GDP Growth
-
పెరిగిన జీడీపీ వృద్ధి అంచనాలు
రాబోయే కేంద్ర బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ నామమాత్ర జీడీపీ వృద్ధి 10.4%గా ప్రకటిస్తారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 9.7 శాతం కంటే ఇది అధికం. వాస్తవ జీడీపీలో ఊహించిన ద్రవ్యోల్బణం నమోదు కావడమే ఈ పెరుగుదలకు కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.నామమాత్రపు జీడీపీ వృద్ధిని నడిపించే అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరంలో 2.5 శాతం నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణంలో ఈ పెరుగుదల నామమాత్ర జీడీపీ వృద్ధికి గణనీయంగా దోహదం చేసే అవకాశం ఉంది. వినియోగాన్ని పునరుద్ధరించేందుకు సబ్సిడీల హేతుబద్ధీకరణ తోడ్పడుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.5% కంటే తక్కువగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి ఈ లక్ష్యం కీలకం కానుంది. జీడీపీలో వృద్ధి అంచనా వేసినప్పటికీ, ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వాస్తవ జీడీపీ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 6.6% ఉంటుందని అంచనా. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించడం ఆర్థిక వృద్ధికి సానుకూల చర్యగా భావిస్తున్నారు. -
నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: బలహీనమైన డిమాండ్ వంటి పలు కారణాల నేపథ్యంలో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (6.6 శాతం), జాతీయ గణాంకాల కార్యాలయం మొదటి ముందస్తు అంచనాలు(6.4 శాతం), ఆర్థిక శాఖ తొలి అంచనా (7 శాతం) కన్నా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా తక్కువగా ఉండడం గమనార్హం.వ్యవస్థలో డిమాండ్ ధోరణులు బలహీనంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే. అటు తర్వాత 6.3 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయిలో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రూపొందించిన ఈ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు...జీడీపీ వృద్ధిలో మందగమనం ఉన్నప్పటికీ తలసరి ఆదాయం 2023–24తో పోల్చితే, 2024–25లో రూ. 35,000 పెరిగే అవకాశం ఉంది. భారీ పెట్టుబడులుకు సంబంధించిన విభాగ ం– క్యాపిటల్ ఫార్మేషన్లో వృద్ధి రేటు 270 బేసిస్ పాయింట్లు (2.7%) 7.2 శాతానికి దిగిరానుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2024–25 జీడీపీలో 4.9 శాతంగా (బడ్జెట్ లక్ష్యం ప్రకారం) ఉంటుంది. -
జీడీపీ మందగమనం
దేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి కాలంలో అంచనాలను మించలేకపోతుంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశార్థికం భారతీయ రిజర్వు బ్యాంకు ఆశించిన ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. 7 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తే ఈసారి కనిష్ఠంగా 5.4 శాతం వృద్ధి కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో అదే తంతు కొనసాగింది. ఏప్రిల్-జూన్ కాలంలో అంచనా వేసిన 7.1 శాతం వృద్ధిని చేరుకోలేక 6.7 శాతంతో సరిపెట్టుకుంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆశించినంత పెరగదని రిజర్వు బ్యాంకు ముందుగానే అంచనా వేసింది. అందుకు విభిన్న అంశాలు కారణమని ఆర్బీఐ విశ్లేషించింది. ఎన్నికల వల్ల వివిధ పథకాలు, ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గడం, వ్యవసాయ, సేవా రంగాల్లో క్షీణత జీడీపీ వృద్ధికి నిరోధంగా నిలిచాయి. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధిని వెనక్కు లాగిన కొన్ని అంశాలను ఆర్బీఐ వెల్లడించింది.వేతనాల్లో మార్పు లేకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో వాస్తవ వేతన వృద్ధిలో ఎలాంటి మార్పులు లేవు. దాంతో వృద్ధికి ప్రతికూలంగా మారింది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.అధిక ఆహార ద్రవ్యోల్బణం: రిటైల్ ఆహార ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇది పట్టణ వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది.బలహీనమైన తయారీ రంగం: తయారీ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కేవలం 2.2 శాతం మాత్రమే వృద్ధి చెందింది.తగ్గిన ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గుతోంది. దానివల్ల ఉపాధి సృష్టి జరగక వినియోగం మందగిస్తోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సన్నగిల్లుతోంది.ప్రతికూల వాతావరణ పరిస్థితులు: మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా విభాగాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది.కార్పొరేట్ ఆదాయాలు: చాలా కంపెనీలు రెండో త్రైమాసికంలో ఆశించినమేర ఆదాయాలు పోస్ట్ చేయలేదు. ఇది వస్తు వినియోగం తగ్గుదలను సూచిస్తుంది.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!ఈ ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ రూ.43.64 లక్షల కోట్లకు చేరుకుంది. అది రెండో త్రైమాసికంలో రూ.44.1 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని ‘వాస్తవ జీడీపీ’ అంటారు. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకుని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది. -
ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆయా ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షం బీభత్సానికి వంతెనలు కూలిపోయాయి. రోడ్లు చిధ్రం అయ్యాయి. వీధుల్లో బోట్లు ప్రత్యక్షమయ్యాయి. పంటలు కొట్టుకుపోయాయి. రవాణా నిలిచిపోయింది. ఇళ్లల్లో నీరు చేరింది. ఏటా కురిసే ఇలాంటి అకాల వర్షాలకు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చెందుతోంది. కేవలం వర్షం వల్ల ఏర్పడే వరదలే కాకుండా, తుఫానులు, కరవులు, భూకంపాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీనదాలు ముంచెత్తడం వంటి ఎన్నో విపత్తులు ఆర్థిక వ్యవస్థను వెనక్కి లాగుతున్నాయి.ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, యువత సహకారం అందుతున్నప్పటికీ తిరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ కొలుకోవాలంటే చాలా సమయం పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్ర అప్పుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అకాల వర్షాలకు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి. ఏటా పత్తి, మిరప, పనుపు..వంటి పంట ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగి ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది.గతంలో సంభవించిన ప్రకృతి విపత్తుల వల్ల దేశంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో భారతీయ స్టేట్ బ్యాంక్ గతంలో పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. 2021 వరకు దేశంలో 756 అతి తీవ్ర ప్రకృతి విపత్తులు ఏర్పడ్డాయి. దాంతో రూ.12.08 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల రూ.7.2 లక్షల కోట్లు, తుఫానుల వల్ల రూ.3.7 లక్షల కోట్లు, కరవుల వల్ల రూ.54 వేలకోట్లు, భూకంపాలు రూ.44 వేలకోట్లు, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రూ.4,197 కోట్లు, హిమానీనదాలు ముంచెత్తడం వల్ల రూ.1,678 కోట్ల నష్టం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో దేశ ఆదాయం తిరిగి వెంటనే పుంజుకునేలా ఇరు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని చెబుతున్నారు. -
RBI: ఊహించిందే జరిగింది
భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్ 10 దేశాలుదేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు. -
సంబరాలు... సవాళ్ళు...
దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఇక, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. వరుసగా మూడోసారి కూడా మోదీ సారథ్యంలోని బీజేపీయే పగ్గాలు చేపడుతుందని అంచనాలు వినిపిస్తున్న వేళ ఓట్ల లెక్కింపుతో అసలైన ఫలితాలు ఇవాళ రానున్నాయి. అయితే, ఎన్నికలు ముగింపు దశలో ఉండగానే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గత శుక్రవారం వెలువరించిన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఆసక్తికరమైన చర్చ రేపుతున్నాయి. జీడీపీ వృద్ధి దాదాపు 7.8 శాతం ఉండవచ్చని తొలుత అందరూ భావించినా, వాస్తవంలో అది 8.2 శాతానికి చేరింది. అంతకు ముందు ఏడాది (2022–23) సాధించిన 7 శాతంతో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. పైగా, వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం, అంతకు మించి పెరిగిందన్న మాట. దీంతో ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని నిపుణుల మాట. ఇది విశేషమే... కాదనలేం. కానీ, ఈ ఏడాది కూడా ఇదే పురోగతిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? అలాగే, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం తదితర సమస్యల మాటేమిటి?నిజానికి, దేశ వాస్తవిక జీడీపీ ఇటు అధికారిక, అటు ప్రైవేట్ అంచనాలన్నిటినీ అధిగమించి ఆశ్చర్యపరిచింది. కోవిడ్ దెబ్బ కొట్టిన తర్వాత, అందులోనూ ప్రపంచమంతా నత్తనడక నడుస్తున్నప్పుడు వృద్ధిలో ఈ రకమైన గణాంకాలు వచ్చాయంటే, అనేక ఆటుపోట్లను భారతీయ గృహవ్యవస్థ, వ్యాపారాలు తట్టుకొని దృఢంగా నిలబడడమే కారణం. అలాగే, ప్రధానంగా నిర్మాణ, వస్తూత్పత్తి రంగాల పుణ్యమా అని కూడా గడచిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థికవ్యవస్థ అనుకున్న దాని కన్నా మెరుగైన వృద్ధిని సాధించినట్టు విశ్లేషణ. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పుంజుకోకున్నా, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వృద్ధిలో సింహభాగానికి కారణమని చెబుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సర్కారుకు ఈ అంకెలు, ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ బదలాయించిన మిగులు నిధుల లాంటివి కొంత సౌకర్యాన్నిచ్చే అంశాలు. అక్కడ నుంచి సమతూకం నిండిన ఆర్థికాభివృద్ధి వైపు ఎలా నడిపించాలన్నది కీలకమైన అంశం. గమనిస్తే... ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఏడేళ్ళ పాటు నిదానంగా సాగింది. దానికి కొత్త ఊపునిచ్చేందుకు మోదీ సర్కార్ ఏటా రైల్వే, రోడ్లు, పట్టణ రవాణా, వాటర్వర్క్స్, రక్షణ ఉత్పత్తులపై ఏటా రూ. 11 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు రావాలి. కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటికీ ప్రబలంగా కనిపిస్తోంది. దానికి తోడు ఆర్థిక వ్యత్యాసం, ద్రవ్యోల్బణం సామాన్యుల్ని వేధిస్తున్నాయి. ఉదాహరణకు భవన నిర్మాణ రంగంలో నూటికి 80 మంది ఉండే నైపుణ్య రహిత కార్మికుల సగటు రోజు వారీ కూలీ సైతం అనేక రాష్ట్రాల్లో జాతీయ సగటు కూలీ కన్నా తక్కువే ఉందని విశ్లేషణలు తేల్చాయి. మహిళా శ్రామికుల కూలీలైతే మరీ కనాకష్టం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే... మన దేశ తలసరి ఆదాయం, మరో మాటలో నికర జాతీయ ఆదాయం 2014–15లో రూ.72,805 ఉండేది. అది కేవలం 3.83 శాతం వార్షిక చక్రవృద్ధి రేటుతో 2022–23లో రూ.98,374కు చేరింది. వాస్తవిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే, ఈ వృద్ధి రేటు అసలైతే ఇంకా తక్కువే ఉంటుంది. అది అటుంచితే – విద్య, ఆరోగ్యం, ప్రజారవాణా, కాలుష్యం వగైరా అంశాల్లో సగటు జనాభా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. సరికదా ఇంకా దిగజారాయి. అదే విషాదం. ఇంకా చెప్పాలంటే, ప్రపంచంలోని అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ అనే నినాదంలో గర్వించడానికి తగిన అంశాలు కొన్నే కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల తలసరి ఆదాయం జాబితాలో 2018లో మనం 153వ స్థానంలో ఉండేవాళ్ళం. అప్పటితో పోలిస్తే, మనం మెరుగుపడి 144వ స్థానానికి చేరాం. కానీ, ఇప్పటికీ మనం అడుగునే ఉన్నామని మర్చిపోలేం. సాధించిన కొద్దిపాటి మెరుగుదల దేశ ప్రజల్ని దారిద్య్రం నుంచి బయటపడేయడానికి చాలదు. నాణ్యమైన జీవన ప్రమాణాలకూ సరిపోదు. 