Bahubali
-
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే!
సినిమా సూపర్డూపర్ హిట్టయితే సెలబ్రిటీలకు ఓపక్క సంతోషంతోపాటు మరోపక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విజయాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కష్టపడుతుంటారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఏం చేయాలో అర్థం కాలేదంటోంది హీరోయిన్ తమన్నా భాటియా.సక్సెస్ అందుకున్నా, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ... వయసులో నాకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు తెలుగు, తమిళం రెండూ వచ్చు. నేను కమర్షియల్ సక్సెస్ అందుకున్నాను కానీ నటిగా ఇంకా విభిన్న పాత్రలు చేయాలన్న ఆకలి మాత్రం ఇంకా ఉంది.బాహుబలి గేమ్ ఛేంజర్నిజానికి కమర్షియల్గా సక్సెస్ అయిన తర్వాత ఛాలెంజింగ్ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం డిఫరెంట్ రోల్స్తో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. బాహుబలి విషయానికి వస్తే పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అందరికీ ఓ గేమ్ఛేంజర్ వంటిది. అయితే ఈ సినిమా చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు.అర్థం కాని పరిస్థితినెక్స్ట్ ఏం చేయాలి? బాహుబలి కంటే పెద్ద సినిమా చేయాలా? ఇంతకంటే పెద్దది ఎలా చేస్తా? పోనీ నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవాలా? అన్న ప్రశ్నలతో సతమతమయ్యాను అని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కా ముఖద్దర్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది.చదవండి: హీరోయిన్ సమంత కుటుంబంలో విషాదం -
కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్ను తుడిచిపెట్టింది!
ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైనప్పటికీ సక్సెస్ సాధించాయి.అయితే భారీ బడ్జెట్ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్ సాధించింది. బాలీవుడ్లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.ఈ లెక్కన సీక్రెట్ సూపర్స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీక్రెట్ సూపర్స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఈ సినిమాలో పెద్ద స్టార్స్ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్స్టార్ నిలిచింది. -
'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!
'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్పుట్ సరిగా రాలేదని మరో టీమ్తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')ఈ సిరీస్లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం) -
తెలంగాణ సెక్రటేరియట్.. ‘బాహుబలి’ గేటు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి మెయిన్ ఎంట్రెన్స్ గేట్లను ప్రభుత్వం తొలగించింది. వాస్తు మార్పుతో మెయిన్ ఎంట్రెన్స్ రెండు గేట్లను తొలగింపు చర్యలు చేపట్టారు. గేట్లు తొలగించిన చోట పూర్తిగా గ్రిల్స్ను ఏర్పాటు చేయనున్నారు. తొలగించిన గేటును హుస్సేన్ సాగర్ వైపు గేటు నెంబరు 3 వద్ద పెట్టనున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సెక్రటేరియట్లో వాస్తు దోషం ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మార్పులు సూచించినట్లు సమాచారు. దీంతో దాదాపు 6 నెలల నుంచి బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ ఎంట్రెన్స్ గేట్లకు తాళాలు వేసి మూసివేశారు. -
భోజనం తింటే..బుల్లెట్ బండి ఫ్రీ
-
రాజమౌళి బాహుబలి-3 .. కంగువా నిర్మాత ఆసక్తికర కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు బాహుబలి, బాహుబలి-2. ఈ సినిమాలతో తెలుగు ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. దీంతో పార్ట్-3 కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే బాహుబలి-3 గురించి కోలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూర్య భారీ యాక్షన్ చిత్రం కంగువా ప్రమోషన్స్లో భాగంగా బాహుబలి పార్ట్-3 గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. కంగువా సీక్వెన్స్ల మధ్య గ్యాప్ను సమర్థిస్తూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ..'గత వారం బాహుబలి మేకర్స్తో చర్చించా. పార్ట్- 3 కోసం ప్లాన్ రూపొందించడంలో బిజీగా ఉన్నారు. దాని కంటే ముందు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతే కల్కి- 2, సలార్- 2 రిలీజ్ అవుతాయని అన్నారు. దీంతో బాహుబలి-3ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లైన 12 ఏళ్లకు గుడ్న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్)కాగా.. బాహుబలి రెండు పార్ట్లకు తమిళంలో నిర్మాతగా కేఈ జ్ఞానవేల్ రాజా వ్యవహరించారు. గతంలో బాహుబలి-3 గురించి ఎస్ఎస్ రాజమౌళి కూడా హింట్ ఇచ్చారు, కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్బాబుతో సినిమా చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిని తర్వాతే బాహుబలి-3 మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
తెలుగులో ఆ సినిమాతోనే ఫేమ్.. ఇకపై ఆ పాత్రలు చేయను: సత్యరాజ్
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యరాజ్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో కట్టప్పగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. తాజాగా ఆయన జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన సత్యరాజ్ తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.సత్యరాజ్ మాట్లాడుతూ..'విలన్గానే నా కెరీర్ ప్రారంభించా. మిర్చి సినిమాతో తెలుగులో ఓ మంచి తండ్రిగా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత బాహుబలిలో కట్టప్పగా నటించా. ఇలాంటి పాత్రలు మళ్లీ చేసే అవకాశం రావడం చాలా అరుదు. మిర్చి మూవీతోనే తెలుగులో నాకు ఇమేజ్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్ విలన్ పాత్రలు చెయ్యను. హీరో ముందు మోకరిల్లే పాత్రల్లో ఇకపై కనిపించను.' అని అన్నారు. (ఇది చదవండి: సత్యదేవ్ 'జీబ్రా' టీజర్ విడుదల)సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. ఈ ఏడాదిలో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. ఇప్పుడు జీబ్రా అనే చిత్రంతో రానున్నాడు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందించారు. -
బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్పై గురి!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ మరో మైలురాయిని దాటేసింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ దేశవ్యాప్తంగా సాధించిన నెట్ వసూళ్లను అధిగమించింది.'స్త్రీ 2' రిలీజైన రెండువారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.424 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గతంలో రాజమౌళి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్' దేశీయంగా రూ. 421 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్ని మళ్లీ థియేటర్లకు రప్పించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.ఇదే జోరు కొనసాగితే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది స్త్రీ-2. బాలీవుడ్లో 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించే లక్ష్యంతో దూసుకెళ్తోంది. మూడో వారాంతం నాటికి ఇండియాలో రూ. 500 కోట్ల నికర స్థాయిని అధిగమిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే షారూఖ్ ఖాన్ చిత్రం జవాన్ సాధించిన రూ.640 కోట్ల నికర వసూళ్లను అధిగమించడం స్త్రీ-2 చిత్రానికి సవాల్గా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుత జోరు చూస్తుంటే స్త్రీ 2'కి ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది. -
ప్రభాస్ లేకుండా 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
డార్లింగ్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకీ ఎక్కడికో వెళ్లిపోతోంది. రీసెంట్గా 'కల్కి'తో ఇంటర్నేషనల్ రేంజుకి చేరుకున్న ఈ హీరోని ఇప్పటికే చాలామంది ప్రశంసించారు. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ ప్రభాస్ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్ లేకపోతే 'బాహుబలి' సినిమా లేదనే కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కోల్కతా బాధితురాలిపై అసభ్యకర పోస్టులు.. మంచు మనోజ్ ఆగ్రహం)క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇందులోనే పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్టం రాజు అని చెప్పారు. అలానే హాలీవుడ్కి పోటీ ఇచ్చిన 'బాహుబలి' సినిమాని ప్రభాస్ లేకుండా ఊహించలేమని పొగడ్తలు కురిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వెళ్లింది. 'సలార్', 'కల్కి' హిట్టవడంతో అది మరింత పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్)Telangana Chief Minister about Telangana king👑#Prabhas pic.twitter.com/0U1Gsz071F— Prabhas Trends (@TrendsPrabhas) August 18, 2024 -
ఐదు నిమిషాల పాట.. 'బాహుబలి' బ్యూటీ రెమ్యునరేషన్ రూ.2 కోట్లా? (ఫొటోలు)
-
బాహుబలితో మొదలైంది.. ట్రెండ్ సెట్
-
'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. అది కూడా హారర్ బ్యాక్డ్రాప్ కావడం ఆసక్తి పెంచుతోంది. కొన్నిరోజులుగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సిరీస్ గురించి చెబుతూ వచ్చారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అలానే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడనేది కూడా అధికారికంగా వెల్లడించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?తెలుగులోనూ హారర్ కథలతో వెబ్ సిరీసులు వస్తున్నాయి. ఇప్పుడు అలా 'యక్షిణి' పేరుతో తీసిన సిరీస్లో మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. 'బాహుబలి' నిర్మాతలు తీసిన ఈ సిరీస్.. జూన్ 14 నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ట్రైలర్ బట్టి చూస్తే.. యక్షిణి అనే దేవకన్య శాపానికి గురవుతుంది. దీంతో మనిషిగా పుడుతుంది. అలానే 100 మంది యువకుల్ని వశపరుచుకుని చంపితేనే శాపవిముక్తి జరుగుతుంది. దీంతో విజయవంతంగా 99 మందిని చంపిన యక్షిణి.. 100వ వాడి విషయంలో మాత్రం ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరి తాను అనుకున్నది నెరవేర్చుకుందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.కాన్సెప్ట్ పరంగా చూస్తే ఆసక్తికరంగానే ఉంది. ట్రైలర్లో గ్రాఫిక్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ పాత్రలే మెయిన్. మరి ఈ హారర్ సిరీస్.. తెలుగు ఓటీటీ ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుంటుందనేది చూడాలి?(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు లభించింది. యానిమేషన్ సిరీస్పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్కు కనెక్ట్ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీప్లస్ మే 17న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది -
త్వరలోనే బాహుబలి ట్రైలర్.. రాజమౌళి పోస్ట్ వైరల్!
తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటేడ్ సిరీస్ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబలి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని రాజమౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024 -
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్గా రూపొందించిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఈ సిరీస్ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
రాజమౌళి డైరెక్టర్ మాత్రమే కాదు.. అంతకుమించి!
దర్శకధీరుడు రాజమౌళి పేరు వినగానే మనకు ఠక్కున ఆ రెండు సినిమాల పేర్లే అందరికీ గుర్తుకొస్తాయి. ఒకటి బాహుబలి.. మరొకటి ఆర్ఆర్ఆర్. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో రికార్డ్ క్రియేట్ చేసిన మన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పేరును మార్మోగించారు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా బ్లాక్బస్టర్గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే గుర్తుకొస్తుంది. అయితే ఆయన అందరూ కేవలం దర్శకుడిగానే చూస్తారు. కానీ రాజమౌళి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన తీసిన సినిమాల్లో నటుడిగా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ఆ సినిమాలేవి? ఏయే పాత్రలు చేశారో ఓ లుక్కేద్దాం పదండి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్యామియో పాత్రల్లో 8 సినిమాల్లో నటించారు. మొదిటసారి 'సై' సినిమాలో వేణుమాధవ్ అనుచరుడిగా కనిపించారు. ఆ తర్వాత రెయిన్ బో చిత్రంలోను నటించారు. అంతే కాకుండా ఆయన డైరెక్షన్లోనే రామ్ చరణ్ మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు. ఇక నేచురల్ స్టార్ నానితో తీసిన చిత్రం ఈగ ప్రారంభంలోనే స్టోరీ చెప్పారు. ప్రభాస్తో తీసిన బహుబలి మూవీలో సారా అమ్మే వ్యక్తిగా కనిపించారు. మజ్ను మూవీలో దర్శకుడిగా క్యామియోలో దర్శనమిచ్చారు. అంతే కాదు.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్లో కూడా కథను స్టార్ట్ చేసేది జక్కన్ననే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' అనే సాంగ్లో కనిపించి సందడి చేశారు. మొత్తానికి మన జక్కన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడిగా కూడా తన టాలెంట్ను నిరూపించుకున్నారు. -
అప్పుడు బాహుబలి..ఇప్పుడు సలార్..!
-
ఆనంద్ మహీంద్రా ఫిదా బాహుబలి పరోటా..
-
హీరోలను ఢీ కొట్టే రేంజ్ అనుష్క సొంతం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా. అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా 'భాగమతి-2' ని యూవీ క్రియేషన్స్లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్. అనుష్క బర్త్డే.. స్ఫెషల్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రభాస్, అనుష్క గురించి ఒక్క మాటలో...?
-
ప్రభాస్ టార్గెట్ రూ. 5వేల కోట్లు.. పెళ్లి రూమర్స్పై ఏమన్నారు?
'ఈశ్వర్'లా వెండితెరపై అడుగుపెట్టి 'ఛత్రపతి'లా 'చక్రం' తిప్పాడు. 'పౌర్ణమి' వెలుగులో 'యోగి'లా నిలిచాడు. సిల్వర్ స్క్రీన్పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూ అభిమానుల చేత 'డార్లింగ్' అని పిలిపించుకున్నాడు. అతని సినిమా రిలీజ్ తేదీ ఖరారు అయితే ఎంతటి హీరో అయినా 'సాహో' అంటూ తగ్గాల్సిందే.. అలా బాక్సాఫీస్ వద్దకు 'ఏక్ నిరంజన్'లా వచ్చి కలెక్షన్స్ రికార్డుల్లో 'బాహుబలి'గా మిగిలాడు. 'రాధేశ్యామ్' అంటూ ప్రేమను పంచడమే కాదు.. అవసరం అయితే 'రెబెల్'గా కూడా దుమ్ములేపుతాడు. 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి కుర్రోడు 'సలార్'గా మారితే ఎలా ఉంటుందో చూడాలని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 23) ప్రభాస్ 44వ పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం... ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్,డైనోసార్ అంటూ పిలుస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించిన ప్రభాస్.. భీమవరంలోని డీఎన్ఆర్ పాఠశాలలో చదువుకున్నారు. హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఆపై ఇంజినీరింగ్ చేశారు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్లు ప్రభాస్కు మంచి స్నేహితులు. కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్కు నటుడిగా పేరు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్- శ్రియా కాంబోలో 'ఛత్రపతి' వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాతో ప్రభాస్కు ఎక్కడలేని ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసింది. దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్ట్లో ప్రభాస్ చేరిపోయాడు. ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో అనుష్క, రానా దగ్గుబాటిలతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పాన్ ఇండియా రేంజ్లో 2015 జూలై 10న భారీ అంచనాలతో విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. అక్కడి నుంచి ప్రభాస్ మార్కెట్ ఇండియా బార్డర్ దాటేసింది. ప్రభాస్ మీద రూ. 5 వేల కోట్ల భారం సలార్, కల్కి, మారుతి కాంబినేషన్లో ఒక సినిమాతో పాటు పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో మరోక సినిమా ఇలా డార్లింగ్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలకు అయ్యే ఖర్చు సుమారు రూ.2 వేల కోట్లు అని అంచనా ఉంది. రిటర్న్ అంచనా రూ. 5 వేల కోట్లకు పై మాటే.. ఈ లెక్కలు తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా.. అయినా ఇదే నిజం. కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ ఆరోగ్యం కొంచెం క్షీణించింది. ఇప్పుడిప్పుడే ఆయన సరైన రూట్లోకి వస్తున్నాడు. ఇక ప్రభాస్ ఏమేరకు కష్టపడతాడో చూడాలి..! కానీ ఇండియన్ సినిమా తన మీద పెట్టుకున్న నమ్మకం ఓ విశేషమే. అనుష్క- ప్రభాస్పై రూమర్స్.. నిజమెంత అనుష్క- ప్రభాస్… ఈ జంట పేరు గత కొన్నేళ్లుగా వార్తల్లో ఉంది… నిజంగానే ఇద్దరి జంట చూడటానికి బాగుంటుంది. అందుకే ఆయన ఫ్యాన్స్కు అనుష్క అంటే ఎనలేని గౌరవం. 2009లో బిల్లా సినిమా షూటింగ్ దగ్గర వీరిద్దరి ప్రేమాయణం మొదలైందని చాలామంది చెప్పేవారు. సోషల్మీడియాలో కొన్ని వెబ్సైట్లు అయితే చాలారోజులపాటు డేటింగులో కూడా ఉన్నారని పేర్కొన్నాయి. అలా మన సైట్లు, చానెళ్లు బోలెడుసార్లు వాళ్లకు పెళ్లి చేశాయి. టీవీ తెర మీద సుధీర్- రష్మి.. వెండితెరకు సంబంధించి ప్రభాస్- అనుష్క… మంచి రొమాంటిక్ జంటలు అని టాక్. ఇవన్నీ రూమర్స్గా మిగిలాయి. పెళ్లి రూమర్స్పై ప్రభాస్ రియాక్షన్ ‘బాహుబలి’ తర్వాత దాదాపు వందల పెళ్లి ప్రపోజల్స్ ప్రభాస్కు వచ్చాయట. దీంతో ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోబుతున్నాడు అంటూ వార్తలు కూడా ప్రచారమయ్యాయి. దీనిపై ప్రభాస్ గతంలో ఇలా స్పందించాడు. 'విజయాల్లో ఉన్నప్పుడు మంచో చెడో.. ఏదో రకమైన వదంతులు వస్తూనే ఉంటాయి. ‘బాహుబలి’ జరుగుతున్నన్నాళ్లూ నాపై కూడా వచ్చాయి. కొన్ని మాటల్లో చెప్పలేనివీ ఉన్నాయి. నా పెళ్లి గురించి కూడా ఆన్లైన్లో వదంతులు సృష్టించారు. పెళ్లి కూతురంటూ ఒక మోడల్ ఫొటోలు పోస్ట్ చేశారు. అలాంటివి ఆగడం కోసమైనా పెళ్లి చేసుకోవాలిక (నవ్వుతూ)’ అని అన్నారు. ఇలా పరోక్షంగా అనుష్కతో ఎలాంటి రిలేషన్ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు. ప్రభాస్లో ఇవన్నీ ప్రత్యేకం ► ప్రముఖ మ్యూజియం మేడమ్ టుసాడ్స్లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్గా ప్రభాస్ గుర్తింపు పొందారు. ► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం ► ప్రభాస్ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్ జాక్సన్'లో అతిథిగా కనిపించారు. ► ప్రభాస్కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట. ► స్టార్డమ్ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు. ► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్ ► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. ► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ► ప్రభాస్ నటుడు కాకపోయుంటే..? హోటల్ రంగంలో స్థిరపడేవారు. ► ప్రభాస్కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం ► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'. ► నటులు: షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, రాబర్ట్ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిషలకు ప్రభాస్ అభిమాని. - బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్డెస్క్ -
CM KCR AI Looks: కేసీఆర్ కొత్త ఏఐ ఫొటోస్..
-
రాజమౌళి బర్త్డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?
ఎస్ఎస్ రాజమౌళి.. ఇది పేరు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు. వేలకోట్ల వసూళ్లని రుచి చూపించాడు. ఫ్లాప్ అనే పదాన్ని తన డిక్షనరీలో లేకుండా చేశాడు. టాలీవుడ్ స్టార్స్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డుని తన మూవీతో సాధించాడు. అలాంటి రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబరు 10). ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో పాటు ఆస్తులు ఎంత సంపాదించాడనేది చూద్దాం. సీరియల్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి.. 'స్టూడెంట్ నం.1'తో సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి సరికొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. ఇక 'బాహుబలి'తో పాన్ ఇండియా లెవల్లో విధ్వంసం సృష్టించి, 'ఆర్ఆర్ఆర్'తో ఆస్కార్ రేంజుకి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు 12 సినిమాలు తీసిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!) సినిమా ప్రమోషన్స్ తప్ప బయట పెద్దగా కనిపించని రాజమౌళికి హైదరాబాద్ మణికొండలోని ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలానే సిటీ చివర్లో ఫామ్ హౌస్ తో పాటు స్థలాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలానే పలు నగరాల్లో ఫ్లాట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. అలానే సినిమా ప్రొడక్షన్ కూడా చేస్తున్నారట. ఇవన్నీ పక్కనబెడితే రాజమౌళి దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్, వోల్వ్ తదితర ఖరీదైన కార్లు ఉన్నాయట. అలా ఓవరాల్ గా రూ.158 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అందనంత రేంజ్కి వెళ్లిపోయిన రాజమౌళి షారితోషికం మిగతా డైరెక్టర్స్తో పోలిస్తే చాలా ఎక్కువ. ఇదిలా ఉండగా సూపర్స్టార్ మహేశ్బాబుతో రాజమౌళి.. తర్వాతి సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. వచ్చే ఏడాది ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని టాక్. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: సడన్గా హౌస్లో నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్!) -
బాహుబలి 'కట్టప్ప' రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
తెలుగు సినిమా ప్రేక్షకులు సత్యరాజ్ను చూడగానే 'కట్టప్ప' అంటూ ఉంటారు. అంతలా 'బాహుబలి' సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్టుగా తన పాత్రలో కట్టప్పగా ఒదిగిపోయారు సత్యరాజ్. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని తెలుగు చిత్రాలలో విలన్గా కనిపించిన ఆయన తర్వాత పలు ప్రత్యేకమైన పాత్రలతో మెప్పించారు. తమిళనాటలో కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలే చేశారు. తర్వాత స్టార్ హీరోగా కొనసాగారు. అనంతరం కేరెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. అప్పటి నుంచీ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సత్యరాజ్ కేరెక్టర్ యాక్టర్గా అలరిస్తూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఎయిర్పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్. నేడు ఆయన 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 3, 1954 కొయంబత్తూర్లో సత్యరాజ్ జన్మించారు. తండ్రి సుబ్బయ్య డాక్టర్. కొయంబత్తూరులోనే సత్యరాజ్ బి.ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆయనకు నటులు ఎమ్.జి.రామచంద్రన్, రాజేశ్ ఖన్నా అంటే ఎనలేని అభిమానం. వారి స్ఫూర్తితో ఎలాగైన వెండితెరపై మెరవాలని ఆయనలో ఆశ చిగురించింది. కానీ ఆయన తల్లికి మాత్రం ఇష్టం లేదు. అయినా అది లెక్క చేయకుండా చెన్నైకి పయనమయ్యాడు సత్యరాజ్. మొదట తమిళ హీరో సూర్య తండ్రి శివకుమారు అప్పట్లో టాప్ హీరో. ఆయనను కలిసి ఎలాగైనా సినిమా అవకాశం ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) తల్లిదండ్రులకు ఇష్టంలేని పని చేయడం ఎందుకని, వారు చెప్పినట్లు చదువు పూర్తి చేయమని చెప్పి వెనక్కు పంపించేశాడు. కానీ, సత్యరాజ్ చెన్నైలోనే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా కమల్ హాసన్ హీరోగా నటించిన 'సట్టం ఎన్ కైయిల్' చిత్రంలో తొలిసారిగా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు సత్యరాజ్. అందులో ప్రధాన విలన్కు అనుచరునిగా సత్యరాజ్ నటించారు. తర్వాత 1985లో కార్తిక్ రఘునాథ్ రూపొందించిన 'సావి' చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు సత్యరాజ్. అనేక అవార్డులు నటుడు సత్యరాజ్కు తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, MGR అవార్డు, పెరియార్ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, విజయ్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులు వరించాయి. బాహుబలిలో కట్టప్పగా ఆయన పాత్రను యావత్ ప్రపంచానికి తీసుకెళ్లింది. ఆస్తి విలువ సత్యరాజ్కు మిర్చి సినిమాతో మంచి పాపులారిటి దక్కింది. అప్పట్లో ఒక సినిమాకు సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్యరాజ్కు చెన్నైలో స్వంత ఇల్లు ఉంది. అతను తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.5 కోట్లు అని టాక్. అలాగే, అతని వద్ద ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, ఇన్నోవా అనే మూడు కార్లు ఉన్నాయి. అతనికి నాగమ్మాళ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ప్రస్తుతం దీని ద్వారా ఆయన భారీగానే ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. అతని మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. -
నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే..
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్టేక్ వెల్కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. – సాక్షి, హైదరాబాద్ 8 రోజులు.. 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణ్పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్హౌస్లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు... ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు సాక్షి, నాగర్కర్నూల్: సీఎం కేసీఆర్ శనివారం నార్లాపూర్ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 4 గంటల పాటు కేసీఆర్ పర్యటన కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్ పంపుహౌస్కు చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరిగి వెళతారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్తోపాటు
సూపర్స్టార్ రజనీకాంత్ పనైపోయిందన్నారు. సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే 'జైలర్' బ్లాక్బస్టర్ అయింది. దెబ్బకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాతో రజనీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ విషయం ఆలోవర్ ఇండియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఏంటి రికార్డ్? రజనీకాంత్ 'రోబో' సినిమా సంచలనం సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'రోబో 2.0'.. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు గానీ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైనే వచ్చాయి. దీని తర్వాత సూపర్స్టార్ పలు సినిమాలు చేస్తున్నప్పటికీ డబ్బులు సాధించలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు 'జైలర్' వల్ల రజనీ మూవ రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) ప్రభాస్ తర్వాత అయితే రజనీకాంత్ కంటే ముందు ఈ లిస్టులో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. 'బాహుబలి' రెండు పార్ట్లతో రూ.500 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరడం కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏదేమైనా ఇక పనైపోయిందనుకునే టైంలో రజనీ కమ్బ్యాక్ ఇవ్వడం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. కలెక్షన్స్ ఎంత? 'జైలర్' ప్రస్తుతం 10 రోజుల్లో రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే హైయస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక తెలుగులో రూ.60 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం.. యూఎస్లోనూ 5 మిలియన్ల కలెక్షన్స్ క్రాస్ అయిపోయింది. కన్నడ, మలయాళంలోనూ మంచి నంబర్స్ నమోదు చేయడం విశేషం. లాంగ్ రన్లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ!) -
రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: నా విషయంలో పవన్ది 100% తప్పే: రేణుదేశాయ్) అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేణు తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్లోని థియేటర్లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్కు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పవన్తో విడాకుల టైమ్లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్ ) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?
టాలీవుడ్ జక్కన ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్గా కొత్త అవతార్ మెత్తాడు. తాజాగా ప్రముఖ స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ ఒప్పో యాడ్ మేకింగ్లో అగ్ర దర్శకుడు రాజమౌళి తళుక్కుమన్నాడు. ఈ యాడ్కు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు సెలబ్రిటీలు, స్టార్ ఆటగాళ్లు, సినిమా సూపర్ స్టార్లు మాత్రమే పలు బ్రాండ్లకు నటీనటులు, క్రీడాకారులు ఎక్కువగా ఫేమస్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా కనిపించారు. కేవలం తమ వృత్తి ద్వారా మాత్రమే కాకుండా, బ్రాండ్ అంబాసిడర్లుగా భారీగానే ఆర్జించారు. కానీ అంబాసిడర్లుగా సినీ డైరెక్టర్లుగా కనిపించి అరుదు. ఈ లోటును పూడ్చేందుకు మన దర్శకధీరుడు రడీ అయిపోయాడు. (తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్గా కోట్లు, ఎలా?) ఒప్పో బ్రాండ్ రాజమౌళిని తమ ప్రచారకర్తగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ సాధించి చరిత్ర సృష్టించిన రాజమౌళికి టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం సినీ ఇండస్ట్రీలో తనకున్న పాపులారిటీ, క్రేజ్ అలాంటిది మరి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీలతో ప్యాన్ ఇండియా ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళితో ఒప్పో తన అప్కమింగ్ ఫోన్ రెనో 10 సిరీస్ వస్తున్న ఫోన్ ఈ యాడ్ చేసినట్టు కనిపిస్తోంది. జూలై 10న ఈ ఫోన్ లాంచ్ కానుంది. రాజమౌళి డ్యుయల్ రోల్లో సూపర్బ్గా ఉన్న ఈ క్లిప్ వైరల్గా మారింది. హీరోలను మించి స్టైలిష్గా, హ్యాండ్సమ్గా డ్యుయల్ రోల్లో కనిపించిన తమ అభిమాన దర్శకుడిని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) కాగా కరియర్ పరంగా గురించి ఆలోచిస్తే..రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్లో మరో మూవీ తీసేందుకు సన్నద్ధమవుతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్గా, ఇండియానా జోన్స్ రేంజ్లో ఉండబోతోందని హింట్ కూడా ఇచ్చేసి ఈ మూవీపై ముందునుంచే భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సూపర్ కాంబో మూవీ 2025లో రిలీజ్కానుందని అంచనా. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) @ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm — Hittu Cinma (@HittuCinma) June 28, 2023 -
సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్?
ఓ సినిమా నచ్చాలంటే ఏముండాలి అని అడగ్గానే చాలామంది 'హీరో' పేరే చెబుతారు. కానీ అన్నిసార్లు ఈ ఒక్కడి వల్లే హిట్ కొట్టలేరు. కరెక్ట్గా చెప్పాలంటే మూవీలో అంతకు మించి ఉండాలి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టోరీతో పాటు పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ యాక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ హీరో ఏమో గానీ అమితాబ్, కమల్ లాంటి ఉద్దండులూ ఇందులో ఉన్నారు. మరి ఇలా స్టార్ కాంబినేషన్స్ తో గతంలో వచ్చిన సినిమాలేంటి? వాటి సక్సెస్ రేట్ ఎంత? బాహుబలి (2015, 2017) తెలుగు సినిమా చరిత్రని మార్చేసిన సినిమాగా 'బాహుబలి' చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇక్కడ క్లియర్ చెప్పుకోవాల్సి పాయింట్ ఏంటంటే.. ఇందులో నటించిన యాక్టర్స్ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ప్రభాస్ దగ్గర నుంచి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్.. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడంతమంది స్టార్స్ ఇందులో భాగమయ్యారు. సరైన కాంబినేషన్ పడాలే గానీ రిజల్ట్ ఏ రేంజులో ఉంటుందో నిరూపించారు. (ఇదీ చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) ఆర్ఆర్ఆర్ (2022) ఈ సినిమాని మల్టీస్టారర్ అని చెప్పలేం. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు కానీ ఈ మూవీ తీసే సమయానికి వీళ్ల కంటే ఎక్కువ ఫేమ్ ఉన్న బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ ఇందులో కీలక పాత్రలు చేశారు. సినిమాకు మరింత బలం తీసుకొచ్చారు. గ్లోబల్ వైడ్ హిట్ కొట్టి, వేల కోట్లు కలెక్షన్స్ రాబట్టడానికి ఓ విధంగా కారణమయ్యారు. 'బాహుబలి'తో ఇలాంటి థియరీ పాటించిన రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'తోనూ మరోసారి అలాంటి సక్సెస్ నే అందుకున్నాడు. విక్రమ్ (2022) విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ప్రస్తుత జనరేషన్ కి పెద్దగా తెలీదు. ఎందుకంటే 1990-2000 సమయంలో ఆయన్నుంచి అద్భుతమైన సినిమాలొచ్చాయి. ఆ తర్వాత సరైన మూవీ ఒక్కటి పడలేదు. ఆ లోటుని 'విక్రమ్' ఫుల్లుగా తీర్చింది. ఇందులో కమల్ తోపాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లాంటి అత్యద్భుతమైన యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేశారు. ఓ ఫెర్ఫెక్ట్ సినిమాకు ఏది ఎంత ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చో వీళ్లు ముగ్గురు కలిసికట్టుగా ప్రూవ్ చేశారు. దళపతి (1991) ఇది తమిళ సినిమా, తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దానికి మణిరత్నం డైరెక్షన్ ఓ కారణమైతే.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో విజృంభించి మరీ నటించడం మరో కారణం. వీళ్లిద్దరే కాదు ఇదే చిత్రంలో అప్పటి స్టార్స్ శోభన, అరవింద స్వామి లాంటి వాళ్లు కూడా తమ యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మైమరిచిపోయేలా చేశారు. సౌత్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో దీని ప్లేస్ ఎప్పుడూ టాప్ లోనే. (ఇదీ చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?) పఠాన్ (2022) నిరాశలో కూరుకుపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఈ ఏడాది కళకళలాడే చేసిన సినిమాల్లో 'పఠాన్' ఒకటి. షారుక్ ఖాన్ కమ్బ్యాక్ ఇచ్చిన మూవీ కూడా ఇదే. ఇందులో షారుక్ తోపాటు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసి ఆకట్టుకున్నాడు. కానీ ఇతడు స్క్రీన్ పై కనిపించింది కొంచెం సేపే అయినా ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్. వీళ్లిద్దరే మళ్లీ 'టైగర్ vs పఠాన్', 'టైగర్ 3'లోనూ సందడి చేయనున్నారు. ఇద్దరు హీరోలున్నారని దీన్ని మల్టీస్టారర్ అనుకుంటారేమో? అస్సలు కాదు ఎందుకంటే దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం లాంటి స్టార్స్ కూడా 'పఠాన్'లో కనిపించారు. రాబోయే చిత్రాల్లో మరింత మంది కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. షోలే (1975) మన దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సినిమా అనగానే 'షోలే' అని తడుముకోకుండా చెప్పొచ్చు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు చూసినా సరే గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అంజాద్ ఖాన్.. ముగ్గురు ఒకరికి మించి మరొకరు అన్నట్లు యాక్టింగ్ చేశారు. వీళ్లకు తోడుగా జయా బచ్చన్, హేమా మాలిని లాంటి వాళ్లు తమదైన గ్లామర్ తో మెప్పించారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) అమర్ అక్బర్ ఆంటోని (1977) - హమ్ (1991) బాలీవుడ్ కు దొరికిన అద్భుతమైన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ముందు వరసలో ఉంటారు. అప్పట్లో హీరోగా చేసినప్పటికీ.. చాలామంది హీరోలతో కలిసి కూడా సినిమాలు చేశారు. వీటిలో 'అమర్ అక్బర్ ఆంటోని' ఒకటి. విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముల కలిసే కథే ఈ సినిమా. అమితాబ్ తోపాటు రిషి కపూర్, వినోద్ ఖన్నా లాంటి ఇందులో నటించి మెప్పించారు. 'హమ్' చిత్రంలో అమితాబ్.. అప్పటి యంగ్ హీరోలైన రజనీకాంత్, గోవిందా లాంటి వాళ్లతో కలిసి నటించారు. స్టార్ కాస్టింగ్ ఉంటే హిట్స్ కొట్టొచ్చని ఆ సమయంలోనే నిరూపించారు. హమ్ సాథ్ సాథ్ హై (1999) - కబీ ఖుషీ కబీ ఘమ్ (2001) స్టార్ కాంబోలు ఉంటే చాలామంది దర్శకులు యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయాలని చూస్తారు. కానీ 90ల్లో బాలీవుడ్ దర్శకులు మాత్రం ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఆ జాబితాలో 'హమ్ సాథ్ సాథ్ హై' కచ్చితంగా ఉంటుంది. సల్మాన్, సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తే.. 'కబీ ఖుషీ కబీ ఘమ్'లో ఏకంగా అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ ఇలా లెక్కకు మించి స్టార్స్ నటించారు. ప్రేక్షకుల్ని మైమరచిపోయేలా చేశారు. ఇలా పైన చెప్పిన సినిమాలే కాదు.. స్పేస్ కుదరక చెప్పుకోని మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. స్టార్ కాంబినేషన్స్ ఉన్న సినిమాలు దాదాపు 90 శాతానికి పైగానే హిట్స్ కొట్టాయి. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కూడా అందుకున్నాయి. త్వరలో రాబోతున్న ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్ట్ K' మూవీస్ లో కూడా లెక్కకి మించి స్టార్స్ ఉన్నారు. మరి ఇవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి? (ఇదీ చదవండి: నేషనల్ క్రష్ రష్మిక అందం కోసం ఏం చేస్తుందో తెలుసా?) -
ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతిసనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా) ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్ వాటిని మార్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్ ఎమోజీని చేర్చి ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్పై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్ను ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో వీరు చేసిన పోస్ట్కు సమాధానంగా వచ్చే కామెంట్స్ కూడా వైరల్ అవతున్నాయి. Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀 — Virender Sehwag (@virendersehwag) June 25, 2023 (ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి) -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్స్టార్కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. రామాయణాన్ని చాలావరకు మార్చి తీశారని, వీఎఫ్ఎక్స్.. హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదనని.. ఇలా ఎవరికివాళ్లు తమ తమ అభిప్రాయాల్ని చెబుతున్నారు. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా ఇందులో నటించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్) 'బాహుబలి' తర్వాత డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఊపులో చాలా సినిమాలు ఒప్పేసుకున్నాడు. వాటిలో సాహో(2019), రాధేశ్యామ్ (2022) ప్రేక్షకుల ముందుకొస్తే, తాజాగా 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఘోరంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్స్ తో కాస్త రిలీఫ్ అనిపించింది. ఇప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ పై చూసిన ఆడియెన్స్ మాత్రం చాలావరకు పెదవి విరుస్తున్నారు. 'ఆదిపురుష్' మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే తొలిరోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజులో వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే దాదాపు రూ.140 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. గతంలో 'బాహుబలి', 'సాహో'తో పాటు ఇప్పుడు 'ఆదిపురుష్'.. రిలీజైన మొదటిరోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. తద్వారా మూడు సినిమాలతో ఈ మార్క్ ని అందుకున్న ఓన్లీ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతానికైతే ఏ హీరో కూడా.. తొలిరోజు కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కి దరిదాపుల్లో లేకపోవడం విశేషం. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్) -
'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' రిలీజ్ కి రెడీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ఓ రేంజులో ఆల్రెడీ సేల్ అయ్యాయి, అవుతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లు దేవాలయాలుగా మారబోతున్నాయి. సోషల్ మీడియాలో డిస్కషన్ అంతా కూడా ఈ సినిమా గురించే. సరిగ్గా ఇలాంటి టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇదీ ఫుల్ కిక్ ఇస్తోంది. డార్లింగ్ ప్రభాస్.. 'బాహుబలి' మూవీతో వేరే ఏ హీరో కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. తనకంటూ సెపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అంతకు ముందు కేవలం తెలుగులోనే మూవీస్ చేస్తూ వచ్చిన ప్రభాస్.. చాలావరకు కమర్షియల్ ఎంటర్ టైనర్స్, యాక్షన్ సినిమాలు చేశాడు. 'బాహుబలి' లాంటి పీరియాడికల్ మూవీలో నటించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. పాన్ ఇండియా హీరో అయిపోయాడు 'బాహుబలి' తర్వాత డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'ఆదిపురుష్'తో మైథలాజికల్ జానర్ లో తొలిసారి నటించాడు. డార్లింగ్ హీరో తన కెరీర్ లో ఈ జానర్ లో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్స్.. మైథలాజికల్ స్టోరీలతో ప్రభాస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంటుంది. ఇప్పటికైతే ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ పెద్దదే. భవిష్యత్తులో బహుశా కుదిరితే కుదరొచ్చు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
బాహుబలి, RRR కాదు.. తెలుగులో ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఇదే..
