brother
-
సోదరుడి అస్థికలను గోదావరిలో కలిపిన జయప్రద (ఫోటోలు)
-
తమ్ముడి పెళ్లిలో 'క' మూవీ హీరోయిన్ (ఫొటోలు)
-
చెల్లి ఋణం తీర్చుకున్న అన్న
-
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
ప్రియాంక చోప్రా సోదరుడి హల్దీ వేడుక (ఫోటోలు)
-
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా
టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్.. తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తోంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్రదర్'. జయం రవి హీరో. కొన్నిరోజుల క్రితం తమిళ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ 'బ్రదర్' సంగతేంటి? ఏ ఓటీటీలో ఉంది?అక్కా తమ్ముళ్ల ఫ్యామిలీ డ్రామా స్టోరీలతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'బ్రదర్'. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. రూ.5 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరీ రొటీన్గా ఉండటమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ బోలెడంతమంది ఉన్నాసరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)దీన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ తమిళ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టముంటే దీనిపై లుక్కేయొచ్చు.'బ్రదర్' విషయానికొస్తే.. అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి (జయం రవి), తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో.. లా డిగ్రీ చేయిస్తే అయినా సరే బాగుపడతాడేమోనని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడా నిరాశే. కనీసం అక్క ఆనంది(భూమిక) దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమోనని ఆశపడతారు. కానీ కార్తి వల్ల వాళ్ల కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటిని కార్తి ఎలా పరిష్కరించాడన్నది మిగతా కథ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'కంగువ') -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. రాబోయే గురువారం 'పుష్ప 2' రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈవారం పెద్ద సినిమాలేం రిలీజ్ కాలేదు. 'రోటి కపడా రొమాన్స్', 'ఉద్వేగం', 'ఝాన్సీ ఐపీఎస్' లాంటి తెలుగు మూవీస్ తోపాటు 'భైరతి రణగల్' చిత్రం థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఓటీటీలోకి శుక్రవారం ఒక్కరోజే 28 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందనేది చూద్దాం.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి మళ్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ)ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన మూవీస్ జాబితా (నవంబర్ 29)అమెజాన్ ప్రైమ్బ్లడీ బెగ్గర్ - తమిళ సినిమాహార్డ్ నార్త్ - ఇంగ్లీష్ సిరీస్ఓషినోకో - జపనీస్ సిరీస్ద వైల్డ్ రోబో - ఇంగ్లీష్ మూవీద వరల్డ్ అకార్డింగ్ టూ కలిబ్ - ఇంగ్లీష్ సినిమాహార్ట్ బీట్స్ - హిందీ సిరీస్నెట్ఫ్లిక్స్ట్వాస్ ద టెక్స్ట్ బిఫోర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ సినిమాఏ రాయల్ డేట్ ఫర్ క్రిస్మస్ - ఇంగ్లీష్ మూవీబ్రింగింగ్ క్రిస్మస్ హోమ్ - ఇంగ్లీష్ సినిమాక్రిస్మస్ ఆన్ విండ్ మిల్ వే - ఇంగ్లీష్ చిత్రంలవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా - ఇంగ్లీష్ సిరీస్పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ - ఇంగ్లీష్ మూవీసెన్నా - పోర్చుగీస్ సిరీస్సికందర్ కా మఖద్దర్ - తెలుగు డబ్బింగ్ సినిమాస్వింగ్ ఇన్ టూ రొమాన్స్ - ఇంగ్లీష్ మూవీద లేటర్ డేటర్స్ - ఇంగ్లీష్ సిరీస్ద స్నో సిస్టర్స్ - నార్వేజియన్ సినిమాద ట్రంక్ - కొరియన్ సిరీస్లక్కీ భాస్కర్ - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)హాట్స్టార్బీటల్స్ 64 - ఇంగ్లీష్ సినిమాపారాచూట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహాఇష్ష్ - తమిళ సిరీస్తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5బ్రదర్ - తమిళ మూవీడివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా - హిందీ సిరీస్వికటకవి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)సోనీ లివ్డోప్ గర్ల్స్ - ఇంగ్లీష్ సిరీస్సన్ నెక్ట్స్కృష్ణం ప్రణయ సఖి - కన్నడ సినిమామనోరమ మ్యాక్స్హెర్ - మలయాళం సిరీస్బుక్ మై షోఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ - ఇంగ్లీష్ సినిమాజస్ట్ వన్ స్మాల్ ఫేవర్ - స్పానిష్ మూవీ(ఇదీ చదవండి: పుష్ప 2: ఐదు కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్.. నిడివి ఎంతంటే?) -
మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ కన్నుమూత
వాషింగ్టన్: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ ఇక లేరు. ప్రఖ్యాత జాక్సన్5 పాప్ గ్రూప్ సభ్యుడైన 70 ఏళ్ల టిటో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి కారణం తెలియరాలేదు. మైకేల్తో పాటు ఇతర సోదరులు జాకీ, జర్మైన్, మార్లోన్లతో కలిసి జాక్సన్5 పేరిట టిటో పలు పాప్ ప్రదర్శనలిచ్చారు. జాక్సన్5 ఖాతాలో ఏబీసీ, ద లవ్ యూ సేవ్, ఐ వాంట్ యూ బ్యాక్ వంటి పలు హిట్లున్నాయి. 1964లో ఏర్పాటైన ఈ గ్రూపు ప్రేక్షకులను ఉర్రూతలూపింది. 1980లో ప్రతిష్టాత్మక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అందుకుంది. 1997లో రాక్ అండ్ రోల్ హాలాఫ్ ఫేమ్లో చోటుచేసుకుంది. గ్రూప్లో టిటో వయోలిన్ వాయించేవారు. ఆయన చివరిదాకా ప్రదర్శనలిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 10న జర్మనీలో తుది ప్రదర్శన ఇచ్చారు. టిటో ముగ్గురు కుమారులు కూడా 3టీ గ్రూప్ పేరిట పాప్ సంగీతంలో ప్రసిద్ధులే. -
సీఎం సోదరుడు ఇంటికి హైడ్రా నోటీసులు
-
జాలి లేని దేవుడా... ఎంత పని జేత్తివిరా?
ఖమ్మంరూరల్: తల్లి గర్భం నుంచి సెకన్ల తేడాతో లోకంలోకి వచ్చిన వారిద్దరూ కలిసే పెరిగారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి కూలీనాలి చేస్తూ తమను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని భావించాలనే తపనతో కష్టపడుతున్నారు. ఇంతలోనే వీరిని మృత్యువు ఒకేసారి బలి తీసుకుంది. 22ఏళ్లుగా కలిసి పెరుగుతున్న సోదరులను కలిపే తీసుకెళ్లిన జాలి లేని మృత్యువును శాపనార్ధాలు పెడుతున్న వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సమీపాన మంగళవారం చోటు చేసుకుంది. నిరుపేద కుటుంబం...ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంకు చెందిన అత్తులూరి నర్సింహారావు, రమాదేవి దంపతులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మహేష్, నవీన్(22) కవల కుమారులు ఉన్నా రు. సోదరులిద్దరు డిగ్రీ పూర్తిచేయగా గ్రూప్స్తో పాటు పోలీసు ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతూ కొన్నాళ్లుగా ఖమ్మంలోని ఓ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. మంగళవారం ఉదయం తల్లి రోజులాగే కూలీ పనులకు వెళ్లగా తండ్రి ఇంకో గ్రామానికి వెళ్లాడు. దీంతో సాయంత్రం సోదరులిద్దరూ బైక్పై స్నేహితుడైన భద్రాద్రి జిల్లా సుజాతనగర్కు చెందిన పవన్తో కలిసి తమ అమ్మమ్మ ఊరైన కూసుమంచి మండలం పెరికసింగారం బయలుదేరారు. అక్కడ వీరి మేనమామ మెకానిక్ షెడ్ నిర్వహిస్తుండడంతో అప్పుడప్పుడు వెళ్లి కాసేపు గడిపి వచ్చేవారు. అలాగే, మంగళవారం కూడా వెళ్లిన సోదరులు గమ్యస్థానానికి చేరలేదు.ఆటో రూపంలో వచ్చిన మృత్యువుకవల సోదరులు మహేష్, నవీన్తో పాటు వారి స్నేహితుడు పవన్ బైక్పై పెరికసింగారం వెళ్తుండగా మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్, నవీన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, పవన్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. కాగా, అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరిన మహేష్, నవీన్ మృతి చెందారని తెలియడంతో స్వగ్రామమైన దానవాయిగూడెంతో పాటు అమ్మమ్మ ఊరైన పెరికసింగారంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కలిసి జన్మించిన కుమారులు కలిసే పెరిగి కుటుంబానికి అండగా నిలుస్తారని భావిస్తున్న తరుణంలో ఒకేసారి కన్ను మూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెక్కల కష్టంతో కుమారులిద్దరిని చదివించామని, ఉద్యోగాలు సాధించేందుకు శిక్షణ పొందుతుండగా ఇలా జరిగిందని వారు రోదిస్తున్న తీరుతో అంతా కంటతడి పెట్టారు. ఈమేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా రోదిస్తూ అక్కడే గడిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. -
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్లోని రామ్గఢ్కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
రాఖీ కడితే ఊరు వదలాల్సివస్తుందట!
దేశ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) రాఖీ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలోని ప్రజలు రాఖీ పండుగ చేసుకోరు. దీని వెనుక వారు ఒక కారణాన్ని చూపుతుంటారు. రాఖీ చేసుకుంటే అన్నదమ్ములు ఊరు వదలాల్సి వస్తుందని వారు చెబుతుంటారు.యూపీలోని సంభాల్ జిల్లా బేనిపూర్ చక్ గ్రామంలో మచ్చుకైనా రాఖీ వేడుకలు కనిపించవు. రక్షాబంధన్ పేరు వినగానే ఇక్కడి ప్రజలు హడలిపోతుంటారు. రాఖీ నాడు తన సోదరి ఏదైనా బహుమతి అడిగితే, సర్వం కోల్పోయి, ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఇక్కడి అన్నదమ్ములు భయపడుతుంటారు.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు యాదవులు, ఠాకూర్ల ఆధిపత్యం ఉండేదట. నాడు ఇక్కడి జమిందారు ఠాకూర్ కుటుంబానికి చెందినవాడు. అయితే అతనికి మగ సంతానమే లేదట. దీంతో ఒకసారి రాఖీ పండుగనాడు యాదవుల ఇంటి ఆడపిల్ల ఆ ఠాకూర్కు రాఖీ కట్టి, అతని జమిందారీని కానుకగా అడిగిందట.ఈ నేపధ్యంలో నాడు యాదవులకు, ఠాకూర్లకు వివాదం జరిగిందని చెబుతారు. చివరికి ఆ ఠాకూర్ తన జమిందారీని యాదవులకు అప్పగించి, ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. నాటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ రాఖీ పండుగను చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అది ఈ నాటికీ గ్రామంలో కొనసాగుతోంది. -
అన్న, వదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు
సిద్దిపేట కమాన్: అప్పు చెల్లించడం లేదని అన్నా, వదినలను.. ఓ ప్రబుద్ధుడు తన భార్య, కొడుకుతో కలిసి గ్రిల్స్కు కట్టేశాడు. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. దొంతరబోయిన పర్శరాములు, తార దంపతులు ఏడో తరగతి చదివే తమ కుమార్తెతో సిద్దిపేట కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు. పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నాసర్పూరలో నివసిస్తున్న సొంత తమ్ముడు దొంతరబోయిన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం కౌన్సిలర్ కనకరాజు.. పర్శరాములుకు ఫోన్ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మన్నాడు. దీంతో పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్పూరకు వచ్చారు. అన్నదమ్ముల మధ్య గొడవ జరగడంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి వారిద్దరిని బయటకు పంపించారు. బకాయి ఉన్న రూ.20వేలు, వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వీరి కుమారుడు భాను కలసి.. పర్శరాములు, అతని భార్య తారను కొట్టి నాసర్పూర హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్కు తాడుతో కట్టేశారు. స్థానికులు కలి్పంచుకుని వారిని విడిపించడంతో బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్ముడు మాట వినడం లేదని.. అన్న విషాదం!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై తమ్ముడు ఏ పనిచేయడం లేదని, తన మాట వినడం లేదని మనస్తాపంతో అన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మస్కాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం.. పట్టణంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన లోనికి సత్తవ్వ, పెంటయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.పెద్ద కుమారుడు శివకుమార్(33) మలేషియా వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో కుటుంబీకులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాగా, తమ్ముడు రాకేశ్ ఇంటి వద్దే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. పలుమార్లు అతన్ని హెచ్చరించినా మార్పురాలేదు. దీంతో శివకుమార్ మనస్తాపం చెంది శనివారం రాత్రి మస్కాపూర్ శివారులోని ఓ వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
18 ఏళ్ల తర్వాత తప్పిపోయిన సోదరుడిని కలిపిన ఇన్స్టా రీల్!
లక్నో: ఇంటి నుంచి తప్పిపోయిన పులువురిని సోషల్ మీడియా వాళ్ల కుటుంబాలకు చేరవేస్తోంది. తప్పినపోయిన వారు చేస్తున్న ఇస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు వైరల్గా మారటంతో వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తిపట్టి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉద్విగ్నభరిత సీన్స్ను చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది.చిన్నప్పుడు ఉద్యోగం కోసం ముంబై వెళ్లిపోయిన సోదరుడిని ఒక అక్క ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశారు. ఆయనకు విరిగిన పన్ను ఉండటంతో తన సోదరుడేనని ఆమె గుర్తుపట్టారు. ఈ ఘటన ఆయన వెళ్లిపోయిన 18 ఏళ్ల తర్వాత జరగింది. ఇన్స్టాగ్రామ్ రీల్లో కనిపించటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వివరాలు.. ఉత్తరప్రదేశ్లోని హతిపూర్కు చెందిన రాజ్కుమారి మొబైల్లో ఒక రీల్స్ చూస్తుండగా, అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. విరిగిన ఆయన పన్ను చూసి 18 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి ముంబై వెళ్లిన తన సోదరుడు బాల్ గోవింద్లా ఉన్నాడని అనుమానించారు. వెంటనే ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆయన్న సంప్రదించారు. అనంతరం చిన్నప్పడు తను సోదరుడితో గడిపిన విషయాలు ప్రస్తావించారు. పాత విషయాలకు ఆయన కూడా స్పందించడంతో.. తన సోదరుడేనని రాజ్ కుమారి నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రాజస్తాన్లోని జైపూర్లో ఉంటున్న ఆయన 18 ఏళ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకున్నారు. తప్పిపోయిన తన సోదరుడిని సోషల్మీడియానే కలిపిందని రాజ్కుమారి ఆనందం వ్యక్తం చేశారు. -
హుషారుగా బ్రదర్ హుడ్ డే...
నగరానికి చెందిన ఫ్రీమేసన్స్ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్ హుడ్ డే ఆదివారం సందడిగా జరిగింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా వాక్థాన్ను నిర్వహించారు. హానికారక డ్రగ్స్కు దూరంగా ఉండాలని విన్నవిస్తూ నిర్వహించిన ఈ వాక్థాన్ అబిడ్స్ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకూ కొనసాగింది. ఫ్రీమేసన్స్కు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
తమ్ముడి ‘నీట్’ రాసేందుకు ఎంబీబీఎస్ అన్న.. తరువాత?
దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. రాజస్థాన్లోని బార్మర్లో గల అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రంలో చీటింగ్ కేసు వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే జోధ్పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్ పరీక్ష రాయడానికి అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. అతనిని చూసిన ఎగ్జామినర్కు అనుమానం రావడంతో ఆరా తీశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు భగీరథరామ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.నీట్ పరీక్ష నిర్వహణకు బార్మర్లోని ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆంత్రి దేవి స్కూల్లో నకిలీ అభ్యర్థిని గుర్తించినట్టు తమకు సమాచారం అందిందని బార్మర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జస్రామ్ బోస్ తెలిపారు. పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకుని నకిలీ అభ్యర్థిని విచారించగా, నిందితుడు డమ్మీ అభ్యర్థి అని తేలింది. ఈ ఉదంతంలో పోలీసులు భగీరథ్ రామ్, అతని తమ్ముడు గోపాల్రామ్లను అరెస్ట్ చేశారు.భగీరథ రామ్ జోధ్పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. తమ్ముడిని డాక్టర్ని చేసేందుకు మున్నా భాయ్ తరహాలో నకిలీ అభ్యర్థిగా పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చాడు. అయితే ఇంతలోనే పోలీసులకు పట్టబడ్డాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సోదరులిద్దరినీ విచారిస్తున్నారు. -
కాంగ్రెస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోదరుడు
హైదరాబాద్, సాక్షి: అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ఐపీఎస్, నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు..మూడ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. బీఎస్పీ అధ్యక్ష పదవి వదిలేసి బీఆర్ఎస్లో ప్రవీణ్కుమార్ చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సొంత అన్నపైనే ప్రసన్నకుమార్ తిరుగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా భావించే చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్పీ భేటీ కావడంపై ప్రసన్న కుమార్ అలక బూనారు. ఈ క్రమంలోనే సొంత అన్నతో రాజకీయంగా విబేధించాలని సిద్ధపడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపిన ప్రసన్న కుమార్.. నేడో,రేపో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్నకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. -
స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం..ఈమె మూడో అమ్మాయి (ఫొటోలు)
-
కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్ట్ చేశారు. మరోవైపు.. అదే సమయంలో కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్న కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేయగా, మరో 28 మంది పరారీలో ఉన్నారు. అరెస్టైన వారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ సైతం ఉన్నాడు. ఈ కేసులో కన్నారావు సింగపూర్ పారిపోయి ఉంటాడన్న అనుమానాల మధ్య లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశారు కూడా. ఈలోపు ముందస్తు బెయిల్ కోసం కన్నారావు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే.. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అంతకు ముందు.. కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్ను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్ చేయనున్నారు. -
ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు
పటాన్ చెరు టౌన్, పటాన్చెరు: అక్రమ మైనింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్రావు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడుమధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
US: రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న
ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు. ఇదీచదవండి.. తగ్గిన భారత టూరిస్టులు.. పెరిగిన చైనా వాటా -
సోదరుడే కాలయముడై..
మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్ బైక్పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇంతలో పట్టరాని కోపంతో నితిన్ తన చెల్లి చేతులను టవల్తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్ పోలీసులు నితిన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ!
బెంగళూరు: పార్లమెంట్ అలజడి విషయంలో వార్తల్లో నిలిచిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సోదరుడు విక్రమ్ సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోట్ల విలువ చేసే 126 చోట్లను నరికివేసినట్లు అభియోగాలు ఉన్న ఓ కేసులో అతన్ని కర్ణాటకలోని హసన్ జిల్లా అటవీశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెట్ల నరికివేత నేరానికి విక్రమ్ సింహ పాల్పడినట్లు అటవీ అధికారులు వద్ద ఆధారాలు ఉండటంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్నించారు. అయితే అప్పటికే విక్రమ్ సింహ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు, అటవీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో విక్రమ్ సింహ పట్టుబడ్డారు. అటవీ శాఖ పోలీసులు విక్రమ్ సింహను హసన్ జిల్లా తీసుకువచ్చి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరోవైపు.. ఇప్పటికే పార్లమెంట్ అలజడి విషయంలో సతమతమవుతున్న బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహకు తన సోదరుడి అరెస్ట్.. మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్లు అయింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి పార్లమెంట్ సందర్శన పాసులు పొందిన ఆగంతకులు పార్లమెంట్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. పార్లమెంట్ భదత్ర వైఫల్యంపై ఎంపీ ప్రతాప్ సింహను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టారు. అదేవిధంగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఆందోళనకు దిగిన 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. చదవండి: మన్మోహన్ సింగ్పై పవార్ కీలక వ్యాఖ్యలు -
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
Abhiram Wedding : టాలీవుడ్ హీరో రానా తమ్ముడి గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
-
Virat Kohli Brother Vikas Family: విరాట్ కోహ్లి సొంత అన్నా- వదిన.. ఫ్యామిలీని చూశారా?
-
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..
సాక్షి, మహబూబ్నగర్: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె తమ్ముడు భరత్పై పెద్దకొత్తపలి మండలం వెన్నచెర్లలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని శిరీష వాపోయింది. ఆమె తమ్ముడిపై దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తప్పుబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని, పోటీలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ దాడి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమెకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ, ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరారు. సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, పలు ప్రజా సంఘాల నాయకులు దాడిని ఖండించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్రెడ్డి కూడా దాడి హేయనీయమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థిపై దాడికి ప్రయత్నించడం, ఆమె సోదరునిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. ఈ దాడి ఘటనపై కొల్లాపూర్లో సోషల్మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇవి చదవండి: 'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి -
'ఎన్టీఆర్ సినిమాతో చంద్రమోహన్కు చేదు అనుభవం'.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మరో సినీ దిగ్గజం, కళామతల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విభిన్నమైన పాత్రలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. (ఇది చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) దాదాపుగా 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. దశాబ్దాల పాటు కెరీర్ కొనసాగించిన చంద్రమోహన్ అప్పటి స్టార్ హీరోయిన్లందరితో సినిమాలు చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన గతంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావుతో తన అనుభవాలను పంచుకున్నారు. రామారావు చిత్రం సందర్భంగా ఆయనకెదురైన ఓ చేదు అనుభవాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం. గత ఇంటర్వ్యూలో చంద్రమోహన్ మాట్లాడుతూ..'నాగేశ్వరరావు, నేను దాదాపు 40 సినిమాలు చేశాం. అయితే రామారావుతో నాకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ సినిమా వల్ల చేదు అనుభవం ఎదుర్కొన్నా. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ సమయంలో ఎన్టీఆర్కు తమ్ముడిగా మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ.. చివరికీ బాలయ్యను తీసుకున్నారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డా. కానీ.. ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా చేసే అవకాశం నాకు లభించింది. ఎన్టీఆర్ సినిమా సెట్లో జరిగిన ఘటన వల్లే నాకు ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రం వల్లే నాకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.'అని అన్నారు. తన కెరీర్లో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చంద్రమోహన్.. చివరిసారిగా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రంలో కనిపించారు. కాగా.. అనారోగ్య కారణాలతో ఇవాళ మరణించారు. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్గా..) -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్లోని వాటర్ హీటర్ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
రూట్ మార్చిన స్టార్ హీరో.. అలాంటి మూవీలో
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ఈయన నయనతారతో కలిసి నటించిన 'ఇరైవన్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. మరోపక్క 'సైరన్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. తాజాగా జయం రవి 30వ సినిమా టైటిల్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి 'బ్రదర్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నటరాజన్, భూమిక, శరణ్య, గణేష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్న జయం రవి.. ఇప్పుడు రూట్ మార్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటిస్తున్నాడు. చైన్నె, హైదరాబాద్, ఊటీ, కొడైక్కెనాల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!) Excited to be a '#Brother,' a word that connects us all ♥️ Releasing worldwide in Tamil & Telugu !!! #BrotherMovie #BrotherFirstLook Happy #VinayagarChathurthi @rajeshmdirector @jharrisjayaraj @screensceneoffl @priyankaamohan @bhumikachawlat @vivekcinema@saranyaponvanan… pic.twitter.com/YvUQMHMJLl — Jayam Ravi (@actor_jayamravi) September 18, 2023 -
మిస్టర్ ఇడియట్ వస్తున్నాడు
హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్. గౌరీ రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం మాధవ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిస్టర్ ఇడియట్’లోని మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శక–నిర్మాత కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘‘మిస్టర్ ఇడియట్’ ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గౌరీ రోణంకి. ‘‘నవంబరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత జేజేఆర్ రవిచంద్. -
అన్నపై ఒక్కసారిగా.. పదునైన ఆయుధంతో.. తమ్ముడి వీరంగం!