2029 నాటికి గానీ మన దేశం తలసరి ఆదాయంలో ఉజ్బెకిస్తాన్, పాపువా న్యూ గినియా, అంగోలా లాంటి దేశాలను అధిగమించలేదని గుర్తించాలి. కాబట్టి, కొత్త ప్రభుత్వానికి తన ముందున్న సవాలేమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. భారత జనాభాలో ఇప్పటికీ అధిక శాతం గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. వారి కష్టనష్టాలు, జీవన పరిస్థితులు స్టాక్ మార్కెట్ల విజృంభణను చూసి చప్పట్లు కొట్టే వర్గాలకు పెద్దగా తెలియవు. తాజా ఎన్నికల దయతో నిరుద్యోగం, ఆర్థిక అసమతౌల్యం, ద్రవ్యోల్బణం లాంటివి మళ్ళీ కనీసం చర్చకైనా వచ్చాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లోని దురవస్థల’ ప్రస్తావన జరిగింది. అందుకే, గడచిన నాలుగు త్రైమాసికాలను కలిపి తీసిన ఆఖరి లెక్కలు పైకి సంతోషం రేపుతున్నా, క్షేత్రస్థాయిలోని ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే కష్టమే. ఇప్పటి లెక్కలతో తృప్తిపడి, ఉదాసీనంగా వ్యవహరించకుండా సవాళ్ళను ఎదుర్కొంటూ ముందడుగు వేయాలి. అందుకోసం ఆర్థిక విధానాలను నిర్ణయించే ప్రభుత్వ యంత్రాంగం దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించాలి. ప్రజల నైపుణ్యాలను పెంచి, వారిని మరింత ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలి. అందుకు తగ్గ సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే ఏటికేడు ఈ వృద్ధి అంకెలు స్థిరపడతాయి. సామాన్యుల జీవితాలు నిలబడతాయి. లేదంటే ‘వికసిత భారత్’ మాటల్లో, లెక్కల్లోనే మిగిలిపోతుంది. -
6.7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. నాల్గవ త్రైమాసికానికి (జనవరి–మార్చి 2024) అలాగే మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీపీ తొలి అధికారిక గణాంకాలు మే 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం పురోగతి సాధించింది. కీలక రంగాల పటిష్ట వృద్ధికోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాస్న భరద్వాజ్ ఎకానమీ పరిస్థితులపై మాట్లాడుతూ, కీలక రంగాలకు సంబంధించి హై ఫ్రీక్వెన్సీ డేటా విస్తృత ప్రాతిపదికన బలమైన వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. అలాగే నాల్గవ త్రైమాసికంలో వాణిజ్యం, హోటళ్ల రంగం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ‘‘తయారీ రంగం కార్యకలాపాలు కూడా బాగున్నాయి. నిర్మాణ ఆధారిత, పెట్టుబడి విభాగాల నుంచి మెరుగైన ఫలితాలు రావాలి. అయితే వ్యవసాయ రంగం వృద్ధి వెనుకబడి ఉండవచ్చు. నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతం జీడీపీ వృద్ధిని మేము ఆశిస్తున్నాము. పూర్తి సంవత్సరం సంఖ్య 7.6 శాతానికి దగ్గరగా ఉంటుందని అనుకుంటున్నాం’’ అని భరద్వాజ్ చెప్పారు. కాగా, క్యూ4లో 6.5 శాతం, ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక ఇండియా రేటింగ్స్ క్యూ4 అంచనా 6.2 శాతంగా ఉంది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా క్యూ4లో 6.7 శాతం, ఆర్థిక సంవత్సరం 7.8 శాతం వృద్ధి అంచనాలను వెలువరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంది. -
20 ఏళ్లలో ఏ దేశం ఎంత వృద్ధి చెందిందో తెలుసా.. (ఫొటోలు)
-
పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం.. స్థిరమైన వృద్ధికి అవకాశం
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. దీన్ని 4 శాతం దిగువకు తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నట్లు, అయితే ఇందుకు ఆహార ధరలే అడ్డంకిగా మారుతున్నట్లు మార్చి బులెటిన్ ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’లో ఆర్బీఐ ఇటీవల తెలిపింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత డిసెంబరు నుంచి తగ్గుతూ వస్తూ, గత నెలలో 5.09 శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా, రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరేందుకు ఆహార ధరల ఒత్తిళ్లే అడ్డంకిగా మారుతున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబత్ర పాత్రా నేతృత్వంలోని బృందం తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వృద్ధి మందగించడం, రాబోయే కాలంలో పరిస్థితుల్ని సూచిస్తున్నాయని వివరించింది. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవిక జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ఠ స్థాయికి చేరుకుందని బులెటిన్ వివరించింది. పరోక్ష పన్నులు పటిష్ఠంగా వసూలు కావడం, తక్కువ సబ్సిడీలు వృద్ధి ఊపందుకునేందుకు దోహదం చేశాయని బృందం వెల్లడించింది. నిర్మాణాత్మక గిరాకీ, ఆరోగ్యకర కార్పొరేట్ గణాంకాలు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు వృద్ధి ముందుకు సాగడానికి సాయపడతాయని వ్యాసం పేర్కొంది. ఇదీ చదవండి: 1 శాతం కుబేరుల దగ్గరే 40 శాతం సంపద దేశం ఏటా 8%, అంతకంటే ఎక్కువ వృద్ధిని స్థిరంగా కొనసాగించే అవకాశం ఉందని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2021-24 మధ్య దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సగటున 8% పైనే నమోదైందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) అదుపులోనే ఉందని, విదేశీ మారకపు నిల్వలు బాగున్నాయని, వరుసగా మూడో ఏడాది కూడా ఆర్థిక ఏకీకరణ కొనసాగుతోందని తెలిపింది. వచ్చే కొన్ని దశాబ్దాలకు ఈ అనుకూల అంశాలను అవకాశాలు, బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్గ్రేడ్ రేటింగ్తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్బక్ వినియోగించుకోనుంది. బ్లాక్బక్ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి
కరోనా సమయంలో అన్ని రంగాలు కుదేలైనా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రం వృద్ధి నమోదు చేశాయి. అలాంటి వ్యవసాయ రంగానికి సంబంధించి దేశ జీడీపీలో వాటా తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉండేదని, 2022–23లో 15 శాతానికి తగ్గిందని లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముంద్రా వెల్లడించారు. ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ వేగంగా వృద్ధి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గిందని మంత్రి పార్లమెంట్లో పేర్కొన్నారు. ‘ప్రొడక్షన్ పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదు. పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే ఇందుకు కారణం’ అని ఆయన వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్ధి సాధించాయని మంత్రి అన్నారు. వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రొడక్షన్ పెంచడానికి, సుస్థిరాభివృద్ధికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు, పాలసీలు తీసుకొచ్చిందని వివరించారు. కేంద్రం ప్రభుత్వం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేశామన్నారు. ఇదీ చదవండి: మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం? -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర
సాక్షి, విశాఖపట్నం: జీడీపీలో ఎంఎస్ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎంఎస్ఎంఈ జాయింట్ సెక్రటరీ మెర్సీ ఇపావో తెలిపారు. విశాఖలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ)షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్పై శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక రంగ వృద్ధికి దోహదపడటమే కాక.. ఉపాధికి ముఖ్య వనరులుగా ఉన్నాయని, గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, ప్రాంతీయ అసమానతలను కూడా తగ్గిస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో ఇవి మరింత బలోపేతమవుతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా రుణ పరిధి పెంపు, ఆధునికీకరణకు ప్రోత్సాహం, సాంకేతిక సాయం, మౌలిక సదుపాయాల వృద్ధి, నైపుణ్యాల పెంపుదల, శిక్షణ అవకాశాల మెరుగుదల, మార్కెట్ల విస్తరణ, ఎగుమతుల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సరళతరం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఏపీ మారిటైం బోర్డు డెప్యూటీ సీఈవో లెఫ్టినెంట్ కమాండర్ బీఎం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికి, మౌలిక సదుపాయాల విస్తృతానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎగుమతులు, దిగుమతులు పెరగడంలో మారిటైం బోర్డు తోడ్పడుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టుల ద్వారా కొత్తగా పలు పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. శ్రావణ్ షిప్పింగ్ సరీ్వసెస్ లిమిటెడ్ ఎండీ జి.సాంబశివరావు, ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర ఎస్ జాస్తి తదితరులు ప్రసంగించారు. ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
స్థూల ఆర్థిక నిర్వహణ భేష్: కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అసాధారణ సవాళ్ల మధ్య భారత్ బలమైన రికవరీ బాటలో నడవడానికి దేశ స్థూల ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉండడమేనని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. ఇతర దేశాలకు ఇదొక ఉదాహరణగా పేర్కొంది. మౌలిక సదుపాయాల సరఫరా వైపు చేసిన పెట్టుబడులతో భారత్ దీర్ఘకాలం పాటు స్థిరమైన వృద్ధిని నమోదు చేయగలదని అంచనా వేసింది. ‘‘గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఊహించని సవాళ్లు నెలకొన్నాయి. దీనికితోడు భారత బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేట్ రంగంలో బ్యాలన్స్ షీటు సమస్యలు వెలుగు చూశాయి. అయినా కానీ, భారత్ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉండడం వీటిని అధిగమించేలా చేసింది’’అని కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంతక్రితం ఆర్థిక సంవత్సంతో పోలిస్తే తగ్గడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గించేందుకు ప్రభుత్వం సుంకాలు తగ్గించి, సంక్షేమంపై వ్యయాలను పెంచొచ్చని పేర్కొంది. అలాగే, గరిష్ట స్థాయిలో మూలధన వ్యయాలను కొనసాగించొచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సానుకూల పనితీరు ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన అంచనా 7 శాతం మించి, 7.2 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడానికి, చివరి త్రైమాసికంలో బలమైన పనితీరును కారణంగా పేర్కొంది. -
భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: భారత్ ఎకానమీ పటిష్టంగా, నిలకడగా పురోగమిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఉద్ఘాటించింది. తగిన మూలధనం, అలాగే మొండిబకాయిలు (ఎన్పీఏ) బహుళ సంవత్సర కనిష్ట స్థాయికి తగ్గుతూ కొనసాగుతున్న పటిష్ట బ్యాంకింగ్ వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక మూలస్తంభాల పటిష్టత వంటి అంశాలు ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ఈ మేరకు ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్–కమిటీ ఇచి్చన నివేదికలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముందుమాట రాస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట రికవరీ బాటన పయనిస్తోందన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటి నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనే అంశంపై రాజీపడే ప్రశ్నేలేదని, ఈ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోని వారు ఇందుకు తగిన కృషి చేయాలని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనడానికి ఇది అవసరమనీ ఉద్ఘాటించారు. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2018 మార్చిలో బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల మొండి బకాయిలు, నికర మొండిబకాయిలు వరుసగా 11.5 శాతం, 6.1 శాతాలుగా ఉన్నాయి. 2023 మార్చిలో ఇవి వరుసగా 3.9 శాతం, 1 శాతానికి తగ్గాయి. ► రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్ఓఏ) 2018లో కనిష్ట స్థాయి – 0.2 శాతం నుండి 2023లో 1.1 శాతానికి పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత మెరుగుపడింది. ► బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్మెరుగుపడ్డం విస్తృత స్థాయిలో అన్ని రంగాలకూ బ్యాంకింగ్ రుణ వృద్ధినీ పెంచుతోంది. ► 2022–23లో బ్యాంకింగ్ డిపాజిట్ల వృద్ధి 10 శాతం. 2023 జూన్ తొలి నాళ్లలో ఈ రేటు 11.8 శాతానికి పెరిగింది. రూ.2000 నోట్ల ఉపసంహరణా దీనికి ఒక కారణం. ► రిటైల్ రుణాలు మార్చి 2021 నుండి మార్చి 2023 వరకు 24.8 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదుచేసుకున్నాయి. స్థూలంగా చూస్తే ఈ వృద్ధి రేటు 13.8 శాతంగా ఉంది. ► సైబర్ దాడులు, వాతావరణ మార్పు వంటి ఇతర సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ పరస్పర సహకారం అవసరం. ► జీ 20కి భారత్ నేతృత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి తగిన కృషి చేస్తుంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ థీమ్తో సవాళ్లపై పోరాటానికి దేశాల మధ్య పరస్పర సహకారానికి, సమన్వయ చర్యలకు భారత్ ప్రయతి్నస్తుంది. -
మూడో త్రైమాసికంలో భారత్ వృద్ధి 4.6 శాతం: ఎస్బీఐ అంచనా
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతమన్న అంచనాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గ్రూప్ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంత్ ఘోష్ వెలువరించారు. రెండవ త్రైమాసికంలో ఉన్న ఆశావహ పరిస్థితుల్లో తమ 30 హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు లేవని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో వృద్ధి 4.4 శాతమన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) అంచనాలకన్నా ఎస్బీఐ గ్రూప్ ఎకనమిక్ అడ్వైజర్ లెక్కలు అధికంగా ఉండడం గమనార్హం. కాగా, ఆర్థిక సంవత్సరంలో (2022-23) 6.8 శాతం అంచనాలను 7 శాతానికి పెంచుతున్నట్లు ఘోష్ పేర్కొన్నా రు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్లో ఎకానమీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదయ్యింది. రెండవ త్రైమాసికానికి ఇది 6.3 శాతానికి పడిపోయింది. 2023-24లో వృద్ధి 5.9శాతం : ఇండియా రేటింగ్స్ కాగా, 2023- 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.9 శాతమని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్కి బాయ్ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
అధిక ధరల సెగ: జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23, జూలై-సెప్టెంబర్) నెమ్మదించింది. 2021-22 ఇదే కాలంతో పోల్చితే జీడీపీ విలువ 6.3 శాతం పెరిగింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు ఇందుకు ఒక కారణం. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం, గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం కన్నా వృద్ధి వేగం (2.1 శాతం మేర) మందగించడం గమనార్హం. అయితే, ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను మాత్రం భారత్ కొనసాగిస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 3.9 శాతం. భారత్ సాధించిన వృద్ధి రేటుకు మరే దేశమూ చేరుకోకపోవడం గమనార్హం. ఇక మొదటి, రెండు త్రైమాసికాలు కలిపి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జీడీపీ వృద్ధి రేటు 9.7శాతం, రెండవ త్రైమాసికంలో 6.1-6.3 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనాలకు అనుగుణంగానే బుధవారం విడుదల చేసిన గణాంకాలు ఉండడం గమనార్హం. 6.3 శాతం ఎలా అంటే.. 2011-12 స్థిర ధరల ప్రాతిపదిక, వాస్తవిక జీడీపీ విలువ 2021-22 క్యూ2లో రూ.35.89 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.38.17 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే వృద్ధి 6.3 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్- జీవీఏ) ప్రాతిపదికన క్యూ2 వృద్ధి రేటు మాత్రం 5.6శాతం పెరిగి రూ.35.