-
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
'బాహుబలి' సీన్ రీక్రియేట్ చేసిన కాజల్.. వైరల్ అవుతున్న ఫోటో
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కొడుకు నీల్ కిచ్లూతో కలిసి బాహుబలిలోని ఓ సీన్ రీక్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ కెరీర్ పీక్స్లో ఉండగానే గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన కాజల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలుపెట్టే సీన్ని కాజల్ తన కొడుకు నీల్తో రీక్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. 'రాజమౌళి సర్ ఇది నీల్, నేను మీకు అంకితమిస్తున్నాం' అంటూ ఫోటోను షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 2లో త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనుంది. -
Viral Video: పెద్దపల్లి జిల్లాలో బాహుబలి సీన్ను తలపించిన దృశ్యం
-
మంథనిలో వరద బీభత్సం: అంతెత్తు నీటిలో.. 3 నెలల బాలుడిని బుట్టలో పెట్టుకుని
సాక్షి, పెద్దపల్లి: వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కాలనీలు, ఇళ్లల్లోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో వరద బీభత్సం సృష్టించిన తీరు అంతా ఇంతాకాదు. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కుటుంబం తమ నెలల పసిపాపను వరద నీటి నుంచి రక్షించేందుకు పడ్డ కష్టం బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. సినిమాలో గ్రాఫిక్స్తో క్రియేటివిటీ చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యక్ష్యంగా సాక్షాత్కరించిందీ దృశ్యం. మర్రివాడకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో మూడు నెలల పసికందును కుటుంబ సభ్యులు బుట్టలో పెట్టుకొని తరలించారు. భుజాల వరకు వచ్చిన నీటిలో చిన్నారిని ఉంచిన బుట్టను తల్లిదండ్రులు తమ తలపై ఉంచుకుని అడుగులో అడుడేస్తూ నడుస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంథని పట్టణంలో వరద పరిస్థితి తీవ్రతను ఈ దృశ్యాలు కల్లకు కడుతున్నాయి. చదవండి: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం -
Photo Feature: చీమ.. బలానికి చిరునామా..
ఇండోనేసియా: మనుషులను బాహుబలి బాహుబలి అంటాం గానీ.. అసలైన బాహుబలులు ఈ చీమలే.. చూశారుగా.. వాటి బలం.. తమ బరువుకు 10 రెట్ల బరువును అవి అలవోకగా మోయగలవు. ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్ జాల్ఫిక్రి ఈ చిత్రాన్ని తీశారు. -
ఆ రాత్రి ఏం జరిగింది?
‘బాహుబలి’ ప్రభాకర్, ‘షకలక’ శంకర్ ప్రధాన పాత్రల్లో పాలిక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సన్నివేశానికి నిర్మాత ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ క్లాప్ కొట్టారు. ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ – ‘‘రిటైర్డ్ మిలటరీ మేజర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సినిమాకు కీలకమైన పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం’’ అన్నారు రావుల రమేష్. పాలిక్ మాట్లాడుతూ – ‘‘నా శిష్యురాలు వింధ్య రెడ్డి ఈ చిత్రకథ ఇచ్చారు’’ అన్నారు. వింధ్య రెడ్డి, సంగీత దర్శకుడు జాన్ భూషణ్ మాట్లాడారు. -
RRR Movie Review: బాక్సాఫీస్ కుంభస్థలం బద్దలుగొట్టిన ఆర్ఆర్ఆర్
-
బాహుబలి-3 ఉంటుంది, వర్క్ చేస్తున్నాం : రాజమౌళి
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాపై తాజాగా ఓక్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. త్వరలోనే బాహుబలి పార్ట్-3 రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ వార్తలపై స్పందిస్తూ.. పార్ట్-3 గురించి నాకు కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు అని హింట్ ఇచ్చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్లో పాల్గొన్న రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి-3 రానుందని భావించవచ్చా అని అడగ్గా.. తప్పకుండా భావించవచ్చు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనల్ని చూపించనున్నాం. దానిపై వర్క్ చేస్తున్నాం. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని తీయడానికి కాస్త టైం పట్టొచ్చు..కానీ బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త రానుంది' అని వివరించారు. దీంతో త్వరలోనే బాహుబలి-3పై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. -
బాహుబలి 3 ఇక లేనట్టేనా..? రూ. 150 కోట్లు ఖర్చు చేశాక కూడా
Netflix Is Put Aside Bahubali Before The Beginning Web Series: దర్శక ధీరుడు తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం 'బాహుబలి'. డార్లింగ్ ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్గా మార్చేసింది ఈ సినిమా. ప్రభాస్తోపాటు రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో నటీనటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. అయితే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఓ సిరీస్ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్తో ఈ సిరీస్ను తెరకెక్కించాలని భావించిన నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా పక్కనపెట్టిట్లు సమాచారం. ఇప్పటివరకూ 6 నెలల పాటు షూటింగ్ చేశారు. ఈ చిత్రీకరణకు రూ. 150 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ఫైనల్ అవుట్పుట్పై నెట్ఫ్లిక్స్ సంతృప్తి చెందలేదని టాక్. అందుకే ఈ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అంతకుముందే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని షూట్ చేసిన తర్వతా పలు కారణాలతో ఆమె ఈ సిరీస్నుంచి తప్పుకుంది. తర్వాత వామికా గబ్బిని ఈ ప్రధాన పాత్రలో అనేక సన్నివేశాలను రీషూట్ చేశారు. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా పక్కన పెట్టారా ? తాత్కాలికంగానా ? అనేది తెలియాల్సి ఉంది. -
బాహుబలి కట్టప్ప ఇంట విషాదం
Bahubali Actor Sathyaraj Younger Sister Kalpana Passess Away Due To Ill Health: తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ అంటే గుర్తుపడతారో లేదో కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు. తాజాగా ఈ నటుడి ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్ చెల్లెలు కల్పన మండ్రాదియార్(66) శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్ సోదరి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీతారలు సంతాపం తెలియజేశారు. -
ప్రభాస్ నాట్ జస్ట్ ఎ నేమ్..ఇట్స్ ఎ బ్రాండ్
Happy Birthday Prabhas: ప్రభాస్.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు..ఇదొక బ్రాండ్ అంటారు డార్లింగ్ ఫ్యాన్స్. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్కు అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. శనివారం(అక్టోబర్23)న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన వరల్డ్ వైడ్ క్రేజీ ఫ్యాన్స్పై ఓ లుక్కేద్దాం. ప్రభాస్ వీరాభిమాని ఒకరు ఇటీవలె తన హోటల్ను ప్రారంభించారు. రాధే శ్యామ్ పోస్టర్ను హోటల్ బ్యాక్ గ్రౌండ్గా మార్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక రాధేశ్యామ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు ఈ సినిమాలో కీ రోల్ పోషించాయి. ఈ మూవీకి ఉన్న క్రేజ్ను తమ హోటట్ ప్రమోషన్స్కి వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్ ఉంది. ప్రభాస్పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆరడుగుల అందగాడు ప్రభాస్కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. రష్యన్కు చెందిన ఓ లేడీ ఫ్యాన్ లవ్ ప్రభాస్ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు. మరి ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి. ప్రభాస్కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్లో డార్లింగ్కు క్రేజీ గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓసారి జపాన్ లేడీ ఫ్యాన్స్ అంతా కేవలం ప్రభాస్ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్ను తమ బిజినెస్ ప్రమోషన్కు వాడేసింది జపాన్లోని ఓ హోటల్. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్ ప్యాకేజింగ్లో ప్రభాస్ ఫోటోను అతికించి తమ బిజినెస్కు ప్రమోట్ చేసుకున్నారు. జపాన్లో ప్రభాస్కు క్రేజీ ఫ్యాన్స్ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో సలార్ అనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. తన 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నట్లు ఇటీవలె ప్రభాస్ ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
బాహుబలి వచ్చి ఆరేళ్లు.. వైరల్గా మారిన ప్రభాస్ ఆసక్తికర పోస్ట్
వెండితెరపై సినిమాలు ఎన్నో వస్తుంటాయ్ పోతుంటాయ్. అందులో పరాజయాలు, హిట్లు, బ్లాక్బస్టర్లు ,ఇండస్ట్రీ హిట్లు ఉంటాయ్ కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతాయి. అలాంటి చిత్రమే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహాబలి’. ఈ చిత్రం తెలుగు సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరింది. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ దీనికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్ను తన ట్వీటర్లో పంచుకున్నాడు. నిర్మాతల భయాన్ని పోగొట్టిన బాహాబలి... అప్పటి వరకు టాలీవుడ్ పరిశ్రమలో భారీ బడ్జెట్ అంటే పెద్ద స్టార్లతోనే సాధ్యమవుతుందనే భావన ఉండేది. మరో వైపు సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వస్తుందో లేదో అన్న భయం కూడా నిర్మాతల్లో ఉండేది. ఎందుకంటే తెలుగు పరిశ్రమకు ఇతర భాషల్లో అప్పట్లో ఆదరణ పెద్దగా లేదనే చెప్పాలి. ఈ భయాలన్నింటికీ ఒక్క సినిమా చెక్ పెట్టింది. సరైన కథ, అద్భుతమైన నటన, పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇలా అన్ని సమకూరితే బ్లాక్ బస్లర్కు మించిన విజయం అందుకోవచ్చని నిరూపించింది ‘బాహుబలి’ చిత్రం. బాక్సాఫీస్ ఊచకోత.. రికార్డులు సౌండ్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది గతంలో ఉన్న వాటన్నింటిని తుడిచి పెట్టి చరిత్ర సృష్టించింది బాహుబలి. ఈ పీరియాడికల్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాక తెలుగు చిత్రాల ఖ్యాతిని అంతర్జాతీయంగా గుర్తింపుని సంపాదించి పెట్టింది. అదే క్రమంలో మన చిత్రాలకు ఇండియా వైడ్గా డిమాండ్ని కూడా క్రియేట్ చేసింది. మొదట ఒక పార్టుతోనే బాహుబలి ప్లాన్ చేసినప్పటికీ బడ్జెట్, కథాంశం, పాత్రల నిడివి కారణంగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్లు బాక్స్ఫీస్ కలెక్షన్లను ఊచకోత కోయడమే గాక వాటి రికార్డుల సౌండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగించేలా చేశాయి. విజువల్ వండర్కు ఆరేళ్లు ఈ సిరీస్లో మొదటి సినిమా బాహుబలి బిగినింగ్ విడుదలై నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఇందులో శివుడి పాత్రకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేస్తూ..‘ ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహాబలి సినిమా యూనిట్ తమ సినిమాటిక్ మ్యాజిక్తో వరల్డ్ వైడ్గా తుపాన్ సృష్టించిందని పేర్కొన్నాడు. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తొలి రూ. 100 కోట్ల పైగా షేర్ సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కిక సంగతి తెలిసిందే. #6YearsOfBaahubali: Here's to the team that created waves of cinematic magic all across the country and the world 🙌🏻 - #Prabhas @ssrajamouli @Shobu_ @BaahubaliMovie #6YearsOfUnrivalledBaahubali pic.twitter.com/Ud01NKuqWK — Prabhas (@PrabhasRaju) July 10, 2021 -
ఇవి ‘బాహుబలి’ విత్తనాలు.. శివగామి, కట్టప్పవీ ఉన్నాయ్
న్యూఢిల్లీ: రైతుల కష్టార్జితం వారికి కడుపు నింపుతుందా? అన్నది ప్రకృతి చేతుల్లోనే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ప్రకృతి అనుకూలత, ఆరోగ్యకరమైన దిగుబడి, మార్కెట్లో మద్దతు ధరలు ఇవన్నీ కలిస్తేనే అన్నదాత కష్టానికి ఫలితం దక్కినట్టుగా భావించాలి. మహారాష్ట్రలో వరి, ఉల్లి రైతులు ఈ సీజన్లో బాహుబలి, కట్టప్ప, శివగామి, భీమ, దుర్గ బ్రాండ్ల విత్తనాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అకాల వర్షాలు, లాక్డౌన్లు, పెరిగిన ఖర్చుల మధ్య వారు ప్రజాదరణ పొందిన పౌరాణిక పాత్రల పేర్లతో విక్రయిస్తున్న విత్తనాలపై ఆశలు ఎక్కువగా పెట్టుకున్నారు. మహారాష్ట్రలో సాగు ఊపందుకోవడంతో ఇటువంటి బ్రాండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. పేర్లతో అనుబంధం వేరు.. పేర్లలో ఏముందిలే అనుకోవద్దు. కొనుగోళ్ల విషయంలో బ్రాండ్ల పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని.. ముఖ్యంగా కరువు, సంక్షోభ సమయాల్లో వీటికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కువని మహారాష్ట్ర విత్తన పరిశ్రమ సమాఖ్య ఈడీ ఎస్బీ వాంఖడే పేర్కొన్నారు. ‘‘నిర్ణీత పరీక్షలు, అనుమతుల తర్వాతే విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. సినిమాల్లోని పాత్రల పేర్లు, దేవతల పేర్లను పెట్టడం ద్వారా రైతుల దృష్టిని ఆకర్షించడానికి వీలుంటుంది’’అని వాంఖడే వివరించారు. సినిమాల్లో ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు అయితే ప్రజలకు పరిచయం చేయక్కర్లేదని.. దీంతో ప్రచారం కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే ఆయా పేర్లతో తేలిగ్గా చేరువ కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించడం తెలిసిందే. ఇందులోని బాహుబలి, కట్టప్ప, శివగామి పాత్రలు ఎంతో విజయవంతం అయ్యాయి. అందుకే ఈ పేర్లను విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులకు తగిలించేశాయి. వీటితోపాటు భీష్మ, అర్జున్, కరణ్ వంటి పౌరాణిక పేర్లతో ఉన్న విత్తనాలను అక్కడి రైతులు నాణ్యమైనవిగా భావిస్తుండడం గమనార్హం. వరికి సంబంధించి సోనా, నవాబ్, ఉల్లికి సంబంధించి కోహినూర్ బ్రాండ్లకూ అక్కడ మంచి ఆదరణే ఉంది. మ్యాజిక్.. పత్తి సాగు రైతులకు పెద్దగా మిగిల్చిందేమీ లేకపోయినా.. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో మ్యాజిక్, మనీ మేకర్, ఫోర్స్ పేర్లతో ఉన్న పత్తి విత్తనాలు బాగా అమ్ముడుపోతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఈ పేర్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టు కమ్యూనికేషన్ నిపుణుడు ఫ్రొఫెసర్ ఆర్ఎల్ పండిట్ పేర్కొన్నారు. ప్రజలకు చేరువ కావడమే ఈ పేర్ల వెనుక వ్యూహమని చెప్పారు. ‘‘తమ అనుభవం, నేపథ్యం, అవగాహన ఆధారంగా పేర్లతో వ్యక్తులకు అనుబంధం ఏర్పడుతుంది. ప్రజాదరణ పొందిన పాత్రల పేర్లు ప్రజల జ్ఞాపకాల్లో సులభంగా నిలిచిపోవడమే కాకుండా ఆయా పేర్లతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహిస్తుంది’’అని పండిట్ వివరించారు. అయితే, అనుభవం కలిగిన రైతులు మాత్రం నాణ్యమైన విత్తనాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. గత సీజన్లో నాణ్యతలేమి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు.. సోయాబీన్, ఉల్లి, పత్తి విత్తనాలపై ఫిర్యాదులు కూడా చేశారు. -
తెలుగు సినిమా టార్గెట్ @ ఆల్ ఇండియా
తెలుగు సినిమా టార్గెట్ మారిపోయింది. టార్గెట్ ఆల్ ఇండియా అయిపోయింది. పరభాషలకు హాయ్ చెబుతోంది. అన్ని భాషలకూ సరిపోయే కథలతో సినిమాలు తీస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తోంది. ప్రస్తుతం ‘ఆన్ సెట్’ మీద డజనుకి పైగా ప్యాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. ప్రకటించిన చిత్రాలు అరడజను పైనే ఉన్నాయి. భవిష్యత్తు అంతా ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగు పరిశ్రమ ‘ప్యాన్మయం’ కానుంది. ప్రభాస్ ‘బాహుబలి’కి ప్రేక్షకులు భళా అన్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజైన ‘బాహుబలి’ బాక్సాఫీస్ రికార్డ్స్ కూడా భళా అనిపించాయి. ఆ తర్వాత కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై, బాక్సాఫీస్ను షేక్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో వందకోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇటు తెలుగు ‘బాహుబలి’ అటు కన్నడ ‘కేజీఎఫ్’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడంతో దర్శక–నిర్మాతలు, హీరోల టార్గెట్ మారింది. సినిమాల ప్లానింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో జరగడం మొదలైంది. తెలుగులో తొలి ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత అంగీకరించిన ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ అన్నీ ప్యాన్ ఇండియన్ సినిమాలే. భవిష్యత్లో కూడా ప్రభాస్ సినిమా అంటే ఇక అది ప్యాన్ ఇండియన్ మూవీయే అన్నట్లుగా సీన్ మారింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఇక పవన్ కల్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మూవీ లైన్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం దాదాపు పధ్నాలుగు భాషల్లో విడుదల కానుంది. విదేశీ భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కానుండటం విశేషం. మరో హీరో అల్లు అర్జున్కు ఆల్రెడీ మలయాళ పరిశ్రమలో మల్లు అర్జున్ అని పేరు ఉంది. ఇలాంటి క్రేజ్నే ఇండియా లెవల్లో సంపాదించుకోవాలని అల్లు అర్జున్ ‘పుష్ప’ అవతారం ఎత్తాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అంతేకాదు.. ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. రెండో భాగం ఆరంభమైంది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ, హీరోగా ఎదిగి ‘అర్జున్రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి హిట్స్తో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయిపోయారు. యూత్లో విజయ్కు ఉన్న ఫాలో యింగ్ మరో ప్లస్. ప్యాన్ ఇండియా సినిమాల ఖాతాలో విజయ్ దేరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ కూడా ఉంది. మరో హీరో అడివి శేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు శేష్ ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసిన హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. దుష్యంతుడు–శకుంతల ప్రేమకావ్యంగా గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఓ పెద్ద హీరో, ఓ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ అనే ట్రెండ్ నడుస్తోంది. రానున్న రోజుల్లో బహు భాషా చిత్రాల నిర్మాణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా... మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రకటించిన సినిమా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కనుంది. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోయేది కూడా ప్యాన్ ఇండియా మూవీయే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కమిట్ అయినవి కూడా ప్యాన్ ఇండియన్ మూవీసే. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్లతో ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయనున్నారు జూనియర్ ఎన్టీఆర్. దర్శకుడు శంకర్తో ప్యాన్ ఇండియన్ మూవీ కమిటయ్యారు రామ్చరణ్. దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్, వంశీ పైడిపల్లితో తమిళ హీరో విజయ్ ప్యాన్ ఇండియన్ అప్పీల్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. రానాతో ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నట్లు నిర్మాతలు ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు గతంలో ప్రకటిం చారు. దర్శకులు ప్రశాంత్ నీల్, వేణు శ్రీరామ్లతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా సినిమాలు చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. వీటితో పాటు మరికొన్ని ప్యాన్ ఇండియన్ సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని రానున్నాయి. -
హీరోగా మారిన 'బాహుబలి' బాలనటుడు
'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్. నేహా పఠాన్ హీరోయిన్గా కనిపించనుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంతో పాటు కాలేజీలో కుర్రాళ్ల కథే మా సినిమా అన్నారు శివ. మా సినిమాకు సంగీత దర్శకుడు కుంచె మరో హీరో అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
వైరల్ వీడియో: బాహుబలి తేనేటీగలు
తేనేటీగలు తమ శక్తికి మించిన పని చేసి బాహుబలిని తలపించాయి. రెండు తేనేటీగలు కలిసి ఫాంటా కూల్డ్రింక్ బాటిల్ని ఓపెన్ చేశాయి. బాటిల్ మూతకి రెండు వైపులా చేరో తేనటీగ వాలి... నెమ్మదిగా మూతని తెరిచి ఫాంటాని చప్పరించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. Two bees opening a soda bottle together.. 😲 #repost pic.twitter.com/Kv8nJrwxJD — Buitengebieden (@buitengebieden_) May 26, 2021 -
'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను'
ప్రభాస్ అనగానే అందరికీ డార్లింగ్ అనే పేరే గుర్తొస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిదే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు ఆదిత్య ప్రభాస్ గురించి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ని షేర్ చేసుకున్నారు. 'బాహుబలిలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లేముందు మేకను బలిచ్చే సన్నివేశంలో...''యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది .. పెనుముప్పు తప్పదు యువరాజా" అనేది నా డైలాగ్. అయితే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరికి వచ్చి...డార్లింగ్ ఏమనుకోకు..డైలాగ్ కొంచెం మెల్లిగా చెప్పవా..నా డైలాగ్ మరిచిపోతున్నాను అని అన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని ఘటన. నిజంగా ప్రభాస్ చాలా మంచి వ్యక్తి..ఆయన లాంటి వ్యక్తిని నేను నా లైఫ్లో ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అంత స్టార్ స్టేటస్ ఉండి కూడా అందరితో ఎంతో సరదాగా కలిసిపోతారు. ప్రభాస్ క్యారవాన్ నుంచి దిగగానే అందరూ ఆయన కోసం ఎదురు చేస్తుంటారు. నిజంగానే ఆయన డార్లింగ్' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి : ప్రభాస్ అలా ఉంటాడని ఊహించలేదు : శృతీహాసన్ Rashmika Mandanna: డేటింగ్ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక -
హీరోయిన్తో ముద్దు సీన్.. తండ్రికి ఫోన్ చేసిన ప్రభాస్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ అంటే ఆరడుగుల మంచితనం..ఇదీ ప్రభాస్ను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. ప్రభాస్ ఎంతో మొహమాటస్తుడని అంటుంటారు వాళ్లు. అంతేకాకుండా కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతుంటారని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. రియల్ లైఫ్లోనే కాదు, రీల్ లైఫ్లోనూ ప్రభాస్ సిగ్గరి. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేనప్పుడు ప్రభాస్ చాలా మొహమాటపడుతుంటాడని, డైరెక్టర్ రాజమౌళి సైతం ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి సినిమా సమయంలో తనకు యాక్షన్ సీన్లు డైరెక్ట్ చేయడం కంటే ప్రభాస్తో రొమాన్స్ చేయించడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. 2003లో ఆర్తి అగర్వాల్తో కలిసి ప్రభాస్ అడవి రాముడు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ప్రభాస్.. వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడట. ముద్దు సీన్ చేయడానికి తండ్రి వద్ద నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ మేనేజర్, నటుడు ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్కు వాళ్ల నాన్న గారంటే ఎంతో గౌరవం అని, ఏ చిన్న విషయాన్నైనా ఆయన అనుమతి తీసుకునేవారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరొచ్చినా, ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్దని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. చదవండి : ప్రభాస్ లగ్జరీ కారు! ఖరీదు ఎంతంటే? ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్కే రూ.300 కోట్లు ఖర్చు! -
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు!
హైదరాబాద్ : టాలీవుడ్లో బాహుబలి విడుదల తర్వాత నాన్ బాహుబలి రికార్డులు గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటిది బాహుబలి రికార్డునే బీట్ చేస్తే…అది కూడా ఒక చిన్న సినిమా అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అండీ బాబు. ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో థియేటర్లకు అడ్డాగా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది. 2017 ఏప్రిల్లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల గ్రాస్ వరకు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్నపాత రికార్డులను చెరిపేసి తన పేరుని నమోదు చేసుకుంది. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు అధిగమించాయి. అల వైకుంఠపురములో 40.83 లక్షల గ్రాస్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సరిలేరు నీకెవ్వరు దానికి చేరువగా వచ్చి తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకొని రెండో స్థానంలో ఉంది. ఆ చిత్రం 40.76 లక్షల రూపాయిలు కొల్లగొట్టింది. ప్రస్తుతం దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలిని నాలుగో స్ధానాని వెనక్కి నెట్టింది. ఫలితంగా మూడో స్థానానికి చేరుకుంది. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా పెద్ద సినిమాలతో ధీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదని సీని పండితులు అంటున్నారు. ( చదవండి : జాతి రత్నాలు ...కురిపిస్తున్నారు కాసులు ) -
రూ.100 కోట్లు వృధా: బాహుబలి మళ్లీ తీయండన్న నెట్ఫ్లిక్స్!
భారత రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందీ అద్భుత చిత్రం. దీనికున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అటు రాజమౌళి, ఇటు ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దీన్ని వెబ్సిరీస్గా తీసుకురావాలనుకున్నారు. దీంతో బాహుబలి మొదటి భాగానికి ముందు మాహిష్మతి రాజ్యం ఎలా ఉంది? శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా తదితర అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఈ మేరకు కథ రెడీ చేయించడమే కాక 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' అనే టైటిల్ సైతం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ను భారీ స్థాయిల్ షూట్ చేశారు కూడా! కానీ ఫైనల్ కట్ చూసేసరికి అంతా చెత్తచెత్తగా వచ్చిందట. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజే కాని నెట్ఫ్లిక్స్ ఈ 9 ఎపిసోడ్లు చూసి గుడ్లు తేలిసినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్లో తీద్దామనుకున్న సిరీస్ ఇంత డొల్లగా చెత్తగా తయారైందేంటని ఆశ్చర్యపోయిందట. దీంతో ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. అంటే అప్పటివరకు ఖర్చు చేసిన రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరన్నమాటే. ఇక ఇది అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణం ఓ రకంగా తక్కువ బడ్జెట్ కూడా కారణమేనని భావించిన నెట్ఫ్లిక్స్ తాజాగా రూ.200 కోట్లు కేటాయించి మరీ ఈ వెబ్సిరీస్ను సరికొత్తగా ప్లాన్ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. దీంతో ఈ సిరీస్ బడ్జెట్ లెక్కలు మూడు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ సిరీస్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళి కూడా ఒకరు. చదవండి: ‘దృశ్యం 2’ సెట్స్లో జాయిన్ అయిన మీనా వివాదాస్పద 'బాంబే బేగమ్స్' అసలు కథేంటి..? -
చిన్నప్పటి మహేంద్ర బాహుబలిని ఇప్పుడు చూశారా..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ బాహుబలి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రెండు భాగాలు తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది. ఈ సినిమాలో బాహుబలిగా ప్రభాస్కు ఎంత పేరు వచ్చిందో, భళ్ళాదేవుడుగా రానా కూడా అదే స్థాయిలో మెప్పించారు. ఇక శివగామిగా రమ్యకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే బాహుబలి- ది బిగినింగ్లో శివగామి తన చేతిలో ఉన్న చిన్నారిని నీటిలో మునగకుండా పైకి లేపి “మహేంద్ర బాహుబలి బ్రతకాలి ” అంటూ తుది శ్వాస విడిచిన సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. చదవండి: ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి పసిబిడ్డను రెండు చేతులతో పైకి ఎత్తి పట్టుకుని ప్రవాహానికి ఎదురు వెళ్లడం. పైకి ఎత్తుకున్న రెండు చేతుల్లోని పసిబిడ్డ పోస్టర్ కూడా అప్పట్లో విపరీతంగా పాపులర్ అయింది. ఈ అద్భుతమైన ఆ దృశ్యం ప్రేక్షకుల జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ చెదిరిపోదు. అయితే ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్గా మనకు చూపించగా, ఆ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. సినిమాలో నెలల పిల్లగా చిన్నగా చూపించగా, ఇప్పుడు ఆమె చాలా పెద్దది అయ్యింది. ఇప్పుడే స్కూల్కు కూడా వెళుతోంది. యూకేజీ చదువుతోంది. ప్రస్తుతం కొందరు తన్వితో దిగిన ఫోటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చదవండి: బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్ బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli pic.twitter.com/Aj31XvG6EB — DONTHU RAMESH (@DonthuRamesh) January 27, 2021 -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్
సాక్షి, జైనూర్(ఆసిఫాబాద్): సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో జిల్లావాసులను కాసేపు గందరగోళానికి గురిచేసింది. జైనూర్ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లు ఈ వీడియో, ఫొటోలో ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇలాంటి ఇక్కట్లు తప్పడం లేదంటూ సదరు పోస్టు ఉద్దేశం. ఈ పోస్టు అనేక గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. బాహుబలి సినిమాను తలపిస్తూ పసికందును వాగు దాటిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొద్ది సేపటికే అది ఫేక్ అని తేలింది. చింతకర్రకు వాగు కష్టాలు ఉన్నా గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని గ్రామస్తులు, అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో, ఫొటో 2006లో ఆంధ్రప్రదేశ్లో జరిగినదిగా తెలుస్తోంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై తిరుపతి తెలిపారు. -
జపాన్లో తగ్గని ప్రభాస్ క్రేజ్!
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్స్టార్ ప్రభాస్.‘సాహో’ సినిమాతోనూ వసూళ్లపరంగా సత్తా చాటి తన క్రేజ్ను మరింతగా పెంచుకున్నాడు. ఈ రెండు సినిమాలకు జపాన్లో లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డార్లింగ్ నటనకు ఫిదా అయిన జపాన్వాసులు ‘బాహుబలి’తో పాటు ‘సాహో’పై కూడా కలక్షన్ల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు అక్కడ కొంతమంది ఫ్యాన్స్ మరో ముందడుగు వేసి.. ప్రభాస్ పేరిట షుగర్లెస్ మింట్ క్యాండీస్ తయారు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చారు.(దంగల్ రికార్డును బద్దలు కొట్టిన సాహో!) కాగా గతంలో చైనాలోనూ డార్లింగ్ అభిమానులు ప్రభాస్ ఫొటోతో గాజు పాత్రలు తయారు చేసి అమ్మిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రభాస్తో పాటు బాహుబలి సినిమాలోని క్యారెక్టర్ల పేర్లన్నింటితో ఫుడ్ ఐటమ్స్ను విక్రయించారు. ఇక బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డార్లింగ్ ‘సాహో’తో సందడి చేసినా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫ్యాన్స్ను ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్.. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో నటించనున్నాడు.(సీతగా మహానటి?) ఇక బాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఈ పాన్ ఇండియా స్టార్.. ‘ఆదిపురుష్’ అనే పౌరాణిక చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనువిందు చేయనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ మూడు సినిమాల బడ్జెట్ కలిపి మొత్తంగా సుమారు వెయ్యి కోట్ల వరకు ఉండవచ్చని వినికిడి. దీంతో ఎటువంటి రికార్డు సృష్టించాలన్నా తమ హీరోకి మాత్రమే సాధ్యమవుతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
బాహుబలితో ఆ ఐదింటిపై ప్రభాస్ పట్టు
రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రయాణాన్ని చెప్పుకోవాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పాల్సిందే. అప్పటివరకూ కొందరివాడైన ప్రభాస్ "బాహుబలి: ది బిగినింగ్"తో చిత్రంతో అందరివాడిగా మారిపోయాడు. వరల్డ్ వైడ్గా హిట్ కొట్టిన ఈ సినిమా అందరికన్నా ప్రభాస్కే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ కింది ఐదు అంశాలు డార్లింగ్ హీరోకు బాగా కలిసొచ్చాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. (బాహుబలికి ముందు ఆ సినిమానే!) సరిహద్దులు దాటిన ఫాలోయింగ్: బాహుబలి మొదటి పార్ట్తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా మారిపోయాడు. అతని ఫాలోయింగ్ ఖండాంతరాలను దాటింది. జపాన్, రష్యాలోనూ ప్రభాస్కు పుట్టెడు అభిమానులు పుట్టుకొచ్చారు. అతను తర్వాత నటించిన 'సాహో' తెలుగు బాక్సాఫీస్ కన్నా హిందీలోనే అధికంగా వసూళ్లు కురిపించడమే దీనికి నిదర్శనం. మేడమ్ టుస్సాడ్స్లో ప్రభాస్ విగ్రహం: ఈ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఉండాలని ఎంతోమంది నటీనటుల కల. అలాంటి గొప్ప అవకాశం ప్రభాస్ చెంతన చేరింది. బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహం ఏర్పడిన తొలి దక్షిణాది నటుడిగా అతని పేరిట రికార్డు నమోదైంది. (‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు) రాయల్ ఆల్బర్ట్ హాల్: లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో గతేడాది అక్టోబర్ 19వ తేదీన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రాన్ని స్క్రీనింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరోతోపాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, అనుష్క, రానా హాజరయ్యారు. అక్కడి మీడియా కూడా మన హీరోను కెమెరాల్లో బంధించేందుకు తెగ ఆసక్తి చూపింది. అతన్ని చూసేందుకు జపాన్ వంటి దేశాలనుంచి సైతం అభిమానులు లండన్ చేరుకోవడం విశేషం. రష్యాలో ప్రభాస్ ప్రభంజనం: రష్యాలోనూ బాహుబలి1,2 రిలీజయ్యాయి. కాకపోతే ఇవి అక్కడి టీవీ చానెల్లో ప్లే అయ్యాయి. ఈ సినిమాలు అక్కడ విశేష పాపులారిటీ దక్కించుకున్నాయి. ఇందులో అమరేంద్ర బాహుబలిగా అద్వితీయంగా నటించిన ప్రభాస్ "రష్యా ఆడియన్స్ హార్ట్" అవార్డును ఎగరేసుకుపోయాడు. బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలిచాడు. ముప్పై ఏళ్ల క్రితం.. శ్రీ 420, ఆవారా, ఆరాధన వంటి చిత్రాలతో రాజ్ కపూర్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. (‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’) హిందీలో మార్కెట్ ఉన్న దక్షిణాది హీరో: బాలీవుడ్ సెలబ్రిటీలకు దక్షిణాదిన పాపులారిటీ, ఫాలోయింగ్ సర్వసాధారణం. కానీ దక్షిణాది సెలబ్రిటీలకు మాత్రం బాలీవుడ్లో పెద్దగా ఆదరణ లేదు. ఏళ్ల తరబడి వస్తున్న ఈ నియమాన్ని ప్రభాస్ చెరిపేశాడు. హిందీలోనూ తనకంటూ మార్కెట్ను క్రియేట్ చేసుకుంటూ తన పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. దీనికి హిందీలో రిలీజైన సాహో రికార్డులే సాక్ష్యం. వసూళ్ల పరంగా తెలుగు, తమిళంలో కన్నా హిందీ వర్షన్లో సాహో 150 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. -
ప్రభాస్ సినిమాలో మరోసారి రానా!
