Dulkar Salman
-
'లక్కీ భాస్కర్' ఎఫెక్ట్.. మరోసారి ఆ తప్పు చేయను: మీనాక్షి చౌదరి
తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి మీనాక్షిచౌదరి. ఇటీవల ఆమెకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముఖ్యంగా తమిళంలో విజయ్ఆంటోనీకి జంటగా 'కొలై' చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటుడు ఆర్జే బాలాజి సరసన నటించిన 'సెలూన్' చిత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విజయ్కు జంటగా 'గోట్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో మీనాక్షిచౌదరికి పెద్దగా నటించే అవకాశం లేకపోయినా భారీ చిత్రం కావడంతో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్కు భార్యగా, ఒక బిడ్డకు అమ్మగా ఆమె నటించి షాకిచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని కూడా అందుకుంది. దీంతో ఆమె కూడా బాగా సంతోషించింది. అయితే, ఈ సినిమాలో భార్యగా, తల్లిగా నటించడం రుచించలేదట. దీంతో ఇకపై భార్య, అమ్మ పాత్రల్లో నటించరాదని నిర్ణయం తీసుకున్నారట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ 'లక్కీ భాస్కర్' చిత్రంలో దుల్కర్ సల్మాన్కు భార్యగా నటించినందుకు తనకు ప్రశంసలు లభించినా కొందరు స్నేహితులు తనను భయపెడుతున్నారని చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలా భార్యగా, తల్లికి బిడ్డగా నటించకపోవడం చాలా మంచిదనే అభిప్రాయాన్ని తన స్నేహితులు సలహా ఇచ్చినట్లు తెలిపింది. అలాంటి పాత్రలకు ఇంకా చాలా కాలం ఉందని సూచించినట్లు పేర్కొన్నారు. అలా కాకుంటే త్వరలోనే అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారని గట్టిగానే భయపెట్టారని తెలిపింది. దీంతో ఇకపై తాను హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రలను అంగీకరించరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాక్షన్తో కూడిన కమర్షియల్ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నాట్లు మీనాక్షిచౌదరి చెప్పారు.లక్కీ భాస్కర్ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఒక భార్యగా మాత్రమే కాకుండా తల్లిగా నటించడంలో తనదైన మార్క్ చూపింది. ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్ చిత్రంగా ఉండనుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్లకు పైగానే రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. -
పుట్టినరోజు విషెస్.. 'సీతారామం' హీరో భార్యని చూశారా? (ఫొటోలు)
-
కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్.. ఎవరెవరు ఎంత..?
కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.సౌత్ ఇండియా స్టార్ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు కేరళ మంత్రి పి రాజీవ్కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్ ప్యాడ్పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు. -
'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు హీరోలు..
పాన్ ఇండియా హీరో ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). దీని కోసం ప్రభాస్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. గతేడాది వచ్చిన సలార్ చిత్రం విజయంతో మంచి జోష్లో ఉన్న ప్రభాస్ మార్కెట్ కల్కి సినిమాతో మరోస్థాయికి చేరుకోవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్స్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపిక పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వీరందరితో పాటుగా క్యామియో రోల్స్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది. 'కింగ్ ఆఫ్ కోథా' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆ సినిమా సెట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయిని చెప్పిన ఆయన కల్కిలో భాగం అవుతున్నారా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన మాటలను బట్టి కల్కిలో దుల్కర్ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది. కల్కి సినిమా ఎండింగ్లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. కల్కి చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక్ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది. మే 9న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్కీ ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. 'కల్కి 2898 ఎ.డి' చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. -
నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్ చేసిన దుల్కర్
సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్.. తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్ వేయడం జరిగింది. దుల్కర్, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో దుల్కర్తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్ అని అభిమానులు గుర్తించారు. ఆ ఫోటోకు క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్మెన్ అనే ట్యాగ్లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్లో స్టైలిష్ స్మైల్తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్గా పోజులిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్లో పాపులర్ అయింది. తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్తో సురుమి ఉంది. View this post on Instagram A post shared by Dulquer Salmaan (@dqsalmaan) -
మమ్ముట్టికి మైల్స్టోన్ చిత్రంగా 'కన్నూర్ స్క్వాడ్'.. కథ ఏంటంటే?
శాండిల్వుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తాజాగా విడుదల చేసిన 'కన్నూర్ స్క్వాడ్' 100 కోట్ల క్లబ్లో చేరింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మమ్ముట్టి నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కొత్త పోస్టర్ను కూడా మమ్ముట్టి సంస్థ షేర్ చేసింది. 100 కోట్ల క్లబ్లో చేరిన మమ్ముట్టికి ‘కన్నూర్ స్క్వాడ్’ నాలుగో చిత్రం. (ఇదీ చదవండి: బిగ్ బాస్ ఎలిమినేషన్.. టేస్టీ తేజకు రిటర్న్ గిఫ్ట్.. సందీప్ పోస్ట్ వైరల్) గతంలో 'భీష్మ పర్వం', 'మధురరాజా', 'మామాంగమ్' చిత్రాలు కూడా మమ్ముట్టి 100 కోట్ల క్లబ్లో చేరిన మలయాళ సినిమాలు. ‘కన్నూర్ స్క్వాడ్’ చిత్రం విడుదలైన రోజు నుంచి థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికీ కూడా వీకెండ్లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. 'కన్నూర్ స్క్వాడ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరి మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 'కన్నూర్ స్క్వాడ్' కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమా విజయాన్ని అభినందించారు. ‘కన్నూర్ స్క్వాడ్’ చూనిట్ సభ్యులందరికీ సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. ఈ చిత్రంపై చూపిన అంతులేని ప్రేమకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. కథ ఏంటి..? కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్కు సవాల్గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆదారాలు లేని ఈ క్రైమ్ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకుతెస్తుంది. -
మ్యాడ్ బ్లాక్బస్టర్ అవుతుంది
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయం అవుతూ, సాయి సౌజన్య సహ–నిర్మాతగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఓ ముఖ్య అతిథిగా హాజరైన దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ ట్రైలర్ నిజంగానే మ్యాడ్గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్లలా లేరు. ‘మ్యాడ్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. మరో అతిథి సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ స్టోరీ లైన్ నాకు తెలుసు. సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గుంటూరు కారం’ సెట్స్లో ‘మ్యాడ్’ ప్రస్తావన విన్నాను. ‘మ్యాడ్’ చిత్రం ‘మ్యాడ్’గా ఉంటుందట’’ అన్నారు శ్రీ లీల. ‘నా ఫ్రెండ్ అనుదీప్ లేక΄ోతే నేను లేను’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
మీనాక్షి చౌదరినే కావాలని పట్టుబట్టిన త్రివిక్రమ్ భార్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రముఖ దర్శకనిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. సినిమాకు సంబంధించిన పలు పనుల్లో అతని భార్య సాయి సౌజన్య కూడా చురుకుగా పాల్గొంటున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్లో కూడా సౌజన్య పాల్గొంటోంది. ఇప్పుడు, ఆమె సితార ఎంటర్టైన్మెంట్తో కలిసి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్ని నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: రవితేజ, విజయ్ దేవరకొండ ఎవరైతే ఏంటి.. శ్రీలీల పరిస్థితి ఇదీ!) అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని టీమ్ ఎంపిక చేసింది. మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం కోసం త్రివిక్రమ్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. ఆమె ఈ చిత్రంలో ద్వితీయ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ధనుష్ తొలి తెలుగు స్ట్రైట్ మూవీ అయిన 'సార్'ను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు దుల్కర్ సినిమాను కూడా ఆయన తెరకెక్కించనున్నారు. లక్కీ భాస్కర్లో దుల్కర్కు సరిజోడిగా మీనాక్షి అయితే బాగుంటుందని సౌజన్య పట్టుబట్టి మరీ తీసుకున్నారట. ఒక సాధారణ మనిషి ఉన్నత శిఖరాలకు చేరిన అసాధారణమైన ప్రయాణంగా ‘లక్కీ భాస్కర్’ రూపొందుతోందని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ సతీమణి సౌజన్యతో మీనాక్షి చౌదరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్. -
'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి కాబట్టే ఆయన సినిమాలపై తెలుగు వారు కూడా ఆ వైపు ఓ కన్నేస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్ ఆఫ్ కొత్త (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం) సినిమా విడుదలైంది. ఇదీ చదవండి నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్కు గోల్డెన్ ఛాన్స్ ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీప్లస్హాట్ స్టార్లో సెప్టెంబర్ 22 విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకు సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీప్లస్హాట్ స్టార్లో రేపు సెప్టెంబర్ 22 విడుదల కావడం లేదు. అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్కు అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న ప్రకారం సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన ఈ మూవీ ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదులో యాక్షన్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింగా. గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్పైకి వెళ్తుందని సమచారం. -
ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది. తాజాగా నటుడు దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే తన లైఫ్లో కూడా చోటుచేసుకుందని ఓ ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కస్తూరి ఎమోషనల్ అయింది. దుల్కర్ సల్మాన్ను అసభ్యంగా టచ్ చేసిన మహిళ గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్ సల్మాన్ ఓపెన్గానే తెలిపారు. స్టేజ్పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ప్రమోషన్స్ సమయంలో చెప్పారు. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ తన బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయానని దుల్కర్ చెప్పాడు. గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఆమె తనను అభ్యంతరకరంగా తాకడంతో ఎంతో బాధనిపించిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. టచ్ చేసి అక్కా సారీ.. సారీ అంటే ఎలా ఇలాంటి ఘటనే సీనియర్ నటి కస్తూరి జీవితంలో జరిగిందని తెలిపింది. కోలీవుడ్లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్లో తనపై లైంగిక దాడి జరిగిందని ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు' అని నటి కస్తూరి చెప్పింది. కామెంట్ బాక్స్లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీలో చాలమంది నటీమణులు ఇబ్బందులకు గురైన వారున్నారు. ఇలాంటి ఘటనలపై కొందరు నటీనటులు బహిరంగంగానే ఇప్పుడు చెబుతున్నారని కస్తూరి తెలిపింది. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. కొందరు తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తూ సైబర్ దాడులకు దిగుతుంటారని పేర్కొంది. సోషల్ మీడియాలో చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురవుతున్నారు. తమ కోపాన్ని ఎక్కడ బయట పెట్టాలో తెలియడం లేదు. అందుకే కామెంట్ బాక్స్లోకి వచ్చి ఇలా రచ్చ సృష్టిస్తున్నారని కస్తూరి చెప్పింది. -
‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్ ఆఫ్ కొత్త నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కళ్ళరక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ దర్శకత్వం: అభిలాష్ జోషి నేపథ్య సంగీతం: జాక్స్ బిజోయ్ పాటలు : షాన్ రెహమాన్, బిజోయ్ సినిమాటోగ్రఫీ: నిమేష్ రవి విడుదల తేది: ఆగస్ట్ 24, 2023 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మలయాళ హీరో అయినప్పటికీ మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కింగ్ ఆఫ్ కొత్త’కథేంటంటే.. ఈ మూవీ కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకున్నట్లే పెద్ద రౌడీ అయి కోతా టౌన్ని తన గుప్పింట్లోకి తెచ్చుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. స్వతాహా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు.. ఆ ఏరియాలో ఎక్కడ పోటీలు నిర్వహించిన తన గ్యాంగ్తో కలిసి పాల్గొనేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. దీంతో అతని గ్యాంగ్ అంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. ఆ ఏరియా పోలీసు అధికారులు సైతం కన్నాభాయ్కి భయపడతారు. అయితే ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్కి చెక్ పెట్టేందుకై రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? పదేళ్ల పాటు రాజు ఎక్కడికి వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? కన్నాభాయ్ ఆగడాలకు రాజు ఎలా చెక్ పెట్టాడు? ప్రాణంగా ప్రేమించిన తారకు రాజు ఎందుకు దూరమయ్యాడు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. దానికి కారణం కథ, కథనం కొత్తగా ఉండడం. ‘కింగ్ ఆఫ్ కొత్త’లో అసలు కొత్తదనం అనేదే లేదు. అవే కత్తి పోట్లు.. తుపాకుల తూట్లు.. వెన్నుపోట్లు. కథ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించదు కానీ కథనం మాత్రం కాస్త వెరైటీగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్తో పాటు ప్రేమ, స్నేహ బంధం..ఇలా అన్ని అంశాలు ఉన్నాయి . కానీ వాటిని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఈ మూవీ కథ కోత అనే పట్టణంలో జరుగుతుంది. (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోతా అని వాడారు ) ప్రారంభమవుతుంది. కోతా పట్టణానికి కొత్తగా వచ్చిన సీఐ శావుల్కి అక్కడి ఎస్సై టోని.. రాజు, కన్నాల ఫ్లాష్బ్యాక్ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఫుట్బాల్ పోటీకి సంబంధించిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇక తారతో రాజు ప్రేమాయణానికి సంబంధించినసన్నివేశాలు రొటీన్గా సాగుతుంది. రంజియ్ భాయ్ పాత్ర మాట్లేడే ఇంగ్లీష్ నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్గా ఫస్టాఫ్లో కథ ఏమీ ఉండదు.. అలా సాగిపోతుంది అంతే. ఇక ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది ఈజీగా అర్థమవుతుంది. రాజు తిరిగి కోతాకి రావడం.. కన్నాభాయ్ మనుషులపై దాడి చేయడం..ఇలా రొటీన్గా కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్కి అరగంట ముందు వరుసగా ట్విస్టులు ఉంటాయి. కాని అవి బోరింగ్ అనిపిస్తాయి. ఇక సినిమా ముగుస్తుందిలే అని అనుకున్న ప్రతిసారి మరో మలుపు రావడం.. సాగదీతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ సల్మాన్ గ్యాంగ్స్టర్గా చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ తనదైన నటనతో గ్యాంగ్స్టర్ రాజు పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్లో అదరగొట్టేశాడు. ఇక దుల్కర్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర షబిర్ది. కన్నా అలియాస్ కన్నాభాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్ర తనది. ఇక గ్యాంగ్స్టర్ రాజు ప్రియురాలు తారాగా ఐశ్వర్య లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో సోదరి రీతూగా అనిఖా సురేంద్రన్ తన పాత్రకు న్యాం చేసింది. సీఐ శావుల్గా ప్రసన్న, ఎసై టోనీగా గోకుల్ సురేశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జేక్స్ బిజోయ్. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. బీజీఎం కారణంగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. నిమేష్ రవి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో చాలా సన్నివేశాలు మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
దుమారం రేపిన నాని వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని. దీంతో టాలీవుడ్లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు. -
'నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించారు'.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్లోనూ కనిపించింది. సీతారామం చిత్రంలో చాలా పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్లో మరింత బోల్డ్గా కనిపించి అందరికీ షాకిచ్చింది. (ఇది చదవండి: రిలేషన్షిప్పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!) అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సీతారామం మూవీ వీడియోను పంచుకుంది. సీతారామం విడుదలై ఈ రోజుకు ఏడాది పూర్తి కావడంతో మృణాల్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనను తెలుగు అమ్మాయిలా భావించి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మృణాల్ తన ఇన్స్టాలో రాస్తూ..'ప్రియమైన ప్రేక్షకులారా.. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ.. నా కలలకు మించిపోయింది. మీరు నన్ను మీ తెలుగు అమ్మాయిలా అంగీకరించారు. ఈ అందమైన ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్నీ విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని మాట ఇస్తున్నా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సీత ఉత్తమ వెర్షన్ని తీసుకురావడంలో నాకు సహాయం చేసినందుకు హను రాఘవపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొత్తం అనుభవాన్ని ఎంత చిరస్మరణీయం చేసినందుకు దుల్కర్ సల్మాన్కు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఎప్పటికీ మా సీత నువ్వే కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తోన్న 'రసవతి'..!) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
రివ్యూయర్లూ.. బహుపరాక్, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!
సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్ కిల్లర్ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్ కిల్లర్గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్ సల్మాన్ నటించారు.వచ్చే వారమే ‘చుప్’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్! అన్నట్టు నాడు ‘కాగజ్ కే ఫూల్’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్కు ఈ సినిమా నివాళి. బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్ఫ్లూయెన్స్ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు. బాల్కి అంటే ‘చీనీ కమ్’, ‘పా’, ‘పాడ్మేన్’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్’ సినిమా తీశాడు. సెప్టెంబర్ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్ వంటి సీనియర్లు, దుల్కర్ సల్మాన్ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్ థ్రిల్లర్’. ‘రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఇక్కడ ఆర్టిస్ట్ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్లో ఉన్న ట్రైలర్లో సీరియల్ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్. సన్ని డియోల్ మాత్రం పోలీస్ ఆఫీసర్గా చేశాడు. పూజా భట్ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్ను చంపుతున్న సీరియల్ కిల్లర్ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట. ఊరికే ఉండాలా? సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా? మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్కి ఒక రివ్యూయర్ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్ కిల్లర్ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్ కిల్లర్ బయలుదేరుతాడన్నమాట. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి. గురుదత్ బాధకు జవాబు దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్కు అభిమాని కావచ్చు. గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్’ (1959) బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్ చిత్రం. అంతే కాదు గురుదత్ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం. కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్ కే ఫూల్’ క్లాసిక్గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్గా ఉంది. బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్ కే ఫూల్ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్’ తీశాడు. గురుదత్ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు. -
దుల్కర్తో ప్రతి ఏడాది ఒక మూవీ తీద్దామని చెప్పా: అశ్వినీదత్
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను’అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది. ►ప్రేక్షకులు థియేటర్కి రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ► ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను రాఘవపూడి ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది. ► సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను చాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ► హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టు ఉంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. ► మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. సుమంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ► ఈ సినిమా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్గా ఉంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలవుతుంది. ► ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలవుతుంది. -
అలా అయితే మంచి పాట వస్తుంది : విశాల్ చంద్రశేఖర్
‘‘నేను ఏ సినిమా చేసినా ఆ కథ వినను.. స్క్రిప్ట్ పూర్తిగా చదువుతాను. అప్పుడే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఓ అవగాహన వస్తుంది. మంచి సంగీతం కుదరాలంటే కథ మ్యూజిక్ని డిమాండ్ చేయాలి. అప్పుడే మంచి పాట వస్తుంది. అలా మ్యూజిక్ని డిమాండ్ చేసిన కథ ‘సీతారామం’. ఈ చిత్రకథ ఇచ్చిన స్ఫూర్తితో అద్భుతమైన సంగీతం ఇచ్చాను’’ అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ బారోట్ అనే సంగీత దర్శకుడు నాకు స్ఫూర్తి. తమిళ్లో ప్రభుదేవా హీరోగా ‘వీఐపీ’ అనే సినిమాతో పాటు మరో చిత్రానికి సంగీతం అందించారాయన. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్గారి ట్రూప్లో మెయిన్ డ్రమ్మర్. హను రాఘవపూడిగారితో ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం బాగుంటుంది. ‘సీతారామం’ వంటి చాలా గొప్ప కథ రాశారు. ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్... ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజీయన్స్ కలిసి నేపథ్య సంగీతం కోసం పని చేశారు. ఈ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ పాటని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు రాశారు. ఈ పాట కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ్.. ఇలా అన్ని భాషల్లోని అలంకారాల గురించి నాకు వివరించారు. పాటల రచయితలు కేకేగారు, అనంత్ శ్రీరామ్లతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలని డబ్బింగ్లా కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్గా చేశాం. మెలోడీ పాటలు నా బలం. నా తర్వాతి సినిమా మాధవన్గారితో ఉంటుంది.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
సినిమా కలకాలం నిలుస్తుంది – రమేశ్ ప్రసాద్
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత ఎల్వీ ప్రసాద్) మూకీ సినిమా అప్పటినుంచి సినిమాల్లో భాగమయ్యారు. ఆ విధంగా మా ప్రసాద్స్ సంస్థకి సినిమాతో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో సినిమా గడ్డు పరిస్థితి ఎదుర్కొనడం చూశాం. ప్రేక్షకుల ప్రేమతో ఇండస్ట్రీ ఈ కష్టకాలాన్ని అధిగమించింది. సినిమా కలకాలం నిలుస్తుంది. ‘సీతారామం’ టీమ్కి శుభాకాంక్షలు’’ అని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. ఇందులో రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రలు చేశారు. 1965, 80 నేపథ్యంలో సాగే ప్రేమకథగా హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సోమవారం జరిగిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేశ్ ప్రసాద్ అతిథిగా పాల్గొన్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘అందరూ నన్ను రొమాంటిక్ హీరో అంటుంటే విసుగొచ్చి ఇక ప్రేమకథలు చేయకూడదనుకున్నాను. హనుగారు చెప్పిన ‘సీతారామం’ అద్భుతమైన ప్రేమకథ. క్లాసిక్ ఎపిక్ లవ్ స్టోరీ కాబట్టి చేశాను’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన అఫ్రిన్ పాత్ర రెబల్. నా పాత్ర పై ఆడియన్స్కి కోపం వచ్చినా ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్తో కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే’’ అన్నారు రష్మికా మందన్నా. ‘‘ఈ చిత్రంలో మ్యాజికల్ రొమాన్స్ వుంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. సుమంత్, హను రాఘవపూడి మాట్లాడారు. -
ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా : హను రాఘవపూడి
‘నాకు పాత పుస్తకాలు కొనుక్కోనే అలవాటు ఉంది. అలా ఒక్కసారి కోఠిలో కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. అతను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా . ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా’ అని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేయడానికి కారణం? మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానాతో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. సీతారామంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. సీతారామం కథకు ప్రేరణ? నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపింగదచింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. తెలుగులో ఇంత మంది ఉండగ దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ? విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది.ఇందులో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు. పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ? పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే. 'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ? ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ ఉంటుంది. రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది ? రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది. వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ) కొత్తగా చేయబోతున్న సినిమాలు ? బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది. -
సింగర్గా ఎందుకు అవకాశాలు రాలేదో తెలియదు: ఎస్పీ చరణ్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లపైనే అవుతోంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఒకేలా పాడాను. అయితే కొందరు నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) వాయిస్లా నా వాయిస్ ఉందన్నారు. నాకు వచ్చే పాటలను నా శక్తి మేరకు బాగా పాడాలని ప్రయత్నం చేస్తాను’’ అన్నారు గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఓ సీత..’, ‘ఇంతందం..’ పాటలను ఎస్పీ చరణ్ పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ చెప్పిన విశేషాలు.... ► హీరో దుల్కర్ సల్మాన్కు నేను పాడటం ఇదే తొలిసారి. ‘సీతా రామం’ చిత్రంలో ‘ఓ సీత’, ‘ఇంతందం..’ పాటలను పాడటం చాలా సంతోషంగా ఉంది. చిరకాలం నిలిచిపోయే పాటలివి. ‘ఓ సీత..’ పాటకు అనంత శ్రీరామ్, ‘ఇంతందం..’ పాటకు కేకే (కృష్ణకాంత్) మంచి సాహిత్యం అందించారు. మెలోడిపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ►ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన నేను ఆ తర్వాత ఇదే స్పీడ్ను ఎందుకు కొనసాగించలేకపోయానన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా అందరి సినిమాల్లో నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి... జనాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత ఓ సింగర్గా నాకు ఎందుకు అవకాశాలు కుదర్లేదో అయి తే తెలియదు. నిర్మాణ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను పాట పాడలేననే మాట ఎప్పుడూ చెప్పలేదు. రికార్డింగ్కు ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారీ నేను అందుబాటులోనే ఉన్నాను. ► సంగీతంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాను నేను. పాట పట్ల నా అప్రోచ్ అయితే మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. దర్శక–నిర్మాతలు కూడా కొత్త సంగీత దర్శకులు, సింగర్స్ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నాన్నగారు చేసిన టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. భవిష్యత్లో ప్రతిభ గల సింగర్స్ మరింతమంది వస్తారని ఆశిస్తున్నాను. ► తమిళంలో ఓ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాను. సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టే ఆలోచన నాకు ఇప్పట్లో లేదు. -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్తో వెబ్సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్లో దుల్కర్తోపాటు రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్లో సోనాక్షి పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్తోనే కెరీర్ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
దుల్కర్ సల్మాన్, రష్మికల కొత్త చిత్రం టైటిల్ ఇదే
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ని వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు నిర్మాతలు. ఈ చిత్రానికి ‘సీతారామం’అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్ షేడ్స్ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా.. యుద్దంలో మద్రాస్ ఆర్మీ ఆఫసర్ లెఫ్ట్నెంట్ రామ్( ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ పాత్ర పేరు)కు రష్మిక సహాయం చేస్తుంది. ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అనే సుమంత్ వాయిస్ ఓవర్ ప్రారంభమైన ఈ స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. -
రష్మిక బర్త్డే: దుల్కర్ సల్మాన్తో జతకట్టిన రష్మిక, ఫస్ట్లుక్ అవుట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేటితో(ఏప్రిల్ 5) 26వ వసంతంలోకి అడుగు పెడుతుంది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తూ ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఆమె ‘పుష్ప 2’తో పాటు హిందీలో అమితాబ్ బచ్చన్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే రణ్బీర్ కపూర్-సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న ఏనిమల్ వరల్డ్ చిత్రంలో హీరోయిన్ చాన్స్ కొట్టెసింది. ఇప్పుడు తాజాగా ఆమె మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో జతకట్టబోతోంది. ఈ రోజు ఆమె బర్త్డే సందర్భంగా ఈ మూవీలోని తన ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఆమె పాత్ర పేరు కూడా ప్రకటించారు. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిగ్ లవ్ స్టోరీ తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇందులో ఆమె అఫ్రీన్ అనే కశ్మీర్కు చెందిన ముస్లిం యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్గా మారింది. (చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ పై అక్షయ్ భార్య సంచలన వ్యాఖ్యలు) -
ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
ఈ మధ్య ఎన్ఎఫ్టీ (NFT) పదాన్ని తరచుగా వింటున్నాం. పలు సెలబ్రిటీలు ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో భారతదేశంలో ఎన్ఎఫ్టీకి క్రేజ్ పెరిగింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సన్ని లియోన్ ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టడంతో వాటికి మరింత డిమాండ్ పెరిగింది. ఎన్ఎఫ్టీ అంటే నాన్ పంగీబుల్ టోకెన్స్. ఇవీ ఒక రకమైన డిజిటల్ ఆస్తులు. బ్లాక్చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఓనర్షిప్ ఇస్తారు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలు, ఇతర సేకరణలను ఎన్ఎఫ్టీలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్లే మరెవ్వరూ దీనిపై ఓనర్షిప్ క్లైమ్ చేసుకోలేరు. అలా చేయాలంటే వాటిని కొనుగోలు చేయాల్సిందే. వీటిని సేకరణ కర్తలు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సెకండరీ మార్కె్ట్లో విక్రయించుకోవచ్చు. ఎన్ఎఫ్టీలను ప్రత్యేకంగా తయారు చేయాలా? కొద్ది మందికే విక్రయించాలా అన్నది క్రియేటర్ ఇష్టం. అయితే ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన టాప్ ఇండియన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. 1. అమితాబ్ బచ్చన్ బియాండ్లైఫ్.క్లబ్తో పెరుతో తన సొంత ఎన్ఎఫ్టీలను ప్రారంభించిన మొదటి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. రితీ ఎంటర్టైన్మెంట్ వారి బియాండ్లైఫ్.క్లబ్, గార్డియన్లింగ్.ఐవోతో భాగస్వామ్యమైంది. గ్లోబల్ సెలబ్రిటీలు, ఆర్టిస్తులు, అథ్లెట్లకు వారి వారి చిత్రాలను ఎన్ఎఫ్టీలుగా (NFTs.Movie) మార్చడానికి ఈ ఫ్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీ వేలంతో మూడు సెట్ల కలెక్షన్లతో లైవ్లోకి వెళ్లారు. 2. సన్నీ లియోన్ సన్నీ లియోన్ నాన్-ఫంగిబుల్ టోకెన్ల (NFT) మార్కెట్ ప్లేస్లోకి ప్రవేశించిన మొదటి భారతీయ నటిగా అవతరించింది. ఈమె మిస్ఫిజీ పేరుతో ఎన్ఎఫ్టీ తీసుకుంది. 3. దుల్కర్ సల్మాన్ మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ తన చిత్రం కురుప్ కోసం గత నెలలో ఎన్ఎఫ్టీ సేల్ను నిర్వహించడానికి అబుదాబికి చెందిన టెక్నాలజీ కంపెనీ అంబర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 4. రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన చిత్రం డేంజరస్ను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా విక్రయించబడుతోందని ఆర్జీవీ ట్విటర్లో పేర్కొన్నారు. 90 నిమిషాల ఈ ఫీచర్ ఫిల్మ్ను ఎన్ఎఫ్టీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంచనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేశారు. 5. విశాల్ మల్హోత్ర టీవీ హోస్ట్, నటుడు విశాల్ మల్హోత్ర నాన్ ఫంగిబుల్ టోకెన్ (NFT)ను ఆర్టిస్ట్ ఇషితా బెనర్జీతో కలిసి విడుదల చేశారు. అలా ఒక ఆర్టిస్ట్తో కలిసి విడుదల చేసిన మొదటి భారతీయ నటుడు విశాల్ మల్హోత్ర. ఈయన తన 25 ఏళ్ల బాలీవుడ్ కెరీర్లో ఎన్నో ప్రజాధరణ పొందిన పాత్రలు చేశారు. వీరితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రాపర్ రాఫ్తర్, సింగర్ మికా సింగ్, యూట్యూబర్ అమిత్ బదాన ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి దిగనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు, ప్రజలు డిజిటల్ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్కాయిన్, ఈథిరియం, డోగ్ కాయిన్ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. -
దుల్కర్ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ తెరకెక్కి నవంబర్ 12న విడుదలకు సిద్దమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల విడుదలైన ‘కురుప్’ ట్రైలర్కు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీ విడుదలపై హీరో దుల్కర్ సల్మాన్, చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తిక వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ‘కురుప్’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూరైనప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొదట ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారట. అంతేగాక డిజిటల్ విడుదలకు వారికి ఓటీటీ నుంచి రూ. 40 కోట్ల డీల్ కూడా కుదిరినట్లు వినికిడి. చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు అయితే దుల్కర్ సల్మాన్ తండ్రి, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమా చూసి ఓటీటీ డీల్ను రద్దు చేసి థియేటర్లో విడుదల చేయమని మేకర్స్ను ఒప్పించాడట. తండ్రి చెప్పడంతో వెంటనే రూ. 40 కోట్ల ఓటీటీ ఒప్పందాన్ని దుల్కర్ సల్మాన్ రద్దు చేసుకుని థియేటర్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ చిత్రాన్ని స్యయంగా దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. చదవండి: తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో -
బాల్కీ ప్రయోగం..సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్తో థ్రిల్లర్ మూవీ
చీనీ కమ్, పా, ప్యాడ్ మ్యాన్... ఇలా బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ తెరకెక్కించినవన్నీ విభిన్న చిత్రాలే. హిందీ సినిమా ఒక రూట్లో వెళుతుంటే బాల్కీ వేరే రూట్లో వెళ్లి సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు చార్ (నాలుగు) జోర్ చూపించడానికి రెడీ అయ్యారు. సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్, పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ నలుగురూ ప్రధాన తారాగణంగా బాల్కీ ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించనున్నారు. ‘‘సన్నీ డియోల్ లాంటి అద్భుత నటుడితో ఓ కొత్త అడ్వంచర్ మూవీ చేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమా కెరీర్లో ఇది ఓ కొత్త కోణం చూపించే సినిమా అవుతుంది. అలాగే ఇండియన్ సినిమాలో ఉన్న చార్మింగ్ యాక్టర్స్లో దుల్కర్తో సినిమా చేయడం ఓ ఆనందం. విలక్షణ నటి పూజా భట్ ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోరు. ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం ఓ మంచి విషయం. ఇక, ‘స్కామ్ 1992’లో అద్భుతంగా నటించిన శ్రేయా ధన్వంతరి ఈ సినిమాలో భాగం కావడం మరో మంచి విషయం’’ అని బాల్కీ అన్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దుల్కర్ సల్మాన్తో ‘తూఫాన్’ భామ రొమాన్స్
‘సూపర్ 30’, ‘బాట్లా హౌస్’, ‘తూఫాన్’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు మృణాల్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమా బ్యానర్పై అశ్వినీ దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర లుక్ని విడుదల చేశారు. ‘‘హను రాఘవపూడి ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన ప్రేమ కోణాన్ని చూపించబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. Proud to Introduce @mrunal0801 as Sita ❤️ Happy birthday Sita.. u will conquer hearts... Here's the Glimpse: https://t.co/BHCX1vF3p1#declassifiessoon @dulQuer @hanurpudi @Composer_Vishal@AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/mENkXh0aKS — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 1, 2021 -
దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్ ప్రత్యేక పాత్ర!
మామూలుగా హీరోకి దీటైన విలన్ అంటారు కదా.. హీరోకి దీటైన హీరో అన్నారేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సుమంత్ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. హీరోగా పాతిక సినిమాలకు పైగా చేసిన సుమంత్ ప్రత్యేక పాత్ర చేయడమేంటీ అనుకోవచ్చు. ఇది హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్ర కావడంతో ఒప్పుకున్నారట. 1964 బ్యాక్డ్రాప్లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ బహు భాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. మరోవైపు సుమంత్ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు సిద్ధమైంది. -
భార్యలతో మాలీవుడ్ స్టార్ హీరోలు.. ఫోటో వైరల్
మలయాళ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్లు ఒకచోట చేరారు. గెట్ టు గెదర్ పార్టీలో భార్యలతో కలిసి దర్శనమిచ్చారు. ఈ ఫోటోలను హీరోయిన్ నజ్రియా నజిమ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. మలయాళ స్టార్ హీరోలంతా ఒకచోట చేరడంతో ఈ ఫోటో ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ స్వీట్ మూమెంట్ని నజ్రియా మిర్రర్ సెల్ఫీలో బంధించారు. అయితే ఈ గెట్ టు గెదర్ లో అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లో కనిపించారు. ఇక ‘ట్రాన్స్’లో చివరిసారిగా కనిపించిన నజ్రియా నాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. ఇక ‘కోల్డ్ కేస్’ విడుదల కోసం హీరో పృథ్వీరాజ్ సన్నద్ధమవుతుండగా, ‘కురూప్’, ‘సెల్యూట్’ చిత్రాల రిలీజ్ కోసం దుల్కర్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) చదవండి : కమెడియన్ అలీ సినిమాకు ప్రభాస్ ప్రమోషన్స్ ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్బై చెప్పనుందట! -
అడుగు బయటపెట్టారు
కోవిడ్ వల్ల ఏర్పడ్డ లాక్డౌన్లో అందరూ దాదాపు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆ సమయంలో స్వీయ సవాల్ విసురుకున్నారు మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా ఎన్ని రోజులు ఉండగలనన్నది ఆ చాలెంజ్. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నటుడు దుల్కర్ సల్మాన్ కొన్ని రోజుల క్రితం పంచుకున్నారు. ‘ఇప్పటికే నాన్న ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టి 150 రోజులయింది’ అని పేర్కొన్నారు దుల్కర్. దాదాపు తొమ్మిది నెలలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేదు మమ్ముట్టి. సుమారు 275 రోజులు ఇల్లు కదల్లేదు ఆయన. తాజాగా స్వీయ నిర్భంధాన్ని బ్రేక్ చేశారు. శుక్రవారం ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు మమ్ముట్టి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. త్వరలోనే సినిమా షూటింగ్స్లోనూ పాల్గొననున్నారట మమ్ముట్టి. -
ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని బాలు కుమారుడు చరణ్ తెలిపారు. అయితే బాలసుబ్రహ్మణ్యంకు ఈనెల 5న కరోనా బారిన పడిన విషయంతెలిసిందే. గత పది రోజులుగా చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, తాజాగా ఆయన సతీమణి సావిత్రి బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా get well soon అంటూ ప్రార్థిస్తున్నారు. (ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ‘ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బాలసుబ్రమణ్యం సార్ గురించి వినడానికి చాలా భయంగా ఉంది. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ‘అనారోగ్యం నుంచి కోలుకొని మీ డివైన్ వాయిస్తో మమ్మల్ని ఆశీర్వదించడానికి తిరిగి వస్తారని మాకు తెలుసు.ఎస్పీబీ కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి’ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. వీరితోపాటు ఏఆర్ రెహమాన్, ఇళయ రాజా, చిత్ర, బోణీ కపూర్, భారతీరాజా, కొరటాల శివ, విజయ్ ఆంటోని, శేఖర్ కపూర్, ధనుజ్, యువన్ శంకర్ రాజా వంటి వారంతా బాలు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. Dearest Brother SP Balu garu , My hearty prayers and wishes for your Speedy recovery. — Chiranjeevi Konidela (@KChiruTweets) August 14, 2020 Please pray for SPB sir ! 🙏🙏🙏🙏🙏 — Dhanush (@dhanushkraja) August 14, 2020 Lets all Strongly Pray to GOD for our GOD OF SINGING.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️🎶🎶🎶🎶#SPBalasubrahmanyam sirr We all know U wil come back STRONG & FINE 🙏🏻🙏🏻 To bless our LIVES with ur DIVINE VOICE as always Lov U sir .. Ur Health wil be Pefectly Fine..❤️ — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 14, 2020 Praying for the Speedy recovery of Legendary Thiru S P Balasubrahmanyam.#SPBalasubrahmanyam — Boney Kapoor (@BoneyKapoor) August 14, 2020 S P B sir is a strong & positive person. I am sure he will come out of the present situation. Prayers for Sir’s speedy recovery. 🙏#SPB — K S Chithra (@KSChithra) August 14, 2020 Praying for the legend #SPBalasubrahmanyam sir for a quick recovery. The mike awaits your mighty voice. Come back soon sir 🙏 — koratala siva (@sivakoratala) August 15, 2020 -
అడుగు బయటపెట్టేది లేదు!
