dating rumours
-
కూతురిపై డేటింగ్ రూమర్స్.. తనకేలాంటి బాధలేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి శ్వేత తివారీ గురించి పరిచయం అక్కర్లేదు. బీటౌన్లో పలు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. ఆమె కూతురు పాలక్ తివారీ సైతం సినిమాల్లోకి అడుగుపెట్టింది. శ్వేత వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీలో కనిపించింది.డేటింగ్ రూమర్స్..అయితే పాలక్ తివారీపై గతంలో చాలాసార్లు డేటింగ్ రూమర్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా చేశారు. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్తో డేటింగ్లో చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురిపై వచ్చిన డేటింగ్ రూమర్స్పై ఆమె తల్లి శ్వేత తివారీ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అయితే అవన్నీ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని.. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారంటూ కొట్టిపారేసింది.శ్వేత తివారీ మాట్లాడుతూ..' తన కూతురిపై వస్తున్న రూమర్స్ నన్ను బాధించవు. ఎందుకంటే అవీ కేవలం 4 గంటలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాళ్లే వార్తలను మరచిపోతారు. అందుకే వాటి గురించి బాధపడటం ఎందుకు?. అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్నెట్లో తరచుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి. అలా రూమర్స్ ప్రకారం నాకు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అయినప్పటికీ ఇలాంటి విషయాలు నన్ను ప్రభావితం చేయలేవు. ఇంతకుముందు సోషల్ మీడియా లేనప్పుడు కొంతమంది జర్నలిస్టులు నా గురించి మంచి విషయాలు రాసేందుకు ఎప్పుడూ ఇష్టపడలేదు. నటీనటుల గురించి నెగెటివ్ రాస్తేనే వాళ్ల మార్కెట్ నడుస్తుంది. ఇవన్నీ నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు" అని తెలిపింది. అయితే తన కుమార్తె పాలక్ తివారీపై నెగెటివ్ ప్రచారం పట్ల ఒక తల్లిగా ఆందోళన చెందుతున్నట్లు అంగీకరించింది.మొదట తనపై వచ్చే ట్రోల్లను డీల్ చేసిన పాలక్ తివారీని చూసి వాటిని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నానని శ్వేత తివారీ వివరించింది. ఎలాంచి రూమర్స్ వచ్చినా తన కూతురు బలంగా ఉన్నప్పటికీ అది కొన్నిసార్లు తనను భయపెడుతుందని తెలిపింది. నా కూతురు చాలా అమాయకంగా ఉంటుందని.. తనపై వస్తున్న రూమర్స్కు తిరిగి స్పందించదని వెల్లడించింది. ఆ సమయంలో ఒక తల్లిగా నాపై కొంత ప్రభావం ఉంటుందని శ్వేత చెప్పుకొచ్చింది. ఒకసారి నా స్నేహితులతో కూర్చుని మాట్లాడుతుండగా.. మా అమ్మ దేనికీ భయపడదని పాలక్ చెప్పిందని గుర్తు చేసుకుంది. కాగా.. శ్వేతా తివారీ చివరిసారిగా మిత్రన్ దా నా చల్దా, ఉమానియా, ఇండియన్ పోలీస్ ఫోర్స్ చిత్రాల్లో కనిపించారు. -
బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. హార్దిక్ తో డేటింగ్..!
-
హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్..!
లైగర్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ అనన్య పాండే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. బారాత్ వేడుకల్లో రణ్వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.అయితే ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నారు. వీరిద్దరూ కలిసి బరాత్లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారా? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.ఎందుకంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్తో విడిపోయినట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అనన్య పాండే సైతం తన బాయ్ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతనితో కాదు..స్టార్ హీరోయిన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనెల 22న అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. అదే సమయంలో అక్కడే ఉన్న ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగనా అతనితో డేటింగ్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తెగ వైరలవుతున్న రూమర్స్పై కంగనా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని చెప్పుకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని.. దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. అయితే తాను ఇంకో వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని కంగనా కుండబద్దలు కొట్టింది. ఒక వ్యక్తితో ఫోటో దిగినంత మాత్రాన ఇలా మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవలే అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కంగనా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకుంది. అయితే గతంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. అతను తన హెయిర్ స్టైలిష్ట్ అని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతలోనే మరోసారి అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవంలో కంగనా, నిషాంత్ ఫొటోలు వైరల్ కావడంతో రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 -
లైగర్ భామతో డేటింగ్.. యంగ్ హీరో రిప్లై ఇదే !
బాలీవుడ్ తారలే కాదు.. సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి. అలా రూమర్స్ కొన్నిసార్లు నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే రూమర్స్తో మొదలైన పెళ్లిబంధంతో ఒక్కటైన బాలీవుడ్ జంటలు కూడా ఉన్నాయి. వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, ఇటీవలే పెళ్లి చేసుకున్న రణ్దీప్ హుడా-లైస్రామ్ కూడా ఉన్నారు. తాజాగా ఈలిస్ట్లో లైగర్ భామ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో అనన్య బర్త్డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎక్కడా కూడా తమ రిలేషన్పై నోరు విప్పలేదు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైన ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అర్జున్ కపూర్తో కలిసి పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనన్యతో డేటింగ్ గురించి ప్రశ్నలు సంధించారు కరణ్ జోహార్. అయితే ఆ ప్రశ్నకు ఆదిత్య రాయ్ కపూర్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. ఆదిత్య మాట్లాడుతూ..'నన్ను రహస్యాలు మాత్రం అడగవద్దు. అయితే నేను కచ్చితంగా అబద్ధాలైతే మాత్రం చెప్పను' అని అన్నారు. అంతే కాకుండా తన మాజీ లవర్ శ్రద్ధా కపూర్ గురించి కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు కరణ్. మీరు అనన్య పాండే, శ్రద్ధా కపూర్తో కలిసి లిఫ్ట్లో చిక్కుకుంటే.. ఏం చేస్తారని ఆదిత్యను అడిగారు. అయితే దీనికి పక్కనే ఉన్న అర్జున్ కపూర్ ఫన్నీ ఆన్సరిచ్చాడు. 'కచ్చితంగా రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో చేస్తాడో మాత్రం తెలియదు'.. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ చెప్పాడు. అనన్య, ఆదిత్య రిలేషన్ కాగా.. లైగర్ భామ అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది కృతి సనన్ దీపావళి పార్టీలోనూ జంటగా కనిపించారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చాలాసార్లు విదేశాలకు వెళ్తూ విమానాశ్రయాల్లో జంటగా కనిపించారు. అంతకు ముందే సారా అలీఖాన్తో కలిసి అనన్య పాండే సైతం కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది. మరోవైపు ప్రస్తుతం ఆదిత్య, అనన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్తో డేటింగ్ రూమర్స్పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
డేటింగ్లో స్టార్ హీరోయిన్.. ముచ్చటగా మూడోసారి!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2010లో టీన్ పట్టి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా.. లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో విడుదలైన ఆషికి- 2 చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది. శ్రద్దా సినిమాల్లో నటించడంతో పాటు మంచి సింగర్ కూడా. తన సినిమాల్లో చాలా పాటలు పాడింది. (ఇది చదవండి: ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు) అయితే తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. గతంలో ఆషికి-2 నటుడు ఆదిత్య రాయ్కపూర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి.. ఆఫ్ స్క్రీన్లోనూ రిలేషన్లో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని పలు పార్టీలకు హాజరైంది. ఆ సమయంలో శ్రద్దా కపూర్పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా శ్రద్ధా కపూర్ అతనితో డేటింగ్లో ఉందన్న వార్త బీటౌన్లో హాట్టాపిక్గా మారింది. తు జూతీ మైన్ మక్కర్' చిత్రానికి సహ రచయితగా పనిచేసిన రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందని బీ టౌన్ టాక్. అయితే ఈ రూమర్స్పై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ జోడీ రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. నెటిజన్స్ సైతం న్యూ లవ్ బర్డ్స్ ఇన్ బాలీవుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!) కాగా.. తూ ఝూతీ మైన్ మక్కర్ చిత్రం 2023లో విడుదలైంది. లవ్ ఫిల్మ్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, డింపుల్ కపాడియా, అనుభవ్ సింగ్ బస్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్షిప్ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్లోకి వెళ్లండి'.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన అఖిల్!) సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. (ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) -
హీరోయిన్పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో !
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్జున్ కపూర్తో లంచ్ డేట్కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కాగా.. ఇన్స్టాగ్రామ్లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. మలైకా అరోరా బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే 2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉంది. (ఇది చదవండి: అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్తో కనిపించి! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!
ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్కు వెళ్లగా.. అక్కడ వీధులు, రెస్టారెంట్లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమివ్వడంతో డేటింగ్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ఈ వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కూతురి రిలేషన్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) చంకీ పాండే మాట్లాడుతూ..' నటీనటుల జీవితంలో రిలేషన్స్పై రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్లో వృత్తిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో టైగర్ ష్రాఫ్ సరసన, 'పతి, పత్నీ ఔర్ వో'లోని కార్తీక్ ఆర్యన్తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే మెరుగ్గా ఉండాలి.' అని అన్నారు. కాగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో 'డ్రీమ్ గర్ల్' సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలో నటించనుంది. ఆదిత్య రాయ్ కపూర్'ది నైట్ మేనేజర్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) -
నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎక్కువగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ కూడా వినిపించాయి కానీ తనపై వస్తున్న రూమర్స్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపారేసింది. ఓసారి లండన్ వెకేషన్లో, మరోసారి రెస్టారెంట్లో ఇద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. తాజాగా ది నెట్ మేనేజర్-2 ప్రమోషన్లలో పాల్గొన్న శోభిత ధూళిపాళ తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: చైతో డేటింగ్ అంటూ రూమర్స్.. స్పందించిన శోభిత ధూళిపాళ) శోభిత మాట్లాడుతూ.. 'నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండాలి. జీవితంలో ఎంత ఎదిగినా అణగిమణిగి ఉండాలి. సింపుల్గా, మంచి మనసు, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ప్రకృతిని ప్రేమించాలి. ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి.' అని తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... 'అలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఎవరైనా నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తా. ఎందుకంటే.. ఎన్నో ఆడిషన్స్ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి రోజు కష్టపడుతున్నా. అని అన్నారు. కాగా.. నాగ చైతన్యతో శోభితా రిలేషన్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు! ) కాగా.. గూఢచారి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శోభిత అంతకన్నా ముందు బాలీవుడ్లో అడుగుపెట్టింది. తెలుగు, హిందీలోనే కాకుండా మలయాళంలోనూ సినిమాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1లో నటించిన ఈ భామ రెండో భాగంలోనూ యాక్ట్ చేసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ శోభిత నటించింది. ప్రస్తుతం ఆమె ది నైట్ మేనేజర్-2తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. -
స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్కాస్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ చిత్రంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఆ ప్లేస్లో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. (ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ భామ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో ప్రభాస్తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి ప్రభాస్తో కలిసి పనిచేయడం ఎలా ఉందని కృతి సనన్ను ప్రశ్నించగా వాటికి సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ. కృతి మాట్లాడుతూ.. 'ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో అతను సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించా. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పా. ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. కానీ ప్రభాస్ చాలా ఒపెన్గా ఉండేవారు. ఆయన చాలా సైలెంట్గా తన పని చేసుకోపోయేవారు. ప్రభాస్ కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆదిపురుష్లో రాఘవగా ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించుకోలేను.' అని అన్నారు. గత కొంతకాలంగా కృతి, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. - ఐవీవీ సుబ్బరాజు (ఇది చదవండి : షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) -
క్రికెటర్ను పెళ్లి చేసుకుంటున్నారా?.. ఓపెన్గానే చెప్పేసిన హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విక్కీ కౌశల్తో జంటగా నటించిన చిత్రం జరా హాట్కే జరా బచ్కే. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సారా అలీ ఖాన్ టీమిండియా క్రికెటర్ శుభ్మాన్ గిల్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సారాను మీరు క్రికెటర్ను పెళ్లి చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అయితే దీనికి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. తనకు వారు ఎలాంటి వృత్తిలో ఉన్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోనని ఓపెన్గానే చెప్పేసింది. వారు నటుడు, క్రికెటర్, వ్యాపారవేత్త, డాక్టరైనా సరేనని చెప్పుకొచ్చింది. తన మేధోస్థాయికి సరిపోయే వ్యక్తిగా ఉంటే చాలని ఆమె పేర్కొంది. కాగా.. గతంలో తన అమ్మమ్మ, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్.. మాజీ భారత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. సారా, శుభ్మాన్ డేటింగ్ రూమర్స్ కాగా.. గతంలో సారా, శుభ్మాన్ డేటింగ్ డిన్నర్ డేట్లో ఒకే రెస్టారెంట్లో కనిపిచండంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వీరిద్దరు విడిపోయినట్లు వైరలైంది. సారా ప్రస్తుతం కరణ్ జోహార్ ఏ వతన్ మేరే వతన్లో కనిపించనుంది. ఇది ఓటీటీలో విడుదల కానుంది. హోమీ అదాజానియా మూవీ 'మర్డర్ ముబారక్', ఆదిత్య రాయ్ కపూర్ సరసన అనురాగ్ బసు చిత్రం 'మెట్రో...ఇన్ డినో'లో కూడా సారా నటిస్తోంది. (ఇది చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో.. టార్గెట్ అదే..) -
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరిపై పలుసార్లు డేటింగ్లో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా మరోసారి ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఓ డిన్నర్ పార్టీ నుంచి బయటకు వస్తూ జంటగా కనిపించడంతో లవ్బర్డ్స్ అంటూ మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!) శుక్రవారం రాత్రి ముంబయిలోని బాంద్రాలో డిన్నర్ పార్టీలో తళుక్కున మెరిశారు. ఇద్దరు కూడా బ్లాక్ అవుట్ఫిట్లో కనిపించారు. దీంతో మరోసారి ఈ జంట డేటింగ్ గురించి బీటౌన్లో చర్చ మొదలైంది. కాగా.. విజయ్ వర్మ ఇటీవలే రిలీజైన దహాద్ వెబ్ సిరీస్లో కనిపించారు. ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోళాశంకర్లో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. (ఇది చదవండి: ఆ విషయంలో నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తా: అనుపమ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ గతంలో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు. (ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్లో శుబ్మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..) అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్నారు. -
కీర్తిసురేష్ పెళ్లి చేసుకునేది ఇతడినేనా? ట్వీట్తో క్లారిటీ వచ్చేసింది
హీరో,హీరోయిన్ల సినిమా సంగతులతో పాటు వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే కుతూహాలం ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా హీరోయిన్ కీర్తిసురేష్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఓ బిజినెస్ మ్యాన్తో కీర్తిసురేష్ లవ్లో ఉందని, త్వరలోనే వీరి వివాహం జరగనుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రీసెంట్గా కీర్తి ఓ అబ్బాయి ఫోటో షేర్ చేయడంతో ఇతడే మహానటికి కాబోయే వరుడు అంటూ ఒక్కసారిగా కథనాలు వెలువడ్డాయి. దీనికి తోడు కీర్తి షేర్ చేసిన ఫోటోల్లో ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ దుస్తులు వేసుకోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో కీర్తిసురేష్ పెళ్లిపై ఫిల్మీదునియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై కీర్తి స్వయంగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. 'ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ను ఈ వార్తల్లోకి తీసుకొచ్చారా?నా జీవితంలోని నిజమైన మిస్టరీ మ్యాన్ను తప్పకుండా సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాను. అప్పటిదాకా చిల్గా ఉండండి' అంటూ పేర్కొంది. దీంతో రీసెంట్గా కీర్తి షేర్ చేసిన ఆ అబ్బాయి బాయ్ఫ్రెండ్ కాదని తేలిపోయింది. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అనడంతో కీర్తి లైఫ్లో మిస్టరీ మ్యాన్ ఉన్నడన్నది మాత్రం స్పష్టమైంది. ఆయన ఎవరన్నది త్వరలోనే తెలియనుంది. Hahaha!! Didn’t have to pull my dear friend, this time! I will reveal the actual mystery man whenever I have to 😉 Take a chill pill until then! PS : Not once got it right 😄 https://t.co/wimFf7hrtU — Keerthy Suresh (@KeerthyOfficial) May 22, 2023 -
బెల్లంకొండ హీరోయిన్ “యో...యో”
-
ప్రభాస్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. టీజర్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్తో మాత్రం ప్రశంసలు అందుకుంటున్నారు. టీజర్కు వంద రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్లో ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో హీరోయిన్ కృతిసనన్ ప్రభాస్పై ప్రశంసలు కురిపించింది. రాముడిలాగే ప్రభాస్ చాలా మంచివాడని, అతను చాలా సింపుల్ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్-కృతిసనన్ ప్రేమలో పడ్డారని, త్వరలోనే తమ రిలేషన్షిప్ స్టేటస్ అనౌన్స్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కృతిసనన్ ప్రభాస్పై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
హనీసింగ్తో ఛత్రపతి హీరోయిన్ డేటింగ్? నటి ఏమందంటే?
బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరూచా, ర్యాపర్, సింగర్ హనీ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్లో కలిసి కనిపించారు. హనీసింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కాడు. ఇంకేముంది, వీరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందంటూ బీటౌన వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ రూమర్స్ నుస్రత్ చెవిన పడ్డాయి. ఈ వార్తలు విన్న భామ ఆగ్రహమో, అసహనమో వ్యక్తం చేయకుండా ఎగిరి గంతేసినంత పని చేసింది. నుస్రత్ బరూచా హిందీ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో జోడీ కట్టింది. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు హనీసింగ్తో డేటింగ్పై ప్రశ్న ఎదురైంది. దీనికామె స్పందిస్తూ.. 'మీకో విషయం తెలుసా, ఇది నా జీవితంలోనే ఫస్ట్ డేటింగ్ రూమర్. నేను పెద్దగా ఎవరితోనూ తిరగను కాబట్టి నాపై ఇంతవరకు ఎలాంటి రూమర్ రాలేదు. కానీ ఈ పుకారు గురించి విన్నాక.. వావ్, నాకూ ఒకరు ఉన్నారన్నమాట అని సర్ప్రైజ్ అయ్యా. ఇక మీదట ఎవరడిగినా సరే, నాపై కూడా ఓ లవ్ రూమర్ ఉందని చెప్పుకోవచ్చు. అయినా జనాలకు బొత్తిగా పని లేకుండా పోయింది. ఏదేదో ఊహించుకుంటూ ఎప్పుడూ ఊహల్లోనే బతికేస్తున్నారు. సరే, నా గురించి కూడా ఏదేదో అనుకోండి, నేనేం పట్టించుకోను, నాకే సమస్యా లేదు' అని చెప్పుకొచ్చింది హీరోయిన్. కాగా నుస్రత్, హనీ సింగ్ 2021లో వచ్చిన ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి, సినిమాలు వదిలేసుకున్నా: హీరో అవే మనల్ని దూరం చేశాయి: సమంత -
నా తమన్నాతో తిరుగుతున్నావా?.. విజయ్ వర్మపై నటుడి కామెంట్స్ వైరల్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భామ.. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో కలిసి గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ రోజు తమన్నాను విజయ్ ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్గా మారింది. అప్పటి నుంచి ఈ జంట ఎక్కడా చూసిన కనిపించడంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. చాలా సార్లు విమానాశ్రయాల్లో ఇద్దరు కెమెరాలకు చిక్కడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కనిపించారు. దీంతో మిల్కీ బ్యూటీ- విజయ్ వర్మ డేటింగ్ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్గా మారాయి. (ఇది చదవండి: ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసింది: మధుబాల) అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్పై విజయ్ వర్మ స్నేహితుడు, సహానటుడు గుల్షన్ దేవయ్య క్రేజీ కామెంట్స్ చేశారు. విజయ్ వర్మ తన ఇన్స్టాలో 'దహాద్' థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్ను పోస్ట్ చేశారు. ఈ టీజర్ చూసిన గుల్షన్.. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్పై ఫన్నీగా పోస్ట్ చేశారు. గుల్షన్ తన కామెంట్లో రాస్తూ..' నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావ్. నాకు సరైన బుద్ధి చెప్పావ్ విజయ్. ఇంకా నా పరువు తీయనందుకు నీకు చాలా థ్యాంక్స్. లేకపోతే ఏం జరిగేదో.. హే రామ్' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది కావాలనే విజయ్ వర్మను ఆటపట్టించేందుకు చేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. (ఇది చదవండి: అమెరికాలో లయ.. ఎలాంటి జాబ్ చేస్తుందో తెలుసా?) అయితే ఈ జంట తమ రిలేషన్పై ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. తమన్నా, విజయ్ మొదటిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2' సినిమాలో కలిసి నటించబోతున్నారు. కాగా.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దహాద్'లో విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ మే 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ట్రైలర్ను మే 3న రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) -
హీరోయిన్తో సింగర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆయన ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్లో బీ టౌన్కు చెందిన పలువురు అగ్ర తారలు హాజరయ్యారు. అయితే ఈవెంట్లో బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే హనీ సింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఓ నెటిజన్ రాస్తూ వారిద్దరు డేటింగ్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. కాగా.. హనీ సింగ్ ఇటీవలే తన కొత్త పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ సాధించింది. మరోవైపు నుస్రత్ ప్రస్తుతం 'చోరీ' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'సెల్ఫీ' చిత్రంలో కనిపించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన 'తు ఝూతీ మైన్ మక్కార్'లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సల్మాన్ ఖాన్ తో డేటింగ్ ? పూజ హెగ్డే షాక్ కామెంట్స్..
-
సల్మాన్ ఖాన్తో బుట్టబొమ్మ డేటింగ్.. స్పందించిన హీరోయిన్
బుట్టబొమ్మ పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం 'కిసీ కా భాయ్.. కిసీ కి జాన్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. అయితే గతంలో పూజా హేగ్డేతో సల్మాన్ ఖాన్ డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బుట్టబొమ్మతో సల్మాన్ ఖాన్ మరో రెండు సినిమాల్లోనూ హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. తాజాగా సల్మాన్ ఖాన్తో డేటింగ్ రూమర్స్పై బుట్టబొమ్మ స్పందించింది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. 'దాని గురించి నేనేం చెప్పగలను? నా గురించి వచ్చిన వార్తలు చదివా. ప్రస్తుతం తాను సింగిల్గానే ఉన్నా. అలా ఉండడమే నాకిష్టం. నా దృష్టి అంతా కెరీర్పైనే ఉంది. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. సల్మాన్తో కలిసి నటించడం చాలా గొప్ప అనుభవం. సెట్స్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తనకు అనిపించింది ముక్కుసూటిగా చెప్పేస్తాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ తెలుగు అమ్మాయి పాత్ర. అందుకే నాకు బాగా నచ్చింది' అని అన్నారు. మంగళూరులో జరిగిన పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహానికి సల్మాన్ హాజరు కాగా.. డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. పూజా తాజా కామెంట్స్తో రూమర్స్కు చెక్ పెట్టినట్లు అయింది. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, విజేందర్ సింగ్, రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, భూమికా చావ్లా, సిద్ధార్థ్ నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Samantha: సామ్ అంతమాట అనేసిందా?
