Gangster Nayeem
-
పోలీసుల అదుపులో నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్న
-
గ్యాంగ్స్టర్ నయీం జీవితాధారంగా సినిమా.. ట్రైలర్ విడుదల
కరుడుగట్టిన నేరస్థుడు గ్యాంగ్స్టర్ నయీం జీవితాధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'నయీం డైరీస్' అనే టైటిల్ను ఖరారు చేశారు. వశిష్ట సింహ ప్రధాన పాత్రలో నటించగా, సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు సంపత్ నంది సోమవారం రిలీజ్ చేశారు. ఇలాంటి నిజ జీవిత కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందని సంపత్ నంది తెలిపారు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. హీరో వశిష్ట్ మాట్లాడుతూ 'ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుంది.' అని అన్నారు. ' ఈ సినిమాలో నయీం ఎందుకు క్రిమినల్గా మారాడు. అతన్ని మించిన నేరస్థులు సమాజంలో ఎవరున్నారు ? అనేది సినిమాలో చూపిస్తున్నాం.' అని చిత్ర దర్శకుడు బాలాజీ తెలిపారు. నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్డ్రాప్లో బాగుంటుందని చేశామని నిర్మాత వరదరాజు తెలిపారు. వశిష్ట తామనుకున్న దానికన్న బాగా చేశారని కొనియాడారు. -
నయీం కుడి భుజం శేషన్న జాడేది..?
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు వీడాలంటే శేషన్న దొరకాల్సిందే.. శేషన్న పట్టుకునే విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం ఘోరంగా విఫలమైంది. నయీం హతమై నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటికీ నయీం యాక్షన్ టీమ్ ఇన్చార్జ్ ఆచూకీ లభించలేదంటే సిట్ పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. అతడు చిక్కలేదా..? పోలీసులు పట్టుకోవట్లేదా..? అన్న విషయం స్పష్టం కావట్లేదు. మరోపక్క నయీం రాసిన డైరీల ఆచూకీ లభించకపోవడంలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఆ టీమ్ అత్యంత కీలకం.. షాద్నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో 2016 ఆగస్టు 8న జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమయ్యాడు. ఇది జరిగిన నాటి నుంచి అతడి కేసుల్ని దర్యాప్తు చేసిన, చేస్తున్న పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు చేశారు. కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే అతడి అనుచరుల్ని పట్టుకున్నారు. వీరంతా అప్పటివరకు తెరచాటుగా ఉంటూ నయీం ఆదేశాల మేరకు పని చేస్తూ వచ్చారు. భూ కబ్జాలకు పాల్పడటం, బెదిరింపుల ద్వారా వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లలో కీలకపాత్ర పోషించడంతో పాటు నయీం ఆస్తులకు బినామీలుగా, ఆస్తిపత్రాలు, నగదు తదితరాలను దాచే డెన్లకు కేర్ టేకర్స్గా పని చేశారు. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీం కనుసన్నల్లో పనిచేసేది. వీరి పేర్లు, వ్యవహారాలు గతంలో అనేక సార్లు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నేరగాళ్లు, మాజీ మావోయిస్టులు, పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన, ఎక్కని వారితో కూడిన ఈ టీమ్ నల్లగొండ, హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో యాక్టివ్గా పనిచేసింది. అనేక కేసుల్లో వీరి ప్రస్తావన ఉంది. ఆయుధాల గుట్టు వీడేనా? ఈ యాక్షన్ టీమ్ సాధారణ సమయంలో ఎవరి కంటపడేది కాదు. నయీం ఆదేశాల మేరకు నిర్దేశిత సమయంలో రంగంలోకి దిగడం.. హత్యలు, కిడ్నాప్లకు పాల్పడి ఆపై షెల్టర్ జోన్స్కు వెళ్లిపోవడం వీరి పని. ప్రతి కేసులోనూ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి మరో టీమ్ సిద్ధంగా ఉండేది. నయీంకు చెందిన యాక్షన్ టీమ్ చేసిన ఏ నేరమైనా.. మేమే చేశామంటూ తమ మీద వేసుకునే ఈ టీమ్ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోతుండేవారు. ఈ నేపథ్యంలో ఆయా కేసుల్లో యాక్షన్ టీమ్కు చెందిన వారు కేవలం కుట్రదారులుగానే నమోదయ్యారు. అంతకాలం రాజ్యమేలిన ఈ యాక్షన్ టీమ్ నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నయీం వద్ద, అతడి డెన్లలోనూ దొరికిన భారీ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయం నయీంతో పాటు యాక్షన్ టీమ్కు నేతృత్వం వహించిన శేషన్నకు మాత్రమే తెలిసే అవకాశముంది. గాలించినా ఫలితం శూన్యం.. కేవలం ఆయుధాల సమాచారమే కాదు.. నయీం వ్యవహారంలో అనేక చిక్కుముడుల్ని విప్పగలిగేది శేషన్న మాత్రమే. నయీం ‘వారసత్వాన్ని’కొనసాగించే ప్రయత్నం ఆ యాక్షన్ టీమ్ చేయవచ్చని తొలినాళ్లలో పోలీసులు అనుమానించారు. నయీంకు చెందిన యాక్షన్ టీమ్లో ఏడుగురున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే మహబూబ్నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపి.. పటోళ్ల గోవవర్ధన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్ననే అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసు వర్గాలకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించాయి. ఓ దశలో శేషన్న పోలీసుల అదుపులోనే ఉన్నాడనే వార్తలు వచ్చినా.. ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ గాలింపు మొదలై ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావస్తున్నా శేషన్న పోలీసులకు దొరకలేదు. గ్యాంగ్స్టర్నే పట్టుకున్న పోలీసులు అతడి కుడిభుజాన్ని పట్టుకోలేకపోవడం సిట్ పనితీరుపై సందేహాలకు తావిస్తోంది. డైరీలెన్ని? అవెక్కడ? సుదీర్ఘ కాలం మావోయిస్టులతో కలసి పనిచేసిన నయీంకు డైరీ రాసే అలవాటుంది. నయీం 2010 వరకు రాసిన డైరీలను సొహ్రబుద్దీన్ కేసు భయంతో తగలపెట్టాడని గతంలో చిక్కిన అతడి అనుచరుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు ప్రతి అంకాన్నీ నయీం తన డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశాడు? ఆయా దందాల్లో ఎంత డబ్బు వచ్చింది? దాన్ని ఎవరెవరికి పంచాడు? ప్రధాన అనుచరులెవరు.. ఇలా ఎన్నో అంశాలు డైరీల్లో రాసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత షాద్నగర్తో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న డెన్ల నుంచి పోలీసులు డైరీలు స్వాధీనం చేసుకున్నారనీ వార్తలు వెలువడ్డాయి. అయితే అవెన్ని? ఎక్కడున్నాయి? వాటిలో ఏముంది.. అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. -
ఖాకీలందరికీ క్లీన్చిట్
-
నయీం మేనకోడలు దుర్మరణం