మమ్ముట్టికి సవాళ్లంటే ఇష్టమట. తాజాగా ఓ సవాల్ ను తన మీద తానే విసురుకున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మమ్ముట్టి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదట. ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి సుమారు 150 రోజులు అయింది. ఇలా బయటకు రాకుండా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండగలనో చూస్తాను అని ఓ చిన్న ఛాలెంజ్ చేసుకున్నారట. ‘సరదాగా ఓ డ్రైవ్ కి వెళ్లి రండి’ అని ఇంట్లోవాళ్లు అన్నప్పటికీ ‘నో’ అనేశారట మమ్ముట్టి. ఇలా తండ్రి బయటకు అడుగుపెట్టేది లేదని, ఇంటిపట్టునే ఉంటున్న విషయాన్ని మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ సరదాగా షేర్ చేసుకున్నారు. -
డైరీ ఫుల్
హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్ఫామ్లో ఉన్నారు. టాలీవుడ్లో ప్రభాస్తో ఓ సినిమా (ఓ మై డియర్), అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలో పూజ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్ కొట్టేశారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్గా నటించేందుకు ఓకే అన్నారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాలోనే దుల్కర్, పూజ జంటగా నటించనున్నారని సమాచారం. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ నటించనున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలోనూ పూజయే హీరోయిన్ అట. సో.. పూజ డైరీ ప్రస్తుతానికి ఫుల్ అన్నమాట. -
దుల్కర్కు జోడిగా బుట్టబొమ్మ!
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి సక్సెస్ను సొంతం చేసుకున్న ఈ భామకు వరుసపెట్టి సినిమాలు ఒళ్లో వాలుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తున్న పూజా త్వరలో దుల్కర్ సల్మాన్తో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ ఫేం హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. (ప్రభాస్ 20 మూవీ ఫోటోలు వైరల్) దుల్కర్కు తెలుగులో ఇది రెండో సినిమా. ఇంతక ముందు ‘మహానటి’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ బుట్టబొమ్మను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీడియో కాల్ ద్వారా కథ విన్న అనంతరం సినిమాలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. (బిగ్బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?) వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చరుకుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక కొరియోగ్రాఫర్ బృందా దర్శకత్వం వహిస్తున్న హే సినిమికాలో దుల్కర్ నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. అలాగే పూజ హెగ్డే చేతిలో ‘ప్రభాస్ 20’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కి జోడిగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలోనూ పూజా నటిస్తున్నారు. (‘నేను చచ్చిపోలేదు.. బతికే ఉన్నా’) -
‘నువ్వు ఎప్పటికీ మా చిన్నారివే డార్లింగ్ మేరీ’
లాక్డౌన్ కాలాన్ని నటుడు దుల్కర్ సల్మాన్ తన భార్య అమల్ సుఫియా, కూతురు మరియం అమీరా సల్మాన్తో ఉల్లాసంగా గడుపుతున్నారు. మంగళవారం ఈ మలయాళ నటుడు కూతురు మూడవ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలో దుల్కర్ తన కూతురుకి బర్త్డే విషెస్ తెలుపుతూ.. కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్టు చేశారు. (అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు) ‘హ్యాపీయెస్ట్ బర్త్డే డార్లింగ్ మేరీ.. ‘నేను ఇప్పుడు పెద్ద అమ్మాయిని’ అని నువ్వు చెప్పింది నిజమే. నువ్వు త్వరగా పెరుగుతూ, మాటలు పూర్తిగా నేర్చుకుంటున్నావు. నీకు మూడు సంవత్సరాలు నిండాయి. పెద్దదానివి అయిపోయావు. నీ యువరాణి దుస్తుల్లో చకాచకా తిరుగుతున్నావు. మాకు కథలు చెబుతున్నావు. అవును నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి. సొంతంగా నడవడం నేర్చుకున్నావు. ఇప్పుడే పరుగెత్తుతున్నావు. అవును నువ్విప్పుడు పెద్ద అమ్మాయివి. కానీ మాకు నువ్వింకా చిన్నపిల్లలాగే ఉన్నావు. ఎప్పుడైతే మేము నిన్ను మొదటిసారి చూశామో ఆ రోజులా. ఆ రోజు మేము తొలిసారి ఓ దేవతను చూశాము. నువ్వు ఎదుగుతున్నా.. మాకు చిన్నపాపలాగే మాకు కనిపిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మా చిన్నారివే. నువ్వు పెద్దదానివి అయ్యావని ప్రపంచమంతా చెప్పినా.. మాకు నువ్వు చిన్న పిల్లవే డార్లింగ్ మేరీ’’. అంటూ కూతురిపై తన ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్) చదవండి: (కత్రినాపై రణ్బీర్కు ఎంత ప్రేమో!’) View this post on Instagram Happiest birthday darling Marie. You’ve got every one of us acting your age while you insist, “Im a big girl now!” Maybe you’re right. You’re fast growing up, speaking in full sentences now. 3 years old you’re a big girl now. Twirling in your princess dresses. Creating your own games now. Telling us stories, you’re big girl now. Walking on your own. Running now. Learning how to jump, you’re a big girl now. Slow down darling Marie, be a baby still. Like the day we saw you for the first time. Held you and heard your cries for the first time. The day they thronged the hallways, to meet an angel for the first time. Be that baby girl still, we havnt had enough. Though forever more you’re our baby. Even when the world says, she’s a big girl now. Don’t rush, darling Marie, stay our baby girl still. #pappasattemptatapoem #youhavethateffectonus #happymaryamday #myangelbaby #cantbelieveit #youarethreeyearsold #loveyoutothemoonandback #ourbabygirl A post shared by Dulquer Salmaan (@dqsalmaan) on May 5, 2020 at 2:22am PDT -
థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది
దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, రక్షణ్, నిరంజని అహతియాన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. తమిళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లయడిత్తా’గా విడుదలైంది. వయాకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసఫ్ ఫిలిమ్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రంతో దేశింగ్ పెరియస్వామి దర్శకునిగా పరిచయమయ్యారు. తెలుగులో కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్ కమలాకర్ రెడ్డి, జనార్థన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవమీనన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బుధవారం ఈ చిత్రం సక్సెస్మీట్ను హైదరాబాద్లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన 25 సినిమా ఇది. తమిళంలో, తెలుగులో ఒకేసారి విడుదలైంది. చూసినవాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్ (డిజిటల్)లో చూసే సినిమా కాదిది. థియేటర్లో చూడాల్సిన చిత్రం. నన్ను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. డా. రవికిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి కంటెంట్ నచ్చటంతో కేఎఫ్సి వాళ్లతో కలిసి తెలుగులో విడుదల చేశాను. ప్రేక్షకుల ఆదరణతో కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపించింది’’ అన్నారు. రీతూవర్మ మాట్లాడుతూ– ‘‘చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో మీ ముందున్నాను. ఈ సినిమాకి దర్శకుడు, కెమెరామెన్ రియల్ హీరోలు’’ అన్నారు. అనీష్ కురువిల్లా, రక్షణ్, నిరంజని, కె.యం భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. -
నాలో మార్పు తెచ్చింది
‘‘కొన్ని సినిమాల చిత్రీకరణ పూర్తవగానే ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో జ్ఞాపకాల్ని సంపాదించుకున్నాం అనే అనుభూతి మిగులుతుంది. ‘కురుప్’ చిత్రం ఓ మంచి జ్ఞాపకం’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. దుల్కర్ సల్మాన్ హీరోగా శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కురుప్’. శోభితకి ఇది రెండో మలయాళ చిత్రం. కేరళ ప్రాంతంలో నివసించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ – ‘‘కురుప్’ నా తొలి పూర్తి స్థాయి మలయాళ (గతంలో ‘మూతాన్’లో గెస్ట్ రోల్ చేశారు) చిత్రం. ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. దానికి కారణం ఈ ప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్గా, క్రియేటివ్గా నాలో వచ్చిన మార్పు. నా పర్సనల్ క్యారెక్టర్ని ప్రభావితం చేసిన ప్రయాణమిది. ఇది మర్చిపోలేని ప్రయాణం’’ అన్నారు. -
ప్రాణం తియ్యొద్దే
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. ఈ సినిమాకు తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తెలుగు హక్కులను దక్కించుకున్న కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ అనే పాటను విడుదల చేశారు. సమ్రాట్ చారి, పూర్ణాచారి సాహిత్యం అందించారు. ‘‘మొబైల్ అప్లికేషన్ డెవలెప్పర్ సిద్ధార్థ్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డ సిద్దార్థ్, అతని స్నేహితుడు కల్లీస్ ఏం చేశారు? వారు చేసిన పనుల వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అన్నదే కథ’’ అన్నారు దేసింగ్ పెరియసామి. -
డైరెక్షన్ వైపుకి స్టెప్స్?
నృత్య దర్శకురాలిగా ఎన్నో వందల సినిమాలకు పని చేశారు బృందా. రజనీకాంత్, కమల్హాసన్, మోహన్ లాల్, విజయ్, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్తో ఫ్యాన్స్ విజిల్స్ కొట్టే డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు బృందా. ఇప్పుడు బృందా మాస్టర్ డైరెక్షన్ వైపు స్టెప్స్ (అడుగులు) వేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఓ తమిళ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. -
14 ఏళ్ల తర్వాత
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపీ. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్గా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. -
రౌడీకి జోడీ
దుల్కర్ సల్మాన్ ఓ పెద్ద క్రిమినల్గా మారబోతున్నారు. తనకు పార్టనర్గా శోభితా ధూళిపాళ రెడీ అయ్యారు. ఇదంతా మలయాళ సినిమా ‘కురుప్’ కోసమే. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్ సుకుమార కురుప్. అతని జీవితం ఆధారంగా ‘కురుప్’ తెరకెక్కుతోంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శోభితా కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. శోభితకి ఇది రెండో మలయాళ సినిమా. నివీన్ పౌలీతో శోభిత చేసిన ‘మూతాన్’ రిలీజ్కు రెడీ అయింది. -
అదృష్ట దేవత
చేసే పని కలసి రావాలని కొందరు రకరకాల నమ్మకాలను అనుసరిస్తుంటారు. ‘నేనుంటే ఇంకేదీ అవసరం లేదు. నేను అదృష్టాన్ని’ అంటున్నారు సోనమ్ కపూర్. దుల్కర్ సల్మాన్, సోనమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’. అభిషేక్ శర్మ దర్శకుడు. క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ సాగుతుంది. దుల్కర్ క్రికెటర్ పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల టీమ్కు లక్కీ చార్మ్గా సోనమ్ కనిపిస్తారట. సోనమ్ లుక్ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘జోయా సోలంకీ ఉండగా నిమ్మకాయలు, మిరపకాయలు ఎవరికి కావాలి? ఇండియాకి లక్కీ చార్మ్ నేను. మ్యాచ్లు గెలిపిస్తాను’’ అని తన ఫస్ట్లుక్ ఫొటోకి క్యాప్షన్ చేశారు సోనమ్. ‘జోయా ఫ్యాక్టర్’ సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. -
డైరెక్షన్ మార్చారు
అనుపమా పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. ఇదేదో కొత్త సినిమాలో పాత్ర అనుకోకండి. నిజంగానే అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్త జాబ్లోకి మారారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ విషయం గురించి అనుపమ చెబుతూ– ‘‘ఇది సరికొత్త ప్రారంభం. షంజూ జేబా అనే ట్యాలెంటెడ్ దర్శకుడికి అసిస్టెంట్గా చేయడం సంతోషంగా ఉంది. ఈ కొత్త రోల్ పట్ల చాలా ఎగై్జటెడ్గా, ఆనందంగా, నెర్వస్గా ఉన్నాను. ఈ టీమ్ పట్ల పూర్తి నమ్మకంగా ఉన్నాను. మా సినిమాకు మీ అందరి బ్లెసింగ్స్ కావాలి’’ అన్నారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న ఈ బ్యూటీ పూర్తి స్థాయి దర్శకురాలిగా కొనసాగుతారా? లేదా? వేచి చూడాలి. ప్రస్తుతం బెల్లం కొండ సాయిశ్రీనివాస్తో ‘రాక్షసుడు’ సినిమాలో నటిస్తున్నారు అనుపమ. -
వాళ్లు చెబితే ఒప్పుకుని తీరాలి
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరేళ్లు అవుతుంది. ఐదు సినిమాలు చేశాను. ప్రకాశ్రాజ్, రావు రమేశ్, మోహన్లాల్ వంటి గొప్ప నటులతో నటించాను. మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్టర్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని అల్లు శిరీష్ అన్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం ‘ఏబీసీడీ’. డి. సురేష్బాబు సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించారు. మలయాళంలో దుల్కర్సల్మాన్ నటించిన ‘ఏబీసీడీ’ (2012) సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన సంగతులు. ► మలయాళ ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమా చూడమని రామ్చరణ్ చెప్పారు. దర్శకుడు మారుతి, వరుణ్ తేజ్ ఇలా ఇండస్ట్రీలోని నా సన్నిహితులు కూడా ఈ సినిమా గురించి చెప్పారు. సాధారణంగా అందరూ రీమేక్ ఈజీ అంటారు కానీ అంత ఈజీ కాదు. తెలుగు కోసం కొన్ని మార్పులు చేశాం. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఒరిజినల్ సినిమాలో ఉన్నవి ఉంటాయి. సోల్ని మాత్రమే తీసుకున్నాం. సంజీవ్ బాగా తీశారు. ► ఈ సినిమాలో నా పాత్ర పేరు అవి. అమ్మ ప్రేమ చాటున గారాభంగా పెరుగుతున్న అవికి అంతగా డబ్బు విలువ తెలియదు. ఆ విలువ తెలియడానికి అవి తండ్రి తనను ఇండియాకి పంపి, మధ్యతరగతి జీవితం గడిపేలా ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో అవి లైఫ్లో ఎలాంటి విషయాలను నేర్చుకున్నాడు అన్నదే కథ. ► నాకు, భరత్కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్ కాపీని చూశాం. సినిమా పట్ల కాన్ఫిడెంట్గా ఉన్నాం. ► నేను ముంబైలో నాలుగేళ్లు ఉన్నాను. అక్కడ నేను ఆల్మోస్ట్ నార్మల్ జీవితాన్ని గడిపాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేసేవాణ్ణి. సినిమాలు చూడాలనుకున్నపుడు అక్కడ మార్నింగ్ షో అయితే టికెట్ రేటు తక్కువగా ఉంటుందని ఆ షోలకు వెళ్లాను. ముంబైలో నేను గడిపిన ఆ నాలుగేళ్లు నాలో చాలా మార్పు తెచ్చాయి. ఆ తర్వాత స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్లినప్పుడు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త తీసుకున్నాను. ► నేను ‘కొత్తజంట’ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్గారిని కలిశాను. డీసెంట్ యాక్టర్కి, గుడ్ యాక్టర్ తేడా ఏంటి? అన్న సంభాషణ వచ్చింది. ‘‘దర్శకుడు చెప్పింది చెప్పినట్లు చెసేవాడు యాక్టర్. దర్శకుడు చెప్పింది చేస్తూనే ఏదో తన సొంతగా, కొత్తగా ప్రయత్నించాలని తపన పడేవాడు గుడ్ యాక్టర్’ అని చెప్పకొచ్చారు. అప్పట్నుంచి ప్రతి సినిమాకి నేను కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► ‘ఒక్క క్షణం’ సినిమాకు బాగా కష్టపడ్డాం. ఫస్ట్ కాపీ చూసి చాలా సంతోషపడ్డాను. కానీ ప్రేక్షకుల నుంచి మేం ఆశించిన ఫలితం రాలేదు. సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల తీర్పు మనకు నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకుని తీరాలి. ఆన్లైన్ ఆడియన్స్కు బాగానే నచ్చింది. ప్రస్తుతం రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి లవ్స్టోరీ. -
దుల్కర్ నిర్మాతయ్యాడోచ్
ఈ మధ్య స్టార్స్ కేవలం స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా సరికొత్త రోల్స్ టేకప్ చేస్తున్నారు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కొత్త చాలెంజింగ్ రోల్కి మారారు. ప్రొడ్యూసర్గా సరికొత్త అవతారం ఎత్తారు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మలయాళం, హిందీ, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ బిజీలోనూ ప్రొడ్యూసర్ బాబుగా ఓ మలయాళ సినిమాను స్టార్ట్ చేశారు. సన్నీవాన్ హీరోగా నటిస్తున్నారు. ‘‘నా ప్రొడక్షన్లో మొదటి సినిమా షూటింగ్ ఈరోజే మొదలైంది. సినిమా పేరు, నా బ్యానర్ పేరు త్వరలోనే అనౌన్స్ చేస్తాం. క్వాలిటీ సినిమాలు తీయాలనే మీ ఆశీర్వాదాలు మాకు కావాలి’’ అని దుల్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఏ ‘డీ’తో జోడీ
‘ధడక్’తో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో మంచి మార్కులే వేయించుకున్నారు జాన్వీ కపూర్. ఆ సినిమాతో జాన్వీని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శక–నిర్మాత కరణ్ జోహార్, జాన్వీ రెండో చిత్రాన్నీ కూడా నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గుంజన్ సక్సెన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో గుంజన్ సక్సెన్ పాత్రను పోషించనున్నారు జాన్వీ కపూర్. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు యాక్ట్ చేస్తారన్నది ఈ మధ్య బాలీవుడ్లో హాట్టాపిక్. ఇందులో హీరోగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేదా మలయాళీ యువ హీరో దుల్కర్ సల్మాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్లో ఎంట్రీæ(కార్వాన్) ఇచ్చి, సెకండ్ మూవీ (జోయా ఫ్యాక్టర్)లో నటిస్తున్నారు దుల్కర్. ఈ హీరోతో కరణ్ ప్రొడక్షన్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఓ సినిమా చేయనున్నట్లు టాక్. మరోవైపు టాలీవుడ్ హీరోలలో విజయ్ నటనకు ఫ్యాన్ అయ్యానని కరణ్ జోహార్ షోలో పేర్కొన్నారు జాన్వీ. కరణ్ కూడా విజయ్ను బాలీవుడ్కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు బాలీవుడ్ టాక్. మరి దేవరకొండ, దుల్కర్ ఈ ఇద్దరిలో ఏ డీ (డి ఫర్ దేవరకొండ, దుల్కర్)తో జాన్వీ కపూర్ తన తదుపరి చిత్రంలో జోడీ కడతారో వేచి చూడాలి. వీళ్లిద్దరూ కాకుండా వేరే హీరో సీన్లోకి వస్తారేమో వెయిట్ అండ్ సీ. -
వార్కి రెడీ
యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారట జాన్వీ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గున్జన్ సక్సేనా కార్గిల్ యుద్ధంలో ప్రతిభ చాటారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుందని బాలీవుడ్ సమాచారం. టైటిల్ రోల్లో జాన్వీ కపూర్ నటించనున్నారట. సక్సేనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను తెలుసుకునే పనిలో పడ్డారట జాన్వీ. తొలిచిత్రం ‘ధడక్’లో గ్లామర్గా నటించిన ఆమె ఈ చాలెంజింగ్ పాత్రలో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తారనే విషయం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర చేయనున్నారని వినికిడి. జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఈ సినిమాని కూడా నిర్మించనున్నారట. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమా కంటే ముందు కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్న ‘తక్త్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జాన్వీ. -
ఫుల్ జోష్!
తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే కొత్త సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నారు కథానాయిక కల్యాణి ప్రియదర్శన్. ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ శర్వానంద్తో ఓ సినిమా చేశారు. ఇది రిలీజ్కి రెడీ అవుతోంది. అలాగే మాలీవుడ్లో ‘మరార్కర్: అరబికడలింటే సింగమ్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న తమిళ సినిమా ‘వాన్’లో నటించడానికి ఊ కొట్టి ఫుల్ జోష్లో ఉన్నారీ భామ. ఈ సినిమాతో రా కార్తీక్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. అలాగే ఈ సినిమాలో కృతి కర్భందా మరో కథానాయికగా నటిస్తారు. ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ‘‘ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్. కథ పరంగా కథానాయికల పాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. ఫ్రెష్ ఫేస్ కోసం కల్యాణిని తీసుకున్నాం. తమిళనాడుతో పాటు ఉత్తర భారతదేశంలో చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. ప్రచారంలో ఉన్నట్లు ఇది బైలింగ్వల్ సినిమా కాదు. కేవలం తమిళంలోనే తెరకెక్కిస్తాం’’ అని దర్శకుడు కార్తీక్ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక పాత్ర కూడా ఉందని, ఆ పాత్రకు నివేథా పేతురాజ్ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచిస్తోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
ఇండియన్ 2లో ఇరుక్కారా?
తెలుగు హిట్ ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ ‘వందా రాజావాదాన్ వరువేన్’ సినిమాతో బిజీగా ఉన్నారు శింబు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి శింబు నెక్ట్స్ చిత్రం ఏంటీ? అంటే ‘ఇండియన్ 2’ అంటున్నారు కోలీవుడ్ సినీ వాసులు. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్వకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఇండియన్ 2’. ఇటీవల ఈ సినిమా సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికయ్యారని, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీ రోల్ చేయబోతున్నారనీ ప్రచారం సాగుతోంది. ‘ఇండియన్ 2’లో శింబు కూడా భాగమయ్యారన్నది తాజా టాక్. ఇందులో శింబు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నారని సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందట. మరి.. ఈ సినిమాలో శింబు ఇరుక్కారా (ఉన్నారా)? లేదా? అనేది అప్పుడు తెలిసిపోతుంది. -
ఫుల్ జోష్
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది ‘కర్వాన్’ సినిమాతో బాలీవుడ్ గడప తొక్కిన దుల్కర్ ప్రస్తుతం ‘జోయా ఫ్యాక్టర్’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. నార్త్, సౌత్ సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫుల్ జోష్లో ఉన్న ఆయనకు తాజాగా ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించే చాన్స్ వచ్చిందని కోలీవుడ్ టాక్. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ‘ఇండియన్ 2’ సీక్వెల్. శంకర్ –కమల్హాసన్ కాంబినేషన్లోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. -
ఈ క్వొశ్చన్ ఎవరూ అడగలేదు!
దుల్కర్ సల్మాన్కి పెళ్లయిపోయింది. ఒక కూతురు కూడా. అయినా చాలామంది అమ్మాయిలు దుల్కర్ని ‘దిల్కర్’, ‘దిల్కర్’ అని ‘దిల్దార్’గా ఇష్టపడతారు. ‘తప్పు కదా.. ఇలా చేయొచ్చా దుల్కర్’ అంటే.. ‘వాళ్లు ప్రేమిస్తున్నది నా ఫ్యామిలీ మొత్తాన్ని’ అంటారు. అందుకే మన ఫ్యామిలీలో ఈ ఇంటర్వ్యూ. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ రూపురేఖలు వరదల కారణంగా మారాయి. మళ్లీ పూర్వపు స్థితికి రావడానికి చాలా టైమ్ పట్టేట్లుంది? దుల్కర్: అవును. ప్రకృతి వైపరీత్యం చాలా నష్టాన్నే మిగిల్చింది. కేరళ రాష్ట్రం మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా చాలా సమయం పడుతుంది. దేశంలో ఇలాంటి విపత్తులు ఎక్కడ జరిగినా ‘మేమున్నాం’ అంటూ ఇతర చిత్రపరిశ్రమల వాళ్లు ముందుకు రావడం ఎలా అనిపించింది? దుల్కర్: కళలకు భాషా భేదం లేదని అందరం అంటుంటాం. ఇలాంటివి జరిగినప్పుడు నిరూపిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల నుంచి సహాయం అందింది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అందరూ ఫీల్డ్లోకి దిగి వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మీరు డైరెక్ట్గా ఫీల్డ్లోకి రాలేదని కొందరు విమర్శించారు. దాని గురించి? దుల్కర్: మనం అక్కడ ఫిజికల్గా లేకపోతే సహాయం చేయనట్లు కాదు. తొందరపాటుతో కామెంట్ చేసిన వాళ్ల కోసం ‘నేనీ సహాయం చేశాను’ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఒకటిగా నిలబడిన ఇలాంటి సమయంలో నెగటివిటీని స్ప్రెడ్ చేయకపోవడం మంచిది. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్లు పెట్టేవాళ్లు ఒక్కరు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ దగ్గర ఉండరు. ఇలాంటి సమయాల్లో కావల్సింది యూనిటీ, పాజిటివిటీ. నెగటివిటీ కాదు. మమ్ముట్టిగారు నటించిన ‘కసాబా’ సినిమాలో కొన్ని డైలాగ్స్ స్త్రీలను అగౌరవపరిచేలా ఉన్నాయని నటి పార్వతి విమర్శించారు. డైలాగ్స్ చెప్పేటప్పుడు మేల్ ఆర్టిస్టులు జాగ్రత్త తీసుకోవాలేమో? దుల్కర్: పార్వతి తన మనసుకి అనిపించింది చెప్పారు. మేం ఏదైనా సినిమా ఒప్పుకున్నామంటే అందులో క్యారెక్టర్ ఎలా ఉంటే అలా చేయడం వరకే మా బాధ్యత. కొన్నిసార్లు తాగుబోతులా, డ్రగ్ అడిక్ట్లా చేయాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అది అతని రియల్ లైఫ్ పర్సనాలిటీ అనుకుంటే తప్పు. ఒకవేళ ఈ ఇంటర్వ్యూలో ఏదైనా తప్పుంది అనుకుంటే అది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి నన్ను నిందించవచ్చు. కానీ సినిమాల్లో చేసేదాన్ని పర్సనల్గా ఊహించుకొని బ్లేమ్ చేయకూడదన్నది నా ఒపీనియన్. సినిమాల విషయానికొద్దాం. మలయాళం టు తెలుగు వయా తమిళ్.. ‘కార్వాన్’తో హిందీ స్క్రీన్కి. బిజీ బిజీగా ఉంటున్నారు.. దుల్కర్: (నవ్వుతూ). అన్ని భాషల్లో చేస్తే అందరి అభిమానాన్ని పొందవచ్చు కదా. ప్రతిసారి కొత్త భాషలో ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు అది కూడా ఓ మలయాళం సినిమానే అనుకుని చేస్తాను. ‘కార్వాన్’ సినిమా ఐడియా నచ్చింది. పాత్రలు చాలా ఆసక్తిగా ఉంటాయి. డెడ్ బాడీస్తో ట్రావెలింగ్ అనే పాయింట్ కొత్తగా అనిపించింది. పైగా ఇర్ఫాన్గారు ఒప్పుకున్నారంటే కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది. నా ఫస్ట్ సినిమాకే రీచ్ ఎక్కువ ఉంటుంది. అందుకని చేశాను. దుల్కర్ అంటే అలెగ్జాండర్ అని అర్థం అట. ఆయన పలు రాజ్యాలను గెలుచుకున్నట్లు మీరు కూడా అన్ని ఇండస్ట్రీలను గెలుచుకోవాలనుకుంటున్నారా? దుల్కర్: అలా ఏం లేదు. కానీ వేరే భాషల్లో చేసే అవకాశం రావడం లక్. జనరల్గా ఒకే ఇండ స్ట్రీలో ఫోకస్డ్గా ఉంటే బాగుంటుంది. అయితే అన్ని ఇండస్ట్రీలు తిరగడం వల్ల డిఫరెంట్ కల్చర్, రకరకాల మనుషులను కలుసుకోవడం, వాళ్లతో మాట్లాడటం, వాళ్లను తెలుసుకోగలగడం మంచి ఎక్స్పీరియన్స్గా భావిస్తాను. ‘మహానటి’ చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకున్నాను. అందులో నేను చేసిన జెమినీ గణేశన్గారి పాత్రకు మంచి డైలాగ్స్ రాశారు. వాటిని అర్థం చేసుకుంటేనే బాగా యాక్ట్ చేయగలుగుతాను. అందుకే ప్రతి పదాన్నీ అర్థం చేసుకొని నటించాను. అంత అర్థం చేసుకున్నారు కాబట్టే ‘అమ్మాడి’ అనే పదాన్ని భలే పలికారేమో.. దుల్కర్: ఈ మాట చాలామంది అన్నారు. ‘అమ్మాడి’ అని భలే అన్నారే అన్నప్పుడు హాయిగా నవ్వుతుంటాను. నిజానికి ‘మహానటి’ చేయాలా వద్దా అని ఆలోచించింది కూడా డైలాగ్స్ కరెక్ట్గా పలుకుతానా? లేదా అనే. ‘ఓకే బంగారం’కి కూడా డబ్బింగ్ చెప్పుకోలేదు. ‘డబ్బింగ్ చెప్పుకుంటే అది సినిమాకు హెల్ప్ అవ్వాలే తప్ప హాని జరగకూడదు. తెలుగు కూడా వచ్చిన యాక్టర్ని పెట్టుకోవచ్చు కదా’ అన్నాను. ‘నువ్వు చేయగలవు’ అని టీమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ‘మహానటి’ ఒప్పుకున్నాను. కానీ రీసెంట్గా మీ నాన్నగారి (మమ్ముట్టి)తో మాట్లాడినప్పుడు ‘ఒక ఆర్టిస్ట్ తన రోల్కు తన వాయిస్ ఇచ్చినప్పుడే పర్ఫెక్ట్ యాక్టర్ అవుతాడు’ అన్నారు.. దుల్కర్: నాన్నగారు చెప్పిన విషయాన్ని నేను పూర్తిగా ఒప్పుకుంటాను. కానీ భాషకు న్యాయం చేయాలని కూడా నమ్ముతాను. పర భాషను గౌరవించాలి, అక్కడి మనుషులను గౌరవించాలి. తప్పుగా మాట్లాడితే క్యారెక్టర్కు సెట్ కాలేదంటారు. పైగా ఆ తప్పు తడకల వల్ల సినిమా తేలిపోతుంది. పర్ఫెక్ట్గా డబ్బింగ్ చెప్పగలం అనుకున్నప్పుడే చెప్పాలి. నాన్నగారు ఏ భాషలో సినిమా చేసినా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ఆయన పర్ఫెక్ట్గా చెబుతారు. ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం) తమిళ్లో నా సెకండ్ మూవీ. డబ్బింగ్ చెప్పమని అడగలేదు. ఒకవేళ నా అంతట నేను అడిగి డబ్బింగ్ చెప్పానంటే ఆడియన్స్కి ఎవరో ఏలియన్ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే చెప్పలేదు. ‘మహానటి’కి మాత్రం చాలా కష్టపడ్డాను. ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పాకే ‘భాష వేరైనా మన వాయిస్ కూడా కచ్చితంగా ప్లస్ అవుతుంది’ అనిపించింది. ‘కార్వాన్’ సినిమాను సింక్ సౌండ్లో చేశాం. దానికి డబ్బింగ్ లేదు. లొకేషన్లో మేం లైవ్లో మాట్లాడిందే రికార్డ్ చేశారు. ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి నెపోటిజమ్ (బంధుప్రీతి) గురించి మీరేం అంటారు ? దుల్కర్: మలయాళం సినిమాలో మేము (బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు) మైనారిటీలాగా. ఎందుకంటే నేను యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పృథ్వీ రాజ్, ఫాహద్ ఫాజిల్ మాత్రమే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు. మా ఫాదర్ టైమ్లో కూడా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ తక్కువ. మేం స్టార్ట్ అయినప్పుడు కూడా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అన్నారు. మేం కూడా సక్సెస్ అవ్వమనేది వాళ్ల ఫీలింగ్. కానీ సినిమా మీద ప్రేమతో, చేస్తున్న మంచి సినిమాల వల్ల మేం మంచి పొజిషన్లోనే ఉన్నాం అనుకుంటున్నాను. బంధుప్రీతి వల్ల అవకాశాలు రావు. ఎంట్రీ ఈజీ అవుతుందంతే. సో.. సెకండ్ జనరేషన్ యాక్టర్స్ సక్సెస్ కాలేదు అన్నవాళ్లందరూ రాంగ్ అని ప్రూవ్ చేశారా? దుల్కర్: రాంగ్ అని ప్రూవ్ చేయడానికి పనిగట్టుకుని ప్రయత్నం చేయలేదు. జెన్యూన్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ‘మన ఫ్యామిలీ ట్యాగ్ వల్ల ఒకటి రెండు సినిమాలకు అవకాశం వస్తుంది తప్పితే ప్రూవ్ చేసుకోకపోతే రావు’ అని. నా కోసం నా ఫ్యామిలీ వచ్చి యాక్ట్ చేయరు కదా. ఒకవేళ ఫ్యామిలీ అండతో చాన్స్ వచ్చినా కెమెరా ముందు నేనే చేయాలి. నా కష్టానికి కొంచెం లక్ కూడా తోడవ్వాలి. మంచి సినిమాలు రావాలి. అలాగే నా సినిమాలకు 100 పర్సెంట్ నేనే బాధ్యుడ్ని అని అనడం లేదు. మంచి మంచి డైరెక్టర్స్తో యాక్ట్ చేయడం వల్ల ఇప్పుడీ పొజిషన్లో ఉన్నాను అనుకుంటాను. నేను చేసిన సినిమాలకు ఎవరైనా యస్ అంటారు.. అవి మంచి సినిమాలు కాబట్టి. నా బలమేంటంటే.. కొన్ని సినిమాలకు నో చెప్పగలగడం. పెళ్లయ్యాకే సినిమాల్లోకి వచ్చారు. ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ అవుతుందని ఏమైనా అనిపించిందా? దుల్కర్: అస్సలు లేదు. యాక్టర్ అవ్వడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఫీమేల్ ఫ్యాన్స్ కాదు. నాకు సినిమా అంటే ఇష్టం. మంచి సినిమాలు చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. లక్కీగా నాకు ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు (నవ్వుతూ). అందుకు హ్యాపీ. నా పెళ్లి 28 ఏళ్లకే అయిపోయింది. మా ఫ్యామిలీలో అందరి పెళ్లిళ్లూ అలానే జరిగాయి. జనరల్గా కెరీర్తో సంబంధం లేకుండా చాలామంది 25, 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి చూస్తుంటారు. మమ్ముట్టిగారు ఓసారి లైఫ్లో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే కెరీర్ మీద ఇంకా ఫోకస్డ్గా ఉండొచ్చు అన్నారు. మీరు ఒప్పుకుంటారా? దుల్కర్: నిజమే. కెరీర్ గురించి వదిలేస్తే మా నాన్నగారు ఇప్పుడు తన మనవళ్లు, మనవరాలితో ఆడుకుంటున్నారు. ఆయన చుట్టూ ఎప్పుడూ పిల్లలే ఉంటారు. అందరితో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. యాక్చువల్లీ మన తల్లిదండ్రులకు గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకునే చాన్స్ మనం ఇవ్వాలి. లేట్ మ్యారేజ్ చేసుకుంటే గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకునే ఓపిక వాళ్లకు ఉండచ్చు, ఉండకపోవచ్చు. అసలు వాళ్లే లేకపోవచ్చు. ఆ సంగతలా ఉంచితే మీరు చెప్పిన ఫీమేల్ ఫ్యాన్స్ కూడా నన్ను ఒక్కడినే కాదు.. నా ఫ్యామిలీని ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అమల్ (భార్య) ఎలా ఉంది? మరియమ్ (కూతురు) ఎలా ఉంది? అని అడుగుతారు. సినిమాలో రకరకాల హీరోయిన్స్తో యాక్ట్ చేస్తుంటారు. వాళ్లలో చాలా మందికి బెటర్ క్వాలిటీస్ ఉండచ్చు. అందంగా ఉంటారు. వాళ్లకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండటానికి ఏం చేస్తారు? దుల్కర్: ఈ క్వొశ్చన్ ఎవరూ అడగలేదు. కొంచెం ఆలోచించాల్సిందే (నవ్వుతూ). నాతో యాక్ట్ చేసిన నా కో–స్టార్స్ అందరూ నా ఫ్యామిలీకి క్లోజే. వాళ్లందరూ నా భార్యను కలిశారు. నేను ఒకటి రెండు సినిమాలు ఒక హీరోయిన్తో యాక్ట్ చేశానంటే వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లోకి వచ్చేస్తుంటారు. లంచ్ కోసం కలుస్తుంటాం. నాకు కొత్త కొత్త మనుషులను కలవడం ఇంట్రెస్ట్. వాళ్ల నుంచి ఏదో కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. మనకు వేరే ఏ ఉద్దేశం లేనప్పుడు కలసి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. నా బిహేవియర్ని చెక్ చేసుకుంటాను. మనం ఎదుటి వ్యక్తిని చూసే దృష్టి కోణాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. నేను మంచి దృష్టితో చూస్తాను. ఓ పాపకు తండ్రిగా అమ్మాయిలను ఎలా పెంచాలో చెబుతారా? దుల్కర్: అబ్బాయిలను ఎంత ప్రేమగా పెంచుతామో అంతే ప్రేమగా అమ్మాయిలను పెంచాలి. ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇవ్వాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను ప్రొటెక్టివ్ ఫాదర్లానే ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా నేను అమ్మాయి పుట్టాలనే కోరుకున్నాను. మా అక్కకి ఇద్దరు అబ్బాయిలు. ఇంట్లో ఆడపిల్ల ఉండాలనుకున్నాం. నా భార్యకి సిజేరియన్. ఆపరేషన్ థియేటర్లో అమ్మాయి అని తెలిసింది. అప్పుడు నన్ను చూడాలి.. పింక్ బెలూన్ పట్టుకొని అల్లరి అల్లరి చేసేశాను. సో.. మీ నాన్నగారికి ముద్దుల మనవరాలు అన్నమాట.. దుల్కర్: ఆయన అయితే మరియమ్తో ఆడుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. కళ్లలో మెరుపు కనిపిస్తుంది. అసలు కంటే కొసరు ఎక్కువ అంటారు కదా.. ఒక్కోసారి నాన్నని చూస్తుంటే నాకలా అనిపిస్తుంది. మా ఫ్యామిలీకి క్వీన్ వచ్చింది అన్నది ఆయన ఆనందం. మమ్ముట్టి గారిని ఎప్పుడు మీ గురించి, మీ సినిమాల గురించి అడిగినా వేరే యాక్టర్స్ గురించి మాట్లాడను అంటుంటారు దుల్కర్: అది మంచిదే కదా. నాకే హెల్ప్ అవుతుంది. అప్పుడు అందరూ నన్ను సెపరేట్ యాక్టర్గా గుర్తిస్తారు. మేమిద్దరం దాదాపు ఎక్కడా కలసి కనిపించం. మా సినిమాలను ప్రమోట్ చేసుకోం. దానివల్ల నా కెరీర్ని నా ఓన్గా బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నాన్న ప్రిన్సిపల్ ఏంటంటే.. తన కొడుకు గురించి నలుగురూ మాట్లాడుకోవాలి. ఆయన మాట్లాడి, నలుగురితో మాట్లాడించాలనుకోరు. మీరు బయోపిక్ ద్వారానే ఈ ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. మీ నాన్నగారు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత బయోపిక్ (యాత్ర) ద్వారానే తెలుగులోకి రీ–ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తోంది? దుల్కర్: (నవ్వుతూ) ఇద్దరం తెలుగులో బయోపిక్ చేయడం అనుకోకుండా జరిగింది. నాన్నగారు చాలా ఏళ్ల తర్వాత తెలుగుకు తిరిగి వస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. మహీ (‘యాత్ర’ దర్శకుడు) కూడా మంచి టెక్నీషియన్. నాన్నగారు యంగ్ ఫిల్మ్ మేకర్స్తో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. కొత్త డైరెక్టర్స్ నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఆయనకు ఉంది. మమ్ముట్టిగారు ఇప్పటికీ మీ కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారు. దుల్కర్: అవును. నాన్నగారు 6–7 సినిమాలు చేస్తుంటే నేను 3–4 సినిమాలు చేస్తున్నాను. ఆయన సినిమాలు చేయడానికి అలవాటు పడిపోయారు. గత 35 ఏళ్ల నుంచి అదే చేస్తున్నారు. ఈ జనరేషన్లో మాకు సెలెక్టివ్గా చేసే లగ్జరీ ఉంది అనుకుంటున్నాను. అది కూడా పర్సనల్ చాయిస్ అంటాను. నా కో–యాక్టర్స్లో సంవత్సరానికి 6–7 సినిమాలు చేసేవాళ్లు ఉన్నారు. నేనెప్పుడూ పని చేస్తూనే ఉంటాను అనుకుంటాను కానీ నాన్నగారి రిలీజ్లే ఎక్కువ ఉంటాయి. అదేంటో? (నవ్వుతూ). తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళం లో పారితోషికాలు తక్కువే కదా? దుల్కర్: అది నిజమే. అయితే డబ్బు కోసం నేనెప్పుడూ పరిగెత్తలేదు. నా స్కూల్మేట్స్తో కంపేర్ చేస్తే నేను వాళ్ల కంటే ఎక్కువ డబ్బులే సంపాదిస్తున్నట్టు లెక్క. ఆల్రెడీ నా ఏజ్కి ఎక్కువే పే చేస్తున్నారని అనుకుంటున్నాను. పెంచమని అడిగే ఉద్దేశం లేదు. వేరే భాషల్లో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి అక్కడి సినిమాలు చేస్తే బాగుంటుందనుకోను. నాకు స్టోరీ, క్యారెక్టర్ ఇంపార్టెంట్. మలయాళంలో కూడా హై బడ్జెట్ సినిమాలు రావాలని కోరుకుంటున్నారా? దుల్కర్: తప్పకుండా. అయితే వేరే భాషల్లో పెద్ద సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అని చేయకూడదు. స్టోరీ డిమాండ్ చేస్తేనే చేయాలి. ‘బాహుబలి’ లాంటి సినిమాను మామూలు బడ్జెట్లో చేయలేం కదా. అది పెద్ద ఐడియా. చాలా ఎఫర్ట్తో కూడుకున్నది. అంత బడ్జెట్ అవసరం. అలాంటి సినిమా అయితే ఖర్చు పెట్టచ్చు. ఫైనల్లీ.. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మీ నాన్నగారితో పోలుస్తారని భయపడ్డారా? దుల్కర్: చాలా భయపడేవాణ్ణి. ఆ భయాన్ని అధిగమించాలనుకున్నాను. కొంచెం కొంచెంగా ఓవర్కమ్ అవుతున్నాను. ఇప్పటివరకూ చేసినవన్నీ మంచి సినిమాలే. గొప్ప గొప్ప సినిమాల్లో నటించాలన్నదే నా లక్ష్యం. డైరెక్షన్ చేయాలని ఉంది. అయితే ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తా. – డి.జి. భవాని -
మల్టీస్టారర్?