మహబూబ్నగర్: దామరగిద్ద పోలీస్స్టేషన్ పరిధిలో అన్నను చంపిన తమ్ముడిపై యావజ్జీవ కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే.. 2021 ఏప్రిల్ 7న గుండు స్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ గోవర్ధన్ నిందితుడు బ్యాగరి బుగ్గప్పపై కేసు నమోదు చేశారు. దామరగిద్ద మండలం క్యాతన్పల్లికి చెందిన బ్యాగరి బుగ్గప్పకు తన అన్న హన్మంతుకు భూతగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ పెద్దలు, కులస్తుల సమక్షంలో మాట్లాడిన బ్యాగరి బుగ్గప్ప రాజీకి వచ్చారు. అదే ఏడాది ఏప్రిల్ 6 బొంబాయి హన్మంతు అలియాస్ బ్యాగరి హన్మంతు (55) రాత్రి పొలం వద్ద వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. గమనించిన బుగ్గప్ప వరి పొలం వద్ద వెళ్లి తన అన్నతో గొడవపడుతుండగా పక్క పొలంలో ఉన్న బ్యాగరి బాలప్ప గమనించి విడిపించేందుకు ప్రయత్నించాడు. అతనిని పక్కకు నెట్టి తన చేతిలో ఉన్న పదునైన ఆయుధంతో హన్మంతును పొడవగా స్పృహతప్పి పడిపోయినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై అప్పటి సీఐ శ్రీకాంత్రెడ్డి నేర పరిశోధన చేసి నేరస్తునిపై కోర్టులో చార్జిషీట్ వేశారు. నేరము రుజువు కావడంతో జిల్లా జడ్జి నిందితుడికి శిక్ష ఖరారు చేశారు. -
అక్కకు 95, తమ్ముడికి 85
సుభాష్నగర్: సుదీర్ఘకాలంగా మంచానికే పరిమితమైన అక్కతో రాఖీ కట్టించుకొని ఆమె ముఖంలో ఆనందం నింపాడొక తమ్ముడు. సూరారం ప్రాంతానికి చెందిన అనసూయ (95) కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. గురువారం రాఖీ పండుగ కావడంతో.. ఆమె సోదరుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కోల ఈశ్వరయ్య (85) అక్క వద్దకు వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. సోదరుడు రాఖీ కట్టించుకోవడానికి రావడంతో అనసూయ కన్నీటి పర్యంతమైంది. తమ్ముడికి మిఠాయి తినిపించి ఆశీర్వచనాలు అందజేసింది. -
రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు
క్రైమ్: ‘‘ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఒక సోదరుడు తన సోదరిని తన చివరి శ్వాస వరకు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేసే పర్వదినం ఇది. అలాంటి పండుగనాడు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి రావడం దిగ్భ్రాంతికరం. కానీ, ఈ కేసులో నిందితుడు దుర్మార్గుడు. అందుకే ఇలాంటి శిక్ష విధిస్తున్నా’’ అంటూ జస్టిస్ ఎస్ సాహూ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా హైకోర్టు బుధవారం సంచలన కేసులో.. అంతే సంచలన తీర్పు వెల్లడించింది. తన చెల్లిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డ మృగానికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష సరైందేనని తెలిపింది. ట్రయల్ కోర్టు విధించిన ఈ శిక్షను సమర్థిస్తూనే.. మరో రెండేళ్ల పాటు శిక్షను పొడిగిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి సాహూ. మల్కన్గిరికి చెందిన నిందితుడు.. 2018-19 మధ్య తల్లిని చంపేస్తానని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. తల్లికి విషయం తెలిసి స్థానిక అధికారుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కొడుకుపైనే న్యాయపోరాటానికి దిగింది. స్థానిక నేతల అండతో కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు నిందితుడు. అయితే.. చివరకు న్యాయమే నెగ్గింది. ఈ కేసుకు సంబంధించి మల్కన్గిరి జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై నిందితుడు హైకోర్టుకు వెళ్లగా.. ఇలాంటి మృగానికి శిక్ష సరైందేనని జడ్జి చెబుతూ అదనంగా మరో రెండేళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమానా విధించారు. -
రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..
రాయ్పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్తో అన్నాదమ్ముళ్లు సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్గఢ్లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది. ఓం ప్రకాశ్(48), ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్పూర్లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది. తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది. ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా! -
రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!
త్వరలోనే మెగా కోడలిగా అడుగుపెట్టబోతోన్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే వరుణ్ తేజ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది చివర్లోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేదికతో పాటు పెళ్లి తేదీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తన రిలేషన్ను అఫీషియల్గా ప్రకటించి ఉంగరాలు కూడా మార్చుకున్నారు. (ఇది చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! ) అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అన్న, వదినతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. అన్నా, చెల్లెల్ల అనుబంధం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన వరలాంటిదని అన్నారు. ఇన్స్టాలో లావణ్య రాస్తూ..' అన్న, వదినకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు. మీపై ప్రేమ రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంది.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సైతం లావణ్యకు హ్యాపీ రాఖీ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) -
గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టి..
సాక్షి, పెద్దపల్లి జిల్లా: సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన సోదరి షాక్కు గురైంది. కళ్ల ముందు అన్న విగతజీవిగా ఉండడాన్ని చూసి ఆమె గుండెలు అవిసెలా రోదించింది. అంత దుఖంలో అన్న మృతదేహానికి ఆమె రాఖీ కట్టి తన రక్తసంబంధాన్ని ప్రదర్శించింది. ఈ హృదయ విదారకమైన దృశ్యం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్టలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కనకయ్యకి.. రాఖీ పండగ సందర్బంగా రాఖీ కట్టడానికి ఆయన చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. సంతోషంగా వచ్చిన ఆమెకు అన్న కనకయ్య గుండెపోటుతో మృతి చెందాడని తెలిసి సొమ్మసిల్లిపడిపోయింది. అన్న మృతిని తట్టుకోలేకోపోయిన గౌరమ్మ బోరున విలపించింది. పుట్టెడు దుఃఖంలోనూ కడసారిగా అన్న మృతదేహానికి చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపింది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
‘అత్యంత క్రూరుడైన సోదరుడు!’.. బెంబెలెత్తిస్తున్న కుర్రాడి రాఖీ ఖర్చుల లిస్టు!
రక్షాబంధన్.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తమ ఆత్మీయతను వ్యక్తపరిచేరోజు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే సోదరులు ఈ వాగ్దానంతో పాటు తమ సోదరీమణులకు ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో సోదరులు మల్లగుల్లాలు పడుతుంటారు. కాగా ఒక కుర్రాడు రాఖీ రోజున తనకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఒక లిస్టు తయారు చేశాడు. దానిని సోషల్ మీడయాలో షేర్ చేయగా, అది వెంటనే వైరల్గా మారింది. అతను తనకు వరుసకు సోదరీమణులయ్యేవారికి రాఖీ రోజున ఎంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలో ఆ పోస్టులో రాశాడు. పిన్ని కూతురికి 11 రూపాయలు. ఎదురింటిలోని చెల్లెలికి 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ స్కూల్లోని చెల్లెలికి 21 రూపాయలు. ట్యూషన్లోని చెల్లెలికి 11 రూపాయలు. డైరీ మిల్క్ చాక్లెట్. ఇంకా ఎక్కువ మంది సోదరీమణులు వస్తే వారికి 5 రూపాయల పర్క్ చాక్లెట్ నా సొంత సోదరికి ఒక రూపాయికి లభించే 2 ఎక్లెయిర్స్ టోఫీలు ఈ కుర్రాడు రాఖీకి తనకు అయ్యే మొత్తం ఖర్చును 80 రూపాయలలో అడ్జెస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. @indian.official.memes అనే పేజీలో దీనిని షేర్ చేశారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లోనూ షేర్ చేశారు. ఈ పోస్టును చూసిన యూజర్లు దీనిని లైక్ చేస్తున్నారు. వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 2000 మందికి పైగా లైక్ చేశారు. ఒక యూజర్ ఇలా రాశాడు.. ‘ఈ కుర్రాడు తన సొంత సోదరికి కేవలం ఒక రూపాయి విలువ చేసే 2 చాక్లెట్లు మాత్రమే ఇస్తున్నాడు. ఎంత క్రూరమైన సోదరుడు’ అని రాయగా మరొక యూజర్ ‘వావ్ బ్రదర్, వాట్ యాన్ ఐడియా’ అని రాశాడు. ఇంకొక యూజర్ ‘ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి’ అని రాశాడు. ఇది కూడా చదవండి: యాంకర్ సల్మా సుల్తానా హంతకుడెవరు? మూలన పడిన కేసు ఎలా బయటకు వచ్చింది? -
తల్లి చేతులు అణిచింది.. అన్న కాళ్లు నొక్కి పెట్టాడు.. తండ్రి చేతుల్లో పాశవిక పరువు హత్య!
ఆమె భర్త ఆ సమయంలో సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంతలో ఆమె సోదరుడు, తల్లి, తండ్రి ఆమె ఇంటికి వచ్చారు. తల్లి ఆమె చేతులను గట్టిగా అదిమిపట్టుకుంది. సోదరుడు ఆమె కాళ్లను నొక్కిపెట్టాడు. తండ్రి ఆమె గొంతు నొక్కాడు. తరువాత ఆమె మృతదేహాన్ని కారులో ఉంచి, తమ గ్రామానికి తీసుకువెళ్లి, అక్కడున్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ కుమార్తె మృతదేహాన్ని దహనం చేశారు. అయితే ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. గ్రామంలోని అతని స్నేహితులు అతనికి ఫోన్ చేసి, నీ భార్య చనిపోయిందని, దహన సంస్కారాలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దీంతో అతను తన అత్తామామలపై అనుమానంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరువు హత్యకు పాల్పడిన మృతురాలి తల్లిదండ్రులతో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. కాగా నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. పండుగ పూట దారుణం ఈ ఘటన ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు జరిగింది. అంజలి(22) అనే మహిళ హరియాణాలోని గురుగ్రామ్లోని సెక్టార్ 102లో గల రాఫ్ ఆల్యాస్లోని ఫ్లాట్ నంబరు 201లో భర్త సందీప్తో పాటు ఉంటోంది. అంజలి బీఎస్సీ పూర్తి చేసింది. ఆమె భర్త అతని సోదరి ఇంటికి తీజ్ ఉత్సవం సందర్భంగా మిఠాయిలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అంజలి ఇంటికి ఆమె తండ్రి కుల్దీప్, తల్లి రింకీ, సోదరుడు కుణాల్ వచ్చారు. వారు ఒక్కసారిగా అంజలిపై దాడి చేశారు. తండ్రి ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత వారు అంజలి మృతదేహాన్ని తమ కారులో ఉంచి, తమ గ్రామమైన సురౌతికి చేరుకున్నారు. తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అంజలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తొలుత గ్రామస్తులకు ఈ విషయం తెలియలేదు. తరువాత అసలు విషయం వెలుగు చూసింది. కుమార్తె బ్రాహ్మణ యువకుడిని వివాహం చేసుకున్నదని.. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంజలి భర్తకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. వెంటనే సందీప్ తన భార్య అంజలిని ఆమె తల్లిదండ్రులు, సోదరుడు హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు గురించి పోలీసు ఉన్నతాధికారి వరుణ్ దహియా మాట్లాడుతూ ఇది పరువు హత్య అని తెలిపారు. అంజలి జాట్ కుటుంబానికి చెందినది, సందీప్ బ్రాహ్మణుడని, ఇద్దరూ ప్రేమించుకుని, 2022 డిసెంబరు 19న ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిపారు. అయితే వారు తమకు పెద్దల నుంచి ముప్పు ఉందని గ్రహించి, అప్పటి నుంచి గురుగ్రామ్లో ఉండసాగారు. పథకం ప్రకారం పరువు హత్య అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె ఇంటిలోని వారికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఒక పథకం ప్రకారం అంజలిని హత్య చేశారని పోలీసు అధికారి వరుణ్ తెలిపారు. కాగా అంజలి సోదరుడు కుణాల్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతను తన సోదరిని హత్య చేసేందుకు ఒక పథకం ప్రకారం ఆమె భర్త సందీప్తో పరిచయం పెంచుకుని వారుంటున్న అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో కాపురం పెట్టాడు. ఆగస్టు 17న సందీప్ తీజ్ ఉత్సవం సందర్భంగా అతని సోదరి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని కుణాల్ తన తల్లిదండ్రుకు తెలిపాడు. వెంటనే వారు అంజలి ఇంటికి చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంజలి తండ్రి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తుంటాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వరుణ్ దహియా తెలిపారు. ఇది కూడా చదవండి: నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది? -
ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడాడని... ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా?
ఉత్తరప్రదేశ్లోని ముజఫ్ఫర్నగర్కు చెందిన ఒక ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడటం వివాదాస్పదంగా మారి, అతని తమ్ముని హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భజన పాట పాడటంపై తలెత్తిన వివాదంలో గాయకుని సోదరుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో మృతి చెందిన ఖుర్షీద్(17) గాయకుడు ఫర్మానీ నాజ్కు వరుసకు సోదరుడు అవుతాడు. ఈ ఘటన రతన్పురీ పరిధిలోని ముహమ్మద్పుర్ మాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహాశివుని కీర్తిస్తూ సాగే ‘హర హర శంభో’ అనే పాటను ముస్లిం గాయకుడు నాజ్ గత ఏడాది పాడాడు. ఈ నేపధ్యంలో దేవబంద్కు చెందిన ఒక ముస్లిం మతపెద్ద ఇది మత విశ్వాసాలకు విరుద్దమంటూ అతనిపై ఫర్మానా జారీ చేశారు. అయితే నాజ్ ముస్లిం మతపెద్ద తీర్మానాన్ని తప్పుబడుతూ కళాకారులకు ఎటువంటి మతం ఉండదని, తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. నాజ్ గతంలో సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-12లో కూడా పాల్గొన్నారు. నాజ్ నిర్వహిస్తున్న యూ ట్యూబ్ చానల్కు 4.5 మిలియన్లకు మించిన సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అద్నాన్, వాజిద్, జుబేర్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కూడా గాయకుడు నాజ్కు వరుసకు సోదరులే కావడం విశేషం. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం -
గ్రాండ్గా బిగ్బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే తమ్ముడి రిసెప్షన్ (ఫోటోలు)
-
'బేబీ' వైష్ణవి తమ్ముడు ఎలా ఉన్నాడో చూశారా? (ఫొటోలు)
-
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా
బాలీవుడ్లో బుల్లితెర నటి, యూట్యూబ్ వ్లాగర్గా చారు అసోపా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మితా సేన్ బ్రదర్ అయిన రాజీవ్ సేన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్ 9, 2019న గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2021లో వారికి పాప జన్మించడంతో జియానా అని పేరుపెట్టుకున్నారు. వారి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జూన్ 8న విడాకులు తీసుకున్నారు. తాజాగా తన మాజీ భర్త రాజీవ్ సేన్ గురించి తను మొదటి వీడియో షేర్ చేసింది. ఆమె యూట్యూబ్లోని తన వ్లాగ్లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లే ముందు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో పంచుకుంది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) ఆ వీడియోలో విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్న ప్పుడు తీసిన సన్నివేశాలను ఇలా పంచుకుంది. 'నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను, నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అదే ఆందోళనను అనుభవిస్తారని భావిస్తున్నాను. విడాకుల ద్వారా...రాజీవ్ ఎల్లప్పుడూ జియానా తండ్రిగా ఉంటాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు జియానాను కలుసుకోవచ్చు'. అని తెలిపింది. ఆమె వ్లాగ్పై పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వారు కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) -
మహారాష్ట్ర రాజకీయంలో కలకలం.. చంపేస్తామంటూ మరో నేతకు బెదిరింపులు..
మహారాష్ట్ర: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర రాజకీయంలో కలకలం రేపింది. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్..తనకూ, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. చంపేస్తామంటూ దుండగులు బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేసేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి బెదిరింపులను కోరుకుంటోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని గతంలోనూ ఇలాంటివే వచ్చాయని ఆయన అన్నారు. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్.. -
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. (ఫొటోలు)
-
రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్బాస్ విన్నర్ నుంచి ఆర్ఆర్ఆర్ నాటునాటు సాంగ్తో స్టార్ అయిపోయాడు. హైదరాబాద్లోని బస్తీ నుంచి ప్రపంచం మెచ్చేస్థాయికి ఎదిగాడు. అంతలా పేరు సంపాదించుకున్నారు మన తెలుగు కుర్రాడు. సింగర్గానే కాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి నెలకొంది. తన తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహా వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ రాజకీయ నాయకులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. రాహుల్ దగ్గరుండి తమ్ముడి పెళ్లి పనులు చూసుకున్నారు. తమ్ముడి పెళ్లిలో దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ పెళ్లికి తెలంగాణ మంత్రులు, భాజపా నాయకులు హాజరయ్యారు. (ఇది చదవండి: బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
చెరువు వైపు చూస్తూ మొరుగుతున్న కుక్క.. పరిశీలనగా చూసి నివ్వెరపోయిన జనం!
తమ పెంపుడు కుక్కకు చెరువులో స్నానం చేయించాలని ఆ అన్నాచెల్లెలు ఎంతో ముచ్చటపడ్డారు. అయితే అదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్కను తీసుకుని చెరువుకు వెళ్లారు. అక్కడ దానికి స్నానం చేయించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారు లోతైన నీటిలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఉమేష్నగర్కు చెందిన రంజిత్ రవీంద్రన్(22),కీర్తి రవీంద్రన్(16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్పై కుక్కను తీసుకుని గావ్దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు. ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు ఏదో అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అన్నాచెల్లెళ్లు చదువు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కీర్తి 10వ తరగతిలో 98శాతం మార్కులను సంపాదించింది. ఈ అన్నాచెల్లెళ్లద్దరూ ఆ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. -
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. శాండల్వుడ్ నటి అనితా భట్ సోదరుడు గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోదరుని మరణాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. అనితా ట్వీట్లో రాస్తూ.. 'నిన్న నా గుండె ముక్కలైంది. కార్డియాక్ అరెస్ట్తో మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాలేడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. దయచేసి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ పోస్ట్ చేసింది. సోదరునితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అనితా భావోద్వేగానికి లోనైంది. కాగా.. అనితా భట్ 2008లో సైకో అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ లాంటి చిత్రాలలో నటించింది. A piece of my heart tore apart yesterday. My brother left us due to cardiac arrest. No words can explain the pain we are going through and the bitter truth we need to accept is he won't come back. Please bless him to get Sadgati. Need lots of yours blessing now 🙏🏻 pic.twitter.com/Ww9QOs1wog — Anita Bhat (@IamAnitaBhat) April 10, 2023 -
సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
Umesh Pal kidnapping case: గ్యాంగ్స్టర్ అతిక్ని దోషిగా తేల్చిన కోర్టు!