సాక్షి, నల్లగొండ: గ్యాంగ్స్టర్ నయీం మేనకోడలు (నయీం సోదరి సలీమా బేగం కుమార్తె) సాజీదా షాహీనా (35) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి–అద్దంకి రహదారిలో మిర్యాలగూడ వైపు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు.. సాజీదా షాహీనా, ఆమె భర్త మహ్మద్ అబ్దుల్ హైదరాబాద్ హయత్నగర్ సమీపం కుంట్లూరులో నివాసముంటున్నారు. నల్ల గొండలో గృహ ప్రవేశానికి వచ్చిన షాహీనా.. మధ్యలో మిర్యాలగూడ వెళ్లి వస్తానని చెప్పి కారులో బయలుదేరింది. మధ్యాహ్నం 3.30 గంటలకు కారును సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో 120 కిలోమీటర్ల వేగంతో బలంగా ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఇరుక్కుపోయిన షాహీనా మృతదేహాన్ని పోలీసులు బయటికి తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం పలు కేసుల్లో ఆమె జైలుకు వెళ్లి వచ్చింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో అధికారులు నయీం కేసులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడించారు. అయితే ఈ సమాచారంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, పలు అంశాలతో గవర్నర్ నరసింహన్కు ఓ లేఖ రాసింది. దీనిపై పద్మనాభరెడ్డి గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేహాలను వెలిబుచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయీం ఎన్కౌంటర్ జరిగి మూడేళ్లు గడిచిన తరువాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు నివేదికలో రూ. 3.74 లక్షలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి డబ్బులు లెక్కించారు. మరీ ఇంత తక్కువ మొత్తం లెక్కించడానికేనా కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లింది?. రాజకీయ నాయకులకు ఎనిమిది మందికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికిందని అన్నారు. మేము అందులో ఏముందో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగాం. కానీ దర్యాప్తు సమయంలో సమాచారం ఇవ్వలేమని చెప్పారు. డైరీలో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. 2003 నుంచి నయీంపై 8 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటిని అతను చనిపోయాక రీ ఓపెన్ చేశారు. నయీం చనిపోయిన తరువాత 250 కేసులు నమోదైనట్టు చెబుతున్న పోలీసులు.. అతడు బతికి ఉన్నప్పుడు ఏం చేశారు?. ఇప్పటికే నయీం కేసులో తమకున్న అనుమానాలపై గవర్నర్కు లేఖ రాశామ’ని తెలిపారు. చదవండి : నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు -
నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను కోరింది. దీంతో అధికారులు నయీం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నయాం కేసులో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరినవారే కావడం గమనార్హం. నయీం కేసును సిట్కు అప్పగించిన తర్వాత 250 కేసుల నమోదు అయ్యాయి. అంతేకాకుండా 1.944 కేజీల బంగారం, 2,482 కేజీల వెండి, రెండు కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు. ఆ జాబితాలోని పేర్లు... అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్రెడ్డి డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, వెంకటనర్సయ్య పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇన్స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకటరెడ్డి, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేంద్రగౌడ్, దినేశ్, సాదిఖ్మియా టీఆర్ఎస్ నాయకులు.. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య మాజీ సర్పంచ్ పింగల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ్ 2016లో షాద్నగర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంటకాగి.. భారీగా భూ దందాలు సాగించారు. -
శిక్షించండి లేదా..క్షమించండి!
సాక్షి, సిటీబ్యూరో: గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు కావస్తోంది... అతడితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు పోలీసులకు తాఖీదులు జారీ చేసి ఏడాదిన్నర దాటింది... దీనికి వారు సమాధానం ఇచ్చి సంవత్సరం కావస్తోంది... అయినా ఇప్పటికీ దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్కు గురైన వారిపై చర్యలు ఉపసంహరించిన అధికారులు తాఖీదుల విషయం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చార్జ్మెమోలపై నిర్ణయం తీసుకోకుంటే అది తమ పదోన్నతుల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అనేక మందికి చార్జ్మెమోలు... నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి వ్యవహారాలను దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పలువురు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు అనేక మంది పోలీసుల పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరికి నయీంతో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు లభించగా.. మరికొందరు అతడితో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో 20 మందిపై విచారణ నిర్వహించారు. వీరిలో 16 మందికి నయీంతో ఉన్న సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ చార్జ్మెమోలు జారీ చేశారు. సమాధానాన్ని పట్టించుకోలేదు... చార్జ్మెమోలు అందుకున్న వారిలో డీఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వీరంతా ఆరు నెలల్లోపే వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేసిన నయీంతో విధి నిర్వహణలో భాగంగానే సంబంధాలు కొనసాగించామని, ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు అధికారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అతడితో ఎలాంటి సంబంధాలు లేవని, అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్లో అతడు కలిశాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు ప్రతి అధికారీ అతడితో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని, సెటిల్మెంట్లతో సంబంధాలు లేకపోవడమే కాదు అప్పట్లో ఈ వివరాలు తమకు తెలియవని చెప్పారు. పట్టించుకోని ఉన్నతాధికారులు... నయీంతో సంబంధాల ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో ఇద్దరిపై ఇటీవల చర్యలు ఉపసంహరించారు. చార్జ్మెమోలు అందుకున్న అధికారులు వివరణలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సాధారణంగా పోలీసులపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తే వారికి