ఫస్ట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సక్సెస్ అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ బండి బాగానే సౌండ్ చేసిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్ ప్రాజెక్ట్గా మల్టీస్టారర్ చేస్తున్నట్టు ఆ మధ్య ‘సాక్షి’కి తెలిపారు అజయ్ భూపతి. లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారమేంటంటే ఈ మల్టీస్టారర్లో ఎనర్జిటిక్ హీరో రామ్, ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోలుగా కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్ను ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్నారు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతోందని, అలాగే ఫస్ట్ సినిమాలానే రియలిస్టిక్గానే ఉంటుందని కూడా దర్శకుడు ఓ సందర్భంలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
వెంకటేష్, దుల్కర్ల మల్టిస్టారర్..?
మహనటితో తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ త్వరలోనే మరో తెలుగు సినిమాకు సైన్ చేశాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ బాలీవుడ్ చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’తో బిజీగా ఉన్నారు. త్వరలోనే టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి యుద్ధ నేపధ్యంలో సాగే చిత్రంలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో, నూతన దర్శకుడి దర్శకత్వంలో మల్టీస్టారర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు వెంకీ, దుల్కర్లని పలుమార్లు కలిసాడని, కథ గురించి వారికి వివరించినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. -
బెంగళూర్ టు ముంబై
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్. -
డాటర్ ఆఫ్ కపూర్స్
ఆఫ్ స్క్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ స్క్రీన్ కలిసి యాక్ట్ చేస్తే ఆ యాక్టర్స్కే కాదు ప్రేక్షకులకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడదే థ్రిల్లింగ్ మూమొంట్ను ఎంజాయ్ చేస్తున్నారు సోనమ్. ఒకసారి కాదు వరుసగా రెండోసారి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి యాక్ట్ చేస్తున్నారు సోనమ్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏశా లగా’ సినిమాలో తండ్రి అనిల్ కపూర్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇందులో సోనమ్, అనిల్ తండ్రీ కూతుళ్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్తో కలిసి యాక్ట్ చేస్తున్న ‘జోయా ఫ్యాక్టర్’లో సోనమ్ బాబాయ్ సంజయ్ కపూర్ కూడా యాక్ట్ చేయబోతున్నారట. బాబాయ్ సంజయ్ కపూర్ ఈ సినిమాలో సోనమ్కి తండ్రిగా కనిపిస్తారట. ఆల్రెడీ ‘ముబారకన్’ సినిమాలో అన్నయ్య అనిల్ కపూర్, మరో అన్నయ్య బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు సంజయ్. ‘‘సోనమ్ నా కళ్ల ముందే పెరిగింది. తను నా కూతురు లాంటిదే. తనతో వర్క్ చేయడం చాలా ఎగై్జటింగ్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వర్క్ చేయడం కంటే హ్యాపీ ఏం ఉంటుంది’’ అన్నారు సంజయ్కపూర్. -
విదేశాల్లోనూ మహా విజయం
జనరల్గా బయోపిక్ అంటే ఏవోవో వివాదాలు వినిపిస్తుంటాయి. ‘మహానటి’ సినిమా విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఎక్కువ ప్రశంసలే వచ్చాయి. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన సినిమా ‘మహానటి’. తమిళంలో ‘నడిగర్ తిలకం’ అనే టైటిల్తో విడుదల చేశారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ వెండితెరపై కనిపించారు. సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్వప్నాదత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ ఏడాది మే 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికపై మంచి గౌరవం లభించింది. ‘ఈక్వాలిటీ ఇన్ సినిమా’ అనే అవార్డు ‘మహానటి’ చిత్రాన్ని వరించింది. ఈ అవార్డును అందుకున్నారు ‘మహానటి’ టీమ్. అంతేకాదు ఇందులో కథానాయికగా నటించిన కీర్తీ సురేశ్ ఉత్తమ నటి విభాగంలో నామినేట్ అయ్యారు. ‘‘ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ నంబర్స్ ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి’’ అన్నారు స్వప్నాదత్. -
భాష ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటా
‘‘యాక్టర్గా వేరే వేరే భాషల్లో సినిమాలు చేయడం చాలా ఎగై్జటింగ్గా ఉంటుంది. ‘మహానటి’ సినిమాలో నన్ను తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. దుల్కర్ సల్మాన్ బాలీవుడ్కు పరిచయం అవుతున్న చిత్రం ‘కార్వాన్’. ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఆకర్ష్ కురానా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ – ‘‘మలయాళంలో హీరోగా చేస్తున్నాను కాబట్టి బాలీవుడ్కు పరిచయం అవుతున్న సినిమాలోనూ నేనే లీడ్ రోల్ చేయాలి అనుకోలేదు. కథతో పాటు క్యారెక్టర్ ఉండాలి అనుకుంటాను. ఇర్ఫాన్ సార్ ఓకే అన్నారంటే స్క్రిప్ట్ కచ్చితంగా బావుంటుందని అనుకున్నాను. ఏ భాషలో సినిమా చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను’’ అన్నారు. దర్శకుడు ఆకర్ష్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి కీలకంగా నిలిచే ఓ పాత్రకు దుల్కర్ సరిపోతాడని మా క్యాస్టింగ్ డైరెక్టర్ చెప్పారు. అప్పుడే దుల్కర్ సినిమాలు చూశాను. అవినాష్ అనే పాత్రకు అతనే సరిపోతాడని ఫిక్స్ అయ్యాను. కథ చెప్పినప్పుడు దుల్కర్ కూడా బాగా ఎగై్జట్ అయ్యారు. స్క్రిప్ట్ నచ్చి ఒప్పుకున్నారు. 34 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. అలా అయితే యాక్టర్స్ అందరూ క్యారెక్టర్స్కు స్టిక్ అయ్యి ఉంటారు. ఎనర్జీస్ సేమ్గా ఉంటాయి అని నా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఇర్ఫాన్ ఖాన్గారు బాగానే ఉన్నారు. ఫస్ట్ కాపీ కూడా చూశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు కేన్సర్ వ్యాధి ఉందని బయటపడింది. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. మిథిలా పాల్కర్ మాట్లాడుతూ – ‘‘ఈ షూటింగ్ అంతా ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంది. ఇర్ఫాన్, దుల్కర్ వంటి యాక్టర్స్తో వర్క్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. కేవలం సినిమాలే అని నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోను. యూ ట్యూబ్, నెట్ఫ్లిక్స్, సినిమాలు, థియేటర్... ఎక్కడ ఎగై్జటింగ్ కాన్సెప్ట్ ఉంటే అక్కడ చేస్తాను’’ అన్నారు. -
బర్త్డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్ను దుల్కర్కి గిఫ్ట్గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్తో ఎమోషనల్గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
జనతా హోటల్
‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో మంచి జోడీ అనిపించుకున్నారు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్ కొండేటి. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం తదితర అంశాలతో రూపొందిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్గా నిలిచింది. ‘మహానటి’ మూవీ తర్వాత దుల్కర్ సల్మాన్కు మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా సంస్థలో వచ్చిన ‘జర్నీ, పిజ్జా, డా. సలీమ్’ చిత్రాలకు మంచి సంభాషణలు అందించిన సాహితీ ‘జనతా హోటల్’కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. గోపీ సుందర్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. లోకనాథన్. -
పాఠాలు చెబుతారట
‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్గా సావిత్రికి ప్రేమ పాఠాలు చెప్పిన దుల్కర్ సల్మాన్ ఈసారి లెక్చరర్గా మారి పాఠాలు చెప్పనున్నారట. మిధున్ మన్యూల్ థామస్ దర్శకత్వంలో దుల్కర్ ఓ మలయాళ సినిమాలో యాక్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులోనే ఆయన లెక్చరర్గా కనిపిస్తారట. ప్రస్తుతం బాలీవుడ్లో సోనమ్ కపూర్తో కలసి ‘జోయా ఫ్యాక్టర్’ లో యాక్ట్ చేస్తున్న దుల్కర్ మలయాళంలో ‘కన్నుమ్ కన్నుమ్ కొళైయాడితల్, వాన్’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకి గుమ్మడికాయ కొట్టాక మిధున్ సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. -
కార్వాన్ ట్రైలర్ విడుదల
-
నన్నెప్పుడూ ప్రమోట్ చేయలేదు
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. ‘‘స్టార్ కొడుకు కాబట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే వచ్చేసింది. కావల్సి వస్తే తండ్రే స్వయంగా కొడుకు సినిమాను ప్రమోట్ చేస్తారు’’ అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ తనయుడు సినిమాలని తండ్రి ఎప్పుడూ ప్రమోట్ చేయరట. బాలీవుడ్కు ‘కార్వాన్’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు దుల్కర్. ఈ సినిమాను మమ్ముట్టి కూడా ప్రమోట్ చేయనున్నారు అనే వార్తలు వచ్చాయి. దానికి దుల్కర్ స్పందిస్తూ– ‘‘మా నాన్నగారు ఇప్పటివరకూ నన్ను కానీ, నా సినిమాలని కానీ ప్రమోట్ చేయలేదు. ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నారు. ఎవరి టాలెంట్తో వాళ్లు పైకి ఎదగాలి అన్నది ముమ్ముట్టి అభిప్రాయం అయ్యుండొచ్చు. తండ్రి అనుకున్నట్లుగానే తన ప్రతిభతోనే దుల్కర్ సౌత్ స్టేట్స్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన లక్ని టెస్ట్ చేసుకోనున్నారు. -
నలుగురు నారీమణులతో...
పగలు పైకి చూస్తే ఆకాశంలోని చుక్కలు కనపడవు. అదే రాత్రి చూస్తే మెరుస్తుంటాయి. జస్ట్.. టైమ్ డిఫరెన్స్ అంతే. ఈ టైమే దుల్కర్ సల్మాన్ లైఫ్లో చాలా మార్పులు తెచ్చిందట. మరి.. ఆ మార్పులకు గల కారణాలు తెలుసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వాన్’. వాన్ అంటే తెలుగులో ఆకాశం అనే అర్థం వస్తుంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ను ప్రకటించారు. ఈ సినిమాలో దుల్కర్ మల్టిపుల్ రోల్స్లో కనిపిస్తారట. అంతేకాదు నలుగురు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో ఆల్రెడీ ఒక హీరోయిన్గా నివేథా పేతురాజ్ ఎంపికయ్యారని కోలీవుడ్ టాక్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. జె. సెల్వకుమార్ నిర్మించనున్న ఈ సినిమాకు జార్జ్ సి. విలియమ్స్ కెమెరా వర్క్ చేయనున్నారు. -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు. -
జోడీ కుదిరింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హిట్ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి) తెలుగు రీమేక్లో అల్లు శిరీష్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శిరీష్ సరసన నటించే అవకాశం ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకున్నారు. సంజీవ్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఏబిసిడి’ చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్తో నిర్మిస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ మా చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కన్ఫ్యూజ్డ్ దేశీ.. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్
దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రం తెలుగు రీమేక్లో అల్లు శిరీష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజయ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీని తీసుకున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘ఆపరేషన్ అలిమేలమ్మ, చమక్’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు జుడా స్యాండీ. ‘‘ఏబిసిడికు జుడా స్యాండీను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాం. కన్నడలో యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ టూ టాలీవుడ్ బ్రో’’ అంటూ స్యాండీను టాలీవుడ్కు వెల్కమ్ చేశారు శిరీష్. ‘‘తెలుగు సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గౌరవంగా కూడా ఉంది’’ అని పేర్కొన్నారు జుడా స్యాండీ. -
డాడీ ఈజ్ ప్రౌడ్
‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్గా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. నటుడిగా తనయుడు ఎంచుకుంటున్న పాత్రలు చూసి తండ్రి మమ్ముట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారట. ఈ విషయాన్ని దుల్కర్ షేర్ చేసుకుంటూ – ‘‘యాక్టర్గా నా చాయిస్లు చూసి డాడ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇదివరకు అందరూ మమ్ముట్టి అబ్బాయిగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు నన్నూ ఓ నటుడిగా ఆడియన్స్ గుర్తిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్లో ప్రతి విషయాన్ని నాన్నగారితో పోలుస్తారేమో అని కంగారు పడేవాణ్ణి. కానీ మెల్లిగా యాక్టర్గా నా ప్రతిభని ఆడియన్సే గుర్తిస్తారని అర్థం చేసుకున్నాను’’ అని పేర్కొన్నారు. -
సావిత్రి గొప్పే.. మా నాన్న కాదా?
