగ్గించటం హిందూపూరం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు మంగళవారం వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే కిసాన్ రైల్లో రవాణా ఛార్జీలను సగానికి సంగం తగ్గించటం వల్ల అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతలో పండే పంటలు ఢిల్లీలో అధిక ధరలకు విక్రయించి రైతులు లాభం పొందవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు -
చంద్రబాబు, లోకేష్లకు అవకాశం..
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేశారని, దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీలా మారిపోయిందని.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని అక్రమాలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.(చదవండి: అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) కాగా అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్లకు అవకాశం టీడీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. చట్టాలను సైతం ఉల్లంఘించి భూ కుంభకోణానికి పాల్పడ్డారని.. చంద్రబాబు, లోకేష్ తమ నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే విచారణకు సహకరించాలని చాలెంజ్ విసిరారు. ఫైబర్గ్రిడ్ కుంభకోణంపై విచారణ జరగాలి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో రాజధాని అక్రమాలు బయటపడ్డాయని ఎమ్మెల్యే రోశయ్య స్పష్టం చేశారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదైందని, తప్పు చేశారు కాబట్టే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ కోట్లు కొల్లగొట్టారు అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తుంటే కక్షసాధింపు అంటున్నారని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఫైబర్గ్రిడ్లో లోకేష్ తన బినామీలతో కోట్లు కొల్లగొట్టారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణ జరిపించాలి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని, చంద్రబాబు, టీడీపీ నేతలు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
‘డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే ఫిర్యాదు’
సాక్షి, అనంతపురం: వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’) కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..
సాక్షి, అనంతపురం: జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి సీరియస్ అయ్యారు. సోమవారం రోజున అనంతపురం జీజీహెచ్లో కరోనా బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై చిన్నచూపు తగదు. వైద్యులు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించినా ఎందుకీ నిర్లక్ష్యం...? ప్రభుత్వ వైద్యుల్లో బాధ్యత పెరగాలి. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. కరోనా కష్టకాలంలో ప్రైవేటు డాక్టర్ల దోపిడీ తగదు. కరోనా పరీక్షల పేరుతో ఒక్కొ సీటీ స్కాన్కు రూ. 5,000 వసూలు చేయటం బాధాకరం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కఠిన చర్యలు తప్పవు!. కరోనా బాధితులకు భరోసా ఇవ్వాల్సింది వైద్యులే. కోవిడ్ వారియర్స్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల అండగా ఉంటారని' ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు. ('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్') -
'కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్'
సాక్షి, అనంతపురం: కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సంజీవిని బస్సులను శుక్రవారం ఉదయం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఏపీలో కరోనా టెస్టింగ్ కెపాసిటీ మరింత పెరిగింది. కరోనా పరీక్షలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్దే. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కరోనా వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ రంగయ్య పేర్కొన్నారు. చదవండి: సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..! హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్పై టీడీపీ విమర్శలు అర్థరహితం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అభాండాలు వేస్తున్నారు' అని తెలిపారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలు సీఎం జగన్ను ఫాలో అవుతున్నాయి. సీఎం జగన్పై ప్రజలకు విశ్వాసం పెరిగింది అని అనంత వెంకటరామి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది.. -
కరోనాతో సీఐ మృతి.. ఎంపీ మాధవ్ దిగ్భ్రాంతి
సాక్షి, అనంతపురం/ కర్నూలు: అనంతపురం ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్ కుటుంబసభ్యులు కర్నూలులోని రామలింగేశ్వర నగర్ రోడ్నెంబర్ 5లో నివాసముంటున్నారు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి వీరు కర్నూలులోనే నివాసముంటున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కుమారుడైన రాజశేఖర్ 1995లో ఎస్ఐగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలోనే విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తరువాత కొంతకాలం కర్నూలు సీసీఎస్లో కూడా విధులు నిర్వహించారు. ఈయనకు భార్య శిరీషతో పాటు బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. మొన్నటివరకు విధుల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఉన్న సీఐ రాజశేఖర్ ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ మృతిపై కలెక్టర్ గంధం చంద్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. సమర్థవంతుడైన సీఐ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ గోరంట్ల రాజశేఖర్ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాజశేఖర్ మృతికి ఎమ్మెల్యే అనంత సంతాపం అనంతపురం సెంట్రల్: సీఐ రాజశేఖర్ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా వివిధ హాదాల్లో సమర్థవంతంగా పనిచేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ మూడు నెలలుగా ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసిన అధికారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
దమ్ముంటే మోదీని ప్రశ్నించగలవా?