రానా, ప్రభాస్ కలిసి నటించిన బాహుబాలి ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ తాజాగా ఒక పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ను జూలై రెండో వారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ప్రేక్షకులు ఆమోదిస్తేనే స్టార్స్ అవుతారు) ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. బాహుబలిలో భల్లాల దేవగా ప్రభాస్తో కలిసి నటించి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో గెస్ట్రోల్ చేయబోతున్నట్లు ఫిల్మ్నగర్ టాక్. అయితే కేవలం రెండు నిమిషాల పాటు మాత్రమే రానా ఈ సినిమాలో కనిపించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటించనున్నారు. యువీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా కూడా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. (రానా, రవితేజలను డైరెక్ట్ చేయబోయేది అతడే?) -
మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 11,489, తెలంగాణలో 11,364 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగానూ కోవిడ్ విజృంభణ ధాటిగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు కేసుల సంఖ్య 4.90 లక్షలకు చేరుకుంది. స్వీయ నియంత్రణ చర్యలే వైరస్ బారినపడకుండా మానవాళిని కాపాడలగలవని వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దానిలో భాగంగా భారత్లోని కొన్ని రాష్ట్రాలు, విదేశాల్లో మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఈక్రమంలో టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా తలపడే సన్నివేశాన్ని యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ సూడియో టీమ్ ఎడిట్ చేసి.. భళ్లాల దేవ, మహేంద్ర బాహుబలి మాస్కులు ధరించినట్టుగా చూపించింది. మాహిష్మతీ రాజ్యంలో కూడా మాస్కులు తప్పనిసరి అని వీడియోలో పేర్కొంది. మాస్కులు మరువొద్దని సూచించింది. ఈ వీడియోను రాజమౌళీ ట్విటర్లో షేర్ చేశాడు. అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని ఆకాక్షించారు. యునైటెడ్ సాఫ్ట్ టీమ్కు అభినందనలు తెలిపాడు. (చదవండి: ‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు) -
రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ
హైదరాబాద్: తెలుగుతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. విడుదలై దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ల వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు వారాల క్రితం బాహుబలి 2 సినిమా రష్యా టెలివిజన్లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ శుక్రవారం ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. (9న సీఎం జగన్తో సినీ పెద్దల భేటీ) 39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో(2017లో జరిగింది) బాహుబలి చిత్రాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రసంగించారు. (మహేశ్వారి పాటలు!) రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ నెమరువేసుకుంటూ తమ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ వేడుకలకు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు. ఇక గత నెల 28న బాహుబలి-2 చిత్రం రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. While presenting #Baahubali2 at the Moscow Film Festival, director @SSRajamouli explained how the movie promotes Indian values all over the world. Here is was he said. pic.twitter.com/g257hAk9K3 — Russia in India (@RusEmbIndia) June 5, 2020 -
రేపు వార్నర్ ‘మైండ్ బ్లాక్’ సర్ప్రైజ్!
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ గత కొద్దిరోజులుగా టిక్టాక్ వీడియోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరోలను అనుకరిస్తూ ఇప్పటికే చేసిన టిక్టాక్ వీడియోలు ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుట్టబొమ్మ సాంగ్, పొకిరి డైలాగ్, బాహుబలి సాంగ్కు తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు వార్నర్. తన సతీమణి, కూతురుతో చేస్తున్న వీడియోలతో టిక్టాక్లో వార్నర్ ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్కు టిక్టాక్ చేయమని వార్నర్ను అభిమానులు కోరుతున్నారు. (వార్నర్ వీడియోకు రష్మిక ఫిదా) ఇప్పటికే ఆ పాటలోని చిన్న బిట్కు టిక్టాక్ చేసిన వార్నర్, తాజాగా ఆ పాటకు సంబంధించిన పార్ట్1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు తెలిపాడు. అయితే ‘మైండ్ బ్లాక్’ సాంగ్కు టిక్టాక్ అని చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు వార్నర్. దీంతో వార్నర్ తర్వాత టిక్టాక్ ‘మైండ్ బ్లాక్’అని అభిమానులు ఫిక్సయ్యారు. ఇక ‘బాహుబలి’ చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, తన ఫోటోను జతచేస్తూ ‘మీరు మాలో ఎవర్ని ఇష్టపడుతున్నారు. మాలో ఎవరి దుస్తులు ఇష్టపడుతున్నారో చెప్పండి’అంటూ అభిమానులను వార్నర్ ప్రశించాడు. ఇక ఈ ఫోటోకు ‘దేవసేన ఎక్కడ’, ‘టాలీవుడ్లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు’, ‘ప్రభాస్ ఇండియా బాహుబలి, వార్నర్ ఆస్ట్రేలియా బాహుబలి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (ఎన్టీఆర్కు వార్నర్ స్పెషల్ విషెస్!)! View this post on Instagram If you can guess this we will release part 1 tomorrow. #dance #nochance #wife #daughter @candywarner1 250k likes 👍👍 A post shared by David Warner (@davidwarner31) on May 28, 2020 at 11:36pm PDT View this post on Instagram Who’s costume do you prefer? 😂😂 @baahubalimovie #bahubali #prabhas #funny #fun A post shared by David Warner (@davidwarner31) on May 27, 2020 at 11:16pm PDT -
‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’
హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ టిక్టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు లేక వాయిదా పడటంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ లెఫ్టాండ్ బ్యాట్స్మన్. ఈ క్రమంలో తన ఫ్యాన్స్ను అలరించాలనే ఉద్దేశంతో టిక్టాక్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ‘అల.. వైకుంటపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అనంతరం ‘పోకిరి’ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్కు టిక్టాక్ చేశాడు. సన్రైజర్స్ జెర్సీ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకొని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్తో టిక్టాక్ చేశాడు. తాజాగా వార్నర్ చేసిన మరో టిక్టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది. బాహుబలి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్ను టిక్టాక్ చేసి అందిరినీ సంభ్రమాశ్చర్యంలోకి ముంచెత్తాడు. ఇక టాలీవుడ్ అభిమానుల నుంచి వార్నర్కు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్లకు టిక్టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నా కెరీర్ను నాశనం చేశాడు.. 'ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి' -
పెళ్లిపై కామెంట్స్.. నచ్చావ్ సుబ్బరాజు
వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సుబ్బరాజు. 2003లో తెరంగేట్రం చేసిన ఈయన తొలి ఏడాదే ఖడ్గం, అమ్మనానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు నెగటీవ్ రోల్స్ చేసుకుంటూనే మరోవైపు విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. బాహుబలిలో కుమార వర్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయే పాత్ర చేశాడు. అయితే ఆయన రియల్ లైఫ్ విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్న సుబ్బరాజు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు. దీంతో అతడి పెళ్లి గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుబ్బరాజు తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదు. 25ఏళ్లు వచ్చాక అందరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండటంతో నేను కూడా అలా చేసుకోవాలి అనుకోవడం సరికాదు. జీవిత భాగస్వామికి నేను బెస్ట్ ఇవ్వగలను, ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలనని నాకు అనిపించినప్పుడ మాత్రమే పెళ్లి చేసుకుంటా’అని సుబ్బరాజు పేర్కొన్నాడు. ఇక పెళ్లిపై సుబ్బరాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఈ వ్యాఖ్యలతో మీరు ఇంకా నచ్చారు సుబ్బరాజు గారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: నిఖిల్ పెళ్లి మరోసారి వాయిదా.. రాఘవ.. నువ్వు రియల్ హీరోవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_691245605.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాహుబలి’ని బ్రేక్ చేసిన మహేశ్ చిత్రం
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ . ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా మహేశ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ‘సరిలేరు’ చిత్రం తాజాగా మరో ఘనతను అందుకుంది. ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ చిత్రం అత్యధిక టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్ (టీవీఆర్)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ‘బాహుబలి 2’రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించింది. ఇప్పటివరకు 22.70 టీవీఆర్తో బాహుబలి-2 అగ్ర స్థానంలో ఉండగా.. తాజాగా మహేశ్ సరిలేరు నీకెవ్వరు చిత్రం 23.4 టీవీఆర్ను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది. బాహుబలి తొలి పార్ట్కు 21.84 టీవీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో కూడా వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హెచ్డీ ప్రింట్ను కొంత మంది ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారు. అయినప్పటికీ ఇటీవల ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన ఈ సినిమాను ఎవరూ ఊహించన విధంగా బ్రహ్మరథం పట్టారు. దీంతో చిత్ర యూనిట్తో పాటు మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గడిచిన పదిహేనేళ్లలో ఏ తెలుగు చిత్రానికి ఈ విధంగా టీవీఆర్ రాలేదని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్స్టార్ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. చదవండి: ‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’ ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలీవుడ్ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్..
దక్షిణాది చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అని బాలీవుడ్ కండల హీరో సల్మాన్ఖాన్ పేర్కొన్నారు. ఈయన తాజాగా నటించిన చిత్రం దబాంగ్–3. దీనికి ఈయనే నిర్మాత కావడం విశేషం. మరో విశేషం ప్రభుదేవా దర్శకుడు కావడం. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన దబాంగ్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత దబాంగ్–2 చేశారు. తాజా గా దానికి మూడవ సీక్వెల్గా దబాంగ్ 3 రెడీ అయ్యింది. సోనాక్షిసిన్హా నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రకాశ్రాజ్, అర్బాస్ఖాన్, మహీగిల్ ముఖ్యపాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న దబాంగ్–3 చిత్ర ప్రమోషన్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు. ఇది హిందీతో పాటు పలు భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో చిత్ర తమిళ వెర్షన్ ప్రసారంలో భాగంగా నటుడు సల్మాన్ఖాన్, ప్రభుదేవా బుధవారం చెన్నైలో హల్చల్ చేశారు. దబాంగ్–3 చిత్ర దర్శకుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. దబాంగ్ చిత్రం సక్సెస్ తరువాత ఇప్పుడు దబాంగ్–3 చిత్రం చేసినట్లు తెలిపారు. ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయని అన్నారు. దీంతో చిత్ర యూనిట్ అంతా చాలా శ్రమించినట్లు తెలిపారు. దబాంగ్–3ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అందువల్ల ఒక్కో రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రేక్షకులను నేరుగా కలుసుకుంటున్నట్లు తెలిపారు. చిత్ర ట్రైలర్ అందరినీ అలరించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సల్మాన్ఖాన్ మాట్లాడుతూ దక్షిణాది చిత్రాలు తనకెప్పుడూ ఇష్టమేనన్నారు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్, విక్రమ్ నటించిన చిత్రాలను తాను చాలా ఇష్టపడిచూస్తానని చెప్పారు. ఇక్కడ ప్రస్తుతం హిందీ చిత్రాలకంటే కూడా బాహుబలి, కేజీఎఫ్ వంటి దక్షిణాది చిత్రాలే వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. తమిళంలో విజయ్ నటించిన పోకిరి చిత్ర హీంది రీమేక్లో తాను నటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నటించిన తెరి, తిరుపాచ్చి చిత్రాలు తనకు బాగా నచ్చినట్లు చెప్పారు. దబాంగ్–3 చిత్రం తన మనసుకు బాగా దగ్గరైన చిత్రం అని అన్నారు. ఇది దక్షిణాది చిత్రాల మాదిరిగానే ఉంటుందని, ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఎక్కువగా పనిచేసినట్లు తెలిపారు. ప్రభుదేవా మా సొత్తు అని పేర్కొన్నారు. ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విజయానికి చిహ్నంగా పేర్కొన్నారు. తన తదుపరి చిత్రానికి ఆయనే దర్శకుడని చెప్పారు. మరోసారి త్వరలోనే తమిళ ప్రేక్షకులను తాను ప్రత్యక్షంగా కలుసుకుంటానని నటుడు సల్మాన్ఖాన్ అన్నారు. -
భళా బాహుబలి
‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్కి హాజరయ్యారు. -
బాహుబలి 3 కూడా రావొచ్చు : ప్రభాస్
బెంగుళూరు: ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. రాజమౌళికి ఉత్సుకత ఉంటే బాహుబలి 3 కూడా తెరకెక్కే అవకాశం ఉందన్నాడు. సినీ చరిత్రలో బాహుబలి సృష్టించిన సంచలనం మనందరికి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ.. రాజమౌళి ఉత్సాహంగా ఉంటే బాహుబలి-3 కూడా రావొచ్చని అభిప్రాయపడ్డాడు. తాము బాహుబలి రెండు భాగాల్లో దాదాపు 60% కథను మాత్రమే పూర్తి చేశామని చెప్పాడు. రాజమౌళి మదిలో బాహుబలి సీక్వెల్-3 కూడా ఉందన్నాడు. అయితే అది కార్యరూపం దాల్చే అవకాశాల గురించి మాత్రం తనకు తెలియదన్నాడు. ఇక బాహుబలితో తన అనుబంధాన్ని పంచుకుంటూ నాలుగు సంవత్సరాలు ఆ సినిమా కోసం కేటాయించినందుకు తనకు ఏ మాత్రం బాధలేదన్నాడు. నా జీవితంలో అమరేంద్రబాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నాడు. కొన్నిసార్లు ఈ సినిమా కథలో లీనమయ్యి తనను తానే మర్చిపోయే సంఘటనలు కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు. కాగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ ఆగష్టు 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఇట్స్ షో టైమ్
డైరెక్టర్ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ ‘బాహుబలి’ టీమ్ రీ యూనియన్ ‘బాహుబలి –3’ కోసమా? అని మాత్రం అడక్కండి. ఈ విషయానికి రాజమౌళీయే సమాధానం చెప్పాలి. ఇప్పుడు మాత్రం వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది. సినిమాలో నటించిన ప్రభాస్, అనుష్క, రానా వస్తారు. షో తర్వాత రాజమౌళితో ప్రశ్నోత్త్తరాల సమయం ఉంటుంది’’ అని ఈ విషయాన్ని రాయల్ ఆల్బర్ట్ హల్ ప్రతినిధులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ‘బాహుబలి’ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. రాయల్ ఆల్బర్ట్ హాల్ విషయానికి వస్తే....1871లో క్వీన్ విక్టోరియా ఈ హాల్ను స్టార్ట్ చేశారు. బ్రిటన్కు చెందిన ముఖ్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ వేదికనే ఎక్కువగా ఉపయోగిస్తారట. వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ వేదికపై తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ హాల్ సీటింగ్ సామర్థ్యం ఎంతో తెలుసా.... 5,267. -
చాన్స్ వస్తే బాహుబలి 3లో చేస్తా
బాహుబలి లాంటి సినిమాలో నటించడం ఏ నటికైనా కల సాకారం కావడమేనని బాహుబలి 3 తీస్తే అందులో తనకు అవకాశం వస్తే ఆనందంగా చేస్తానని చెప్పింది బాలీవుడ్ నటి నిధి అగర్వాల్. ప్రముఖ టైర్ల బ్రాండ్ ఎఆర్ఎల్ టైర్స్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జీతో షాన్ సే కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాలీవుడ్లో తాను నటించిన గత 2 చిత్రాలతో పోలిస్తే త్వరలో విడుదల కానున్న ఇస్మార్ట్ శంకర్ తనకెంతో ప్రత్యేకమని ఈ సినిమా విడుదల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. తనకు అత్యంత ఇష్టమైన హాబీ ట్రావెలింగ్ అని చెప్పిన నిధి... పనిలో కాస్త విరామం చిక్కినా ఎక్కడో ఒక చోటకి టూర్ వెళ్లిపోతానని, తన ఇన్స్ట్రాగామ్ ఫాలోయర్స్ అందరికీ తన ట్రావెల్ హాబీ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుందంటూ నవ్వేసింది. -
వాళ్ళు తోపులు
-
కొత్త దర్శకుడితో?
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్లో పెరిగిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెండుసినిమాలు (సాహో, జాన్ (వర్కింగ్ టైటిల్))లు కూడా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రూపొందుతున్నాయి. ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్ కానుంది. ‘జాన్’ కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి.. ప్రభాస్ నెక్ట్స్ చిత్రం ఏంటి? అంటే... ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. తాజాగా క్రిష్ణ అనే కొత్త దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని టాక్. దర్శకుడు రాజమౌళి దగ్గర క్రిష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారట. మరి... అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హీరోతో కొత్త దర్శకుడికి సినిమా చేసే ఛాన్స్ దక్కుతుందా? వెయిట్ అండ్ సీ. -
‘అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు’
కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో పాల్గొన్న బాహుబలి త్రయం(ప్రభాస్, రానా, రాజమౌళిలు) పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి టెలికాస్ట్ అయిన కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో కరణ్ పలు ఆసక్తికర ప్రశ్నలను బాహుబలి టీమ్ ముందు ఉంచారు. ప్రభాస్, రానాల పెళ్లిపై.. ప్రభాస్, రానాల పెళ్లి ఎప్పుడని కరణ్ రాజమౌళిని ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటే.. అతడు చాలా లేజి, పెళ్లి చూపులు, వెడ్డింగ్ కార్డులు పంచడం, పెళ్లి వేడుక ఇదంతా చాలా టైమ్ తీసుకుంటుందని.. అదంతా ప్రభాస్ చేయలేడని సరదాగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ కాకుండా ఓ అమ్మాయితో మూవ్ అన్ కావచ్చుగా అని కరణ్ అడగ్గా.. ప్రభాస్ అలా చేయడని.. మ్యారేజీ చేసుకోవడానికి మాత్రం లేజిగా ఫీల్ అవుతాడని తెలిపారు. రానా ఓ స్ట్రక్చర్ ప్రకారం ముందుకు వెళ్తున్నాడని.. ఏ వయస్సులో ఏది చేయాలో అది చేస్తాడని తెలిపారు. అందులో పెళ్లి అనే అంశం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభాస్ చాలా ఫూడీ అని రాజమౌళి తెలిపారు. హైదరాబాద్లోని తన ఫామ్హౌస్లో పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేయడానికి ప్రభాస్ ఇష్టపడతారని తెలిపారు. View this post on Instagram Who do you think will get married first? #KoffeeWithKaran #KoffeeWithTeamBaahubali A post shared by Star World (@starworldindia) on Dec 23, 2018 at 8:04am PST ఫిల్మ్ స్కూల్కు వెళ్లినట్టయింది.. ఇంతటి గొప్ప చిత్రానికి పనిచేయడం ఎలా అనిపించిందని కరణ్ ప్రశ్నించగా నాలుగేళ్లు ఫిల్మ్ స్కూల్కు వెళ్లినట్టుందని రానా సరదా సమాధానమిచ్చారు. బాహుబలి షూటింగ్లోనే తమ మూడు, నాలుగు బర్త్ డేలు కూడా జరిగాయని తెలిపారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి ప్రభాస్ ఈ షోలో వెల్లడించారు. ‘ఈ సినిమా రిలీజ్ రోజు నా స్నేహితులకు ఓ విషయం చెప్పాను. సినిమా బ్లాక్బాస్టర్ రెస్పాన్స్ వస్తేనే నాకు ఫోన్ చేసి నిద్ర లేపమని, లేకుంటే వద్దని చెప్పాన’ని పేర్కొన్నారు. బాహుబలి హిందీలో తీసి ఉంటే.. అలాగే ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో బాహుబలి హిందీలో తీసి ఉంటే ఎవరిని నటీనటులుగా ఎంచుకునే వారని కరణ్ రాజమౌళిని ప్రశ్నించారు. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. అనుష్క పోషించిన దేవసేన పాత్రకు దీపికా పదుకోనె సరిపోయేదని తెలిపారు. అలాగే రానా, ప్రభాస్ క్యారెక్టర్ల విషయంలో మాత్రం ఆయన ఎవరి పేరు చెప్పలేదు. ఆ పాత్రల్లో వారిని తప్ప ఎవరిని ఊహించుకోలేనని స్పష్టం చేశారు. అనుష్కతో డేటింగ్పై.. ‘హీరో హీరోయిన్లు వరుసగా కలిసి పనిచేస్తే.. వారిద్దరికి లింక్ పెట్టేసి ప్రచారం చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే.. కావాలంటే రాజమౌళిని (సరదాగా) అడగండ’ని ప్రభాస్ తెలిపారు. -
బాహుబలి రికార్డు బద్దలు!
దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి సిరీస్లతో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్డే కలెక్షన్లు, రిలీజ్ చేసిన థియేటర్స్ ఇలా ప్రతిదాంట్లో బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. అయితే వీటన్నంటికి ఇప్పుడు చెక్ పెట్టేయడానికి శంకర్ వస్తున్నాడు. శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్గా 2.ఓ రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ విషయంలో బాహుబలి (రెండో పార్ట్ను 6,500 థియేటర్లలో రిలీజ్చేసినట్లు సమాచారం)ని క్రాస్ చేసేసిందని తెలుస్తోంది. ‘2.ఓ’ను దాదాపు 6,800 థియేటర్లలో దాదాపు పదివేల స్క్రీన్స్పై ప్రదర్శించనున్నట్లు సమాచారం. వీటిలో 7500 మంది ఇండియాలో కాగా, ఓవర్సీస్లో 2,500 తెరలపై ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు బద్దలుకావడం ఖాయమంటూ అభిమానులు సంబరపడుతున్నారు. -
వినుమా వినాయక సినిమా కోరిక
కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా కోరికలు కోరికలే.కొన్ని సినిమా కోరికలు చిత్రంగా ఉంటాయి.చూసేవాళ్లలో చోద్యం కలిగిస్తాయి. విజయానికి ‘కీ’గా మారిన సినీ కోరికలు ఇవి. చదువులు కావాలంటే ఇస్తావు. స్కూటర్ కొనిపెట్టమంటే పెడతావు. ఫలానా పొరుగమ్మ మెడలో ఉన్నట్టున్న మామిడి పిందెల గొలుసు కావాలంటే పోనీలే పాపం అని ప్రసాదిస్తావు. కొడుకును అమెరికా పంపించమంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా శాంక్షన్ చేసి శాన్ప్రాన్సిస్కో ఫ్లయిట్ ఎక్కిస్తావు. చిన్న చాక్లెట్ కావాలన్నా పెద్ద మినిస్టర్ పోస్ట్ కొట్టాలన్నా ఆ కోరికలన్నీ తీర్చల్సిన దేవుడివి తీర్చే దేవుడివి నీవే.వినాయకునివే. సిద్ధి వినాయకునివే.ప్రతి మనిషిలో కోరికలు కామన్. సినిమాల్లో కోరికలు కోరుకునే క్యారెక్టర్లూ కామన్. కాని అన్ని సినిమాలు ఒక్కలా ఉండవన్నట్టే అన్ని కోరికలూ వొక్కలా ఉండవు. ఈ సినీ వింత కోరికలు నీకు గుర్తున్నాయా స్వామీ. ఈ కోరికలే కాసులు కురిపించాయి కదా స్వామీ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే ‘చేసుకో అనో.. చేసుకోవద్దు’ అనో తండ్రి అంటాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కూడా తండ్రి ప్రకాష్రాజ్ తన కొడుకు సిద్ధార్థ ప్రేమ సంగతి విని ఆ మాటే అంటాడు.దానికి సదరు పుత్రరత్నం తిరగబడాలి. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరిన ఆర్యసమాజ్లో ఆర్భాటం లేకుండా మూడుముళ్లు వేసి ఆటో ఎక్కి అద్దె పోర్షన్కు చేరుకోవాలి.కాని కొడుకు ఒక వింత కోరిక కోరుతాడు.‘ఆ అమ్మాయిని తెచ్చి వారం రోజులు ఇంట్లో పెడతాను. నీకు నచ్చేలా చేస్తాను. ఛాన్స్ ఇవ్వు నాన్నా’ అంటాడు.ఇలాంటి కోరిక ఇంతకు ముందు నిజ జీవితంలో ఎవరూ కోరలేదు.సినిమాలోనూ కోరలేదు.అందుకనే ఈ కోరిక పండింది. బాక్సాఫీస్ బొజ్జ కలెక్షన్లతో నిండింది. అదేం చిత్రమో ప్రేమ అనేసరికి వింత వింత కోరికలే వస్తాయి. ‘మరో చరిత్ర’లో అరవ బాలు కమలహాసన్, తెలుగు స్వప్న సరిత ప్రేమించుకోలేదూ? వాళ్లు మరో మాట లేనట్టుగా పెళ్లి చేసుకుంటాము మొర్రో అంటే పెద్దలు కోరిన వింత కోరిక ఇంతకు మునుపు విన్నామా కన్నామా? ‘మీరిద్దరు సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. లవ్ లెటర్స్ రాసుకోకూడదు. ఇలా చేసిన తదుపరి కూడా మీలో ప్రేమ ఉన్నచో అప్పుడు పెళ్లి’ అంటారు. ఈ కోరిక విని అంత పెద్ద దేవుడుని నీవు కూడా కలవర పడి ఉంటావు కదూ. ఏవో పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఫలితంగా సిరిసంపదలు కోరుకుంటే వాటిని నువ్వు నెరవేరుస్తే అర్థముంది. స్ట్రయిట్ కోరికలకు స్ట్రయిట్ రిజల్ట్సు. కాని ‘లేడిస్ టైలర్’లో బట్టలు కొట్టే సుందరం కోరుకునే కోరిక ఏమిటి? ‘తొడ మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని’ కదూ. అదేం కోరిక. అట్లాంటి అమ్మాయిని ఎలాగని వెతికేదిక. సెర్చ్ వారెంట్ తీసుకొని బయలుదేరితే అరెస్టు వారెంటు వస్తుందే. చివరకి అతడికి అలాంటి అమ్మాయిని ఇవ్వకనే నువ్వు బుద్ధొచ్చేలా చేస్తావు. దారిలో పెడతావు. అంతేనా? మరుజన్మలో అతడే ‘ఆ ఒక్కటి అడక్కు’లో హస్తరేఖను నమ్ముకొని సంవత్సరం తర్వాత నేనే కింగ్ని అని విర్రవీగితే అలాంటి వెర్రి కోరికతో కలలు గంటూ కూర్చుంటే నష్టమేనని శ్రమ కంటే మించిన వరం లేదని తెలిసొచ్చేలా చేసి ట్రాక్ ఎక్కిస్తావు. సరే. ‘ఏప్రిల్ ఒకటి విడుదల’లో ఇతని గర్ల్ఫ్రెండ్ కోరిన కోరిక చాలా తమాషా. నోరు తెరిస్తే అడ్డమైన అబద్ధాలు కూసే ఇతణ్ణి దారిలో పెట్టడానికి స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి సైన్ చేయించి ‘నెల రోజులు పాటు ఒక్క అబద్ధం చెప్పకూడదని’ కోరితే ఆ కోరికలోంచి కోటి నవ్వులు పుట్టడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకోవాలిలే. అసలు ఈ వింత కోరికలు కోరే జాడ్యం మన హీరోలకు ముందు నుంచీ ఉంది. రాజ్యాభిషేకం చేస్తూ నీ కోరిక ఏమిటి నాయనా అని ‘జగదేక వీరుని కథ’లో ఎన్టీఆర్ను ముక్కామల అడిగితే ‘మీ పాద సేవ చేసుకోవడలై తండ్రీ’ అని అనకుండా అతడు గొప్పలు పోతూ ‘వెన్నెల రాత్రిలో కలువపూల పాన్పు మీద తాంబూలం సేవిస్తూ ఉంటే ఒక చెంత ఇంద్ర కుమార్తె, మరో చెంత వరుణ కన్య, కనుల ముందు నాగకన్య, ఎదుట నాట్యం చేస్తూ అగ్నికూమారి’ఇలా నలుగురు సావాసకత్తెలు కావాలనే వింత కోరిక కోరి నీ దయ వల్ల క్లయిమాక్స్ సమయానికి ‘శివశంకరీ’ పాడి సాధిస్తాడనుకో. అక్కినేని మాత్రం తక్కువ తిన్నాడా. ‘తెనాలి రామకృష్ణ’లో మీ అమ్మ కాళికాదేవి దయతలిచి ఒక గిన్నెలో పాల రూపంలో ‘జ్ఞానం’, మరో గిన్నెలో పెరుగు రూపంలో ‘ధనం’ ఇచ్చి ఏది కావాలో కోరుకో అంటే చిటికెలో రెండూ మిక్స్ కొట్టి తాగి ‘నాకు రెండూ కావాలి ఇవ్వు’ అని రెటమతం కోరిక కోరితే ఆమెకు తిక్కరేగి ‘వికటకవిగా మిగులుతావు పో’ అని శపిస్తే ఆ వికటత్వంలో నీకెంతో ఇష్టమైన హాస్యాన్ని ఆ మహా కవి పుట్టించాడు కదా స్వామీ. ఆ నవ్వులు నేటికీ తలుచుకుంటున్నాము. అందుకు నీకు ఎన్ని అహ్హహ్హలూ ఓహ్హొహ్హోలు చదివించాలో. సరే పోనీ... నిన్న మొన్న ‘బాహుబలి’లో ఏమైంది. ‘నేను ప్రేమించిన దేవసేనను నాకే ఇవ్వు రాజమాతా’ అని శివగామి విఎఫ్ఎక్స్ ఎలివేటెడ్ కళ్లలోకి బాహుబలి సూటిగా చూస్తూ కోరితే ఆమె ఏమి కోరింది.‘నీకు రాచపదవి కావాలా? ఆ దేవసేన కావాలా తేల్చుకో’ అని ఎదురు కోరింది. కోరికకు కోరికే సమాధానం అయినప్పుడు బాహుబలి దేవసేన చిటికెన వేలినే చటుక్కున పట్టుకున్నాడు రాజ్యం పోతుందన్న చీకూ చింత చీమంతైనా లేకుండా. అందుకే సాహోరే బాహుబలి అనిపించుకున్నాడు. ఇలాంటి సీరియస్ కోరికలే కాకుండా గిలిగింతలు పెట్టే సిల్లీ కోరికలు కూడా ఉంటాయనుకో. ‘పడమటి సంధ్యారాగం’ సినిమా గుర్తుందిగా. అందులో ఐస్క్రీమ్ పార్లర్ ఆసామికి పుట్టిన బకాసురుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దొరికే అన్ని ఆహార పదార్థాల మీదా దాడి చేసి గుటకాయ స్వాహా చేస్తుంటే ఆ తండ్రి కోరే కోరిక ఏమిటో తెలుసా? ‘కులాసా అని ఎవరైనా అడిగితే కులాసే. అంటే కుమారుడి వల్ల లాసు’ అని జవాబు చెప్పే పరిస్థితి కల్పించవద్దని. ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి కోరిక కూడా చిన్నదే. ‘నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా’ అని వ్రాసే ఆమె యొక్క కవితా ఖండికల్ని అచ్చులో చూసుకోవాలనేగా.‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అలీ కోరిక కూడా చిన్నది. ‘ఎంద పరంద ఇన్న చేటా’ అంటూ అతడు బ్యాంకు మేనేజర్ బ్రహ్మానందం చుట్టూ తిరిగి అర్థం కాని భాషలో కోరే కోరిక ఒక్కటే –‘చేటల వ్యాపారం చేసుకుంటాను. లోను ఇమ్మని’.స్వామీ. సినిమాల్లో ఎన్నో కోరికలు చూశాము.ఆ కోరికలు తీరుతుంటే సంతోషపడ్డాము.కాని కొన్ని కోరికలు మాత్రం నువ్వు తీర్చనందుకు కొంచెం నిష్టూరం కూడా ఉంది. ‘అంతులేని కథ’లో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకున్న జయప్రద కోరిక నువ్వు తీర్చలేదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ఢిల్లీలో డాన్స్ చేయాలన్న కమలహాసన్ కోరికను ‘సాగర సంగమం’లో నువ్వు తీర్చలేదు. భర్త చనిపోయాక పిల్లలను తానుగా చూసుకుందామనుకున్న మాధవి కోరికను ‘మాతృదేవోభవ’లో నువ్వు తీర్చలేదు. అన్న ఆది పినిశెట్టిని నాయకుడిగా చూసుకోవాలనుకున్న తమ్ముడు రామ్చరణ్ కోరికను ‘రంగస్థలం’లో నువ్వు తీర్చలేదు. లేటెస్టుగా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ముప్పై అడుగుల నీ బొమ్మను తయారు చేసి మార్కులు కొట్టేయాలనుకున్న నత్తి రామ్మూర్తి కోరికను నువ్వు తీర్చలేదు. ఇక మీదట సినిమాల్లో ఏ కోరికకూ విఘ్నం కలిగించవద్దు. అవిఘ్నంగా సినిమా కోరికలన్నీ తీరే వరం ప్రసాదించు స్వామీ. -
తెర మీదకు ‘బాహుబలి 3’..వైరల్!
-
అనుకున్నవన్నీ జరగవు
సాక్షి, సినిమా: అనుకున్నవి జరగవు, ఊహించనివి జరుగుతాయి ఇది జీవితానికే కాదు, సినీరంగానికి వర్తిస్తుంది అంటోంది మిల్కీబ్యూటి తమన్న. ఈమె సినీ జీవితం బాహుబలికి ముందు, ఆ తరువాత అన్నట్లుగా విభజించవచ్చు. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇంకో విషయం ఏమిటంటే ఆమె ఉదయనిధి స్టాలిన్తో నటించిన కన్నె కలమానే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా, విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆ చిత్రం మినహా చేతిలో మరో చిత్రం లేదు. ఈ సందర్భంగా తమన్న ఏమంటుందో చూద్దాం. ‘‘నేను సినీరంగప్రవేశం చేసి 12 ఏళ్లు అయ్యింది. ఆరంభంలో సినిమా గురించి పెద్దగా అర్థం కాకపోయినా ఇప్పుడు చాలా అనుభవం పొందా. చిత్ర పరిశ్రమ గురించి అర్థం అయ్యింది. ఇంకా చెప్పాలంటే నా నిజజీవితానికి, సినీ జీవితానికి అనుబంధం ఉందనిపిస్తోంది. ఆదిలో వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించి నటించాను. అందులో కొన్ని చిత్రాలు అనూహ్యంగా విజయం సాధించి నా కెరీర్కు ఉపయోగ పడ్డాయి. బాహుబలి చిత్రం తరువాతే ఉత్తమ నటి అనిపించుకున్నాను. అంతకు ముందు హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడా నాకు గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం బాహుబలినే. హిందీలో డబ్బింగ్ చేసిన బాహుబలి చిత్రం అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఓ చిత్రంలో నటిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందీ? విజయం సాధిస్తుందా. అపజయం చెందుతుందా? అన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి చిత్రాన్ని ముఖ్యంగానే భావించి నటిస్తాం. కొన్ని చిత్రాలే సంతృప్తిని కలిగిస్తాయి. కొన్ని చిత్రాలు విజయం సాధిస్తాయని భావించినా ప్లాప్ అవుతుంటాయి. నిజం చెప్పాలంటే కొన్ని చిత్రాల్లో ఎలాంటి నమ్మకం లేకుండా నటిస్తాం. అవి అనుకోకుండా సక్సెస్ అవుతుంటాయి. ఇక్కడ ఊహించినవి జరగవు, అనుకోనివీ జరుగుతుంటాయి. సినిమా పేరు, డబ్బు అన్నీ ఇస్తుంది. అద్భుత చిత్రాలు ఎప్పుడు వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. అనూహ్యంగా వస్తాయి. ఉన్నత స్థాయిలో కూర్చోబెడతాయి’’ అని తమన్న పేర్కొంది. -
నిజమేనా?
ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ‘పద్మావత్’ సినిమా నటీనటుల ఎంపిక జరుగుతున్న రోజులవి. ఆల్రెడీ ‘పద్మావత్’ సినిమాలో రాణి పద్మావతి పాత్రకు దీపికా పదుకోన్ని ఎంపిక చేశారు. ఖిల్జీ పాత్రకు రణ్వీర్సింగ్ని అనుకుంటున్నారు. పద్మావతి భర్త రాజా రతన్ సింగ్ రావల్ పాత్రకు ఎవరైతే బాగుంటుందా అని చిత్రదర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఆలోచిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ‘‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని మహేంద్ర బాహుబలి... అదే మన ప్రభాస్ గుర్తొచ్చారట. వెంటనే.. ఆయన ప్రభాస్కు ‘పద్మావత్’ కథ చెప్పారట. ఆ సమయానికి ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా రిలీజై మంచి ఊపు మీద ఉన్న ప్రభాస్ రతన్ సింగ్ పాత్రకు ‘నో’ చెప్పేశారట. ‘‘బాహుబలి ఫస్ట్ పార్ట్తో మంచి పాపులారిటీ వచ్చింది. ‘పద్మావత్’ సినిమాలో రతన్ సింగ్ది హీరో పాత్ర కాదు. ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. ఇంకా ‘బాహుబలి–2’ రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ ఈ పాత్ర చేసి, బాక్సాఫీస్ వద్ద ‘పద్మావత్’ సక్సెస్ కాకపోతే ఆ ఎఫెక్ట్ ‘బాహుబలి –2’ మీద పడే అవకాశం ఉంది. ఐదేళ్ల కష్టం వృ«థా అవుతుంది’’... ఇలా ఆలోచించి ‘పద్మావత్’కి ప్రభాస్ నహీ అన్నారని బాలీవుడ్లో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. యంగ్ రెబల్స్టార్ వద్దనడంతో ఆ పాత్ర షాహిద్ కపూర్కు వెళ్లింది. మరి... ఈ కథనాల్లో ఎంత వరకు వాస్తవం ఉందన్నది ‘పద్మావత్’ టీమ్ అయినా చెప్పాలి లేదా ప్రభాస్ అయినా చెప్పాలి. -
ఇకపై అన్నిటికీ ఓకే చెప్పను..