2006 ఉమేష్పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ను ప్రయాగ్రాజ్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్, అతని సోదరుడిని నేడు ప్రయాగ్రాజ్ కోర్టు ముందు హజరు పరిచారు. కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్ అహ్మద్, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్రాజ్లోని నైని సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్ అహ్మద్ను ప్రయాగ్రాజ్లోని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్పాల్ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్ పాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్. ఐతే అతను కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం
అన్నమయ్య : జల్సాల కోసం అక్క ఇంటికే కన్నం వేసి దోచుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కే.రామమోహన్ బుధవారం మీడియాకు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లెకు చెందిన డి.ఓబులేసు (28) మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఓబులేసుకు కూలీపనితో సంపాదించే డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓబులేసు అక్క ఉత్తమ్మ తాకాటంవారిపల్లెలోని ఇంటిలో ఉంటోంది. ఆమెకు బి.కొత్తకోటలోనూ ఇల్లు ఉంది. గతనెల 11న తాకాటంవారిపల్లెలోని ఇంటికి తాళంవేసి బి.కొత్తకొటకు వచ్చింది, పది రోజుల తర్వా తిరిగి తాకాటంవారిపల్లెకు వెళ్లింది. తాళం తీసి లోపలికి వెళ్లింది. బీరువా పగులగొట్టి ఉండటం గమనించింది. వెంటనే బీరువాలో చూడగా గలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు చేధించేందుకు పోలీసులు బెంగళూరు, మైసూర్లో దర్యాప్తు చేశారు. పలువురి అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా నిందితులు ఎవరో తేలకపోవడంతో స్థానికులపై అనుమానంతో నిఘా వేసి దర్పాప్తు ప్రారంభించడంతో బుధవారం నిందితుడు ఓబులేసు బత్తలాపురం క్రాస్ వద్ద ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. చోరీపై విచారించగా ఉత్తమ్మ ఇంటికి కన్నంవేసింది సొంత తమ్ముడు ఓబులేసు అని నిర్ధారణ అయింది. గతనెల 11వ తేది రాత్రి 11 గంటల సమయంలో అక్క ఉత్తమ్మ ఇంటి తాళాలు తీసి లోపలికి ప్రవేశించి బీరువాలోని నగలను చోరీ చేసినట్టు నిర్ధారించారు. నిందితుని నుంచి రూ.1.24 లక్షల విలువైన ఒక నక్లెస్, జత కమ్మలు, జత జాలర్లులను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిని మదనపల్లె కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్ని పోశాడు. రెండు గ్లాస్ల వాటర్ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
'రేసుగుర్రం' విలన్ రవికిషన్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కాగా రామ్ కిషన్ శుక్లా ముంబైలో ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటేవారు. నిన్న(ఆదివారం)రామ్ కిషన్ శుక్లా తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ఇదిలా ఉంటే రవికిషన్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం చిత్రంలో ‘మద్దాలి శివారెడ్డి’పాత్రతో తెలుగు వారికి దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. दुःखद …मेरे बड़े भाई श्री रामकिशन शुक्ला जी का अचानक ह्रदय गति रुकने के कारण मुंबई के नानावटी अस्पताल में दोपहर 12 बजे निधन हो गया है । महादेव से प्रार्थना है की अपने श्री चरणों में स्थान दे ओम् शान्ति शान्ति शान्ति 🙏 pic.twitter.com/TViOuakWcl — Ravi Kishan (@ravikishann) February 5, 2023 -
పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘ఒకలైలా కోసం’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం ముంకుందా, డీజే, మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ సైతం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. శివానీ శెట్టి అనే యువతితో అతడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో పూజా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది. ఈ వేడుకలో పూజా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘మా అన్నయ్య ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేమను కలుసుకున్నాడు. ఈ వారం అంతా చాలా ఉరుకులు పరుగులుగా గడిచింది. మా ఇంట పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి నేను చిన్న పిల్లలా నవ్వుతూ.. ఆనందంతో కన్నీళ్లు పెట్టాకుంటూనే ఉన్నాను’ అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా తన జీవితంలో మరో ఫేజ్కు వెళ్లిన తన అన్నయ్య పూజా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) చదవండి: తారకరత్న గురించి గుడ్న్యూస్ చెప్పిన మంచు మనోజ్ నయనతార భర్త విగ్నేశ్ శివన్కు షాక్ ఇచ్చిన స్టార్ హీరో -
సోదరుడి వివాహవేడుకలో పూజా హెగ్డే అల్లరి.. ఫొటోలు వైరల్
-
Kushboo: సీనియర్ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయంపై ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ను షేర్చేసింది. 'మనకు ఇష్టమైన వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకున్నప్పటికీ వోడ్కోలు చెప్పే సమయం స్తుంది. ఈరోజుతో మా అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ,గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ ఖుష్బూ భావోద్వేగానికి లోనైంది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ నేడు(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
Viral Video: అన్న, చెల్లెల బాండింగ్ చూస్తే ముచ్చటేస్తుంది ..!
-
‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి..
సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్ యూ’ అంటూ మెసేజ్ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్ నిరాకరించారు. దీంతో దినేశ్, గణేశ్లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్గుట్టకు వెళ్లాడు. అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్కు ఫోన్చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంకటేశ్ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రిలేషన్ని వద్దన్నారని...ప్రియురాలి సోదరుడు, తండ్రిపై దాడి
ఒక వ్యక్తి తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని ప్రియురాలి తండ్రి సోదరుడుపై పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని రంసోల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సమల్ అనే వ్యక్తి కాలియాపాణిలోని మార్కెట్ వద్ద ఉన్న ప్రియురాలి సోదరుడు జితేంద్ర వద్దకు వచ్చి పదునైనా ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతని కేకలు విన్న అతని తండ్రి సంతోష్ జితేంద్రను రక్షించడానికి అడ్డుగా వచ్చాడు. దీంతో సమల్ అతడి తండ్రి సంతోష్పై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ ఘటనలో తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు బీరెస్ సమల్ అలియాస్ సంతను బాధితుడు జితేంద్ర సోదరితో సంబంధం పెట్టుకున్నాడు. ఐతే సమల్ వివాహితుడు కావడంతో జితేంద్ర, అతని తండ్రి వారి సంబంధాన్ని వ్యతిరేకించారు. దీంతో కోపం పెంచుకున్న సమల్ వారిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. దీంతో స్థానికులు సమల్ను పారిపోకుండా అడ్డుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఐతే బాధితుడు జితేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని, అతడి తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహంతో నిందితుడి ఇంటిని కూల్చివేసి, నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: షాకింగ్ ఘటన: రాత్రికి రాత్రే రోడ్డుని మాయం చేసిన దొంగలు) -
Crime: ప్రాణం తీసిన పక్కింటి కుర్రాడి ప్రేమ
పక్కింటి కుర్రాడు.. అదీ వేరే వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని తెలిసి ‘వద్దని’ చెల్లెలిని వారించాడు ఆ అన్న. అయినా ఆమె వినలేదు. అతనితో మాటలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలో వాళ్లిద్దరూ మరింత చనువుగా ఉండడం చూసి రగిలిపోయాడు ఆ అన్న. అతనిలో కోపం కట్టలు తెంచుకుని.. ఆమెను అతి దారుణంగా హతమార్చాడు. ఉత్తర ప్రదేశ్ గోండాలో పరువు హత్య కలకలం సృష్టించింది. 16 ఏళ్ల టీనేజర్ను ఆమె సోదరుడే అత్యంత పైశాచికంగా హతమార్చాడు. మూడు నెలల కిందట పక్కింటి కుర్రాడితో వాట్సాప్ ఛాటింగ్ చేస్తూ ఆమె అన్న కంటపడింది. దీంతో ఆమెను చితకబాది.. అతనికి దూరంగా ఉండాలని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఈసారి ఏకంగా ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోవడంతో.. ఆమెతో గొడవకు దిగాడు. ఏం చేస్తావో చేస్కో అంటూ తెగేసి చెప్పేసరికి ఆ అన్నలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ వెంటనే ఇద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ అతని కంటపడ్డారు. గురువారం రాత్రి ఓ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఆపై కాట్రా బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్య కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట నిందితుడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి సోదరితో కలిసి దామోదర్ గ్రామంలోకూలీ పనులు చేసుకుంటూ స్థిరపడ్డాడు. అయితే వేరే వర్గానికి చెందిన కుర్రాడితో తన చెల్లెలు చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇదీ చదవండి: అశ్లీల సైట్లు చూసే అత్యాచారం చేశారట! -
రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది.. భర్త వేధింపులపై తొలిసారి నోరు విప్పిన నటి
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019లో జూన్లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం వారికి 11 నెలల కూతురు ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరో ప్రకటన చేసింది. తాజాగా దీనిపై నటి చారు అసోపా స్పందించింది. ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది. తన భర్త వల కెరీర్ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను. పెళ్లయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాను. అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు. కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు. ఫోన్ నంబర్లు బ్లాక్ చేశాడు. అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని చెప్పింది. అలాగే ‘‘ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్పై దృష్టి పెట్టాను. ‘అక్బర్ కా బల్ బీర్బల్’తో తిరిగి షూటింగ్ పాల్గొన్న. అయితే నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే రాజీవ్ తిరిగి వచ్చాడు. నా వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు. నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్ అందరికీ మెసేజ్లు పెట్టడం, బెదిరించడం చేశాడు. రాజీవ్ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు. దీంతో నేను విడాకులకు అప్లయ్ చేశాను. విడాకులు వద్దని, నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా. అయినా రాజీవ్ తన తీరు మార్చుకోలేదు. కొన్నిరోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు. అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎంత ధైర్యం రా.. నాకే నోటీసు ఇస్తావా.. నువ్వు ఏమనుకుంటున్నావ్.. నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త.. ఇక్కడే పాతేస్తా...’ అంటూ టీడీపీ నాయకుడు కూన రవి సోదరుడు, కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ ఓ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగిపై రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి ఎత్తి బెదిరించారు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. తాను కాంట్రాక్ట్ తీసుకున్న రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ కేసీహెచ్ మహంతిపైనే దౌర్జన్యానికి దిగారు. ఈనెల 10న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ‘సాక్షి’ ఆరా తీయగా అసలు విషయాలు తెలిశాయి. అలవాటు ప్రకారమే.. టీడీపీ నేతల రౌడీయిజం ఆగలేదు. పదవులు పోయి మూడేళ్లయినా అధికార దర్పం దిగలేదు. సామాన్య ప్రజలను తిట్టినట్టు అధికారులపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇప్పటికే అనేక మార్లు అధికారులకు బెదిరింపులు, దాడులు చేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. కేసులు నమోదై, అరెస్టుల వరకు వెళ్లాయి. అయినా వారి పంథా మారడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా కూన రవికుమార్ మాదిరిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణ దౌర్జన్య కాండకు దిగారు. శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంలో బరితెగించి వ్యవహరించారు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరి ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజినీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా చెయ్యి ఎత్తి తన అహంకారాన్ని ప్రదర్శించారు. దౌర్జన్యానికి మారుపేరైన కూన రవికుమార్.. సోదరుడు కావడంతో తోటి సిబ్బంది కూడా చోద్యం చూశారే తప్ప తప్పు అని చెప్పలేకపోయారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక, పై అధికారులు ముందుకు రాక అసిస్టెంట్ ఇంజినీర్ మహంతి కుంగిపోతున్నారు. యూనియన్ లీడరైన తనకే ఇలా జరిగితే.. మిగతా ఉద్యోగుల మాటేంటని బాధపడుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం.. శ్రీకాకుళం మండలం ఎన్హెచ్–16 (శాస్త్రుల పేట) నుంచి సానివాడ మీదుగా వప్పంగి వరకు రూ.2.69 కోట్ల పీఎంజీఎస్వై నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది మే 24న అగ్రిమెంట్ కుదిరింది. ఈ ప్రకారం ఏడాదిలోగా పనులను పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ కూన వెంకట సత్యనారాయణతో పీఆర్ పీఐయూ విభాగం అగ్రిమెంట్ అయ్యింది. అయితే కాలపరిమితి పూర్తయినప్పటికీ ఏడాది కాలంలో ఒక్క రాయి కూడా వేయలేదు. తీరా ఇంజినీరింగ్ అధికారులు గట్టిగా అడిగితే.. కోవిడ్ కారణంగా రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్కు వెసలు బాటు కల్పించారు. దీంతో మే నెల నుంచి రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ.. నిబంధనలకు పూర్తిగా పాతరేశాడు. దీంతో ఏఈ మహంతి నిర్మాణ పనులపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అలార్మింగ్ లెటర్(లోటుపాట్లు సరిచేసుకోండని చెప్పే పత్రం) ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ విషయం తెలుసుకున్న కూన సత్యనారాయణ ఈ నెల 10న పీఆర్ డివిజనల్ కార్యాలయానికి వచ్చి వీరంగం వేశారు. ఏఈ మహంతిపై దురుసుగా ప్రవర్తించాడు. తొలుత అసిస్టెంట్ ఇంజినీర్తో వాగ్వాదం చేసి.. ఆ తర్వాత పళ్లు బిగించి కళ్లు ఎర్రజేసి, కొట్టడానికి చెయ్యెత్తారు. నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి, పాతేస్తానంటూ బెదిరించి దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ ఇంజినీర్ చేసేదేమి లేక ‘కొట్టేయండి సార్.. కొట్టేస్తే మీకు హ్యాపీగా ఉంటుంది కదా’ అని నిస్సహాయంగా స్పందించారు. అయినా కూన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో పీఏ టు ఈఈ, మరో ముగ్గురు నా కేడర్ ఏఈలు, క్లరికల్ స్టాఫ్ అంతా ఉన్నారు. కానీ కూనకు భయపడి ఎవరూ ఏమీ అనలేకపోయారు. దీంతో ఆ అసిస్టెంట్ ఇంజినీర్ తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని కుమిలిపోతున్నారు. (క్లిక్ చేయండి: అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!) -
ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి
సాక్షి, తమిళనాడు: చెన్నై పుళల్ సమీపంలో శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటించిన పాఠశాల విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. చెన్నై పుళల్ సమీపంలోని బుద్దాగరం గ్రామం కామరజర్ నగర్కు చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తీక్(11). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇద్దరు సోదరులకు ఎదురుగా గదిలో పరుపు మీద కుర్చీ వేసుకుని నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తీక్ నటించి చూపిస్తూ ఉన్నాడు. ఇందుకోసం కుర్చీపైకి ఎక్కి నిలబడి ఫ్యాన్ కొక్కికి నైలాన్ తాడు తగిలించి, మరో కొనను కార్తీక్ మెడకు చుట్టుకుని నటించాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కుర్చీ కింద పడి పోవడంతో కార్తీక్ మెడకు నైలాన్ తాడు బిగుసుకుని మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు పాఠశాల విద్యార్థి కార్తీక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం? -
వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ ఆటోస్టాండ్ సమీపంలో నివాసముండే అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా కుంగిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక స్థానికులు పోలీసులకు తెలపడంతో ఈ అన్నా చెల్లెళ్ల దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. చదవండి: ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో... శుక్రవారం సాయంత్రం పోలీసులు వారి ఇంటికి వచ్చి అన్నా చెల్లెళ్లతో మాట్లాడారు. తిరిగి శనివారం ఉదయం స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్చార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనరు కె.భాగ్యలక్ష్మి వారి ఇంటికి వెళ్లారు. మురికి కూపంగా ఉన్న బాధితుల ఇంటిని శుభ్రం చేయించారు. విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించారు. అన్నా చెల్లెళ్లకు ఆహారం, కొత్త దుస్తులు అందజేశారు. అన్నా చెల్లెళ్లకు స్నానం చేయించి, దుస్తులు మార్చి జన జీవన స్రవంతిలోకి తెచ్చారు. ఇన్నాళ్లూ ఆ ఇంటిని చూసి భయపడిన వీధిలోని చిన్నారులు సైతం వారితో మాట్లాడేలా పోలీసులు మమేకం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరికి ఈ సహాయం చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ తెలిపారు. నాడెంతో వైభవం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల చెర్లోపల్లికి చెందిన అంబటి రామయ్య, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన లక్ష్మిదేవి దంపతులు 50 ఏళ్ల క్రితం అనంతపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక పాతూరు పూల మండీల పక్కనే ఉన్న వీధిలో అంబటి రామయ్య హోటల్ నడిపేవారు. బాగానే సంపాదించారు. పెద్ద కుమార్తెను కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే అల్లుడికి మరో మహిళతో పెళ్లయిందని తెలిసి కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. రామయ్య వయసు మళ్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్ల క్రితం భార్య లక్ష్మీదేవి కూడా మృతి చెందింది. తల్లిదండ్రుల మరణం తర్వాత అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి కుంగిపోయారు. పిల్లలను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకు పంపకపోవడంతో అటు బంధువులు, ఇటు ఆత్మీయులు పెద్దగా లేరు. చిన్న చెల్లెలు, ఆమె భర్త ఎప్పుడైనా ఇంటికి వెళ్లినా, అన్నా చెల్లెళ్లు వారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో క్రమేణా వారూ దూరమయ్యారు. తిరుపాల్ బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తేవడం, దాంతోనే ముగ్గురూ సరిపెట్టుకోవడంతో బక్కచిక్కిపోయారు. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి వారికి కొత్త వెలుగు ప్రసాదించారు. -
అమ్మ కావాలి.. కన్నీరు పెట్టించిన విషాద ఘటన..
ముప్పాళ్ల(పల్నాడు జిల్లా): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆలనా పాలనా చూడాల్సిన తల్లి క్షణికావేశంతో ఆత్మహత్యకు ప్రయత్నించి కన్నబిడ్డకు అమ్మప్రేమను దూరం చేయగా, తన తోబుట్టువులా భావించే మనిషి కళ్ల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తే ఆమెను కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన పల్నాడు జిల్లాలో సోమవారం జరిగింది. రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బీచ్లో రిప్ కరెంట్.. వేరీ డేంజర్.. గజ ఈతగాళ్లు కూడా తప్పించుకోలేరు.. కాలువలో దూకిన చెల్లి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన సోదరుడు ఇద్దరూ మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలోని నార్నెపాడు సమీపంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్రెడ్డికి నాలుగేళ్ల కిందట ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(22)తో వివాహం జరిగింది. వారికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు. ఏడాది కిందట ప్రమాదం జరిగి హరినాథ్రెడ్డికి కాలు విరిగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. 15 రోజుల కిందట భర్తతో గొడవ పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. హరినాథ్రెడ్డి వరుసకు బావ అయిన మోదుగుల వెంకటరమణారెడ్డి(47)ని తన భార్య, కుమారుడిని తీసుకురావాలని కోరారు. ఆ నేపథ్యంలో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి ఆమె తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడాడు. కృష్ణవేణి, ఆమె కుమారుడు మహీందర్రెడ్డిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పాకాలపాడు బయలుదేరాడు. మండల పరిధిలోని నార్నెపాడు రోడ్డు వద్ద గల గుంటూరు బ్రాంచి కాలువ వద్దకు రాగానే ఆమె బైకు ఆపమని కోరింది. బైకు ఆపగా వెళ్లి కాలువలో దూకింది. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతిన్న వెంకటరమణారెడ్డి బండిపై బాలుడిని కూర్చోబెట్టి ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో ఆమె మునిగి పోయింది. అక్కడే ఉన్న స్థానికులు వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అతను మునిగిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీయగా, ఆమె మృతదేహం కనిపించలేదు. నీటి ఉధృతిని మరో కాలువకు మళ్లించి గాలింపు చేపట్టారు. కాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇరువురి మృతదేహాలను శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం.పట్టాభిరామయ్య తెలిపారు. అమ్మ కావాలి... అమ్మ కావాలి అంటూ బాలుడు ఏడుస్తున్న తీరు చూపరులను కన్నీరు పెట్టించింది. అప్పటి వరకు తనతోపాటు వచ్చిన అమ్మ, మామయ్యలు కనిపించకపోవటంతో పాటు, జనాలు పెద్దఎత్తున గుమికూడి ఉండటంతో ఏమి జరిగిందో తెలియక బాలుడు విలపించసాగాడు. కొద్దిసేపటికి మృతుల బంధువులు అక్కడికి చేరుకుని బాలుడిని ఓదార్చారు. వెంకటరమణారెడ్డికి భార్య ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లోను విషాదఛాయలు అలముకున్నాయి. -
Hyderabad: మూడేళ్లుగా చెల్లెలిపైనే అఘాయిత్యం..
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డ దారుణం నగరంలో వెలుగు చూసింది. నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపాల్కు చెందిన కుటుంబం హిమాయత్నగర్లో స్థిరపడింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019లో బాలిక వయస్సు 16 సంవత్సరాలు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు రోహన్ నాయుడు తన చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారూ పట్టించుకోలేదు. దీనిని అసరగా తీసుకున్న రోహన్ నాయుడు చెల్లిని భయపెడుతూ అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు లైంగిక దాడిచేశాడు. ఇదిలా ఉండగా జూన్లో బాధితురాలు నేపాల్కు వెళ్లి వచ్చింది. తిరిగి వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. అయినా ఆమెను ఫోన్చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు ఆగస్టు 30న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రోహన్నాయుడుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. చదవండి: గుజరాత్లో కారు బీభత్సం.. ఆరుగురు మృతి -
నడి రోడ్డు పై హత్య... సోదరుడిని చంపాడన్న కోపంతో...
న్యూఢిల్లీ: సోదరుడిని హత్య చేశారన్న కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్టు 13న ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు సునీల్ గున్నిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆగస్టు 12న సునీల్ సోదరుడుని కొంతమంది వ్యక్తులు చంపారని ఢిల్లీ పోలీస్ నార్త్ డిప్యూటి కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఆ తర్వాత రోజు సునీల్ తన సోదరుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి రాహుల్, అజయ్, ముఖేష్ అతని సహచరుల చేతిలో హత్యకు గురయ్యాడు. తొలుత సునీల్ రాహుల్, అజయ్, ముఖేష్ వారి సహచరుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారంతా సునీల్ని దారుణంగా కొట్టి పరారయ్యినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సునీల్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి సునీల్ తన సోదరుడిని చంపారన్న కోపంతో నిందితులపై దాడి చేసేందుకు కొడవలితో వెళ్లాడని అన్నారు. ఐతే వారంతా సునీల్ వద్ద నుంచి కొడవలిని లాక్కుని, కర్రలు, రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. (చదవండి: స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్య
-
తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి దారుణ హత్య!
సాక్షి, ఖమ్మం: జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడి తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో కొడవళ్లతో దారుణంగా హతమార్చారు దుండగులు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. అయితే.. సీపీఎంతో విభేదించి.. టీఆర్ఎస్లో చేరాడు కృష్ణయ్య. ఆపై తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఇదీ చదవండి: దారుణాతీ దారుణం .. దళిత చిన్నారిని కొట్టి చంపిన టీచర్ -
ఇదేం పెళ్లి?