సమంత- నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా వీరికి పేరుంది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. తమ దారులు వేరంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే చై-సామ్లు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు.ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లండన్లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ డేట్కు వెళ్లడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత నాగచైతన్య డేటింగ్ రూమర్స్పై స్పందించినట్లు వార్తలు వచ్చాయి.'ఎవరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారన్నది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎంతమందితో డేటింగ్ చేసినా చివరికి మిగిలేది కన్నీళ్లే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తను ప్రవర్తన మార్చుకొని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది' అంటూ సామ్ పేర్కొన్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ మాటలు తాను అనలేదంటూ స్వయంగా సామ్ ట్వీట్ చేసింది. కాగా 2017లో ప్రేమపెళ్లి చేసుకున్న చై-సామ్లు 2021లో విడాకులు తీసుకున్నారు. -
విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పిన రష్మిక మందన్నా?
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడం.. అదంతా తూచ్ అని ఇద్దరూ కొట్టిపారేయడం.. చివరికి జంటగా కనిపించడం సదా మామూలే! మేమిద్దరం మంచి ఫ్రెంట్స్ అంటారు వాళ్లు.. కాదు కాదు, మీరు కచ్చితంగా ప్రేమికులే అంటారు అభిమానులు. రీల్ లైఫ్లోని గీతాగోవిందం రియల్ లైఫ్లో కూడా ఒక్కటైతే చూడాలని ఉందని తహతహలాడుతుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓపెన్ అయింది లేదు. అయితే తాజాగా రష్మిక.. విజయ్కు బ్రేక్ చెప్పిందని ఇప్పుడు మరో హీరోకు దగ్గరైందంటూ బీటౌన్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మరో హీరో ఎవరో కాదు, మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాసే! వీరిద్దరూ రెండుమూడు సార్లు కలిసి కనిపించడం పాపం.. ప్రేమ మొదలైందంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏకంగా విజయ్కే బ్రేకప్ చెప్పిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మధ్య తరచూ కలుస్తున్న విషయం వాస్తవమే కానీ వారిది కేవలం స్నేహం మాత్రమే! అంతకు మించి అంటే ఒప్పుకునేది లేదంటున్నారు అభిమానులు. అయినా సరే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రష్మిక చివరిసారిగా వారిసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సందీప్రెడ్డి వంగా డైరెక్షన్లో యానిమల్ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే అతడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. -
లండన్లో హీరోయిన్తో చైతూ.. మరోసారి డేటింగ్ రూమర్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమంతతో విడాకుల అనంతరం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన చై భాషతో సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్ట్స్కు ఒకే చెబుతున్నాడు. ఇటీవల లాల్ సింగ్ చడ్డాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై తాజాగా ‘కస్టడీ’తో కోలీవుడ్కు పరిచయం కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటి శోభిత దూళిపాళ్లతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ నడిచింది. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చైతూకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తాజాగా నాగ చైతన్య లండన్లోని ఓ రెస్టారెంట్లో ఉన్న ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ కూడా ఉండడంతో వైరల్గా మారింది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుమార్లు గాసిప్స్ కూడా గుప్పుమన్నాయి. లండన్లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్లో నాగ చైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో శోభిత ధూళిపాళ టేబుల్ దగ్గర కనిపించడం అభిమానుల్లో మరింత అయితే గతేడాది నవంబర్లో లండన్ వెకేషన్కు వెళ్లిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలిసి ఉన్న ఫోటో ఆన్లైన్లో కనిపించడంతో డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. గతంలో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్లలో ఈ విషయంపై చైతూను ప్రశ్నించగా నవ్వుతూ వెళ్లిపోయారు. కాగా.. ఇటీవలే హైదరాబాద్లోని కొత్తగా ఓ ఇంటికి షిఫ్ట్ అయ్యారు నాగ చైతన్య. అయితే వీరిద్దరిపై రిలేషన్పై ఎవరూ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. View this post on Instagram A post shared by Surender Mohan (@chefsurendermohan) -
పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఇండస్ట్రలో హాట్టాపిక్ నిలిచింది. కొంతకాలంగా తెరపై పెద్ద వినిపించిన ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆప్ పార్టీకి చెందిన యంగ్ పొలిటిషియన్ రాఘవ చద్దాతో పరిణీతి ప్రేమలో మునిగితేలుతుందంటూ కోద్ది రోజులుగా నెట్టంట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటివలె ఇద్దరు జంటగా డిన్నర్ డేట్కు వెళ్లి మీడియా కంట పడ్డారు. దాంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు అప్పటి నుంచి వీరి ప్రేమ, పెళ్లి రూమర్స్ బి-టౌన్తో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పార్లమెంట్ సమావేశానికి హజరయ్యేందుకు వచ్చిన రాఘవ చద్దాకు మీడియా నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. పలు రాజకీయ అంశాలతో పాటు పరిణీతి చోప్రా గురించి విలేకర్లు ప్రశ్నించారు. ఇటీవల మీ ఇద్దరి ఫొటోలు వైరలయ్యాయి.. ఏంటీ సార్ ఏమైన శుభవార్త ఉందా? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి రాఘవ చద్దా ముసిముసి నవ్వుతూ ‘రాజకీయ అంశాల గురించి అడగండి. కానీ.. పరిణితీ చోప్రా గురించి అడగోద్దు’ అంటూ సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్ నా వల్లే వచ్చింది: అజయ్ దేవగన్ ఇక దీనిపై మీరు స్పందించాల్సిందే అని విలేకరి అడగ్గా.. ‘సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ పార్లమెంటులోకి నడిచారు రాఘవ చద్దా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. ఇక త్వరలోనే రాఘవ చద్దా-పరిణితిలు పెళ్లి ప్రకటన రానుందా? అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల పరిణీతి పెళ్లి స్పందిస్తూ తన సహానటీనటులు, స్నేహితులంత పెళ్లి పీటలు ఎక్కారని, వారిని చూస్తుంటే తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రస్తుతం తాను సింగిల్ అని, వరుడు కావాలంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. Hehe! @raghav_chadha 🤭 That smile. Aap mujhse rajneeti ke sawal kariye, Parineeti ke nahi kariye. Video zaroor dekhiye! pic.twitter.com/CJhsUNkhP3 — Mohak🇮🇳 (@mohak_kohli) March 24, 2023 -
ఆప్ నేతతో స్టార్ హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డ్ దక్కింది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం పరిణితీ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పరిణీతి ఆప్ పార్టీకి చెందిన పొలిటిషియన్తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ చద్దా అనే వ్యక్తితో కలిసి ముంబయిలో కెమెరాలకు చిక్కింది. నగరంలోని ఒక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా ఈ జంట కెమెరాల కంటపడ్డారు. దీంతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. పరిణితీ, రాఘవకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా.. గతంలో పరిణితీ చోప్రాపై చాలా సార్లు డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కాగా.. ప్రస్తుతం పరిణీతి తదుపరి చిత్రం చమ్కిలాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరిణీతితో దిల్జిత్ దోసాంజ్ నటిస్తున్నారు. పరిణీతి చివరిసారిగా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, నీనా గుప్తా నటించిన ఉంఛాయి చిత్రంలో కనిపించింది. -
హీరో సిద్ధార్థ్తో డేటింగ్పై ప్రశ్న.. అదితి షాకింగ్ కామెంట్స్
హీరో సిద్దార్థ్తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి స్పందించింది. గతంలో డేటింగ్ రూమర్స్ను ఖండించిన అదితికి తాజాగా ఇంటర్య్వూలో అదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన తాజ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆమె ఓ చానల్కు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలేషన్షిప్పై స్పందించాలని యాంకర్ ఆమెను కోరగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను అంది. చదవండి: ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్పై హీరోయిన్ ఆగ్రహం తన రిలేషన్ స్టేటస్పై మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్పై చూడటమంటనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ను అందించగలం. అదే మాకు ముఖ్యం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం సిద్దార్థ్తో రిలేషన్పై మాట్లాడుతూ అసహనం చూపించింది. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ‘ఈ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా నేనేమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని వాఖ్యానించింది. దీంతో యాంకర్ ఇది ఆడియన్స్ ప్రశ్న అనగానే వారెప్పుడు తనని ఇలాంటి ప్రశ్న అడగలేదని, మీరు అడుగుతున్నారంటూ నవ్వుతూ చెప్పింది. కాగా అదితి-సిద్ధార్థ్లు మాత్రం తమపై వచ్చే రూమర్స్ పట్టించుకోకుండా కలిసి పార్టీలు, విందులకు హాజరవుతున్నారు. అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, రీల్స్ను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. -
అప్పటి నుంచే నాపై రూమర్స్.. డేటింగ్పై నోరు విప్పిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. ఇటీవల జరిగిన లక్మీ ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసింది. పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్న ఈ షోలో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పరంగా తన అభిరుచులను అభిమానులతో పంచుకుంది. తన ఫ్యాషన్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది మిల్కీ బ్యూటీ. అలాగే డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది తమన్నా. అలా ఉండేందుకు ఇష్టపడతా తమన్నా మాట్లాడుతూ.. 'ఎప్పుడూ క్యాజువల్ దుస్తుల్లో ఉండడానికి ఇష్టపడతా. తనకు కంఫర్ట్గా ఉండే దుస్తులే ధరిస్తా. నా జుట్టు అంటే చాలా ఇష్టం. దాని కోసం ఎక్కువ కాస్మోటిక్స్ వాడను. ఎప్పుడూ సహజంగా ఉండేలా చూసుకుంటా. అందుకోసం ఉల్లిపాయ రసాన్ని వాడతాను.' అంటూ మిల్కీ బ్యూటీ తన అందం సీక్రెట్ చెప్పేసింది. విజయ్ వర్మతో డేటింగ్ అయితే గతంలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో పెద్దఎత్తున గాసిప్స్ గుప్పుమన్నాయి. విజయ్ వర్మతో రిలేషన్పై కాస్త ఘాటుగానే స్పందించింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో విజయ్ వర్మకు తమన్నా ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. డేటింగ్ వార్తలపై తమన్నా మాట్లాడుతూ.. 'మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. అప్పటి నుంచే మాపై రూమర్స్ తీసుకొచ్చారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది తమన్నా. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్లో కనిపించనుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి జైలర్లో నటిస్తోంది. -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో హీరో సిద్దార్థ్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
గ్రాఫిక్ డిజైనర్తో హీరో డేటింగ్.. నాలుగేళ్లుగా!
బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నారా? దీనిపై ప్రస్తుతం బీటౌన్లో చర్చ నడుస్తోంది. ముంబయికి చెందిన గ్రాఫిక్ డిజైనర్తో నాలుగేళ్లుగా డేటింగ్ కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ రాధికా కోల్గాంకర్తో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. కాగా.. ఆదర్శ్ గౌరవ్ 'ది వైట్ టైగర్'లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. అయితే ఆదర్శ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడని తెలుస్తోంది. అయితే డేటింగ్ వార్తలను ఆదర్శ్ ఖండించలేదు. రాధికా కోల్గాంకర్తో రిలేషన్పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన రాబోయే ప్రాజెక్ట్లపై దృష్టి సారించినందువల్లే ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. సినిమాల విషయాకొనిస్తే గౌరవ్ 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్తో తన నటనను ప్రారంభించాడు. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో బలరామ్ హల్వాయి పాత్రను పోషించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించిన 'ఖో గయే హమ్ కహాన్'లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Adarsh Gourav (@gouravadarsh) -
కొత్త బాయ్ఫ్రెండ్ను పరిచయం చేసిన హీరోయిన్, రొమాంటిక్ పిక్స్ వైరల్
ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు ఆమె. చదవండి: పొలిటికల్ లీడర్ను పెళ్లాడిన హీరోయిన్ తాజాగా ఆ పుకార్లనే నిజం చేస్తూ కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్వెస్ట్విక్తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్వెస్ట్వీక్తో దిగిన పలు రొమాంటిక్ పిక్స్ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో ఆమె పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూంటే మరికొందరు ఆమె తీరుపై విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మనివ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమయాణం ఏంటని తప్పుబడుతున్నారు. చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్ను ఉద్దేశించేనా? View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్పై క్లారిటీ వచ్చేసింది?
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పటికీ గాసిప్స్కు దూరంగా ఉన్న తమన్నా ఈ ఏడాది న్యూఇయర్ నుంచి డేటింగ్ రూమర్స్తో వార్తల్లోకి ఎక్కింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్ వర్మకు లిప్లాక్ ఇచ్చి ఫ్యాన్స్కి షాకిచ్చింది. దీంతో అతడితో తమన్నా రిలేషన్లో ఉందంటూ ఒక్కసారిగా గాసిప్స్ గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటి మిల్కీ బ్యూటీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. అయితే తమన్నా రిలేషన్ స్టేటస్పై అభిమానులంతా సందేహంలో ఉన్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సందర్భంగా తమన్నాతో డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు నటుడు విజయ్. ప్రేమికుల రోజును పురస్కరించుకుని విజయ్ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో ఎదురెదురుగా నిలుచుని ఉండి, ఇద్దరి కాళ్ల మధ్యలో హార్ట్ ఎమోజీని జత చేసి ఫొటో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో వారి ముఖాలు కనపడకుండ జాగ్రత్త పడ్డాడు. విజయ్ ఎదురుగా ఉన్నది తమన్నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వ్యక్తి వేసుకున్న షూ, జాకెట్ ఆధారంగా అది తమన్నానే అంటూ పట్టేశారు నెటిజన్లు. గతంలో తమన్నా అచ్చం అలాంటి షూ, చేతిలో జాకెట్ పట్టుకుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే రోజు స్పెషల్ పోస్ట్ షేర్ చేసి పరోక్షంగా తమన్నాతో రిలేషన్ రూమర్స్పై స్పష్టత ఇచ్చాడని నెటిజన్లంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయాన్ని కన్ఫాం చేస్తూ తమన్నా ఫ్యాన్ పేజీలో ఓ ట్విటర్ యూజర్ పోస్ట్ కూడా షేర్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్గా మారింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా.. తమిళం, హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. Exclusive Confirmed 👌🏻 Happy Valentine's day to #VijayVarma Live in partner @tamannaahspeaks parents arent in favour of Tamanna living with Vijay and getting married with him after few months. Her parents tried hard to change decision but she's behaving adamant. Look at choice pic.twitter.com/KJ07mDK1oM — ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) February 14, 2023 -
దర్శకుడితో హీరోయిన్ డేటింగ్..!
బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ గిల్టీ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. అంతకుముందే పలు టీవీ సీరీస్ల్లోనూ కనిపించింది భామ. 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, తేరే దో నైనా అనే మ్యూజిక్ ఆల్బమ్లోనూ కనిపించింది. తాజాగా ఈ నటికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శకుడు శరణ్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మై డార్లింగ్ సినిమాలో చివరిసారిగా కనిపించిన నటి గుంజన్ సక్సేనా దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఆరు నెలలకు పైగా డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. శరణ్ శర్మ తన ఇన్స్టాలో చేసిన రంజన్ కపూర్తో ఉన్న ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు లవ్ సింబల్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. గతేడాది ద్వితీయార్థంలో వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించినప్పటికీ ఎక్కడ గానీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు ఈ జంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే వేడుకల్లోనూ రంజన్ కపూర్, శరణ్ శర్మ తరచుగా హాజరవుతుంటారు. ఈ విషయంపై సన్నిహితుడొకరు మాట్లాడుతూ..'వారు కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారు. వారు తమ సంబంధాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకోను. వాస్తవానికి ఈవిషయంలో వారు చాలా ఓపెన్గా ఉంటారు. అని అన్నారు. కాగా.. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రంజన్ కపూర్ను ప్రశ్నించగా నో కామెంట్స్ అంటూ బదులిచ్చారు. కాగా.. ది గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్ దర్శకుడు శరణ్ శర్మ ప్రస్తుతం మిస్టర్ & మిసెస్ మహీ చిత్రీకరణలో ఉన్నారు. View this post on Instagram A post shared by Sharan Sharma (@sharanssharma) -
మళ్లీ దొరికిపోయిన రష్మిక-విజయ్.. ఈసారి ఏకంగా!
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ గురించి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ జంట ఎక్కడికెళ్లినా ఇద్దరు ప్రత్యక్షమవుతుంటారు. గతంలో వ్యాకేషన్కు వెళ్లి సోషల్ మీడియాలో షేర్ ఫోటోలు షేర్ చేసి దొరికిపోయారు. తాజాగా మరోసారి ఈ జంట దుబాయ్లో మెరిసింది. ఇప్పటికే ఈ జంటపై సోషల్ మీడియాలో డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్లో విజయ్ దేవరకొండ, అతని కుటుంబంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అక్కడే విజయ్ పక్కన రష్మిక నవ్వుతూ కనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ జంట రిలేషన్పై ఎక్కడా నోరు విప్పలేదు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న విజయ్తో అతని తల్లిదండ్రులతో కలిసి వ్యాకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో పలుసార్లు విదేశాల్లో పర్యటించినా.. ఇద్దరు కలిసి ఫోటోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ఫోటోలను కొందరు నెటిజన్లు ట్విటర్లో షేర్ చేశారు. రష్మిక -విజయ్ రష్మిక మందన్నా, విజయ్ జంటగా తెలుగులో రెండు చిత్రాల్లో నటించారు. అయితే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. కాగా.. విజయ్ చివరిసారిగా పాన్-ఇండియా చిత్రం 'లైగర్'లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సమంతతో కలిసి 'ఖుషి' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రష్మిక చివరిసారిగా సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో కనిపించింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ హిట్ మూవీ పుష్ప సీక్వెల్లో నటిస్తోంది. ఆ తర్వాత రణబీర్ కపూర్తో 'యానిమల్' చిత్రంలో కనిపంచనుంది. Virosh at Dubai #VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/VDfyNhlkel — Rashmika VijayDeverakonda 💕 (@Rashmikavijay8) January 30, 2023 -
మాజీ లవర్తో జాన్వీ కపూర్.. మళ్లీ స్టార్ట్ చేసిందా..!
జాన్వీ కపూర్ బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. ఇటీవలే మిలి చిత్రంలో అభిమానులను పలకరించిన జాన్వీ ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అయితే గతంలో జాన్వీ కపూర్తో తన మాజీ లవర్ శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఇటీవల ఎక్కడా జంటగా కనిపించలే దు. గతంలో కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్లో పాల్గొన్న జాన్వీ పహారియాతో విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఈ జంట కలిసి వరుస పార్టీల్లో పాల్గొంటున్నారు. దీంతో పహారియా, జాన్వీ మధ్య సయోధ్య కుదిరిందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో మాజీ లవర్తో కలిసి కరణ్ జోహార్ పార్టీలో జాన్వీ కపూర్ పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇద్దరు కలిసి కారులో రావడం కనిపించింది. అంతే కాకుండా ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ఎంగేజ్మెంట్ పార్టీలో శిఖర్తో జంటగా కనిపించింది. ఇప్పడు అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్లతో కలిసి కరణ్ జోహార్ పార్టీకి హాజరైంది. మాజీ లవర్స్ మరోసారి కలవడంతో బీ టౌన్లో చర్చ నడుస్తోంది. -
బాలీవుడ్ నటుడితో శిల్పా శెట్టి సోదరి డేటింగ్. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ నటి షమితా శెట్టి అంటే చాలామందికి తెలియదు. శిల్పా శెట్టి సోదరి అంటే చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి 'పిలిస్తే పలుకుతా' చిత్ర౦తో తెలుగు సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ఆమె బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేశాయి. అయితే వీటిపై తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేం లేదంటూ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గానే చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. నా అభిప్రాయాలను పంచుకునేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. ఏదైనా చెప్పే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇటీవల అమీర్ అలీతో షమితా శెట్టి ఓ వీడియో ముద్దులు పెట్టుకోవడంతో అది కాస్తా వైరలైంది. షమితా శెట్టి తన ఇన్స్టాలో రాస్తూ.. 'సమాజంలో ఇలాంటి మనస్తత్వంతో నేను అయోమయంలో ఉన్నాను. రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తారు. ఇది నెటిజన్ల భావనలకు నిదర్శనం. అందుకే నేను నోరు విప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం సింగిల్గానే హ్యాపీగా ఉన్నా. వీటిపై కాకుండా ఈ దేశంలోని మరిన్ని ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టండి.' కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది బాలీవుడ్ భామ. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మా మధ్య ఏదో ఉందనుకుంటారు.. కానీ: డేటింగ్పై యంగ్ హీరో
ఇటీవల 'భూల్ భులయ్యా 2' సినిమాతో సెన్సేషనల్ స్టార్గా మారాడు చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందించింది. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్గా పేరున్న ఆర్యన్పై డేటింగ్ రూమర్లు పెద్ద ఎత్తున వైరలయ్యాయి. ఈ జాబితాలో సారా అలీ ఖాన్, అనన్య పాండే కూడా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈ వార్తలపై ఎక్కడా నోరు విప్పలేదు కార్తీక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు తొలిసారి డేటింగ్ వార్తలపై స్పందించారు. కార్తీక్ మాట్లాడుతూ.. ' నాకు కాఫీ తాగడం అంటే ఇష్టం. ఎవరైనా నాతో కాఫీ తాగడానికి పిలిస్తే వారితో వెళ్లిపోతా. ఈ విషయంలో నేను చాలా నిజాయితీగా ఉంటా. నాపై డేటింగ్ వార్తలు చాలా వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రజలు బయటి ప్రపంచంలో కనిపించే వాటినే ఎక్కువగా నమ్ముతారు. వార్తల్లో వచ్చిన వాటిని చూసి వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనుకుంటూ ఉంటారు. ' అని అన్నారు. కాగా.. కార్తీక్ 2020లో లవ్ ఆజ్ కల్లో సారా అలీ ఖాన్తో కలిసి పనిచేశాడు. పతి పత్నీ ఔర్ వో సినిమా సమయంలో కార్తీక్, అనన్య డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ప్రస్తుతం కృతి సనన్తో నటించిన షెహజాదా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుంది. కార్తీక్ చేతిలో కెప్టెన్ ఇండియా, సత్యప్రేమ్ కీ కథ, ఆషికి 3 కూడా ఉన్నాయి. అతను హేరా ఫేరి 3లో కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. -