చార్జ్మెమో జారీ చేస్తారు. సదరు అధికారి ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే చార్జ్మెమో ఉపసంహరించడం, లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నయీం కేసులో చార్జ్మెమోలు అందుకున్న వారు ఇచ్చిన వివరణల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. సాధారణంగా వివరణ ఇచ్చిన మూడు నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉన్నా... డీజీపీ కార్యాలయంతో పాటు నగర పోలీసు కార్యాలయం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. పదోన్నతి ప్రక్రియకు అడ్డంకిగా... పోలీసు విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం పదోన్నతి ఓ ప్రహసనం. ఓ అధికారికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి చార్జ్మెమోలు అడ్డంకిగా మారితే ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఆ మెమో డ్రాప్ చేసినా.. మళ్లీ పదోన్నతి ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎన్నాళ్లకు సాకారమవుతుంతో చెప్పలేని స్థితి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతి కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబితాలో చార్జిమెమోలు అందుకున్న వారుసైతం ఉన్నారు. వారి వివరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ప్రమోషన్కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా అధికారులు కోరుతున్నారు. -
నయీమ్ బతికి ఉంటే అమిత్షా జైల్లో ఉండేవారు
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్స్టర్ నయీమ్ బతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జైల్లో ఉండేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. గురువారం భువనగిరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీమ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నయీమ్ను తమ ప్రభుత్వమే చంపించిందని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్షా పాత్ర ఉందన్న విషయం బయటపడుతుందని కేంద్రమే నయీమ్ను ఎన్కౌంటర్ చేయించిందన్నారు. కేసీఆర్కు నిజాయితీ ఉంటే సిట్ నివేదికను, నయీమ్ డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
నయీం గ్యాంగ్ పేరుతో వసూళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం పేరుతో ఒక వ్యాపారవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన నగేష్(20) అనే యువకుడు నయీమ్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తినంటూ ఒక వ్యాపార వేత్త పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించి రూ.1 కోటి డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.5లక్షలను ఇచ్చేందుకు అంగీకరించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు వలపన్ని నగేష్ను గురువారం ఉదయం పట్టుకున్నారు. ఠాణాకు తరలించి అతడిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నయీం అనుచరులకు ఖాకీల అండ
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం అరెస్ట్ చేసిన అతడి అనుచరులకు పోలీస్ల సహకారం మెండుగా ఉంటోంది. శుక్రవారం వెలుగు చూసిన నలుగురు పోలీసుల సస్పెన్షన్తో నయీం ముఠాకు ఖాకీల సహకారం ఏ మేరకు ఉందో మరోసారి తేటతెల్లమైంది. ముఖ్య అనుచరుడు పాశం శ్రీను వరంగల్జైల్లో ఉన్నప్పటికీ అతనికి ఆరు నెలలుగా కొందరు పోలీసులు సహకరించారని తేటతెల్లమైంది. గురువారం పోలీసులు భువనగిరిలో పాశం శ్రీనుకు చెందిన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేయడంతో మరోమారు విషయం చర్చనీయాంశమైంది. పీడీ యాక్టు నమోదై వివిధ కేసుల్లో వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న పాశం శ్రీనును భువనగిరి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో ఎస్కార్ట్ పోలీస్లు సహకరించినట్లు తేలడంతో వారిపై వేటు పడింది. అయితే పాశం శ్రీను ఎస్కార్ట్ పోలీస్లకు పెద్దఎత్తున డబ్బులను ముట్టజెబుతుండడంతో ఆ డ్యూటీలకు ఏఆర్ పోలీసుల్లో తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి భువనగిరి కోర్టుకు తీసుకువచ్చి తిరిగి జైలులో అప్పగించే వరకు పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. డ్యూటీలో ఉన్న ఒక్కో పోలీస్కు రూ.30వేలు, డ్యూటీ వేసిన అధికారికి రూ.10 వేలు పాశం శ్రీను ముట్ట చెబుతున్నారని సమాచారం. ఒక్కసారి ఆ డ్యూటీకీ వెళ్తే చాలు కొంత మొత్తం చేతికి వస్తుందన్న ఆశతో డిమాండ్ పెరిగింది. శ్రీనుకు స్వేచ్ఛ..సెల్ఫోన్లలో బెదిరింపులు డబ్బులు తీసుకుంటున్న ఎస్కార్ట్ పోలీసులు..పాశం శ్రీనును స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించారు. కొన్ని సెటిల్మెంట్ల విషయంలో అతను సెల్ఫోన్లో బెదిరింపులకు దిగడంతో బాధితులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జరిపిన విచారణలో పోలీసుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో ఎస్కార్ట్ పోలీస్ల సెల్ఫోన్లతోపాటు, పాశం శ్రీనుకు చెందిన మరికొందరు అనుచరుల ఫోన్లపై నిఘాపెట్టారు. గత నెల భువనగిరి కోర్టుకు వచ్చి తిరిగి వరంగల్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ సరిహద్దు దాటిన తర్వాత..జనగామ జిల్లా కేంద్రానికి సమీపంలో జాతీయరహదారి పక్కన గల డాబాలో పాశం శ్రీను, అతని అనుచరులు కలిసి విందులు, వినోదలు చేశారు. ఎస్కార్ట్ పోలీస్ బృందంలోని ఆర్ఎస్ఐలు రమేష్, పాషా, హెడ్కానిస్టేబుళ్లు రమేష్, లక్షినారాయణకు చెందిన సెల్ఫోన్ల నుంచి బెదిరింపు కాల్స్ చేశాడు. ఈ విషయం సిట్ విచారణలో బయటపడడంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదే కేసులో పాశం శ్రీను తమ్ముడు మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పాశం అమర్నాథ్, అనుచరులైన అందెసాయి కృష్ణ, అంగడి నాగరాజు,మెరుగు శివశంకర్, పులి శ్రీనివాస్ లపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. పెరిగిన నిఘా.. కొంతకాలంగా నయిమ్ ముఠా సభ్యుల బెదిరింపులు ప్రారంభమయ్యాయని పలువురు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో..నిఘాపెంచారు. ఇందుకోసం సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిరంతర నిఘా కొనసాగిస్తూ నయీమ్ పేరుతో ఆగడాలు సాగించే వారిని అణిచివేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ హెచ్చరిస్తున్నారు. -
యువతులను చెరబట్టాడు..చంపేశాడు..
-
చెరబట్టాడు.. చంపేశాడు..