పిల్లలకు తండ్రంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆ తండ్రి గొప్ప స్టార్ అయితే ఆ ప్రేమ ఇంకా ఎక్కువ ఉంటుంది.‘మహానటి’ సినిమా సావిత్రిని వర్తమానంలోకి తెచ్చింది.అలాగే జెమినీ గణేశన్ను కూడా. జెమినీ మీద తెలుగు సమాజంలో ఉన్న అపోహలను ‘మహానటి’ సినిమా దూరం చేసిందని అనుకునేవారు ఇప్పుడు ఉన్నారు. కానీ జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె కమలా సెల్వరాజ్ మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నారు.ఆమె తరఫు వాదన ఏమిటో విందాం. ► ‘మహానటి’ సినిమా విషయంలో మీ స్పందనలు తెలుస్తున్నాయి. ఆ సినిమా గురించి మీ అభ్యం తరం ఏమిటి? మా నాన్నగారు సావిత్రమ్మను చూసి అసూయ పడినట్లుగా చూపించారు. మా నాన్నగారు పెద్ద స్టార్. శివాజీ గణేశన్, ఎం.జి.ఆర్లతో పాటు మా నాన్న కూడా స్టార్డమ్ చూశారు. అలాంటి వ్యక్తి సావిత్రమ్మను చూసి అసూయ పడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే సావిత్రమ్మ ఆకర్షణలో మా నాన్నగారు ఆమె వెంట తిరిగినట్లు చూపించారు. సావిత్రిగారు మా నాన్న వెంట తిరిగి ఉండొచ్చు కదా. అలాగే ఆమె మద్యానికి ఎలా బానిసయ్యారో ఎవరూ చెప్పలేరు. అందులో మా నాన్న ప్రమేయం ఉన్నట్టు చూపడం సరికాదు. ► ‘మహానటి’ సినిమా చూసి జెమినీ గణేశన్ మీద అపోహలు తొలిగాయని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. అంటే మీ నాన్నను పాజిటివ్గా చూపించినట్టే కదా? నిజంగానే మా నాన్నగారు మంచి వ్యక్తే. అన్నేసి లవ్ సీన్స్ తీయడం ఎందుకు? సావిత్రిగారు గొప్ప స్టార్ అని ఎలివేట్ చేశారు. మా నాన్నగారు కూడా పెద్ద స్టార్. అది ఎలివేట్ చేసినట్లు అనిపించలేదు. ఆయనేదో అవకాశాలు తగ్గిపోయి బాధపడినట్లు చూపించారు. అది నిజం కాదు. సావిత్రమ్మను ఆయన మోసం చేయాలని ఏనాడూ అనుకోలేదు. ‘నా భార్య’ అని సమాజానికి చెప్పారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే అసలు పెళ్లి చేసుకునేవారు కాదు. పైగా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరికీ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాలి. సావిత్రమ్మ తరఫున వాళ్ల పిల్లలతో మాట్లాడినట్లే నాన్నగారి తరఫున మాతో మాట్లాడి ఉండాలి. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్పేదాన్ని. అసలైన నిజాలతో సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది. ► సినిమా విషయంలో మీ ఒపీనియన్ మీది.. సావిత్రిగారి కూతురు విజయ చాముండేశ్వరిగారి ఒపీనియన్ ఆమెది.. ఈ సినిమా మీలో మనస్పర్థలు రావడానికి కారణం అవుతుందా? అస్సలు కాదు. మేమంతా చాలా బాగుంటాం. సినిమా విషయంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది. అది మా పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించదు. మేమంతా ఎప్పటిలానే బాగుంటాం. ► సావిత్రిగారితో మీకున్న మెమొరీస్ గుర్తు చేసు కుంటారా? సావిత్రి గారిది చాలా లవింగ్, కైండ్ నేచర్. చాలా ఆప్యాయత చూపించేవారు మా మీద. ఎవరికైనా మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు నా మొదటి అమ్మాయి, రెండో అమ్మాయి అని మమ్మల్ని పరిచయం చేశాకే వాళ్ల పిల్లల్ని (విజయ చాముండేశ్వరి, సతీష్ను) పరిచయం చేసేవారు. నేను మెడికల్ కాలేజ్లో చదువుతున్న రోజుల్లో సావిత్రిగారు విజిట్ చేసేవారు. నాకు హెయిర్ కట్ చేసేవారు. కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేశాం. ఆవిడ నైస్ పర్సన్. ► సావిత్రమ్మగారితో మీ అమ్మ అలమేలుగారి ఈక్వేషన్ గురించి? ఇంట్లో హింసిస్తున్నారంటూ అర్ధరాత్రి సావిత్రిగారు ఏడ్చుకుంటూ మా ఇంటికొస్తే మా అమ్మగారు ఇంట్లోకి రానిచ్చారు. ఏనాడూ ఒక్క మాట అన్నది లేదు. సావిత్రిగారు కూడా మా అమ్మగారంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. మా అమ్మకి మేం నలుగురు కూతుళ్లం. పుష్పవల్లి అమ్మకు ఇద్దరు కూతుళ్లు. సావిత్రమ్మకు ఒక కూతురు, కొడుకు. పిల్లలందరం బాగుండేవాళ్లం. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మ, సావిత్రమ్మగారు.. మమ్మల్నందర్నీ సమానంగా చూసేవారు. ► ‘మా నాన్నగారు డిగ్నిఫైడ్ పర్సన్’ అని ఇంతకు ముందు మీరన్నారు. మరి కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయిలతో ఆయన ఎఫైర్స్ గురించి మీరేమంటారు? మా నాన్నగారు కావాలని ఎవరి చుట్టూ తిరగలేదు. ఆయన చాలా హ్యాండ్సమ్ మ్యాన్. బాగా చదువుకున్నారు. స్టార్ హీరో. ఆయన చుట్టూనే అమ్మాయిలు తిరిగేవారు. నాన్నను ప్రేమించినవాళ్లంతా సింగిల్ ఉమన్. పుష్పవల్లిగారు, సావిత్రిగారు.. ఇద్దరూ పెళ్లి కానివాళ్లే. ప్లస్ మా నాన్నగారు తనకు పెళ్లయిన విషయాన్ని ఎవరి దగ్గరా దాచి పెట్టలేదు. పుష్పవల్లి అమ్మను నాన్న పెళ్లి చేసుకోలేదు. ఆమె ద్వారా ఆయనకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. వాళ్లకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలే అని యాక్సెప్ట్ చేశారు. అంతేకానీ మా నాన్నగారు మ్యారీడ్ ఉమెన్ లైఫ్లోకి ఎంటరై, వాళ్ల కాపురాలను నాశనం చేయలేదు. ► సావిత్రమ్మగారిని పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మగారు పడిన బాధ మీకు తెలుసా? అప్పుడు మేం చిన్నపిల్లలం. ఏం జరుగుతుందో తెలియని వయసు. అయితే బాగా ఏడ్చేదని మాత్రం తెలుసు. మా ఇంటి పక్కన విజ్జీయమ్మ అని ఉండేవారు. ఆవిడ దగ్గర చెప్పుకుని బాధపడేవారు. అయితే పిల్లల దగ్గర తన బాధను చెప్పుకోలేదు. ► స్కూల్లో మీ ఇంటి విషయాల గురించి మీ స్నేహితులు అడిగేవారా? అలా జరుగుతుందని అమ్మకు తెలుసు కాబట్టి, ఎవరేం అడిగినా ‘మాకు తెలియదు’ అని చెప్పమన్నారు. ‘మీ నాన్నగారు సావిత్రిని పెళ్లి చేసుకున్నారట?’ అని ఎవరైనా అడిగితే అమ్మ చెప్పమన్నట్లే ‘మాకు తెలియదు’ అనేవాళ్లం. ► విజయ చాముండేశ్వరిగారు మీ అమ్మగారి గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. తన తండ్రి గురించి కూడా తప్పుగా చెప్పలేదు... అవును. నేనూ ఎవర్నీ విమర్శించడంలేదు. విజ్జీ నన్ను సొంత అక్కలానే అనుకుంటుంది. నేను నా సొంత చెల్లెలిలానే అనుకుంటాను. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. సావిత్రమ్మగారు మమ్మల్ని బాగా చూసినట్లే మా అమ్మగారు కూడా విజ్జీని, తన తమ్ముడు సతీష్ని బాగా చూసేవారు. మా అక్క రేవతి పెళ్లప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. అమ్మ నాలుగు గోడల మధ్య పెరిగిన వ్యక్తి. అంత మంది మధ్యలోకి రావడానికి ఆవిడ ఇబ్బందిపడ్డారు. అప్పుడు సావిత్రమ్మే అన్నీ చూసుకున్నారు. చాలామంది రేవతక్క సావిత్రమ్మ కూతురు అనుకున్నారు. ► సావిత్రమ్మగారు చనిపోకముందే విజయ చాముండేశ్వరిగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత సతీష్ మీ ఇంట్లో ఉండేవారట? సావిత్రమ్మగారు చనిపోయాక ‘విజ్జీ అక్కతో ఉంటావా? నాతో పాటు ఉంటావా?’ అని నాన్నగారు సతీష్ని అడిగితే.. ‘మీతో ఉంటాను నాన్నా’ అన్నాడు. దాంతో నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారు సతీష్ని తన సొంత కొడుకులానే చూసుకున్నారు. మేం కూడా మా తమ్ముడనే అనుకున్నాం. సతీష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాన్నగారు ఏమీ అనలేదు. సతీష్కి కొడుకు పుడితే పుట్టు వెంట్రుకలు తీయించడానికి నేనే పళని గుడికి తీసుకెళ్లాను. మేమంతా అంత బాగుంటాం. ► మరి.. ముంబైలో సెటిలైన నటి రేఖ (పుష్పవల్లి కూతురు)గారితో మీరంతా టచ్లోనే ఉన్నారా? మేమంతా నెలకోసారి ఫోన్లో మాట్లాడుకుంటాం. వీలు చేసుకుని ఆర్నెల్లకోసారి కలుస్తాం. ► సావిత్రిగారి ఆస్తుల్ని జెమినీగారు తీసుకున్నారని రూమర్ ఉండేది.. అది నిజం కాదు. నాన్నగారి ఆస్తిని ఆవిడ, ఆవిడ ఆస్తులను నాన్నగారు తీసుకోలేదు. అసలు మా నాన్నగారు తన పేరు మీద ఆస్తులు కొనేవారు కాదు. మా అమ్మ పేరు మీదనో, నానమ్మ పేరు మీదనో కొనేవారు. ► సావిత్రిగారు కోమాలోకి వెళ్లిపోయి ఆస్పత్రిలో చేరే నాటికి ఆవిడకు ఆస్తులు లేవని చాలామంది చెప్పుకుంటారు... ఆవిణ్ణి చాలామంది మోసం చేశారు. నాన్నగారు చెప్పాలని ప్రయత్నిస్తే చాన్స్ ఇవ్వలేదు. ఆయన్ను దగ్గరికి రానివ్వలేదు. బంధువులు కొందరు, ఇంట్లో పని చేసినవాళ్లు కొందరు ఎవరి చేతికి చిక్కినవి వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆవిడ ఆస్పత్రిలో చేరాక మా నాన్నగారు చూసుకోలేదని చాలామంది అంటారు. అది నిజం కాదు. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా ఆయనే కట్టారు. ► సావిత్రిగారి అంత్యక్రియలు మీ ఇంట్లోనే జరిగాయి కదా? అవును. మా అమ్మగారు, పుష్పవల్లి అమ్మగారు దగ్గరుండి చేశారు. భర్త బతికి ఉండగా చనిపోయిన స్త్రీ చివరి యాత్ర ఎలా జరుగుతుందో అలా సంప్రదాయానుసారం మా అమ్మ దగ్గరుండి చేయించారు. ► ఫైనల్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ నటన, జెమినీగారిలా దుల్కర్ నటన మీకు నచ్చాయా? కీర్తీ సురేశ్ అచ్చంగా సావిత్రమ్మల్లా మౌల్డ్ అయ్యారు. దుల్కర్ బాగా యాక్ట్ చేశారు. అయితే నాన్నగారు అందగాడు. కళ్లతోనే చెప్పాలనుకున్న విషయాలను కన్వే చేసేవారు. ఆయనలాంటి అందగాడు, నటుడు రారు. ఆయనకు రీప్లేస్మెంట్ లేదు. ► సావిత్రిగారి జీవితం నాశనం కావడానికి ఆవిడే కారణం అంటారా? నా ఒపీనియన్ అదే. ఆమె కొంచెం యారోగెంట్గా ఉండేవారు. అలాగని మంచి మనిషి కాదని కాదు. అందరికీ సహాయం చేసేవారు. కానీ మొండి మనిషి. నాన్నతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. ఆయనకు దూరమయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను మోసం చేయడం మొదలుపెట్టారు. మోసపోవద్దని చెప్పడానికి వెళ్లిన నాన్నను నానా మాటలు అన్నారు. ఆవిడ జీవితం అలా కావడానికి ఆమే కారణం. ► మీ అక్కాచెల్లెళ్ల గురించి చెబుతారా? మా నాన్నగారు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మమ్మల్ని బాగా చదివించారు. మేం నలుగురుం బాగా స్థిరపడ్డాం. మా అక్క రేవతి పెద్ద డాక్టర్, నేను కూడా డాక్టర్. చెల్లెలు జయలక్ష్మీ డాక్టర్, చిన్న చెల్లెలు నారాయణి మంచి జర్నలిస్ట్. మా అందరికీ చాలా మంచి పేరుంది. కమలా సెల్వరాజ్, అలమేలు, జెమినీ గణేశన్, రేవతి (పైన) నారాయణి, జయలక్ష్మి నానమ్మ, నాన్న, అమ్మ అలమేలు, ఒళ్లో జయలక్ష్మి (పై వరస) నారాయణి, రేవతిలతో కమల – ఇంటర్వ్యూ: డి.జి. భవాని – కర్టెసీ: సంజయ్, చెన్నై -
అశ్వనీదత్గారికి ఆ లోటు తీరిపోయింది
‘‘నా అభిమాన నటి సావిత్రి అనే విషయం అందరికీ తెలిసిందే. ‘పునాది రాళ్లు’ సినిమాలో సావిత్రిగారు హీరో తల్లి పాత్రలో నటిస్తే.. నేను హీరో ఫ్రెండ్స్లో ఒకడిగా నటించాను. రెండు మూడు సన్నివేశాలు సావిత్రి గారితో కలిసి నటించే అవకాశం కలగడం నా అదృష్టం. మంచి ఆర్టిస్ట్గా ఎదగాలని అప్రిషియేట్ చేశారు. అలాంటి మహనటిపై సినిమా తీయడం. అది కూడా అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో తన కుమార్తెలు స్వప్నా, ప్రియాంకలు చేయడం ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ అత్యద్భుతంగా తీశాడు’’ అన్నారు చిరంజీవి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’. వైజయంతి మూవీస్. స్వప్నా సినిమాస్ బ్యానర్పై ప్రియాంకా దత్ నిర్మించారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘సావిత్రి బయోపిక్ను నాగ్ అశ్విన్ చేస్తున్నాడు అనగానే కొంచెం సందేహం కలిగింది. సావిత్రి గురించి ఏం తెలుసు? ఎంత వరకూ న్యాయం చేయగలడని అనుకున్నాను. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూశాక ఎంత రీసెర్చ్ చేశాడో అర్థం అయింది. తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతినీ పెంచిన వాళ్లలో అశ్విన్ నిలిచారు. సావిత్రిగా కీర్తీ సురేశ్ జీవించింది. జెమినీ పాత్ర చేసిన దుల్కర్ని అభినందిస్తున్నాను. సమంత, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకొని నటించారు. మంచి కమర్షియల్ తీశాను కాని క్లాసిక్ సినిమా తీయలేకపోయాను అని అనేవారు అశ్వనీదత్గారు. స్వప్నా, ప్రియాంక తండ్రికి ఆలోటు లేకుండా ‘మహానటి’ సినిమాను బహుమతిగా అందించారు. ఈ సినిమాకు రివార్డులే కాదు అవార్డులు కూడా వస్తాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయిన మే9నే ‘మహానటి రిలీజ్ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంకా పాల్గొన్నారు. -
మహాద్భుతం
‘‘సావిత్రిగారి గురించి రాసే అర్హత తెచ్చుకున్నాకే ఆమె కథ రాస్తా’... ‘మహానటి’లో జర్నలిస్ట్ మధురవాణి ఇలానే అంటుంది. కానీ సావిత్రి లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాక, ఇన్స్పైర్ అయ్యి అనుభవం పెరిగే వరకూ ఆగకుండా రాస్తుంది. ఆ మాటకొస్తే.. ‘మహానటి’ తీయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ వయసు, అనుభవం ఎంత? చాలా చాలా తక్కువ. అయినా కన్విక్షన్, ప్యాషన్ ఉంటే వయసు, అనుభవంతో పనేంటి? పైగా సావిత్రి లైఫ్ హిస్టరీ తెలుసుకున్నాక నాగ్ అశ్విన్కి ఆమె అంటే విపరీతమైన అభిమానం ఏర్పడింది. అదే ‘మహానటి’ జీవితాన్ని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేలా చేసింది. టైటిల్ రోల్లో కీర్తీ సురేష్, జెమినీ గణేశన్గా దుల్కర్ సల్మాన్ తదితర తారలతో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. సినిమా చూసినవాళ్లు ‘నాగ్ అశ్విన్ బ్రహ్మాండంగా తీశాడు.. కీర్తీ నటన అద్భుతం’ అంటు న్నారు. ట్వీటర్ ద్వారా కొందరు ప్రముఖులు తమ అనుభూతిని పంచుకున్నారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (మే, 9) భారీ వర్షం. చాలా పెద్ద సినిమా (జగదేక వీరుడు అతిలోక సుందరి) తీశామనే ఆనందం. ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు.. ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు. మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా అశ్వనీదత్గారికి ఆ రోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికీ మర్చిపోలేదు. సరిగ్గా అదే రోజున ‘మహానటి’ విడుదలైంది. ఆ రోజున ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఈ రోజు ‘మహానటి’ నిర్మించడానికీ అంతే ధైర్యం కావాలి. సావిత్రిగారి చరిత్రను తరతరాలకు అందించిన స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్కి ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తీ జీవించింది. జెమినీ గణేశన్గా దుల్కర్ నటన అద్భుతం. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్కు నా అభినందనలు. – దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మహానటి క్లాసిక్, ఇన్స్పిరేషనల్ బయోపిక్. కీర్తీ సురేశ్ ‘మాయాబజార్’ డ్యాన్స్లతో సావిత్రిగారిని తిరిగి తీసుకువచ్చింది. సమంతా అదరగొట్టింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఇలాంటి క్లాసిక్ మాకు అందించినందుకు వైజయంతీ మూవీస్కు స్పెషల్ థ్యాంక్స్. – ‘మెర్సల్’ ఫేమ్ దర్శకుడు అట్లీ సావిత్రిగారిలా కీర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ల్లో ఒకటి. కేవలం ఇమిటేటింగ్ కాదు, సావిత్రి గారి పాత్రకు ప్రాణం పోసింది. దుల్కర్ ఈజ్ ఫెంటాస్టిక్. నేను అతని ఫ్యాన్ అయిపోయా. కంగ్రాట్స్ నాగ్ అశ్విన్, స్వప్నా. మీ నమ్మకం, డిటర్మినేషన్ అద్భుతం. – దర్శకుడు రాజమౌళి థ్యాంక్యూ నాగ్ అశ్విన్.. ఈ సినిమా తీసినందుకు. సావిత్రిగారు అమరులు. నీ రైటింగ్, నీ రీసెర్చ్, నీ స్క్రీన్ప్లే గురించి మాట్లాడటానికి నా దగ్గర మాటలు లేవు. నాగీ ఆలోచనను, అతని కన్విక్షన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించినందుకు స్వప్నా, ప్రియాంకకు కంగ్రాట్స్. టేక్ ఏ బౌ గర్ల్స్. సమంతా.. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం గ్రేట్. నీ రోల్ను కమాండబుల్గా చేశావు. క్లైమాక్స్లో నీ నటన చాలా రోజులు గుర్తుండిపోతుంది. – దర్శకుడు వంశీ పైడిపల్లి నాగ్ అశ్విన్ నన్ను సావిత్రిగారి ఎరాలోకి తీసుకువెళ్లిపోయారు. ఏం సినిమా... ఇలాంటి పాత్ర చేసే అవకాశం కీర్తీ సురేశ్కి రావడం నిజంగా బ్లెస్డ్. అక్కినేని నాగేశ్వరరావుగారిలా చైతన్య సూపర్బ్. స్వప్నా అండ్ టీమ్కు కంగ్రాట్స్. – దర్శకుడు మారుతి నాగ్ అశ్విన్, స్వప్నా, వైజయంతి మూవీస్ బోల్డ్ ఆలోచన ఇది. అద్భుతమైన నటీనటులతో సినిమా ఎగ్జిక్యూట్ చేశారు. నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నా. ప్రతి ఒక్కరి నటన నచ్చింది. ‘కీర్తీ యూ కిల్డ్ ఇట్’. సమంతా.. నన్ను ఏడిపించేశావ్. దుల్కర్.. నువ్వు సూపర్. మోహన్బాబుగారు, విజయ్, క్రిష్, ప్రకాశ్ రాజ్ అందరూ కన్విన్సింగ్గా చేశారు. తాత రోల్లో చైతన్యను చూడటం హ్యాపీగా ఉంది. హార్ట్ ఈజ్ హ్యాపీ. – సుశాంత్ -
అమ్మ ఎదిగిన తీరును బాగా చూపించారు
-
చిన్నప్పటి నుంచి చివరి క్షణం వరకూ...