మరోసారి మెరిసిన మిల్కీ బ్యూటీ.. అతనితో డేటింగ్ నిజమేనా..!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో సందడి చేసిన భామపై డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున హల్చల్ చేశాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు ముద్దు పెడుతున్న వీడియా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మ అతనితో డేటింగ్లో ఉన్నట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎయిర్పోర్ట్లోనూ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ కెమెరాకు చిక్కింది. మరోసారి విజయ్ వర్మతో కలిసి ముంబయిలో జరిగిన ఓ వేడుకల్లో తళుక్కున మెరిసింది . దీంతో ఆమె అభిమానులు మరోసారి ఆశ్చర్యానికి గురయ్యారు. అతనితో తమన్నా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ నవ్వుతూ కనిపించారు. దీంతో ఇప్పటికే వీరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై మరోసారి చర్చ మొదలైంది. నిజంగా ఈ జంట డేటింగ్లో ఉందా అనే అనుమానాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ వార్తలపై వీరు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. తమన్నా రాబోయే ప్రాజెక్ట్లు తమన్నా, విజయ్ తొలిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2'లో కనిపించనున్నారు. ఆ తర్వాత ఆమె చిరంజీవి, కీర్తి సురేష్లతో కలిసి 'భోళా శంకర్'లో కనిపించనుంది. ఇది తెలుగులో ఏప్రిల్ 14, 2023న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరోవైపు, విజయ్ 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్'లో నటించనున్నారు. ఇందులో కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కనిపించనున్నారు. ఆ తర్వాత సోనాక్షి సిన్హాతో 'దహాద్', సుమిత్ సక్సేనా చిత్రం 'మిర్జాపూర్ 3' లో నటించనున్నారు. -
ఆర్యన్ ఖాన్తో డేటింగ్! క్లారిటీ ఇచ్చిన పాకిస్తాన్ నటి
గతంలో డ్రగ్ కేసుతో సంచలనమైన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్ మోడల్, నటి సాదియా ఖాన్తో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు హాల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కాస్తా క్లోజ్గా దిగిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ వార్తలపై క్లారిటీ రాకముందే బాలీవుడ్ నటి, డాన్సర్ నోరా ఫతేహితో ఆర్యన్ ఖాన్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఆర్యన్తో డేటింగ్ రూమర్స్పై పాకిస్తాన్ నటి సాదియా ఖాన్ స్పందించింది. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె ఆర్యన్తో డేటింగ్పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలేం తెలియకుండానే ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. కలిసి ఫొటో దిగితే వారు రిలేషన్లో ఉన్నట్లేనా? అసలు ఏంటీ? ఏం జరిగిందో తెలియాకుండానే అలా ఎలా రాసేస్తారు. ఒక్క ఫొటో చూసి డేటింట్లో ఉన్నాని ఎలా అభిప్రాయపడతారు. ఇదంత వింతగా.. విచిత్రంగా అనిపిస్తోంది’ అని పేర్కొంది. అనంతరం ‘ఆర్యన్ను న్యూ ఇయర్ ఈవెంట్లో కలిశాను. అప్పుడు మేం మాట్లాడుకున్నాం, ఫొటో దిగాం. ఫొటో దిగినంత మాత్రాన మేమిద్దరం డేటింగ్లో ఉన్నట్లు కాదు. ఆ రోజు న్యూ ఇయర్ పార్టీ నేను మాత్రమే లేను. చాలా మంది ఉన్నారు. వారంత కూడా ఆర్యన్తో ఫొటో దిగారు. వారందరు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు కూడా షేర్ చేశారు. కానీ ఈ రూమర్స్పై నాపైనే ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు’ అంటూ సాధియా మండిపడింది. కాగా దుబాయ్లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్లో సాధియా ఖాన్, ఆర్యన్ ఖాన్లు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే సాధియా పాకిస్తాన్లో పలు టీవీ సీరియల్స్తో గుర్తింపు పొందింది. -
హీరోయిన్తో షారుక్ ఖాన్ కొడుకు డేటింగ్? ఫోటోలు లీక్
బాలీవుడ్లో సెలబ్రిటీల మధ్య లవ్ ఎఫైర్లు, రిలేషన్స్షిప్స్కు కొదువ లేదు, ఇప్పటికే చాలామంది స్టార్స్ డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. తాజాగా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ బీటౌన్ను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహితో ఆర్యన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా వీరిద్దరూ దుబాయ్కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25ఏళ్లు కాగా, నోరాకి 30 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఐదేళ్లు గ్యాప్ ఉంది. ఇక రీసెంట్గా నోరా ఆర్యన్ సోదరి సుహానా ఖాన్తో కూడా డిన్నర్ పార్టీలో కనిపించింది. దీంతో నోరా-ఆర్యన్ల రిలేషన్ నిజమేనన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై నోరా లేదా ఆర్యన్లు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఐదేళ్లుగా నటి సీక్రెట్ లవ్.. మిస్టరీ మ్యాన్ ఎవరంటే?
'ప్యార్ కా పంచ్నామా' సినిమా హీరోయిన్ సొనాలి సెగల్ లవ్లో ఉందట. కానీ బయటకు మాత్రం అబ్బే, తనింకా సింగిలే అని చెప్తోంది. బీటౌన్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సొనాలి ఆశేష్ ఎల్ సంజనాని అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందట. ఇతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు, ఎంటర్ప్రెన్యూర్. కాకపోతే అతడు ఇండస్ట్రీ సెలబ్రిటీలతో స్నేహం చేస్తుంటాడు. ఇకపోతే వీరిద్దరి ప్రేమ ఇప్పటిది కాదని, నాలుగైదేళ్లుగా వీరి లవ్వాయణం నడుస్తోందని తెలుస్తోంది. కానీ ఈ విషయం బయటకు పొక్కకూడదనే వీరు బయటకు మీడియా కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో కూడా జంటగా దిగిన ఫోటోలను పంచుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం సోనాలి నూరాని చెహరె సినిమా చేస్తోంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ, నుపూర్ సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల సత్యనారాయణ కైకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి -
పూజా హెగ్డేతో సల్మాన్ ఖాన్ డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన స్నేహితుడు..!
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, అందాల బుట్టబొమ్మ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూయర్ కమల్ రషీద్ ఖాన్(కేఆర్కే) ట్వీట్ వైరల్గా మారడంతో సల్మాన్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరేమో మా బుట్టబొమ్మకు సల్మాన్ను అంటగడతారేంట్రా అని పూజా హెగ్డే ఫ్యాన్స్ ఫైరయ్యారు. (ఇది చదవండి: బుట్టబొమ్మతో లవ్లో పడ్డ సల్మాన్ ఖాన్!) ఈ రూమర్లపై తాజాగా సల్మాన్ ఖాన్ స్నేహితుల్లో ఒకరు స్పందించారు. ఈ వార్తలను అతను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుతో తలదించుకోవాలి. పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్కు కూతురి లాంటిది. వాళ్లిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే రూమర్లు వ్యాప్తి చేస్తారా? కొంతమంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని అనుకోవచ్చు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.' అని అన్నారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, భూమికా చావ్లా, షెహనాజ్ గిల్ కూడా నటించారు. -
డేటింగ్ రూమర్స్..హోటల్లో కెమెరాలకు చిక్కిన హీరో, హీరోయిన్లు
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్లో సిద్ధార్థ్- అదితిలు జంటగా కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. కాగా ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ పెళ్లి చేసుకోగా, 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే అతడితో విడిపోయింది. -
శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య.. నెట్టింట ఫోటో లీక్
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య గతేడాది సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా పేరు తెచ్చుకున్న చై-సామ్లు అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. వీళ్లు ఎందుకు విడిపోయారన్నదానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సామ్తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పర్సనల్ లైఫ్పై అనేక రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్లతో చై డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు నాగ చైతన్య ఇటు శోభిత ఇద్దరు కూడా స్పందించలేదు. తాజాగా శోభితతో కలసున్న నాగచైతన్య ఫోటో ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనడానికి ఈ ఫోటోనే కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్లో 'శోభిత ధూళిపాళ్ల పేరు వినగానే ఏం గుర్తొస్తుంది?'అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నాగ చైతన్య చిన్న స్మైల్ ఇచ్చి సమాధానం దాటవేశారు. అలాగే ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగ్గా హ్యాపీ స్టేటస్ అంటూ బదులిచ్చారు. ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చై- శోభిత ఫోటోలో ఎంతవరకు నిజముంది? ఇది ఇద్దరూ కలిసిన దిగిన ఫోటోనా? లేక ఎడిటింగ్ ఫోటోనా అన్నది తేలాల్సి ఉంది. -
పెళ్లయిన వ్యక్తితో మాజీ ప్రపంచసుందరి డేటింగ్..ఇంతకీ ఎవరో తెలుసా..!
మాజీ మిస్ వరల్డ్, నటి, మోడల్ మానుషి చిల్లర్పై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. హర్యానాకు చెందిన నటి ఓ వ్యాపారవేత్తతో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో టాక్ నడుస్తోంది. 2021 నుంచి ఈ జంట తరచూ విహారయాత్రలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసని బాలీవుడ్లో టాక్. (చదవండి: 'అలా ఆలోచించే వాళ్లయితే ఓకే'.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర కామెంట్స్..!) అయితే వ్యాపారవేత్త నిఖిల్ కామత్కు ఇదివరకే పెళ్లయింది. 2019లో పెళ్లి చేసుకున్న కామత్ గతేడాదే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అతను ప్రస్తుతం మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్తో డేటింగ్లో ఉన్నారని నెట్టింట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మానుషి ప్రస్తుతం సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. అయితే డేటింగ్ వార్తలపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. -
బాలీవుడ్ స్టార్ హీరో చెల్లితో డేటింగ్.. ఆ యంగ్ హీరో ఎవరంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్తో డేటింగ్ కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య బంధం ఎక్కువ కాలం నిలువలేదు. తాజాగా కార్తిక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్ సిస్టర్ పష్మినా రోషన్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యంగ్ హీరో కార్తిక్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల భూల్ భూలయ్యా- 2 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్లోనూ నటిస్తున్నారు. బాలీవుడ్లో మరో రెండు ప్రాజెక్టులు అతని చేతిలో ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు యంగ్ హీరో కార్తిక్. హృతిక్ బాబాయి, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రాజేశ్ రోషన్ కూతురైన పష్మినాతో కలిసి కార్తిక్ ఇటీవలే ముంబయి రోడ్లపై కనిపించి సందడి చేశారు. అంతే కాదు దీపావళి వేడుకల్లోనూ ఈ జంట ప్రత్యేక వాహనంలో ముంబైలోని జూహూలో డ్రైవ్కు వెళ్లారు. వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు రావడం, రాత్రిళ్లు పార్టీల్లో పాల్గొనడంతో డేటింగ్ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంతవరకు వీటిపై ఈ జంట నోరు స్పందించకపోవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరీ పష్మినాతో బంధమైనా ఎక్కువ కాలం కొనసాగిస్తాడో లేదా వేచి చూడాల్సిందే. -
నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఈ భామ అల్లు శిరీష్తో డేటింగ్లో ఉందంటూ వార్తలొచ్చినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు. (చదవండి: అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్) అను మాట్లాడుతూ.. 'అందులో ఎలాంటి నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇలాంటి అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను. ఈ వార్తలు చదివి మా అమ్మ చాలా బాధపడింది' అని తెలిపింది. అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు వైరలయ్యాయి. -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్
Siddharth-Aditi Rao Hydari Dating Rumours: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు వీరిద్దరు జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. చదవండి: కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె అదితితో కలిసి క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్లు సిద్ధార్థ్ ఈ పోస్ట్తో క్లారిటీ ఇచ్చాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్ పోస్ట్పై వారి సన్నిహితులు సైతం వీరిద్దరిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్దార్థ్ పోస్ట్కి అదితి స్పందిస్తూ సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే అదితి బర్త్డే సందర్భంగా వీరిద్దరు జంటగా వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె బర్త్డే రోజున(అక్టోబర్ 28న)ముంబై ఎయిరోపోర్ట్లో సిద్దార్థ్, అదితిలు జంటగా దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
భార్యతో విడిపోయి రెండేళ్లు.. పంజాబీ నటితో ఏడాదిగా సింగర్ డేటింగ్?