నయీమ్ దుర్మార్గాలపై వెలుగులోకి మరిన్ని సంచలనాలు - బాలికలు, యువతుల జీవితాలను బలితీసుకున్న గ్యాంగ్స్టర్ - దగ్గరి బంధువుల పిల్లలనూ వదలని దుర్మార్గం - తన మాట వినకపోతే దారుణంగా హింసించిన వైనం - చివరికి నిద్రమాత్రలిచ్చి, గొంతు నులిమేసి హత్యలు - ఈ పైశాచిక ఆనందానికి తోడ్పడిన నయీమ్ భార్య, అత్త, అక్క - దందాలు, సెటిల్మెంట్ల సమయంలో రక్షణగా పసికందులు - నెలల వయసున్న చిన్నారులను కొనుక్కువచ్చి వినియోగం - ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉన్న 30 మంది చిన్నారులు! - వారిని తీసుకెళ్లేందుకు ముందుకురాని తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: హత్యలు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో ఆగని గ్యాంగ్స్టర్ నయీమ్ మరెన్నో పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం అభం శుభం తెలియని బాలికలు, యువతులను చెరబట్టా డు. పెంచి, పోషిస్తానని, చదివిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. కాదన్న వారిని క్రూరంగా హింసించాడు. చివరికి నిద్ర మాత్రలు ఇచ్చి, కాలితో గొంతు నులిమి చంపేశాడు. నయీమ్ అత్త, భార్య, అక్క, మేనకోడలు ఈ దారుణాలకు తోడ్పడ్డారు. ఇక తన దందాల సమయంలో పట్టుబ డకుండా ఉండేందుకు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నెలల పసికందులను వినియోగించుకున్నాడు. నయీమ్ అనుచరులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో ఇలాంటి విస్తుపోయే దారుణాలెన్నో బయటపడుతున్నాయి. విచ్చలవిడిగా దుర్మార్గం.. తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకోవడం కోసం నయీమ్ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. బయటివారైతే విషయం బయటకు వెళతాయన్న ఉద్దేశంతో అమ్మాయిలను తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. చదివిస్తానని, ఉద్యో గం చేయిస్తానని చెప్పి తెప్పించుకున్నాడు. తాను ఎటు వెళ్లినా వారిని తీసుకువెళుతూ కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఒప్పుకోకుంటే తీవ్రంగా హింసించేవాడు, హతమార్చేవాడు. ► 2006లో నయీమ్ తన దగ్గరి బంధువులకు చెందిన నలుగురు బాలికలను పెంపకం పేరుతో తీసుకువచ్చి, లైంగికంగా వేధించాడు. వారిని కాపాడేందుకు యత్నించిన అనుచరుడు ఆరీఫ్ను దారుణంగా చంపేశాడు. ► 2008లో గోవాలో ఇల్లు కొనుగోలు చేసిన నయీమ్.. తరచూ హైదరాబాద్లోని వైట్ హౌజ్ ఇంట్లో ఉన్న ఆరుగురు 14 ఏళ్ల బాలి కలను అక్కడికి తీసుకెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. వాళ్లు వెళ్లేందుకు ఇష్టపడకపోతే నయీమ్ భార్య, అక్క వారిని కొట్టి మరీ బలవంతంగా పంపించేవారు. ► 2010లో బంధువులకు చెందిన 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ► 2012 ఆగస్టులో షాద్నగర్లోని ఇంట్లో 12 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచి మరీ అత్యాచారం చేశాడు. అదే సంవత్సరం నవంబర్లో మరో 14 ఏళ్ల బాలికను రెండు రోజుల పాటు లైంగికంగా వేధించాడు. కొద్దిరోజులకు నయీమ్ సొంత చిన్నాన్న బంధువులైన 12 ఏళ్ల ముగ్గురు బాలికలను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేశాడు. ► 2013లో 15 ఏళ్ల ఇద్దరు బాలికలను, 2014 లో ముగ్గురిని తన దుశ్చర్యలకు బలిచేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తమ్ముడితో కలసి భర్తను చంపింది నయీమ్ ఎంచుకున్న దారిలోనే నడిచిన అతడి సోదరి సలీమా తన భర్తను అతి దారుణంగా హతమార్చింది. నయీమ్ అనుచరుడు కృష్ణ అలియాస్ బాషాతో సలీమా అక్రమ సంబంధం పెట్టుకుందని ఇతర అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. అక్రమ సంబంధం విషయం తెలియడంతో సలీమా భర్త కొండా విజయ్కుమార్ అలియాస్ నదీం.. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. తమ రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో నయీమ్, సలీమా, ఇతర కుటుంబ సభ్యులు కలసి అతడిని హతమార్చారు. స్వయంగా సలీమానే భర్తను చున్నీతో బిగించి చంపేసింది. పసికందులను అడ్డం పెట్టుకుని.. తన కామవాంఛలకు బాలికలను, యువతు లను బలిచేసిన నయీమ్.. తన దందాల సమయంలో రక్షణగా నెలల వయసున్న పసికందులను ఉపయోగించుకున్నాడు. దందాల సమయంలో, సెటిల్మెంట్లలో వసూలు చేసిన సొమ్మును తరలించే సమయంలో నయీమ్ భార్య, అక్క, కోడలు ఆ పిల్లలను వెంట పెట్టుకునేవారు. పసిపిల్లలు, మహిళలు ఉండడంతో పోలీసులు ఆయా వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేసేవారని, అలా పట్టుబడకుండా తప్పించుకునేవారని అనుచరులు వెల్లడించారు. తన అత్త సుల్తానా మిర్యాలగూడ, నల్లగొండ సమీప ప్రాంతాల నుంచి పసిబిడ్డలను కొనుగోలు చేసి తీసుకువచ్చేది. అలా 2010 నుంచి నయీమ్ ఎన్కౌంటర్ సమయం వరకు 30 మందికిపైగా పిల్లలను తీసుకువచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి మూడు నెలల వరకు వయసున్న ఈ చిన్నారులకు తానే పేర్లు పెట్టి.. వివిధ ప్రాంతాల్లోని తన నివాసాల్లో పెట్టాడు. ఈ పిల్లలంతా ప్రస్తుతం ఓ రెస్క్యూ హోంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొందరి తల్లిదండ్రులను గుర్తించలేకపోతున్నారని, మరికొందరు పిల్లలను తీసుకెళ్లేందుకు ముందుకురావడం లేదని తెలిసింది. దారుణంగా హతమార్చాడు.. అలకాపురి కాలనీలోని ఇంట్లో 18 ఏళ్ల అనామిక (పేరు మార్చాం)పై 2015 జూలై 24న నయీమ్ అత్యాచారానికి పాల్ప డ్డాడు. ఆమె సహకరించలేదనే కోపంతో తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు రాత్రి తుక్కుగూడలో నయీమ్ తమ్ముడి కుమార్తె ఎంగేజ్మెంట్ ఉండడంతో.. అనామికకు నిద్ర మాత్రలు మింగించి, ఓ గదిలో పడేసి అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చారు. కదలకుండా పడి ఉన్న అనామికను చూసి చనిపోయిందనుకొన్నారు. బయటకు తరలించే క్రమంలో ఆమెకు ప్రాణం ఉన్నట్లు గుర్తించిన నయీమ్... క్రూరంగా ఆమె పొట్టపై తొక్కి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత డ్రైవర్తో కలసి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోని పొదల్లో మృతదేహాన్ని దహనం చేశారు. ► 2014లో ఇద్దరు బాలికలను తీసుకుని ఛత్తీస్గఢ్కు వెళ్లిన నయీమ్.. వారిని తిరిగి హైదరాబాద్కు తీసుకురాలేదు. వారిని చంపేశాడా? లేకా అక్కడి అనుచరులకు వదిలేశాడా.. అన్నదానిపై పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు. ► 2016 ఫిబ్రవరిలో గోవాలోని ఇంట్లో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. నయీమ్ అతి దారుణంగా చంపేసినట్టు అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. -
డాన్ ఆయుధాలెక్కడ?