తమిళసినిమా: నటి తమన్నా భాటియా. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో ప్రముఖ కథానాయకిగా రాణిస్తోంది. నాజూకైన నడుము, పాలవన్నె శరీరం, ఆకర్షణీయమైన నగుమోము ఈ అమ్మడికే సొంతం. మొదట్లో హిందీ చిత్రంతో రంగప్రవేశం చేసినా, ఆపై దక్షిణాదికే పరిమితమైంది. 2005లో శ్రీ చిత్రంతో టాలీవుడ్కు దిగుమతి అయిన తమన్నా కోలీవుడ్లో కేడీ చిత్రంతో దూసుకొచ్చింది. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఆశించిన సక్సెస్ను అందించకపోయినా, తమిళంలో కల్లూరి చిత్రం పేరును, తెలుగులో హ్యాపీడేస్ చిత్రం విజయాన్ని అందించాయి. ఆ తరువాత అమ్మడికి ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. బాలీవుడ్లో కలిసి రాకపోయినా, తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరునే తెచ్చుకుంది. మొదట్లో తన అందానే నమ్ముకుని కమర్శియల్ చిత్రాల్లో నటించి గ్లామరస్ కథానాయకిగా గుర్తింపు పొందినా, బాహుబలి చిత్రంలో అవంతికగా నటిగా తానేమిటో నిరూపించుకుంది. అలా వచ్చిన అవకాశాలన్నీ ఎడాపెడా ఒప్పేసుకుని నటించేస్తున్న ఈ బ్యూటీకి ఇటీవల స్పీడ్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్లో గత ఏడాది స్కెచ్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్తో నటిస్తున్న కన్నే కలైమానే చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తోంది. కల్యాణ్ రామ్తో నటించిన నా నువ్వే గురువారం తెరపైకి రానుంది.ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి చిత్రంలో గెస్ట్ రోల్లో మెరవనుంది. సో మొత్తం మీద ఈ మిల్కీబ్యూటీకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. తమన్నా జోరు తగ్గిందా? అన్న ప్రశ్నకు ఆమె మాత్రం అంగీకరించడంలేదు. తమన్నా ఏమంటుందో చూద్దాం. కొందరు అనుకుంటున్నట్లు నాకు అవకాశాలు తగ్గలేదు. నా జోరు తగ్గలేదు. అవకాశాలు తగ్గలేదు. నేను 13 ఏళ్లుగా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా నటిస్తున్నానని చెప్పింది. కొంచెం విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అందుకే ఇకపై వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా, నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించాలని నిర్ణయించుకున్నానంది. -
ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం
తమిళసినిమా: ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యమే నంటోంది నటి అనుష్క. ఇప్పుడు అగ్రనటి అనే పదానికి అడ్రస్ అనుష్క. టాలీవుడ్, కోలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ అవకాశాలు వచ్చినా, దక్షిణాది సినిమానే చాలు, ఇక్కడే సంతృప్తిగా ఉందంటూ హిందీ చిత్రాలపై ఆసక్తి చూపని అనుష్క ఈ రెండు భాషల్లోనూ స్త్రీ ప్రధాన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిందనే చెప్పాలి. అరుంధతి చిత్రం అందలం ఎక్కించడంతో బాహుబలి, భాగమతి వంటి చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారింది. అలాంటి అనుష్క తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అలాంటి తీయని వార్త గురించి ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పలు అవకాశాలు తలుపు తడుతున్నా, సరైన కథా పాత్ర కోసం ఎదురు చూస్తున్నానంటున్న అనుష్క తాను 13 ఏళ్లుగా కథానాయకిగా రాణిస్తునందుకు కారణం అభిమానులేనంటోంది. దీని గురించి ఈ స్వీటీ ఒక భేటీలో పేర్కొంటూ నటీనటులు సినిమా అవకాశాలను దక్కించుకున్నా, ప్రతిభను చాటుకున్నా అభిమానుల ఆదరణ లభిస్తేనే గౌరవం దక్కుతుందని అని పేర్కొంది. వారికి నచ్చకపోతే ఎంత కష్టపడి నటించినా ఫలితం శూన్యం అని అంది. తనకు అభిమానుల ఆదరణ చాలానే ఉందని చెప్పింది. అరుంధతి, బాహుబలి, భాగమతి చిత్రాల తరువాత ప్రతిభావంతమైన నటి అని ప్రశంసిస్తున్నారంది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించగలిగే నటి అని కీర్తిస్తున్నారని అంది. అలా తనకు నటిగా మంచి స్థాయిని అందించారని చెప్పింది. అయితే ముందు తరంలో 30, 40 ఏళ్ల పాటు కథానాయికలను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగానూ, గర్వంగా ఉందని అంది. ఇప్పటి సౌకర్యాలు అప్పటి కథానాయికలకు లేవని, వాళంతా కష్టపడి ప్రతిభను చాటుకుని రాణించారని పేర్కొంది. అలాంటి వారితో పోల్చుకుంటే తాను, ఇతర నటీనటులు సాధారణమైన వాళ్లం అని అంది. తాము పడే కష్టం కూడా తక్కువేనని, ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని నటి అనుష్క పేర్కొంది. -
ఆ దర్శకుడికి ‘నో’ చెప్పిన బాహుబలి
దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తర్వాత హీరో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ నుంచి కూడా ఈ హీరోకు అవకాశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహర్, ప్రభాస్తో ఒక సినిమా తీయాలని భావించాడు. ప్రభాస్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి. కరణ్ సినిమాలో నటించడానికి గాను ప్రభాస్ అక్షరాల ‘20కోట్ల’ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టుగా అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్కు తెలుగు పరిశ్రమలో ఉన్న క్రేజ్తో ఆయన అంత పారితోషికాన్ని డిమాండ్ చేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ బాలీవుడ్లో మొదటి సినిమాకే అంత పారితోషికాన్ని ఇంతవరకూ ఏ నటుడు అందుకోలేదు. దాంతో కరణ్ జోహర్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. తాజాగా మరోసారి ప్రభాస్తో సినిమా తీయాలని ముందుకొచ్చాడు కరణ్ జోహర్. ఈ సారి కూడా ఈ దర్శకుడికి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్తో బిజిగా ఉన్నాడు. ఆ తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని మరో సినిమా అంగీకరించ కూడాదని భావిస్తున్నాడు ప్రభాస్. అందువల్లే మరోసారి కరణ్కు నో చెప్పాడు. -
వెనకపడ్డ మాట నిజమే!
తమిళసినిమా: నేను వెనకపడ్డ మాట నిజమేనని నటి తమన్నా అంగీకరించారు. తమన్నా భాటియా ఈ పేరు ఒకప్పుడు గ్లామర్కు అడ్రస్. ఇప్పుడు అభినయానికి అడ్డా. తమన్నా వయసు 28 ఏళ్లు అయితే అందులో సగంపైనే ఆమె నట వయసు. ఇప్పటికీ అగ్రకథానాయకిగా రాణిస్తున్నారు. ఇది అరుదైన విషయమే. మధ్యలో ఈ ముద్దుగుమ్మ మార్కెట్ కాస్త తడబడినా మళ్లీ నిలదొక్కుకుని స్టార్ హీరోల నుంచి వర్థమాన హీరోల వరకూ నటించేస్తున్నారు. ఈ మిల్కీబ్యూటీలో నటితో పాటు మంచి డాన్సర్ ఉన్నారు. ఈమె కచ్చితమైన కొలతల మేనందాలకు ఇదీ ఇక కారణంగా భావించవచ్చు. బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో తమన్నా నటనను మరువలేం. తన నట జీవితంలోనూ ఎత్తుపల్లాలను చవిచూసిన తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళంలో భాషల్లో చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా తన దశాబ్దన్నర నట జీవితాన్ని ఒక్కసారి నెమరువేసుకున్నారు. ఆ సంగతులేంటో చూసేస్తేపోలా! నేను సినిమాలోకి రంగప్రవేశం చేసి 15 ఏళ్లు అయ్యిందని ఎవరైనా చెబితేనే గుర్తుకొస్తుంది. అంతగా కాలం పరుగులు పెడుతోంది. 2005లో నేను నటించిన తొలి తెలుగు చిత్రం విడుదలైంది. అప్పుటి నుంచి ఇప్పటి వరకూ కథానాయకిగా కొనసాగుతుండడం సంతోషంగానూ, మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. అన్నీ చిత్రాలు ఏదో రకంగా పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాకు దక్షిణాది సినిమానే అధికంగా ఆదరించింది. ఇంకా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో కొద్ది కాలమే కథానాయకిగా రాణించడం సాధ్యం. ఆ తరువాత పక్కన పెట్టేస్తారు. అలాంటిది నటి సౌందర్య తరువాత అనుష్క, కాజల్అగర్వాల్, నేను ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగడం సంతోషకరమైన విషయం. విశ్రాంతి లేకుండా నటిస్తూనే ఉన్నాను. మంచి విభిన్న కథలు, నా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలనే అంగీకరిస్తున్నాను. తెలుగులో సక్సెస్లు లేని కాలంలో తమిళంలో సురా, తిల్లాలంగడి, చిరుతై, వీరం వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే సీనియర్ నటులతోనూ, వర్థమాన నటులతోనూ నటించడం వల్లే నాకు అవకాశాలు తగ్గాయా అన్న ప్రశ్న తలెత్తినా, ఆ వెనుకబడడం అన్నది తాత్కాలికమే. -
రేస్ బైక్.. భలే కిక్
రయ్.. రయ్మంటూ బండి ఎక్స్లేటర్ విపరీతంగా రైజ్ చేస్తున్నారు ప్రభాస్. స్పీడోమీటర్లో స్పీడ్ లిమిట్ కూడా పట్టించుకోవట్లేదట. విశాలమైన దుబాయ్ రోడ్స్ పై రేసులో దూసుకెళ్లడానికా? కాదు. మరి ఎందుకీ స్పీడు? అంటే.. విలన్స్ని క్యాచ్ చేయాలంటే ఆ మాత్రం స్పీడు కావాల్సిందే కదా. ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన భారీ చేజ్ సీక్వెన్స్ను దుబాయ్లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చేజ్ సీక్వెన్స్లో రేస్ బైక్పై ఉన్న ప్రభాస్ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ ఇరవై నిమిషాల చేజ్ సీన్స్ కోసం చిత్రబృందం సుమారు 20కోట్లు ఖర్చుపెడుతోందట. ఈ సీన్స్ను దాదాపు యాభై రోజులు షూట్ చేయనున్నారు. ఈ రేస్ బైక్తో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు ఫీస్ట్లా, కిక్ ఇచ్చేలా ఉండేలా ప్లాన్ చేశారట చిత్రదర్శకుడు సుజిత్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్లో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంగీతం: శంకర్–ఎహసాన్–లాయ్, కెమెరా: మది. -
మొదట్లో అలానే ఉండేదాన్ని
తమిళసినిమా: ముందు అనుసరించినా, తరువాత మారానని అన్నారు నటి అనుష్క. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఆమెకు ఆమే సాటి. రుద్రమదేవి, బాహుబలి, నమో వేంకటేశాయ చిత్రాలే ఇందుకు సాక్షి. ఇక అరుంధతి, భాగమతిలోనూ విశ్వరూపం చూపించారు. అలాంటిది భాగమతి తరువాత ఆమె తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దర్శకుడు గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించానని ఇంతకు ముందొకసారి చెప్పారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదుగాని, తాజాగా ఒక చిత్రంలో నటించే విషయమై కథను వింటున్నారట. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ స్వీటీ దాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వపు అందాలను తెచ్చుకునే ప్రయత్నంలో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించేది సినిమాల్లోనేననీ, నిజ జీవితంలో తనకు నచ్చినట్లు నడుచుకుంటానని చెప్పారు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకటిగా చూడనని చెప్పారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఇకపై బహిరంగ కార్యక్రమాలకు కూడా మేకప్ వేసుకుని మంచి మోడరన్ దుస్తులు ధరించి వెళ్లాలని సలహాలిచ్చారన్నారు. వారి సూచనలను కొంత కాలం అనుసరించినా, ఆ తరువాత మారిపోయానని చెప్పారు. తనకు నచ్చినట్టు ఉండడం సౌకర్యంగా ఉంటుందన్నారు. చిత్రం సక్సెస్ అయితే ప్రతిభావంతులు, ఫ్లాప్ అయితే ప్రతిభ లేదని అనడం కరెక్ట్ కాదని అనుష్క పేర్కొన్నారు. -
ఐపీఎల్: బాహుబలి ఇన్నింగ్స్కు రాజమౌళి ఫిదా!
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో తెలుగు బ్యాట్స్మన్ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. సొంత గడ్డపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసి.. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. మొదట్లో పరుగులు రావడం కష్టంగా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన రాయుడు తొలుత ఆచితూచి ఆడుతూ.. మెళ్లిగా పరుగుల వేగాన్ని పెంచాడు. రైనాకు జోడీగా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. రషీద్ ఖాన్ వేసిన 12 ఓవర్లో సురేశ్ రైనా వరుస రెండు సిక్సులు బాది బ్యాటింగ్ జోరును పెంచాడు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద అంబటి రాయుడు పరుగుకు ప్రయత్నించి రనౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అంబటి, రైనా (54 నాటౌట్;43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అద్భుతంగా ఆడటంతో లోకల్ హైదరాబాద్ సన్రైజర్స్ జట్టుకు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై నిర్దేశించింది. చెన్నై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసి కీలకంగా వ్యవహరించిన బ్యాట్స్మన్ అంబటి రాయుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అంబటి ఆటను చెన్నై సూపర్కింగ్స్ జట్టు తన ట్విటర్ పేజీలో బాహుబలి ఇన్నింగ్స్ అంటూ ప్రశంసించింది. విజిల్ పోడు అంటూ అంబటి ఇన్నింగ్స్పై తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంబటి ఇన్నింగ్స్కు ‘బాహుబలి’ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఫిదా అయ్యారంటూ..అభిమానులు ఆయన ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, చెన్నై మ్యాచ్కు దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. అంబటి ఇన్నింగ్స్ను ఆస్వాదించిన ఆయన.. అంబటి అర్ధసెంచరీకి లేచినిలబడి చప్పుట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. -
రాయుడు విజిల్ పోడు ఇన్నింగ్స్కు రాజమౌళి అభినందనలు
-
కరణ్కి కుచ్ కుచ్ హోతా హై
‘కుచ్ కుచ్ హోతా హై’.. ఇది కరణ్ జోహార్ డైరెక్టర్ చేసిన తొలి మూవీ. ఆ సినిమా చాలామంది మనసుల్లో ఏదో ఏదో జరిగేలా చేసింది. తీయని అనుభూతిని మిగిల్చింది. ఇప్పుడు కరణ్ జోహర్ మనసులో కూడా కుచ్ కుచ్ హోతా హై. ఎందుకంటే.. డైరెక్టర్ కమ్ రైటర్గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కరణ్ తర్వాత డైరెక్టర్గా బీటౌన్లో సక్సెస్ అయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్పై ఎన్నో బిగ్గెస్ట్ మూవీస్ను నిర్మించడమే కాదు సూపర్హిట్స్ అందుకున్నారు. దర్శక–నిర్మాతగా కరణ్ జోహార్కి ఉన్న సక్సెస్ఫుల్ ట్రాక్ ఆయన్ను మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్ వరకూ తీసుకెళ్లింది. లండన్ మేడమ్ తుస్సాడ్స్లో కొన్ని రోజుల్లో ఆయన మైనపు బొమ్మ దర్శనమివ్వనుంది. ఈ విషయాన్ని కరణ్ సోషల్మీడియా ద్వారా షేర్ చేశారు ‘‘మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ ఫిల్మ్ మేకర్ని నేనే కావడం ఆనందంగా ఉంది. నా బొమ్మ తయారీ కోసం కొలతలు తీసుకున్నారు. నా విగ్రహం కోసం వర్క్ చేస్తున్న లండన్ టీమ్కి థ్యాంక్స్’’ అన్నారు కరణ్ జోహార్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
బాహుబలి భామ డ్యాన్స్ వీడియో వైరల్
-
పాపులార్టీకి.. ప్రయోగానికి పట్టం
తెలుగు చిత్రసీమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రం ‘బాహుబలి’. 63వ జాతీయ అవార్డుల్లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’, ‘స్పెషల్ ఎఫెక్ట్స్’ విభాగంలో అవార్డులు దక్కించుకుంది. 65వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి–2’ మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ పాపులర్ ఫిల్మ్’గా జాతీయ అవార్డు దక్కించింది. అంతేకాదు.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్కి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్కి కూడా జాతీయ అవార్డులు దక్కాయి. మరో తెలుగు సినిమా ‘ఘాజీ’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుకి ఎంపికైంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఇక.. ఇతర భాషల విషయానికొస్తే అస్సామీ ఫిల్మ్ ‘విలేజ్ రాక్స్టార్స్’ ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు దక్కించుకుంది. దివంగత నటుడు వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఇతర అవార్డు విజేతల వివరాలు, అవార్డు దక్కించుకున్న పలువురి ప్రముఖుల స్పందన ఈ విధంగా... విలేజ్ రాక్స్టార్స్ 65వ జాతీయ అవార్డులు అస్సామ్వారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే గడచిన 29 ఏళ్లల్లో అస్సామ్కి జాతీయ అవార్డు అందని ద్రాక్షే అయింది. ఈసారి ఏకంగా ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డుని దక్కించుకుంది ఓ అస్సామీ ఫిల్మ్. పేరు ‘విలేజ్ రాక్స్టార్స్’. కథ చాలా చిన్నది. ‘జెన్యూన్ మూవీ’. అందుకే అవార్డు దక్కించుకుంది. 29 ఏళ్ల నుంచి నేషనల్ అవార్డు లేని లోటుని తీర్చిన సినిమా ‘విలేజ్ రాక్స్టార్స్. చివరిగా ఒక అస్సామీ సినిమా నేషనల్ అవార్డ్ అందుకున్నది 1987లో. జానూ బరువా తెరకెక్కించిన ‘హలోదియా చొరయా బావోధాన్ కాయ్’కు అప్పట్లో అవార్డు దక్కింది.అది కూడా ప్రాంతీయ చిత్రం విభాగంలో. 29 ఏళ్ల తర్వాత ఏకంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కడం విశేషం. ‘విలేజ్ రాక్స్టార్స్’ దర్శకురాలు ‘రిమా దాస్’ సెల్ఫ్మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ చిత్రాన్ని గౌహతిలోని తన స్వగ్రామం చాయగన్లోనే కేవలం హ్యాండీ కెమెరాతో దాదాపు 150 రోజులు తెరకెక్కించడం విశేషం. సినిమా కథ చాలా సింపుల్ లైన్స్లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్స్ బుక్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను నాశానం చేస్తాయి. అప్పుడు దునుకి తన ప్రియారిటీ ఏంటో చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలివిగా దును ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బనితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్స్టార్స్, మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలోనే కాకుండా ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం. 65వ జాతీయ అవార్డుల ఎంపికలో బెస్ట్ పాపులర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ విభాగంలో మా ‘బాహుబలి 2’ సెలెక్ట్ అయినందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మా టీమ్ వర్క్ని గుర్తించి ఇదే చిత్రానికి యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు ప్రకటించినందుకు కమిటీకి ధన్యవాదాలు. బెస్ట్ రీజినల్ తెలుగు ఫిల్మ్గా సెలెక్ట్ అయిన ‘ఘాజీ’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. – రాజమౌళి టీమ్ వర్క్ని గుర్తించి ‘బాహుబలి–2’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్కు కృతజ్ఞతలు. తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ‘ఘాజీ’ చిత్రబృందం రానా, సంకల్ప్రెడ్డి తదితరులకు శుభాకాంక్షలు. జాతీయ అవార్డులు గెలుచుకున్న అందరికీ... ముఖ్యంగా అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్స్టార్స్’కి శుభాకాంక్షలు. – ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ శ్రీదేవిగారు అందరికీ ఓ తీయని జ్ఞాపకం – రవి ఉడ్యవర్ ► ‘మామ్’ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్గా శ్రీదేవికి అవార్డు రావాటం డైరెక్టర్గా మీకెలా అనిపిస్తోంది? మిక్స్ ఫీలింగ్స్. నా ఫస్ట్ సినిమాకే శ్రీదేవిగారికి నేషనల్ అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ని సెలెబ్రేట్ చేసుకోవటానికి ఆమె మన మధ్య లేరని బాధగా ఉంది. ఆమె కూడా మనతో ఉండి ఈ అవార్డును సెలబ్రేట్ చేసుకుంటే బావుండు అనే చిన్న బాధ లోపల ఉంది. ఆమె ఫిజికల్గా మనతో లేకపోయినా మన మదిలో ఎప్పుడూ ఓ తీయని జ్ఞాపకంలా ఉంటారు. ► మామ్ మీకు ఫస్ట్ మూవీ, శ్రీదేవిగారికి 300వ సినిమా? ఆమె ఈ కథను అంగీకరిస్తారని అనుకున్నారా? ఈ కథ సిద్ధం చేసుకున్నాక బోనీగారు ఒకసారి శ్రీకి కలిసి చెప్పు అన్నారు. కొంచెం భయంగానే ఉన్నా శ్రీదేవి గారు వద్దూ అనకూడదు అనేలాగా స్క్రిప్ట్ తీసుకువెళ్లాను. న్యారేషన్ అయ్యాక శ్రీదేవిగారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఇది ఛాలెంజింగ్ ఫిల్మ్, నేను చేస్తున్నాను అన్నారు. నా బెస్ట్ మూమెంట్స్లో అదొకటి. ► ఏదైనా సీన్లో శ్రీదేవిగారు కచ్చితంగా రెండు మూడు రీటేక్స్ తీసుకుంటారని మీరు అనుకొని ఆమె సింగిల్ టేక్లో చేసిన సీన్స్ ఉన్నాయా? సినిమాలో ఒక హాస్పిటల్ సన్నివేశం ఉంటుంది. చాలా ఎమోషనల్ సీన్ అది. ఆ సీన్కు రెండు మూడు టేక్స్ తీసుకుంటారనుకున్నాను. జస్ట్ సింగిల్ టేక్లో చేసేశారు శ్రీదేవి గారు. ► మీ ఫస్ట్ సినిమానే శ్రీదేవిగారి ఆఖరి సినిమా అవ్వడం పట్ల మీ ఫీలింగ్? నేను అలా ఆలోచించొద్దని డెసైడ్ అయ్యాను. ఈ సినిమా తర్వాత శ్రీదేవి గారు ఇంకా మంచి సినిమాలు చేస్తారనుకున్నాను. ఫ్రెష్ స్టార్ట్ నా సినిమా ద్వారా అవుతుందని ఆనంద పడ్డాను. ఎప్పటికీ ఆ ఆలోచనతోనే ఉంటాను. ► జాన్వీ, ఖుషీ వాళ్ల మామ్ను ‘మామ్’లో చూసుకున్నాక ఎలా ఫీల్ అయ్యారు? ఖుషీ సినిమా చూసినప్పుడు నేను పక్కన లేను, కానీ జాన్వీ చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. ► ఇప్పుడు జాన్వీ కూడా డెబ్యూ చేస్తున్నారు. తన గురించి ఏమైనా ? షీ విల్ బీ అమేజింగ్. శ్రీదేవిగారిలాగే తను కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవిగారికి సాంబార్ అన్నం అంటే ఇష్టం – కోన వెంకట్ ► ‘మామ్’ ఒప్పుకున్నప్పుడు శ్రీదేవిగారు మీతో ఏమన్నారు? ‘ఇంగ్లిష్–వింగ్లిష్’ తర్వా త ఆమె ఎన్నో కథలు విన్నా ఏదీ ఒప్పుకోలేదు. ‘చేస్తే మంచి సినిమా చేయాలి, నా పిల్లలు గర్వపడేలా ఆ సినిమా ఉండాలనుకుంటున్నాను’ అని కథ చెప్పడానికి వెళ్లినప్పుడు అన్నారు. ‘మామ్’ కథ విన్న వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని కథలు కొంతమంది ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళతాయి. అలా ‘మామ్’ శ్రీదేవిగారిని వెతుక్కుంటూ వెళ్లింది. ► అంటే..? నాలుగేళ్ల క్రితం నేను న్యూయార్క్ వెళ్లినప్పుడు శ్రీదేవిగారి ఫ్యామిలీ అక్కడ ఉంది. అక్కడ అనుకోకుండా ఆ ఫ్యామిలీని కలిశాను. వాళ్లు తాము ఉంటున్న అపార్ట్మెంట్కి ఆహ్వానిస్తే వెళ్లాను. అప్పుడే ఓ స్టోరీ లైన్ ఉందంటూ ‘మామ్’ లైన్ చెప్పాను. ఆవిడ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నిజజీవితంలో పరిపూర్ణమైన తల్లిగా తన పిల్లల పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నారు. పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు. ఆవిడే ‘మామ్’కి కరెక్ట్ అనుకున్నాను. శ్రీదేవిగారు ఈ సినిమాలో జీవించేశారు. ఏ లోకంలో ఉన్నా ఈ అవార్డుకి ఆమె ఆనందపడతారు. ► ఈ సందర్భంగా శ్రీదేవిగారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు చెబుతారా? నమ్మరేమో. ఆవిడ చాలా బిడియస్తురాలు. అపరిచితులు ఉంటే అస్సలు మాట్లాడరు. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వాళ్ల కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడరు. ఇన్ని సినిమాలు చేసిన ఈవిడ ఇలా ఉన్నారేంటి? అనుకున్నాను. అదే సన్నిహితులతో అయితే చాలా బాగా మాట్లాడతారు. జోకులు వేస్తుంటారు. ‘ఫన్ లవింగ్ పర్సన్’. హైదరాబాద్ వస్తున్నారంటే చాలు.. నాకు ఫోన్ చేస్తారు. ‘‘మీకు ‘ఉలవచారు’ హోటల్ ఉందట కదా. సాంబార్ అన్నం, గోంగూర అన్నం’ తెప్పిస్తారా’ అనేవారు. ఆ హోటల్ మాది కాదండి, నా ఫ్రెండ్ది అని, తెప్పించాను. ఆవిడకు అవి బాగా నచ్చేశాయ్. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అవే తినేవారు. శ్రీదేవిగారు వెజిటేరియన్. ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండేవారు. మనకున్న గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. చాలా త్వరగా వెళ్లిపోయారు. బట్... తాను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ నిలిచిపోతారు. నీకు చాలా త్వరగా జాతీయ అవార్డు వచ్చిందన్నారు ‘కాట్రు వెలియిడై’కి ఉత్తమ సంగీతదర్శకుడిగా, ‘మామ్’ బ్యాగ్రౌండ్ స్కోర్కి ఏఆర్ రెహమాన్కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ – ‘‘కాట్రు వెలియిడై’కి జాతీయ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా గురువు, అన్నయ్య, గైడ్ మణిరత్నం నాకు చాలా స్పెషల్. ఆయనొక ఆలోచనల గని. మణిరత్నంతో మనం ఏ ఐడియా చెప్పినా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటారు. అంత టాలెంట్ ఉంది. ‘రోజా’తో మా ప్రయాణం మొదలైంది. ఆ సినిమాకి నాకు జాతీయ అవార్డు వస్తే ‘నీకు చాలా త్వరగా వచ్చింది’ అని కొందరు అన్నారు. కానీ, నేనలా అనుకోలేదు. ప్రజలు, నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలు, హీరోలు, నా టీమ్.. అందరికీ ధన్యవాదాలు. ఇక ‘మామ్’ విషయానికొస్తే.. ఈ సినిమాకి మ్యూజిక్ చేయాలని బోనీజీ, శ్రీదేవిజీ చెన్నై వచ్చినప్పుడు నన్ను అడిగారు. నేను ఆనందంగా అంగీకరించాను. ఇలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. పైగా ఇప్పుడున్న పరిస్థితులకు చాలా అవసరమైన సినిమా. నాకీ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బోనీజీ, శ్రీదేవిజీలకు ధన్యవాదాలు. ఆమె అద్భుతమైన నటి. శ్రీదేవిగారి ఆత్మ మనతోనే ఉందని నమ్ముతున్నాను’’ అన్నారు. ఉత్తమ గాయనిగా ‘కాట్రు వెలియిడై’ సినిమాకు జాతీయ అవార్డు దక్కించుకున్న శాషా తిరుపతికి శుభాకాంక్షలు తెలిపారు రెహమాన్. ఈ క్షణాలు ప్రత్యేకమైనవి ‘మామ్’ సినిమాలో శ్రీదేవి నటనకు బెస్ట్ యాక్ట్రస్ అవార్డును జ్యూరీ కమిటీ కన్ఫార్మ్ చేసినప్పుడు మేం ఎంతగానో సంతోషించాం. ఈ క్షణాలు మాకు ఎంతో ప్రత్యేకమైనవి. శ్రీదేవి నటించిన 300 సినిమాల్లోనూ సేమ్ ఫర్ఫెక్షన్ను చూపించారు. ఆమె కేవలం సూపర్ యాక్టర్ మాత్రమే కాదు. సూపర్ మామ్ అండ్ సూపర్ వైఫ్ కూడా. ఆమె జీవితంలో సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకునే టైమ్ ఇది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోవచ్చు. కానీ ఆమె వారసత్వం, జ్ఞాపకాలు మా వెంట ఇంకా జీవించే ఉన్నాయి. ఈ అవార్డుతో శ్రీదేవిని గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి జ్యూరీ మెంబర్స్కు ధన్యవాదాలు. – బోనీ కపూర్ అన్నవరం టు వైజాగ్.. ఓ ‘ఘాజీ’ ఐడియా – సంకల్ప్ రెడ్డి ► దర్శకుడిగా మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ కొట్టేశారు.. హ్యాపీగా ఉండి ఉంటారు.. అఫ్కోర్స్. ఒక ఎక్స్పరీమెంటల్ మూవీని ముందు ప్రజలు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. ఐ యామ్ హ్యాపీ. ► ఇండియాలో ఫస్ట్ సబ్మెరైన్ మూవీ ‘ఘాజీ’. వర్కౌట్ అవుతుందా? అని కొందరు.. కొత్త కుర్రాడు సరిగ్గా తీయగలుగుతాడా? అని కొందరు.. ఈ మాటలు మీ వరకూ వచ్చాయా? ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అయితే రానాగారు, పీవీపీగారు నమ్మారు. నా స్క్రిప్ట్ని నేను బలంగా నమ్మాను. డిఫరెంట్ మూవీ ఇస్తే ప్రేక్షకులు చూస్తారనుకున్నాను. అది నిజమైంది. ► ఈ సినిమాని పీవీపీగారు నిర్మించే ముందు మీరే నిర్మించాలని కొంచెం డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా? అవును. పాకిస్తాన్ సబ్మెరైన్ సెట్ కూడా వేయించాను. అయితే సినిమా కంప్లీట్ చేసేంత మనీ లేదు. అప్పటికే నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. అలాంటి పరిస్థితిలో రానా ఈ సినిమాని నమ్మడం, పీవీపీగారు ముందుకు రావడంతో ‘ఘాజీ’ స్క్రీన్ మీదకు వచ్చింది. ► అసలు ‘ఘాజీ’ థాట్ ఎలా వచ్చింది? 2012లో నా పెళ్లయింది. అప్పుడు నా వైఫ్ (కీర్తీ రెడ్డి) బలవంతం చేస్తే అన్నవరం వెళ్లాం. అక్కణ్ణుంచి హైదరాబాద్ ట్రైన్ మిస్సవడంతో వైజాగ్ వెళ్లాం. అక్కడ బీచ్ రోడ్డులో సబ్మెరైన్ చూసినప్పుడు ఈ సినిమా థాట్ వచ్చింది. ► పెళ్లయిన వెంటనే సొంత డబ్బులు పెట్టి సినిమా తీయాలనుకోవడం, అది కూడా ప్రయోగం. మరి.. మీ మిసెస్ వద్దనలేదా? (నవ్వుతూ). తను కూడా కొంత అమౌంట్ ఇచ్చింది. అమ్మానాన్న కూడా ఎంకరేజ్ చేశారు. వీళ్లతో పాటు ‘ఘాజీ’కి వర్క్ చేసిన టీమ్ చాలా కష్టపడ్డారు. అందువల్లే ఇంత మంచి ప్రాజెక్ట్ ఇవ్వగలిగా. నేనే ఈ సినిమా నిర్మించాలనుకున్నప్పుడు మనీ ఎరేంజ్ చేయడం నాకు పెద్ద సవాల్ అయింది. అంతకు మించి నాకేదీ సవాల్ అనిపించలేదు. ఒకవేళ అవార్డు రాకపోయినా మంచి థాట్ వస్తే కచ్చితంగా ఎక్స్పరీమెంటల్ మూవీ చేస్తాను. అయితే అవార్డ్ అనేది ఒక బూస్ట్ లాంటిది. అవార్డ్స్ లిస్ట్ దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్ – వినోద్ ఖన్నా బెస్ట్ డైరెక్టర్ : జయరాజ్ (‘భయానకం’ – మలయాళం) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు బెస్ట్ రీజనల్ ఫిల్మ్ : లడఖ్ మరాఠి : కచ్చ లింబు తెలుగు : ఘాజీ మలయాం : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం హిందీ : న్యూటన్ బెంగాలీ : మయూరాక్షి అస్సామీ : ఇషూ తమిళ్ : టు లెట్ గుజరాతీ: డీ హెచ్ హెచ్ కన్నడ : హె బెట్టు రామక్క బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ : పీటర్ హెయిన్ (బాహుబలి –2) బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమకథా) బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ‘బాహుబలి 2’ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ : నగర్ కిర్టన్ చిత్రం బెస్ట్ లిరిక్స్ : ముత్తూ రత్న (కన్నడ– ‘మార్చి22’) బ్యాగ్రౌండ్ స్కోర్ : ఏఆర్ రెహమాన్ (మామ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్ (కాట్రు వెలియిడై) బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ : రామ్ రజాక్ (నగర్ కిర్టన్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : సంతోష్ రాజన్ (మలయాళం) బెస్ట్ ఎడిటింగ్ : రీమా దాస్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : తొండిముత్తాలుం ద్రిక్శాక్షయుం బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : భయానకం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : శాషా తిరుపతి బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ : ఏసుదాస్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : దివ్య దత్తా (ఇరాదా) బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఫాహద్ ఫాజిల్ బెస్ట్ యాక్ట్రెస్ : శ్రీదేవి (మామ్) బెస్ట్ యాక్టర్ : రిద్దీ సేన్ (నగర్ కిర్టన్) బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ మూవీ: దప్పా (మరాఠీ) బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : ‘బాహుబలి 2’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: ‘విలేజ్ రాక్స్టార్స్’ -
ఆవకాయ్... అందరికీ కావాలోయ్