ప్రముఖ గాయకుడు, పంజాబ్కు చెందిన బాద్షాపై రూమర్లు గుప్పుమంటున్నాయి. పంజాబీ నటి ఇషా రిఖీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం తన భార్య జాస్మిన్తో విడిపోయాక ఆమెతో చనువుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఏడాదిగా డేటింగ్లో ఉన్నా ఇప్పటివరకు ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త వహించారు. తాజాగా వీరిద్దరు ఓ స్నేహితుని పార్టీలో కలుసుకోవడంతో డేటింగ్లో ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాద్షా అభిమానులు ఈషా రిఖీ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ విషయం ఈ జంట వారి కుటుంబాలతో ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరి బంధాన్ని బాద్షా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరు చలనచిత్ర పరిశ్రమకే చెందినవారే కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. (చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్పై లైంగిక ఆరోపణలు.. మహిళా కమిషన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు) బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. అతని అభిమానులు ముద్దుగా బాద్ షా అని పిలుస్తారు. పంజాబీ చలనచిత్ర పరిశ్రమలో గాయకుడిగా, నిర్మాతగా స్టార్డమ్ సంపాందించుకున్నారు. హిందీ, హర్యానా, పంజాబీ సంగీతంతో ఫేమస్ అయ్యారు. హిప్ హాప్ గ్రూప్ మాఫియా ముందీర్లో కలిసి 2006లో తన కెరీర్ ప్రారంభించాడు. కాగా.. ఇషా రిఖి స్వస్థలం పంజాబ్లోని చంఢీఘడ్. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఆమె పంజాబీ చిత్రం జట్ బాయ్స్ పుట్ జట్టన్ దే సినిమాతో తెరపైకి అడుగుపెట్టింది. పంజాబీ నటుడు అమ్రీందర్ గిల్తో కలిసి హ్యాపీ గో లక్కీ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత వరుసగా 2014, 2015లో మేరే యార్ కమీనీ, వాట్ ది జాట్ మూవీల్లో కనిపించింది. -
ప్రియుడు చనిపోయిన ఏడాదికే మరొకరితో నటి డేటింగ్?
షెహనాజ్ గిల్.. ఈ పేరు వినగానే చాలామందికి సిద్దార్థ్ శుక్లా గుర్తుకు వస్తాడు. అంతలా వీరి జంట పాపులర్ అయింది బిగ్బాస్ షోతో. కానీ షెహనాజ్ను ఒంటరి చేస్తూ నటుడు సిద్దార్థ్ శుక్లా చిన్నవయసులోనే తనువు చాలించాడు. ప్రియుడి మరణంతో ఎంతగానో కుమిలిపోయిన షెహనాజ్ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి తన పనిలో నిమగ్నమైంది. అయితే ఆమె టీవీ యాంకర్, కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయల్తో కొంచెం క్లోజ్గా కనిపించడంతో అతడితో డేటింగ్ చేస్తుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్కు హాజరైన షెహనాజ్కు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో చిర్రెత్తిపోయిన నటి.. 'ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారు? ఒకరి పక్కన నిల్చున్నామంటే వారితో రిలేషన్లో ఉన్నామనే అర్థమా? మేమిద్దరం కలిసి కనిపిస్తే ప్రేమలో ఉన్నట్లేనా? కాదు కదా! ఇలా వాగితే నాకు పిచ్చి కోపం వస్తుంది' అని ఆగ్రహించింది. తాజాగా ఈ వీడియో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలో కనిపించిన షెహనాజ్ చివరగా హోంస్లా రఖ్ అనే పంజాబీ చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by KATTAR SHEHNAAZIAN (@shehnaazian_army) చదవండి: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! -
మరోసారి తెరపైకి వరుణ్ తేజ్-లావణ్య డేటింగ్ రూమర్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్ కానీ, లావణ్య కానీ స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకే బర్త్డే పార్టీలో సందడి చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి సహా నితిన్ ఆయన భార్య షాలినీ, సాయి ధరమ్ తేజ్తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యరు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్తో డేటింగ్?.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక మందన్నా
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తుంది. రష్మిక కెరీర్ ఆరంభం నుంచి ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ- రష్మికలు చాలాకాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఫిల్మీ దునియాలో జోరుగా ప్రచారం జరుగుంది. ఇప్పటికే విజయ్ ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ వీరి రిలేషన్పై గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రూమర్స్పై రష్మిక మందన్నా స్పందించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంతసేపైనా మాట్లాడతా. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలన్ని ఆసక్తి ఉండటం సహజమే. కానీ పదేపదే అవే ప్రశ్నలు అడగటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో పుకార్లను అస్సలు నమ్మొద్దు. నేను చెప్పేందవరకు ఒక నిర్ణయానికి రాకండి. నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్. -
సోనాక్షి సిన్హాతో డేటింగ్పై స్పందించిన హీరో..
Jaheer Iqbal Reacts To Dating Rumours With Sonakshi Sinha: గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై జహీర్ స్పందించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ పుకార్లను పట్టించుకోనని పేర్కొన్నాడు. 'ఇదంతా జరిగి చాలా కాలం అయింది. నేను అదంతా పట్టించుకోను. మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. అలాగే ఆలోచించండి. అదే మీకు మంచిది అయితే అలాగే చేయండి. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా ? నన్ను క్షమించండి. దాని గురించి ఆలోచించడం మానేయండి.' అని జహీర్ తెలిపాడు. ఇంకా ఈ విషయంపై జహీర్ మాట్లాడుతూ 'ఇదంతా సినీ పరిశ్రమలో ఒక భాగం. నేను పరిశ్రమకు రాకముందే తను తెలుసు. ఈ పరిశ్రమలో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఇలా జరిగినప్పుడు ఎక్కువగా రాస్తారు, దానిపై పెద్దగ శ్రద్ధ పెట్టవద్దని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కాబట్టి నేను నిజంగా ఈ విషయాన్ని పట్టించుకోను.' అనిపేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2010లో 'దబాంగ్' సినిమాతో సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేయగా జహీర్ ఇక్బాల్ 'నోట్బుక్' మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఇది చదవండి: ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోతో బిగ్బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్
బిగ్బీ మనవరాలు నవ్య నవేలీ నంద, హీరో సిద్దాంత్ చతుర్వేది లవ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. సిద్దాంత్ ఓ వైట్ బ్రిడ్జి మీద పుస్తకం చదువుతున్నట్లుగా పోజిచ్చాడు. అటు నవ్య కూడా రాత్రి సమయంలో వైట్ బ్రిడ్జి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి ఫొటోల్లో తెల్లటి బ్రిడ్జి కామన్గా ఉండటంతో నవ్య, సిద్దాంత్ కలిసే ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా సిద్దాంత్ పోస్ట్కు మండుతున్న సూర్యుడి ఎమోజీతో రిప్లై ఇచ్చిన నవ్య తర్వాత దాన్ని డిలీట్ చేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం రిషికేష్కు వెళ్లిన వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని చెప్పకనే చెప్పారని అభిప్రాయపడుతున్నారు. కాగా హీరో సిద్దాంత్ చివరగా గెహ్రియాన్ సినిమాలో నటించాడు. ఇందులో దీపికా పదుకొణెతో పాటు నవ్య క్లోజ్ ఫ్రెండ్ అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_301238179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే! -
నువ్వు అతడిని లవ్ చేస్తున్నావా? 'నాగిని' బ్యూటీ ఆన్సరేంటంటే?