♦ 21 పిస్టళ్లను స్మగ్లింగ్ చేసిన అర్ఖాన్ భాయ్.. ఉత్తరప్రదేశ్ నుంచి తుపాకుల సరఫరా ♦ పోలీసులు సీజ్ చేసింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే.. మిగతా ఏకే–47లు, పిస్టళ్లు ఎక్కడ? ♦ నయీం అనుచరుల వద్దే ఉన్న మారణాయుధాలు ♦ ఏడాది తర్వాత బయటకు వచ్చిన సంచలన అంశాలు ♦ రెండు గ్రూపులుగా చీలిపోయిన అనుచరులు ♦ మళ్లీ గ్యాంగ్వార్ మొదలయ్యే అవకాశముందంటున్న నిఘా వర్గాలు (ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి) జేబులో పెన్ను పెట్టుకున్నంత సులభంగా గ్యాంగ్స్టర్ నయీమ్ ఏకే–47 వంటి మారణాయుధాలను వినియోగించాడు. నయీమ్తోపాటు అతడి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు కూడా ఏకే–47లు, పిస్టళ్లు పట్టుకుని దందాలు చేశారు. అసలు నయీం 2003 నుంచి 2015 మధ్య ఏకంగా 11 ఏకే–47లు, 21 పిస్టళ్లు కొనుగోలు చేసినట్లు కుటుంబ సభ్యులు, అనుచరుల విచారణలో వెల్లడైంది. కానీ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులకు దొరికింది ఒకే ఒక ఏకే–47, ఆరు పిస్టళ్లు మాత్రమే. దీంతో మిగతా ఆయుధాలు ఏమయ్యాయనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అసలు నయీంకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని ఆయుధాలను కొనుగోలు చేశాడు, వాటికోసం ఎంత ఖర్చుపెట్టాడన్న అంశాలపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోయారు. అంతేకాదు ప్రస్తుతం నయీం అనుచరుల వద్ద ఉన్న ఆయుధాల పరిస్థితి ఏమిటి? మళ్లీ దందాలు, ముఠా కక్షలు మొదలవుతాయా అన్న ఆందోళన రేకెత్తుతోంది. ఈ నేపథ్యంలో నయీం ఆయుధాల అంశంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ముఖ్యులందరి వద్దా ఏకే–47లు నయీం దందాలు, సెటిల్మెంట్లు వంటివి చేసే ముందు తన భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్లను ‘టార్గెట్’ప్రాంతానికి పంపుతాడు. వారు మూడు ఏకే–47లు, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్తో అక్కడికి చేరుకుంటారు. తర్వాత నయీం తన ఆంతరంగికురాలు అమీనా, అనుచరులు శ్రీధర్గౌడ్, శ్రీధర్రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యతో కలసి వస్తాడు. వీరందరి వద్దా ఏకే–47లు ఉంటాయి. వాటితోపాటు ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్ కూడా ఉంటుంది. ఏకే–47లను కారులో కనబడకుండా పట్టుకునే వీరు.. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారని సమాచారం. ఇలా 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్నగర్లోని ఇందిరాపార్క్ నివాసానికి వచ్చేవాడు. యాంజాల్ శివారులోని ఇంజాపూర్లో ఉన్న నివాసంలోనూ సెటిల్మెంట్లు చేశాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలు ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో నయీంను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ జైలుకు పంపించారు. అక్కడే నయీంకు ఐఎస్ఐ ఉగ్రవాది షాహీద్తో పరిచయం ఏర్పడింది. అనంతరం షాహీద్ ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్ అర్ఖాన్భాయ్ అలియాస్ యుజవార్ను నయీంకు పరిచయం చేశాడు. అలా అర్ఖాన్భాయ్ ద్వారా 2000 సంవత్సరంలో నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు. ఈ క్రమంలో 2003లో అర్ఖాన్కు రూ.10 లక్షలు చెల్లించి.. రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్కు అందించింది. తర్వాత 2006లో రూ.15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే–47లు, నాలుగు పిస్టళ్లను గోవాలోని తన చర్చిహౌస్కు తెప్పించుకున్నాడు. 2008లో అర్ఖాన్ రూ.20 లక్షలు తీసుకుని మరో రెండు ఏకే–47లను ఇంజాపూర్లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్లోని రైల్వేహౌజ్లో ఇంకో రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు. ఇవన్నీ నయీం కుటుంబ సభ్యులకు తెలిసి జరిగినవి. ఇవిగాకుండా ఛత్తీస్గఢ్లో రెండు సందర్భాల్లో 2 ఏకే–47లను, నాలుగు పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు రెండు పిస్టళ్లను నయీం తెప్పించినట్లు అనుచరుల విచారణలో వెల్లడైంది. మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి.. పదకొండు ఏకే–47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు. దొరికింది మాత్రం ఒక్కటే.. గతేడాది ఆగస్టు 8న షాద్నగర్ మిలినీయం టౌన్షిప్లో ఉన్న ఇందిరాపార్క్ హౌజ్ వద్ద నయీం ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం పోలీసులు అలకాపురి కాలనీ, శంషాబాద్, ఇంజాపూర్లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్.. ఇలా 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.2.5 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నయీం ఎన్కౌంటరైన ప్రాంతంలో ఒక ఏకే–47ను.. అతడి అనుచరులు శ్రీధర్గౌడ్, పాశం శ్రీనుల వద్ద మూడు చొప్పున ఆరు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలకాపురి కాలనీలోని ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్ స్టిక్స్ దొరికాయి. అయితే నయీం వద్ద 11 ఏకే–47 తుపాకులు, 21 పిస్టళ్లు ఉన్నట్లు లెక్క. మరి పోలీసులకు దొరికింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే. మిగతా ఆయుధాల సంగతేంటి, అసలు అవి ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నయీం షాద్నగర్ డెన్కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే–47లు ఉన్నాయి. కానీ సోదాల సమయంలో మాత్రం లభించలేదు. దీనిపై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పోలీసులు సీజ్ చేసినట్లుగా పేర్కొన్న ‘ప్రాపర్టీ’లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ గ్యాంగ్వార్.. నయీం ముఠా యాక్షన్ కమిటీలో కీలకంగా ఉన్న శేషన్న, ఇతర అనుచరులు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు. వారు ఇటీవల పలు రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా వెళ్లడం సంచలనంగా మారింది. నయీంకు సంబంధించిన ఆయుధాలు వారి వద్ద ఉండి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల నయీం కుటుంబీకులు, అనుచరులుగా ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయని నిఘా వర్గాలు గుర్తించాయి. నయీం ముఠాలో రెండు గ్రూపులు ఏర్పడి ఉంటాయని. వాటి మధ్య తిరిగి గ్యాంగ్వార్ మొదలయ్యే అవకాశముందని సమాచారం. -
227 కేసులు.. 895 మంది సాక్షులు!