కావాలోయ్.. కావాలోయ్... మాకూ ఆవకాయ్ కావాలోయ్... అంటున్నారు మన పక్క భాషలవాళ్లు... తెలుగోడి ఆవకాయ్కి అంత క్రేజ్ మరి. తెలుగు సినిమాలకూ అంతే క్రేజ్ ఉంది. అదిరేటి మన ఆవకాయ్లాంటి సినిమాలను రీమేక్ చేస్తున్నారు. రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సీన్ రివర్స్. మనం పక్క సినిమాలను ఎక్కువ రీమేక్ చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడికెళుతున్నాయి. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయ్. బాహుబలి.. వీర్ యోధ మహాబలి ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్తు భారతదేశాన్ని ఏడాదిన్నరకు పైగా వెంటాడింది. 2015 జూలై 15న ‘బాహుబలి’ విడుదలైన తొలి ఆట నుంచి సినిమా చూసిన అందరిలోనూ ఇదే ప్రశ్న. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అంటూ గూగుల్లోనూ రికార్డు స్థాయిలో వెతికారంటే ఎంత ఆసక్తి నెలకొందో తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ తొలి షో పడగానే ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ‘తెలుగు సినిమా స్టామినా ఇది’ అని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్ తమ నటన విశ్వరూపాన్ని చూపారు. దర్శకుడిగా రాజమౌళి ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు. కావాలంటే ఈ సినిమాని డబ్, చేసి విడుదల చేసుకోవచ్చు కానీ రీమేక్ చేయడం సాహసమే అని మన దేశంలో ఇతర భాషలవాళ్లు అనుకున్నారు. అయితే భోజ్పురిలో ‘వీరయోధ మహాబలి’ పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమా ‘బాహుబలి’కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. దినేష్లాల్ యాదవ్, ఆమ్రపాలి దుబే, అయాజ్ ఖాన్, సుశీల్ సింగ్, దీపక్ భాటియా ముఖ్య తారలుగా ఇక్భాల్ బి„Š దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పణలో ఎమ్. రమేష్ వ్యాస్ నిర్మిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ‘వీరయోధ మహాబలి’ ఫొటోలు, వీడియోలు ‘బాహుబలి’ని పోలి ఉండటం విశేషం. సో.. ఇది ‘ఫ్రీమేక్’ అనుకోవచ్చేమో. ఒకేసారి రెండు భాషల్లో టెంపర్ ‘నా పేరు దయ.. నాకు లేనిదే అది.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్’.. ‘చేతనైతే చెయ్యి.. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చో. ఊరికే అరవకు’.. వంటి డైలాగ్స్తో ఆకట్టుకుంది పూరి జగన్నాథ్ ‘టెంపర్’. ఎన్టీఆర్లోని మరో కోణాన్ని చూపించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ‘సింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రణ్వీర్ సింగ్, కాజల్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ కనిపించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు తమిళంలోనూ ‘టెంపర్’ రీమేక్ అవుతోంది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. మన ‘టెంపర్’ ఒకేసారి రెండు భాషల్లో రీమేక్ అవ్వడం విశేషం. ఇక్కడ లవ్.. అక్కడ కాదల్ ‘చూశారా నా బ్యాడ్లక్ ఎలా ఉందో. నాకు నచ్చినంత అందంగా.. నీరసం వచ్చేంత ఉత్సాహంగా.. కోపం వచ్చేంత క్యూట్గా.. నా బ్యాడ్లక్ని రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా మా నాన్నే స్టేషన్కి వెళ్లారు’ అంటూ తన మరదలు మహా లక్ష్మిని (తమన్నా) పరిచయం చేస్తాడు బాలు (నాగచైతన్య). బావామరదళ్లుగా ౖచైతూ, తమన్నా అలక, ప్రేమ, కుటుంబ పెద్దల జోక్యంతో ‘100% లవ్’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందర్నీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘100% కాదల్’ పేరుతో చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మిస్తుండటం విశేషం. ‘కుమారి 21ఎఫ్’, ‘దర్శకుడు’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు సుక్కు. నాగచైతన్య పాత్రలో జి.వి.ప్రకాష్, తమన్నా క్యారెక్టర్లో ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే నటిస్తున్నారు. ఈ వేసవిలో ఈ కాదల్ (ప్రేమ) తెరమీదకు రానుంది. అర్జున్ రెడ్డి.. వర్మ అయ్యాడు ‘మొదటి సంవత్సరంలో ఒకమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకిష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతావాళ్లంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. తరగతులు పెరిగేకొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి. మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రానివాళ్లకి, మిగతా తరగతుల వాళ్లకు చెప్పండి. ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అంటూ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో జూనియర్స్కి వార్నింగ్ ఇస్తాడు అర్జున్రెడ్డి (విజయ్ దేవరకొండ). ‘పెళ్ళిచూపులు’ వంటి ఫ్యామిలీ మూవీలో నటించిన విజయ్ ‘అర్జున్రెడ్డి’ వంటి బోల్డ్ క్యారెక్టర్లో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా యూత్కి తెగ నచ్చేయడంతో సూపర్హిట్గా నిలిచింది. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో విజయ్ ఓవర్నైట్ స్టార్గా మారిపోయారు. కథానాయిక షాలినీ పాండేకీ అదే స్థాయిలో పేరొచ్చింది. ఈ సినిమాని తమిళ్లో ‘వర్మ’ పేరుతో విలక్షణ దర్శకుడు బాలా రీమేక్ చేస్తున్నారు. నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్లోనూ ఈ సినిమా రీమేక్ కానుంది. తొలుత రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వరుణ్ ధావన్ పేరు.. ఇప్పుడేమో అర్జున్ కపూర్ పేరు వినిపిస్తోంది. అర్జున్ కపూర్ హీరోగా మురద్ ఖేతానీ ఈ సినిమా తెరకెక్కించనున్నారని బాలీవుడ్ టాక్. క్షణం.. బాఘీ 2 రిషి (అడివి శేష్) ఎన్ఆర్ఐ. మెడిసిన్ చదివేందుకు ఇండియా వెళ్లినప్పుడు సహ విద్యార్థి శ్వేతతో (అదా శర్మ) ప్రేమలో పడతాడు. తండ్రి కోసం శ్వేత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. శ్వేత నుంచి ఫోన్ రావడంతో ఇండియాకి వచ్చిన రిషికి శ్వేత కుమార్తె రియా కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుంది. కిడ్నాప్ చేసిందెవరు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనే అంశాలతో.. చక్కటి స్క్రీన్ప్లేతో రూపొందిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని ‘బాఘీ–2’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్, దిశాపాట్నీ జంటగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 30న విడుదల చేస్తున్నారు. సీతారామ కల్యాణ చూద్దాం శివ (నాగచైతన్య), భ్రమరాంబ (రకుల్ ప్రీత్సింగ్) ఓ పెళ్లిలో కలుసుకుంటారు. వారిమధ్య పరిచయం ఏర్పడుతుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. ప్రేమ విషయం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడుతుంటాడు శివ. తన కోసం రాజకుమారుడు వస్తాడనే భ్రమల్లో ఉన్న భ్రమరాంబ.. శివ ప్రేమను అర్థం చేసుకోదు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న శివ, భ్రమరాంబ తండ్రులు తర్వాత విడిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరి ప్రేమకథ ఏ మలుపు తీసుకుంది? వారి తండ్రులు కలిశారా? లేదా? అనే చక్కటి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్ వేడుకచూద్దాం’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ హిట్ సినిమాని కన్నడంలో ‘సీతారామ కల్యాణ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘జాగ్వార్’ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన నిఖిల్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. భలే భలే గజినీకాంత్ లక్కీ (నాని)కి చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉంటుంది. కానీ, ఆ విషయం ఎదుటి వాళ్లకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇలాంటి టైమ్లో నందనతో (లావణ్య త్రిపాఠి) పరిచయం ఏర్పడుతుంది లక్కీకి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన మతిమరుపు గురించి నందనకు తెలియకుండా లక్కీ జాగ్రత్త పడుతుంటాడు. అయితే లక్కీకి మతిమరుపు ఉన్న విషయం నందన తండ్రి రంగారావుకు (మురళీ శర్మ) తెలుస్తుంది. రంగారావు పెట్టిన పరీక్షను లక్కీ ఎలా ఎదుర్కొన్నాడన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మనిషిలోని లోపాన్ని కూడా కథాంశంగా తీసుకుని సూపర్ హిట్ సాధించొచ్చని నిరూపించారు దర్శకుడు మారుతి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమాను ఆర్య హీరోగా తమిళంలో ‘గజినీకాంత్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అఖిల్’ బ్యూటీ సాయేషా ఇందులో కథానాయిక. ఇటు సూర్య హిట్ మూవీ ‘గజనీ’, అటు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గుర్తొచ్చేలా ‘గజినీకాంత్’ టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమా ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. - డేరంగుల జగన్ -
చిన్నప్పటి నుంచి అవే ఊహలే
తమిళసినిమా: అనుష్క అంటే ఒకప్పుడు అందాల నటి మాత్రమే. ఇప్పుడు అందం, అభినయం కలబోసిన జాణ. అలాంటి తార నేను ఊహల్లో జీవించానంటోంది. తన చిన్నతనంలోనే బాహుబలిలో యువరాణిగా ఊహల్లో జీవించేశానని చెప్పుకొచ్చింది. అనుష్క కెరీర్లో అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్కను ఇప్పుడు సాదా సీదా కథా పాత్రల్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించిన స్వీటీ ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త చిత్రాలు అంగీకరించలేదంటున్న అనుష్క తాజాగా ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తన సినీ అనుభవం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి రాణించగలనని నిరూపించుకున్నానంది. తన విజయాల వెనుకున్నది దర్శకులేనని, మంచి కథాపాత్రల్లో వాళ్లు నటింపజేయడం వల్లే పేరు అని పేర్కొంది. చిన్నవయసులోనే తాను పురాణ, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదివేదాన్ననీ, అదే విధంగా కల్పిత కథలను ఎక్కువగా చదివేదానినని చెప్పింది. అలాంటి కథలోని ఒక పాత్రలో తనను ఊహించుకుని జీవించేదానిననీ అంది. అలాంటి ఊహల్లోంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనీ, అదో తీయని అనుభవంగా ఉండేదని పేర్కొంది. రాజ్యాలు, కోటలు కూడా తన ఊహల్లో మెదిలేవనీ, అలా తాను మహారాణి ఊహించుకుని జీవించేదాన్నని చెప్పింది. ఆ ఊహలే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించడానికి ధైర్యాన్నిచ్చాయని భావిస్తానంది. ఇంకా చెప్పాలంటే బాహుబలి చిత్రం తాను చిన్నవయసులో ఊహించిన విధంగానే అమరిందని చెప్పింది. విజయాల గురించి ఎదురు చూడననీ, బాధ్యతను నిర్వహించు ఫలితాన్ని ఎదురు చూడకు అన్నది తన ఫాలసీ అని పేర్కొంది. -
బాహుబలి అభిషేక వేడుకలు
-
ఘనంగా బాహుబలి అభిషేకోత్సవం
మైసూరు (శ్రావణ బెళగొళ): కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణ బెళగొళలో బాహుబలి 88వ మహామస్తకాభిషేకాల్లో ప్రధాన ఘట్టమైన అభిషేకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య పవిత్రజలంతో బాహుబలిని అభిషేకించారు. అనంతరం జైన మునులు, భక్తులు బిందెలలోని పవిత్ర జలాలతో విగ్రహాన్ని అభిషేకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీఎం హోదాలో మహామస్తకాభిషేకాల్లో తొలిసారి పాల్గొన్నాననీ, ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు. -
మహాబలి
బాహుబలి చూస్తిరా? అంతకంటే పెరియ (పెద్ద) సినిమా చూస్తరా? బాహుబలి కంటే మహాబలి లాంటి సినిమాలు ఇండియాలో హాల్చల్ చేయబోతున్నాయి. బోట్లలో నింపినా సరిపోవు. అన్ని దుడ్లు... మునుగుతాయా? తేలతాయా? చూస్తమా? వెయ్యి కోట్ల భీముడు భీముడు బలవంతుడా లేక బాహుబలినా! అయినా ఆ పోలికేంటి? భీముడు రియల్ క్యారెక్టర్. బాహుబలి రీల్ క్యారెక్టర్ కదా అనుకుంటున్నారా? కరెక్టే. అయితే ఈ ఇద్దరి బలానికి పోలిక పెట్టింది రీల్ వైజ్గానే. బడ్జెట్ వైజ్గా ఎవరు పెద్ద అంటే. నిన్న మొన్నటి వరకూ ‘బాహుబలి’ పెద్ద. ఇప్పుడు భీముడే బిగ్. ‘బాహుబలి’ రెండు పార్ట్స్ బడ్జెట్ దాదాపు 300 కోట్లు. మరి భీముడికి అయ్యే బడ్జెట్ ఎంతో తెలుసా? 1000 కోట్లండి బాబు. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో జ్ఞానపీuŠ‡ అవార్డుగ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రాసిన బుక్ ఆధారంగా ‘మహాభారతం’పై ఈ సినిమా తీయడానికి బీఆర్ శెట్టి అనే బిలియనీయర్ రెడీ అయ్యారు. భీముడి క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమాకయ్యే బడ్జెట్ 1000 కోట్లు. టైటిల్ రోల్ని మోహన్లాల్ చేయబోతున్నారు. కర్ణుడి పాత్రలో నాగార్జున కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం తెలియడానికి ఇంకా టైమ్ పడుతుంది. మోహన్లాల్ మాత్రం భీముడిగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ‘‘రెండు పార్ట్స్గా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మొదటి పార్ట్ను విడుదల చేసిన, నెక్ట్స్ 90 డేస్ తర్వాత సెకండ్ పార్ట్ను రిలీజ్ చేస్తాం’’ అని వాసుదేవన్ నాయర్ అన్నారు. యూనిట్ అనుకున్నట్లుగానే ఈ సినిమా సెట్స్పైకి వెళితే.. దేశంలో 1000కోట్లతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. వెయ్యి కోట్లా? తీసినవాళ్లు, కొన్నవాళ్లు ‘సేఫ్’ అవుతారా? అంటే.. టూ పార్ట్స్, మల్టీస్టారర్, మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్.. మునిగే చాన్సే లేదని ఊహించవచ్చు. 500 కోట్ల రామాయణం రామబాణానికి తిరుగులేదంటారు. అందుకే భీముడు గదతో బాక్సాఫీసు దగ్గరకు వస్తుంటే.. విల్లును ఎక్కుపెట్టి నేనూ వస్తున్నా అంటున్నాడు రాముడు. రామాయణం అంటే సీతను అడవులపాలు చేసిన రాముడు అని ఈతరం వారు అనుకుంటారు. కొందరకి అది కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి టైమ్లో రామాయణం వస్తే? అబ్బో.. బడ్జెట్ బోలెడంత అవుతుంది. అయినా ఓకే అంటూ అల్లు అరవింద్ రామాయణం ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి త్రీ పార్ట్స్గా ఆయన ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. రాముడు ఎవరంటే రామ్చరణ్ అట. అంతేకాదు.. మెగా కాంపౌండ్కి చెందిన హీరోలు కీలక పాత్రల్లో కనిపిస్తారని టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఇలాంటి వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఇంతకీ రాముడు ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాడు? దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి నో క్లారిటీ. ‘‘రామాయణం వంటి సినిమాను నిర్మించాలంటే ఎంతో బాధ్యతగా ఉండాలి. బిగ్ స్రీన్పై చూపించడం అంత ఈజీ కాదు. అందుకే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం’’ అని అల్లు అరవింద్ అప్పట్లో అన్నారు. సో... 500 కోట్లు వర్కవుట్ అవుతుందా అంటే... త్రీ పార్ట్స్ బాస్. పైగా పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా. రాముడికి తిరుగుండకపోవచ్చు. 300 కోట్ల కర్ణుడు కర్ణుడి దానగుణం ఎంత గొప్పది? ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇచ్చేంత గొప్పది. మరి కురుక్షేత్ర రణరంగంలో దుష్టులైన కౌరవుల వైపు ఎందుకు ఉండాల్సి వచ్చింది? పాండవులకు కర్ణుడు ఎందుకు వ్యతిరేకం అయ్యారంటే చరిత్ర తెలుసుకోవాలి. మలయాళ దర్శకుడు ఆర్. ఎస్. విమల్ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్ టైటిల్ రోల్లో ఆయన ‘మహావీర్ కర్ణ’ అనే సినిమా తీయబోతున్నారు. 300 కోట్ల రూపాయలతో యునైటెడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘‘రెండేళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. కొన్ని సీన్లు రీ–రైట్ కూడా చేశా. తమిళ్, హిందీ భాషల్లో తీసి, మిగతా భాషల్లో డబ్ చేయాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవల్లో యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని తీసుకోబోతున్నాం’’ అన్నారు విమల్. డైరెక్టరే చెప్పేశారుగా.. ఇంటర్నేషనల్ లెవల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అని.. ఇంకేం? బొమ్మ మునిగే చాన్సే లేదు. 400 కోట్ల రోబో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డుల గురించి చెప్పుకోవాలంటే ప్రజెంట్ బాహుబలి, దంగల్ వసూళ్ల నుంచి స్టార్ట్ చేయాలి. ‘‘హలో... ఫ్యూచర్లో మా గురించి కూడా చెప్పుకుంటారు’’ అంటున్నారు ‘2.0’ టీమ్. ‘రోబో’కి సీక్వెల్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ డేట్స్లో కాస్త అయోమయంగా ఉన్నా కలెక్షన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో దూసుకెళ్లేలా మార్కెట్ను రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వంద కోట్లకు పైగా శాటిలైట్ రైట్స్ను దక్కించుకున్నారు. రజనీకాంత్, అక్షయ్కుమార్, అమీజాక్సన్ ముఖ్యతారలుగా సుమారు 400 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇండియన్ సినిమాల్లో ఇప్పటికి ఇది హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ఆల్రెడీ శాటిలైట్, ఇతర హక్కుల రూపంలో 150 కోట్లు వచ్చేశాయట. రోబో మునిగే చాన్సే లేదు. టోటల్ కలెక్షన్స్ మిగతా సినిమాలకు షాక్ ఇస్తాయేమో! వెయిట్ అండ్ సీ. 250 కోట్ల సంఘమిత్ర బాక్సాఫీసుపై యుద్ధం చేయడానికి భీముడు, రాముడు, కర్ణుడు రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు తలపడటానికి ఓ రాణి రెడీ అవుతోంది. పేరు... సంఘమిత్ర. 250కోట్ల ఖర్చుతో దండయాత్రకు రెడీ అవుతున్నారు సంఘమిత్ర. లేడీని నమ్మి 250 కోట్లు ఖర్చుపెడుతున్నారా? అంటే.. హలో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘డర్టీ పిక్చర్’, ‘క్వీన్’.. ఇలా చాలా సిన్మాలున్నాయి. ఒకట్రెండు మినహా అన్నీ ఆల్మోస్ట్ లాభాలు తెచ్చినవే. ఆ ఒకటీ రెండూ సినిమాలూ ‘భేష్’ అనిపించుకున్నాయి. ఇక.. ‘సంఘమిత్ర’ గురించి చెప్పాలంటే.. ముందు శ్రుతీహాసన్ ఒప్పుకుని ఆ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులకు సీన్లోకి దిశా పాట్నీ వచ్చారు. సుందర్. సి దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలమ్స నిర్మిస్తున్న ఈ సినిమాలో జయం రవి, ఆర్య కీలక పాత్రలు చేయనున్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో సంఘమిత్ర దండయాత్రకు స్టార్టింగ్ ప్రాబ్లమా? అనే డౌట్స్ వచ్చాయి. సినిమా లేట్ అవుతున్నది స్టార్టింగ్ ప్రాబ్లమ్ వల్ల కాదని, ప్రిపరేషన్ ప్లాన్ వల్ల అని అంటున్నారు చిత్రబృందం. ‘‘ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్కి చాలా టైమ్ పట్టింది. చిన్న చిన్న మార్పులు చేస్తున్నాం. గ్రాఫిక్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని సుందర్ సి. స్పష్టం చేశారు. ఇది ట్రైలింగ్వుల్ మూవీ. పెట్టిన పెట్టుబడిని ‘సంఘమిత్ర’ సునాయాసంగా లాగేస్తుంది సారూ. సోనమ్ భారతం బీటౌన్లో మహాభారతం సినిమాపై మోస్ట్ ఇంట్రస్టెడ్ యాక్టర్ ఎవరంటే.. ఆమిర్ ఖాన్ అని చెప్పేయొచ్చు. మరి.. యాక్ట్రస్ విషయానికొస్తే సోనమ్ కపూర్. భారతంలో నటించడానికి ఆమిర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు సోనమ్ కపూర్ అయితే ఏకంగా ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాల రైట్స్ కూడా కొనేశారు. మహాభారతంపై ‘ఆర్యావతార క్రానికల్స్’ అనే టైటిల్తో మూడు పార్ట్స్గా బుక్ రచించారు ఉదయశంకర్. అందులో ఫస్ట్ పార్ట్ ‘గోవింద’ రైట్స్ను సోనమ్ కపూర్ కొన్నారు. దీంతో మహాభారతంపై సినిమా తీయడానికి సోనమ్ రెడీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. ‘‘మహాభారతం గొప్ప కథ. ఇందులో ఏ క్యారెక్టర్ చేస్తానో ప్రస్తుతం నాకు తెలీదు’’ అని సోనమ్ పేర్కొన్నారు. సో.. ఈ సినిమా సెట్స్పైకి వెళితే బడ్జెట్ రెండు వందల కోట్ల పైనే ఉంటుందని ఊహించవచ్చు. 200 కోట్లకు దగ్గరగా.. ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన చిత్రాల్లో ‘పద్మావత్’ బడ్జెట్ దాదాపు 180 కోట్లు అని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్ ముఖ్య పాత్రలో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలు, పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా రిలీజయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రెండో ఇండియన్ @ 180 కోట్లు శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఓ సంచలనం. ఆ చిత్రానికి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ ని ప్లాన్ చేస్తున్నారు. కమల్ నటిస్తారు. శంకర్ తెరకెక్కిస్తారు. ‘దిల్’ రాజు తీస్తారనే వార్త వచ్చింది. అయితే ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఫస్ట్ పార్ట్ నిర్మించిన ఎ.యం. రత్నం నిర్మించడానికి రెడీగా ఉన్నారట. ఇక, శంకర్ ప్లాన్ చేయడం, కమల్ డేట్స్ లాక్ చేయడమే ఆలస్యం. ఈ చిత్రానికి 180 కోట్లు బడ్జెట్ అవుతుందట. ‘భారతీయుడు’పై ఉన్న క్రేజ్ సీక్వెల్కి వర్కవుట్ అవు తుంది. సో.. రెండో భారతీయుడు వసూళ్లు ఇరగదీస్తాడని అంచనా వేయొచ్చు. -
బాహుబలి విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయండి
సాక్షి,బెంగళూరు: శ్రవణ బెళగోళలో ఉన్న దిగంబర బాహుబలి విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలంటూ ప్రభు పాత్రికేయుడు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కన్నడ సంస్కృతికశాఖ మంత్రి ఉమాశ్రీకు బుధవారం లేఖ రాశారు. సాంకేతికంగా, సామజిక మార్పుల పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో తొమ్మిదవ శతాబ్దంలో దిగంబరుడిగా ఉన్నారనే కారణంగా నేటికి కూడా బాహుబలిని దిగంబరుడిగానే ఉంచడం సమంజపం కాదంటూ లేఖలో విన్నవించారు. అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయం అప్పటికి సరైనదేనైనా ప్రస్తుత కాలానికి ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దీనివల్ల ప్రజల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో మూఢనమ్మకాలు మరింత ప్రబలే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా దిగంబరుడిగా ఉన్న బాహుబలి విగ్రహాన్ని చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని విగ్రహాన్ని దుస్తులతో కప్పివేయాలని లేఖలో విన్నవించారు. -
దందా చేస్తాడా?
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు, తన కాల్షీట్లు పొందాలని ప్రతి నిర్మాత ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడు ఒప్పుకున్న రెండు సినిమాలు తప్పితే వేరే ఏ సినిమానూ సైన్ చేయలేదు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న హై బడ్జెట్ యాక్షన్ మూవీ ‘సాహో’ సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ–ప్రమోద్లు నిర్మించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత సొంత బేనర్ గోపీకృష్ణ మూవీస్పై ప్రభాస్ హీరోగా స్వీయదర్శకత్వంలో కృష్ణంరాజు ఓ సినిమా తెరకెక్కిస్తారని టాక్. ఆ వార్తలకు తగ్గట్టుగానే ఫిల్మ్ చాంబర్లో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ ‘దందా’ అనే టైటిల్ను రిజిస్టర్ చేసింది. ఇదివరకు గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ‘బిల్లా’లో కృష్ణంరాజుతో కలిసి నటించారు ప్రభాస్. ఇప్పుడు కూడా ప్రభాస్ తన పెదనాన్నతో కలిసి నటిస్తారా? లేదా కృష్ణంరాజు డైరెక్షన్ మాత్రమే చేస్తారా? అనేది చూడాలి. -
మ్యాగజీన్ కవర్పై ప్రభాస్ సర్ప్రైజ్ లుక్!
సాక్షి, ముంబై: ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ కొత్త సంవత్సరం సందర్భంగా తన అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. ప్రముఖ మ్యాగజీన్ జీక్యూ ఇండియా జనవరి ఎడిషన్ కవర్పేజీపై ప్రభాస్ స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చాడు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా సూపర్స్టార్ అయ్యాడు. దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూఇయర్ తొలి ఎడిషన్లోనే ప్రభాస్ ముఖచిత్రంతో జీక్యూ మ్యాగజీన్ కథనాన్ని ప్రచురించింది. బ్లూపిన్ స్ట్రిప్డ్ త్రిపీజ్ సూట్తో కాలు మీద కాలు వేసుకొని రాయల్ లుక్తో ప్రభాస్ కవర్పేజీకి పోజు ఇచ్చాడు. ‘సంచలన విజయం సాధించిన ’బాహుబలి’ స్టార్ ప్రభాస్ ఆశ్చర్యకరంగా ఒక సిగ్గరి. 2018లో రాబోయే మా మొదటి ఎడిషన్లో ఆయన గురించి కొన్ని విశేషాలు మేం అందించబోతున్నాం. జనవరి 2018 ఎడిషన్ను మిస్ కాకండి’ అంటూ జీక్యూ మ్యాగజీన్ ట్విట్టర్లో పోస్టుచేసింది. -
బాహుబలి మానియా.. మరో రెండు దేశాల్లో!
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజా జపాన్, రష్యన్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నెల 29న జపాన్లో, జనవరి నెలలో ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది. దాదాపు ఐదేళ్లు కష్టపడి రాజమౌళి బృందం తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటిభాగం 2015లో, రెండోభాగం 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి' ఘనత సొంతం చేసుకుంది. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా సత్తాని ఇటు దేశానికి, అటు ప్రపంచానికి చాటిచెప్పారు. బాహుబలి-2 ఇప్పుడు జపాన్, రష్యాలో కూడా రికార్డుల వేటకు సిద్ధమైంది. -
రాజమౌళి 15.. ప్రభాస్ 22
‘ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా మన టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ఫోర్బ్స్ లిస్ట్లో చేరారు’. ఇంతకీ ఆ లిస్ట్ స్పెషాల్టీ ఏంటి? అంటే.. ‘ఎంటర్టైన్మెంట్ విభాగంలో దేశంలో అత్యధిక సంపాదనపరులు ఎవరు?’ అనే జాబితాను ప్రతి ఏడాదీ ‘ఫోర్బ్స్ మ్యాగజీన్’ వాళ్లు విడుదల చేస్తారు. ఇది చాలామందికి తెలిసిన విషయం. ఈసారి రిలీజైన లిస్ట్ మన టాలీవుడ్ కాలరెగరేసేలా ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఈ ‘టాప్ 100’ లిస్ట్లో చోటు దక్కింది. మన జక్కన్న.. అదేనండీ రాజమౌళి 100 మందిలో 15వ స్థానం దక్కించుకోవడం గర్వించదగ్గ విషయం. ఇక, ‘బాహుబలి’ ప్రభాస్ 22వ స్థానం దక్కించుకున్నారు. ‘భల్లాలదేవ’ రానా లేకుండా ఉంటారా? 36వ స్థానంలో నిలిచారు. హ్యాండ్సమ్ హీరో మహేశ్బాబు 37వ స్థానం, పవన్ కల్యాణ్ 69, అల్లు అర్జున్ 81వ ప్లేస్ కొట్టేశారు. విశేషం ఏంటంటే.. గతేడాది పోర్బ్స్ జాబితాలో ఓన్లీ మహేశ్, అల్లు అర్జున్, రామ్చరణ్, ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది సంఖ్య పెరగడం మనం ఆనందించాల్సిన విషయం. అది కూడా మొదటి 25 స్థానాల్లో మన తెలుగువాళ్లు ఇద్దరు ఉండటం ఇంకా విశేషం. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి లిస్ట్ను పోర్బ్స్ ఎనౌన్స్ చేసింది. ఎప్పటిలానే బాలీవుడ్ సెలబ్రిటీలకూ ప్లేస్ దక్కింది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. తదుపరి స్థానాల్లో షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ఖాన్ వరుసగా 2, 4, 6 స్థానాల్లో నిలిచారు. ఈ అందరి సంగతి పక్కన పెడితే హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా ఎనిమిదో ప్లేస్ని, సొట్టబుగ్గల సుందరి దీపికా పడుకోన్ 11వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. గత ఏడాది సౌత్ నుంచి 11 మంది ఫోర్బ్స్ లిస్ట్లో ఉంటే, ఈ ఏడాది 13 మంది ఉండటం ఆనందించదగ్గ విషయం. ఈ 13 మందిలో తమిళ హీరోలు సూర్య, విజయ్ 25, 31 స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్కి మాత్రం కొంచెం నిరాశ తప్పదు. ఎందుకంటే, గత ఏడాది సంఖ్య 35 ఉంటే.. ఈ ఏడాది 33 మాత్రమే ఉంది. ప్రిపేర్ ఫర్ 2018! ‘నేను నటించిన రెండు సినిమాలు (బాహుబలి, ఘాజీ) ఐఎమ్డీబీ టాప్ టెన్లో ఉన్నాయి. ఇండియన్ ఫోర్బ్ జాబితాలో చేరాను. లైవ్ షోస్, ఏజెన్సీస్, టెక్నాలజీ... ఇలా ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు 2018కి ప్రిపేర్ అవుతున్నాను. వచ్చే ఏడాది కూడా ఇలానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని రానా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. -
బాహుబలి.. వీర యోధ మహాబలి
బాక్సాఫీస్ కలెక్షన్స్ను, రికార్డులను ‘బాహుబలి’ ఏ లెవెల్లో కొల్లగొట్టిందో సినీ లోకమంతా చూసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తొలుత రిలీజ్ చేసిన ఈ సినిమాను కొన్ని భాషల్లోకి డబ్ చేశారు. డబ్బింగ్ వెర్షన్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టోటల్గా మన టాలీవుడ్ సత్తా ఏంటో ‘బాహుబలి’ వరల్డ్ వైడ్గా చాటింది. ఈ నెల 29న ఈ చిత్రం జపాన్లో విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని అనువదించి, విడుదల చేస్తున్నారు కానీ, వేరే భాషలవాళ్లు రీమేక్ చేసే సాహసం అయితే చేయలేదు. మరి.. ఐదేళ్లంటే మాటలా? పైగా మరో రాజమౌళి ఉండాలి కదా? ప్రభాస్, రానా, రమ్యకృష్ణ.. ఇలా ఏ ఆర్టిస్ట్ని తీసుకున్నా వేరే భాషల్లో ఇలాంటి ‘గుడ్ ప్యాకేజ్’ సెట్ అవుతుందా? అంటే.. భోజ్పురి వాళ్లు సెట్ చేసుకున్నారని సమాచారం. యస్.. ‘బాహుబలి’ చిత్రం భోజ్పురిలో రీమేక్ అవుతోందని టాక్. అందుకు తగ్గట్టే.. కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. సో.. నమ్మక తప్పదు. దినేష్ లాల్ యాదవ్ నిర్హూస్ హీరోగా దర్శకుడు ఇక్బాల్ భ„Š ‘వీర్ యోధ మహాబలి’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది ‘బాహుబలి’కి రీమేక్ అనేది భోగట్టా. ‘‘షూటింగ్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ వీర్ యోధ మహాబలి’’ అంటూ నిర్హూస్ ఫేస్బుక్లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అవి అచ్చం... ‘బాహుబలి’లో మన ప్రభాస్ గెటప్ పోలినట్లే ఉన్నాయి. అయితే... ఇది ‘బాహుబలి’కి రీమేక్ అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇక, ఈ చిత్రకథానాయకుడు విషయానికొస్తే.. దినేష్లాల్ యాదవ్ భోజ్పురి ఇండస్ట్రీలో సింగర్, తర్వాత యాక్టర్గా మారాడు. టెలివిజన్ ప్రజెంటర్గా కూడా వర్క్ చేశాడు. 2012 బిగ్ బాస్ 6 కంటెస్ట్ కూడా. ప్రజెంట్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. ‘నిర్హాహ్ హిందూస్థానీ, పాట్నానే పాకిస్తాన్’ వంటి భోజ్పురి చిత్రాల్లో నటించారు. వాటిని హిందీలోనూ విడుదల చేశారు. ఈ సంగతలా ఉంచితే.. మన ‘బాహుబలి’ సాధించిన తాజా రికార్డ్ గురించి చెప్పుకుందాం. ఐఎమ్డిబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది ఇండియన్ టాప్ 10 మూవీస్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో ‘బాహుబలి 2’ సినిమా సెంకడ్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ను మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ ఆక్రమించడం విశేషం. అర్జున్రెడ్డి, సీక్రెట్ సూపర్స్టార్, హిందీ మీడియమ్, ఘాజి సినిమాలు 3,4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. తొలి టాప్ 10 మూవీస్ లిస్ట్లో ఐదు సినిమాలు ఉండటం విశేషం. -
రాష్ట్రపతి నోట హైదరాబాద్ బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ‘సోదరసోదరిమణులారా నమస్కారం. దేశభాషలందు తెలుగు లెస్స’ అని రామ్నాథ్ కోవింద్ ప్రసంగం ప్రారంభంలో కొంత తెలుగులో మాట్లాడారు. ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు ఉత్సవాలు మంగళవారం ఎల్బీస్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆంగ్లంలో ప్రసంగిస్తూ.. తెలుగుభాష ఔనత్యాన్ని, తెలుగు సాహిత్య తేజోమూర్తులను, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాల ఉన్నతి ప్రస్తావించారు. పలువురు తెలుగు కవులను, వారి సేవలను గుర్తుచేశారు. ఆయన ఏమన్నారంటే.. తెలుగుభాషకు ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. తెలుగు సాహిత్యవ్యాప్తి శ్రీకృష్ణదేవరాయులు ఎంతో కృషి చేశారు దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగు మాజీ రాష్ట్రపతులు ఎస్ రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరావు తెలుగు తెలిసినవారు బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా తెలుగువారే స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు దేశవిదేశాల్లో తెలుగువారు ఎంతో ఖ్యాతి గడించారు హైదరాబాద్ అనేక సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది హైదరాబాద్ బిర్యానీకి, బ్యాడ్మింటన్, బాహుబలికి ప్రసిద్ధి రాష్ట్రపతిగా తెలంగాణలో ఇదే మొదటి పర్యటన 18 రాష్ట్రాల్లో, 42 దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలుగువారే కావడం ఆనందదాయకం 2008లో తెలుగుభాషకు చారిత్రక భాష గుర్తింపు నన్నయ్య, తిక్కన మొదలగు కవులు భారతాన్ని తెలుగులోకి అనువదించారు గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వట్టికోట ఆళ్వార్స్వామి, దాశరథి వంటి కవులు తెలుగుభాషను సుసంపన్నం చేశారు గిరజన హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీమ్ వంటి వీరులు కన్న భూమి ఇది తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలు ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము’ అనే గేయాన్ని ఉటంకించి రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు -
రాష్ట్రపతి నోట హైదరాబాద్ బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి..!
-
బుజ్జి బాహుబలి హీరో అయ్యాడు
‘లవ్లీ, ఉయ్యాలా జంపాలా, కృష్ణగాడి వీర ప్రేమగాథ, బాహుబలి’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించిన నిఖిల్ హీరోగా పరిచయమవుతు న్నాడు. ‘వాళ్లమ్మాయి’ పేరుతో కృష్ణచైతన్య దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్పై ప్రవీణ్ సిద్ధాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకురాలు జయ.బి క్లాప్ ఇచ్చారు. నృత్యదర్శకుడు శేఖర్ గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ– ‘‘2001లో ఒక ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ సమాజంలో రావణాసురుల మధ్య నలిగిపోతున్న ఒక సీత కథే ఇది. ఆ అమ్మాయిని ఓ కుర్రాడు ఎలా కాపాడాడు? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు ప్రవీణ్ సిద్ధాంత్. మాటల రచయిత కమల్ వి.వి., సంగీత దర్శకురాలు కౌసల్య, నిర్మాత బీఏ రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వినయ్, శివగౌడ్. -
ప్రభాస్ 'సాహో' రిలీజ్ డేట్ ఇదేనట!
'బాహుబలి' సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న తాజా సినిమా 'సాహో'.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలు దేశంలో ఎంత పెద్ద విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమాల అనంతరం ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఈ సినిమాపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'సాహో' సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. రానున్న దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తోందని, అయితే, వీఎఫ్ఎక్స్ మిక్సింగ్ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా వచ్చే అవకాశముంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్ వంటి హాలీవుడ్ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్ సీక్వెన్స్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. -
బాహుబలికి క్రేజ్ మరీ ఈ రేంజ్లోనా..?
బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సినిమాల పేర్లతో చీరలు, డ్రెస్లు రావడం కొత్తేమి కాదు. హీరోయిన్, హీరోల పేర్లతో వస్త్ర వ్యాపారులు మార్కెట్ క్యాచ్ చేసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ను జ్యూవెల్లరి వ్యాపారులు సైతం అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ సాధించిన బాహుబలి సినిమా పేరుతో ఆభరణాలను తయారు చేసి మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలోని కీలక ఘట్టాలను తీసుకొని లాకెట్లు గా మార్చేస్తున్నారు. శివగామి, బాల బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సీన్, బాహుబలి 2లో అత్యంత పాపులర్ అయిన మహేంద్ర బాహుబలి ఏనుగును ఎక్కే సీన్. అలాగే సింహాసనంపై బాహుబలి కూర్చున్న దృశ్యాలను లాకెట్ లుగా మార్కెట్లో తీసుకొస్తున్నారు. టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ టైపులోనే కళాకారులు ఈ బాహుబలి డిజైన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. -
బాహుబలి స్టంట్ను ట్రై చేస్తే..
-
ఏనుగుపై బాహుబలి స్టంట్ ట్రై చేసి..