‘‘సావిత్రిగారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఎప్పుడో కలిగింది. కానీ ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ తీయాలనే కోరిక ఇంకా బలంగా పెరిగింది. సావిత్రిగారి రియల్ లైఫ్, రీల్ లైఫ్ ఒకేలా నడిచాయి. స్క్రీన్ ప్లే కూడా అలానే డిజైన్ చేస్తూ కథ రాసుకున్నాను. సావిత్రిగారి లైఫ్లో చిన్నప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకూ జరిగిన అన్ని ముఖ్యమైన సంఘటనలు సినిమాలో ఉంటాయి’’ అన్నారు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తీ సురేశ్ నటించిన చిత్రం ‘మహానటి’. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – ‘‘కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూశాక ఆడియన్స్కు ఆవిడ మీద గౌరవం పెరుగుతుంది. స్వప్నా, ప్రియాంకా ఇచ్చిన క్రియేటీవ్ సపోర్ట్ సూపర్. ఈ బ్యానర్లో కాకపోయుంటే ఇంత గొప్పగా తీసుండకపోవచ్చేమో. మిక్కీ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎన్టీఆర్ గారి పాత్ర కోసం తారక్ని అడిగాం. కుదరలేదు. అయినా అభిమానులకోసం చిన్న ట్రీట్ ఏర్పాటు చేశాం. 99 శాతం నిజమైన సంఘటనలతోనే రూపొందించాం. ప్రతీ సీన్ వాస్తవానికి లింక్ అయి ఉంటుంది. సావిత్రి గారు యాక్ట్ చేసిన ముఖ్యమైన 11 సినిమాలను టచ్ చేశాం. -
ఇంట్లో పులి.. భయపడ్డ జెమినీ
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం ‘మహానటి’. కీర్తీ సురేశ్ సావిత్రి పాత్రను పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్స్పై ప్రియాంకా దత్త్ నిర్మించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ‘మహానటి’లో సావిత్రి గురించి మనందరికీ తెలియని సావిత్రి ఇష్టాలు, గమ్మతైన అలవాట్లు చూపించనున్నారు. అందులో కొన్ని... ► సావిత్రి కార్లను ఎక్కువగా ఇష్టపడేవారు. రేస్ కార్ డ్రైవర్ కూడా. ఒకానొక సమయంలో చెన్నైలో ఎక్కువ రేస్ కార్ల కలెక్షన్ సావిత్రి దగ్గరే ఉండేది. ఇక్కడ కీర్తీ సురేశ్ కారు పక్కన నిలబడి ఇచ్చిన పోజు సినిమాలోనిదే. ► ఓసారి మైసూర్ వెళ్లినప్పుడు మైసూర్ మహారాజ్ ప్యాలెస్లో టైగర్స్ ఉండటం గమనించిన సావిత్రి, పిల్లలు ఆడుకోవటానికి ఒకదాన్ని ఇంటికి తీసుకువెళ్లారట. ఇంట్లో సడన్గా పులిని చూసిన ఆమె భర్త ‘జెమినీ’ గణేశన్ భయపడ్డారట. ► సావిత్రి విపరీతమైన స్పోర్ట్స్ అభిమాని. బ్యాడ్మింటన్, షటిల్ ఎక్కువగా ఆడేవారు. ► స్విమ్మింగ్ మీద అమితమైన ఇష్టంతో ఇంట్లోనే ఓ పెద్ద స్మిమ్మింగ్ పూల్ని కట్టించుకున్నారు. ► సావిత్రికి గోల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఏకంగా ఒక కంసాలిని ఇంట్లో పెట్టుకున్నారట. తనకు నచ్చిన డిజైన్తో జ్యూయలరీ తయారు చేయించుకునేవారట. అలాంటి నగలనే సినిమాలో కీర్తీ వాడారు. -
మేలో మెలోడీలు
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ పోషించారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్పై ప్రియాంకా దత్ నిర్మించారు. ‘మహానటి’ సినిమా ఆడియోను మే 1న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన మొదటి పాట ‘మూగ మనసులు’కు విశేష స్పందన లభిస్తోంది. మిక్కీ జె.మేయర్ కంపోజ్ చేసిన పాటలు అలనాటి పాటలకు దీటుగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది. -
క్లాప్.. క్లాప్
‘హలో’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అఖిల్. తొలి సినిమా ‘తొలిప్రేమ’తోనే సూపర్ హిట్ సాధించారు దర్శకుడు వెంకీ అట్లూరి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. దేవుని పటాలకు నమస్కరిస్తున్న అఖిల్పై తీసిన తొలి షాట్కి నాగార్జున క్లాప్ ఇచ్చారు. హీరో దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మేలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జి సి. విలియమ్స్. -
మహానటిని వదల్లేక!
సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తీ సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. ‘మహానటి’ షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్రబృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తీ సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్బాబుగారు, రాజేంద్ర ప్రసాద్గారు స్ట్రాంVŠ సపోర్ట్గా నిలబడ్డారు. కీర్తీ సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
చిరస్థాయిగా మహానటి
అలనాటి అందాలతార, అభినయ రాణి సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. తమిళ్లో ‘నడిగర్ తిలకం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కీర్తీ సురేశ్ టైటిల్ రోల్లో, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ అశ్విన్ దర్వకత్వంలో రూపొందుతోంది. మోహన్బాబు, ప్రకాశ్రాజ్, భానుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు.వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. మే 9న ‘మహానటి’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఉగాది సందర్భంగా చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. దాదాపు 27 ఏళ్ల కిత్రం వైజయంతీ మూవీస్ సంస్థ నుంచి 1990 మే 9న చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తేదీన ‘మహానటి’ చిత్రం విడుదల కానుండటం విశేషం. ‘‘మహానటి సావిత్రి కథని వెండితెరపై దర్శకుడు ఆవిష్కరించిన తీరు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అచ్చం సావిత్రి, జెమినీ గణేషన్లా...
ప్రస్తుతం సినీ అభిమానులను దాదాపు ముప్పై, నలభైయేళ్లు వెనక్కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు దర్శకులు. అందులో ఒకటి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న రంగస్థలం, మరొకటి నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న మహానటి చిత్రం. 1980 నేపథ్యంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ చూసిన ప్రేక్షకులు అప్పటి కాలం అనుభూతికి లోనవుతున్నారు. ఇక సావిత్రి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహానటి. అంటే దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులను తెరపై ఆవిష్కరిస్తున్నాడు నాగ్ అశ్విన్.అయితే మహానటికి సంబంధించిన సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల అయింది. అయితే ఆ సినిమాలో ఇతర పాత్రలకు సంబంధించి ఎలాంటి న్యూస్తో పాటు ఫోటోలు బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సావిత్రి, జెమినీ గణేషన్లను తలపించేలా కీర్తిసురేశ్, దుల్కర్ సల్మాన్ల ఫోటో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోను ఎవరైనా అభిమాని డిజైన్ చేసి ఉంటాడని కొంతమంది, మహానటి పోస్టర్ లీకైందని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా... ఈ చిత్రం మాత్రం నాటి తరం తారాగణాన్ని గుర్తుచేసేలా...సరికొత్త అనుభూతికి గురయ్యేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ పోస్టర్ పై చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఐ యామ్ అవినాష్
అవినాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. వీకెండ్ పార్టీలు, పబ్లు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అవుటింగ్లు. పుల్ బిందాస్ లైఫ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది లైఫ్ ఎందుకవుతుంది? సడన్గా లైఫ్లో బిగ్ టర్న్. అంతే ఆల్ చేంజ్. జాబ్లోనే కాదు అతని లైఫ్లో కూడా. హిందీ చిత్రం ‘కర్వాన్’ స్టోరీ లైన్ ఇదేనట. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, కృతి కర్భందా, మిథిలా పాల్కర్, రోనీ స్క్రూవాలా ముఖ్య తారలుగా ఆకాశ్ ఖురానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘‘ఇర్ఫాన్ ఖాన్, రోనీ స్క్రూవాలాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమా జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్ డే నుంచి షూటింగ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంత మంచి టీమ్, ఇలాంటి మంచి సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దుల్కర్ సల్మాన్. రోడ్ జర్నీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుందట. అది సరే.. ఇంతకీ అవినాష్ ఎవరో చెప్పలేదు కదూ. తెలుగులో అయితే.. అఖిల్ గుర్తుకు రావొచ్చు. ‘హలో’లో తను చేసిన పాత్ర పేరది. బట్... ‘కర్వాన్’లో మై నేమ్ ఈజ్ అవినాష్ అంటున్నారు దుల్కర్ సల్మాన్. -
లైక్ డాడ్స్ – లైక్ సన్స్
మమ్ముటి, మోహన్లాల్ మలయాళ సూపర్ స్టార్స్. ఇద్దరూ సూపర్ స్టార్స్ అంటే పోటీ సహజమే. కానీ అది కేవలం సినిమాల వరకు మాత్రమే. బయట వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. వాళ్లనే వాళ్ల వారసులు కూడా ఫాలో అవుతున్నారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ హీరోగా హిట్. ఇప్పుడు మెహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ‘ఆది’ సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకు పరిచయం అయ్యాడు. ‘ఆది’ సినిమా ఈ నెల 26న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణవ్ డెబ్యూ సినిమాకు దుల్కర్ సల్మాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లెటర్ రాసి, ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. ‘‘డియరెస్ట్ అప్పు, ‘ఆది’ సినిమాకు ఆల్ ది వెరీ బెస్ట్. మనిద్దరం ఎప్పుడూ మంచి ఫ్రెండ్లీ బాండ్ను షేర్ చేసుకున్నాం. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్ చిన్నపిల్లాడివి. మనం ఫ్రెండ్స్ అయినప్పడు నీకు ఏడేళ్లు. నేను హై స్కూల్లో చదువుతున్నాను. నువ్వు నాకు ఎప్పటికీ ‘లిటిల్ బ్రదర్’వే. నీ ప్రతీ స్టెప్ను అప్రిషియేట్ చేస్తూ, నీ సక్సెస్ కోరుకుంటున్నాను. నీ పెరెంట్స్, సిస్టర్ నీ ఎంట్రీకు ఎంత ఎగై్జటెడ్గా ఉన్నారో నాకు తెలుసు అండ్ వాళ్లు అస్సలు వర్రీ అవ్వాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నువ్వు పుట్టిందే సూపర్ స్టార్ అవ్వడం కోసం’’ అంటూ ప్రణవ్కు హృదయపూర్వక విషెస్ తెలిపారు దుల్కర్ సల్మాన్. చాలా బాగుంది కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏ నటుడైనా తన తొలి సినిమాను స్క్రీన్ పై చూసుకొని మురిసిపోవాలనుకుంటాడు. కానీ ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం అందుకు భిన్నం. ప్రణవ్కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. తన తొలి సినిమా ‘ఆది’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే తన ఫేవరేట్ ప్లేస్ హిమాలయాలకు వెళ్లిపోయాడట. ప్రణవ్ తనను తాను ఇంకా స్క్రీన్ మీద చూసుకోలేదు అని దర్శకుడు జీతూ జోసెఫ్ పేర్కొన్నారు. ‘ఆది’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణవ్ యాక్షన్ సీక్వెన్స్ బాగా చేశాడని, మిగతా సీన్స్ కూడా ఓకే అని టాక్. సో.. మోహన్ లాల్ ఫుల్ హ్యాపీ అన్నమాట. -
అచ్చంగా ఆయనలానే...
ఇక్కడున్న ఫొటో చూశారుగా! తమిళ సినిమాలు ఫాలో అయ్యేవారికి అచ్చంగా ప్రముఖ నటుడు జెమినీ గణేశన్లాగా ఉన్నారనిపిస్తుంది కదూ! కానీ మీరు చూస్తున్న ఫొటోలో ఉన్నది మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగఅశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ‘నడిగర్ తిలగమ్’ అని తమిళ్లో టైటిల్ పెట్టారు. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నారు. దుల్కర్కు సంబంధించిన సీన్స్ను బుధవారంతో కంప్లీట్ చేశారు. అందుకని దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. మోహన్బాబు, దర్శకుడు క్రిష్, సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
గోవా బీచ్లో నటుడి మృతదేహం!
మలయాల నటుడు సిద్ధు ఆర్ పిళ్లై మృతదేహం సోమవారం గోవా బీచ్లో కనిపించింది. సిద్దు ప్రముఖ నిర్మాత పీకేపీ పిళ్లై కుమారుడు. జనవరి 12న సిద్దు గోవాకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఏమీ జరిగిందో తెలియదు. సడన్గా గోవా బీచ్లో సోమవారం శవమై కనిపించారు. సిద్ధు తల్లి మృతదేహాన్ని గుర్తుపట్టారు. ఇది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు ఆయన బీచ్లో మునిగిపోయారా అనే విషయంపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సిద్ధు శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వం వహించిన ‘సెకండ్ షో’ సినిమాతో నటుడిగా తన కెరీర్ని ప్రారంభించారు. ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా సిద్ధు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సెకండ్ షో సినిమా షూటింగ్లో సిద్ధు ఉత్సాహంగా ఉండేవాడని, ఆయన మృతి చాలా బాధాకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. Disturbed and sad about the passing of #SidhuRPillai ! Was an excited and vivacious youngster during #SecondShow. Prayers to his family 😞 — dulquer salmaan (@dulQuer) January 16, 2018 -
ఎటో వెళ్లిపోయింది మనసు!
సండేని ఫన్డేగా ఫుల్ జోష్తో దిల్ ఖుష్ అయ్యేలా ఎంజాయ్ చేయాలనుకున్నారు హీరోయిన్ సమంత. కానీ, దర్శకుడు నాగ అశ్విన్ షూట్ ప్లాన్ చేయడంతో సమంత షూట్లో జాయినైపోయారు. వృత్తి పట్ల సమంతకు అంత డెడికేషన్. సెట్లో సమంత యాక్షన్ ఇరగదీసేస్తున్నారు కానీ షూట్ గ్యాప్లోనే ఎటో వెళ్లిపోయింది మనసు అన్నట్లు ఆలోచిస్తున్నట్లున్నారట. అందుకే నాగ అశ్విన్పై సరదాగా సెటైర్ వేశారీ బ్యూటీ. ‘‘ప్రజెంట్ నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ లిస్ట్లో నాగ అశ్విన్ లేరు. సరదాగా గడపాల్సిన నా సండే.. వర్క్ అంటూ సెట్లో గడిచిపోయింది’’ అని సమంత పేర్కొన్నారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహానటి’లో కీర్తీ సురేశ్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. మెహన్బాబు, దుల్కర్సల్మాన్, సమంత, దర్శకుడు క్రిష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇటీవల 1980 కాలం నాటి లూనా ఫొటోను సమంత బయటపెట్టారు. ఇప్పుడు ఆ కాలంనాటి ఎమ్టీఎస్ ఫొటో ఒకటి (ఇన్సెట్లో చూడొచ్చు) ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
నా కొత్త బండి ఎలా ఉంది
కావాలంటే పడవంత కారులో షికారు చేయవచ్చు. అనుకుంటే విమానంలో ఆనందంగా గగన విహారం చేయవచ్చు. కానీ కథానాయిక సమంత మాత్రం మోపెడ్ ఎక్కుతా. లూనాలో గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే ఎంత లొల్లికైనా డేర్ చేస్తా అంటున్నారీ బ్యూటీ. ఈ గాలింపు, ఈ డేరింగ్ ప్రస్తుతానికైతే రీల్ లైఫ్ కోసమేనండి. అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా ‘ఏవడే సుబ్రమణ్యం’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్నారు. మోహన్బాబు, దుల్కర్ సల్మాన్, సమంత కీలక పాత్రలు చేస్తున్నారు. సమంత జమున పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ‘‘1980కి వెళ్తున్నాం. కొందరి జీవిత చరిత్రలు అందరూ తెలుసుకోవడానికి అర్హమైనవి. అలాంటి సావిత్రిగారు జీవించిన టైమ్ని ఇప్పుడు రీ–క్రియేట్ చేసిన ప్లేస్లో నటించడం ఆనందంగా ఉంది. ఆ కాలం నాటి పీస్ (లూనా) నా చెంతకు చేరడం హ్యాపీగా ఉంది. 1960 అండ్ 1970లలో జరిగే సినిమా ‘మహానటి’’ అని సమంత పేర్కొన్నారు. నా కొత్త బండి ఎలా ఉందో చెప్పండి అన్నట్లు ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
గన్ కాదు గులాబి
ఒక్క అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం చాలా సినిమాల్లో చూశాం. ఆ ఇద్దరిలో ఒక యువకుడి ప్రేమ మాత్రమే గెలుస్తుంది. ఇలా ముక్కోణపు ప్రేమకథలు ఎన్ని వచ్చినా.. ఏదో ఒక్క కొత్త ట్విస్ట్ పెట్టి, కొత్త కథలా చూపిస్తుంటారు దర్శకులు. ఇప్పుడు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అలాంటి లవ్స్టోరీ చూపించే పని మీదే ఉన్నారు. యాక్చువల్గా అనురాగ్ అంటే గుర్తొచ్చేది గన్స్. ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘బాంబే వెల్వట్’ వంటి యాక్షన్ మూవీస్ అందుకు నిదర్శనం. కానీ, ఈసారి ఆయన గులాబీలు వైపు మొగ్గు చూపారు. మరి.. ప్రేమకథ అంటే గులాబీలు ఉంటాయి కదా! ఇందులో తాప్సీ, విక్కీ కుశాల్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్కి ఇది రెండో హిందీ సినిమా. దుల్కర్ తొలి హిందీ చిత్రం ‘కర్వాణ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ చిత్రం ‘కమ్మాటిపాడం’లో దుల్కర్ నటన చూసి అనురాగ్ క్లీన్ బౌల్డ్ అయ్యారట. అందుకే తన తాజా లవ్స్టోరీకి ఆయన్ను తీసుకోవాలనుకున్నారట. ఆనంద్.ఎల్.రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మన్మర్జియా’ అనే టైటిల్ ఖరారు చేశారు. -
ఓకే బంగారం అంటారా?
షాలినీ పాండే... ఇప్పుడు హాట్ టాపిక్. టీ టౌన్ అదేనండీ.. మన టాలీవుడ్... కో టౌన్ అంటే.. కోలీవుడ్లో షాలినీ పాండేకి బోలెడంత క్రేజ్. ఆ క్రేజ్ అంతా ‘అర్జున్ రెడ్డి’ తెచ్చిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్తో షాలినీ పాండేకి ఓవర్ నైట్ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ఇటు తెలుగులో కాకుండా అటు తమిళ పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘100% పర్సంట్’ తమిళ రీమేక్ ‘100% కాదల్’లో నటిస్తున్నారు. ఇటు తెలుగులో ‘మహానటి’లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ సినిమాకి అవకాశం వచ్చిందట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో షాలినీ పాండేని కథానాయికగా అడిగారట. ‘ఓకే బంగారం’తో దుల్కర్కి తెలుగు, తమిళంలో మంచి పేరొచ్చింది. ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర చేస్తున్నారు. ఇదే చిత్రంలో షాలినీ కూడా నటిస్తున్నారు. కాకపోతే జోడీగా కాదు. సో... ద్విభాషా చిత్రానికి షాలిని ఓకే చెబితే.. ఈ ఇద్దరినీ జంటగా చూడొచ్చు. మరి.. ‘ఓకే బంగారం’ అంటారా? అనే క్వొశ్చన్ అవసరం లేదేమో. ఎందుకంటే, షాలిని పచ్చజెండా ఊపేస్తారని ఊహించవచ్చు. -
అందమైన జీవితంలో...