అనంతపురం సెంట్రల్: దమ్ముంటే ప్రధాని మోదీని ప్రశ్నించగలవా? అని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరిచాయని, కానీ ఏపీలో మాత్రమే చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం నగరంలోని 50వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ గురు బిందుప్రియ, శేఖర్బాబు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అనంత హాజరై పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. లాక్డౌన్తో పనులు లేకపోవడంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందించిందని, దాతలు కూడా మందుకొచ్చి చేయూతనిస్తున్నారన్నారు. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చంద్రబాబు, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రతి వీధిలో బెల్ట్ షాపులు ఉండేవని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. -
‘టీడీపీ నేతలంతా హోంక్వారంటైన్లో ఉన్నారు’
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ తెలియదని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో చంద్రబాబు, లోకేష్ ఇంట్లో దాక్కున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలంతా హోంక్వారంటైన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్పై విమర్శలు చేసే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుచూపుతో ఆలోచిస్తున్నారని, కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షాలు బాధ్యత నేర్చుకోవాలని సూచించారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి
సాక్షి, అనంతపురం: కరోనా వైరస్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రార్థనాలయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ పేదల పక్షపాతి
-
ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి
-
హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్దే..
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి వైఎస్సార్సీపీకే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలువలు,విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం సీఎం వైఎస్ జగన్ది.. హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనదేనని’ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేదిలేదని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. -
‘స్థానిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానికి సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కర్యాకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించాలని పేర్కొన్నారు. బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు ఎలా ఉందో ప్రచారంలో పేర్కొవాలని సూచించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను ధీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచి, టీడీపీ జనసేనలకు బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఐక్యమత్యంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. -
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా జగనన్న వసతి దీవేన
-
ఆ దాడులకు బాబుదే నైతిక బాధ్యత
సాక్షి, అనంతపురం: అమరావతిలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుదే నైతిక బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత ఎంపీ నందిగం సరేష్పై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. బాబు ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆయన వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బుతోనే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే బాబు ఆరాటపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎంపీ నందిగం సురేష్పై దాడి) -
బాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!: అనంత
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై విచారణ అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్పై సిట్ ఏర్పాటును మేము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల భూ లావాదేవిలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఒకే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇక అవినీతికి కేరాఫ్ అడ్రస్గా చంద్రబాబు, లోకేష్లు మారారని విమర్శించారు. కులాలు, మతాల ప్రాతిపదికన అవినీతి పరులను ఊపేక్షించాలా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. -
‘శంకుస్థాపన చేసినా.. తట్టెడు మట్టి కూడా తీయలేదు’
సాక్షి, అనంతపురం : తెలుగు ప్రజల ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన ఘనత రాయలసీమ ప్రజలదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయని, చరిత్ర తెలిసి కూడా చంద్రబాబు తప్పులు చేశారని విమర్శించారు. మూడు పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని నిర్మించడం మంచిది కాదన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు పరిపాలనలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు మూడుసార్లు శంకుస్థాపన చేసినా..తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. రాయలసీమ కరవు పై చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులు ఎందుకు జోలె పట్టలేదని, ఆ సమయంలో రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. (మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ) దేశమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వైపు చూస్తోందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏపీ లేదని,అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు. వైఎస్సార్ కృషి వల్ల రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని, జీఎన్ రావు, బోస్టన్,శివరామకృష్ణయ్య కమిటీలు అధికార వికేంద్రీకరణకు సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా జేసీ, ఇతర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. గ్రేటర్ అమరావతిలో నారాలోకేష్ ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చదవండి: 'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా' అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కరవు కాటకాలకు చంద్రబాబు విధానాలే కారణమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, హంద్రీనీవా కాలువ వెడల్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని తెలిపారు. వృథాగా వెళ్తున్న వరద నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రణాళికలు వేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికల కు వెళ్లాలని, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అప్పుడెందుకు బాబు రోడ్లు ఎక్కలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. రాయలసీమ వెనుకకబాటుకు చంద్రబాబే కారణమని, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అదే విధంగా రాయలసీమ కరవుపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు జరిగినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం ఎందుకు రోడ్లు ఎక్కలేదని, అమరావతి కోసం ఎందుకింత తాపత్రయమని ప్రశ్నించారు. అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు నిర్మించలేదని, రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు జరపలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిపుణుల కమిటీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, ఏపీలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కన్నారు. -
మైనార్టీలకు సర్కార్ అండ..
సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ఆర్పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ అమరావతికే పరిమితమా?