తిరువనంతపురం : ‘బాహుబలి - ది కంక్లూజన్’ సినిమాలో ప్రభాస్ ఏనుగుపై ఎక్కే స్టంట్ను ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఏనుగు విసిరికొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఏనుగు తొండంతో బలంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని తోడుపుజాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగును మచ్చిక చేసుకునేందుకు తొలుత అరటిపళ్లను తినిపించిన వ్యక్తి.. మద్యం మత్తులో ఏనుగును రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం తొండంపై కాలు మోపి బాహుబలి సినిమాలోలా పైకి ఎక్కేందుకు యత్నించాడు. తొండంపై కాలు పెట్టడంతో కోపగించుకున్న ఏనుగు అతడిని విసిరికొట్టింది. దీంతో అంత దూరంలో ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు. అంతకుముందు తాను చేసేది మొత్తం మొబైల్లో చిత్రీకరించాలని ఓ యువకుడిని కోరడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాహుబలిలో ప్రభాస్లా చేద్దామని ట్రై చేస్తే.. -
సీఎం ఎవరు? బాహుబలి ఎవరు? కాంగ్రెస్ అద్వానీ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అద్వానీలాంటివాడినని, ముఖ్యమంత్రి పదవిని అడగబోనని చెప్పారు. కానీ, అందరూ కోరితే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం అంటూ తన మనస్సులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తే.. వారే బాహబలి అని అన్నారు. పార్టీలో చేరగానే బాహుబలి కారంటూ పరోక్షంగా రేవంత్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ బాహుబలి ఉన్నాడని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఆయన గట్టెక్కిస్తాడని హస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా జానారెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వాయిదా తీర్మానాలను తిరస్కరించాలని బీఏసీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. 'ప్రభుత్వం సభలో మా గొంతు నొక్కుతోంది. మీడియా కూడా ఆవేదనను ప్రజలకు తెలుపడం లేదు. ఇక మేం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాడుతాం' అని జానారెడ్డి అన్నారు. -
ప్రభాస్తో ఛాన్స్ వస్తే..!
‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకున్నారు ప్రభాస్. దీంతో ఆయన సరసన ఒక్క ఛాన్స్ కోసం తెలుగులో నటిస్తున్న హీరోయిన్లే కాదు... పరభాషా చిత్రాల హీరోయిన్లూ ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్తో నటించే చాన్స్ రావాలే కానీ ఎవరు మాత్రం వదులుకుంటారు? అనేవారి జాబితాలోకి తాజాగా నటుడు శరత్కుమార్ కూతురు వరలక్ష్మి చేరారు. తమిళంలో హీరోయిన్గా కొనసాగుతోన్న వరలక్ష్మి ‘శక్తి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రభాస్తో కలిసి నటిస్తారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆయనతో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ నటన సూపర్బ్. నాకు చాలా బాగా నచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి టాలెంట్ ఉన్న నటులున్నారు. వారితోనూ సినిమాలు చేయాలనుంది’’ అన్నారు. -
కన్ఫర్మ్: రాజమౌళి నెక్స్ట్ రెండు సినిమాలు ఇవే!
'బాహుబలి' సినిమాల భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. ఏ సినిమా తీయబోతున్నారన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. 'బాహుబలి' సిరీస్తో అంతర్జాతీయంగా పాపులర్ అయిన రాజమౌళి తాను తీయబోయే తదుపరి రెండు చిత్రాల గురించి క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాగజీన్ 'వెరీటీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి.. తన తదుపరి సినిమాలను కన్ఫర్మ్ చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబుతో సినిమా తీయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ తెరకెక్కించే ఈ సినిమా 2019లో సెట్స్పైకి వెళ్లే అవకాశముంది. 'క్షణ క్షణం', 'హాలోబ్రదర్', 'రాఖీ' వంటి ప్రముఖ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేఎల్ నారాయణ నిర్మించే ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ లోపే డీవీవీ దానయ్యతో సినిమా తీస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. 'బాహుబలి' సిరీస్ తర్వాత వెంటనే తీయబోయే సినిమా ఇదే కానుంది. 'దానయ్యకు నేను కమిట్ అయ్యాను. ఇదే నా నెక్స్ట్ సినిమా కానుంది' అని రాజమౌళి స్పష్టం చేశారు. 'ఏ భాషలో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు? అన్నది ఇంకా తెలియదు' అని ఆయన చెప్పారు. డీవీవీ దానయ్య ప్రస్తుతం మహేశ్బాబుతో 'భరత్ అను నేను' సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనంతరం రాజమౌళితో సినిమాను దానయ్య సెట్స్పైకి తీసుకెళ్లే అవకాశముంది. -
నానమ్మ చెప్పిన కథలే స్ఫూర్తి
సాక్షి, బెంగళూరు (ఉడిపి) : బాహుబలి చిత్రానికి తన చిన్నతనంలో నానమ్మ చెప్పిన రామాయణం, మహాభారతం కథలే స్ఫూర్తి అని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఉడిపిలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాజమౌళి శనివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కువగా ఫాంటసీ, క్రైమ్తో కూడిన పుస్తకాలను ఎక్కువగా చదివేవాడని, అందుకే ఆ తరహా చిత్రాలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తానన్నారు. -
బాహుబలి డిజైన్లు బాగున్నాయి
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రాజమౌళి క్రియేటర్ అని, బాహుబలి సినిమాలో డిజైన్లు బాగా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందుకే రాజధానిపై ఆయన అభిప్రాయం అడిగానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్తో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ పత్రికలో తాను నీళ్లు దొంగిలించుకుపోయినట్లు రాశారని, నీళ్లిస్తున్నా అడ్డుకుంటున్నారని, ప్రజల్ని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సదావర్తి భూములపైనా ప్రతిపక్ష పార్టీ పేపర్లో ఏదేదో రాస్తున్నారన్నారు. సదావర్తి భూములకు వేలం వేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా తనకు తెలియదని చెప్పారు. వచ్చే 2019 ఎన్నికల్లోనే కాదు.. 2024 ఎన్నికల తర్వాత కూడా తానే అధికారంలో ఉంటానని చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ అధికారం కోసం పని చేయలేదన్నారు. తనకు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వద్దన్నానని చెప్పారు. కుటుంబంకోసం డెయిరీ పెట్టా : తన కుటుంబం కోసం ఏంచేయాలని ఆలోచించి 1989–94 మధ్య ప్రతిపక్షంలో ఉండగా డెయిరీ పరిశ్రమ పెట్టానని, దాన్ని ఇప్పుడు తన కుటుంబసభ్యులు చూసుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ను తన బ్రెయిన్ చైల్డ్గా అభివర్ణించారు. అక్కడ అడుగడు గునా తన ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. రోజూ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తా : తాను ప్రతిరోజూ ఉదయం విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో ధ్యానం చేసే వాడినని కొద్దిరోజుల నుంచి అది మానేసి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నారు. విజువలైజేషన్ అంటే ఏమిటని మీడియా ప్రతినిధులు అడగ్గా.. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిని గుర్తు చేసుకుంటా నని, తానెవరు, ఎక్కడి నుంచి వచ్చా, ఏం చేశా, ఏం చేస్తున్నా, ఏంచేయాలి, తన లక్ష్యం ఏమిటో గుర్తుచేసుకుంటానని చెప్పారు. -
జాలువారుతున్న జలపాతం
బట్రేపల్లి జలపాతం బాహుబలి సెట్టింగ్ను తలపిస్తోంది. కొండ పైనుంచి బండల మీదుగా నీరు కిందికి జాలవారుతూ సందర్శకులను కనువిందు చేస్తోంది. కొండపై నుంచి నీళ్లొస్తున్నాయని తెలుసుకున్న ప్రజలు జలకాలాడుతూ సంబర పడిపోతున్నారు. యువత సాహొరే.. బాహుబలి అంటూ కేరింతలు కొడుతోంది. ఆదివారం సెలవు కావడంతో జలపాతాన్ని చూసేందుకు మరింత మంది వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరో నాలుగురోజుల పాటు అడపాదడపా వర్షాలు కురిస్తే దసరా సెలవుల్లో బట్రేపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగవచ్చు. సెప్టెంబర్ మొదటివారంలో మొదలై మూడు, నాలుగు రోజులపాటు జాలువారిన తలుపుల మండలం బట్రేపల్లి జలపాతం శనివారం మళ్లీ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు బట్రేపల్లి అడవుల్లో నీటిఊట ప్రారంభమైంది. అది పాయలు పాయలుగా ఇక్కడకు చేరి జలపాతమైంది. - కదిరి -
విత్ లవ్ ప్రభాస్!
... అంటూ ‘బాహుబలి’లో తాను వాడిన కత్తిని పోలిన కత్తిని తయారు చేయించి విరాట్కు బహుమతిగా పంపించారు ప్రభాస్. ఎవరీ విరాట్ అనుకుంటున్నారా? దివంగత నటుడు శివాజీ గణేశన్ ముని మనవడు. అంటే.. శివాజీ తనయుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు కుమారుడు విరాట్ అన్నమాట. ఈ బుడతడు ‘బాహుబలి’ సినిమా చూశాడు. అప్పటి నుంచి ప్రభాస్కి వీరాభిమాని అయ్యాడు. ఈ విషయాన్ని విక్రమ్ ప్రభు ద్వారా తెలుసుకున్న ప్రభాస్... తన చిన్ని ఫ్యాన్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ‘బాహుబలి’లో తాను వాడిన ఖడ్గాన్ని పోలిన ఖడ్గాన్ని తయారు చేయించి, దాని మీద ‘ఫర్ విరాట్... విత్ లవ్ ప్రభాస్’ అని రాసి పంపించారు. ఈ విషయాన్ని విక్రమ్ప్రభు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుని, ఫొటో షేర్ చేశారు. ‘ఇది ఒక స్వీటెస్ట్ పర్సన్ నుంచి అందిన కానుక. థ్యాంక్యూ ప్రభాస్. యు ఆర్ గ్రేట్’ అని ప్రభాస్కు విక్రమ్ప్రభు ధన్యవాదాలు తెలియజేశారు. -
బాహుబలి విజయానికి అదే కారణం..
సినీనటుల్ని తమిళ నిర్మాతల మండలి కట్టడి చేయాలని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ తిరుపూర్ సుబ్రమణియం పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన వివేకం చిత్రానికి థియేటర్లలో అధిక టిక్కెట్ల విక్రయంపై ఈయన స్పందిస్తూ, ఈ టికెట్టు ధరతో సాధారణ ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూడలేరన్నారు. అభిమానులు మాత్రమే చూస్తారన్నారు. బాహుబలి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి కారణం న్యాయమైన టికెట్ ధరేనన్నారు. ప్రస్తుత టికెట్ అధిక వెలకు నిర్మాతల, నటులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కారణం అని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా టికెట్ ధర విషయంలో ఒక నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. -
రాజమౌళికి తప్పుడు సమాచారమిచ్చారు!
తమిళసినిమా: దర్శకుడు రాజమౌళికెవరో తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని ఎవర్గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి పేర్కొన్నారు. బహుభాషా నటిగా రాణిస్తున్న ఈ భామ తాజా చిత్రం మామ్తో 300 చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సిరీస్లో శివగామి పాత్రకు మొదట ఈమెను నటింపజేయాలని దర్శకుడు భావించారట. శ్రీదేవి నిరాకరించడంతో ఆ లక్కీచాన్స్ నటి రమ్యకృష్ణను వరించింది. ఆ పాత్రతో రమ్యకృష్ణ పేరు ఎక్కడో వెళ్లి పోయిందది. దీంతో శివగామి పాత్రను ఎందుకు మిస్ అయ్యారంటూ శ్రీదేవిపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. అటు దర్శకుడు రాజమౌళికి ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతోంది. అయితే ఇటీవల ఆయన శ్రీదేవి గురించి ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. దానికి శ్రీదేవి వెంటనే స్పందించారు. ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను బాహుబలి చిత్రంలో నటించడానికి పలు నిబంధనలను విధించానని రాజమౌళి చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. తాని ప్పటికి 300 చిత్రాల్లో నటించానని, అలాంటి నిబంధనలు విధిస్తే తననెప్పుడో సినిమా నుంచి పంపించేసే వారని అన్నారు. తానూ ఒక నిర్మాత భార్యానేనని, తనకూ నిర్మాతల సాధకబాధకాలు తెలుసునని అన్నారు. తన గురించి రాజమౌళికెవరో తప్పుడు సమాచారం అందించారని శ్రీదేవి పేర్కొన్నట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. -
శ్రీదేవిని రాజమౌళి ఎందుకు...
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న అందర్నీ వేధించింది. ఇప్పుడు శ్రీదేవిని రాజమౌళి ఎందుకలా అన్నాడు? అనే ప్రశ్న అందర్నీ వేధిస్తోంది. రాజమౌళి అన్న మాటలు శ్రీదేవిని కూడా చాలా బాధించాయి.. చాలా వేధించాయి. 50 ఏళ్ల సినిమా కెరీర్లో ఎవర్నీ ఒక మాట అనలేదు. ఎవరితో ఒక మాట పడలేదు. భూదేవంత సహనం ఉన్న శ్రీదేవి మనసు గాయపడింది. అసలు ఏం జరిగిందో.. ఎలా జరిగిందో.. ఏది నిజమో.. ఏది అబద్ధమో.. మనసు విప్పి చెప్పాలనుకుంది... సాక్షి పాఠకులతో మాత్రమే పంచుకుంది. ♦ నాలుగేళ్ల క్రితం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. వయసు పెరుగుతున్నట్టే అనిపించడం లేదు! (నవ్వుతూ...) ఏం చెప్పమంటారు? ఎవరైనా నా గురించి ఇలా చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. హెల్దీ లైఫ్, హెల్దీ థింకింగ్, బీయింగ్ హ్యాపీ... ఈ మూడూ చాలు! మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది ముఖంలో కనిపిస్తుంటుంది. ♦ ‘మామ్’ మూవీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కథ... అంతేనండీ! వేరే కారణాలేవీ లేవు. మా ఆయన (శ్రీదేవి భర్త, చిత్రనిర్మాత బోనీ కపూర్) నాతో ‘నీకో లైన్ చెబుతాను. నచ్చితే సినిమా చేద్దాం. స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం’ అన్నారు. లైన్ వినగానే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేనీ సినిమాలో నటించకపోయినా.. మీరు మాత్రం తప్పకుండా నిర్మించాలని మా ఆయనతో అన్నాను. అంతగా ఈ సబ్జెక్ట్ నాకు కనెక్ట్ అయ్యింది. ♦ తల్లీకూతుళ్ల రిలేషన్ మీద సినిమా కాబట్టి, ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ అమ్మగారు గుర్తొచ్చారా? లేదండీ! ‘మామ్’ చేసినప్పుడు మా అమ్మగారు గానీ, నా పిల్లలు గానీ గుర్తు రాలేదు. దేవకి (సినిమాలో శ్రీదేవి పాత్ర పేరు) మనసులో ఎంత బాధ ఉంది? పిల్లల కోసం ఏం చేస్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అనేవి నా మనసులో ఉన్నాయి. దేవకి పాత్రలో ఉన్నంతసేపూ నా ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రాలేదు. ♦ మీ చిన్నప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకూ.. మీ అమ్మగారు మిమ్మల్ని గైడ్ చేశారు.. ఆమె గురించి కొన్ని మాటలు... తప్పకుండా! ఈ రోజు నేను ఏమాత్రం కొంచెం ఎఛీవ్ చేశానన్నా... ఆ క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలి. అమ్మ నన్ను కూర్చోబెట్టి ఏం నేర్పలేదు. కానీ, ఆమె నుంచి జీవితం అంటే ఏంటనేది నేర్చుకున్నాను. లైఫ్లో ఏం చేసినా వంద శాతం కష్టపడాలి. ఊరికే చేయాలని చేయకూడదు. హార్డ్ వర్కింగ్. బీయింగ్ పంక్చువల్ – ఈ లక్షణాలన్నీ అమ్మ దగ్గర్నుంచి నేర్చుకున్నా. ‘కష్టే ఫలి. నో పెయిన్–నో గెయిన్’ – ఇలాంటివి నాకు నేర్పించింది. అమ్మ దగ్గర నేను నేర్చుకున్న దాంట్లో ఒక యాభై శాతం నేను నా పిల్లలకు ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఎచీవ్మెంట్ అనుకుంటా. ♦ నేను కొంచెమే ఎచీవ్ చేశాననడం మీ గొప్పతనం. 50 ఏళ్ల కెరీర్... 300 సినిమాలంటే జోక్ కాదు. మీరు చాలా ఎచీవ్ చేశారు. ఎప్పుడూ అలసిపోలేదా? ఇప్పుడీ ‘మామ్’ నా ఫస్ట్ ఫిల్మ్లా ఉంది (నవ్వులు). ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో అడుగు పెట్టినట్టు ఫీలవుతున్నా! మీరు చెబుతుంటే ‘300 సినిమాలు చేశానా?’ అనిపిస్తోంది. అదర్ వైజ్... ఐ ఫీల్ లైక్ థిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ♦ ఈ సినిమా చేసేటప్పుడు మా అమ్మ గుర్తు రాలేదన్నారు. మీ వ్యక్తిగత జీవితంతో సినిమా కథలను రిలేట్ చేసుకోరా? లేదండీ! ఎందుకంటే... ‘మామ్’ కథలో ఆ అమ్మకు జరిగేది లోకంలో ఎవరికీ జరగ కూడదు. ‘ఇట్స్ వరస్ట్ థింగ్ టు హ్యాపెన్ ఫర్ ద ఫ్యామిలీ’. అది ఎవరి లైఫ్లోనూ జరిగి ఉండదు. కానీ, ఆ కుటుంబానికి జరిగింది. అప్పుడు ఆ అమ్మ ఎలా ఫీలవుతుందనేదే తప్ప... మా ఫ్యామిలీ గురించి ఆలోచనలు రాలేదు. సినిమా వేరు.. జీవితం వేరు. ♦ మీరెలాంటి మదర్? స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా? (నవ్వుతూ). ఫుల్ ఫ్రెండ్లీ. యాక్చువల్గా ఎప్పుడూ స్ట్రిక్ట్గా ఉండాల్సిన పరిస్థితి నా పిల్లలు తీసుకు రాలేదు. చాలా తక్కువ సార్లు స్ట్రిక్ట్గా ఉంటాను. ♦ ‘మామ్’ ట్రైలర్లో ‘వచ్చాను రా దానమ్మను’ అనే డైలాగ్ చెప్పే టైమ్లో మీ కళ్లలో ఆగ్రహం కనిపించింది. మీ పిల్లల గురించి రాకూడని వార్తలు వచ్చినప్పుడు ఓ మదర్గా మీరెలా ఫీలవుతారు? అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. ఐయామ్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మై చిల్డ్రన్. మా అమ్మాయి ఓ పార్టీకి వెళ్లొచ్చి, నాకు ఫొటోలు చూపించింది. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రదర్శకురాలు గౌరీ షిండేతో ఆ ఫొటోలు దిగింది. గౌరీ కూడా నాకు ఫోన్ చేసి ‘పాపతో పార్టీలో మాట్లాడాను. తనతో చాలా టైమ్ స్పెండ్ చేశా’ అని చెప్పింది. తర్వాత రోజు పేపర్లో మా పాప ఎవరో హీరో వెనకాల, అతను ఎక్కడికి వెళితే అక్కడే తిరుగుతుందని రాశారు. పాప చాలా అప్సెట్ అయ్యింది. కానీ, నా పాప గురించి నాకు తెలుసు. నేను అలాంటి వార్తలు చూసి నవ్వుకుంటాను. కానీ, కొన్ని వార్తలు మాత్రం నిజంగా బాధకు గురిచేస్తాయి. అలాంటి వార్తలు రాసేవాళ్లు ‘వాళ్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. తల్లి మనసు ఎంత బాధపడుతుంది’ అనేది అర్థం చేసుకోవాలి. ♦ నా కూతురి పెళ్లి చేస్తున్నానా? షూటింగ్కి వస్తున్నానా? ♦ 50 ఏళ్ల కెరీర్లో మీ మీద ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినట్లు అనిపించలేదు? అవును. ఎప్పుడూ ఎవరి గురించీ నేను చెడుగా మాట్లాడింది లేదు. దర్శక–నిర్మాతలెవరూ నా గురించి చెడుగా మాట్లాడింది లేదు. నిజం చెప్పాలంటే చాలా సినిమాలకు నేను డబ్బులే తీసుకోలేదు. చివరి నిమిషంలో కష్టాల్లో ఉన్నామని, బడ్జెట్ ఎక్కువ అయ్యిందని నిర్మాతలు అంటే అర్థం చేసుకుని బోలెడు సినిమాలకు నా రెమ్యునరేషన్ తీసుకోలేదు. నేనే కాదు మా అమ్మ కూడా పారితోషికం విషయంలో పట్టూవిడుపుగా ఉండేవారు. ఆవిడ దగ్గరే నేనిలా ఉండటం నేర్చుకున్నాను. అలాంటిది నేను మొత్తం హోటల్ ఎందుకు బుక్ చేయమని అడుగుతా? నేనేమైనా నా కూతురి పెళ్లి చేస్తున్నానా? లేక షూటింగ్కి వస్తున్నానా? అయినా ఒక షో ఇంట్రస్ట్గా నడవడం కోసం లేని పోనివి చెప్పకూడదు. ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా... రాజమౌళిగారు నాతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు పక్కన కూర్చుని చూసినట్లు మాట్లాడటం బాధగా అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం చాలా తప్పు. పైగా, రాజమౌళిగారు నన్ను కలిసిన ప్రతిసారీ ఒక్కో డిమాండ్ చేశానట. అది చాలా తప్పు. ‘బాహుబలి’ గురించి ఆయన నాతో మాట్లాడ్డానికి వచ్చినప్పుడు కేవలం ‘క్రియేటివ్ డిస్కషన్’ మాత్రమే జరిగింది. ‘కమర్షియల్స్’ గురించి మాట్లాడలేదు. అయినా ఒక్కో మీటింగ్లో ఒక్కో డిమాండ్ ఎలా పెడతామండి! ♦ ‘మామ్’ ట్రైలర్ చూసి, మీ పిల్లలేమన్నారు? వాళ్లు సినిమా కూడా చూశారు. జాన్వీ అయితే నన్ను గట్టిగా కౌగలించుకుంది. తను అలా చేయడం అదే మొదటిసారి. మా పిల్లలకు సినిమా బాగా నచ్చింది. ♦ జాన్వీ ఎవరితోనో లవ్లో ఉందని, మీరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఇంకో న్యూస్ వచ్చింది... ఇక వాటన్నిటి గురించి మాట్లాడడం వేస్ట్. ముంబయ్లో ఇటీవల ఓ పత్రికలో ‘మా పాపకు పెళ్లి చేయాలి’ అని నేను చెప్పినట్టు రాశారు. ప్రతి అమ్మ తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది కదా! నేనూ అదే చెప్పా. కానీ, అంతకు ముందు ‘జాన్వీ ఇండిపెండెంట్గా ఎదగాలి. తన కాళ్లపై తను నిలబడాలి. ఊరికే పెళ్లి చేసి కుక్కేయడం కాదు. తనకూ ఓ కెరీర్ ఉండాలి’ అని చెప్పా. అదంతా వదిలేసి ‘శ్రీదేవి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది’ అని రాశారు. దాన్నే హెడ్లైన్ చేశారు. ♦ ఇంట్లో ఆల్రెడీ ఓ సక్సెస్ఫుల్ స్టార్ ఉన్నారు కాబట్టి, జాన్వీని మీతో కంపేర్ చేస్తారు. మీరేమంటారు? జాన్వీ ఎంత పెద్ద స్టార్ అవుతుందనేది మన చేతుల్లో లేదు. తన టాలెంట్, హార్డ్వర్క్ బట్టి పైకొస్తుంది. తనింకా ఒక్క అడుగు కూడా వేయలేదు. నాతో తనను కంపేర్ చేయడమనేది చాలా రాంగ్. ఎందుకంటే... నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చాను. హీరోయిన్గా పరిచయమయ్యే టైమ్కి చైల్డ్ స్టార్గా సుమారు 50 సినిమాలు చేశా. హీరోయిన్గా ఫస్ట్ సినిమా చేసే టైమ్కి షూటింగ్ ఎలా ఉంటుంది? కెమెరా... వంటివన్నీ తెలుసు. మా పాపకు మాత్రం ‘ఇట్స్ జస్ట్ ఎ ఫస్ట్ ఫిల్మ్’ అన్నమాట. సో, తననూ, నన్నూ కంపేర్ చేయడమనేది న్యాయం కాదు. తనని ఇండివిడ్యువల్గా చూస్తే బాగుంటుంది. ♦ మీ పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. చిన్నమ్మాయి మీకంటే హైట్ అనుకుంటా! అవునండీ. జాన్వీ కంటే... నాకంటే చిన్న పాప ఖుషీ ఇంకా హైట్! ♦ ఈ వయసులోనూ మీరింత స్లిమ్గా ఉన్నారు. మీ పిల్లలకు మీరేమైనా టిప్స్ ఇస్తారా? నేనా? అయ్యో... లేదండీ! వాళ్లే నాకు టిప్స్ ఇస్తున్నారు. నేనెప్పుడైనా కొంచెం ఎక్కువ తింటే... ‘మమ్మా! ప్లీజ్ ఆపు’ అంటారు. ఇప్పుడు నాకంటే వాళ్లే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. ♦ ఇంట్లో మీరు ఎక్కువ తెలుగు మాట్లాడతారా? మా సిస్టర్, కజిన్స్తో తెలుగులోనే మాట్లాడతా. రోజుకి ఓ పదిసార్లైనా వాళ్లు–నేను ఫోనులో మాట్లాడుకుంటాం. నేను ఫోనులో తెలుగు మాట్లాడుతున్నంత సేపూ మా ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. మా సిస్టర్ ఫోన్ చేయగానే వచ్చి పక్కన కూర్చుంటారు. ♦ మీ పిల్లలు తెలుగు మాట్లాడతారా? లేదండీ. వాళ్లకు అంతగా రాదు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు. ♦ మీరు బోనీ కపూర్గారికి నేర్పించిన రెండు మూడు తెలుగు పదాలు చెప్పండి? ఎప్పుడూ ‘ఏమ్మా...’ అంటుంటారు (నవ్వులు). ♦ తెలుగు నుంచి మీ పెద్దమ్మాయికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కదా? ఏయే ఆఫర్స్ వచ్చాయి. ఎవరెవరు మా అమ్మాయిని నటించమని అడిగారు? అనేవి చెప్పడం నాకిష్టం లేదు. ఏదైనా దర్శక–నిర్మాతలు అఫిషియల్గా ఎనౌన్స్ చేస్తారు. ♦ మీరు ఓ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తే చూడాలనుంది? నేను తెలుగమ్మాయినే. తెలుగు ఇండస్ట్రీ నాకెంతో ఆప్యాయత, అనురాగం, అభిమానం ఇచ్చింది. నేను ఏనాడూ దాన్ని మర్చిపోను. తెలుగులో చేయాలని నాకూ ఉంది. ♦ ‘మామ్’ ప్రెస్మీట్లో రాఘవేంద్రరావుగారిని కలిసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయా? ఆయన చెప్పారు కదా! మా ఇద్దరి కాంబినేషన్లో 24 సినిమాలు వచ్చాయి. ఇట్స్ రియల్లీ గ్రేట్. ఆయన దర్శకత్వంలో చేసిన ప్రతి సినిమా నాకో అందమైన జ్ఞాపకమే. ఆయనింకా అలానే ఉన్నారు. (నవ్వుతూ..) కానీ, ఓ కళ్లజోడు లేదంతే. ♦ నేను ఫలానా క్యారెక్టర్ చేయలేదని ఎప్పుడైనా ఫీలయ్యారా? అలా ఏం లేదు. ఇప్పటివరకూ నేను ఆల్మోస్ట్ అన్నీ మంచి పాత్రలే చేశాను. అయితే, ముందుగా నాకు అవకాశం వచ్చినా కొన్ని సినిమాలు చేయలేక పోయాను. అవి చాలా పెద్ద హిట్టయ్యాయి. కొన్ని కారణాల వల్ల అవి చేయలేదు. దర్శక–నిర్మాతలు కూడా ‘నేనెందుకు చేయలేదు’ అనే విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. నన్నూ ఎవరూ ‘ఎందుకు చేయలేద’ని తరచి తరచి అడగలేదు. ♦ రీసెంట్గా ‘బాహుబలి’ని కూడా మీరు వదిలేసుకున్నారు? నేను చెన్నై వెళ్లినా, ముంబయ్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా... ‘బాహుబలి’ గురించే అడుగుతున్నారు. ఎందుకనేది నేనెవరికీ చెప్పలేదు. కానీ ‘సాక్షి’ పత్రిక ద్వారా ఓ క్లారిటీ ఇవ్వాలనుంది. ‘బాహుబలి’ గురించి మాట్లాడటానికి రాజమౌళిగారు నా దగ్గరకు వచ్చారు. ఆయన తీసిన ‘ఈగ’ చూశాను. నాకు బాగా నచ్చింది. అఫ్కోర్స్.. ఐ లవ్ ద స్టోరీ (బాహుబలి). కానీ, కొన్ని కారణాల వల్ల నేనా సినిమా చేయలేకపోయాను. అయితే, నేనేదో అన్రీజనబుల్గా డబ్బులు అడిగాననీ, తర్వాత హోటల్ మొత్తం బుక్ చేయాలన్నాననీ, పది టికెట్స్ (ఫ్లైట్) కావాలన్నాననీ... దారుణంగా, అన్యాయంగా నిర్మాతను దోచేసుకోవాలను కున్నాననే మాటలు వినిపించాయి. అందువల్ల, సినిమా చేయలేదన్నారు. వీటిని మొదట్లో నేను నమ్మలేదు. ఇలా ఎవరు మాట్లాడతారులే అనుకున్నా. కానీ, ఒకరు యూట్యూబ్ లింక్ పంపిస్తే రాజమౌళిగారి ఇంటర్వ్యూ చూశా. అందులో ఆయన మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ అనిపించాయి. నేనేదో 8 కోట్లు అడిగానట. మొత్తం హోటల్ బుక్ చేయమన్నానట. నేనంత దారుణంగా అడిగి ఉంటే... 300 సినిమాలు చేసేదాన్ని కాదు. 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు. ఓ ఆర్టిస్ట్గా నిర్మాత కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మహేశ్బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే.. మీ అమ్మాయి జాన్వీ రిజెక్ట్ చేసిందనే టాక్ వచ్చింది... నిజమా? ఎంత అన్యాయమండీ. నాకు మహేశ్బాబుగారంటే చాలా ఇష్టం. ఆయన ఉన్నారంటే ఆ సినిమా నేను చూడాల్సిందే. మహేశ్గారి యాక్టింగ్, ఆయన స్టైల్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఒకవేళ మా పాప జాన్వీకి మహేశ్బాబు సరసన యాక్ట్ చేసే చాన్స్ వస్తే మేం చాలా సంతోషపడతాం. అలాంటిది ఆయన సినిమాకి అడిగితే జాన్వీ రిజెక్ట్ చేసిందని రాశారు. జాన్వీ వయసెంత? తనింకా సినిమాలు కూడా మొదలు పెట్టలేదు. అప్పుడే ఒక హీరోని రిజెక్ట్ చేస్తుందా? నిజం ఏంటో తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే ‘అ ఆమ్మాయికి పొగరు’ అనరా? అలాంటివి చదివితే ఒక తల్లిగా నాకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోండి. ♦ మీ ఇంట్లోనూ నిర్మాత ఉన్నారు కాబట్టి, వాళ్ల కష్టాలు బాగా తెలిసే అవకాశం ఉంటుంది... అవును. మా ఆయన ఎంతో అనుభవం ఉన్న నిర్మాత. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ఆయన పడే కష్టాలు నాకు తెలుసు. అందుకే ఆయన నిర్మాతలను దోచుకునే డిమాండ్స్ చేయరు. టెక్నీషియన్గా రాజమౌళి పెద్ద వ్యక్తి. ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాలు ఇంకా తీయాలి. ఇంకా హిట్ సినిమాలు తీయాలని ఆశిస్తున్నా. బట్, నా గురించి చేసిన కామెంట్స్కి నేను అప్సెట్ అయ్యా. ఓ పబ్లిక్ ప్లాట్ఫామ్లో లేనిది ఉన్నట్లు ఎలా మాట్లాడవచ్చనేది నా పాయింట్. ♦ కృష్ణగారితో 40 సినిమాలకు పైగా చేసినట్లున్నారు... రాఘవేంద్రరావుగారితో 24 సినిమాలు.. ఇలా రిపీట్ కాంబినేషన్స్లో సినిమాలు చేశారు కదా? నిజమే. ఒకవేళ నేను బోలెడన్ని డిమాండ్స్ వాళ్ల ముందు పెట్టి ఉంటే, ఎందుకు రిపీట్ చేస్తారు. నేను రాజమండ్రి, విశాఖల్లో ఎక్కువ పని చేశా. అప్పట్లో అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉండేవి కాదు. ఇతర సౌకర్యాలు లేవు. చెట్టు వెనకాలో, గుడిసెలోనో, ఓ ఇంటి లోపలికో వెళ్లి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునేదాన్ని. నేనంతటి నిరాడంబరమైన ఆర్టిస్టుని. ఒకవేళ నిర్మాతలు (బాహుబలి) ఆయనతో (రాజమౌళి) లేనిపోనివి చెప్పినా కూడా వాటిని పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పటం ఎంతవరకు సమంజసం? నేను చాలా హర్ట్ అయ్యాను. షాక్ అయ్యాను కూడా. రాజమౌళి గారు చాలా మంచి మనిషి. కామ్ అండ్ డీసెంట్. ఏదీ ఎక్కువ మాట్లాడరనుకున్నా. ఆ ఇంటర్వ్యూ చూస్తే చాలా బాధ కలిగింది. ఒక ఆర్టిస్ట్ గురించి ఏమీ తెలుసుకోకుండా... అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ♦ ఫైనల్లీ... మీరు బాగా హర్ట్ అయ్యారని అర్థమవుతోంది... అవునండీ. చాలా. ‘ఈ వార్తలకు ఎందుకు రియాక్ట్ కావడం లేదు. ఎక్కడో ముంబయ్లో కూర్చున్నారు. ఇక్కడ విషయాలేం మీకు తెలియడం లేదు’ అంటూ కొంతమంది ఫోన్ చేశారు. ఎందుకులే? అని నేనెప్పుడూ పబ్లిక్గా ఏమీ మాట్లాడలేదు. కానీ, లోలోపల మాత్రం చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా నేను ఇన్ని మాట్లాడింది బాధతోనే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. – డి.జి. భవాని -
ఇక ఆ మొబైల్కు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్
న్యూఢిల్లీ: బాహుబలితో సూపర్స్టార్ నటుడిగా ఎదిగిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ప్రభాస్ భాగస్వామ్యంతో పనిచేసేందుకు తమ కంపెనీ చాలా ఉత్సాహంతో ఉందంటూ ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ జియోనీ ఇండియా ప్రకటించింది. ఇక నుంచి ప్రభాస్ తమ మొబైల్ సెట్కు బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తారని జియోని ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోరా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జియోనీకి ప్రచారకర్తలుగా టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ, అలియాభట్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ దోసాంజ్ ఉండగా ఇప్పుడు తాజాగా ప్రభాస్ వీరితోపాటు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ‘ ప్రభాస్తో కలిసి మేం పనిచేయబోతున్నామని ప్రకటించడాన్ని మేం గర్వంగా భావిస్తున్నాం. సమర్థమంతమైన బ్యాటరీలు, చక్కటి సెల్ఫీలు అనే వాటికి ప్రభాస్తో పనిచేసేందుకు మేం సానుకూలంగా ఉన్నాం’ అని ఆయన తెలిపారు. -
బాహుబలికి సవాల్గా 2.0
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. ప్రపంచ సినిమాను తనవైపు చూసేలా చేసిన బ్రహ్మండ చిత్రం బాహుబలి–2. వసూళ్ల పరంగా భారతీయ సినిమా రికార్డులను బద్దలుకొట్టిన చిత్రం ఇది. హిందీ చిత్రం దంగల్ కలెక్షన్ల పరంగా బాహుబలి–2కు దీటుగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు దర్శకుడు శంకర్కు పెద్ద పరీక్షనే పెడుతున్నాయని చెప్పాలి. తాజాగా శంకర్.. సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ప్రతినాయకుడిగా, ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్ కథానాయకిగా తెరకెక్కిస్తున్న చిత్రం 2.0. ప్రస్తుతం బాహుబలి–2, దంగల్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేయడమే శంకర్ ముందున్న లక్ష్యంగా మారింది. దీంతో 2.0 చిత్ర యూనిట్పై బాధ్యతలు రెట్టింపయ్యాయి. కారణాలేమయినా 2.0 చిత్ర నిర్మాణ వ్యయం, చిత్రీకరణ రోజులు పెరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికే విడుదల తేదీని రెండుసార్లు వాయిదా వేసుకున్న చిత్ర వర్గాలు, సాంకేతికత పరంగా ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక వర్గాన్ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు 2.0 చిత్రాన్ని జనవరిలో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో విశేషాలేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా 15భాషల్లో, 7వేల థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయని తెలిసింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకూ 2.0 చిత్రం సాధించే తొలి రికార్డ్ అవుతుంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర శాటిలైట్ హక్కులే రూ.110 కోట్లకు అమ్ముడు పోవడం మరో రికార్డు. మొత్తం మీద బాహుబలి చిత్రానికి 2.0 సవాల్ విసురుతుందా? వేచి చూడాల్సిందే. -
’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం!