సాధారణంగా పెళ్లంటే ఎవరు వచ్చినా రాకున్నా వధూవరులైతే పెళ్లిపీటలెక్కుతారు. కానీ తన పెళ్లికి పెళ్లికొడుకే గైర్హాజరైతే..?! అయినా పెళ్లి ప్రక్రియ నిరాటంకంగా జరిగిపోతే! పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియారా లియోన్లో ఇటీవల ఇదే విచిత్రం చోటుచేసుకుంది. చైనా ఫుట్బాల్ లీగ్ నుంచి స్వీడన్కు చెందిన మాల్మో ఎఫ్సీ అనే పుట్బాల్ క్లబ్లో ఇటీవల చేరిన మొహమ్మద్ బుయా టురే అనే 26 ఏళ్ల ఫుట్బాలర్ తన ప్రేయసితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే పెళ్లి రోజునే తొలి మ్యాచ్ ఆడేందుకు వీలుగా ప్రాక్టీస్ సెషన్లో తప్పనిసరిగా పాల్గొనాలంటూ చివరి నిమిషంలో క్లబ్ నిర్వాహకుల నుంచి అతనికి పిలుపు వచ్చింది. ఇక చేసేదేమీ లేకపోవడంతో టురే తన సోదరుడిని వరుడి స్థానంలో కూర్చోబెట్టి స్వీడెన్ వెళ్లిపోయాడు! దీంతో పెళ్లి దుస్తులు ధరించడం దగ్గర్నుంచి వధువుతో కలిసి కేక్ కటింగ్ చేయడం వరకు అతనే పెళ్లి తంతునంతా కానిచ్చాడు. పెళ్లి ఫొటోలు, వీడియోల్లో దర్జాగా భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చాడు!! ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారడంతో టురే స్పందించాడు. పెళ్లికి ముందు రోజే తామిద్దరం పెళ్లి దుస్తుల్లో ఫొటోలు, వీడియోలు దిగామంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అయితే మ్యాచ్ల కారణంగా ఇంతవరకు తన ‘భార్య’ను కలుసుకోవడం వీలుకాలేదని.. త్వరలోనే ఆమెను స్వీడన్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే టురే చేసిన ‘పని’ని కొందరు తప్పుబడుతుంటే మరికొందరు మాత్రం ఇదే అసలైన ‘వృత్తి ధర్మం’ అంటూ అతన్ని వెనకేసుకొస్తున్నారు. -
జడ్చర్లలో దారుణం... చెల్లిని ప్రేమించాడని చంపేశారు
జడ్చర్ల: తన చెల్లిని ప్రేమించిన యువకుడిని ఆమె సోదరులు దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన సింగిదాస్ కృష్ణ (24) అదే గ్రామానికి చెందిన యువతి నందిని (17) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు కావడంతో మరింత దగ్గరయ్యారు. ఈ విషయం సదరు యువతి సోదరులు సింగిదాస్ మోహన్, సింగిదాస్ విజయ్కి తెలిసింది. కాగా, మంగళవారం రాత్రి మొహర్రం వేడుకల్లో అందరూ నిమగ్నమైన సమయంలో గ్రామశివారులోని మొక్కజొన్న చేనులో కలుసుకోవడానికి కృష్ణ, నందిని వెళ్లారు. ఇది గమనించిన ఆమె సోదరులు అక్కడకు చేరుకుని కృష్ణ కడుపులో కత్తితో పొడవడంతో పేగులు, అవయవాలు బయటకు వచ్చాయి. తనను ఎలాగైనా కాపాడాలని కృష్ణ వేడుకోవడంతో వారే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి, వెంటనే చికిత్స కోసం మహబూబ్నగర్ సమీపంలోని ఏనుగొండ ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. కృష్ణ ఆటో నడుపుతుంటాడని తల్లిదండ్రులు జంగమ్మ, బాలయ్య కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు జడ్చర్ల పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. -
సుష్మితా సేన్ తమ్ముడితో విడాకులు నిజమే: నటి
బాలీవుడ్ టీవీ నటి చారు అసోపా భర్త రాజీవ్ సేన్తో విడాకులపై స్పందించారు. ఇప్పటికే లాయర్ ద్వారా విడాకుల నోటీసులు పంపానని, ఇక మళ్లీ అతనితో కలిసుండటం అన్నది అసాధ్యం అని పేర్కొంది. రీసెంట్గా రాజీవ్ చారు అసోపాతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై స్పందిస్తూ.. అతను అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని, ఇప్పటికే తామిద్దం ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా రాజీవ్తో కలిసి ఉన్న ఫోటోలన్నింటిని తన అకౌంట్ నుంచి తొలిగించినట్లు పేర్కొంది. '2019లో రాజీవ్తో నా వివాహం జరిగింది. ఈ మూడేళ్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను ఇల్లు వదిలి వెళ్లిపోతాడే తప్పా పరిష్కరించాలని ఎప్పుడూ అనుకోడు. ఎన్నోసార్లు విడాకులు తీసుకోవద్దని అనుకున్నా. కానీ పరిస్థితులు చేయిదాటి పోయాయి.ఇక చేసేదీమీ లేదు. అందుకే మా పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంటున్నాం. ఇక తన మొదటి పెళ్లిని దాచాను అని రాజీవ్ అన్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. నా గతం గురించి మొత్తం చెప్పాకే అతడిని పెళ్లి చేసుకున్నా' అని చారు పేర్కొంది. ఇక తన ఆడపడుచు సుష్మితా సేన్తో మాత్రం తనకు మంచి అనుబంధం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడతానని తెలిపింది. 'విడాకుల సమయంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. సుష్మితా నాకు అండగా నిలబడింది. తనతో ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ మా మధ్య ఉంది' అంటూ వెల్లడించింది. View this post on Instagram A post shared by Rajeev Sen (@rajeevsen9) -
వివాహేతర సంబంధానికి కూతురు అడ్డొస్తుందని.. సొంత అన్నతో కలిసి
సాక్షి, వరంగల్: సభ్యసమాజం తలదించుకునేలా చేసింది ఓ కసాయి తల్లి. తన సొంత అన్నతో వివాహేతర సంబంధం సాగిస్తూ అడ్డొస్తుందని సోదరుడితో కలిసి ఆరేళ్ల కన్న కూతురి గొంతు నులిమి కడతేర్చింది. పోలీసులు నిందితులిద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ గ్రామ శివారు నర్సింహులగూడెంకు చెందిన పూనెం శిరీషకు.. ఏడేళ్ల క్రితం పెనుగొండ గ్రామ శివారు కట్టుగుడెంకు చెందిన అశోక్తో వివాహం జరిగింది. వీరికి కూతురు అనూశ్రీ(6) ఉంది. శిరీష తన సొంత అన్న పూనెం కుమారస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లె కలిసి ఐదేళ్ల క్రితం అనూశ్రీని తీసుకుని భువనగిరిలోని మర్రిగుడెంకు వెళ్లారు. అక్కడే పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అనూశ్రీ తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. ఆస్పత్రులకు తీసుకెళ్లే స్థోమత లేకపోవడం, పెరిగి పెద్దదైతే ఖర్చులు భరించాల్సి వస్తుంది. పైగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వారు భావించారు. ఈ క్రమంలో గత నెల 24న అనూశ్రీ చాతిపై తల్లి కూర్చోని గట్టిగా పట్టుకోగా కుమారస్వామి గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు మృతదేహన్ని స్వగ్రామమైన నర్సింహులగూడెం తీసుకెళ్లి కడుపునొప్పితో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్తులకు అనుమానం రావడంతో డయల్ 100కు సమాచారం అందించారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిని కారుతో ఢీకొట్టి.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో బాలిక గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది. దీంతో పోలీసులు శిరీష, కుమారస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం ఒప్పుకున్నారు. మర్రిగుడెంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసును యాదగిరి టౌన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు. -
Commonwealth Games 2022: అన్నయ్య అభయహస్తమై...స్ఫూర్తిదాయకం అచింత ప్రస్థానం
సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది. ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ‘జరీ’ వర్క్తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్లిఫ్టింగ్లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. 2014 జాతీయ చాంపియన్షిప్లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్షిప్లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్... కామన్వెల్త్ గేమ్స్లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్లో 143+క్లీన్ అండ్ జెర్క్లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు. అజయ్కు నిరాశ 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
నా కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగొద్దు: కేశినేని చిన్ని
సాక్షి,న్యూఢిల్లీ/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాజకీయ స్వప్రయోజనాల కోసం తన కుటుంబసభ్యుల పేర్లను వివాదంలోకి లాగవద్దని టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని సూచించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కారుకు ఎంపీ స్టిక్కర్ను ఉపయోగిస్తున్నానంటూ పోలీసులకు కేశినేని నాని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. కారుకు ఆయన స్టిక్కర్ను అంటించుకుని దందా చేస్తే వెంటనే బహిర్గతం అయ్యేదని, తాను వ్యాపారులెవ్వరినీ బెదిరించలేదని చెప్పారు. వ్యాపారులను బెదిరిస్తే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా.. ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ కేశినేని నానిని ప్రశ్నించారు. ఆయన్ని శత్రువుగా కాకుండా.. సొంత అన్నగానే భావిస్తున్నానని చెప్పారు. నాని చేసిన ఫిర్యాదు వ్యక్తిగతమైనదే తప్ప.. రాజకీయపరమైనది కాదన్నారు. దీనిపై పోలీసుల విచారణ ముగిసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. స్టిక్కర్ను ఫోర్జరీ చేశారు: ఎంపీ కేశినేని నాని విజయవాడ ఎంపీగా తనకు మంజూరు చేసిన కారు స్టిక్కరును ఫోర్జరీ చేసి టీఎస్ 07 హెచ్డబ్ల్యూ 7777 రిజిస్ట్రేషన్ ఉన్న కారుకు వినియోగిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కారు స్టిక్కరును ఫోర్జరీ చేసిన సంగతి 2 నెలల క్రితం తన దృష్టికి వచ్చిందని.. వెంటనే లోక్సభ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీన్ని భద్రతాపరమైన అంశంగా పరిగణించాలన్నారు. -
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
Sushmita Sen Brother Rajeev Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇందుకు కారణం వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేయడమే. అయితే తాజాగా సుష్మితా సేన్కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశమైంది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్ను ఇన్స్టాగ్రామ్లో తను అన్ఫాలో చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజీవ్, అతని భార్య చారు అసోపాతో వివాహమైన మూడేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడంలో తప్పు రాజీవ్దేనని, అందుకే సుష్మితా సేన్ అతని మాజీ భార్య చారుకు సపోర్ట్ చేస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై తాజాగా రాజీవ్ స్పందించాడు. 'నా సోదరి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదని మీడియా చెబుతోంది. అసలు ఆమె ఎప్పుడూ నన్ను ఫాలో కాలేదు, కొత్తగా అన్ఫాలో చేయడానికి. ఈ వార్త నన్ను కలిచివేసింది. అందుకే ఈ విషయం గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. సుష్మితా నన్ను కేవలం ఒక ట్విటర్లోనే ఫాలో అవుతోంది. అది కూడా చాలా కాలంగా. ఇక రెండో విషయం ఏంటంటే ? నా భార్య చారుని ఫాలో అవుతూ ఆమెకు సుష్మితా మద్దతుగా నిలిచిందని మీడియా పేర్కొంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే.. మా అక్క సుష్మితా చాలా తెలివైనది. మేము దేని గురించి నిలబడతామో ఆమెకు చాలా బాగా తెలుసు. అలాగే తను బాధితురాలిగా మెలగడంలో ఎంత గొప్ప నేర్పరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది' అని తెలిపాడు. మరి సుష్మితా సేన్ ఆమెను ఎందుకు ఫాలో అవుతుందని అడిగిన ప్రశ్నకు 'అది ఆమెనే అడిగి తెలుసుకోండి' అని సమాధానమిచ్చాడు. కాగా చారు అసోపా తన మొదటి పెళ్లి గురించి అతని దగ్గర దాచిందని గతంలో ఆరోపణలు చేశాడు రాజీవ్. అయితే ఇప్పుడు ఆమె మూవ్ ఆన్ అయిందని, ముంబైలో సంతోషంగా జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నాను చెప్పుకొచ్చాడు. -
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్తో ఈ గోవా బ్యూటీ డేటింగ్లో ఉన్నట్లు ఇంగ్లీష్ వెబ్సైట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ సోదరుడుల సెబాస్టియన్ లారెంట్ మిచెల్తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్డే సెలబ్రేషన్స్లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్ 6 నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్ ఇన్స్టా అకౌంట్ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
వైరల్: చెల్లెలి పెళ్లిలో సోదరుడి సర్ప్రైజ్.. ఏకంగా తండ్రి రూపాన్నే తీసుకొచ్చి..
అన్న అంటే నాన్నలో సగం అంటారు. అమ్మా, నాన్నల తర్వాత సోదరికి అంతటి ప్రేమను పంచేది అన్నే. చెల్లెలి ముఖంలో సంతోషం చూసేందుకు అన్న ఎంత కష్టమైన సంతోషంగా చేస్తాడు. సోదరి కష్టాన్ని తన కష్టంగా.. సోదరి సంతోషాన్ని తన సంతోషంగా భావించే అన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే అన్న ఈ కోవలోకి చెందినవాడే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ఓ తండ్రి దురదృష్టవశాత్తు వారికి దూరమయ్యాడు. ఇటీవలే తండ్రి మరణించడంతో అన్న దగ్గరుండి చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించాడు. అయితే పెళ్లిలో అన్ని ఉన్నా నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో సోదరుడు ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు. చెల్లెలి పెళ్లిలో నాన్న లేని లోటును తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. చనిపోయిన తండ్రి సజీవంగా ఉన్నట్లు మైనంతో ఆయన రూపాన్ని పునఃసృష్టించాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్యర్యం నింపాడు. వీల్చైర్లో తండ్రి వస్తుండటం చూసి పెళ్లికూతురు కళ్లల్లో కన్నీరు వరదై పారింది. అది మైనపు బొమ్మ అని తెలిసినా.. నాన్నరూపాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఒక్కరేంటి బంధువులు, కుటుంబ సభ్యులు, అతిథులు ఇలా అందరి కళ్లలోనూ పట్టలేని దుఖం, ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ కుంటుంబంలో ఆనందపు భాష్పాలు వెల్లువిరిశాయి. అబ్బురపరిచే ఆనందం గుండెలోంచి తన్నుకుంటూ వచ్చింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. కొడుకు తన తండ్రిపై చాటిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు -
'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
Tumu Mohan Rao Comments On Virata Parvam In Success Meet: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందంతో పాటు.. సరళ అన్నయ్య తూము మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ''సురేష్ ప్రొడక్షన్ లో తొలిసారి యదార్థ సంఘటనల ద్వారా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. దర్శకుడు వేణు కథని అద్భుతంగా చెప్పారు. సాయి పల్లవి గొప్పగా నటిచింది. విరాట పర్వం విజయం ఆనందాన్ని ఇచ్చింది. మేము కూడా ఒక మంచి బయోపిక్ చేశామనే తృప్తిని ఇచ్చింది. సరళ జీవితాన్ని సినిమాగా తీసుకునే అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటులు అందరూ గొప్పగా చేశారు. విరాటపర్వం గురించి అందరూ పాజిటివ్ గా చెబుతున్నారు. రానాకి ఈ సినిమా ఎందుకు చేస్తున్నావ్ ? అని అడిగితే 'ఇలాంటి కథ నేను చేయకపోతే ఎవరు చేస్తారని' చెప్పారు. కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఎక్కువ మార్కులు వేస్తూనే ఉంటారు. విరాటపర్వం టీం అంతటికి కంగ్రాట్స్'' అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''మోహన్ రావుకి ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లి కలసినపుడు నన్ను ఆశీర్వదించి చీర బొట్టు పెట్టి దీవించారు. సరళ గారి కుటుంబాన్ని చూసిన తర్వాత గుండె బరువెక్కింది. కన్నీళ్లు వచ్చాయి. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు. వాళ్లు ఏం అనుకున్నారో ఇంకో మార్గంలో సాధించుకుంటారని చెప్పా. ఈ రోజు మోహన్ రావు ఇక్కడి వచ్చి సినిమా విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. సురేష్ బాబు ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. వెన్నెల పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నా. ప్రేక్షకులు సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నామని, చూసిన ప్రతీ సారి ఇంకా గొప్పగా అనిపిస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.'' అన్నారు. చిత్రానికి అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ గా బిగ్ హిట్ టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కారణమైన నిర్మాతలు రానా, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, ఒక గాడ్ ఫాదర్ గా మా అందరినీ వెనుకుండి నడిపించిన సురేష్ బాబుకు కృతజ్ఞతలు. సాయి పల్లవి లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమెకు కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతం అందించారు. ఎమోషనల్ గా మరో స్థాయికి తీసుకెళ్లారు. 1990 వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రకు థాంక్స్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డానీ, దివాకర్ మణికి కృతజ్ఞతలు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. సరళ అనే అమ్మాయి జీవితంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. సరళ గారి అన్నయ్య తూము మోహన్ రావు గారు ఈ ప్రెస్ మీట్ రావడం కూడా ఆనందంగా ఉంది. విరాట పర్వం చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాలు మౌత్ టాక్ ద్వారానే పబ్లిక్ లోకి వెళతాయి. ఇలాంటి మీనింగ్ ఫుల్ సినిమాని అందరూ ఆదరించాలని ప్రేక్షకులని, మీడియాని కోరుకుంటున్నాను. ఇలాంటి అర్థవంతమైన సినిమాలని నిలబెడితే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని డైరెక్టర్ వేణు ఊడుగుల పేర్కొన్నారు. తూము మోహన్ రావు మాట్లాడుతూ.. ''30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు. వేణు ఊడుగుల కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్లిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్లింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వల్లే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని నా భార్య అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం ఉండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ''నాలో ప్రతిభని గుర్తించి సీనియారిటీ లెక్కలు వేసుకోకుండా ఈ చిత్రానికి అవకాశం కల్పించిన రానాకు కృతజ్ఞతలు. సురేష్ బాబు మా అందరికీ ఒక పెద్ద దిక్కులా ఉన్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్, దర్శకుడు వేణు ఊడుగులకు థాంక్స్. ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి'' అని కొరుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఒక గొప్ప సినిమా చేసాం అనే భావన కలిగింది. ఈ సినిమాకి పని చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు, నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్కు కృతజ్ఞతలు. సాయి పల్లవి, రానా గారు అద్భుతంగా చేశారు. చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.'' అని ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి -
హీరోయిన్ అనుష్క సోదరునికి ప్రాణభయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గ్యాంగ్స్టర్ల మధ్య విభేదాలతో ప్రముఖ బహుభాషా నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు వార్తలొచ్చాయి. వివరాలు... గతంలో ప్రముఖ మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు. ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దీంతో అసూయ పట్టలేని మన్విత్ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్ అనుచరులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్కు భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలను మన్విత్ రై తోసిపుచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చదవండి: విక్రమ్లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
Veerappan: వీరప్పన్ సోదరుడి కన్నుమూత
చెన్నై: గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) కన్నుమూశాడు. గుండెపోటుతో సేలం(తమిళనాడు) ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం. మత్తయ్యన్.. ఓ హత్య కేసులో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజర్ చిదంబరంను హత్య చేసిన కేసులో.. ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు మత్తయ్యన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జీవిత ఖైదు పడగా.. 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. ఈయన్ని విడుదల చేయాలంటూ పలు పిటిషన్లు సైతం తెర మీదకు వచ్చాయి. -
వారిద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది
సాక్షి,లక్సెట్టిపేట(మంచిర్యాల)/జగిత్యాలక్రైం: అన్నదమ్ముల అనుబంధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది. వారి ఇద్దరి చివరి మజిలీ ఒకేరోజు ఒకే సమయంలో ముగిసింది. అన్నదమ్ములు ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఎలాంటి విబేధాలు లేకుండా కలిసిమెలిసి ఉండడం.. చివరి క్షణంలోనూ కలిసే శవయాత్ర సాగడం స్థానికులను కంటతడి పెట్టించింది. తమ్ముడి గుండెపోటుతో మృతిచెందాడన్న విషయం తెలిసి అన్న కూడా గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన గాజుల సత్తయ్య, సత్తవ్వ దంపతులకు భాస్కర్, శ్రీనివాస్, మంజుల సంతానం. పెద్ద కుమారుడు శ్రీనివాస్ జగిత్యాల జిల్లా కేంద్రంలో చిన్న హోటల్ నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు భాస్కర్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో చిరు వ్యాపారం చేస్తున్నాడు. మంజులకు వివాహం జరిగింది. తల్లిదండ్రులు లక్సెట్టిపేటలోనే ఉంటూ శేషజీవితం గడుపుతున్నారు. అప్పుడప్పుడు అందరూ ఇక్కడికే వచ్చి వెళ్తుంటారు. భాస్కర్కు ధర్మపురిలో సోమవారం ఉదయం ఐదు గంటలకు గుండెపోటు వచ్చిందని శ్రీనివాస్ కుటుంబసభ్యులకు ఫోన్ రావడంతో అందరూ ధర్మపురికి చేరుకున్నారు. అప్పటికే భాస్కర్(47) చనిపోవడంతో మృతదేహాన్ని లక్సెట్టిపేటకు తీసుకొచ్చారు. అంతలోనే శ్రీనివాస్(50) స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడం ఆ దంపతులకు తీరిన దుఃఖాన్ని మిగిల్చింది. కాగా, శ్రీనివాస్కు భార్య, ఇంటర్మీడియట్ చదివే ఇద్దరు కుమారులు, భాస్కర్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతులిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు జరిగాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, కౌన్సిలర్లు పరామర్శించారు. చదవండి: ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని. -
వరసలు మరచిన మృగం.. చెల్లెల్లిని గర్భవతిని చేసి..