- నయీమ్ మృతి చెంది ఏడాది పూర్తి - ఇప్పటివరకు 9 కేసుల్లోనే చార్జిషీట్ - త్వరలో 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామన్న సిట్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ మృతికి మంగళవారంతో ఏడాది పూర్తయింది. నయీమ్ సాగించిన దందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు.. ఇలా అన్నింటిపై ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఏడాది నుంచి నయీమ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టేషన్లలో 227 కేసులు నమోదుకాగా, 895 మంది సాక్షులను సిట్ విచారించినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీస్ శాఖ స్పష్టం చేసింది. మొత్తం 128 మందిని అరెస్ట్ చేసి, వీరిలో 109 మందిని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినట్లు సిట్ పేర్కొంది. ఇప్పటివరకు 9 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ దాఖలు చేశామని, త్వరలోనే మరో 22 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది. మిగతా కేసుల్లో దర్యాప్తు తుది దశకు చేరుకుందని వెల్లడించింది. నయీమ్ గ్యాంగ్లోని 14 మందిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నామని, ఐదుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు సిట్ వివరించింది. అదే విధంగా మరో నలుగురు పోలీస్ అధికారులకు తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు, మరో 16 మంది అధికారులకు స్వల్ప తీవ్రత కలిగిన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మిగిలిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ అధికారులు తెలిపారు. -
నయీం పెంచిన కుక్కలెక్కడ?
♦ ఎన్కౌంటర్ తర్వాత నెల పాటు ఓ సంరక్షణశాలలో ♦ ఆ తర్వాత అవి ఎక్కడన్న దానిపై లేని స్పష్టత ♦ గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ జరిగి ఏడాది పూర్తి హైదరాబాద్: ఎవరి పైనైనా పగబడితే నిద్రపోయేవాడు కాదు... నడిరోడ్డుపై విరుచుకుపడేవాడు... కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేయించేవాడు.. ఆస్పత్రికి తరలించినా బతికే అవకాశం లేకుండా కత్తికో కండగా నరికించేవాడు... ఒక్కోసారి శరీరాల్ని ఖండఖండాలుగా చేసి పాతిపెట్టించాడు... ఏడాది క్రితం 2016 ఆగస్టు 8న షాద్నగర్ శివార్లలోని మిలీనియం టౌన్షిప్లో ఎన్కౌంటర్ అయిన నయీమ్ వ్యవహారశైలి ఇది. ఇంతటి కౄరమైన చరిత్ర ఉన్న కరుడుగట్టిన నేరగాడైన అతడికీ ఓ వీక్నెస్ ఉంది. ఇతడికి తన పెంపుడు కుక్కలంటే అమితమైన ప్రేమ. ఇప్పుడు ఇవి ఎక్కడున్నాయన్నది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండింటిని పెంచుకుంటూ... నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని నెక్నంపూర్ అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఇంట్లో నయీం రెండు కుక్కలను పెంచాడు. సరిహద్దులో పహారా కోసం భద్రతా బలగాలు వినియోగించే ‘డాల్మటైన్’ జాతికి చెందిన శునకాలను నయీ మ్ తెచ్చుకుని పెంచే వాడు. వీటికి శాండో, కోమి అని పేర్లు కూడా పెట్టాడు. వాటి తిండికీ‘టైమ్ టేబుల్’.. ఈ రెండు శునకాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్ను ఏర్పా టు చేశాడు కూడా. వైద్యుడి సూచనల మేరకు వీటికి నిత్యం ఇవ్వాల్సిన ఆహారం, టానిక్స్ సంబంధించి ఓ పట్టిక తయారు చేశాడు. తన ఇంటి గ్రౌండ్ఫ్లోర్లో వీటికోసం ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆహార, సమయ సూచిక’ పేరుతో ఓ బోర్డు సైతం ఏర్పాటు చేయించాడు. ఎన్కౌంటర్ తర్వాత నయీం ఇంటిని సీజ్ చేసిన పోలీసులు ఈ రెండు శునకాలనూ సంరక్షణ నిమిత్తం పుప్పాలగూడలోని ఓ కెన్నల్కు తరలించారు. దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉన్నాయి. ఆపై వాటిని పోలీసులే తీసుకువెళ్ళారని కెన్నల్ నిర్వాహకులు, జంతు సంరక్షణ విభాగం అధికారులు తీసుకువెళ్ళారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయన్నది ఎవరూ స్పష్టం చెప్పలేకపోతున్నారు. నిర్మానుష్యంగా నయీమ్ ఇల్లు... ఏరియాకో గ్యాంగ్ను నిర్వహించిన నయీమ్ గల్లీకో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. నెక్నంపూర్ అల్కాపురి టౌన్షిప్తో పాటు శంషాబాద్, హస్తినాపురం, వస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్ల్లో డెన్స్ నిర్వహించాడు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు గోవా, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ప్రత్యేక డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు. వీటిని తన భార్య, సోదరితో పా టు ప్రధాన అనుచరుల పేర్లతోనూ రిజిస్టర్ చేయించాడు. స్థలాలు, భూములు వీటికి అద నం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తొలినాళ్లల్లో స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా... అది కేవలం సీజ్ వరకే సాధ్యమైంది. దీంతో అనేక డెన్స్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. -
యాక్షన్ టీమ్ ఎక్కడ..?
గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఏడాది - ఇప్పటికి చిక్కిన వారంతా ‘సివిల్ క్రిమినల్సే’ - ఎన్కౌంటర్ తర్వాత కనిపించని యాక్షన్ టీమ్ - కొందరు ఖాకీలపైనే వేటు.. సేఫ్జోన్లో రాజకీయ నాయకులు సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: 2016 ఆగస్టు 8.. గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన రోజు. ఇది జరిగి రేపటికి ఏడాది.. నాటి నుంచి పోలీసులు, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 174 కేసులు నమోదు చేశారు. 120 మంది నయీమ్ అనుచరుల్ని పట్టుకున్నారు. మరోవైపు నయీమ్తో అంటకాగిన ఖాకీలపై వేటు పడినప్పటికీ.. రాజకీయ నాయకులు మాత్రం ‘సేఫ్జోన్’లోనే ఉండిపోయారు. నయీమ్ డెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు ఎన్ని? వాటిలో ఉన్న వివరాలు ఏంటి? అనేది సైతం రహస్యంగా ఉండిపోయింది. యాక్షన్ టీమ్ ఎక్కడ..? నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన అనుచరులంతా అప్పటి వరకు వెలుగులోకి రాని ‘సివిల్ నేరగాళ్ల’నే వాదన ఉంది. ఈ ముఠాకు భిన్నమైన యాక్షన్ టీమ్ ఒకటి నయీమ్ కనుసన్నల్లో పని చేసింది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా మన్ననూరు కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన, హైదరాబాద్లో జరిగిన పటోళ్ళ గోవర్థన్రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్న ఈ టీమ్లో కీలకం. మహబూబ్నగర్, అచ్చంపేట, సిద్ధిపేట, నగరంలోని ముషీరాబాద్, పాతబస్తీలకు చెందిన మరో ఆరుగురు సభ్యులుగా ఉండేవారు. నయీమ్ ఆదేశాలతో హత్యలు, కిడ్నాప్లకు పాల్పడటం.. ఆపై షెల్టర్ జోన్స్కు వెళ్లిపోవడం వీరి పని. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ టీమ్ ఏడాది గడిచినా పోలీసులకు చిక్కడం కానీ, అరెస్టు కావడం కానీ జరగలేదు. ఇంకా దర్యాప్తులో అనేక కేసులు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో హత్య, భూకబ్జా, కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలపై 174 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనేక మందికి బెయిల్ లభించింది. నయీమ్ భార్య హసీనాకు ఈ నెల 2న బెయిల్ రావడంతో సంరక్షణాలయంలో ఉన్న తన పిల్లల్ని సైతం ఆమె తీసుకువెళ్లింది. ఇన్ని కేసులు నమోదైనప్పటికీ అభియోగపత్రాలు దాఖలైన వాటి సంఖ్య తక్కువే. కేసుల విచారణ, చార్జిషీట్ల దాఖలులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలతో ఇటీవల భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్కు ఈ బాధ్యతలను పోలీసు శాఖ అప్పగించింది. సేఫ్ జోన్లో రాజకీయ నాయకులు.. నయీమ్తో అనేక మంది పోలీసులు దందాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మేలో ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 20 మంది పోలీసులపై విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆరోపణలు రుజువైతే కేసులుంటాయని అప్పట్లో అధికారులు చెప్పినా.. ఇప్పటికీ రుజువులు లభించలేదు. గ్యాంగ్స్టర్తో అంటకాగిన వారిలో రాజకీయ నేతలు సైతం ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. పోలీసులపై సస్పెన్షన్ వేటు పడినా.. నేతలు మాత్రం ‘సేఫ్జోన్’లో ఉండిపోయారు. కొందరికి నోటీసుచ్చిన సిట్ తమ కార్యాలయానికి పిలిపించి విచారించింది. తమకు నయీమ్తో దోస్తీ తప్ప దందాలు లేవంటూ చెప్పడంతో ఆ కథకు బ్రేక్ పడింది. -
తుపాకులు.. తూటాలు!
-
తుపాకులు.. తూటాలు!
బయటకు వచ్చిన నయీమ్ షాద్నగర్ డెన్ వీడియో సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్కు చెందిన కీలక వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. అతడి ఎన్కౌంటర్కు ముందు తలదాచుకున్న షాద్నగర్ మిలీనియమ్ టౌన్షిప్లోని ఉనూర్ బాషా ఇంటి లోపలి వీడియోలు మీడియాలో హల్చల్ చేశాయి. అక్కడి నయీమ్ బెడ్రూమ్ నుంచి వెలికితీసిన తుపాకులు, తూటాలు, కత్తులు ఈ వీడియోలో కనిపించాయి. మోస్ట్ వాంటెడ్గా ఉన్న నయీముద్దీన్ గత ఏడాది ఆగస్టు 8న షాద్నగర్లోని మిలీనియమ్ టౌన్షిప్లో ఎన్కౌంటర్ అయ్యాడు. ఈ ప్రాంతానికి పక్కనే ఉన్న బాషా ఇల్లే నయీమ్ డెన్గా గుర్తించిన పోలీసులు అదే రోజు సోదాలు చేశారు. అప్పట్లో అధికారులు ఈ ఇంట్లో భారీ మొత్తం నగదు, డాక్యుమెంట్లు, ఆయుధాలు గుర్తించారు. బెడ్రూమ్లోని బీరువా సమీపం లో రెండు కవర్లలో భారీ సంఖ్యలో ఉన్న తూటాలు, ఓ బ్యాగ్లో ఉంచిన కార్బైన్, రివాల్వర్తో పాటు మరో కవర్లో ఉన్న రెండు కత్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని వీడియో ద్వారా చిత్రీకరించారు. అప్పటి నుంచి గోప్యంగా ఉండి పోయిన ఈ వీడియో పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి ఆదివారం హల్చల్ చేసింది. -
‘నయీం నెత్తుటి కూడులో వారికి వాటా’
సూర్యాపేట: ‘ఎంతో మంది అమాయకులను అదిరించి, బెదిరించి సంపాదించిన గ్యాంగ్స్టర్ నయీం నెత్తుటి కూడులో టీఆర్ఎస్ నాయకులకు వాటాలు ఉన్నాయి. నయీం బతికున్నప్పుడు అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు అతడు చనిపోయిన తర్వాత కూడా ఆస్తులను పంచకుండా జాప్యం చేస్తున్నారు’ అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. నయీమ్ సంపాదించిన అక్రమాస్తులను బాధితులను పంచాలని, అందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం అంటే అందరికీ గౌరవమే అని, అయితే ఉద్యమ కారులను ఉరికించి కొట్టిన తూర్పు జయప్రకాశ్ ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీ వారు జూన్ 1న సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం శోచనీయమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నల్లగొండ జిల్లాలో దళితుల ఇళ్లలో భోజనం చేసి అతిగా ప్రచారం చేసుకోవడం దళితుల మనోభావాలను కించపరచడమే అన్నారు. మొదటి నుంచి తెలంగాణ జెండా పట్టి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నేడు కనుమరుగు అయ్యారని, వారికి సరైన గౌరవం కల్పించేందుకే ఇంటి పార్టీ స్థాపించామని చెప్పారు. రాష్ట్ర సాధన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే ఇంటి పార్టీ ఆవిర్భావ సభ జూన్ 2న హైదరాబాద్లో జరగనుందని ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు సబ్బండ వర్ణాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
‘నయీమ్’ నేతలపై వేటు?