‘జీవితం ఎంతో అందమైనది కదూ... తల్లిదండ్రుల ప్రేమానుగారాలు, టీనేజ్లో ప్రేమాయణాలు, అలకలు, సరదాలు... జీవితంలో ఎన్ని ఉంటాయో కదూ’ అని చెబుతున్నారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్కి జోడీగా ఆమె నటించిన మలయాళ సినిమా ‘జొమోంటే సువిశేషంగాళ్’. ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్. మలయాళంలో 50కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాను పత్తిపాటి శైలజ సమర్పణలో మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై ‘అందమైన జీవితం’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 13న తీసుకొస్తున్నారు నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతూ–‘‘తండ్రీకొడుకల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించే చిత్రమే ‘అందమైన జీవితం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్. -
స్ట్రైట్ మూవీ ప్లాన్ చేస్తున్నా!
ఇప్పటివరకు నేను అందించిన అనువాద చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. భవిష్యత్లోనూ నేనందించే చిత్రాలకు ఇదే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ నిర్మించాలన్నది నా కల. ఆ కలను త్వరలోనే నెరవేర్చుకుంటా’’ అన్నారు సురేశ్ కొండేటి. పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించి, ‘సంతోషం’ పత్రికాధినేతగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. నేడు సురేశ్ కొండేటి పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ – ‘‘ప్రేమిస్తే’, ‘జర్నీ, మహేశ్, ప్రేమించాలి, పిజ్జా’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించాను. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ను త్వరలో తెలుగులో విడుదల చేయబోతున్నాను. ఈ చిత్రానికి ‘జనతా హోటల్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని చెప్పారు. -
కెమిస్ట్రీ కుదిరింది!
దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కలి’. సూరెడ్డి గోపాలకృష్ణ (యూ.ఎస్.ఎ) సమర్పణలో లక్ష్మీచెన్నకేశవ ఫిలింస్ పతాకంపై డి.వి కృష్ణస్వామి తెలుగులో ‘హేయ్.. పిల్లగాడ’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా కృష్ణస్వామి మాట్లాడుతూ – ‘‘చక్కని ప్రేమకథ. దుల్కర్, సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. గోపీ సుందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ హెలైట్గా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నలుగురు ముద్దుగుమ్మలతో సోలోగా..
తమిళసినిమా: యువ నటుడు దుల్కర్సల్మాన్ మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడన్న విషయం తెలిసిందే.ఈయనకు కోలీవుడ్లోనూ మంచి ఆదరణ లభించింది. ఇంతకు ముందు వాయై మూడి పేశవు, కాదల్ కణ్మణి చిత్రాల్లో నటించిన దుల్కర్సల్మాన్ తాజాగా సోలో అంటూ నలుగురు ముద్దుగుమ్మలతో వస్తున్నారు. రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్జైన్ నెఫెక్స్ ఎంటర్టైనర్ పతాకంపై గెట్అవే ఫిలింస్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం సోలో. తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రానికి బిజాయ్నంబియార్ దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్సల్మాన్కు జంటగా సాయి ధన్సిక, నేహాశర్మ, శృతి హరిహరన్, ఆర్తీ వెంకటేశ్ నలుగురు అందగత్తెలు హీరోయిన్లుగా నటించడం విశేషం. అదేవిధంగా దుల్కర్సల్మాన్ ఈ చిత్రంలో నాలుగు విభిన్న గెటప్లలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలో ఈ నెల 5వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా చిత్ర టీజర్ను ప్రదర్శించారు. అనంతరం సమావేశంలో చిత్ర హీరో దుల్కర్సల్మాన్ మాట్లాడుతూ మీరిప్పుడు చూసింది టీజర్ మాత్రమేనని, మెయిన్ చిత్రం ఇంకా అదుర్స్గా ఉంటుందని అన్నారు. నాలుగు కథలతో కూడిన ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దర్శకుడు బిజాయ్ నంబియార్ తనకు కలిగించడం అదృష్టంగా భావిస్తున్నట్లు దుల్కర్సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు బిజాయ్ నంబియార్, నేహాశర్మ, శృతిహరిహరన్, ఆర్తీవెంకటేశ్, సతీష్, నిర్మాత అనిల్జైన్ పాల్గొన్నారు. సోమవారం చిత్ర దర్శక నిర్మాతలు నటుడు రజనీకాంత్ను కలిసి చిత్ర ట్రైలర్ను ఆయనకు చూపించారు. ట్రైలర్ చాలా బాగుందంటూ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రశంసించారని వారు తెలిపారు. -
మరో ఆఫర్
తమిళసినిమా: పెళ్లిచూపులు చిత్ర కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ–2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పోరి ప్రస్తుతం విక్రమ్కు జంటగా నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపై చాలా ఆశలనే పెటుకుంది. గౌతమ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో మకాం పెట్టిన రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో లక్కీ ఆఫర్ను దక్కించుకుంది. నటుడు దుల్కర్ సల్మాన్తో రొమాన్స్ చేసే అవకాశం ఈ బ్యూటీని వరించిందన్న తాజా సమాచారం. డేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో దుల్కర్సల్మాన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్గా నటించనుంది. కాగా ప్రస్తుతం దుల్కర్సల్మాన్ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబరులో ప్రారంభం కానున్న డేసింగ్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. కాగా ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట. -
నిజాలే చూపించాలి!
తమిళసినిమా: మహానటి సావిత్రి జీవిత చరిత్ర తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సావిత్రిగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. జెమినీగణేశన్గా మాలీవుడ్ యువ నటుడు దుల్కర్సల్మాన్ నటిస్తుండగా ఒక ప్రత్యేక పాత్రలో చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్పైకి వెళ్లింది. అభినేత్రి సావిత్రి చరమ దశలో ఉన్నప్పుడు, కన్నుమూసిన తరువాత ఆమె గురించి చాలా కథనాలు వెలువడ్డాయి. మరణానికి ముందు ఆర్థికసమస్యలను ఎదుర్కొన్నారన్నది ఆ కథనాల్లో ప్రధానమైంది. సావిత్రి మరణించడానికి ముందు ఆమె ఫొటోలు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫొటోల విషయమై సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి మండిపడ్డారు. ఆమె పేర్కొంటూ తన తల్లి ఆర్థికసమస్యలతో ఎప్పుడూ కష్టపడలేదన్నారు. రెండు తరాలు సుఖ సంతోషాలతో జీవిం చేలా తమకు ఆస్తులను ఇచ్చారని తెలిపారు.తన తల్లి మధుమేహ వ్యాధికి గురయ్యారని అన్నారు. అయితే తన భర్త జెమినీగణేశన్ బాగానే చూసుకున్నారని చెప్పారు. తన తల్లి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తున్న చిత్రంలో నిజాలే చూపిం చాలని, స్క్రిప్ట్ మాకు చూపించి ఆ మోదం పొందిన తరువాతే షూటింగ్ జరపాలని దర్శక నిర్మాతలకు షరతులు విధించినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు నటి సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పినట్లు తమిళపత్రికలు పేర్కొన్నాయి. -
హేయ్... పిల్లగాడ
...‘ఫిదా’లోని ఈ పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్కు తెలుగు ప్రేక్షకులు ‘మేము ఫిదా’ అన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడీ పాటలోని తొలి రెండు పదాలనే సాయిపల్లవి కొత్త సినిమాకు టైటిల్గా పెట్టారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా సామీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కలి’. ఈ సినిమాను తెలుగులో ‘హేయ్... పిల్లగాడ’ పేరుతో విడుదల చేస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ అధినేత డీవీ కృష్ణస్వామి. ఈ సినిమా లోగోను దర్శకులు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళ, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలు గులో కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక టిపికల్ లవ్స్టోరీ. దుల్కర్, సాయిపల్లవిల నటన, గోపీసుందర్ సంగీతం సినిమాకు హైలైట్గా నిలుస్తాయి. సెప్టెంబర్ 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డీవీ కృష్ణస్వామి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిణ్ శ్రీనివాస్, సహ నిర్మాత: వి. చంద్రశేఖర్. -
సావిత్రీ గణేశుడు
అలనాటి అందాలతార సావిత్రి జీవితంలో కీలక వ్యక్తి తమిళ నటుడు ‘జెమిని’ గణేశన్. సావిత్రి జీవిత కథతో నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ సంస్థ ‘మహానటి’ సినిమా తీయనున్నట్టు ప్రకటించగానే... ‘జెమిని’ గణేశన్ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది? ఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ మొదలైంది. తమిళ హీరో సూర్య నుంచి ప్రకాశ్రాజ్ వరకు పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, ‘జెమిని’ గణేశన్ పాత్రకు మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడు, మణిరత్నం ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ను తీసుకున్నారు. తొలుత తెలుగు, తమిళ భాషల్లో తీయాలనుకున్న ఈ సినిమాను ఇప్పుడు మలయాళంతో కలిపి మూడు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సావిత్రిగా కీర్తీ సురేశ్, జర్నలిస్ట్గా సమంత నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో మొదలు కానుంది. అనుష్కను ఈ సినిమాలో కీలక పాత్ర (భానుమతి/జమున?) కు సంప్రదించిన సంగతి తెలిసిందే. -
ముగ్గురమ్మాయిలతో..
ఓ కాదల్ కణ్మణి చిత్రంతో రొమాంటిక్ హీరోగా తమిళ ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడైన ఈయన మాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. వాౖయె మూడి పేసు చిత్రం ద్వారా కోలీవుడ్కు రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్ తో కలిసి నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం దుల్కర్సల్మాన్ ను మరో మెట్టు ఎక్కించింది. మణిరత్నం మరో అవకాశం ఇవ్వచూపగా దుల్కర్ దాన్ని అందుకోలేకపోయారు. నిజానికి కీర్తి నటిస్తున్న కాట్రు వెలియడై చిత్రంలో నటించే అవకాశం మొదట దుల్కర్ సల్మాన్ నే వరించింది. ఆయన మలయాళ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇందులో నటించలేకపోయారని సమాచారం.అంతే కాదు మరిన్ని కోలీవుడ్ అవకాశాలు తలుపు తట్టినా అంగీకరించని దుల్కర్సల్మాన్ తాజాగా ఒక నవ దర్శకుడికి పచ్చజెండా ఊపారు. ఆర్.కార్తీక్ అనే నవ దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు యువళ గీతాలు పాడనున్నారట.అందులో నటి మేఘా ఆకాశ్, నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నటి ఎంపిక జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపారు. మేఘా ఆకాశ్ ఇప్పటికే ధనుష్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇనై నోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటిస్తున్నారన్నది గమనార్హం. ప్రస్తుతం మలయాళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి మే నుంచి కాల్షీట్స్ కేటాయించినట్లు తెలిసింది. -
మణి మనసు మార్చుకున్నారా?
మణిరత్నం తీసే సినిమాల్లోని హీరో హీరోయిన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటారు. ఆ విధంగా సెలక్ట్ చేయడంలో మణిరత్నం చాలా శ్రద్ధ చూపిస్తారు. మోహన్-రేవతి, కమల్హాసన్-శరణ్య, అరవింద్ స్వామి-మధుబాల, జగపతిబాబు-రేవతి, అరవింద్ స్వామి-మనీషా కొయిరాలా, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్... ఇలా మణిరత్నం సినిమాలో నటించిన అన్ని జంటలూ దాదాపు బాగుంటాయి. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జోడీ కూడా కనువిందు చేసింది. అందుకేనేమో ఈ చిత్రం హిందీ రీమేక్లో మణిరత్నం వేరే జంటను ఊహించలేకపోతున్నారని సమాచారం. ‘ఆషికీ-2’ ద్వారా హిట్ పెయిర్ అనిపించుకున్న ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్లను ఈ రీమేక్లో నాయకా నాయికలుగా అనుకున్నారనే వార్త వినిపించింది. కానీ, ఆ తర్వాత మణిరత్నం మనసు మారిందని భోగట్టా. హిందీ రీమేక్లో కూడా దుల్కర్, నిత్యాలనే నటింపజేయాలనుకుంటున్నారట. -
మళ్లీ జతగా వస్తున్నారు!
అతను కోటీశ్వరుడి కొడుకు. చెఫ్ కావాలన్నది అతని ఆశయం. అతని తండ్రికి అది నచ్చదు. స్విట్జర్లాండ్లో చదువుకుని, ఇండియా వచ్చి, ఓ హోటల్లో చెఫ్గా చేరతాడు. చెఫ్గా చేస్తున్న అతనికి ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లగలిగాడా? ఆ హోటల్తో అతనికి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడటానికి కారణం ఏంటి? అనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఆల్రెడీ హిట్ పెయిర్ అనిపించుకుని, ఇటీవల ‘ఓకె బంగారం’తో మరోసారి దాన్ని నిజం చేసుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘జతగా’ పేరుతో నిర్మాత సురేశ్ కొండేటి తెలుగులోకి విడుదల చేయనున్నారు. ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. పాటలను, చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేస్తాం’’ అని సురేశ్ చెప్పారు. -
మణి సినిమాలో నాని
సౌత్ హీరోలకే కాదు, నార్త్ స్టార్ హీరోలకు కూడా మణిరత్నం సినిమాలో నటించడం ఒక కల.. హీరోయిజం, స్టార్డంతో సంబంధం లేకుండా తన కథకు ఎవరైతే సరిపోతారో వారిని వెతికి పట్టుకునే మణిరత్నం, ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తున్నాడు. మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు నాని. టాలీవుడ్లో నాచురల్ ఆర్టిస్ట్గా పేరున్న నాని ... ఈగ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన 'ఓకె బంగారం' సినిమా తెలుగు వర్షన్కు డబ్బింగ్ చెప్పిన నాని, మణిరత్నం దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. అదే జోష్లో ఇప్పుడు మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్లో నటించే ఛాన్స్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా రీవేంజ్ డ్రామాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు మణిరత్నం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఒకేసారి తెరకెక్కించనున్నాడు. మరి నానీని తెలుగు వర్షన్లో హీరోగా సెలెక్ట్ చేశాడా..? లేక వేరే ఏదైనా పాత్రకు తీసుకున్నాడా..? అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా మణిరత్నం నెక్ట్స్ సినిమాలో నాని నటించటం ఖాయంగా కనిపిస్తోంది. -
మమ్ముట్టి కొడుకుతో శ్రీదేవి కూతురు
మమ్ముట్టి కొడుకు శ్రీదేవి కూతురు ఇదేదో సినిమా టైటిల్గా బాగుండేటట్లుంది కదూ... అయితే ఇది సినిమా పేరు కాదు. ఒక క్రేజీ చిత్రం కోసం సూపర్స్టార్ల వారసులు హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారన్న తాజా వార్త. అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు తెరంగేట్రం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వారసుడు అఖిల్ తొలి చిత్రంలో శ్రీదేవి వారసురాలు జాన్వీని నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. కారణాలేమైనా ఆ చిత్రంతో జాన్వీ రంగ ప్రవేశం జరగలేదు. అంతకు ముందు తమిళంలో విజయకాంత్ కొడుకు షణ్ముగపాండియన్కు జోడీగా పరిచయం కానున్నట్లు ప్రచారం జరిగింది. అదీ వార్తలకే పరిమితం అయ్యింది. అలాంటిది కథానాయికగా జాన్వీ ప్రవేశానికి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్కు జంటగా జాన్వీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మలయాళంలో సక్సెస్ఫుల్ హీరోగా వెలుగొందుతున్నారు. ఓ కాదల్కణ్మణి చిత్రంతో తమిళంలోనూ దాని అనువాదంగా రూపొందిన ఓకే బంగారం చిత్రంతో తెలుగులోనూ పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రేజీ జంటతో ఒక బ్రహ్మాండమైన చిత్రం చెయ్యడానికి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. ఈయన ఇటీవల అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్ర కథకుడు. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న విషయం గమనార్హం. విజయేంద్రప్రసాద్ నటి శ్రీదేవితో చర్చించి ఆమెకు కథను వినిపించినట్లు, కథ నచ్చడంతో ఆమె తన కూతుర్ని అందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మొదలగు నాలుగు భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ప్రతీకారం పరిష్కారం కాదు
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ద ర్శకత్వం అనే కత్తికి రెండు పక్కల పదునుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మౌనరాగం, రోజా, ఘర్షణ, గీతాంజలి, నాయగన్, అంజలి, దళపతి ఇలా ఏ తరహా కథనైనా తన స్టైల్లో వెండితెర పై ఆవిష్కరించి పేక్షకులతో చప్పట్లు కొట్టించుకోగల దర్శక సవ్యసాచి మణిరత్నం. తాజాగా ఓ కాదల్ కణ్మణి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల్ని రంజింపజేసిన ఆయన ఇప్పుడు యాక్షన్ వైపు దృష్టి సారించారు. కార్తీ, దుల్కర్ సల్మాన్, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా కమర్షియల్ కోణంలో చిత్రానికి రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇది గ్యాంగ్స్టర్ కథా చిత్రం అనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. అయితే కమర్షియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా దీన్ని మణిరత్నం తీర్చిదిద్దనున్నారని, ఇందులో ప్రతీకారేచ్చ పరిష్కారం కాదనే చక్కని సందేశం కూడా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గం మాట. మణిరత్నం ఈ తాజా చిత్రానికి స్క్రీన్ప్లే కూడా సిద్ధం చేశారని జనవరిలో చిత్రాన్ని సెట్పైకి తీసుకెళ్లడమే తరవాయి అని అంటున్నారు. దీనికి ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. -
'కొడుకు నుంచి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి'
ఎవరినైనా పొగడాలంటే.. అవతలివాళ్లను తిట్టాలన్నది రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ను ప్రశంసల్లో ముంచెత్తడానికి స్వయంగా మమ్ముట్టినే తిట్టిపోశాడు రామూ. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'ఓకే బంగారం' సినిమాను ప్రశంసించేందుకు తన ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్నాడు. ఇప్పుడే తాను మణిరత్నం సినిమా చూశానని, అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం సెన్స్ ఉన్నా.. వాళ్లు మమ్ముట్టికి ఇన్నాళ్లుగా ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసేసుకుని వాటిని ఆయన కొడుక్కి ఇస్తారని రామూ అన్నాడు. దుల్కర్తో పోలిస్తే మమ్ముట్టి ఒక జూనియర్ ఆర్టిస్టు మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మమ్ముట్టి నటనను తన కొడుకు నుంచి నేర్చుకోవాలని.. తాను ఈ మాట నిజంగానే అంటున్నానని నొక్క చెప్పాడు. కొన్నేళ్లలోనే మమ్ముట్టి కొడుకు కేరళ గర్వపడేలా చేస్తాడని.. ఇన్ని దశాబ్దాలుగా మమ్ముట్టి మాత్రం ఆ పని చేయలేకపోయారని కూడా రాంగోపాల్ వర్మ అన్నాడు. Jst saw Mani's film and if the award commitee members have any sense they will take back all awards of Mamooty and give it to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty is a junior artiste compared to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty should learn acting from his son..I mean realistic — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamootys son will make Kerala proud In the non Kerala markets in just years which Mamooty couldn't do for decades — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015