తిరువళ్లూరు: విద్యార్థినికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అన్న (పెద్దమ్మ కుమారుడు)ను తిరువళ్లూరు మహిళ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆరణి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్టూ చదువుతోంది. అయితే పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సదుపాయం లేకపోవడంతో తిరువళ్లూరు సమీపంలోని రామతండలం గ్రామంలోని పెద్దమ్మ కర్పగం వద్ద ఉంటూ చదువుకుంటోంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్పగం కుమారుడు నాగరాజ్ వరసకు చెల్లెలు అయ్యే విద్యార్థినికి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంలో అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. దీంతో, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తిరువళ్లూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి ఆమె పెద్దమ్మ కొడుకు నాగరాజ్ కారణ అని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా ఇది వరకే నాగరాజ్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం. అత్యాచారానికి పాల్పడిన మైనర్కు వినూత్న శిక్ష మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మైనర్ బాలుడికి తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి రాధిక వినూత్న శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు, అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి 2021లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ తిరువళ్లూరులోని జువైనల్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో సాగింది. విచారణలో నిందితుడి నేరం ఒప్పుకోవడంతో న్యాయ మూర్తి రాధిక తీర్పును వెలువరించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు పళ్లిపట్టు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. -
అన్నను దారుణంగా చంపిన తమ్మడు
సాక్షి, హిందూపురం: అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడు రఘును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు హిందూపురం రూరల్ సీఐ హమీద్ ఖాన్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ఈ నెల 17న పరిగి మండలం పైడేటీ గ్రామంలో అన్న మారుతీపై తమ్ముడు కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చిన విషయం విదితమే. ఘటన అనంతరం తమ్ముడు రఘు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ధనాపురం క్రాస్ వద్ద నిందితుడు రఘును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అన్నదమ్ములిద్దరికీ తాగుడు అలవాటు ఉంది. మద్యం మత్తులో తమ్ముడు రఘును మారుతి ఇష్టానుసారంగా తిట్టేవాడు. దీంతో అన్నపై కక్ష పెంచుకున్న రఘు అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 17న రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద రఘుతో మారుతి గొడవ పడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రఘు ఇంటి లోపలకు వెళ్లి కిరోసిన్ తీసుకువచ్చి అన్నపై పోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మారుతిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 18న అతను మృతి చెందాడు. మారుతి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
పండుగ కోసం సొంతూరికి.. తమ్ముడి ప్రేమ వ్యవహారంలో..
మైసూరు: తమ్ముని ప్రేమ వ్యవహారానికి అన్న బలి అయ్యాడు. ఈ ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె పట్టణంలోని హొసూరు లేఅవుట్లో జరిగింది. వివరాలు.. చిక్కరాజు (30) అనే వ్యక్తి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగి. ఉగాది పండుగ కోసం సొంతూరికి వచ్చాడు. చిక్కరాజు తమ్ముడు తమ కూతురిని ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి మహదేవ నాయక్, సోదరులు కిరణ్, అభిషేక్లు చిక్కరాజుతో గొడవపడ్డారు. చిక్కరాజును కత్తితో పొడవడంతో అక్కడే మృతి చెందాడు. నిందితులు పరారీలో ఉన్నారు. గుండ్లుపేటె పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. బైక్ ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి తుమకూరు(బెంగళూరు): పరీక్ష రాసేందుకు బైక్ పై వెళ్తున్న ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన కుణిగల్ తాలుకా హుందనగర గేట్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ఒకే బైక్పై వెళ్తూ అదుపు తప్పి ప్రహరీను ఢీకొంది. ప్రమాదంలో నవీన్ గౌడ (15) మృతి చెందాడు. దర్శన్, శరత్గౌడ అనే ఇద్దరు గాయపడ్డారు. ఆ ఇద్దరినీ ఆదిచుంచునగిరి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్తో సాన్నిహిత్యం.. రవికిరణ్ అదృశ్యం.. కారణం అదేనా? -
తరచూ గొడవ.. ప్లాన్ ప్రకారం మద్యం తాగి కత్తి తీసుకుని ఇంటికెళ్లి..
సాక్షి,ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగాపురానికి చెందిన పెద్ద నర్సింహులు (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తమ్ముడు చిన్న నర్సింహులు ఇంటర్ ఫెయిల్ కావడంతో మద్యానికి బానిసై గ్రామంలోనే జులాయిగా తిరగసాగాడు. కొంతకాలంగా తమ ఇంటి విషయంలో వాటా ఇవ్వాలంటూ తరచూ అన్నతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి అన్నపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పెద్ద నర్సింహులుకు భార్య జయంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని అలంపూర్ సీఐ సూర్యానాయక్, ఇటిక్యాల ఎస్ఐ గోకారి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: రియల్ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి ) -
పాతబస్తీలో కత్తిపొట్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో అన్నాతమ్ముల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తిపోట్ల వరకు దారితీసింది. ఈ ఘటన చంద్రయాణాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓమర్ గుల్షాన్ ఫంక్షన్ హాల్ షైక్ జావీద్ (అన్న) షైక్ అసిఫ్ (తమ్ముడు)కి ఏదో విషయమై వివాదం తలెత్తింది. వారి మధ్య మొదలైన వాగ్వాదం పెరగడంతో అన్న షైక్ జావీద్ కోపంతో చాకు తీసుకుని షైక్ అసిఫ్పై కత్తితో దాడి చేశాడు. దీంతో అసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ అసిఫ్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షేక్ జావిద్ని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! ) -
బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో అమానుషం: అన్నను కొట్టి చంపిన తమ్ముడు
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): మద్యం మత్తులో రక్త సంబంధాన్నే మరిచారు.. తాగిన మైకంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. మత్తులో అన్నపై తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపల్ పరిధి చర్చి గాగిల్లాపూర్కు చెందిన వాడపల్లి వెంకటమారుతి భరత్భూషణ్ (35), సాయితేజ(28)లు అన్నదమ్ములు. వీరికి వివాహాలు కాలేదు. పనిపాట లేకుండాగా ఇంటి పట్టునే ఉంటూ ప్రతిరోజూ మద్యం తాగి గొడవ పడేవారు. వీరి తల్లికి పక్షపాతం ఉండటంతో కదలలేని స్థితిలో ఉండేది. 24వ తేదీ రాత్రి మద్యం తాగి గొడవ పడ్డారు. తమ్ముడు సాయితేజ కుక్కర్తో అన్న భరత్భూషణ్పై విచక్షణ రహితంగా దాడి చేయడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఉదయం అన్నను నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? -
చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..
సాక్షి,నిడమనూరు(వరంగల్): ఒకే గ్రామంలో ఉన్నా పుట్టింటికి వెళ్లకూడదని ఆంక్షలు.. వారితో పల్లెత్తు మాట కూడా మాట్లాడొద్దని ఆదేశాలు.. అనారోగ్యం బారిన పడినా కనీసం చికిత్స కూడా చేయించని కాఠిన్యం.. చీటికి మాటికి వేధింపులు.. మానసిక చిత్రహింసలు.. ఇలా తన చెల్లెలిని అత్తింటి వారు బాధ పెడుతున్నారని ఆ యువకుడు రగిలిపోయాడు. ఇదే విషయంపై ఒకమారు బావను మందలించి దండించినా మార్పు రాలేదు. సరికదా అతడి ఆగడాలు పెచ్చరిల్లాయి. దీంతో సోదరి పడుతున్న బాధలు చూడలేక ఆ యువకుడు సోదరి అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఫ్యాక్షన్ తరహాలో తెగబడి చెల్లెలు అత్తను దారుణంగా మట్టుబెట్టగా మరో ముగ్గురిపై కత్తులతో దాడి చేశారు. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్లో ఓ కుటుంబంపై జరిగిన దాడికి ఇవే కారణాలని తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా.. బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ(60) దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోధ దంపతుల కూతురు శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివనారాయణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఐటీ రంగం దెబ్బతినడంతో రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కూతురు సంతానం.కాగా, శివనారాయణ తనకు భార్య ఇష్టం లేదంటూ నాలుగేళ్లుగా శ్యామలను వేధిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విడాకుల కోసం కోర్టుకు సైతం వెళ్లారని సమాచారం. దీంతో రెండు కుటుంబాల పెద్ద మనుషులు దంపతులకు సర్దిచెప్పి రాజీ కుదిర్చారని తెలిసింది. మార్చురీలోనే అచ్చమ్మ మృతదేహం వియ్యంకుడి కుటుంబం దాడిలో దారుణ హత్యకు గురైన కమతం అచ్చమ్మ మృతదేహం ఇంకా మిర్యాలగూడ మార్చురీలోనే ఉంది. భిక్షమయ్య, అచ్చమ్మ దంపతులకు కుమారుడు శివనారాయణ, కూతురు జ్యోతి సంతానం. కాగా, దాడిలో గాయపడిన కుమారుడు, భర్త ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా కూతురు జ్యోతి విదేశంలో స్థిరపడింది. అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచారు. విదేశంలో ఉన్న ఆమె కూతురు వచ్చే వరకు మృతదేహం అక్కడే ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీ కూతురును కొట్టలేదు.. కొడితే ఏం చేస్తావ్..? పెద్ద మనుషులు సర్దిచెప్పినా శివనారాయణ తీరులో మార్పు రాలేదు. పైగా పుట్టింటికి వెళ్లొద్దని, వారితో మాట్లాడొద్దని ఇలా పలు రకాల ఆంక్షలు పెట్టి శ్యామలను వేధిస్తున్నాడు. ఇదే తరుణంలో గత సోమవారం శ్యామలతో గొడవ పడిన విషయం సూర్యనారాయణకు తెలియడంతో తన అల్లుడు కూతురిని చిత్రహింసలు పెడుతున్నాడని గ్రామస్తుల వద్ద వాపోయాడు. ఆ విషయం తెలుసుకున్న శివనారాయణ మామ సూర్యనారాయణకు ఫోన్ చేసి నీ కూతురును కొట్టలేదు.. ఇప్పుడు కొడితే ఏం చేస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం సూర్యానారాయణ తన కొడుకు శివకు చెప్పడంతో అగ్గికి ఆజ్యం పోసిన చందంగా ఫ్యాక్షన్ తరహా దాడికి కారణమైందని తెలుస్తోంది. ఈ దాడిలో కుమారుడికి సహకారం అందిస్తున్నారన్న అభియోగం మేరకు వృద్ధురాలు అచ్చమ్మ ప్రాణాలు కోల్పోగా శివనారాయణ, అతడి తండ్రి భిక్షమయ్య, అచ్చమ్మ తల్లి నారాయణమ్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, దాడి సమయంలో గ్రామస్తులు ఘటన స్థలానికి రావడంతోనే శ్యామల అత్తింటి వారిని అందరినీ మట్టుబెట్టలేక నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. దాడి ఘటన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. విచారణలో దాడికి ఇవే కారణాలంటూ నిందితులు ఒప్పుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే, నిందితుల లొంగుబాటుపై నిడమనూరు పోలీసు లను వివరణ కోరగా «ధ్రువీకరించలేదు. కాగా, దాడిలో గాయపడిన శివనారాయణను మెరుగైన చికిత్స నిమిత్తం బుధవారం హైదరాబాద్కు తరలించగా మిగిలిన ఇద్దరు మిర్యాలగూడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..
లక్నో: ప్రతి రాష్ట్రంలోనూ దాదాపు అన్నీవర్గాల వారికి ప్రభుత్వం నుంచి లాభాలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు, కులాలు, వృత్తుల ఆధారంగా అర్హులైన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందేందుకు కొందరు ప్రజలు ఎన్ని తంటాలైన పడుతుంటారు. తాజాగా ప్రభుత్వం ద్వారా అందే డబ్బు కోసం సొంత చెల్లిని ఓ అన్న పెళ్లి చేసుకున్న షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్లో రాష్ట్రంలో జరిగింది. ఫిరోజాబాద్ తుండ్లలో డిసెంబర్ 11న చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వరంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఇటీవల సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 జంటలు ఒక్కటయ్యాయి. సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం డబ్బు, ఇతర సౌకర్యాలను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.35వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువలను కానుకలుగా అందిస్తోంది. రూ.20వేల రూపాయలు పెళ్లి కూతురు పేరుతో బ్యాంక్లో డిపాజిట్ చేయడంతోపాటు.. మిగతా డబ్బులను ఇతర కానుకల రూపంలో అందిస్తారు. చదవండి: విక్టరీ హగ్; ఆ ఎమోషన్కు అందరూ కనెక్ట్ అవుతున్నారు! అయితే వీటి కోసం ఆశపడిన ఈ సామూహిక పెళ్లిళ్లో ఓ వ్యక్తి తన సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందరిలానే చెల్లెలి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు, ఇతర కానుకలను తీసుకొని పారిపోయాడు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో వివాహం చేసుకున్న వారు అన్న చెల్లెల్లు అని గ్రామస్థులు గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. చదవండి: ఆ‘గాలి’ అమ్ముకొని వారానికి రూ. 37 లక్షలు సంపాదిస్తోంది.. దీంతో ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్ డెవలప్మెంట్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. వారి ఆచూకీ కనుగొని ప్రభుత్వ పథకం కింద అందించిన గృహోపకరణాలు వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. -
అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన
Kiran Abbavaram Pens Emotional Post On His Brother Death: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబర్ 1) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక సోదరుడిని తలచుకుంటూ హీరో కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోదరుడు గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తన సోదరుడు గురించి కిరణ్ రాసుకొచ్చిన ఈ భావోద్వేగభరితమైన పోస్ట్ చదవుతుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. హీరో సోదరుడు మృతి ‘‘ఒరేయ్ కిరా.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా’’ అని మా అన్నయ్య రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైనదానికంటే ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదా, సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోపు తను లేకుండా పోయాడు. ‘అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా?’ అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామనుకున్నా. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు.. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ‘రాజావారు రాణిగారు’ మూవీతో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయన ఎస్ఆర్ కల్యాణ మండపం మూవీకి సొంతంగా స్క్రిప్ట్ రాసి హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరం ఇటూ హీరోగా, అటూ సినీ రచయితగా ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి హఠాన్మరణం తనకు తీరనిలోటు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
అన్న కాదు మృగాడు.. గర్భం దాల్చిన బాలిక
మైసూరు(కర్ణాటక): తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఆమె గర్భం దాల్చిన సంఘటన మైసూరు గిరిదర్శిని నగరలో వెలుగుచూసింది. కామాంధుడు వినయ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో 16 ఏళ్ల బాలిక అన్న వినయ్కుమార్ వద్ద ఉంటోంది. ఆమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉండగా, అక్కలకు పెళ్లయి వెళ్లిపోయారు. మద్యానికి బానిస అయిన వినయ్కుమార్ మద్యం తాగి వచ్చి చెల్లిపై లైంగికదాడికి పాల్పడేవాడు. గత మూడు నెలలుగా ఇలా జరుగుతుండటంతో ప్రస్తుతం బాలిక గర్భవతి అయ్యింది. ఇది తెలిసిన మరో అన్న ఆళనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మృగాన్ని అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. బాలికకు గర్భం, యువకుడు అరెస్టు శివమొగ్గ: మైనర్ బాలికను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కేసులో యువకున్ని అరెస్టు చేశారు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలిక కడుపుతో ఉందని చెప్పారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం బయట పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే: పసిప్రాయంలో తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న..
సాక్షి,వెంకటాపురం(వరంగల్): పసిప్రాయంలోనే తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. ఇలా అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన వారంతా ఒక్కొక్కరిగా దూరమవుతుంటే ఆమె ఏడ్చిన తీరు వర్ణణాతీతం. పాలుతాగే వయస్సులో అనారోగ్యంతో తల్లి.. బడికి వెళ్లే వయస్సులో తండ్రి ఆత్మహత్య.. అండగా ఉంటాడనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరింది మండల కేంద్రానికి చెందిన మెట్టు కావేరి.. మెట్టు కవిత–సాంబయ్య దంపతులకు 2003లో కుమారుడు రాజ్కుమార్, 2005లో కావేరి జన్మించింది. కావేరికి 8నెలల వయస్సు ఉన్నపుడే తల్లి కవిత అనారోగ్యంతో మృతిచెందింది. బడికి వెళ్లే వయస్సులో 2013లో తండ్రి సాంబయ్య ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో రాజ్కుమార్, కావేరిలు అమ్మమ్మ, తాతయ్య అయిన మంద సమ్మక్క, రాంచెంద్రుల వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో రాజ్కుమార్ పదో తరగతి తర్వాత చదువు మానేసి, ఏడాది కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ( చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. ) కావేరి ప్రభుత్వ జూనియార్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో ఈనెల 24న దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లిలో శుభకార్యాక్రమానికి హాజరయ్యేందుకు రాజ్కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన కావేరి అండగా ఉంటాడనుకున్న అన్న అకాలమరణంతో అనాథగా మారింది. సోదరుడి అంత్యక్రియలు తానే స్వయంగా నిర్వహించిన దృశ్యం చూసి కంటతడి పెట్టనివారుండరు. అయితే వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న కావేరిని ఆదుకునేందుకు దాతలు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి ) వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు మండల కేంద్రంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ.. ఎవరు ఏ పనిచెప్పినా ఓపికతో చేస్తూ అందరితో కలివిడిగా ఉంటే రాజ్కుమార్ చెల్లెలికి ఆర్థికంగా చేయూతనందించేందుకు మండల కేంద్రంలోని కొంతమంది యువకులు ‘రాజ్కుమార్ సహాయనిధి’ అనే వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చిన విరాళాలు కావేరి ఉన్నత చదువులకు, మరికొంత కావేరి భవిష్యత్ అవసరాలకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. సహాయనిధి గ్రూపు ద్వారా ఇప్పటివరకు రూ.60వేలు జమ అయినట్లు పేర్కొన్నారు. కావేరికి సహకారం అందించాలనుకున్న దాతలు 96400 66420, 97044 33991, 98484 39390 నెంబర్లకు ఫోన్ పే లేదా గూగూల్ పే చేయాలని తెలిపారు. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
ఆ అన్న కళ్లలో అమితానందం. ఒకటా రెండా.. 17 ఏళ్ల తర్వాత..
సాక్షి, ఖమ్మం : ఆ అన్న కళ్లలో అమితానందం. ఒకటా రెండా.. 17 ఏళ్ల తర్వాత తన సోదరిని చూసిన ఆ క్షణాన.. ఒక్కసారిగా ఉబికి వచ్చిన దుఃఖం, అంతకు మించిన సంబరం కలగలిసిన ఉద్విగ్న తరుణమిది. 2004లో మతిస్థిమితం కోల్పోయి. .ఐదేళ్ల క్రితం గార్లలో రోడ్ల వెంట దీన స్థితిలో ఉన్న ఓ మహిళను ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్కు తరలించి నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. వైద్యపరీక్షలు చేయించి, బాగోగులు చూసుకోవడంతో క్రమంగా ఆరోగ్యం కుదుటపడి ఇటీవల తన వివరాలు తెలిపింది. తన పేరు వల్లాల భాగ్య అని, ప్రస్తుత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామమని వివరించింది. చదవండి: ఫేస్బుక్ లైవ్: ‘సిరిసిల్ల టౌన్ సీఐ వేధిస్తున్నాడు.. విషం తాగి చనిపోతున్నా’ ఈ క్రమంలో అన్నం ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు సోమవారం ఆమెను తీసుకెళ్లి పోలీసులు, వంగర సర్పంచ్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు లచ్చవ్వ, రామస్వామి గౌడ్, మరో అన్న చనిపోగా.. సోదరులు వీరస్వామి, తిరుపతికి అప్పగించడంతో పాటు ఫౌండేషన్ తరఫున రూ.5వేలు అందజేశారు. ఈమెకు ఒక కుమారుడు ఉండగా.. ఇప్పుడు ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడని వారు చెప్పారు. అప్పట్ల భాగ్య దివంగత ప్రధాని పీవీ.నర్సింహారావు ఇంట్లో కూడా పనిచేసిందని వాళ్లు గుర్తు చేశారు. చదవండి: కారణం ఏదైనా వారే టార్గెట్: కిడ్నాప్లు.. హత్యలు.. లైంగిక దాడులు భర్తతో గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయి.. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి పోయిందని అన్నారు. ఎటు వెళ్లిందో, అసలు ఉందో, చనిపోయిందో తెలియక కుమిలిపోతున్నామని చెప్పారు. అలాంటిది..ఇన్నాళ్ల తర్వాత తిరిగొచ్చిన చెల్లెల్లికి ఇకపై ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని వారు తెలిపారు. తమకు చెల్లెలిని అప్పగించిన అన్నం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యుడు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. -
24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే
రోమ్: ఇద్దరు అన్నదమ్ములు బాల్యం నుంచి చాలా అన్యోన్యంగా ఉండేవారు. తండ్రి మరణం తర్వాత అన్న ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.. టీవీ, పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దాదాపు 24 ఏళ్లుగా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు తమ్ముడు. ఈ క్రమంలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఏ అన్న కోసమైతే ఇంతలా గాలిస్తున్నాడో.. అతడే ఓ రోజు ఇంటికి వచ్చి.. తమ్ముడిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు తమ్ముడు. ఈ సంఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఇటలీకి చెందిన మార్టిన్ రాబన్సర్ (35), ఐవో (42) ఇద్దరు సోదరులు. ఈ క్రమంలో 1997లో వీరి తండ్రి మరణించాడు. ఆ బాధ తట్టుకోలేపోయిన ఐవో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీలో, పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఫలితం శూన్యం. కానీ మార్టిన్ మాత్రం పట్టువదలకుండా సోదరుడి కోసం గాలిస్తూనే ఉన్నాడు. (చదవండి: ఎయిర్ హోస్టెస్ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!) మార్టిన్ సోదరుడి కోసం వెతుకుతుండగా.. మరో వైపు ఐవో ఇందుకు భిన్నంగా ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్లు అన్న మాటలు తట్టుకోలేక తన తండ్రి చనిపోయాడని.. కుటుంబ సభ్యులు కూడా బయటి వారికే మద్దతిచ్చారని అనుకోసాగాడు. ఈ క్రమంలో తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఓ రోజు తెల్లవారుజామున సోదరుడి ఇంటికి వచ్చాడు. వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు. ఇక నిద్రిస్తున్న మార్టిన్ని లేపి మరి కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. చావుబతుకుల్లో ఉన్న మార్టిన్ను అతడి భార్య ఆస్ప్రతిలో చేర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఐవో కోసం గాలిస్తున్నారు. (చదవండి: మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్.. కొడుకును హత్య చేసిందని ఆరోపణలు) ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఐవో పేవ్మెంట్ మీద నిద్రిస్తూ.. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కాలం వెళ్లదీసినట్లు పోలీసులు తెలిపారు. ఖాళీ సమయమంతా లైబ్రరీలో గడిపేవాడన్నారు. ఇక మార్టిన్ను హత్య చేయాలని భావించిన ఐవో కొన్ని నెలల క్రితమే తమ్ముడు ఉంటున్న నగరానికి వచ్చాడని.. మార్టిన్ను కదలికలను గమనిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి! -
నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని...