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేస్తాననటం హాస్యాస్పదమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వతే రాయలసీమలో పర్యటించాలని సవాల్ విసిరారు. శనివారం అనంతవెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు అలాంటి తప్పులు పునరావృతం కాకూడదు. అధికార వికేంద్రీకరణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు ఇంతలా గగ్గోలు పెట్టలేదు. టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఏపీ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారు. రాయలసీమ పర్యటనకు వస్తున్న చంద్రబాబును ప్రజలు ప్రశ్నించాలి. స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు అనంతపురంలో పర్యటించాలి. అమరావతిలో పోరాటం చేస్తున్నది రైతులు కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే. కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా?.. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలా? వద్దా?.. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలా? వద్దా?.. అమరావతి కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారా?..మిగిలిన ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు అక్కర్లేదా?.. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు చంద్రబాబు భిక్షాటన ఎందుకు చేయలేదు?.. సీమ నుంచి రైతులు, వ్యవసాయ కూలీలు వలసలు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు?.. శ్రీభాగ్ ఒప్పందం అమలుపై చంద్రబాబు వైఖరి ఏంటి?.. టీడీపీ అమరావతికే పరిమితమా?.. చంద్రబాబు అమరావతికి మాత్రమే నాయకుడా?.. చంద్రబాబుకు ఏపీ ప్రయోజనాల కన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. -
బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే డ్రామాలు..
సాక్షి, అనంతపురం: ‘అమ్మఒడి పథకం’ వల్ల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం శారదా మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని.. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి అత్యవసరం అని శంకర్నారాయణ పేర్కొన్నారు. దేశం చూపు..జగన్ పాలన వైపు.. అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వైపు.. దేశం యావత్తు చూస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట ఓ వరం అని ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు!
సాక్షి, అనంతపురం: మూడు రాజధానుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందటం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుందని అన్నారు. -
బాబు పారిపోయి వచ్చారు: అనంత
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరు మాసాల పాలన అద్భుతమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. సంక్షేమం అభివృద్ధి సీఎం జగన్కు రెండు కళ్లని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని, అందుకే అమరావతిపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అమరావతిలో నిజంగా అభివృద్ధి జరిగుంటే నారా లోకేష్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టిన చంద్రబాబుకు సింగపూర్ వ్యాపారులతో రహస్య ఒప్పందాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి బాబు పారిపోయి వచ్చారని ఆయన పేర్కొన్నారు. -
కుబ్రా బేగంకు అనంత వెంకట్రామిరెడ్డి చేయూత
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23)కు చేయూత అందించారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద బాధిత యువతికి హైదరాబాద్లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. అలాగే బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలయ్యేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంత వెంకట్రామిరెడ్డి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయకనిధి నుంచి రూ.3,60,000 మంజూరు చేసింది. (చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం) అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం శనివారం హైదరబాద్లోని ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరై సెలక్ట్ కూడా అయింది. ఈ వార్తను సెల్ఫోన్లో అనంతపురంలో ఉన్న తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో కుబ్రా వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్ కోసం రూ.6లక్షలు ఖర్చు అవుందని వైద్యులు చెప్పారు. (చదవండి : రూపాయి లేదు..వైద్యమెలా!) తప్పకుండా ఆదుకుంటా: కేటీఆర్ ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) ను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘రూపాయి లేదు..వైద్యమెలా!’ అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్ కేటీఆర్కు ట్విట్ చేశారు. ఎలాగైనా ఆ యువతిని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యంపై మేయర్ బొంతు రామ్మోహన్తో చర్చించానని చెప్పారు. కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Absolutely will be taken care. I have already asked Hyderabad Mayor @bonthurammohan to visit her and assure her parents of all support that is required https://t.co/MRZKlHz52Z — KTR (@KTRTRS) November 25, 2019 -
‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’
సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు
సాక్షి, అనంతపురం : ఇసుక పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్నది దొంగదీక్ష అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనది 40 ఏళ్ల అనుభవమనీ, 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, పదేళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్నానని గొప్పలు చెప్పే వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా..? అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు ఉనికి కోసమే ఇసుక రాజకీయం చేస్తున్నారన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ క్రమంలో నీటమునిగిన రీచ్లలోని ఇసుకను ఎలా తీస్తారో ఆయనే చెప్పాలన్నారు. అసలు వర్షాలు కురిసే సమయంలో ఎక్కడైనా నిర్మాణాలు జరుగుతాయా..? అని ప్రశ్నించారు. ఆమాత్రం ఇంగితం లేకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ నేతలకు భవన నిర్మాణ కారి్మకుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే వారికి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలి గానీ, రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఇసుకాసురులు టీడీపీ నేతలే ఇసుక, మట్టిని దోపిడి చేసిన నీచమైన చరిత్ర టీడీపీ నాయకులేనని ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేసి భారీగా దోపిడీ చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాతో రాయదుర్గం, పెనుకొండ, హిందూపురం, తాడిపత్రి, శింగనమల, ధర్మవరం ప్రాంతాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు గడించారన్నారు. ఇలాంటి నీచమైన చరిత్ర ఉన్న వారు..ఇప్పుడు ఇసుకపై మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ తహసీల్దార్పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేదన్నారు. ఇసుక మాఫియాను ప్రోత్సాహించింది చంద్రబాబేనని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, అందువల్లే ఎక్కడ అక్రమ రవాణా జరిగిన కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో 9 చోట్ల పోలీసు యంత్రాంగం చెక్పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు. మంచి కనిపించడం లేదా బాబూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారన్నారు. ఆశావర్కర్ల జీతాలను రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచామన్నారు. సొంత ఆటో ఉన్న వాళ్లకు రూ. 10 వేలు అందించామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి విడత రూ. 10 వేల అందించామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని చెప్పి అంతకుమించి రూ. 13,500 అందించామన్నారు. లక్షా 20 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కలి్పంచామన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 11 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇవన్నీ మంచి పనులు కావా..? అని ప్రశ్నించారు. ఇక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఆ స్కూళ్ల ఫొటోలను పంపుతామని, చంద్రబాబు వాటిని దాచిపెట్టుకొని మూడేళ్ల తర్వాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూసుకోవాలన్నారు. మీరు దద్దమ్మలనే 23తో సరిపెట్టారు చంద్రబాబు ఆ పార్టీ నేతలు దద్దమ్మలనే గత ఎన్నికల్లో ఆ పార్టీని 23 స్థానాలకే ప్రజలు పరిమితం చేశారని ఎమ్మెల్యే అనంత అన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. రాజధాని పేరుతో దోపిడీ చేశారని, అమరావతిని గెజిట్లో కూడా పొందుపరచలేదన్నారు. ఇక జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ఆయన ఎంత ఊగినా ఫలితం లేదన్నారు. వారి ఊపులకు ఎవరు భయపడరన్నారు. పవన్ పొలిటికల్ సినిమా ఫ్లాప్తో మూతపడిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా 2012 నుంచి ఏటా 30 నుంచి 35 టీఎంసీలు నీరు వస్తున్నా... ఒక్క ఎకరాకు నీరివ్వలేని దద్దమ్మలు మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ నీళ్లన్ని ఎక్కడికెళ్లాయో కూడా లెక్కలు లేవన్నారు. జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కోసం డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హంద్రీనీవాను 10 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు సమాంతర కాలువ తెస్తున్నట్లు చెప్పారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధి అని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు వస్తే టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారనీ, తాము అలా చేయమని స్పష్టంచేశారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికైనా విమర్శలు చేయడం, దొంగ దీక్షలు చేయడం మాని మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్మోహన్, మాజీ కార్పోరేటర్ చంద్రమోహన్రెడ్డి, జాన్సన్, సైఫుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’
సాక్షి, అనంతపురం : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగజారి వ్యవహరిస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుది దొంగ దీక్ష అని, తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకే బాబు ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఇసుక పుష్కలంగా లభ్యమవుతోందని, రాజకీయ లబ్ధి కోసమే బాబు దీక్ష చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడి ద్వారా టీడీపీ నేతలు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ‘వైఎస్సార్ రైతు భరోసాకు బాబు వ్యతిరేకమా? 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు వ్యతిరేకమా? సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే చంద్రబాబు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతకాని దద్దమ్మ అని అందుకే టీడీపీని ప్రజలు ఓడించారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటే’ అని పేర్కొన్నారు. -
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంత
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎన్నికయ్యారు. అంబటి రాంబాబు చైర్మన్గా ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా...అందులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి చోటు కల్పిస్తూ ఏపీ స్టేట్ లెజిస్లేచర్ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘అనంత’ కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తోంది. నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన అనంత వెంకటారామిరెడ్డి... తన హయాంలో జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి బాటలు వేశారు. ఈయన తండ్రి అనంత వెంకటరెడ్డి రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. అనంత వెంకటరామిరెడ్డికి ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నగర రూపురేఖలు మారుస్తాం