♦ గ్యాంగ్స్టర్ వ్యవహారంలో కేసీఆర్ సీరియస్ ♦ ఏడుగురు టీఆర్ఎస్ నాయకులపై చర్యలకు రంగం సిద్ధం ♦ క్రిమినల్ కేసుల నమోదుకు అనుమతి! ♦ ఆనక పార్టీ నుంచి సస్పెన్షన్కు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్తో అంటకాగిన నేతలపై వేటు పడనుందా? వారిని టీఆర్ఎస్ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధమవుతోందా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారా?.. ఈ ప్రశ్నలకు పోలీసు అధికారుల నుంచి అవుననే సమాధా నమే వస్తోంది. నయీమ్ను మట్టుబెట్టడం ద్వారా వచ్చిన మంచి పేరును కాపాడుకు నేందుకు కఠినమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం అతడి డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పోలీసులకు కీలకమైన సమాచారం లభించింది. దాని ఆధారంగా చర్యలు ప్రారంభించగా.. ఇప్ప టికే ఐదుగురు పోలీసు అధికారులపై సస్పె న్షన్ వేటుపడింది. ఇక రాజకీయ నేతల వంతు వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెం దిన పలువురు నేతలకు నయీమ్తో ఉన్న సంబంధాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన ఆధారాలు పోలీ సులకు లభించాయి. ఏడుగురు నేతలపై చర్యలు! విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వా నికి, అధికార పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండాలంటే నయీమ్తో సంబంధాలున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్కు వివరిం చారని సమాచారం. దీంతో ఆయా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కేసు నమోదైన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, మరో ఇద్దరు నేతలు మొత్తంగా ఏడుగురిపై చర్యలు తీసుకో ను న్నారని విశ్వసనీయ సమా చారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో జరిపిన భేటీలో పచ్చ జెండా ఊపారని చెబుతున్నారు. వీరిలో గతంలో కాం గ్రెస్లో పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న నాయకులే ముగ్గురు ఉన్నారని అంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేపైనా క్రిమినల్ కేసులు పెట్టనున్నారని తెలిసింది. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల కోసం వేట పార్టీ నేతల పనితీరుపై కేసీఆర్ దృష్టి సారిం చారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ముం దస్తుగానే క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల జాబి తా తయారు చేయిస్తున్నారని తెలు స్తోంది. కేసీఆర్ ఈనెల మొదటి వారంలోనే మూడో అంతర్గత సర్వే కూడా చేయించారు. నయీ మ్తో సంబంధాలు నెరిపినవారు, ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో గీత దాటినవారు, నియోజక వర్గాల్లో వివాదాస్పద ఘటనల్లో బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వా రిపైనా ప్రత్యేక సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఆయా నేతలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
నయీమ్ కేసులో మళ్లీ మొదలైన హడావిడి
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
-
నల్లగొండ నేతల్లో ‘నయీమ్’ వణుకు
- రాజకీయ నాయకులపై చర్యలుంటాయన్న వార్తలతో కలకలం - నయీమ్తో నేతి విద్యాసాగర్, చింతలకు సంబంధాల నిర్ధారణ - జిల్లాకు చెందిన ముగ్గురు, నలుగురు నేతలకూ సంబంధాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్తో కలిసి భూదందాలు, సెటిల్మెంట్లకు పాల్పడిన ఆయన అనుచరుల ఎపిసోడ్ అయిపోయింది. వారంతా అరెస్టయి జైలుకెళ్లి మళ్లీ బెయిల్పై విడుదలై కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు. నయీమ్తో అంటకాగిన పోలీసు లపై చర్యలూ పూర్తయ్యాయి. ఐదుగురు అధికారులు సస్పెండ్ కాగా, మిగిలిన వారిని మౌఖిక విచారణ జరిపి నేరం రుజువైతే వారిని కూడా సస్పెండ్ చేసి కటకటాల పాలు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇక, మిగిలిం దల్లా రాజకీయ నాయకులే. అది కూడా నల్లగొండ జిల్లాకు చెందినవారే. నయీమ్ అనుచరులు, అంట కాగిన పోలీసుల ఎపిసోడ్లు ముగిసిన తర్వాత రాజ కీయ నాయకుల పీకలపై కత్తి పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు ఇప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, భువనగిరికి చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిలకు నయీమ్తో ప్రత్యక్ష సంబంధాలున్న విషయం కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇందులో విద్యాసాగర్ను నయీమ్ కేసు విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారించింది కూడా. వీరిద్దరికి తోడు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరికి తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలకు కూడా నయీమ్తో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే, వీరి ప్రత్యక్ష ప్రమేయం పోలీసు విచారణలో నిర్ధారణ అయిందా, వీరిద్దరూ కేవలం మాటామంతీలు మాత్రమే నడిపించారా, భూదందాలు చేశారా? అన్నది బయటకు రానీయడం లేదు. ఈ నేపథ్యంలో నయీమ్ తో ఎవరి సంబంధాలు ఎంత వరకు ఉన్నాయి? అందు లో నేరపూరిత కోణం ఎవరి విషయంలో నిర్ధారణ అయింది? వారిని అరెస్టు చేస్తారా? లేదా పదవులకు రాజీనామా చేయిస్తారా? తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం కూడా ఆ నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారడం విశేషం. గన్లైసెన్స్ రద్దు? నేతి విద్యాసాగర్ వ్యక్తిగత గన్ లైసెన్స్ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. తన గన్లైసెన్స్ను పునరుద్ధరించాలని ఆయన చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయనపై నాలుగైదు కేసులు నమోదు కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభించిన డైరీ ఆధారంగా ఆయన ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యులు, బినామీలు, బంధువులు, పోలీసు ఉన్నతాధికారులు, అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీల వివరాలు బయటపడ్డాయి. మరో నేత చింతల వెంకటేశ్వర్రెడ్డి తన కుటుంబీకుల పేరిట ఎలాంటి ఆస్తులు కూడగట్టకపోయినా, నయీమ్ తో కలసి నడిపిన ఓ భూదందాలో తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని పోలీసు విచారణలో తేలింది. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కూడా నయీమ్కు దగ్గరయ్యాడని పోలీసు విచారణలో తేలినట్టు సమాచారం. నయీమ్ అనుచరులిద్దరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కాగా, వారిని పోలీసులు పట్టుకోకుండా తప్పించే యత్నం కిశోర్ చేశాడని, వారిని పోలీసులు వెంటాడినా పట్టుకోలేకపోయారని, భువనగిరి నుంచి తుంగతుర్తి వరకు పోలీసులు వెంబండించినా ప్రయోజనం లేకుండా పోయిందనే చర్చ అప్పట్లో హల్చల్ సృష్టించింది. వీరు ముగ్గురే కాకుండా నయీమ్తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న నలుగురైదుగురు నేతలు జిల్లాలో ఉన్నా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. మరి సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుం టారు..? రానున్న రోజుల్లో ఎలాంటి పరిణా మాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సిందే. -
నయీం కేసులో మరో కొత్త మలుపు