సాక్షి, శంషాబాద్: పాత కక్షలకు తోడు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. మండలంలోని తొండుపల్లి శివారులో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన గండికోట యాదయ్య (29), శ్రీనివాస్ అన్నదమ్ములు. వీరిద్దరూ కొంపల్లిలో ఉన్న ఆరెంజ్ ట్రాన్స్పోర్టు కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం శ్రీనివాస్ కొంపల్లి నుంచి గూడ్సు వాహనం తీసుకుని చెన్నై బయలుదేరాడు. చదవండి: గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి.. కుమార్తె కళ్లెదుటే.. ఈ వాహనంలో ఇతనితో పాటు వారి గ్రామానికి చెందిన మరో ముగ్గురు కూడా ఉన్నారు. వీరు అదే ట్రాన్స్పోర్టు కంపెనీలో పని చేస్తుండగా.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఈ వాహనంలో ఎక్కారు. అన్నదమ్ములిద్దరూ ఈ వాహనంలో ఒకరి తర్వాత ఒకరు డ్యూటీలో చేరుతారు. ఈ క్రమంలో వాహనం రాత్రి 8 గంటల సమయంలో మండలంలోని తొండుపల్లి వద్దకు చేరుకుంది. అక్కడకు శ్రీనివాస్ అన్న యాదయ్య వచ్చాడు. ఇప్పటి నుంచి తాను డ్యూటీ చేస్తానని తమ్ముడు శ్రీనివాస్కు చెప్పాడు. చదవండి: ఆసిఫాబాద్లో పులి చర్మం స్వాధీనం ఇందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో యాదయ్య బెదిరింపు ధోరణితో నీ అంతు చూస్తానని తమ్ముడు శ్రీనివాస్తో అన్నాడు. వెంటనే శ్రీనివాస్ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి.. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇద్దరు కూడా అన్నదమ్ములే కదా.. చిన్న దానికి గొడవ ఎందుకు అని సర్ది చెప్పి వెళ్లిపోయారు. స్టీరింగ్పైనే కుప్పకూలిన యాదయ్య, శ్రీనివాస్ (ఫైల్) కత్తితో దాడి చేసి.. తొండుపల్లి నుంచి యాదయ్య వాహనం నడుపుతుండగా.. అదే వాహనంలో శ్రీనివాస్తో పాటు మరో ముగ్గురు కూర్చున్నారు. యాదయ్య పక్కన ఓ వ్యక్తి కూర్చోగా.. తర్వాత శ్రీనివాస్ ఉన్నాడు. వాహనం బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి నుంచి రైల్వే వంతెన దాటగానే.. శ్రీనివాస్ ఒక్కసారిగా కత్తి తీసుకుని యాదయ్య ఛాతీలో పొడిచాడు. దీంతో అతను స్టీరింగ్పై స్పృహతప్పి పడిపోయాడు. ఈ సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దయనీయ పరిస్థితి.. బతికుండగానే పెద్దకర్మ!
సాక్షి, నకిరేకల్(నల్లగొండ): ఇంటికి పెద్ద కొడుకని ఎంత ముద్దు చేసి ఉంటుంది? కానీ బతికుండగానే ఆ తల్లికి పెద్దకర్మ చేయాలని చూశాడా కుమారుడు. తోడబుట్టిన వారికే అన్నీ పంచిపెడుతోందని కన్నతల్లిపై కక్షగట్టిన ఆ ప్రబుద్దుడు.. బతికున్న తన తల్లి పేరుతో సంతాప కార్డు ముద్రించాడు. దీంతో విషయం తెలిసిన అతని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వృద్ధాప్యంలోనూ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. పోశమ్మ పెద్ద కుమారుడు యాదగిరి తన తల్లి సంపాందించిన సొమ్మును కూతుళ్లకే పెడుతోందని కక్ష పెంచుకున్నాడు. అదికాస్తా శృతిమించి చివరకు తన తల్లి చనిపోయిందని, పెద్ద కర్మ చేస్తున్నామని సంతాప కార్డులను ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ విషయం పోశమ్మకు తెలిసింది. కొడుకు చేసిన పనికి కన్నీరుమున్నీరైంది. తాను చనిపోక ముందే చనిపోయినట్లు కొడుకు చేసిన నిర్వాకంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నకిరేకల్ సీఐ నాగరాజు వెంటనే స్పందించి పోశమ్మ పెద్ద కూమారుడు యాదగిరిని పిలిపించారు. పోలీసుల సమక్షంలో యాదగిరి త న తల్లికి క్షమాపణ చెప్పాడు. అంతే ఆ తల్లి మనసు కరిగిపోయిది. ఆదివారం తమ కుటుంబ సభ్యుల మధ్య అన్నీ మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పి తల్లీ, కొడుకులు ఇంటికి వెళ్లిపోయారు. చదవండి: అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్ -
కుటుంబ కలహాలు: బావ తలపగులగొడుతావా..? అంటూ అన్నపై..
సాక్షి,పరిగి(వికారాబాద్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మయ్య(38) అదే గ్రామానికి చెందిన తన చెల్లెలు భర్త వెంకటయ్యతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడు. ఈక్రమంలో లక్ష్మయ్య తన బావ వెంకటయ్య తలపగులగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య కుమారుడు నవీన్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. బుధవారం ఉదయం లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య.. బావ తలపగులగొడుతావా..? అంటూ ఆగ్రహంతో లక్ష్మయ్యపై రాళ్లు, కర్రలతో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఇంట్లోకి వెళ్లి పడుకున్న లక్ష్మయ్య దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. మధ్యాహ్నం అయినా ఆయన ఇంట్లోంచి రాకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లక్ష్మయ్యపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతయ్య పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. లక్ష్మయ్య ఆయన భార్య గతంలోనే విడిపోయింది. ఆయనకు 7 సంవత్సరాల కూతురు ఉంది. తండ్రి మృతి చెందడంతో చిన్నారి అనాథగా మారింది. చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. -
పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్స్టేషన్లో లొంగుబాటు
సాక్షి, హుబ్లీ (కర్ణాటక): రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలిని హతమార్చిన అన్న పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. జిల్లాలోని నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయన చెల్లెలు శశికళ సుణగార ఇటీవల పుట్టినింటికి వచ్చింది. ఏదో విషయంపై మంగళవారం సాయంత్రం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంతో మహంతేష్ తన చెల్లెలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తితో పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శశికళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్) -
అన్న మృతిని తట్టుకోలేక..
సాక్షి, కోనరావుపేట(వేములవాడ): సోదరుని మృతిని తట్టుకోలేక సోదరి కూడా ప్రాణాలు విడిచిన సంఘటన మండలంలోని కనగర్తిలో జరిగింది. కనగర్తికి చెందిన బడే రామయ్య శనివారం మృతి చెందాడు. అన్న మృతదేహాన్ని చూసిన చెల్లి నిజామాబాద్కు చెందిన తాళ్లపెల్లి లక్ష్మి కుప్పకూలింది. అన్నాచెల్లెళ్లు ఒకేసారి మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త పోచయ్య, కుమారుడు కిషన్ ఉన్నారు. మరో ఘటనలో.. పాముకాటుతో యువకుడి మృతి కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో పాముకాటుకు యువకుడు బలయ్యాడు. గ్రామానికి చెందిన చీమల ప్రశాంత్(26) 18 రోజుల క్రితం పొలం వద్ద గడ్డి కోస్తుండగా పాము కాటువేసింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య వైష్ణవి, కుమారుడు నితీష్ ఉన్నారు. చదవండి: Canara Bank: పక్కా ప్లాన్.. రూ.338 కోట్లు ఎగనామం! -
పొలం గట్టు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. గొడ్డలి తీసుకుని..
మైలవరం (జమ్మలమడుగు రూరల్): పొలం గట్టు విషయం అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది.తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. మైలవరం మండలం తొర్రివేముల గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ బి.రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రివేముల గ్రామానికి చెందిన గూడెంచెరువు కనకరాజ్, బాలయ్య అన్నదమ్ములు, వీరి మధ్య పొలం గట్టు విషయంలో గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. సోమవారం బాలయ్య తన కుమారుడు సుదర్శన్తో కలిసి పొలం పనులు చేసుకుంటుండగా అన్న కనకరాజ్ వచ్చి గొడ్డలితో తలపై దాడి చేశాడు. దీంతో బాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ఒక్కగానొక్క కూతురు.. అల్లారు మద్దుగా పెంచారు.. పుట్టిన రోజునే.. -
కాళ్లు మొక్కినా కనికరించలే..! వరుసబెట్టి ముగ్గురిని..!
సాక్షి, వరంగల్: డబ్బుల కోసం విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు.. సొంత అన్న కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ‘మా వాళ్లను చంపకండి బాబాయ్... మీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం. వదిలేయండి ప్లీజ్’అంటూ అన్న కూతురు కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు. నిమిషాల వ్యవధిలో అన్న చాంద్పాషా(50), వదిన సాబీరా(42), బావమరిది ఖలీల్ (40)ని అంతమొందించాడు. ఈ దారుణ ఘటన వరంగల్లో కలకలం రేపింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్లోని ఎల్బీనగర్కు చెందిన చాంద్పాషాకు షఫీతోపాటు మరో సోదరుడు ఉన్నాడు. చాంద్పాషా, షఫీలు పరకాల కేంద్రంగా 20 ఏళ్లుగా పశువులు, గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో లెక్కలు చూసుకుంటే రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఈ లెక్కల వ్యవహారాలు షఫీ చూస్తున్నందున వచ్చిన నష్టంలో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. తనకు పెద్ద మొత్తంలో కావాలనే అప్పుగా ఇచ్చారని, కట్టలేనని షఫీ మొండికేయడంతో వ్యాపారం చేసేందుకు చాంద్పాషా ఒప్పుకోలేదు. దీంతో షఫీ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్పాషా ఏడాది క్రితం నూతన గృహాన్ని నిర్మించాడు. తనకు అప్పులు వేసి, అన్న డబ్బులు దాచుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాడని షఫీ పలుమార్లు స్నేహితులు, బంధువుల వద్ద వాపోయాడు. అప్పులతో ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని అన్నా వదినలను బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో కుటుంబాన్ని మట్టుబెట్టాడు. స్నేహితుల సాయంతో.. పథకం ప్రకారం షఫీ స్నేహితులతో కలసి అర్ధరాత్రి వర కు మద్యం సేవించాడు. ఇంటి తలుపులను కోసేందుకు ఎలక్ట్రిక్ రంపంతోపాటు వారిని నరికేందుకు పదునైన వేట కొడవళ్లు, కత్తులను తీసుకొని ఆటోలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అన్న ఇంటికి చేరుకున్నాడు. రంపంతో తలుపులను సగం వరకు కోశాడు. ముగ్గురు ఇంటి బయట పరిసరాలను గమనిస్తుండగా.. షఫీతోపాటు మిగిలినవాళ్లు లోపలికి వెళ్లారు. అలికిడికి నిద్ర లేచిన చాంద్పాషా ఎవరు, ఎవరు అంటూ రాగా.. అంతలోనే షఫీ రంపంతో చాతిభాగంలో కోశాడు. ఆ తరువాత పదునైన కత్తితో తలపై నరకడంతోపాటు శరీరంపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. అడ్డుకోబోయిన చాంద్పాషా బావమరిది ఖలీల్ను కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. తర్వాత వదిన సాబీరానూ విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. వేరే గదిలో ఉన్న చాంద్పాషా కుమార్తె రూబీనా(23) బయటకు వచ్చి బాబాయ్.. అమ్మా, నాన్నలను ఏం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. అడ్డువచ్చిన చాంద్పాషా కుమారులు ఫహాద్ (28), సమద్ (21)లను కొడవలితో పొడవడంతో వారు రక్తస్రావమై కిందపడిపోయారు. తర్వాత 2.35 గంటల ప్రాంతం లో స్నేహితులతో కలిసి షఫీ ఆటోలో తిరిగి వెళ్లిపోయాడు. పైన అద్దెకున్నవారు కిందకు వచ్చే ప్రయత్నం చేయగా... అడ్డొస్తే చంపుతానని బెదిరించారు. కాళ్లు మొక్కినా కనికరించలేదు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చప్పుడు వచ్చింది. అంతలోనే మా నాన్న ఎవరు.. ఎవరు అంటుండగానే బాబాయ్ రంపం, కత్తులతో నాన్నపై దాడి చేశాడు. తర్వాత మామ ఖలీల్ను నరికేశాడు. ఇది గమనించిన మా అమ్మ సాబీరా రెండేళ్ల నా బిడ్డను పట్టుకుని బాత్రూమ్లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమెనూ వదల్లేదు. నా పాపను నా చేతిలో పెట్టి మా తల్లిని సైతం కిరాతంగా హతమార్చాడు. బాబాయ్ డబ్బులు మొత్తం నాన్నతో ఇప్పిస్తా వదిలేయ్ బాబాయ్ అని కాళ్లు మొక్కినా వినలేదు. వాడిని చంపేయండి వదిలిపెట్టొద్దు. – మృతుడి కుమార్తె రూబీనా వర్షం రాకుంటే..ఇంటికి వచ్చేటోడు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చాంద్పాషా బావమరిది సయ్యద్ ఖలీల్ వర్షం రాకపోతే ప్రాణాలతో బయటపడేవాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఖలీల్ హన్మకొండలోని ఓ మొబైల్షాపులో సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటినుంచి హన్మకొండకు బైక్పై వెళ్లి వస్తుంటాడు. ఆలస్యమైనప్పుడు వరంగల్లోని తన అక్క ఇంటికి వెళ్లేవాడు. కేసముద్రంలో నూతనంగా మొబైల్షాపు పెట్టాలని నిర్ణయించుకున్న ఖలీల్ ఆగస్టు 31న తన జాబ్కు రాజీనామా చేశాడు. వర్షం వస్తుండటంతో అక్క ఇంటికెళ్లాడు. బావను చంపేందుకు వచ్చిన షఫీని అడ్డుకోబోయిన ఖలీల్ కూడా హత్యకు గురయ్యాడు. వర్షం రావడంతో ఖలీల్ అక్క ఇంటికెళ్లాడని, లేకుంటే ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి... షఫీ వెళ్లిపోగానే ఆ ఇంట్లో అద్దెకున్న అజీమ్ కిందకు వచ్చి కార్పొరేటర్ పుర్కాన్కు సమాచారమివ్వగా ఆయన అక్కడికొచ్చారు. 3.40 గంటల ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సమద్, ఫహాద్లను అంబులెన్స్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 4.05 గంటల ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్లో ఉన్న మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ ఘటనాస్థలికి రాగా, తర్వాత వరంగల్ ఏసీపీ కె.గిరిధర్, పోలీసు కమిషనర్ తరుణ్ జోషి వచ్చారు. నిందితులు ఇంటిబయట ఓ సంచిలో వదిలిపెట్టిన కత్తులను, రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల సహాయంతోపాటు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా షఫీతోపాటు మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రూబీనా ఫిర్యాదుమేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, షఫీపై 2010లో మట్టెవాడ ఠాణాలో అక్రమ ఆయుధాల సరఫరా కేసు నమోదైంది. దాడి ఘటనలో వరంగల్, పరకాల, నర్సంపేట ప్రాంతాలకు చెందిన షఫీ దగ్గరి మిత్రులు పాలుపంచుకున్నట్లు సమాచారం. -
రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ
నల్లగొండ క్రైం: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలుకు కానుక ఇవ్వాల్సిన అన్న ఆమె బంగారాన్నే దొంగలించాడు. చెల్లెకు బహుమతి ఇవ్వకుండా ఆమె సొత్తునే చోరీ చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రమేశ్కు రాఖీ కట్టేందుకు ఈ నెల 21వ తేదీన ఆయన చెల్లెలు పోగుల లలిత వచ్చింది. లలిత ఆ రోజు అక్కడే ఉంది. అయితే, లలిత తన ఏడు తులాల బంగారు ఆభరణాలను బీరువాలో దాచిపెట్టింది. అదే బీరువాలో తండ్రి ముత్తయ్య రూ.10 వేల నగదును కూడా పెట్టాడు. వాటిపై కన్నేసిన అన్న అదును చూసి బంగారం, నగదును అపహరించాడు. చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించగా రమేశ్ నిర్వాకం బయటపడింది. అతడితోపాటు అతడి స్నేహితుడు వెలగల విజయ్ను అరెస్టు చేశారు. వారి వద్ద నగదు బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్రెడ్డి తెలిపారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..? ) చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
పెళ్లికి అడ్డొస్తున్నాడని.. తమ్ముడు ఎంత పని చేశాడంటే..
చింతలపూడి(కామవరపుకోట): కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామంలో నాటుతుపాకీతో అన్నను చంపిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. తడికలపూడి పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.రవికిరణ్ వివరాలు వెల్లడించారు. వీరంపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు కుమారులు కూతాడి రాజేష్, కూతాడి కృష్ణలకు ఇంకా వివాహం కాలేదు. మృతుడు కూతాడి రాజేష్(23) వ్యసనాలకు బానిసయ్యాడు. గతంలో తండ్రి ఫైనాన్స్పై ఆటో కొనివ్వగా, వాయిదాలు సరిగా కట్టనందున కంపెనీ వారు ఆటో సీజ్ చేశారు. అప్పటి నుంచి ఇంకో ఆటో కొనివ్వమని రోజు మద్యం సేవించి వచ్చి తండ్రిని వేధించేవాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం తల్లిదండ్రులతో గొడవ జరగ్గా.. రాజేష్ను తమ్ముడు కృష్ణ కత్తితో గాయపర్చాడు. అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం లేదు. కృష్ణకు పెళ్లి కుదరడంతో.. తన పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని రాజేష్ బెదిరించాడు. పెళ్లి విషయంలో అడ్డు వస్తుండటంతో అన్నను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణ రూ. 16 వేలకు పెదవేగి మండలానికి చెందిన రెడ్డి కృపావరం అలియాస్ బాబి వద్ద నాటు తుపాకీ కొని ఎవరికీ తెలియకుండా దాచాడు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో అన్న రాజేష్ను నాటు తుపాకీతో చంపి కృష్ణ అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చింతలపూడి సీఐ ఎం.మల్లేశ్వరావు, తడికలపూడి ఎస్సై కె.వెంకన్నలు నిందితుడ్ని పట్టుకుని అతని వద్ద ఉన్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఇవీ చదవండి: ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ! డీమార్ట్, ప్యారడైజ్కు భారీ జరిమానా -
కన్నతల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని..
సాక్షి, మద్నూర్(నిజామాబాద్): మరొకరితో సన్నిహితంగా ఉంటోందని కుటుంబసభ్యులు గొంతు కోసి మహిళపై హత్యాయత్నం చేసిన ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మద్నూర్లో గోసం లక్ష్మికి గతంలోనే వివాహం జరుగగా భర్త వదిలివేశాడు. దీంతో లక్ష్మి తన కొడుకు రవి, తమ్ముడు ప్రవీణ్లతో కలిసి మండలకేంద్రంలో నివసిస్తోంది. ఈక్రమంలో లక్ష్మి మరొకరితో సన్నిహితంగా ఉండటం కొడుకు, తమ్ముడు జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం తెల్లవారుజామున వారు నిద్రపోతున్న లక్ష్మిపై కత్తితో దాడిచేసి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగు, పొరుగు వాళ్లు ఇంట్లోకి వచ్చారు. వెంటనే నిందితులు పారిపోయారు, బాధితురాలిని నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి కూతురు శీరిష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
రూ.వంద కోసం అన్ననే కొట్టి చంపాడు..
అమరాపురం(అనంతపురం జిల్లా): మద్యం మత్తు ఆ వ్యక్తిని విచక్షణ కోల్పోయేలా చేసింది. అన్నకు వంద రూపాయలు ఎక్కువగా ఇచ్చారని తండ్రితో గొడవ పెట్టుకుని.. చివరికి నిలువునా అన్న ప్రాణాలు తీశాడు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన యంజేరప్పకు నలుగురు కుమారులు. ఆదివారం పింఛన్ అందుకున్న తల్లి.. కుమారులు లక్ష్మన్న(35)కు రూ.300, రంగప్పకు రూ.200 చొప్పున ఇచ్చింది. తాగి ఇంటికొచ్చిన రంగప్ప తనకెందుకు రూ.వంద తక్కువ ఇచ్చారంటూ గొడవ పెట్టుకున్నాడు. సర్దిచెప్పబోయినన అన్నపై కోపంతో ఊగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయిన రంగప్ప.. పొద్దుపోయాక లక్ష్మన్న వద్దకు వచ్చి మళ్లీ గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కర్రతో లక్ష్మన్నపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి అప్పటికే లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నాచెల్లెళ్ల గొడవ.. సోదరుడు తిట్టాడని నిండు గర్భిణి ఆత్మహత్య
వక్కలగడ్డ (చల్లపల్లి) : అన్న తిట్టాడని మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మెరైన్ కానిస్టేబుల్ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) 15 నెలల క్రితం హైదరాబాద్లో చార్డెడ్ అకౌంటెంట్గా పని చేసే నెరుసు సాయి శంకర్తో వివాహమైంది. భార్గవి గర్భం దాల్చటంతో పుట్టింటికి వచ్చి ఉంది. తరచూ నాగభావర్గవి అన్న నిఖిల్ తన తల్లి, చెల్లితో ఏదొక విషయంలో వాదన పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆదివారం భార్గవికి, నిఖిల్కు మధ్య వాగ్వాదం జరిగింది. అన్న నిఖిల్ తిట్టడంతో మనస్థాపానికి గురైంది. దీంతో వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట ఉన్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నిండు చూలాలైన కుమార్తె నాగభార్గవి ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశురాలైంది. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందింది. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సొంత అక్కను చంపిన తమ్ముడు.. కారణం ఏంటంటే..