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. వ్యవసాయం: ఆర్థిక వ్యవస్థలో 15శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 3.2శాతం . తయారీ: ఈ రంగం జీవీఏ మాత్రం 5.6 శాతం (2021 ఇదే కాలంలో) వృద్ధి నుంచి 4.3 శాతం పడిపోయింది. మైనింగ్: ఈ విభాగం కూడా 2.8 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2021 ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు భారీగా 14.5 శాతంగా ఉంది. నిర్మాణం: వృద్ధి 8.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది. యుటిలిటీ సేవలు: విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల వృద్ధి రేటు 5.6 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.5 శాతంగా నమోదైంది. సేవలు: మొత్తం జీడీపీలో మెజారిటీ వాటా కలిగిన ఈ విభాగం చూస్తే (ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్) వృద్ధి రేటు 9.6 శాతం నుంచి 14.7 శాతానికి చేరింది.జీడీపీ వృద్ధి తగ్గింది, కానీ...ఎకానమీ పరుగుకు ఢోకా లేదు! అక్టోబర్లో 20 నెలల కనిష్టానికి మౌలికం అక్టోబర్లో ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం వృద్ధి రేటు 20 నెలల కనిష్టానికి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే వృద్ధి కేవలం 0.1శాతం గా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, సిమెంట్ రంగాలు క్షీణతను నమోదు చేసుకున్నాయి. ఎరువుల రంగం మాత్రం 5.4శాతం పురోగతి సాధించింది. బొగ్గు విభాగంలో 3.6 శాతం, స్టీల్ రంగంలో 4శాతం వృద్ధి నమోదైతే, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి కేవలం 0.4శాతంగా నమోదైంది. 7 శాతం వరకూ వృద్ధి 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం 7 శాతం శ్రేణి బాటలో ఉంది. పలు రంగాల్లో రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పండుగల సీజన్లో అమ్మకాలు, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్, బ్యాంక్ రుణ వృద్ధి, ఆటో అమ్మకాల గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి. -వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
క్యూ2లో ఎకానమీ వృద్ధి 5.8 శాతం
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022-23 జూలై,ఆగస్టు, సెప్టెంబర్) 5.8 శాతం వృద్ధి నమెదు చేసుకుంటుందని ఎస్బీఐ రిసెర్చ్ తన అధ్యయనంలో తెలిపింది. తయారీ, వినియోగ విభాగాల బలహీనత గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని పేర్కొంది. నవంబర్ 30వ తేదీన క్యూ2 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక లెక్కలు వెలువడనున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా అంచనాలను వెలువరించింది. క్యూ2లో మార్కెట్ అంచనాలకన్నా (6.1 శాతం) ఇది 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాలను 6.8 శాతంగా ఎస్బీఐ అంచనా వేసింది. మార్కెట్ అంచనాల కన్నా 20 బేసిస్ పాయింట్లు తక్కువ. 41 ఇండికేటర్ల విశ్లేషణల ప్రాతిపదికన ఎస్బీఐ అంచనాలు వెలువడతాయి. 2022-23 మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం. 2022-23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకూ జరగనున్న నేపథ్యంలో క్యూ2 జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. -
భారత్ ఆర్థిక స్థిరత్వానికి ఢోకా లేదు, రూపాయిపై ఆందోళన అక్కర్లేదు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ స్పష్టం చేసింది. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయని, రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయని వివరించింది. ఆయా అంశాలు ఊహించినదానికన్నా వేగంగా సానుకూలతను సంతరించుకుంటున్నట్లు వివరించింది. ఆయా అంశాలు దేశంపై రేటింగ్కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ’సావరిన్ డీప్ డైవ్’ పేరుతో మూడీస్ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గుజ్మాన్ మాట్లాడుతూ, ♦ భారతదేశానికి మూడీస్ ‘బీఏఏ3’ సార్వభౌమ రేటింగ్ ఇస్తోంది. అధిక రుణ భారం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ ఎకానమీ బలహీనతలను అధిక ఆర్థిక వృద్ధి పటిష్టత సమతౌల్యం చేస్తుంది. భారత్ కార్పొరేట్ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తోంది. ♦ 2022 చివరి నాటికి భారత్ రుణ నిష్పత్తి (దేశ స్థూలదేశీయోత్పత్తి– జీడీపీలో) 84 శాతంగా ఉంటుందన్నది అంచనా. పలు వర్థమాన దేశాలకన్నా ఇది ఎక్కువ. ♦ వచ్చే ఏడాది భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ–20 ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మేము భావిస్తున్నాము. అయితే కుటుంబాలు, వ్యాపార సంస్థలు తక్కువ కొనుగోలు శక్తి సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం కీలక సవాలుగా ఉంది. అధిక ద్రవ్యోల్బణం భారతదేశ వృద్ధికి ప్రతికూల ప్రమాదాలను సృష్టిస్తోంది. ♦ భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం జరిగింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. ♦ 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. ♦ బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయి. ♦ 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుంది. 2023లో జీ-20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణించే అవకాశం ఉంది. ♦ మెరుగైన పన్ను వసూళ్ల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2022-23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ♦ మూడీస్ గత ఏడాది అక్టోబర్లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్లుక్ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. రూపాయిపై ఆందోళన అక్కర్లేదు.. భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదని భావిస్తున్నాం. రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.05నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన దోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. -