సాక్షి, అనంతపురం : ‘గత పాలకుల నిర్లక్ష్యం నగర ప్రజలకు శాపంగా మారింది. నగరంలోని రోడ్లు చాలా చోట్ల చిద్రమయ్యాయి. నగర ప్రజలు అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి. శానిటేషన్ను అటకెక్కించేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి నగర రూపురేఖలు మారుస్తాం’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే సాక్షితో మాట్లాడారు. నగరంలో చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. ఆర్అండ్బీ పరిధిలోని గుత్తి రోడ్డు పోస్టాఫీసు నుంచి సోములదొడ్ది వరకు రూ.1.10 కోట్లతో బీటీ రోడ్డు, క్లాక్టవర్ ఆర్ఓసీ బ్రిడ్జిపై రూ.40 లక్షలతో బీటీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. రూ.4.2 కోట్లతో రోడ్లకు ప్రతిపాదనలు గతంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప వేరుకుంపట్లతో నగరాభివృద్ధిని విస్మరించారన్నారు. వీరి అస్తవ్యస్థ పాలనతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.4.2 కోట్లతో నగరంలో రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గుత్తి రోడ్డు వరకు రూ.85 లక్షలతో బీటీ రోడ్డు, త్రివేణి థియేటర్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు రూ.46 లక్షలతో రోడ్డు, 1, 2, 3 రోడ్లు ఉండే జీరో క్రాస్ వద్ద రూ.60 లక్షలతో బీటీ రోడ్డు, నీలిమా థియేటర్ నుంచి తపోవనం హైవే వరకు రూ.81 లక్షలతో రోడ్డు, 48వ డివిజన్లో రూ.49 లక్షలతో రోడ్డు, అశోక్నగర్ నుంచి డ్రైవర్స్ కాలనీ వరకు రూ.40 లక్షలతో బీటీ రోడ్డు, ఓటీఆర్ఐ నుంచి అశోక్నగర్ వైపు రూ.40 లక్షలతో రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మొదలైన ప్యాచ్ వర్క్ పనులు నగరంలో రూ.25 లక్షలతో ప్యాచ్ వర్క్లు మొదలయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాన రోడ్లలో మొదట ప్యాచ్ వర్క్›లు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షం పడుతున్న సమయంలో నెమ్మదిగా పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో నగరం సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
సాక్షి, అనంతపురం సిటీ: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తన నివాసంలో నగరంలోని డివిజన్ కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చూపాలన్నారు. నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని, 50 డివిజన్లలోనూ విజయఢంకా మోగించాలని ఆకాంక్షించారు. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూ చించారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ఇప్పటికే విడుదల చేశారని, మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని, కార్యకర్తలంతా కష్టపడి జాబితాలో చేర్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. పదవుల విషయంలో ఎవరికీ అనుమానాలు, భయాలు వద్దని, కష్టపడి పని చేసేవారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు విజయం సాధిస్తే సరిపోదని, కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటేనే నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లవచ్చన్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయామని, ప్రస్తుతం అలాంటి తప్పు జరగకుండా డివిజన్లలో కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా పొరపాట్లు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే అన్నింటినీ కలిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, పార్టీ సీనియర్ నాయకులు కోగటం విజయభాస్కర్రెడ్డి, పెన్నోబుళేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సాకే చంద్ర, కార్పొరేటర్లు బాలాంజనేయులు, జానకి, గిరిజ, శ్రీదేవి, డివిజన్ కన్వీనర్లు పాల్గొన్నారు. -
అనంతపురంలో ఆసక్తికర పరిణామం
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న అనంతపురంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు ఒకరు.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి టీడీపీ సీనియర్ నేత జయరాం నాయుడు అనూహ్యంగా మద్దతు తెలిపారు. అంతేకాకుండా అనంత వెంకట్రామిరెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి ప్రజలకు చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన ఆయనను ఓడించాలని జయరాం నాయుడు ఓటర్లను కోరుతున్నారు. -
చంద్రబాబుపై ఈసీ సీరియస్గా వ్యవహరించాలి!
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వచ్చే ఎన్నికల్లో దొడ్డిదారిలో గెలిచేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. కావాలనే వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండే పోలీసు అధికారులకు పదోన్నతులు ఇచ్చి ఎన్నికల్లో అక్రమాలకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవిన్యూ, పోలీసు అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాలపై ఎన్నికల సంఘం సీరియస్గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించలేదా?
సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రాజకీయ పార్టీల మాస్కులను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్, జనసేనలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కోసం.. హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని అన్నారు. -
ఎన్ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
సాక్షి, అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు హస్తం ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన ఆయన ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు ఎన్ఐఏ విచారణకు సహకరించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్ఐఏ విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ నాయకుడు ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదని తెలిపారు. వైఎస్ జగన్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. -
పరిటాల శ్రీరాం రాజ్యాంగేతర శక్తి
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్చార్జ్లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు. నాయకులు కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌజ్ అరెస్ట్