సాక్షి, గోల్కొండ(హైదారాబాద్): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టోలిచౌకి ఆడమ్స్ కాలనీలోని నివసించే రైసా ఫాతిమా (41) హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తోంది. కొన్నేళ్ల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి రైసా బేగం తన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా తండ్రి కట్టెల వ్యాపారం, ఇతర ఆస్తుల విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా రైసా బేగంకు ఆమె తమ్ముడు ఆరిఫ్తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఆరిఫ్ కత్తితో రైసా బేగంపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
సెల్ఫోన్ విషయంలో మొదలైన గొడవ, క్షణికావేశంలో..
సాక్షి, ఖమ్మం: సెల్ ఫోన్ విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంకు చెందిన 15ఏళ్ల బాలిక ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. ఆన్లైన్ క్లాసులు ఉండటంతో సెల్ ఫోన్,ఇయర్ ఫోన్స్ తీసుకుంది. ఇదే సమయంలో తమ్ముడికి, అక్కకు మధ్య ఫోన్ విషయంలో జరిగింది. ఈ గొడవ కాస్త బాలిక ప్రాణాలు పోయే పరిస్థితి కి తెచ్చింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఊరివేసుకొని వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: దారుణం: భార్య కాపురానికి రావడంలేదని కన్న తండ్రిని.. -
దారుణం: తల్లిదండ్రులు కోల్పోయిన చెల్లెలిపై మూడేళ్లుగా..
అహ్మదాబాద్: అభంశుభం తెలియని అమాయక చిన్నారులపై అంతకంతకు పెరుగుతున్న నేరాలు ఆందోళనే కాదు ఆవేదన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు నిరోధించేందుకు పాలకులు తీసుకుంటున్న చర్యలు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి బయటికెళ్తే ఏ ఆపద ముంచుకొస్తుందనని తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల కాలంలో పరాయివాళ్ల నుంచే కాక మన అనకున్న సొంతవారి నుంచే ఆపదలు పుట్టుకొస్తున్నాయి. వావి వరుసలు, మంచి మర్యాదలు మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలికకు అండగా నిలవాల్సిన సోదరుడే సొంత చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. గుజరాత్లోని అహ్మదాబాద్లో 15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి నివాసముంటోంది. ఆమె తండ్రి అనారోగ్యంతో 14 ఏళ్ల క్రితమే మరణించగా.. ఇటీవల తల్లి సైతం ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులు కోల్పోయిన మైనర్ బాలికను ఆమె పెద్ద అన్నయ్య(26) మకార్బాలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. తనకు సంరక్షకులు ఎవరూ లేకపోడంతో బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సోదరుడు సొంత చెల్లెలిపై మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పుడుతూ వచ్చాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే గత మూడు నెలలకు మైనర్కు నెలసరి రాకపోవడంతో అనుమానం వచ్చిన వదిన తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూపించింది. అక్కడ పరీక్షల అనంతరం బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఈ విషయంపై బుధవారం సర్కేజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2019 జనవరి 29 నుంచి నుంచి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా అతని భార్య పడుకున్న సమయంలో సోదరుడు అఘాయిత్యానికి పాల్పడేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఆరో పెళ్లికి సిద్ధమైన బాబా.. ఐదో భార్య ఫిర్యాదుతో టీవీ చూసేందుకు రమ్మని పిలిచి.. బాలికపై దారుణం -
కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి.. ఆపాలంటూ పోలీసుల ఎంట్రీ
పట్నా: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి కట్టనుండగా.. ఇంతలో ఓ యువతి పెళ్లి ఆపాలంటూ పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. దీంతో పెళ్లి ఆగిపోవడంతో పాటు వరుడిని కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్లోని పట్నాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెళ్లి కొడుకు (అనిల్ కుమార్) పాలిగంజ్ సబ్ డివిజన్ లోని సియరాంపూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలోని మురార్చక్ గ్రామంలో నివసిస్తున్న కుమారి పింకీ అనే యువతితో ఈ నెల 15న పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనంగా ఓ యువతి పోలీసులతో మంటపంలోకి రంగప్రవేశం చేసింది. ఆ యువతి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ( కుమార్) ఒక సంవత్సరం క్రితం తనని వివాహం చేసుకున్నాడని, వారు భార్యాభర్తలుగా రహస్యంగా కలిసి జీవిస్తున్నారని తెలిపింది. అయితే, అతను తన తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహానికి అంగీకరించాడని చెప్పింది. తన భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలియగానే పోలీస్ స్టేషన్కు వెళ్లి, తన పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలను ఫోటోలతో సహా చూపించిన్నట్లు పేర్కొంది. దీంతో పెళ్లి ఆగిపోగా.. ఇక చేసేదేమి లేక మరుసటి రోజు ఉదయం వరుడి తమ్ముడితో వివాహం జరిపించారు. చదవండి: వైరల్: వధువు నోరు, ముక్కు నుంచి పొగ! -
జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం..! ఏకంగా తన సోదరుడితో కలిసి..
వాషింగ్టన్: మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి కంపెనీలు ప్రయత్నాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. అంతేకాకుండా అంగారక గ్రహంపైకి మానవులను పంపాలనే దృఢ సంకల్పంతో ఎలన్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇప్పటికే అంతరిక్షనౌక ప్రయోగాల దృష్టిసారించింది. కాగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ సంస్థ కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజిన్ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్థమైంది. బ్లూ ఆరిజిన్ ప్రయోగించే మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో ఆస్ట్రోనాట్స్తో పాటుగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రయాణించనున్నాడు. జెఫ్ బెజోస్ అతని సోదరుడు మార్క్ బెజోస్తో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ జెఫ్ బెజోస్ భావోద్వేగానికి గురైయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ అంతరిక్షంలో ప్రయాణించాలనే నా కల ఈ జూలై 20 న నెరవెరబోతుంది. ఈ ప్రయాణాన్ని నా సోదరుడుతో కలిసి పాలుపంచుకుంటున్నాను. అంతేకాకుండా అంతరిక్షం నుంచి భూమిని చూస్తే మనం మారిపోతాము. భూ గ్రహంతో ఉన్నఅనుబంధం కూడా మారిపోతుంద’ని వీడియోలో తెలిపాడు. బ్లూ ఆరిజిన్ తొలి అంతరిక్ష యాత్ర అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎరోస్పేస్ సంస్థను 2000 సంవత్సరంలో నెలకొల్పాడు. బ్లూ ఆరిజిన్ తొలి అంతరిక్ష నౌకకు ‘న్యూ షెపార్డ్ ’గా నామకరణం చేశారు. ఈ అంతరిక్ష యాత్రను జూలై 20 న ప్రయోగించనున్నారు. ప్రస్తుతం ఈ అంతరిక్ష యాత్రలో నౌక సిబ్బంది, బెజోస్ బ్రదర్స్తో పాటుగా.. ఈ ప్రయాణం కోసం అత్యధికంగా బిడ్ చేసిన వారు ప్రయాణిస్తారు. కాగా అందుకు సంబంధించిన వేలాన్ని మే 5 నుంచి ఆన్లైన్లో బ్లూ ఆరిజిన్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ వేలం జూన్ 10 వరకు లైవ్లో ఉండనుంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ ప్రయాణం కోసం సుమారు 21 కోట్ల అత్యధిక బిడ్ను వేశారు. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది. View this post on Instagram A post shared by Jeff Bezos (@jeffbezos) -
నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ అని కాల్ రికార్డు చేసి..
సాక్షి, మెదక్: ‘నాకు పక్షవాతం.. నా భార్యకు కడుపునొప్పి మమ్ములను సరిగ్గా చూస్తే బతికేవాళ్లమేమో.. నా అనారోగ్యమే నాకు బతకాలనే ఆశ లేకుండా చేసింది.. మేము ఎవరికీ భారం కావొద్దని చనిపోతున్నాం.. నాకు ఇద్దరు బిడ్డలు నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ మల్లేశా’ అంటూ ఫోన్లో రికార్డు చేసి దంపతులిద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని గాంధీ నగర్లో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడమంచి రాములు (54), కడమంచి లక్ష్మి (48) దంపతులు చాలా ఏళ్ల క్రితం మెదక్ నుంచి బతుకు దెరువు కోసం కామారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కామారెడ్డిలో పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు గతంలోనే పెళ్లిళ్లు చేసి పంపారు. రాములుకు ఏడాది క్రితం పక్షవాతం వచ్చి కాలు చేతి పని చేయలేని పరిస్థితి. భార్య లక్ష్మికి కిడ్నీలో రాళ్లు ఉండి తరచూ కడుపు నొప్పితో బాధపడేది. ఉన్నదంతా వైద్యానికి ఆస్పత్రులకు ఖర్చు పెట్టారు. అసలే రెక్కల కష్టం ఆధారంగా బతుకు బండిలాగే వారికి కరోనా మరో ఇబ్బందిగా మారింది. కనీసం అప్పు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో ఆరు నెలల క్రితం మెదక్లోని గాంధీ నగర్లో ఉండే తన తమ్ముడి వద్దకు వచ్చారు. చిన్నపాటి అద్దె ఇంట్లో ఉండి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. అయినా బాగు కాకపోవటంతో శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎందుకు చనిపోతున్నామో ఫోన్లో రికార్డు చేసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవటంతో మృతుడి తమ్ముడు మల్లేశం పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని విగత జీవులుగా కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించి కేసు దర్యాపు చేన్నట్లు తెలిపారు. చదవండి: Banjara Hills: సహజీవనం.. విషాదం -
తమ్ముడి వరసయ్యే వాడితో ప్రేమ.. ఓ టీవీ షోలో..
ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ అన్న ఓ సినీ రచయిత రాతలకు ఇంగ్లాండ్కు చెందిన మ్యాడీ నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. తమ్ముడి వరసయ్యే(?) వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె.. ఓ టీవీ షోలో తన మనసు విప్పింది. ఏళ్ల దూరాన్ని దగ్గర చేసింది. మనసుపడ్డ వాడిని చేరుకుంది. వివరాలు.. ఇంగ్లాండ్కు చెందిన మ్యాడీ తల్లికి, కాలమ్ తండ్రికి తొమ్మిదేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పుడు మ్యాడీ, కాలమ్లు చిన్నపిల్లలు. అయితే, కొన్ని అనివార్యకారణాల వల్ల వారిద్దరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. పెద్దలు విడిపోయినప్పటికి మ్యాడీ, కాలమ్లు సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండేవారు. ఈ నేపథ్యంలో మ్యాడీ కాలమ్ను ఇష్టపడటం మొదలుపెట్టింది. తాజాగా, ఐటీవీ సీక్రెట్ క్రష్ అనే డేటింగ్ షోలో కాలమ్పై ఉన్న ప్రేమను బహిర్గతం చేసింది. సాధారణంగా ఎవరైనా తమకిష్టమైన వాళ్లతో డేటింగ్ చేయాలనుకుంటే ఈ షో ద్వారా వాళ్లకు తమ ప్రేమను తెలియజేస్తారు. ఎదుటి వ్యక్తికి వీరి ప్రేమ ఇష్టమైతే డేటింగ్కు వెళతారు. లేదంటే, వారినుంచి ఎలాంటి స్పందన రాదు. ఆ షోలో మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘ నేను కాలమ్ను ఇష్టపడుతున్నానని చెప్పటానికి ఈ షోకు వచ్చాను. మా అమ్మ, వాళ్ల నాన్న తొమ్మిదేళ్ల క్రితం కలిసి ఉండేవారు. రెస్టారెంట్లో కాలమ్తో మ్యాడీ అయితే, ఇప్పుడు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మా పెద్దలు విడిపోయిన తర్వాత కూడా మేము సోషల్ మీడియాలో టచ్లో ఉండేవాళ్లం. అతడు చాలా మంచివాడు, అందగాడు’’ అని చెప్పుకొచ్చింది. వారి తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత మ్యాడీ,కాలమ్లు ముఖాముఖీగా కలవలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే టచ్లో ఉండేవారు. అక్కడే కాలమ్పై మ్యాడీకి ప్రేమ పుట్టింది. మ్యాడీ తనను ప్రేమిస్తోందని తెలుసుకున్న కాలమ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘‘నేను నమ్మలేకపోతున్నాను. మన పెద్దలు విడిపోయిన తర్వాత నేను నీతో మాత్రమే టచ్లో ఉన్నాను. ఇన్నేళ్లలో నిన్ను నేను చూడను కూడా చూడలేదు. మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా. నువ్వు నీ ప్రేమను రహస్యంగా ఉంచావు. నిజంగా నమ్మలేకుండా ఉన్నా’’ అని అన్నాడు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మ్యాడీ మాట్లాడుతూ.. ‘‘మేము చట్టవ్యతిరేకమైన పని చేయటం లేదు. ఎందుకంటే మేము మా బంధాన్ని రహస్యంగా ఉంచటం లేదు’’ అని అంది. కాలమ్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి మేము సవతి సోదరీ, సోదరులం కూడా కాదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఈ విషయం తెలిస్తే నాన్న నాపై మాటలు పేలుతారు. ఇంకెలా స్పందిస్తారో నాకు తెలియదు. కానీ, నేను దాన్ని లెక్క చేయను. ఇది ఆయనకు సంబంధించిన విషయం కాదు. నీకు,నాకు సంబంధించినది’’ అని అన్నాడు. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కోవిడ్(60) బారినపడి కన్నుమూశారు. నెల రోజుల క్రితం ఆశిం బెనర్జీ కరోనా సోకగా.. చికిత్స నిమిత్తం కోల్కతాలోని మెడికా ఆస్పత్రిలో చేరారు. చికిత్స సమయంలో ఆషీమ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించి వైద్యం కొనసాగించారు. శుక్రవారం నుంచి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆషీమ్ తుదిశ్వాస విడిచినట్లు మెడికా ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ తెలిపారు కాగా సీఎం మమతాకు ఆరుగురు సోదరులు కాగా.. ఆశిం బెనర్జీ చిన్నవాడు. వీళ్లందరూ కోల్కతాలోని కాళీఘాట్లో నివాసంలోనే ఉంటారు. ఇక కోవిడ్ నిబంధనల ప్రకారం ఆషీమ్ అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది. చదవండి: బెంగాల్లో కరోనా విజృంభణ, సీఎం మమత కీలక నిర్ణయం -
రెండు రోజులుగా ఆకలితో.. అమ్మ, సోదరుడి శవాల పక్కనే
బెంగళూరు: బెంగళూరులో షాకింగ్ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలియక తల్లీ, సోదరుడి మృతదేహాల పక్కనే మతిస్థిమితింలేని ఒక మహిళ రెండు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ గడిపిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ ఇంటినుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం రాజేశ్వరి నగర్లో నివసించే ప్రవీణ్ తన ఇంటి యజమాని ఇంటినుంచి వాసన వస్తోందని పోలీసులను తెలిపాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. ముందు గదిలోఒకటి, తరువాతి గదిలో మరొకి, మొత్తం రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా గుర్తించారు. వీరిని అర్యాంబ (65), హరీష్(45)గా గుర్తించారు. మరో మహిళ శ్రీలక్షి(47) ప్రాణాలతో ఉంది. వీరు మరణించారని తెలియని ఈమె ఆకలితో అలమటిస్తూ ఇంట్లోనే గడిపిందని పోలీసులు తెలిపారు. ఈమె మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని పోలీసుల ఉన్నతాధికారి సంజీవ్ పాటిల్ వెల్లడించారు. అమ్మ నిద్రపోతోందనుకున్నా, లేచి అన్నం పెడుతుందని చూస్తున్నా. మరోవైపు అమ్మ నిద్రపోతోందనుకున్నానని, లేచి అన్నం వండి పెడుతుందని చూస్తున్నాం.. రోజూ అమ్మే వంట చేస్తుందని, రెండు రోజులుగా ఏమీ తినలేదని శ్రీలక్ష్మి పోలీసులకు తెలిపింది. రెండు రోజుల క్రితం అమ్మ కిందపడిపోతే,హరీష్ చాలాసార్లు అంబులెన్స్కు ఫోన్ చేశాడని అయినా ఎవరూ రాలేదని తెలిపింది. ఆ తరువాత అతను కూడా పడిపోయాడని విచారణలో వెల్లడించింది. సోమవారం ఉదయం హరీష్ 108కు పలు సార్లు ఫోన్ చేసినట్టుగా అతని కాల్రికార్డు ద్వారా పోలీసులు గుర్తించారు. ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నహరీష్ తల్లి, పెళ్లి కాని అక్క శ్రీలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. గత నెల ఏప్రిల్ 22న అతనికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతను హోంసోలేషన్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. చదవండి: కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా -
విషాదం: కరోనాతో హీరోయిన్ సోదరుడు మృతి
లక్నో: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు పుంజుకోవడంతో ఎక్కడ చూసినా మందులులేక, వెంటిలేటర్లు అందబాటులో లేక, , ఆసుపత్రులలో ఐసీయూ బెడ్స్ దొరకక, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వైనం మరింత ఆందోళన రేపుతోంది. ముఖ్యంగా సినీ రంగంలో మహమ్మారి ప్రకంపననలు పుట్టిస్తోంది. తాజాగా హీరోయిన్ పియా బాజ్పాయ్ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పియా బాజ్పాయ్ సోదరుడు కరోనాతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో తన సోదరుడికి కరోనా సోకి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటిలేటర్, బెడ్, కావాలని కోరుతో పియా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే అతడు మృతి చెందాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటిలేటర్ సపోర్ట్ లేకపోవడంతో తన సోదరుడు కరోనాకు బలైపోయాడంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన కళ్లముందే అతని ప్రాణాలు పోవడం చూసి తట్టుకోలేపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గత 24 గంటల్లో ఇద్దరు ఆప్తులను కోల్పోయానని, మరో ముగ్గురి పరిస్థితి క్రిటిక్ల్ వుందని నటి భూమి పడ్నేకర్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే వెబ్ సిరీస్ కోసం షూటింగ్లో ఉన్న మరో నటుడు అనిరుధ్ డేవ్ కూడా కోవిడ్-19 కారణంగా భోపాల్లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ సహా పలువురు కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. కాగా 2008లో తమిళ చిత్రం పోయి సోల్లా పోరోమ్తో పియా తన యాక్టింగ్ కరియర్ను ప్రారంభించారు. ఆ తరువాత హీరో అజిత్ ఏగన్, జివా కో చిత్రాలలోని పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మూవీల్లో కూడా కనిపించారు. విజయలక్ష్మి దర్శకత్వంలో 2018 తమిళ-మలయాళ ద్విభాషా అభియుం అనువం మూవీలో ఆమె చివరిసారిగా బిగ్స్క్రీన్పై కనిపించారు. my brother is no more... — Pia Bajpiee (@PiaBajpai) May 4, 2021 I need urgent help in district Farukhabad , kayamganj block .UP.. a bed wd ventilator ..my brother is dying ..any lead plz help 🙏 Plz Contact if u know anybody -9415191852 Abhishek.. we are already in mess — Pia Bajpiee (@PiaBajpai) May 4, 2021 -
ఆడియో వైరల్ : చెల్లిపై అన్నలు లైంగిక దాడి
-
హన్సిక ఇంట్లో పెళ్లి సందడి ఫోటోలు
-
హీరోయిన్ హన్సిక ఇంట పెళ్లి సందడి!
‘దేశముదురు’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన హన్సిక తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులతో నటించి, తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్లోనే ఈ ముద్దు గుమ్మకు ఎక్కువ అవకాశాలు వస్తుండడంతో ఈ మధ్య తెలుగు తెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా వుంటే తన అన్నయ్య ప్రశాంత్ మోత్వానీకి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న జైపూర్లో వివాహం జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా కేవలం బంధువులను, సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ఆ వేడుకల్లో హన్సిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక పెళ్లిలో తమ సంప్రదాయ దుస్తులు, నగలను ధరించిన హన్సిక బుట్ట బొమ్మలా కనిపించింది. అతిథులతో ముచ్చట్లు పెడుతూ, తోబుట్టువులను ఆటపట్టిస్తూ, డాన్స్ చేస్తూ.. ధూమ్ధామ్గా సందడి చేసింది. అప్పుడే తన వదిన నాన్సీతో బలమైన బంధం ఏర్పడిందని, ఈ వివాహం తర్వాత మేము సోదరీమణులం అయ్యామని పేర్కొంది. పెళ్లి వేడుకల్లో తీసుకున్న కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకోగా అవి కాస్తా వైరల్ అయ్యాయి. మార్చి 21న ఎంగేజ్మెంట్తో మొదలైన ఈ సంబరాలు పెళ్లితో ముగిసాయి. ప్రస్తుతం హన్సిక లేడీ ఓరియంటడ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'మహా'లో నటిస్తోంది. కోలీవుడ్ నటుడు శ్రీకాంత్ విలన్గా చేస్తున్నాడు. శింబు ఓ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఆమె సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్.జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. కోవిడ్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ( చదవండి : మాజీ ప్రియురాలితో.. ) హన్సిక ఇంట్లో పెళ్లి సందడి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జూలియెట్ ఆత్మహత్య : సోదరుడే ముంచేశాడు
సాక్షి, సిటీబ్యూరో: నమ్మిన సమీప బంధువుకే టోకరా వేసి, ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ పరిధిలో నమోదైన సైబర్ నేరంలో ఈ చర్య తీసుకున్నామని, ఆత్మహత్య కేసును నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో జూలియెట్ అనే మహిళ ఒంటరిగా ఉండేది. ఆమె దగ్గర కుటుంబీకులు లేకపోవడంతో వరుసకు సోదరుడయ్యే జోసెఫ్ చేదోడు వాదోడుగా ఉండేవాడు. తనకు డబ్బు అవసరమైనప్పుడు ఆమె జోసెఫ్కు తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెప్పడంతో పాటు డెబిట్కార్డు ఇచ్చి పంపేది. దీనిని ఆసరాగా చేసుకున్న అతడు సొంతానికి కొంత డబ్బు డ్రా చేసుకున్నాడు. ఆమె ఫోన్లో ఉన్న సదరు బ్యాంకు యాప్ ద్వారా మరికొంత మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకుని కాజేశాడు. ఇలా మొత్తం రూ.5 లక్షలు తన బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు జనవరిగుర్తించిన జూలియెట్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా గత నెల 13న ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసును దర్యాప్తు చేసిన అధికారులు జోసెఫ్ను నిందితుడిగా తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట విషాదం..