మైనింగ్కు ప్రభుత్వ మద్దతు కావాలి
కోల్కతా: దేశాభివృద్ధికి మైనింగ్ కీలకమని, ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమని పరిశ్రమకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. జీడీపీని ఎన్నో రెట్లు వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, నియంత్రణపరమైన వెసులుబాటు కల్పించాలని, కీలకమైన ఖనిజాల మైనింగ్పై నియంత్రణలు తొలగించాలని మైనింగ్కు సంబంధించి సీఐఐ జాతీయ కమిటీ చైర్మన్, వేదాంత గ్రూపు సీఈవో సునీల్ దుగ్గల్ కోరారు. కోల్కతాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సు, 2022లో భాగంగా ఆయన మాట్లాడారు. వెలికితీతకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు కావాలని, అప్పుడే ఈ రంగంలో నూతన తరం కంపెనీలను ఆకర్షించొచ్చని సూచించారు. అలాగే, మైనింగ్కు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు ఓ కాల పరి మితి ఉండాలన్నారు. భూ సమీకరణ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లోహాలు, ఖనిజాల వెలికితీత తక్కువగా ఉండడంతో, 2021లో వీటి దిగుమతుల కోసం 86 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సి వచ్చిందని చెబుతూ.. ఇది 2030 నాటికి 280 బిలియిన్ డాలర్లకు పెరుగుతుందని హెచ్చరించారు. భారత్ వృద్ధి చెందాల్సి ఉందంటూ, వృద్ధికి మైనింగ్ కీలకమని ఇదే కార్యక్రమలో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ పేర్కొన్నారు. జీడీపీలో మైనింగ్ వాటా ప్రస్తుతం 2–2.5 శాతంగా ఉంటే, 2030 నాటికి 5 శాతానికి చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తు చేశారు. స్థిరమైన ఉత్పాదకత, యాంత్రీకరణ, డిజిటైజేషన్ అవసరాన్ని ప్రస్తావించారు. మొబైల్, బ్యాటరీ, సోలార్ కోసం అవసరమైన కీలక ఖనిజాల మైనింగ్ సమయంలో కాలుష్యం విడుదలను తగ్గించడం కీలకమని బీఈఎంఎల్ చైర్మన్, ఎండీ అమిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధికి ఖనిజాలు కీలకమని ఎన్ఎండీసీ చైర్మన్ సుమిత్దేబ్ పేర్కొన్నారు. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
మోర్గాన్ స్టాన్లీ కోత..భారత్ జీడీపీ వృద్ధి అంచనా కుదింపు!
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకు అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ 40 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ రేటు 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. 2023–24 వృద్ధి అంచనాలను సైతం 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.7 శాతం నుంచి 6.4 శాతానికి దిగివచ్చింది. ప్రపంచ వృద్ధి మందగమన ధోరణి భారత్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపనుందని మోర్గాన్ స్టాన్లీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇక 2022 డిసెంబర్తో ముగిసే సంవత్సరంలో ప్రపంచ వృద్ధి 1.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2021లో ఈ రేటు 4.7 శాతం. కాగా ఆర్బీఐ రెపోరేటు ప్రస్తుత 4.9% నుంచి 2023 ఆగస్టు నాటికి 6.5%కి చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది. -
ఎకానమీ.. రివర్స్గేర్..!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది. కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది. ‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి... కాగా 2021 ఏప్రిల్తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ‘మూలధనం’ సానుకూలతలు మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం. 8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే... జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%. చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది. కట్టడిలోనే ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు. అన్ని రంగాలూ బలహీనమే... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం. తలసరి ఆదాయం వృద్ధి అంతంతే... తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది. ప్రైవేటు వినియోగం బలహీనత నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకనమిస్ట్ స్టాగ్ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే... ఇతర దేశాలతో పోల్చితే భారత్కు స్టాగ్ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం... 2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్ఫ్లేషన్ సవాళ్లు భారత్పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి -
దేశానికి స్టార్టప్లే వెన్నెముక