బిగ్బాస్ హౌస్లో క్లోజ్గా మూవ్ అయ్యారు రష్మీ దేశాయ్, ఉమర్ రియాజ్. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వారు డేటింగ్ చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నటి. 'ఏదైనా అడిగేయండి' అంటూ అభిమానులతో చిట్చాట్ నిర్వహించిన రష్మీకి 'నువ్వు ఉమర్ను ప్రేమిస్తున్నావా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఉమర్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఒక ఫ్యామిలీలా కలిసిపోయామే తప్ప అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. 'మా బంధాన్ని మీరు ఇష్టపడుతున్నారని తెలుసు, అందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము' అంటూ సమాధానమిచ్చింది. చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు షాకింగ్ లుక్పై స్పందించిన గోపాల కృష్ణ కాగా బిగ్బాస్ హిందీ 15వ సీజన్లో పాల్గొన్న రష్మీ ప్రస్తుతం నాగిని (6వ సీజన్) సీరియల్లో నటిస్తోంది. అయితే ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండటంతో ఆమె అభిమాని ఒకరు పాజిటివ్ రోల్ చేయొచ్చు కదా అని అడిగింది. దీనికి నటి స్పందిస్తూ 'ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి జీవితంలో విలన్లే. అసలు విలన్ లేకపోతే హీరో ఏమీ చేయలేడు. పాజిటివ్ రోల్ అయినా, నెగెటివ్ రోల్ అయినా దేని ప్రాధాన్యత దానికుంటుంది. నాకు స్క్రిప్ట్ నచ్చింది, ఒప్పేసుకున్నాను' అని బదులిచ్చింది. చదవండి: కోట్లలో మోసపోయిన హీరోయిన్ రిమీ సేన్ -
ఆ నటుడితో ఎందుకు ముడిపెడుతున్నారు?: భాగ్యశ్రీ
అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు తప్పుగా అర్థం చేసుకునే రోజులివి. అలాంటిది ఇండస్ట్రీలోని నటీనటులు తరచూ కలిసి కనిపించారంటే చాలు సమ్థింగ్ సమ్థింగ్ అంటూ కథనాలు అల్లేస్తారు ఈ క్రమంలో భాగ్యశ్రీ లిమాయే నటుడు భూషణ్ ప్రదాన్తో డేటింగ్లో ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై మండిపడింది భాగ్యశ్రీ. 'ఇదంతా తప్పుడు ప్రచారం. చాలాకాలం క్రితమే దీనిపై క్లారిటీ ఇచ్చాను కూడా! మరాఠీ ఇండస్ట్రీలో నాకు కొద్దిమంది మాత్రమే స్నేహితులున్నారు. అందులో కొందరు సెలబ్రిటీల ఫ్రెండ్స్తో కూడా నేను చిల్ అవుతుంటాను. నా క్లోజ్ ఫ్రెండ్స్లో యాక్టర్స్ కూడా ఉన్నారు. వారితోనే నేను అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను. అందులో భూషణ్ ఒకరు. అతడితో కలిసి బయట కనిపించిన పాపానికి నాకు అతడికి ముడిపెడుతున్నారు. ఎందుకు మాకిద్దరికీ ముడిపెడతున్నారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వార్తలు విన్నప్పుడు మాత్రం మేము సీరియస్గా తీసుకోకుండా గట్టిగా నవ్వేస్తాం. అంతెందుకు, ఆ వార్తల క్లిప్పింగ్లు కూడా షేర్ చేసుకుంటాం' అని చెప్పుకొచ్చింది. తన జీవితంలో చాలామంది ప్రత్యేక వ్యక్తులు ఉన్నారన్న భాగ్యశ్రీ ప్రస్తుతం తాను సింగిల్గా ఉందా? లేదా ప్రేమలో ఉందా? అన్న విషయాన్ని మాత్రం చెప్పనంది. చదవండి: మళ్లీ ప్రేమలో పడ్డ హీరో, సహజీవనం కూడా?! -
బాలీవుడ్ హీరోయిన్తో టాలీవుడ్ యంగ్ హీరో ప్రేమాయణం!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నాడట. బాలీవుడ్ నటి సోనియా రాధేతో సందీప్ రిలేషన్లో ఉన్నట్లు నెట్టింట ఓ కథనం వైరల్గా మారింది. దీని ప్రకారం.. సందీప్, సోనియా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. తక్కువ కాలంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారిందట. అంతేకాదు, ముంబై వీధుల్లో ఈ ఇద్దరూ షికార్లు కొడుతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ ప్రేమ కథనాలపై అటు సందీప్ కానీ, ఇటు సోనియా కానీ ఇంకా స్పందించలేదు. కాగా సోనియా 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే వెబ్ సిరీస్లో నటించింది. ఆమె నటించిన 'తారా వర్సెస్ బిలాల్' త్వరలో రిలీజ్ అవుతోంది. సోనియా మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్ కూడా! గతంలో ఆమె ప్రొడక్షన్ డిజైనర్గానూ పని చేసింది. అటు సందీప్ విషయానికి వస్తే అతడు చివరగా 'గల్లీ రౌడీ' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'మైఖెల్'లో నటిస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయితోనే నా పెళ్లి: మహేశ్ -
యంగ్ హీరోయిన్తో హృతిక్ సీక్రెట్ డేటింగ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఓ యంగ్ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు నటి సబా ఆజాద్. విరిద్దరు తరచూ కలుసుకోవడం, సన్నిహితంగా మెలగడంతో హృతిక్, సబాలు మధ్య సమ్థింగ్.. సమ్థింగ్ నడుస్తోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల ముంబైలో వీరిద్దరూ డిన్నర్ డేట్కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో హృతిక్ ఆమె చేయి పట్టుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. ఈ క్రమంలో హృతిక్, సబాల రిలేషన్ హాట్ టాపిక్గా మారింది. సబా, హృతిక్ను జంటగా చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హృతిక్ మళ్లి డేటింగ్లో ఉన్నాడా? అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సుశానేతో విడాకులు అనంతరం హృతిక్ లైఫ్లో మూవ్ ఆన్ అయ్యాడని, వీరిద్దరిని ఇలా చూస్తే ఆమె కుళ్లు కోవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు సబా, హృతిక్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వారిద్దరు డిన్నర్ డేట్కు వెళ్లడం వెనక అసలు కారణం బయటకు వచ్చింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హృతిక్, సబాలు కలిశారట. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్గా ఉంటున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. అంతేకాదు తరచూ వీరిద్దరూ కలుసుకుంటుంటారట. సబా ఓ ఇండి మ్యూజిషియన్ అని, తనకు ఓ బ్యాండ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి పరిచయం తర్వాత హృతిక్ తన మ్యూజిక్ను బాగా ఇష్టపడుతున్నాడట. ఈ క్రమంలోనే సబాను తరచూ కలుస్తుంటాడని, అంతేకాదు వీరిద్దరూ కలిసి వర్క్ చేయాలనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వర్క్ గురించి చర్చించేందుకే వారిద్దరు కలిసి డిన్నర్ డేట్కు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సబా 2008లో ‘దిల్ కబడ్డి’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజా ఆమె ‘రాకేట్ బాయ్స్’లో నటించింది. ఇది త్వరలోనే సోని లైవ్లో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
నిర్మాత కొడుకుతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
'మేజర్' హీరోయిన్ సాయి మంజ్రేకర్ లవ్లో పడిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ కుమారుడు సుభాన్ నడియాద్వాలాతో డేటింగ్ చేస్తుందంటూ కొన్ని ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై స్పందించిన హీరోయిన్ అవన్నీ అసత్య ప్రచారాలుగా కొట్టిపారేసింది. తామిద్దరం చిన్ననాటినుంచే బెస్ట్ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. నిజానికి దీనిపై ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావడం లేదన్న ఆమె తనతో డేటింగ్ అంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. చిన్నప్పటి నుంచే తనమీద పుకార్లు పుట్టించడం కామన్ అయిపోయిందన్న సాయి మంజ్రేకర్ తనేంటో తన కుటుంబానికి, స్నేహితులకు తెలుసని చెప్తోంది. -
పొలిటీషియన్ మనవడితో డేటింగ్: స్పందించిన నటి!
బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ కూతురు అలయ ప్రేమలో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే మనవడు ఐశ్వరీ ఠాక్రేతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీరు రహస్య ప్రేమలో మునిగి తేలుతున్నారని కథనాలు ప్రచురిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తమ మధ్య ఉన్నది వండర్ఫుల్ స్నేహం మాత్రమేనని స్పందించింది అలయ. ఐశ్వరీ ఒక అద్భుతమైన స్నేహితుడు అని అభివర్ణించింది. ఐశ్వరీకి, తనకు మధ్య ఏదో ఉందంటూ వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవద్దని సెలవిచ్చింది. మొదట్లో ఈ వార్తలు చూసి తన బంధుమిత్రులు ఆశ్చర్యపోయారని, కానీ రానురానూ వాళ్లకు కూడా అలవాటైపోయిందని చెప్పుకొచ్చింది. కాగా అలయ, ఐశ్వరీ.. ఇద్దరూ ఒకరి బర్త్డేకు మరొకరు హాజరవుతూ, కలిసి ఫొటోలకు పోజులివ్వడంతో వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఫిక్సయ్యారంతా. అయితే అలయ తల్లి పూజా కూడా ఈ గాసిప్ను ఖాతరు చేయలేదు. ఇలాంటి పుకార్లు చాలా చూశానని లైట్ తీసుకుంది. అయినా నటీమణులకు కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కుంది అంటూ తన కూతురి లైఫ్, తనిష్టమని స్పష్టం చేసింది. చదవండి: ‘ఇది చాలా చిన్న విషయం, మరి ప్రజలు అంగీకరిస్తారో లేదో’ -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్డమ్ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్కు గుడ్బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ఐశ్వరీ ఠాక్రేతో అలయ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి
బాలీవుడ్ సీనియర్ నటి పూజ బేడీ ఐశ్వరీ ఠాక్రేతో తన కూతురు, నటి అలయ ఎఫ్ ప్రేమ వ్యవహరంపై స్పందించింది. జవానీ జానెమాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అలయా ఎఫ్ గత కొంతకాలంగా దివంగత శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే మనవడైన ఐశ్వరీ ఠాక్రేతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది అలయ తన బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఐశ్వరీ ఠాక్రేతో కలిసి దుబాయ్లో సందడి చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీ-టౌన్లో టాక్. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా బేడీ ఈ రూమర్స్పై మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అలయకు సంబంధించిన ప్రతి విషయం వార్తల్లో నిలుస్తుందన్నారు. ‘అలయ వ్యక్తిగతం జీవితంపై, ఆమె ఎవరెవరితో డేటింగ్ చేస్తుంది ఇలా చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికి తన డేటింగ్పై దాదాపు 7 వార్తలు చూశాను. ఆపై తను ఎవరితో ఉండాలనుకుంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత రోజుల్లో నటిగా ఏ వయసులో ఎలా ఉండాలి అంటూ వారిని ఓ నిర్థిష్ట పద్దతిలో అంచనా వేయనవసరం లేదు. నా సమయంలో అయితే రిలేషన్షిప్లో లేని మహిళ ఖచ్చితంగా కన్య అయి ఉండాలి, అవివాహితురాలై ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో అలాంటి పట్టింపులు లేవు. కానీ ఇప్పుడ ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కు తనకుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్ కరీనా కపూర్ను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ... కరీనా చూడండి వివాహ ఆనంతరం ఆమె ఆనందంగా లేదాని, కాబట్టి ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అలాగే సోషల్ మీడియా వల్ల ప్రేక్షకుల చూసే విధానంలో కూడా అనుహ్యా మార్పులు వచ్చాయంటూ పూజా స్పష్టత నిచ్చింది. అయితే అలయ ఐశ్వరీ ఠాక్రేతో పలు విందువినోదాలకు, లేట్నైట్ డిన్నర్లకు వెళ్లడం, అంతేగాక ఈ ఏడాది ప్రారంభంలో ఐశ్వరీతో పాటు అతడి తల్లి స్మిత ఠాక్రేతో కలిసి ఆమె ఓ రెస్టారెంట్కు వెళ్లడంతో వీరిద్దరి రిలేషపై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అంతేగాక ఆ మధ్య అలయ ఐశ్వరీ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ చేసిన కామెంట్లను కొట్లిపారెసిన సంగతి తెలిసిందే. చదవండి: నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ -
ఎల్లప్పుడూ మీతో.. లవ్ ఎమోజీ..!
బాలీవుడ్ నటులు తారా సుతరియా, అధర్ జైన్ ప్రేమలో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అధర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ‘యూ2 ముంబై’ మ్యూజిక్ కన్సర్ట్లో పాల్గొన్న అధర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశాడు. దానికి ‘నేను మీతో ఉన్నప్పుడు’ అని కామెంట్ పెట్టి తారా సుతరియాను ట్యాగ్ చేశాడు. దీనికి స్పందించిన సుతరియా అదే ఫోటోపై ‘ఎల్లప్పుడూ మీతో.. లవ్ ఎమోజీ’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో..‘నటుడు అధర్ జైన్తో మీరు డేటింగ్ చేస్తున్నారా’ అని యాంకర్ ప్రశ్నించగా.. సుతరియా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అలా అని తిరస్కరించలేదు. కానీ.. ‘మేము ఒకరికొకరు తోడుగా.. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. అధర్ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మేము బయటికి వెళ్లిన సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాం. నేను అతను ఆహార ప్రియులం’అని తారా సుతారియా సమాధానం ఇచ్చారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2లో నటించిన సుతరియా మంచి నటన కనబర్చింది. సుతరియా, అధర్ నటించిన ‘మర్జావాన్’ చిత్రం ఇటీవల విడుదలైంది. -
స్నేహం కాదు... అంతకు మించి!
బాలీవుడ్ యంగ్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పాట్నీ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా టాక్. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తను మరింత బలోపేతం చేస్తోంది ఈ జంట. ఇలా బయట కనిపిస్తూ ఉన్నా కూడా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఈ ఇద్దరూ. కానీ రీసెంట్గా జరిగిన ఓ ఈవెంట్లో టైగర్ ష్రాఫ్ను.. దిశా పాట్నీకు, మీకు రిలేషన్షిప్ ఏంటి? అని అడగ్గా ‘మేం ఫ్రెండ్స్ కంటే ఎక్కువ’ అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘దిశా, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు దానికంటే ఎక్కువ. దిశా చాలా ఇన్స్పైరింగ్, హార్డ్ వర్కింగ్ అమ్మాయి. సక్సెస్ని, టాలెంట్ని తలకెక్కించుకోని గుణం ఆమెది. ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది’’ అంటు దిశాపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంతకీ వాళ్ల ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టైగర్. -
నటితో పాండ్యా డేటింగ్.. ఫొటోలు వైరల్!
ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్తో డేటింగ్లో ఉన్నట్లు మరోసారి రుజువైంది. గత కొంతకాలం నుంచి, ముఖ్యంగా హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కృనాల్ పెళ్లి వేడుకలో హార్ధిక్, తన ప్రేయసి ఎల్లీ అవ్రామ్తో కలిసి ఫొటోలు దిగగా అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్పోర్టులో కనిపించాడు. ప్రూఫ్ దొరికింది.. ఎల్లీ, పాండ్యా డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్పోర్టులో డ్రాప్ చేసి బాయ్.. బాయ్ చెప్పేసినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు ఈ క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్ జట్టుతో ముఖాన్ని కప్పిఉంచే ప్రయత్నం చేయడం కెమెరా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య ప్రారంభంకానున్న ముక్కోణపు టోర్నీ నుంచి పాండ్యాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
పాండ్యాతో డేటింగ్పై ఎల్లీ ఏమందంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా ప్లేయర్ హార్థిక్ పాండ్యాతో సన్నిహితంగా ఉంటుందనే రూమర్లతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ భామ ఎల్లీ ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడింది. హార్థిక్తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వదంతులను ప్రస్తావిస్తూ ఏ విషయాన్నీ స్పష్టం చేయకుండా తెలివిగా దాటవేసింది. హార్థిక్ పాండ్యాతో తాను సన్నిహితంగా ఉంటానన్న రూమర్లపై తానేం మాట్లాడినా ఎవరూ నమ్మరని, దీనిపై తాను ఏదో దాస్తున్నాననే వారు భావిస్తారని అసలు విషయం చెప్పకుండా తెలివిగా వ్యవహరించింది. వీటిపై తాను మాట్లాడితే వదంతులకు మరింత ఊతం ఇచ్చినట్టే అవుతుందని.. దీనిపై తానెందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా ఎన్నో తప్పుడు విషయాలు రాస్తున్నా తాను ముందుకొచ్చి స్పష్టత ఇచ్చింది లేదని పేర్కొంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడదలుచుకోలేదని.. తానేం చెప్పినా తనను ప్రజలు విశ్వసించరని పేర్కొంది. తాను తన కుటుంబానికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని తేల్చిచెప్పింది. -
ఆ హీరోయిన్ నా గర్ల్ఫ్రెండ్ కాదు!
వాళ్లిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనే అందరూ అనుకున్నారు. కానీ రాబ్తా సినిమాకు సైన్ చేయగానే అంతా మారిపోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్లోనే వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కవుట్ అవుతోందో అందరికీ అర్థమైంది. ధోనీ సినిమాతో ఒక్కసారిగా తారాపథాన్ని అందుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్, వన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృతి సనన్లను చూసి వాళ్లిద్దరి బంధం దృఢమైనది అనే అందరూ అనుకున్నారు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వెంటనే పుట్టుకొచ్చేశాయి. రాబ్తా షూటింగ్ సమయంలో ఇది మొదలైంది. అప్పటినుంచి తెగ చక్కర్లు కొడుతోంది. సరిగ్గా అదే సమయానికి సుశాంత్ తన ఒకప్పటి గర్ల్ఫ్రెండ్ అంకితా లోఖండేతో బ్రేకప్ కావడంతో కృతితో జంట కుదిరినట్లేనని అంతా భావించారు. కానీ.. ఇప్పుడు మాత్రం అదేమీ లేదని సుశాంత్ కొట్టిపారేస్తున్నాడు. తామిద్దరం కేవలం 'మంచి స్నేహితులు' మాత్రమేనని, అంతకంటే మరేమీ లేదని చెబుతున్నాడు. ''మేమా.. లవ్బర్డ్సా.. నాకు తెలియజేసినందుకు థ్యాంక్స్'' అంటూ నవ్వేశాడు. అయితే బుడాపెస్ట్లో రాబ్తా సినిమా షూటింగ్ సమయంలో బయటకు వచ్చిన వాళ్లిద్దరి ఫొటోలు చూస్తే మాత్రం అది కేవలం స్నేహం మాత్రమే కాదని అంతా అన్నారు. అంతకుముందు అంకితతో బ్రేకప్ అయినప్పుడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంటును డిలిట్ చేసిన సుశాంత్, ఆ తర్వాత కృతి సనన్తో కలిసి తీయించుకున్న ఫొటోతో మళ్లీ అందులోకి వచ్చాడు. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. షాట్ గ్యాప్లో కూడా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారని వదంతులు పుట్టుకొచ్చాయి. కృతికి కోపం వచ్చింది.. తామిద్దరి గురించి ఇలా మీడియాలోను, సోషల్ మీడియాలోను తెగ ప్రచారం జరగడంతో కృతి సనన్కు కూడా కోపం వచ్చింది. ఇప్పటివరకు చెప్పింది చాలని, తామిద్దరికీ సహ నటులుగా ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్లు ఏమీ లేదని, అవన్నీ నిరాధార వదంతులేనని కృతి చెప్పింది. -
బాయ్ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు!
ముంబై: ప్రేమ వ్యవహారాలు బాలీవుడ్ నటీనటులకు కొత్తే కాదు. అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీగా ఎంట్రీ ఇచ్చినా అనతికాలంలోనే తానేంటో నటిగా నిరూపించుకుంది సోనమ్ కపూర్. ఫ్యాషన్ ఐకాన్ గానూ ఆమెకు పేరుంది. నీర్జా బానోతు జీవిత కథాశంతో తీసిన మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే సోనమ్ వార్తల్లో నిలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజాతో ఆమె ప్రమాయణంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా నో కామెంట్ అని బదులిస్తుంది. తాజాగా రెండు రోజుల కిందట ఈ ప్రేమ జంట ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అహుజాతో కలిసి లాస్ ఎంజెలిస్ కు వెళ్లిన సోనమ్ అక్కడ కొన్ని రోజులు షికారు చేసి ముంబైకి తిరిగొచ్చిందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ నెల 13న జరగనున్న ఫెస్టివల్ పార్టీకి, కొన్ని ఫ్యాషన్ షోలకు అహుజాతో కలిసి సోనమ్ హాజరుకానున్నట్లు ముంబై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు నెలల కిందట తన సోదరడు హర్షవర్ధన్ కు ప్రమోట్ చేసే కార్యక్రమం కోసం లండన్ వెళ్లినపుడు ఆమె వెంట ఆనంద్ అహుజా ఉన్నారు. అతడితో కలిసి షాపింగ్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఎవరైనా ఆనంద్ తో రిలేషన్ గురించి అడిగితే గుడ్ ఫ్రెండ్ అని చెప్పడం అంతకుమంచి ఏమైనా ఉందా అని సూటిగా అడిగితే మాత్రం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ ఫ్యాషన్ బ్యూటీ. -
అతనితో నేను డేటింగ్ చేయడంలేదు: శ్రియ
ముంబై: వెస్టిండీస్ క్రికెటర్ డ్వెన్ బ్రావోతో నటి శ్రియ శరణ్ డేటింగ్ చేస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆమె వివరణ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, మామూలుగా లంచ్ కోసమే రెస్టారెంట్కు వెళ్లానని చెప్పింది. తాను ప్రస్తుతం సింగిల్గా ఉన్నానని, జీవితం సంతోషంగా ఉందని శ్రియ అంది. ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి డ్వెన్ బ్రావోతో కలసి శ్రియ బయటకు వస్తున్నప్పటి దృశ్యం మీడియా కంటపడటం.. ఈ ఫొటోలు పత్రికల్లో రావడం.. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్లను శ్రియ కొట్టిపారేసింది. బాలీవుడ్ సినిమా దృశ్యంలో నటించిన శ్రియ ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. -
నేను ఆయనతో డేటింగ్ చేయడం లేదు!
ముంబై: ‘‘వన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ భామ కృతి సనన్. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నాగాచైతన్యతో కలిసి ‘దోచేయ్’ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనస్సు దోచేయడంలో విఫలమవ్వడంతో ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలకు పరిమితమైన ఈ భామ చుట్టూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ‘రబ్తా’ సినిమాలో నటిస్తున్న కృతి.. ఆ సినిమాలో తన సహ నటుడైన సుశాంత్ సింగ్ రాజ్పుత్తో డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ కథనాలను కృతి తోసిపుచ్చింది. తాను సుశాంత్ను ఏమాత్రం కలుసుకోవడం లేదని, ఇంతకంటే వివరణ ఇవ్వడానికి ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. సుశాంత్తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వెలువడుతున్న కథనాలను ట్విట్టర్లోనూ కృతి ఖండించింది. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ‘మాదారి’ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడింది. డేటింగ్ వార్తలపై స్పందించకుండా ఉండటమే మేలు అని తాను మొదట అనుకున్నానని, కానీ చిలువలు పలువలుగా కథనాలు వండి వారుస్తుండటంతో వాటిని ఖండిస్తూ తాను ట్విట్టర్లో వివరణ ఇచ్చానని, అంతకుమించి చెప్పాల్సిందేమీ లేదని ఆమె స్పష్టం చేసింది. -
ఆ డేటింగ్ వార్తల్లో నిజం లేదు: కృతీసనన్
తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోన్న కృతీసనన్ తాజాగా వార్తల్లోకెక్కాక్కిన విషయం తెలిసిందే. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో ఆమె డేటింగ్ చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ పుకార్లకు ఆమె పుల్స్టాప్ పెట్టేశారు. ఇటీవలే బ్రేకప్ అయిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజ్పుత్, అంకితా లోఖాండే. హీరో సుశాంత్, బుల్లితెర నటి అంకితా లోఖాండేలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. పెళ్లిపీటలెక్కుతారంటూ వార్తలు అలా గుప్పుమన్నాయో లేదో ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న మూవీలో నటుడు సుశాంత్ నటిస్తున్నాడు. ఆ మూవీ కంటే ముందుగా రాబ్తా మూవీకి సైన్ చేశాడు. కొన్ని నెలల నుంచి రాబ్తా కూడా షూటింగ్ జరుగుతోంది. సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్ ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. ప్రస్తుతం ‘రాబ్తా’. షూటింగ్ లో పాల్గొంటున్న సుశాంత్, కృతీసనన్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అంకితతో తెగదెంపులు చేసుకున్న సుశాంత్, కృతీతో కొత్త ప్రేమను వెతుక్కుంటున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కృతీతో పరిచయం పెరిగినప్పటి నుంచీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమెతో కలిసి దిగిన ఫొటో ఏదో ఒకటి అప్ లోడ్ చేస్తూ సుశాంత్ అంకితను అప్ సెట్ చేయడమే బ్రేకప్ కు కారణమని వార్తలొచ్చాయి. అయితే తాను సుశాంత్ సింగ్ రాజ్పుత్తో డేటింగ్లో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కృతిసనన్ ట్విట్టర్లో వివరణ ఇచ్చుకుంది. 'ఇక చాలు..సహ నటులుగా ఒకరిపై మరొకరికి ఇష్టంతో పాటూ గౌరవం కూడా ఉంది. నిరాధారమైన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. ' అంటూ కృతిసనన్ ట్విట్ చేశారు.