-
’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం!
అనంతపురం: రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతున్న ’బాహుబలి-2’ సినిమా కోసం మందుబాబులు వీరంగం వేశారు. గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో కేపీఎస్ థియేటర్ వద్ద గొడవకు దిగారు. లేడి లేచిందే పరుగు అన్నట్టు తమకోసం అర్ధరాత్రి బాహుబలి-2 షో వేయాలంటూ పట్టుబట్టారు. ఇందుకు థియేటర్ సిబ్బంది నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తులైన మందుబాబులు వారిపై దాడికి దిగారు. అర్ధరాత్రి మందుబాబులు వీరంగం వేసిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బాహుబలి.!
► పెనుగాలులకు ఎగిరిపోయిన బాలుడు ► మృత్యుంజయుడిగా నిలిచిన వైనం కడప: బాహుబలి చిత్రంలో బాలుడు ప్రమాదం నుంచి తప్పించుకొని ఎలా బతికి బట్టకడతాడో అదే రీతిలో ప్రకృతి ప్రకోపాన్ని సైతం తట్టుకొని బతికి బయటపడ్డాడు ఓ చిన్నారి. ఈ ఉదంతం కడప-నెల్లూరు రహదారిలోని రాజంపేట మండలం మందరం గ్రామపంచాయతీ కొత్తపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. పెనుగాలులు వీచిన సందర్భంగా ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతున్న నెలల చిన్నారి కొట్టుకుపోయి..కేవలం స్వల్ప గాయంతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. అనంతపురం జిల్లా గుత్తి తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు మందరం కొత్తపల్లెలోని సిమెంటు ఇటుకల ఫ్యాక్టరీ ఆవరణంలోని రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఈ వలస కుటుంబానికి చెందిన సులోచన ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం సాయంత్రం సమయంలో తన బిడ్డను రేకుల కింద కట్టిన ఊయలలో నిద్రపుచ్చి, తల్లి తన పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో ఉన్నఫళంగా గాలి..వాన మొదలైంది. ఉన్నట్లుండి గాలి ఉధృతంగా వీచడంతో ఇంటి పైకప్పుగా వేసిన రేకులు ఒక్క ఉదుటున కొట్టుకుపోయాయి. ఊయలతో సహా గాలిలోకి.. పెను గాలుల ధాటికి రేకుల షెడ్డు కింద ఉన్న ఊయలలో ప్రశాంతంగా నిద్రపోతున్న నెలల చిన్నారి ఊయల కూడా కొట్టుకుపోయింది. ఉన్నట్లుండి ఊయల గాలికి కొట్టుకుని పోవడంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ ముద్దుల బిడ్డ గాలి దెబ్బకు కొట్టుకుపోయి ఎక్కడ పడ్డాడో.. ఏమయ్యాడో..అంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్కడ ఉన్న వారంతా గాలుల ప్రభావం తగ్గిన తర్వాత గాలించగా తమ నివాసాలకు కొద్ది దూరంలో రేకుల కింద పడి ఉండటం చూసి అక్కున చేర్చుకున్నారు. అప్పటికే చిన్నారి ఏడుస్తున్నాడు. చేతికి స్వల్ప గాయమైంది. ఈదురు గాలులకు కొట్టుకుపోయిన తమ చిన్నారి ప్రాణాలతో ఉండటంతో కన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే చిన్నారి తల్లికి కూడా గాలులతో లేచిపోయిన రేకులు తగిలి గాయపడింది. దీంతో వెంటనే వైఎస్సార్సీపీ యువజన విభాగం తల్లీబిడ్డలకు వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. మొత్తానికి ఆ బాలుడు బాహుబలిలా ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి మృత్యుంజయుడిగా నిలిచాడంటూ పలువురు పేర్కొనడం గమనార్హం. -
బాహుబలి లాంటి అమరావతి?
ఆలోచనం ‘‘బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అమరావతి కూడా మరో బాహుబలి కావాలి’’ అని, చిన్న వ్యాపార సినిమాను ఒక రాష్ట్ర ముఖ్యపట్టణ నిర్మాణంతో పోల్చిన సీఎం నుంచి మనం అంతకంటే జ్ఞానాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. ‘‘అమరావతి అంటే దేవతల రాజధాని. అందుకే భూమి మీద మరో స్వర్గాన్ని, బ్రహ్మాం డమైన నగరాన్ని నిర్మించుకుందాం’’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్న సందర్భంలో సీఎం అన్నమాటలివి. చిన్నప్పుడు, మాకు మా చిన్నాన్న ‘‘బాలల విజ్ఞాన సర్వస్వం’’ అనే పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చారు. బుడ్డిగ సుబ్బరాయన్ గారు సంపాదకత్వం వహించిన ఆ పుస్తకంలో అమరావతి అంటే, ‘‘ఒకప్పుడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బౌద్ధ క్షేత్రం ఇది’’ అని పరిచయం చేస్తూ అమరావతీ స్తూపం బొమ్మ కూడా ఇచ్చారు. అమరావతి గురించిన మలి జ్ఞాపకం ఇది నాకు, తొలి జ్ఞాపకం శంకరంబాడి ‘మా తెలుగు తల్లికి’ లోని, అమరావతి నగర అపురూప శిల్పాలు అనే వాక్యం. ఇప్పుడు చంద్రబాబు అమరావతి అంటే దేవతల రాజధాని అన్నాక కొమర్రాజుగారి విజ్ఞాన సర్వస్వం రెండవ భాగంలో ఉన్న అమరావతి విశేషాలు వెదికాను. ఆయన అమరావతి దేవతల ముఖ్యపట్టణం, ఇంద్రుని రాజధాని అని ఒక 50 పదాలు రాసి ఆ తరువాత పేజీల కొద్దీ సమాచారం అమరావతి స్థూపం గురించి, మహా యాన బౌద్ధం గురించీ, ఆచార్య నాగార్జునుని గురించి, లోకప్రశస్తి గాంచిన ఆ స్తూప శిల్ప కళ, ఆ పిదప వచ్చిన వీరశైవమూ, అమరలింగేశ్వర ఆలయం గురించి రాసుకుంటూ వెళ్లారు. ఎక్కడా సీఎం చెప్పిన స్వర్గం గురించిన గొప్పతనం ప్రస్తావించలేదు. దేవతల స్వర్గం అనేది మనుష్యులు సృష్టించిన ఒక భ్రాంతి. ఎమ్మా గోల్డ్మన్ ‘స్వర్గం మరియు నరకం, వరాలు మరియు శాపాలు ప్రజలను అదుపులో పెట్టడానికి, సంతృప్తంగా ఉంచడానికి సాధుస్వభావులుగా ఉంచడానికి ఉపయోగించే కొరడా’ అంటుంది. మనుషులు అలా సృష్టించిన స్వర్గనాయకుడు ఇంద్రుడు ఆయా పూర్వ పుస్తకాల ప్రకారమే చూసినా అంత గొప్ప వ్యక్తిత్వం కలవాడు కాదు. ఇంద్రుని గురించి పక్కనపెట్టి చంద్రబాబు చెప్పిన స్వర్గాన్నీ చూసినా ఈ స్వర్గంలో గొప్ప గొప్ప పనులేమీ జరగవు, అందరు పనీ పాటు లేకుండా గుంపులు తీరి కూర్చుని, దేవవేశ్యలు అనేవాళ్లు చేసే డాన్సులు చూస్తూ, సుర అనే కాపు సారా తాగుతూ ఆనందిస్తుంటారు. మరీ ముఖ్యంగా స్త్రీల కోసమని స్వర్గాలేం లేవు. స్వర్గానికెళ్లిన స్త్రీలు ఎవరి నృత్యాలు చూస్తారో మనకి తెలియనే తెలియదు. ఈ పురాణ సంబంధిత విషయాలను వదిలేసి చరిత్రను చూస్తే పూర్తిగా రూఢీ కాకున్నా ఇంద్రుడు దస్యుల నగరాలను కూలదోశాడు. అందుకే అతనికి పురంధరుడు అనే పేరు ఉంది. ‘‘బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అలా అమరావతి కూడా మరో బాహుబలి కావాలి’’ అని, చిన్న వ్యాపార సినిమాను ఒక రాష్ట్ర ముఖ్యపట్టణ నిర్మాణంతో పోల్చిన సీఎం నుంచి మనం అంతకంటే జ్ఞానాన్ని ఆశించాల్సిన అవసరం లేదు కానీ, తన స్వర్గ రక్షణ కోసం జీవహత్యాపాతకానికి వెరవని ఇంద్రునికి సీఎంకు కొన్ని పోలికలున్నాయి. ఇప్పుడు చెపుతున్న స్వర్గ నిర్మాణానికి సేకరించిన భూమిలో 40%, 20 అడుగుల లోతులోనే నీరు లభించి, 120 రకాల పంటలు పండగలిగే జరీబు భూమి. భారతదేశంలోని అత్యంత నాణ్యమైన భూములలో ఇది ఒకటట. ఈ భూమిని, సీఎం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు 1908 నాటి రెవెన్యూ రికార్డులు చూపించి ఇది వట్టి బీడు భూమి అంటూ పురంధరుడిలా ధ్వంస రచన చేశారు. పూర్వకాలంలో రాజులు ఉన్నపుడు, ఆ రాజు కోటను స్వాధీనం చేసుకుంటే రాజ్యం స్వాధీనం అయిపోయినట్టే అనే భావన ఉన్న కాలంలో రాజధాని అనే ఫ్యూడల్ భావనకు విలువ ఉండేది. ఇపుడు ఆ అవసరం ఏముంది? అందుకే ప్రభుత్వ కార్యకలాపాలకు ఒక చిన్న ప్రాంతాన్ని కేటాయిస్తే సరిపోతుందని కె.సి. శివరామకృష్ణ కమిటీ సూచించింది. ఆ సూచనలను సీఎం పెడచెవినపెట్టి అభివృద్ధినంతా హైదరాబాదులో కేంద్రీకరించినట్టు ఒకే చోట కేంద్రీకరిస్తూ పాత తప్పులని తిరిగి చేస్తున్నారు. మెడికల్ సైన్స్ ప్రకారం ఒకే చోట విపరీతమయిన పెరుగుదల ఉంటే దానిని ఆరోగ్యకరమైన అభివృద్ధి అనరు. కేన్సర్ అంటారు. అమరావతి కేన్సర్ లాగా పెరిగిపోయి ప్రజలంతా అక్కడికి వలసలు పోవడంకంటే 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందడం ఆరోగ్యకరం కదా. అప్పుడు మనం అమరావతికి వలస వెళ్లకుండా ఉండే ఊర్లోనే ఉద్యోగాలు చేసుకోగలం కదా. రాజరికపు చరిత్ర చివరిలో అమరావతిని చింతపల్లి జమీందార్ రాజా వెంకటాద్రి నాయుడు రాజధానిగా చేసుకున్నాడట, పెద్ద రోడ్లు వేయించి, ఎక్కడెక్కడినుండో వైశ్యులను రప్పించి వారికి రకరకాల సహాయాలు చేసి వ్యాపారాలు పెట్టించాడట, పై కప్పుపై తళతళలాడే రాగి రేకులను తాపడం చేయించి భవ్యమైన రాజమందిరం కట్టించుకున్నాడట. కానీ ఆ తరువాత ఆయన వారసులు కొట్లాడుకుని కోర్టులకెక్కగా రాజ్యం గవర్మెంటు స్వాధీనమయిందట. సీఎం అలాగే తాపడపు భవనాలు కట్టిస్తున్నారు. సరే అలాగే కట్టించండి కానీ, భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తున్న సీఎం గారూ.. ఒక్క ప్రశ్నకు సమాధానమివ్వండి, ఈ ప్రశ్న మయసభను చూడవచ్చిన నారదుడు ధర్మరాజును అడిగాడు ‘‘హీనులగు కర్షకులకును! భూనుత! ధాన్యంబు బీజములు వణిజులకున్ మానుగ శతైకవృద్ధి న! నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్’’. 2–1–44 ఓ ధర్మరాజా! ఉదారబుద్ధితో పేద రైతులకు ధాన్యపు విత్తనాలూ, వర్తకులకు నూటికి ఒక రూపాయి వడ్డీ వంతున అప్పులు ఇస్తున్నావు కదా? వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య కిరణ్ 91635 69966 -
వాళ్లవి రాంగ్ స్టెప్స్... ‘బాహుబలి’ది రైట్ స్టెప్!
భారతీయ దర్శక–నిర్మాతలు ఎవరూ ‘బాహుబలి’ వంటి సినిమాలు తీసే సాహసం చేయలేదా? కలలో కూడా అలాంటి సినిమా గురించి ఊహించలేదా? అనడిగితే... ‘‘ఎందుకు లేదు? ఎప్పుడో ‘బాహుబలి’ విడుదలకు ముందెప్పుడో ఊహించారు. అటువంటి సినిమా తీశారు కూడా. కానీ, సక్సెస్ కాలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి’ గురించే డిస్కషన్. ఆ సినిమా సాధించిన సక్సెస్ అటువంటిది మరి. ఇండియన్ సినిమాపై ‘బాహుబలి’ ప్రభావం ఎంతుంది? అనే దానిపై ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెహమాన్కు సేమ్ క్వశ్చన్ ఎదురైంది. అప్పుడు రెహమాన్ – ‘‘బాహుబలి’ గురించి తప్పకుండా చెబుతాను. అంతకు ముందు కొన్ని విషయాలు చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు శేఖర్ కపూర్ ‘పానీ’ పేరుతో సినిమా తీయాలనుకున్నారు. ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కానీ, సెట్ కావడం లేదు. ఈ మేనియాను ఏడెనిమిదేళ్ల క్రితమే శేఖర్ కపూర్ ఊహించారు. తర్వాత ‘కొచ్చాడియన్’లో యానిమేషన్, సీజీ వర్క్ (గ్రాఫిక్స్) సరిగా కుదరలేదు. లేకపోతే... అది ‘బాహుబలి’ అయ్యేదే. సో, ఇట్ ఈజ్ నాట్ లైక్ ‘బాహుబలి’ ఈజ్ ద ఫస్ట్ వన్ (బాహుబలి ఏం ఫస్ట్ సినిమా కాదు). అలాంటి ప్రయత్నాలు అంతకు ముందు జరిగాయి. కానీ, ఫెయిల్ అయ్యాయి. వాళ్ల నమ్మకం సరైనదే. కానీ, తప్పటడుగులు పడ్డాయి. ‘బాహుబలి’ టీమ్ ఈజ్ వెరీ లక్కీ. మంచి మంచి ప్రతిభావంతులు ఆ సినిమాకు పనిచేశారు’’ అన్నారు. -
బాహుబలి నామకరణం ఖరారు!
భువనేశ్వర్ (బారంగ్): నగర శివార్లు బారంగ్ జంతు ప్రదర్శన శాల నందన్కానన్లో జన్మించిన పులిబిడ్డకు బాహుబలిగా నామకరణం చేయడం విశేషం. నందన్కానన్లో విజయ, మేఘ, స్నేహ అనే మూడు పులులు ప్రసవించిన 7 పులిపిల్లలకు బుధవారం నామకరణం చేశారు. సినీ రంగంలో సంచలనం సృష్టించిన బాహుబలి పేరును వీటిలో ఒక పిల్లకు పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. బాహుబలి నామకరణం ఖరారు చేయడం వెనక బలమైన ప్రజాభిప్రాయం ఉండడం మరో విశేషం. నందన్కానన్కు పలు ప్రాంతాల నుంచి విచ్చేసే పర్యాటకులను కొత్తగా జన్మించిన పులి పిల్లలకు పేర్లను ప్రతిపాదించాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో పర్యాటకులు పేర్లను ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయంలో అత్యధికంగా 52 శాతం మంది బాహుబలి పేరును ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయానికి పట్టం గడుతూ ఒక పులిపిల్లకు బాహుబలి పేరును ఖరారు చేశారు. మిగిలిన 6 పులి పిల్లలకు కుందన్, సాహిల్, ఆద్యాశ, చిన్ను, విక్కి, మౌసుమిగా పేరు పెట్టారు. కొత్త పులి పిల్లల్ని అంచెలంచెలుగా పర్యాటకుల సందర్శన కోసం ఎంక్లోజర్లో బహిరంగపరుస్తారు. -
వెయ్యి కోట్ల కథ
వెయ్యి కోట్లకు అడుగేసింది... ఇంకెన్ని కోట్లకు పడగలేస్తుందో! ఒక ఇండియన్ సినిమా.. అందులోనూ ఒక తెలుగు సినిమా వెయ్యి కోట్ల క్లబ్కి నాందిపలికింది. ‘సాహో.. తెలుగు సినిమా’ అని అందరూ అనేట్లుగా ‘బాహుబలి’ మన ఖ్యాతిని పెంచింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి, పదిహేను వందల కోట్ల దిశగా దూసుకెళుతోంది. పిండి కొద్దీ రొట్టె. కథ కొద్దీ సినిమా. ‘బాహుబలి’కి బహు బలమైన కథ ఇచ్చిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్తో ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్. ‘బాహుబలి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది? 2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నాడు. అప్పుడు కథ రాయడం మొదలుపెట్టాను. కథావస్తువు పెద్దది కాబట్టి క్లిష్టంగా అనిపించిందా? అస్సలు లేదు. అన్ని కథలు రాసినట్లుగానే ఇది కూడా సునాయాసంగానే రాసేశాను. మనం ఏం రాయాలనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటే రాయడం ఈజీ. కథ తయారు కావడానికి ఎన్ని నెలలు పట్టింది? మూడు నాలుగు నెలల్లో రాసేశాను. రెండు భాగాలుగా తీయాలనే రాయడం మొదలుపెట్టారా? ఒక సినిమానే అనుకున్నాం. కానీ, కథ రాయడం మొదలుపెట్టాక అది సాధ్యం కాదనిపించింది. పెద్ద కథ అయిపోయింది. అందుకని రెండు భాగాలు ప్లాన్ చేశాం. ‘బాహుబలి’ అని ఎందుకు టైటిల్ పెట్టాలనిపించింది? తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీసి, హిందీలో అనువదించాలనుకున్నాం. ‘బాహుబలి’ అంటే హిందీలో బలవంతుడు అని అర్థం. సౌత్వాళ్లకూ టైటిల్ అర్థం అవుతుంది. పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. కట్టప్ప, శివగామి తదితర పాత్రల పేర్లు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? కథ రాసుకున్నప్పుడే పెట్టాం. తమిళనాడు నుంచి ఇక్కడికొచ్చిన అమ్మాయిగా రమ్యకృష్ణ పాత్రను మలిచాం. అందుకే శివగామి అని పెట్టాం. శివగామి అంటే మధురై మీనాక్షి అమ్మవారు. శివగామితో పాటే వచ్చిన వ్యక్తి కట్టప్ప అన్నమాట. అందుకే తమిళవాళ్లు రిలేట్ చేసుకునేట్లు సత్యరాజ్ పాత్రకు కట్టప్ప అని పెట్టాం. తమిళ వాళ్ల పేర్లలో దాదాపు ‘అప్పా’ అని ఉంటుంది. అందుకే కట్టప్ప అయితే బాగుంటుందను కున్నాం. ప్రభాస్ చేసిన తండ్రీ కొడుకు పాత్రలకు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనుకున్నాం. భల్లాలదేవా, బిజ్జల దేవా, దేవసేన.. ఇవన్నీ కూడా కథ రాస్తునప్పుడే పెట్టాం. వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్నారా? భారీ సినిమా అవుతుందనుకున్నాను కానీ, ఈ స్థాయి ఊహించలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. మీ అబ్బాయి రాజమౌళి కోట్ల ప్రాజెక్ట్ భుజాన వేసుకున్నందుకు ఎప్పుడైనా టెన్షన్గా అనిపించిందా? నాకేం అనిపించలేదు. నిజానికి టెన్షన్ మొత్తం నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలదే. కోట్ల రూపాయల బడ్జెట్ అంటే రిస్క్. కానీ, వాళ్ల ముఖాల్లో టెన్షన్ చూడలేదు. ఈ సినిమాకి వాళ్లే హీరోలు. వెయ్యి కోట్లకు నాంది పలికిన తొలి ఇండియన్ మూవీ మన తెలుగు సినిమా కావడం ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హద్దులు చెరిపేసింది. కథ, కథకు తగ్గ బడ్జెట్, టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్.. ఇవన్నీ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారని అర్థమైంది. కథ బాగుంటే సినిమా ఆదరణ పొందుతుందనే ధైర్యాన్ని ఇచ్చింది. బలమైన కథను నమ్మి, భారీగా ఖర్చు పెట్టవచ్చని నిరూపించింది. ఇంత భారీ కథ రాశాక.. వేరే కథ రాయడం అంటే ఓ సవాల్లా అనిపిస్తోందా? అలా ఏం లేదు. ఏ సినిమా కథ దానిదే. ఐడియా రావడం.. రాసేయడం. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ ‘బాహుబలి’.. రేపు ఇంకోటి రావాలి. అప్పుడే బాగుంటుంది. పరిశ్రమ పచ్చగా ఉంటుంది. 2012లో రాజమౌళి నాతో రాజుల కాలం నాటి సినిమా చేయాలని ఉందన్నాడు. క్యారెక్టర్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలన్నాడు. మంచి వ్యక్తిగా ఉంటూ పరిస్థితుల ప్రభావంతో చెడుగా మారే పాత్ర కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నాడు. ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ ఓ మైలు రాయి. సినిమా రంగానికి చెందిన మా అందరికీ గర్వకారణం. టీమ్ వర్క్ బాగుంది. రాజమౌళి మాస్టర్ పీస్ తీశారు. అందరికీ శుభాకాంక్షలు. – ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ‘బాహుబలి’ విజయం ఇండియన్ సెలబ్రేషన్. ఈ సినిమాను ఎక్కడెక్క షూట్ చేశారో తెలుసుకోవాలని ఉంది. ఈ సినిమా చూశాక.. సినిమా అనే ఈ వ్యాపారంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉంది. – ప్రముఖ నటుడు రిషీ కపూర్ రాజమౌళి నాకెందుకు నచ్చాడంటే.. ఎంతో దమ్మూ ధైర్యంతో తాను అనుకున్నది క్రియేట్ చేశాడు. అసమాన ప్రతిభ కనబర్చాడు. – దర్శక–నిర్మాత–నటుడు శేఖర్ కపూర్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా నుంచి బయటకు రాలేకపోయాను. విజువల్స్, లొకేషన్స్, బడ్జెట్ ఇలాంటి విషయాలతో ‘బాహుబలి’ సినిమాను కొలవలేం. ఈ సినిమా అంతకుమించి. రాజమౌళికి హ్యాట్సఫ్. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘బాహుబలి’ టీమ్ గొప్ప విజయం సాధించింది. రాజమౌళి, ప్రభాస్, అనుష్క, సత్యరాజ్ , నాజర్ వీరికే కాకుండా టీం అందరికీ శుభాకాంక్షలు. – నటుడు అరవింద్ స్వామి -
నీలాంబరి టు... శివగామి
రమ్యకృష్ణ సినిమా కెరీర్లో మొదటి ఏడేళ్లు అన్నీ ఫట్లే! కుంగిపోలా... లోయలో పడిపోలా... సముద్రంలో మునిగిపోలా తనలో తను లీనమైపోయింది... తనకి తాను చెప్పుకుంది... తన కోసం తను నిలబడింది తన చెయ్యి తనే పట్టుకుని పర్వతం ఎక్కింది ఒక శిఖరం నీలాంబరి... ఒక శిఖరం శివగామి ఈ మధ్యలో అన్నీ శిఖరాగ్రాలే అయినా తలెగరేసినవి ఈ రెండే. 20 ఏళ్ల క్రితం నీలాంబరి అన్నా.. ఇప్పుడు శివగామి అన్నా మీరే చేయాలన్నంత గొప్ప నటి అనిపించుకున్నారు.. (నవ్వుతూ). ఇన్నేళ్ల కెరీర్లో ఏ పాత్ర వచ్చినా అన్నీ బాగా కుదిరాయి. అప్పట్లో నీలాంబరి.. ఇప్పుడు శివగామి రెండూ మంచి పాత్రలే. నాకు వచ్చిన ఏ పాత్రని అయినా నేను హండ్రెడ్ పర్సంట్ డెడికేషన్తో చేస్తాను. ‘బాహుబలి’కి మీరే హీరో అని సోషల్ మీడియా ద్వారా మీకు చాలా మెసేజ్లు వచ్చినప్పుడు ఏమనిపించింది? నాకైతే మాటల్లో ఎలా చెప్పాలో తెలియడంలేదు. నా ప్లేస్లో ఎవరు ఉన్నా హ్యాపీ ఫీలవుతారు. యాక్చువల్లీ నాకు ఏ క్యారెక్టర్ వస్తే అది చేసుకుంటూ వచ్చాను. నాకు సూట్ అయ్యే రోల్స్తోనే డైరెక్టర్స్ ఎప్రోచ్ అవుతారని నా నమ్మకం. అందుకే దాదాపు ఏ పాత్రకీ ‘నో’ చెప్పను. ‘బాహుబలి’కి అవకాశం రావడం నా లక్. లక్ని, దేవుణ్నీ నమ్ముతారా? లక్ని, దేవుణ్ణీ నమ్ముతా. నా టైమ్ ఆర్టిస్ట్లకి ఇలాంటి అవకాశాలు రావడం అరుదు. నాకు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను సాయిబాబా భక్తురాల్ని. సాయిబాబా అంటే ఎప్పటి నుంచీ నమ్మకం.. ఆ నమ్మకం పెరగడానికి ఏదైనా సంఘటనలున్నాయా? కొన్ని అద్భుతాలు జరిగాయి. అవి పూర్తిగా పర్సనల్. ఎప్పటినుంచి నమ్మడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా కెరీర్ బాగుంటోంది. మీకు తెలిసే ఉంటుంది.. హీరోయిన్గా నాకో మంచి హిట్ రావడానికి ఏడేళ్లు పట్టిందని. ఆ ఏడేళ్లల్లో మిమ్మల్ని ‘ఐరన్ లెగ్’ అన్నవాళ్లూ ఉన్నారు. ఆ ట్యాగ్ని ఎలా తట్టుకోగలిగారు? అప్పట్లో ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేశా. ఏడేళ్లు సక్సెస్లు లేవు. విమర్శలు ఎదుర్కొన్నా. అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్ తగ్గేది. ఆ సమయంలో ‘మనకు మనమే ధైర్యం చెప్పుకోకపోతే ఎలా?’ అనుకునేదాన్ని. కాన్ఫిడెన్స్ తెచ్చుకునేదాన్ని. చివరికి రాఘవేంద్రరావుగారి వల్ల నాకో హిట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి ‘శివగామి’ దాకా నా కెరీర్ సక్సెస్ఫుల్గా సాగిందంటే ఆయనే కారణం. లైఫ్లో చిన్నపాటి ఫెయిల్యూర్స్కే డిప్రెషన్లోకి వెళ్లిపోతున్న వాళ్లకు మీరు కచ్చితంగా రోల్ మోడల్ అనాలి... రోల్ మోడల్గా తీసుకోమని అనను కానీ లైఫ్లో ఎవరైనా సరే డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకు మనం అది చేసుకోలేకపోతే ఎవరు చేస్తారు? నా విషయాన్ని తీసుకుందాం. నేను విధిని నమ్ముతా. ఏ ఛాన్స్ వచ్చినా కాదనుకుండా చేశా. కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ వచ్చినా డెడికేషన్ తగ్గలేదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఫైనల్లీ నాకు మంచే జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయింది. అంతవరకూ ఓపిక పట్టాలి. గ్లామరస్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు.. అమ్మవారి పాత్రలూ చేయడం గొప్ప విషయం.. ‘ఒక పక్క గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తూ మరోపక్క అమ్మవారి పాత్రలా?’ అని కొంతమంది అన్నారు. కానీ, నేను పట్టించుకోలేదు. ఏ పాత్రని అయినా నేను డెడికేషన్తో చేయగలనని నాకు తెలుసు. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఏ పాత్ర చేసినా నమ్మకంతో చేస్తాను. అది కమర్షియల్ రోల్స్ అయినా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అయినా.. దేవుడి సినిమాలైనా. ఇలా అన్నీ చేయడం నాకు అడ్వాంటేజ్ అయింది. సమాజ ధోరణి చూస్తుంటే.. మీ ‘కంటే కూతుర్నే కను’ గురించి మాట్లాడాలనిపిస్తోంది.. ఇప్పుడు కొంతమంది ఆడపి ల్లను భూమ్మీదకు రాకముందే అంతం చేయడమో లేకపోతే వచ్చాక చెత్తకుండీలో పడేయడమో చేస్తున్నారు... ‘కంటే కూతుర్నే కను’ మంచి సినిమా. ప్రేరణగా తీసుకోవాల్సిన మూవీ. మీరన్నట్లు ఆడపిల్లకు ఆదరణ లేకుండా పోతోంది. నాకు తెలిసినంతవరకూ అమ్మాయిలే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అమ్మానాన్నలను, అక్కచెల్లెళ్లను, భర్తను.. మొత్తం కుటుంబాన్ని చూసుకుంటారు. బాధ్యతగా ఉంటారు. అబ్బాయిలు అంత బాధ్యతగా ఉండరని నా ఫీలింగ్. మరి.. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు వద్దని ఎందుకనుకుంటున్నారో? సమాజంలో ఆడవాళ్లు నెగ్గుకు రావడం అంత ఈజీ కాదేమో.. ఉదాహరణకు సినిమా పరిశ్రమలో కెరీర్ స్మూత్గా సాగాలంటే ‘అడ్జస్ట్మెంట్’ అనే మెలిక పెడతారని ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు బహిరంగంగానే అన్నారు... అన్నవాళ్లే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆడవాళ్లకు ఇబ్బందులు లేనిదెక్కడ? ఒక్కో చోట ఎక్కువ సమస్యలు.. ఒక్కోచోట తక్కువ. వేరే ఫీల్డ్లో కూడా ‘అడ్జస్ట్మెంట్’ అనేది ఉంటుందేమో. కానీ, అడ్జస్ట్ అవ్వాలా? వద్దా? అనే నిర్ణయం ఎవరికి వాళ్లు తీసుకోవాలి. తప్పదు.. కెరీర్లో ముందుకెళ్లాలనుకున్నవాళ్లు అడ్జస్ట్ అవుతారు. వద్దనుకున్నవాళ్లు ‘నేనిలాగే ఉంటాను’ అని అడ్జస్ట్ అవ్వ రు. వాళ్ల వాళ్ల మైండ్సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ‘రైట్ రాయల్’గా బతికే పరిస్థితి ‘ఉమెన్’కి ఉండదా? సొసైటీ మేల్ డామినేటెడ్ అండి. ఎక్కడైనా ఒక మగాణ్ణి.. స్త్రీ రేప్ చేసిందనే వార్త వింటామా? వినం కదా. మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలనేది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ‘మీరిలా తెలివిగా ఉండాలి. ఇలా చేస్తే నెగ్గుకు రావచ్చు’ అని సలహాలివ్వలేను. ఎందుకంటే, ఫేస్ చేసే సిట్యుయేషన్ బట్టి నిర్ణయాలు ఉండాలి. ఏది రైట్ అనిపిస్తే అది చేయాలి. అది కొందరికి తప్పు అనిపించవచ్చు. కానీ, మన నిర్ణయాలు తీసుకునే హక్కు మనకుంటుంది కదా. లైంగిక వేధింపుల గురించి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది.. నిర్భయలాంటివి? జరగకూడనివి జరుగుతున్నాయి. అవి విన్నప్పుడు, టీవీల్లో చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. శిక్ష కఠినంగా ఉండాలి. ఆ శిక్ష చూసి, తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. నేరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు చట్టంలో మార్పు చేసి, శిక్ష అమలు చేయాలి. ఇలా చేయడం వల్ల దాడులు ఆగుతాయనడంలేదు. కాకపోతే సగం అయినా తగ్గుతాయని నా బలమైన నమ్మకం. నిర్భయ ఘటన తీర్పు నేరగాళ్లకు మంచి హెచ్చరిక. అనుకోకుండా మంచి పాత్రలు కుదిరాయన్నారు. విచిత్రంగా మీ భర్త పేరు, మీ పేరు (‘రమ్యకృష్ణవంశీ’) కూడా భలే కుదిరింది.. లవ్ని ఎవరు ప్రపోజ్ చేశారండి.. (నవ్వుతూ).. నిజమే.. పేరు భలే కుదిరింది. పర్టిక్యులర్గా ప్రపోజల్ అంటూ ఏమీ చేయలేదు. పెళ్లికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచీ పరిచయం. ఆ ట్రావెల్లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే బాగుందనుకున్నాం. కంఫర్టబుల్గా సెటిలయ్యాం. ∙ కృష్ణవంశీగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఆవిడ ఏంజిల్’ అని మీ గురించి అన్నారు. ఆయన గురించి మీరేమంటారు? ఐయామ్ లక్కీ. కృష్ణవంశీగారిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడిన సందర్భం ఒక్కటీ లేదు. నా కెరీర్ కోసం నేను చెన్నైలో ఉంటున్నాను. ఆయన హైదరాబాద్లో ఉంటారు. ‘నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు’ అని ఉంటే, నేనేం చేయలేను. కానీ, ఆయన ‘వర్క్ ఓరియంటెడ్’. వర్క్ విలువ తెలుసు కాబట్టి, నేను హ్యాపీగా కెరీర్ కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇంత ఫ్రీడమ్ ఎవరిస్తారు చెప్పండి? ఆడవాళ్లంటే ఆయనకు గౌరవం ఎక్కువ. ఎంకరేజ్ చేస్తారు. ‘హీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ మి’. భర్త రూపంలో ఉన్న మంచి స్నేహితుడు ఆయన. చెన్నైలో మీరు.. హైదరాబాద్లో కృష్ణవంశీగారు... మిస్ అవుతున్నట్లుగా అనిపించదా? అలాంటిదేం లేదు. మేం చెట్లు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే ఏజ్లో లేం. మెచ్యుర్డ్ పీపుల్. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోతామని కాదు. ఫోన్లో మాట్లాడుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. వీలునప్పుడు ఆయన చెన్నై, నేను హైదరాబాద్ వస్తుంటాం. అప్పుడు కూడా ఎవరో ఒకరం వర్క్తో బిజీగా ఉంటాం. దాంతో దగ్గరగా ఉన్నా కూడా లేనట్లే ఉంటుంది. అందుకే వెకేషన్ ప్లాన్ చేసుకుని, ‘మా కోసమే మేం’ అన్నంతగా టైమ్ స్పెండ్ చేస్తాం. వంట చేసే టైమ్ మీకుంటుందా? మీరు వండిన వంటల్లో కృష్ణవంశీగారికి ఏవి ఇష్టం? రెండు రోజులకు మించి నేను బయట ఫుడ్ తినలేను. ఇంట్లో వండినది కావాల్సిందే. కొన్ని కూరలు వచ్చు. ఆయనెప్పుడూ వంక పెట్టలేదు. వేరే దారి లేక తింటారో... నచ్చే తింటారో కానీ తినేస్తారు (నవ్వేస్తూ). హిట్టూ ఫ్లాప్స్ గురించి చర్చిస్తారా? డిస్కస్ చేసుకుంటాం. కానీ, ఏం చేయాలనేది ఆయన డెసిషనే. డైరెక్టర్గా తనకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది చేయాలి. వేరేవాళ్ల నిర్ణయాల మీద ఆధారపడకూడదు. ఫైనల్లీ... టీనేజ్లో స్టార్ట్ అయిన మీ కెరీర్ వయసు 30 ఏళ్ల పైనే. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనిపించలేదా? అప్పుడప్పుడూ అనిపిస్తుంది. సరిగ్గా ఆ టైమ్కి ఎవరో ఒకరు వచ్చి అడగడం, సినిమా ఒప్పుకోవడం జరిగిపోతోంది. అందుకని రిలాక్స్కి ఛాన్స్ లేదు. అయినా ఫర్వాలేదు. ‘ఐయామ్ ఎంజాయింగ్ మై వర్క్’. శివగామి పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పినప్పుడు... గొప్ప క్యారెక్టర్ అనిపించింది. అయితే ఇంత పెద్ద పేరు వస్తుందని మాత్రం ఊహించలేదు. ‘బాహుబలి’ ఇంత పెద్ద సినిమా అవుతుందని కూడా అనుకోలేదు. సౌత్, నార్త్.. ఇలా అన్ని చోట్లా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్ అందరికీ రాదు. మీ అందం కొంచెం కూడా తగ్గలేదు.. ఏం చేస్తుంటారేంటి? మా అమ్మా నాన్న అందంగా ఉంటారు. వాళ్ల జీన్స్ నాకొచ్చింది. జనరల్గా నేనెక్కువ స్ట్రెస్ అవను. ఆల్మోస్ట్ సంతోషంగా ఉంటాను. పీస్ఫుల్గా ఉంటాను. మనసు బాగుంటే పైకి కూడా బాగుంటాం. ఎక్సర్సైజులు చేయను. వాకింగ్ చేస్తాను. అంతే. ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే బోల్డంత పాపులార్టీ.. పారితోషికం. సో ఇప్పటి తరం హీరోయిన్ అయ్యుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒకట్రెండు సినిమాలకే చాలా పాపులార్టీ వస్తోందన్నది నిజమే. కానీ, ఈ తరం హీరోయిన్ అయ్యుంటే బాగుండేదనుకోవడంలేదు. ఎందుకంటే, మాకు వచ్చినన్ని.. ముఖ్యంగా నాకు వచ్చినన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు బహుశా ఇప్పుడు రావేమో. కెరీర్ వైజ్గా నాకెలాంటి అసంతృప్తీ లేదు. మంచి మంచి పాత్రలు చేశాను. అప్పుడు ఎలా కుదిరాయో ఇప్పుడూ అలానే మంచి పాత్రలు కుదురుతున్నాయి. పాలిటిక్స్ వైపు ఎప్పుడైనా దృష్టి మళ్లిందా? ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందన్నది నా ఒపీనియన్. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసి పెట్టి ఉంటే వచ్చేస్తానేమో. ఒకటి మాత్రం చెప్పగలను. రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ నేను రావడం ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని రాసి పెట్టి ఉంటే.. వస్తానేమో. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? లేదండి. నీలాంబరి కానీ, శివగామి కానీ నేను ఊహించలేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకూ నాకు ఫలానా రోల్ వస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఏది కుదిరితే అది చేశా. ‘బాహుబలి’కి ఛాన్స్ రావడం నా లక్. మీకు ఒకే ఒక్క కొడుకు.. ఆడపిల్ల లేదని ఫీలయ్యారా? ఆడపిల్ల పుడితే బాగుంటుందనుకున్నాను. కానీ, కొడుకు పుట్టాడు. ‘ఐయామ్ ఓకే విత్ హిమ్’. మీ అబ్బాయి రుత్విక్ని హీరోని చేస్తారా? లేక డైరెక్టరా? ఇప్పుడు వాడు సిక్త్స్ క్లాస్ చదువుతున్నాడు. కెరీర్ని డిసైడ్ చేయడానికి ఇది టూ ఎర్లీ అవుతుంది. పెద్దయ్యాక రుత్విక్ ఏమవ్వాలనుకుంటే అదే. 150 సినిమాలకు పైగా చేశారు కదా.. ఆ అనుభవంతో డైరెక్షన్ చేస్తారా? డైరెక్షన్కి చాలా ఓపిక కావాలి. బేసిక్గా నేను బద్ధకస్తురాల్ని. అందుకని దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. – డి.జి. భవాని భర్త కృష్ణవంశీ, తండ్రి బీవీ కృష్ణయ్య, చెల్లెలు వినయ, కొడుకు రుత్విక్తో... -
వీడని బాహుబలి ఫీవర్
తమిళనాట ‘బాహుబలి’ చిత్రం చాలా వరకు థియేటర్లలో గత వారం ఏప్రిల్ 28వ తేదీ విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో విడుదల అవుతుందా లేదా అనే చర్చలు కొనసాగినప్పటికీ, ఆ రోజు ఉదయం షోనే విడుదలైంది. ప్రత్యేక షోలను రద్దు చేశారు. ఆ చిత్ర తొలి సన్నివేశం నుంచే పాజిటివ్ అయిన సమాచారాలు వెల్లడికావడంతో ‘బాహుబలి’ తమిళంలో కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించింది. ఇక్కడ కూడా రూ.100 కోట్లను దాటే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్లలో వచ్చే ఆదివారం వరకు బాహుబలి రిజర్వేషన్లో పూర్తి కావడంతో శుక్రవారం విడుదల కావాల్సిన ఎయ్దవన్, తొండన్ వంటి పలు చిత్రాల విడుదలను తర్వా త వారానికి వాయిదా వేశారు. అభిమానులకు బాహుబలి ఫీవర్ పట్టుకోవడంతో వారు ఇత ర సినిమాలను చూడడానికి వస్తారా అనే సందేహం నెలకొంది. లోబడ్జెట్ చిత్రాల సాహసం: అయినప్పటికీ కొన్ని లోబడ్జెట్ చిత్రాల విడుదలకు సాహసం చేశారు. వాటిలో అందాల తార దన్షిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎంగ అమ్మా రాణి’ చిత్రంలో పాటు ‘ఆరంభమే అట్టగాసం‘, ‘మదిపెన్’, ‘విలయాడ వా’ వంటి చిత్రాలు ఉన్నాయి. వారం రోజుల తర్వాత అయినా బాహుబలి ఫీవర్ తగ్గుతుందనే నమ్మకంతో ఇరుక్క బయమేన్, తిరప్పు విళా’ వంటి చిత్రాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయినా అప్పటికి బాహుబలి చిత్రానికి అభిమానుల ఆదరణను బట్టి ఆ చిత్రల విడుదలలో కూడా మార్పులు ఉంటాయని సమాచారం. -
‘బాహుబలి’లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది
- ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ రావులపాలెం (కొత్తపేట) : తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రంలో గాయకుడిగా తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని సినీ గాయకుడు, ఇండియన్ ఐడల్ విజేత కేఎల్ రేవంత్ అన్నారు. రావులపాలెంలో బాహుబలి-2 చిత్రం ప్రదర్శిస్తున్న శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా పారిశ్రామిక విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం రేవంత్ను ఘనంగా సన్మానించారు. ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఆయనకు రవిరాజు, ప్రభాస్ అభిమానులు పూలకిరీటం, పూలమాలలు, జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రేవంత్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన సన్నిహితులు, అభిమానులు, పెద్దల ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. ఈ కృషిలో తల్లిదండ్రులు, తోటి గాయకుల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ విజయంలో తన కృషితోపాటు ప్రజల ఓటింగ్ కూడా కీలక పాత్ర పోషించాయన్నారు. రవిరాజు తనకు మంచి మిత్రుడని, ఆయన సహకారంతోనే జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని ప్రభాస్ అభిమానుల సమక్షంలో సత్కారం పొందడం సంతోషంగా ఉందని అన్నారు. సచిన్ టెండూల్కర్, ఎస్ఎస్ రాజమౌళి తనకు స్ఫూర్తి అన్నారు. బాహుబలి సినిమాలోని ప్రతి సన్నివేశం అమోఘంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఆయన బాహుబలి-1లో తాను ఆలపించిన ‘మనోహరీ..’ గీతాన్ని ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరో గాయని గీతామాధురి బాహుబలి-2 చిత్రంలోని ‘దండాలయ్యా’ పాట పాడి అలరించారు. కార్యక్రమంలో గాయకుడు శ్రీకృష్ణ, యాంకర్ అశ్వని, ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు వేగిశ్న మణికంఠవర్మ, దాట్ల రాకేష్వర్మ, సయ్యపరాజు నరసింహరాజు, తాడిపూడి బాబు, నడింపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
భాగమతి ప్రేమకథ
లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్ అనుష్క అన్నట్లుగా అయిపోయింది. ‘అరుంధతి’లో జేజెమ్మ, ‘రుద్రమదేవి’లో రాణీ రుద్రమదేవి, ఇటీవల విడుదలైన ‘బాహుబలి’లో దేవసేన.. అన్నీ శక్తివంతమైన పాత్రలే. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ‘భాగమతి’ చారిత్రక చిత్రం కాకపోయినా ఇందులో కూడా అనుష్కది పవర్ఫుల్ క్యారెక్టరే. ఇది ప్రేమకథా చిత్రం. ‘పిల్ల జమిందార్’ ఫేం ఆశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇంతకీ ‘భాగమతి’లో అనుష్క గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలను కుంటున్నారా? జస్ట్ ముప్ఫై రోజులాగితే చాలు. వచ్చే నెల టీజర్ను, జూలైలో సినిమాని రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం అనుష్క కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు. కథలు వింటున్నానని అన్నారు. ‘బాహుబలి’ మంచి అనుభూతినిచ్చిందని, ఇందులో మహేంద్ర బాహుబలి తల్లి పాత్ర చేయడం సవాల్ అనిపించిందని చెప్పారు. భవిష్యత్తులో తన పిల్లలకు ‘బాహుబలి’ కథ చెబుతానని అనుష్క అన్నారు. -
18 రోజుల పసికూనతో బాహుబలి ప్రభంజనం..
ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బాహుబలి.. భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట విడుదలైన బాహుబలి ఫస్ట్ లుక్ లో.. శివగామి(రమ్యకృష్ణ) చేతిలో పొద్దికగా ఒదిగి, భవిష్యత్తును శాసించబోతున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఆ పసికూన గురించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఒకేఒకరు ఈ పసికునే కావడం మరో విశేషం! బాహుబలి: ది బిగినింగ్ లో శివగామి.. మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది, ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు చూపించింది, బాహుబలి:కన్ క్లూజన్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లలో.. మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును ప్రజలకు చూపించింది, కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందునే! అయితే ఈ బుజ్జాయి నిజానికి అబ్బాయి కాదు.. అమ్మాయి! పేరు అక్షర! బాహుబలిలో నటించే సమాయానికి అక్షర వయసు జస్ట్ 18 రోజులు మాత్రమే! ఇంతకీ ఈమెకు బాహుబలిలోకి ఎలా తీసకున్నారంటే.. కేరళలోని అతురపల్లి జలపాతాల దగ్గర బాహుబలి షూటింగ్ జరిగినప్పుడు స్థానికుడైన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ సినిమాకు పనిచేశాడు. ఆ సమయంలోనే వల్సన్ దంపతులకు అక్షర జన్మించింది. బాహుబలి ప్రొడక్షన్ లో కీలక పాత్రపోశించిన శ్రీవల్లి ద్వారా ఆ పాప గురించి దర్శకుడు రాజమౌళికి తెలిసింది. నిజానికి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు పసికందులుగా చూపించేటప్పుడు గ్రాఫిక్స్ ను వినియోగించాలని అనుకున్న జక్కన్న.. అక్షరను చూశాక మనసుమార్చుకున్నాడు. అలా ఆమె సినిమాలో కాలుమోపడం, ఫస్ట్ లుక్ లోనే ప్రభంజనం సృష్టించడం, ఆ తర్వాతి విషయాలు తెలిసినవే. కాగా, ప్రస్తుతం కేరళలోనే చదువుకుంటున్న అక్షర వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది.. -
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
-
బాహుబలిని ఆస్కార్కు సిఫార్సు చేస్తా
మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాన్ని చాటిచెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్కు సిఫారసు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సినిమాను ఆద్యంతం హృద్యంగా మలిచిన రాజమౌళికి హ్యాట్సాఫ్ చెబుతూ... చిత్ర నిర్మాణ యూనిట్కు అభినందలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానించిందని వివరిం చారు. బాహుబలి యూనిట్ను త్వరలో అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కన్సార్టియం కంపెనీకి స్విస్ ఛాలెంజ్లో అప్పగించేందుకు నిర్ణయించామని తెలిపారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని సీఎం పేషీలో మంగళవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలు ► కళాతపస్వి కె.విశ్వనాథ్కు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం పట్ల హర్షం. ► ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్–1 సర్వీస్లో నియమించేందుకు వీలుగా చర్యలు. ► కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం. 25 డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2 పోస్టులను గ్రేడ్–1 పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ ఆమోదం. -
నేను.. బాహుబలి.. కట్టప్ప..
వర్చువల్ బాహుబలికి సిద్ధం కండి - తెలుగు సినిమాల్లో తొలిసారిగా అందుబాటులోకి - భవిష్యత్తు వర్చువల్ రియాల్టీదే - గేమింగ్.. సూపర్ కంప్యూటింగ్లోనూ వినియోగం - ‘సాక్షి’తో ఏఎండీ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో మీకీపాటికి అర్థమైపోయి ఉంటుంది. మరి.. బాహుబలితోపాటు మీరూ గుర్రమెక్కి స్వారీ చేస్తూ వెళితే ఎలా ఉంటుంది? దేవసేన, అవంతికలు మీ పక్కనే ఉండి డైలాగులు చెబుతూంటే ఏమనిపిస్తుంది? బాగానే ఉంటుందిగానీ.. అవన్నీ సాధ్యమేనా అనుకోవద్దు.. అంతా వర్చువల్ రియాల్టీ మహిమ. తెలుగు సినిమాల్లోనే మొదటిసారిగా ‘ద స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ పేరుతో వర్చువల్ రియాల్టీ ఎక్స్పీరియన్స్ను ప్రదర్శిస్తున్నారు. దీని వెనక ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దాన్ని ఎలా అభివృద్ధి చేశారు? ఇది సినిమాలకు మాత్రమే పరిమితమా? వంటి ప్రశ్నల గురించి ఏఎండీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన రాజా కోడూరి ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ‘ఈగ’తో మొదలు.. ఏఎండీతో రాజమౌళి అనుబంధం ఈగ సినిమా నుంచే మొదలైంది. బడ్జెట్, సాంకేతిక పరిజ్ఞానం పరిమితులు ఎన్నో ఉన్నప్పటికీ ఆ సినిమాతో ఓ అద్భుతం సృష్టించగలిగాడు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో బాహుబలి–2 ఈగకు వందరెట్లు ఎక్కువని చెప్పవచ్చు. మూడు గంటల నిడివి ఉన్న బాహుబలి–2లో అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ లేని ఒక్క ఫ్రేమ్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మొత్తం సినిమాను తీసుకుంటే కంప్యూటర్ ద్వారా సృష్టించిన పిక్సెళ్లు రెండు లక్షల కోట్ల వరకూ ఉంటాయని అంచనా. బాహుబలి–2లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అన్నీ ఒక ఎత్తైతే.. వర్చువల్ రియాలిటీ చిత్రీకరణ మరో ఎత్తు. ఆశ్చర్యానికి గురయ్యా.. నాలుగేళ్ల క్రితం బాహుబలి సెట్స్ను మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యా. అంత భారీ స్థాయి సినిమాను వర్చువల్ రియాలిటీలో నిర్మించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు తగ్గ మైక్రో ప్రాసెసర్లుగానీ.. సాఫ్ట్వేర్గానీ అప్పట్లో లేవు. ఒకరకంగా చెప్పాలంటే ఏఎండీ బాహుబలి–2 కోసమే ‘వేగ’’పేరుతో ప్రత్యేకమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల(జీపీయూ)ను తయారు చేయాల్సి వచ్చింది. పెటాబైట్ల సమాచారాన్ని ప్రాసెస్ చేయగల సామర్థ్యం దీని సొంతం. చాలా సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వాడారుగానీ.. అవన్నీ ఆఫ్లైన్లో చేసిన మార్పులు, చేర్పులు. ఒక్కో ఫ్రేమ్కు విజువల్ ఎఫెక్ట్ జోడించేందుకు 8–10 గంటల నుంచి ఒకట్రెండు వారాలు పట్టొచ్చు. వర్చువల్ రియాల్టీ చిత్రీకరణ అలా ఉండదు.. ఒకవైపు సినిమా చిత్రీకరణ జరుగుతూండగానే.. సెకనులో వెయ్యోవంతు సమయంలోనే వర్చువల్ రియాల్టీ వెర్షన్ను సిద్ధం చేయాలి. అందుకే శక్తివంతమైన మైక్రో ప్రాసెసర్లు, జీపీయూలు అవసరం. గేమింగ్.. సూపర్ కంప్యూటింగ్లకు తోడు వేగ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ మిగిలిన వాటికంటే వినూత్నమైంది. ఎన్నో రెట్లు శక్తివంతమైంది. నాలుగు వేగా ప్రాసెసర్లు సెకనుకు వంద బిలియన్ ఆపరేషన్లు చేయగలవు. వందల కోట్ల పెట్టుబడులు పెట్టి తయారు చేసిన ఈ ప్రాసెసర్లు త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇవి సూపర్ కంప్యూటింగ్ మొదలుకుని, వర్చువల్ రియాల్టీ గేమింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ రంగాల్లోనూ ఇది విస్తృత వాడకంలోకి వస్తుందని భావిస్తున్నాం. 36 కన్నుల కెమెరా తయారీ వర్చువల్ రియాల్టీ కంటెంట్ కోసం ఇప్పటికే చాలా మంది 360 డిగ్రీ కెమెరాలను వాడుతున్నారు. వీటికీ కొన్ని పరిమితులున్నాయి. ఈ నేపథ్యంలో మేము బాహుబలి–2 వర్చువల్ రియాల్టీ వెర్షన్ కోసం ప్రత్యేకమైన కెమెరాను సిద్ధం చేశాం. దీంట్లో ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 36 వరకూ చిన్న చిన్న కెమెరాలు వేర్వేరు కోణాల్లో ఏర్పాటై ఉంటాయి. ఒక సన్నివేశాన్ని అన్ని కోణాల్లోంచి చిత్రీకరిం చడంతోపాటు.. అప్పటికప్పుడు వాటన్నింటినీ జోడించేందుకు స్పెషల్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశాం. ఆడియో ప్రీరిలీజ్ సమయంలో మేము ఈ కెమెరాలను ఉపయోగించాం. వర్చువల్ రియాల్టీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి.. స్టేజీ, ప్రభాస్, రాణా వంటి నటీనటులు తమ పక్కనే ఉన్న అనుభూతిని పొందొచ్చు. అంతెందుకు.. వచ్చే ఏడాది ఐపీఎల్నూ మీరు మీ ఇంట్లోంచే వర్చువల్ రియాల్టీ పద్ధతిలో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాదు.. బాహుబలి–2 కోసం తయారు చేసిన కొత్త టెక్నాలజీలను వర్చువల్ క్లాస్రూమ్స్తోపాటు.. వైద్య విద్యబోధన వంటి అనేక రంగాల్లో వాడవచ్చు. -
నో టిక్కెట్ ... ఓన్లీ బ్లాక్
– యథేచ్ఛగా బ్లాక్ టిక్కెట్ల విక్రయం – కౌంటర్లో ఒక్క టిక్కెట్ట అమ్మని థియేటర్లు – ఆన్లైన్లోనూ దర్శనమివ్వని వైనం – చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు విభాగాలు – అమలాపురంలో బెనిఫిట్ షోపై వివాదం.. ఉద్రిక్తత సాక్షి, రాజమహేంద్రవరం: బాహుబలి–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ను డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్లను బ్లాక్లో అమ్మి సొమ్ముచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాహుబలి బెనిఫిట్ షోను ప్రదర్శించారు. వాటి టిక్కెట్లను రూ.800 నుంచి రూ.2000 వరకు గురువారం ఉదయం నుంచే విక్రయించేశారు. శుక్రవారం సాధారణ షో టిక్కెట్లు కూడా బ్లాక్లో అమ్మడంతో సాధారణ ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. సాధారణంగా ఇప్పటి వరకు »బెనిఫిట్ షోతోపాటు సాధారణ షోలకు కనీసం కొద్ది మొత్తంలోనైనా థియేటర్ కౌంటర్లో టిక్కెట్లు అమ్మేవారు. అయితే ఈ చిత్రానికి మాత్రం శుక్రవారం బ్లాక్లోనే అన్నీ విక్రయించేశారు. ఆన్లైన్ టిక్కెట్లు నిల్... గతంలోనూ కొత్త సినిమా లేదా పేరున్న హీరో సినిమా విడుదల అవుతుందంటే ఆన్లైన్లోనే టిక్కెట్లన్నీ అయిపోయాయని థియేటర్ యాజమాన్యాలు, నిర్వాహకులు చెప్పేవారు. వాటిని వారి సిబ్బందితో థియేటర్ వద్దనే విక్రయించేవారు. అయితే బాహుబలి సినిమాకు మాత్రం ఆన్లైన్లో ఒక్క టిక్కెట్టు కూడా పెట్టలేదు. నిబంధనల ప్రకారం బాల్కనీ టిక్కెట్లలో 50 శాతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. మిగిలిన 50 శాతం టిక్కెట్లతోపాటు ఇతర క్లాస్ టిక్కెట్లు కౌంటర్లో విక్రయిచాలి. కానీ శుక్రవారం ఇలా జిల్లాలో ఎక్కడా జరుగలేదు. నిమ్మకు నీరేత్తిన రెవెన్యూ, పోలీస్ విభాగాలు... థియేటర్ల వద్ద బ్లాక్టిక్కెట్ల దందా ఇలా సాగుతుంటే జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనల ప్రకారం కనీసం కౌంటర్లో, ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించేలా చూడాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకునీరేత్తినట్లుగా వ్యవహరిస్తోందని థియేటర్ల వద్ద ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు బ్లాక్ టిక్కెట్ల దందా అరికట్టడం తమ పని కాదన్నట్లు థియేటర్ల వద్ద చోద్యం చూశారు. టిక్కెట్ల కోసం గుంపులుగా నిరీక్షిస్తున్న ప్రేక్షకులపై తమ ప్రతాపం చూపారేగానీ బ్లాక్టిక్కెట్లు విక్రయిస్తున్న వారి వైపు కన్నెత్తి చూడలేదు. అమలాపురంలో బెనిఫిట్షోపై ఉద్రిక్తత... అమలాపురంలో బాహుబలి బెనిఫిట్ షో ప్రదర్శనపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది. గతంలో కొంత మంది హీరోల సినిమాలకు బెనిఫిట్ షో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే యంత్రాంగం బాహుబలి–2 చిత్రానికి ఇవ్వలేదు. కొంత మంది అభిమానులు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఒక్కో టిక్కెట్టును రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయించేశారు. ఈ నేపథ్యంలో ఇతర హీరోల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు అనుకున్న సమయానికి సినిమా వేయలేదన్న కోపంతో టిక్కెట్లు కొన్నవారు వెంకట పద్మావతి మల్లి కాంప్లెక్స్ అద్దాలు, అక్కడ ఉన్న ఐదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సున్నితమైన అంశం కావడంతో అధికార యంత్రాంగం చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. -
ఉద్రిక్తం... పగిలిన అద్దాలు
బాహుబలి–2 బెనిఫిట్ షోలపై అమలాపురంలో ఆందోళన థియేటర్లు, అయిదు కార్ల అద్దాల ధ్వంసం పోలీసుల అదుపులో ముగ్గురు భిన్న ఉత్తర్వులతో రెవెన్యూ, పోలీసు అధికారుల హైరానా అమలాపురం టౌన్ : బాహుబలి–2 సినిమా బెనిఫిట్ షోలు అమలాపురంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకట పద్మావతి సినీ ప్లెక్స్ థియేటర్ల అద్దాలను, అక్కడ పార్కు చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారుల ఆంక్షలను కాదని థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోలకు దిగటం ఈ పరిస్థితికి దారితీసింది. గతంలో ఇతర హీరోల చిత్రాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఆ హీరోల అభిమానుల నిరసనలతో రోడ్డెక్కారు. నిరసనలు, పోలీస్ స్టేషన్ వద్ద బెఠాయింపు వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటికే అధికారుల ఆంక్షలను ఖాతరు చేయకుండా థియేటర్ల యాజమాన్యాలు బెనిఫిట్ షోల కోసం ప్రేక్షకులకు ఒక్కో టికెట్ను రూ.1000 నుంచి రూ.1500 విక్రయించి షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఈ సున్నితమైన విషయాన్ని ఆర్డీఓ జి.గణేష్కుమార్, డీఎస్పీ ఎల్.అంకయ్య అంతే సున్నితంగా డీల్ చేసి బెనిఫిట్ షోలు తెర మీద పడకుండా చర్యలు చేపట్టారు. ఇదంతా గురువారం అర్ధరాత్రిలోపు చోటు చేసుకున్న సంఘటనలు. అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్ర పోలీసుశాఖ రెండో బాసు నుంచి అనుమతి తెచ్చుకున్న ఉత్తర్వు పత్రాలను చూపిస్తూ థియేటర్ యాజమాన్యాలు బెనిఫిట్ షోలు వేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారిని థియేటర్ల ప్రాంగణంలో ఉంచారు. అమలాపురంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న 8 థియేటర్ల వద్ద పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8 మంది ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇంతలో అర్ధరాత్రి దాటిన తరా>్వత వెంకట పద్మావతి థియేటర్లలో బెనిఫిట్ షోలు వేసేందుకు సమాయత్తమవుతుండటంతో ఆర్డీఓ, డీఎస్పీలు తక్షణం అక్కడకు చేరుకుని ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో వేరే నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు అక్కడ వీరంగం చేసి బెనిఫిట్ షోలు వేసి తీరుతామని సవాల్ విసరటం కొసమెరుపు. ప్రేక్షకుల ఆగ్రహం గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్లు బెనిఫిట్ షోలకు టిక్కెట్లు విక్రయించటం... అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు వేయకపోవటంతో రూ.1000 నుంచి రూ.1500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల్లో అసహనం చోటుచేసుకుంది. ఎంతకీ షోలు వేయకపోవటంతో కొందరు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అయిదు కార్ల అద్దాలనూ పగలగొట్టారు. భిన్న ఉత్తర్వుల పర్యవసానమే... ముందు రోజు బెనిఫిట్ షోలకు అనుమతి లేదని.. టికెట్ ధరలు అధికంగా విక్రయించరాదని కలెక్టర్ ఉత్తర్వులతో ఆర్డీఓ గణేష్కుమార్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర పోలీసు శాఖ రెండో బాసు నుంచి బెనిఫిట్ షో వేసుకునేలా గురువారం రాత్రి మరో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ప్రభుత్వ అధికారే... పోలీసు బాసు ప్రభుత్వ అధికారే. ఈ ఇద్దరి నుంచి భిన్నమైన ఉత్తర్వులు రావడంతో ఏ ఉత్తర్వులు అమలు చేయాలో తెలియక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అయోమయంతో హైరానా పడ్డారు. ఇలా ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమన్వయ లోపంతో భిన్న ఉత్తర్వులు ఇవ్వటం వల్ల అమలాపురంలో శాంతి భద్రతలు అదుపు తప్పేలా చేశాయి. హోం మంత్రి రాజప్పతో ఇదే విషయంపై డీఎస్పీ అంకయ్య శుక్రవారం ఉదయం చర్చించారు. థియేటర్, కార్ల అద్దాలు ధ్వంసం చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ థియేటర్ యాజమాన్యం నుంచి గానీ... కార్ల యజమానుల నుంచి గానీ పోలీసులకు ఫిర్యాదులు అందకపోవడం గమనార్హం. ఎవరి నుంచైనా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని, లేకుంటే అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారించి వారి వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్ విలేకర్లకు తెలిపారు. థియేటర్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజ్లను సేకరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
బ్లాక్బలి
- రూ. 500 పలికిన బాహుబలి సినిమా టికెట్ – నిబంధనలు పాటించని థియేటర్ల నిర్వాహకులు – ఆన్లైన్ పేరుతో అడ్డగోలు దోపిడీ - పడిగాపులు కాసినా ప్రేక్షకుడికి దొరకని టికెట్ - ఆనంద్ థియేటర్ వద్ద అభిమానులు గొడవ కర్నూలు సీక్యాంప్: బాహుబలి సినిమా థియేటర్ నిర్వాహకులకు కాసులు కురిపించింది. ఈ సినిమాను చూసేందుకు శుక్రవారం తెల్లవారుజామున నుంచే అభిమానులు నగరంలోని వెంకటేష్, రాజ్, శ్రీరామ, ఆనంద్ సినిమా థియేటర్ల వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా కౌంటర్లలో టికెట్లు దొరకని దుస్థితి. ఈ చిత్రం విడుదలైన దాదాపు పది థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం సినిమా టికెట్స్ మొత్తం ఆటకు ముందు రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలి. వారు టికెట్లను పంపిణీ చేయాలి. అందుకు విరుద్ధంగా కొన్ని థియేటర్ల నిరా్వహకులు టికెట్స్ మొత్తం ఆన్లైన్లో బుక్ అయ్యాయని చెప్పి దోపిడీకి దిగాయి. దీంతో ఆగ్రహించిన అభిమానులు ఆనంద్ థియేటర్ ఎదుట ఉదయం గొడవకు దిగారు. క్లాస్ టికెట్ ధర రూ.100 అయితే రూ. 500, ఆపై, మాస్ టికెట్ రూ.60 ఉండగా రూ. 250, ఆపై ధరకు నిర్వాహకులే దగ్గరుండి అమ్మిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే బ్లాక్లో టికెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
‘బాహుబలి కాదు.. పెద్ద బఫూన్’
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ బాహుబలి కాదు..పెద్ద బఫూన్ అని సర్వే ఎద్దేవా చేశారు. కబాలి సినిమా లాగానే.. వరంగల్ సభ కేసీఆర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చేతకాని దద్దమ్మ అని.. సన్నాసి..కేకే, డీఎస్ లాంటి దద్దమ్మలను పార్టీ చేర్చుకున్న పెద్ద దద్దమ్మవు అంటూ విమర్శించారు. 2014 లో కేసీఆర్ ది యాక్సిడెంటల్ విన్ అని వర్ణించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కు లు చేసినా 2019 లో కాంగ్రెస్ దే అధికారమని స్పష్టం చేశారు. వరంగల్ నుంచే కేసీఆర్ వినాశం మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ సర్వే ఫలితాలు చూసి కేసీఆర్ వణుకు మొదలైందని చెప్పారు. కేసీఆర్ గద్దె దిగక తప్పదని అన్నారు. -
22వేల టీకప్పులతో ‘బాహుబలి’
పలమనేరు(చిత్తూరు): బాహుబలి–2 చిత్రం విడుదల సందర్భంగా పలమనేరుకు చెందిన సమీర్ అనే యువకుడు తన మిత్రబృందంతో కలసి తన అభిమాన హీరో ప్రభాస్ ముఖచిత్రాన్ని టీ కప్పులతో తయారు చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. పట్టణంలోని వాణి విద్యాశ్రమం పాఠశాల పక్కన ఖాళీ స్థలంలో గురువారం సాయంత్రం ఈ ముఖచిత్రాన్ని స్థానిక ప్రభాస్ ప్యాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆవిష్కరించారు. దీనికోసం నాలుగు రోజులుగా 22వేల టీకప్పులను వినియోగించి, అందులో రెండువేల లీటర్ల పలు రంగునీళ్లను నింపి రూపొందించినట్టు సమీర్ తెలిపాడు. ఇందుకోసం రూ.35వేలను ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్లు సీవీకుమార్, రాకేష్రెడ్డి, పట్టణ కన్వీనర్ మండీ సుధా సమీర్ సృజనాత్మకతను అభినందించారు. ఇప్పటికే వైస్ ముఖచిత్రాన్ని సమీర్ వినూత్నంగా రూపొందించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శ్యామ్సుందర్రాజ్, నీళ్లకుంట మణి, మూర్తి, సోము, ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. -
ప్రేక్షకులే ‘బలి’
డిస్ట్రిబ్యూటరే బ్లాక్ టిక్కెట్ల విక్రేత అధికారికంగా ప్రభుత్వం పెంచింది రూ.200 గంపగుత్తగా రూ. 200 టిక్కెట్ రూ.400కు అమ్మేసిన డిస్ట్రిబ్యూటర్లు వారి నుంచి కొన్నవారు అమ్మేధర రూ. 650 నుంచి 800 రూ.30 నేల టిక్కెట్ ధర రూ. 200 నుంచి 300 పేక్షకుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న వైనం పట్టించుకుకోని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు కొత్త కలెక్టర్ కార్తికేయ మిశ్రా వైపు ప్రేక్షకుల చూపు సాక్షి, రాజమహేంద్రవరం : బాహుబలి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని తమకు అనుకూలంగా మలుచుకున్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా వారే బ్లాక్లో టిక్కెట్లు గంపగుత్తగా విక్రయించేస్తున్నారు. వారి వద్ద టిక్కెట్లు కొన్న వారు ప్రేక్షకులకు మరింత ధర పెంచి అమ్మేస్తున్నారు. జిల్లాలో ఉన్న దాదాపు 190 థియేటర్లలో బాహుబలి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్ ధరలను అధికారికంగా ఎక్కువ ధరకు పెంచి అమ్ముకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రూ. 120ల బాల్కనీ టిక్కెట్ రూ. 200, రూ. 80 బెంచీ టిక్కెట్ రూ. 150, రూ.30ల నేల టిక్కెట్ రూ.80ల లెక్కన పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది. సాధారణం కన్నా 100 శాతం ప్రభుత్వమే ధరలు పెంచినా అది చాలదన్నట్లు సినిమా డిస్ట్రిబ్యూటర్లు అంతకు మరో 100 శాతం అంటే బాల్కనీ రూ. 200ల టిక్కెట్టు రూ.350 నుంచి రూ.400లకు ఒక్కొక్క షోను ఇతరులకు విక్రయించేస్తున్నారు. వారి వద్ద షోలు, రోజుల లెక్కన టిక్కెట్లు గుత్తగా కొనుగోలు చేసిన కొందరు రూ.200 టిక్కెట్లను రూ.700 నుంచి రూ. 800, రూ.80 టిక్కెట్లు రూ.300 నుంచి రూ.400, రూ.30 టిక్కెట్లు రూ.200 నుంచి రూ. 300 వరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. బెనిఫిట్ షోలకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రోజుకు 6 షోలు ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం తదితర పట్టణాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహిస్తున్న లీజు థియేటర్ల వద్ద కూడా డిస్ట్రిబ్యూటర్లు నేరుగా వారే గుత్తగా టిక్కెట్లు బ్లాక్లో విక్రయించారు. నగదు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని థియేటర్ నిర్వాహకులకు టిక్కెట్లు ఇవ్వాలని సందేశం పంపుతున్నారు. రెండు మూడు రోజులకు ప్రదర్శించే టిక్కెట్లు కూడా అయిపోయాయని థియేటర్ల యాజమాన్యాలు, సిబ్బంది చెబుతున్నారు. రాజమహేంద్రవరంలోని కొన్ని థియేటర్లలో అధికారులు, రాజకీయ నాయకులే అథిక ధరలు వెచ్చించి డిస్ట్రిబ్యూటర్ల వద్ద టిక్కెట్లు తీసుకున్నట్లు సమాచారం. అధికారులు, రాజకీయ నాయకులు తమ అనుచరులకు, సన్నిహితులకు ఇవ్వడం కోసం పెద్దమొత్తంలో టిక్కెట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇలా కేవలం 10 శాతం టిక్కెట్లు మాత్రమే బయటకు వెళ్లాయి. మిగిలిన 90 శాతం టిక్కెట్లు బ్లాక్ టిక్కెట్లు వ్యాపారం చేసేవారు తీసుకున్నట్లు తెలిసింది. సాధారణ రోజుల్లో సినిమా హాళ్ల వద్ద రూ.10, 20 ఎక్కువకు బ్లాక్ టిక్కెట్లు అమ్మేవారికి బాహుబలి సినిమాకు మాత్రం ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. టిక్కెట్లును బ్లాక్లో అమ్మి సొమ్ము చేసుకునేందుకు అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు, వారి వద్ద పని చేసేవారు రంగంలోకి దిగారు. సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసే వ్యక్తి రాజమహేద్రవరంలో పేరొందిన థియేటర్ టిక్కెట్లను మొదటి రోజుకి అమలాపురానికి చెందిన డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 11 గంటలకు వరకు కూడా తన మనుషులను ద్వారా అక్కడే ఉండి టిక్కెట్లు రూ. 800లకు విక్రయిస్తున్నారు. కాగా, థియేటర్ల వద్ద ఈ విధంగా బ్లాక్ టిక్కెట్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నా క్షేత్రస్థాయిలోని రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లు ఉంటోంది. బాహుబలి సినిమాపై పేక్షకుల్లో ఉన్న ఆసక్తిని వారం పది రోజులపాటు బ్లాక్లో టిక్కెట్లు అమ్మి దొచుకునేందుకు నేరుగా డిస్ట్రిబ్యూటర్లే రంగంలోకి దిగడం గమనార్హం. కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తికేయ మిశ్రాకు అనుకోని మొదటి సవాల్గా బాహుబలి సినిమా బ్లాక్టిక్కెట్ల వ్యవహారం వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ధరను 100 శాతం పెంచింది, అయినా ఇలా డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్లో రూ. 400లకు, వారి వద్ద కొన్నవారు రూ. 800లకు విక్రయిస్తుండడంతో సామాన్య ప్రేక్షకుడు దోపిడీకి గురువుతున్నాడు. -
వివాస్పదంగా మారిన బాహుబలి -2 ప్రి రిలీజ్