సాక్షి, తిరుపతి: చంద్రగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు చెవి రెడ్డి హనుమంత రెడ్డి(45)మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డి గురువారం ఉదయం మరణించారు. రేపు తుమ్మలగుంటలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్లో రియాకు బెయిల్ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
డేటా వాడేశాడని తమ్ముడిని కడతేర్చాడు
జోధ్పూర్: మొబైల్ డేటాను మొత్తం వాడేశాడని సొంత తమ్ముడిని అన్నయ్య చంపిన ఘటన రాజస్థాన్ జోధ్పూర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నిందితుడు రామన్(23) తన తమ్ముడు రాయ్ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇంటర్నెట్ డేటాను పూర్తిగా వాడడంతో తమ్ముణ్ణి తిట్టాడు. కోపంతో నిందితుడు రాయ్ ఛాతీ మీద పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న రాయ్ను కుటుంబ సభ్యులు బుధవారం అర్థరాత్రి ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. పారిపోయిన నిందితుడు రామన్ను శుక్రవారం రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. (చదవండి:ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!) -
అజయ్ దేవగన్ సోదరుడు మృతి
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సోదరుడు అనిల్ దేవగన్(51) కన్నుమూశారు. గుండెపోటుతో సోమవారం రాత్రి ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అనిల్ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. గత రాత్రి నా సోదరుడు అనిల్ దేవగన్ మరణించాడు. అతని అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్రంగా కలిచి వేసింది. అతనిని ఎంతో కోల్పోతాను. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కోవిడ్ కారణంగా ఎలాంటి వ్యక్తిగత ప్రార్థన సమావేశం ఉండదు. అని ట్వీట్ చేశారు. చదవండి : అతనితో జాగ్రత్తగా ఉండమన్నారు: కాజోల్ I lost my brother Anil Devgan last night. His untimely demise has left our family heartbroken. ADFF & I will miss his presence dearly. Pray for his soul. Due to the pandemic, we will not have a personal prayer meet🙏 pic.twitter.com/9tti0GX25S — Ajay Devgn (@ajaydevgn) October 6, 2020 అనిల్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను ప్రారంభించిన అనిల్ ఆ తరువాత రాజు చాచా, బ్లాక్మెయిల్, హాల్-ఈ-దిల్ వంటి సినిమాలను తెరకెక్కించారు. దర్శకత్వంతో పాటు అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్గా అనిల్ దేవగన్ పనిచేశారు. అదే విధంగా గత ఏడాది (2019 మే 27) అజయ్ దేవగన్ తండ్రి వీరూ దేవగన్ కూ డా మరణించారు. -
బోర్డు మీటింగ్లోనే తమ్ముడిపై దాడి
సాక్షి, భావనగర్ : కంపెనీ బోర్డు మీటింగ్ లోనే షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. కంపెనీ బోర్డునుంచి తొలగించారన్న అక్కసుతో సొంత తమ్ముడిపైనే దాడికి దిగాడు. తండ్రి, ఇతర బోర్డు సమక్షంలోనే సోదరుడుపై కత్తితో దాడిచేసిన వైనం కలకలం రేపింది. భావనగర్లోని వర్తే గ్రామంలోని సిడ్సర్ రోడ్లోని తాంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టిసిఎల్)వద్ద ఈ సంఘటన జరిగింది. బాధితుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్లో తంబోలి కాస్టింగ్స్ లిమిటెడ్ (టీసీఎల్) డైరెక్టర్లలో ఒకడైన మెహుల్ తంబోలిని తొలగించాలని కంపెనీ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది. స్వయంగా తండ్రి బిపిన్ తంబోలి (77) అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సస్పెన్షన్పై ఆగ్రహించిన మెహుల్ తమ్ముడు వైభవ్ను కత్తితో పొడిచి పొత్తికడుపులో పారిపోయాడు.వెంటనే బాధితుడు వైభవ్ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మొహుల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. 2004లో ఏర్పాటైన టీసీఎల్ బీఎస్ఇ లిస్టెడ్ సంస్థ. ఫెరారీ, ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, జాగ్వార్, జాన్ డీర్ వంటి ఆటోమోటివ్ కంపెనీలకు విడి భాగాలను సరఫరా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్గా బిపిన్ తంబోలి ఉండగా, పిఎ సుబ్రమణియన్ వైస్ చైర్మన్గా, అన్నదమ్ములు మెహుల్, వైభవ్ ఇద్దరూ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు, మెహుల్ ను ఎందుకు తొలగించారు తదితర వివరాలు వెలుగులోకి రాలేదు. -
తమ్ముడి మృతితో ఆగిన ఇద్దరక్కల గుండెలు!
బెంగుళూరు: వారు ముగ్గురు అక్కతమ్ముళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. 50 యేళ్ల వయసు పైబడిన, పెళ్లిళ్లు అయ్యి తమకంటూ సొంతగా కుటుంబాలు ఏర్పడిన తరువాత వారి కూడా వారి ప్రేమ తగ్గలేదు. అందుకేనేమో ఒకరు చనిపోయారని తెలియగానే మరో ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెళగావి సమీపంలోని పంత్బలేకుంద్రి గ్రామానికి చెందిన అబ్దుల్ మాజిద్ జమదార్(57)కు ఇద్దరు అక్కలు. ఒకరు హుస్సేన్ బీ ముల్లా(64), మరొకరు సహారాబీ సనాది(70). వారు చిన్నప్పటి నుంచి ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టంతో పెరిగారు. వారి తమ్ముడు అబ్దుల్ మాజిద్ డయాబెటిస్ పెషంట్. మాజిద్కు గుండె నొప్పి నొప్పి రావడంతో అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కరోనా టైం కావడంతో కరోనా పరీక్ష నిర్థారణ రిపోర్టు లేకపోతే హాస్పటల్లో చేర్చుకోమని చాలా ఆసుపత్రులు తిప్పి పంపేశాయి. చదవండి: తెల్లారిన బతుకులు.. దీంతో కుటుంబ సభ్యులు మాజిద్ను బెలగావిలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అతడికి అక్కడ కోవిడ్-19 పరీక్షను నిర్వహించారు. అయితే పరీక్ష ఫలితం రాకముందే, తీవ్రమైన గుండెనొప్పితో మాజీద్ జమదార్ మరణించాడు. అయితే కరోనా రిపోర్టులో మాత్రం అతనికి నెగిటివ్ వచ్చింది. మాజీద్ మరణ వార్త తెలియగానే చిన్నక్క హుస్సేన్ బీ ముల్లాకు గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. పెద్దక్క సహారాబీ సనాది సైతం తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తరలించే క్రమంలో గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆ ఇళ్లు చీకటిగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ముగ్గురు అక్కాతమ్ముళ్లకు బేలగావికి 15 కిలోమీటర్ల దూరంలోని వారి స్వగ్రామమైన పంత్బలేకుంద్రి గ్రామంలో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: ‘నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు’ -
నాకు కరోనా సోకలేదు
కోల్కతా: తనకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సోదరుడైన స్నేహాశిష్ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే ముందు జాగ్రత్తగా స్నేహాశిష్ తన ఇంట్లో ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపాడు. తన ఆరోగ్యం బాగున్నట్లు, తనకు కూడా వైరస్ సోకినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్నేహాశిష్ స్పష్టం చేశాడు. ఇకనైనా ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా వ్యవహ రిస్తున్న స్నేహాశిష్ కుటుంబంలో మాత్రం ముగ్గురు కోవిడ్–19 పాజిటివ్గా తేలారు. -
‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్’
ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మికంగా గుండె పోటుతో గత వారం మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి మరణాన్ని సోదరుడు ధృవ్ సర్జా జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు లేకుండా ఉండలేము.. తిరిగొచ్చెయ్ అంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలో చనిపోవడానికి ముందు చిరంజీవి సర్జా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోను రీపోస్ట్ చేస్తూ.. ‘నీవు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను.. నీవు లేకుండా ఉండలేము’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ అభిమానులను కలిచి వేస్తోంది. (చివరి కోరిక తీరకుండానే మరణించిన హీరో) View this post on Instagram Then and now.. we r still the same... what say guys..?? A post shared by Chirranjeevi Sarja (@chirusarja) on Jun 6, 2020 at 1:20am PDT చిరంజీవి మరణం.. ధృవ్ సర్జాను కుంగదీసింది. సోదరుడి అంత్యక్రియల రోజున కూడా ఎంతో విచారంగా.. కుంగిపోయినట్లు కనిపించారు. చిరంజీవికి ధృవ్ సర్జా ఫాం హౌస్ అంటే ఎంతో ఇష్టమని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని సన్నిహితులు తెలిపారు. -
చెల్లెలి కోసం అన్న ..
టీ.నగర్: చెల్లెలి కోసం అన్న సైకిల్పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మదురై కూడల్ నగర్కు చెందిన ముత్తు, తమిళ్సెల్వి దంపతులకు కొడుకు జీవరాజ్, కూతురు ప్రవీణ ఉన్నారు. మదురైలోని ప్రైవేటు కళాశాలలో జీవరాజ్ చదువుతుండగా ప్రవీణ తేనిలో కంటి ఆస్పత్రి ఆధీనంలోని నర్సింగ్ కళాశాలలో డిప్లొమా చదువుతోంది. తేని జిల్లాలో 43 కరోనా కేసులు నమోదు కావడంతో జీవరాజ్ తన చెల్లెలును మదురైకు తీసుకువచ్చేందుకు తన పాత సైకిల్పై మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. సుమారు 80 కి.మీ దూరంలో ఉన్న తేనికి చేరుకోగా అన్నను చూసి ప్రవీణ ఆనందంతో ఏడ్చేసింది. ఆ తరువాత ఇద్దరూ బుధవారం ఒకే సైకిల్పై ఇంటికి బయలుదేరారు. జీవరాజ్ సైకిల్పై వచ్చిన సమాచారం స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ రామలక్ష్మికి తెలియడంతో స్థానికులు కొందరు అన్నాచెల్లెలిని మదురైకు కారులో పంపారు. -
నీరవ్ మోదీకి షాక్ ఇచ్చిన తమ్ముడు!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. తన అన్న అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపిస్తూ నీరవ్ తమ్ముడు నిషాల్ మోదీ ముందుకు వచ్చాడు. నీరవ్ మోదీ అవినీతి గురించి తనకు తెలియందటూ నిషాల్ ఈడీని ఆశ్రయించాడు. ఈ మేరకు తాను దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు ఒక లేఖ రాశాడు. తన వ్యాపార ప్రయోజనాల కోసం బ్యాంకులతో నీరవ్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నదీ తనకు తెలియదనీ, వార్తల్లో వచ్చేంతవరకు తనకు ఈ కుంభకోణం గురించి తెలియదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాననీ, చట్టం ప్రకారం సహాయం చేస్తానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆంట్వెర్ప్లో ఉన్న తనను కలవాలని ఈడీని కోరారు. నీరవ్ మోదీ సంపదకు తాను లబ్ధిదారుడిని కాదని నొక్కిచెప్పిన నీషల్ ఫైర్స్టార్ డైమండ్ డైరెక్టర్గా వేతనంతోపాటు వ్యాపారం ద్వారా వచ్చే చట్టబద్ధమైన ఆదాయాన్ని మాత్రమే తాను పొందానని, క్రమం తప్పకుడా పన్నులు కూడా చెల్లించానని రాశాడు. మరోవైపు ఈ లేఖ విషయాన్ని ధ్రువీకరించిన ఈడీ అధికారి ఒకరు నీషల్ నిందితుడు కాబట్టి, అతని సమాచారానికి విలువ వుండదని పేర్కొన్నారు. అంతేకాదు విచారణకు సహకరించదల్చుకుంటే అతనే భారతదేశానికి రావాలని తెలిపారు. కాగా దాదాపు రూ.14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో ప్రధాన ఆరోపణలపై నీరవ్ మోదీని 2019 మార్చిలో లండన్లో అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితుడు అతని మామ మెహుల్ చోక్సీ, నీరవ్ సోదరుడిపై కూడా ఇప్పటికే పలు ఆరోపణలు కింద సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్న నీరవ్ను వీడియో ద్వారా విచారించిన వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు అతడి జ్యుడీషియల్ రిమాండ్ను ఏప్రిల్ 28వ తేదీవరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
జేసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : ప్రముఖ గాయకులు కేజే జేసుదాసు (యేసుదాసు) సోదరుడు కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. కేరళలోని కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్ వల్లర్పాడమ్ కంటైనర్ టెర్మినల్ సమీపంలో జస్టిన్ శవం తేలుతూ కనిపించింది. అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు అయిదుగురు సంతానం. అందులో జేసుదాసు మొదటివాడు. ఆయన సొంత సోదరుడే కేజే జస్టిన్. ఈయన సంగీత కారుడు, నాటక రచయిత. బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన జస్టిన్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. బుధవారం త్రికక్కర పోలీసులు బ్యాక్ వాటర్స్ నుంచి జస్టిస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొడుకు మరణంతో జస్టిన్ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు, అంతేకాకుండా ఆయనకు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నువ్వులేని లోకంలో నేనుండలేను
తమిళనాడు, తిరువొత్తియూరు: తల్లిదండ్రులు మందలించారని తమ్ముడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ్ముడు మృతి తట్టుకోలేక అదే చోట అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నై కాశిమేడులో సంచలనం కలిగించింది. చెన్నై కాశిమేడు కాశితోట 2వ వీధికి చెందిన అలెగ్జాండర్ (48)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హృదయరాజ్ (24) బీటెక్ చదువుతున్నాడు. చిన్న కుమారుడు ఆరోగ్య ఆకాష్ (23) బీఈ పూర్తి చేశాడు. రెండో అంతస్తులోని ఓ గదిలో హృదరాజ్, 3వ అంతస్తులోని గదిలో ఆరోగ్య ఆకాష్ ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆరోగ్య ఆకాష్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తన స్నేహితుడికి సెల్ఫోన్కు మెసేజ్ పంపించాడు. వెంటనే స్నేహితుడు హృదయరాజ్తో కలిసి ఆరోగ్య ఆకాష్ గదికి వెళ్లారు. అప్పటికే ఆరోగ్య ఆకాష్ ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఇద్దరూ ఆరోగ్య ఆకాష్ను క్రిందకు దించి చికిత్స కోసం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్టు తెలిపారు. కాశిమేడు పోలీసులు ఆరోగ్య ఆకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో హృదయరాజ్ కనిపించలేదు. దీంతో అతని తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటిలోని మూడో అంతస్తులో ఆరోగ్య ఆకాష్ ఉంటున్న గదిలోకి వెళ్లి చూశారు. ఆరోగ్య ఆకాష్ ఉరి వేసుకుని మృతి చెందిన చోటే హృదయరాజ్ ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. ఇది చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆరోగ్య ఆకాష్ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడని తెలిసింది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను సరిగా పనికి వెళ్లకపోవడం వల్ల తల్లిదండ్రులు అతన్ని మందలించారు. దీంతో విరక్తి చెందిన అతను ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. తమ్ముడి మృతిని తట్టుకోలేక అదే చోట అన్న ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇద్దరు కుమారులు ఒకేరోజు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. -
గంట వ్యవధిలోనే అక్క, తమ్ముడి మృతి
చిత్తూరు, కలకడ : గంట వ్యవధిలోనే అక్క, తమ్ముడు మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి కలకడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లె గొల్లపల్లెకు చెందిన కుర్రా రామచంద్రయ్య(77) వైఎస్సార్ జిల్లా పులివెందుల్లో సర్వే అటెండర్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. స్వగ్రామం గొల్లపల్లెలో ఉన్నారు. అతడి అక్క ఎల్లమ్మ (80)వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లెలో ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎల్లమ్మ మృతి చెందింది. ఒంటి గంట సమయంలో రామచంద్రయ్య మృతిచెందారు.కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అక్క, తమ్ముడు ఒకే రోజు రాత్రి ఒకరి తరువాత ఇంకొకరు మరణించడం గమనార్హం. మృతుడు రామచంద్రయ్యకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
మైనర్పై సొంత సోదరుడి లైంగిక దాడి
సాక్షి, మచిలీపట్నం: సమాజంలో రానురాను కుటుంబ విలువలు.. మానవత్వం కనుమరుగైపోతున్నాయి.. కుటుంబ జీవితానికి మాయని మచ్చగా మారిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మలో సగం.. నాన్నలో సగం కలిపితే అన్న అంటారు. తల్లిదండ్రులను మరిపించే స్థాయిలో తోబుట్టువులను ప్రేమించాల్సిన సొంత అన్నే ఆ తోబుట్టువుపాలిట కామంధుడుగా మారాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి చివరకు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొంత కాలంగా తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆ మైనర్ బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆరా తీసేసరికి సొంత అన్నే ఈ అకృత్యానికి పాల్పడినట్టు గా తెలుసుకుని ఆ కుటుంబం ఘొల్లుమంది. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులు నిరాకరించారు. విషయం తెలుసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నించగా, కేసు నమోదు చేస్తే తమ పరువుపోతుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో చేసేది లేక పోలీసులు సైతం వెనుదిరిగారు. కాగా లైంగిక దాడికి పాల్పడిన యువకుడు పరారీ కాగా, ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ నోటా ఈ నోటా ఈ వార్త నగరమంతా వ్యాప్తిచెంది అంతా ముక్కున వేలేసుకున్నారు. -
తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న
సాక్షి, చెన్నై : విషవాయువు పీల్చి ట్యాంక్లో స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని రక్షించి ఓ అన్న మృత్యుఒడిలోకి చేరాడు. మంగళవారం రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్లో మురికి నీటి ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తమ్ముడి కోసం అన్న.. చెన్నై ఐస్ హౌస్ హనుమంతపురానికి చెందిన మూర్తికి అరుణ్కుమార్(25), రంజిత్కుమార్(23) కుమారులు. అన్నదమ్ముళ్లు ఇద్దరూ తమకు ఏ పని దొరికినా సరే, దాన్ని పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్స్లో అండర్ గ్రౌండ్లో ఉన్న మురికి నీటి తొట్టెను శుభ్రం చేసే పని లభించింది. తమ ప్రాంతానికి చెందిన దండపాణి అనే వ్యక్తి ద్వారా లభించిన ఈ పనిని చేయడానికి రంజిత్, అరుణ్కుమార్తో పాటుగా మరో ముగ్గురు ఉదయం వెళ్లారు. తొలుత రంజిత్ కుమార్తో పాటుగా, మరో యువకుడు మురికి నీటి ట్యాంక్లోకి వెళ్లి శుభ్రం చేయడం మొదలెట్టారు. ఈ సమయంలో విషవాయువు వెలువడడంతో ఓ యువకుడు భయంతో బయటకు వచ్చేశాడు. అయితే, రంజిత్కుమార్ బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆందోళన చెందిన అన్న అరుణ్కుమార్ తమ్ముడ్ని రక్షించేందుకు ఆ ట్యాంక్లోకి వెళ్లాడు. స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని అతి కష్టం మీద రక్షించి బయటకు పంపించాడు. అయితే, ఆ విషవాయువు తనను కూడా తాకడంతో క్షణాల్లో ఆ మురికి నీటి ట్యాంక్లో కుప్పకూలాడు. మిగిలిన వారు పెట్టిన కేకతో మాల్ భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అన్నా సాలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అరుణ్కుమార్ను బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. రంజిత్కుమార్ ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నాడు. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం.. తనను రక్షించి అన్న అరుణ్కుమార్ మరణించడంతో రంజిత్ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన సోదరుడి మృతికి మాల్ నిర్వాహకులే కారణమని మండిపడ్డాడు. ట్యాంకును సేఫ్టీ బృందం పరిశీలించినట్టు, అందులోకి వెళ్లవద్దని సూచించినా, ఆ విషయం తమకు చెప్పలేదని ఆరోపించాడు. విషయం తెలియకుండా లోపలికి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడిని కోల్పాయానని విలపించాడు. అరుణ్ కుమార్ మరణ సమాచారంతో మూర్తి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఐస్ హౌస్ పరిసర వాసులు పెద్ద సంఖ్యలో రాయపేట ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన అన్నా సాలై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చుస్తున్నారు. -
భారత పారిశ్రామికవేత్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: భారతకుచెందిన వ్యాపారవేత్త, స్టీల్ మాగ్నేట్ లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం, అధికార దుర్వినియోగం ఆరోపణలతో బోస్నియాలో బుధవారం అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈశాన్య పట్టణం లుకావాక్లో ఒక కోకింగ్ ప్లాంట్ కేసుకు సంబంధించి ప్రమోద్ మిట్టల్ను అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. వ్యవస్థీకృత నేరం, అధికారం దుర్వినియోగం ద్వారా నేరపూరిత చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. ప్రమోద్ మిట్టల్తోపాటు, కంపెనీ జనరల్ మేనేజర్ పరమేష్ భట్టాచార్య, పర్యవేక్షక బోర్డు సభ్యుడు రజీబ్ డాష్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తుజ్లా కంటోనల్ ప్రాసిక్యూషన్ విభాగం ప్రాసిక్యూటర్ కాజిమ్ సెర్హాట్లిక్ స్థానిక మీడియాకు తెలిపారు. నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులుఉన్నారు. నిందితులను కోర్టుముందు హాజరుపర్చనున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులుగా తేలితే 45 సంవత్సరాలదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నాలుగవ నిందితుడిపై అరెస్ట్ వారంట్ జారీ చేశామన్నారు. అయితే ఈ పరిణామంపై కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా బోస్నియాలో అతిపెద్ద ఎగుమతిదారులలో ఒకటి, మెటలర్జికల్ కోక్ ప్రొడ్యూసర్ గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రిజా లుకావాక్ (జికిల్) నేతృత్వంలోని 2003 నుంచి ప్రమోద్మిట్టలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు వెయ్యిమందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.