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా భారత్ నుంచి భారత్ కోసం ఆవిష్కరణలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. స్టార్టప్ల ప్రతినిధులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ‘‘మన స్టార్టఫ్లు ఆట (పోటీ) నిబంధనలను మార్చేస్తున్నాయి. భారత్కు స్టార్టప్లు వెన్నెకముగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్లో 60,000 స్టార్టప్లు, 42 యూనికార్న్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం మూడింటిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ప్రభుత్వ చట్రం నుంచి, అధికారిక అడ్డుగోడల నుంచి వ్యవస్థాపకత, ఆవిష్కరణలకు విముక్తి కల్పించడం. ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేయడం. యువ ఆవిష్కర్తలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలవడం’’ అని ప్రధాని వివరించారు. ఎంతో పురోగతి.. 2013–14లో కేవలం 4,000 పేటెంట్లు భారత సంస్థలకు మంజూరు అయితే, గతేడాది 28,000 పెటెంట్లు మంజూరైన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2013–14లో 70,000 ట్రేడ్మార్క్లు సంఖ్య వృద్ధి చెందినట్టు చెప్పారు. అలాగే 2013–14లో 4,000 కాపీరైట్లు మంజూరు అయితే, 2021–22 మంజూరైనవి 16,000గా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్ స్థానం 2015లో 81 ఉంటే, అది ఇప్పుడు 46కు మెరుగుపడినట్టు పేర్కొన్నారు. స్టార్టప్లు ప్రదర్శన.. 150కుపైగా స్టార్టప్లు ఆరు రకాల గ్రూపులుగా ఏర్పడి ఈ సందర్భంగా ఆరు రకాల థీమ్లపై ప్రదర్శన ఇచ్చాయి. సాగు రంగంలో విస్తృతమైన డేటా సమీకరణకు యంత్రాంగం, భారత్ను వ్యవసాయానికి ప్రాధాన్య కేంద్రంగా మార్చడం, టెక్నాలజీ సాయంతో హెల్త్కేర్కు మద్దతునివ్వడం, మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారం, వర్చువల్ టూర్స్ ద్వారా రవాణా, పర్యాటకానికి ప్రోత్సాహాన్నివ్వడం, ఎడ్యుటెక్, ఉపాధి అవకాశాల గుర్తింపు, ఆఫ్లైన్ రిటైల్ దుకాణాలను ఈ కామర్స్తో అనుసంధానించడంపై స్టార్టప్లు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి. ఉపాధి అవకాశాలకు వేదిక స్టార్టప్లు ఆవిష్కరణలు తీసుకురావడే కాదు భారీ ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కింది స్థాయి వరకు స్టార్టప్ సంస్కృతి ఫరిడవిల్లేందుకు వీలుగా ఏటా జనవరి 16న ‘నేషనల్ స్టార్టప్ డే’గా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్లకు 2022 ఎన్నో అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. స్టార్టప్లకు ప్రోత్సాహాన్నిస్తుంది.. నేషనల్ స్టార్టప్ డే అన్నది దేశ జీడీపీ వృద్ధిలో స్టార్టప్ల పాత్రను గుర్తించడమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, యువ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేసేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని బోలోలైవ్ (షార్ట్ వీడియోల ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ సక్సేనా పేర్కొన్నారు. -
ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..?
న్యూఢిల్లీ: కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ పెరుగతున్న కేసుల వల్ల భారతదేశం ఈ ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం జీడీపీ రేటు తగ్గే అవకాశం ఉన్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పేరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి రాత్రి, వారాంతపు కర్ఫ్యూలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం.. క్యూ4ఎఫ్ వై22లో జీడీపీ వృద్ధి ఇప్పుడు 5.7 శాతం(యోవై)గా ఉండనున్నట్లు తెలపింది. ఇది ఈ ఏజెన్సీ మునుపటి అంచనా 6.1 శాతం కంటే 40 బేసిస్ పాయింట్లు తక్కువ. "2022 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ది రేటును తగ్గిస్తూ 9.3 శాతంగా పేర్కొంది. ఇది మా మునుపటి అంచనా 9.4 శాతం కంటే 10 బేస్ పాయింట్లు తక్కువ" అని ఏజెన్సీ తెలిపింది. ఓమిక్రాన్ కొత్త కేసులు గత కోవిడ్ వేరియెంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఎక్కువగా ప్రాణాంతకం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా, కోవిడ్ 1.0 & 2.0 కంటే ఇది తక్కువ విఘాతం కలిగిస్తుంది. కరోనా కేసుల వ్యాప్తిని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూలు, లాక్ డౌన్ విధించాలని చూస్తుండటంతో ఆ ప్రభావం దేశ జీడీపీ పడుతున్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది. (చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు శుభవార్త!) -
ఒమిక్రాన్ అలజడి..! భారత్ను కుదిపేయనుందా...?
కోవిడ్-19 భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్నే చూపింది. వ్యవసాయం, మత్స్యరంగం, మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. కాగా తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచదేశాలు భయపడిపోతున్నాయి. మైనస్ 7.3 శాతంగా వృద్ధిరేటు..! కరోనా మహమ్మారి ఫస్ట్వేవ్ను ఎదుర్కోవడం కోసం వచ్చిన లాక్డౌన్తో దేశ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. కరోనా సెకండ్ వేవ్లో కూడా గ్రోత్ రేట్ కాస్త మెరుగైంది. వేగవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియనే ఆయా దేశాలను ఆర్థిక సంక్షోభాల నుంచి కాపాడుతుందని ప్రపంచ ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. సరైన జాగ్రత్తలు తీసుకొకుంటే ఒమిక్రాన్ వేరియంట్ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై భారీగానే ప్రభావం చూపుతోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వేగవంతమైన వ్యాక్సినేషన్..! భారత్లో ఇప్పటివరకు 33 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో టీకా వేగాన్ని పెంచడంతో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ- నవంబర్ 2021 నెలవారీ ఆర్థిక నివేదికలో పేర్కొంది. మార్కెట్ సెంటిమెంట్లు, వేగవంతమైన టీకా కవరేజ్, బలమైన బాహ్య డిమాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రానున్న త్రైమాసికాల్లో భారత్ ఆర్థికంగా బలపడుతుందని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 8.4 శాతం గ్రోత్..! గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత్ స్థూల జాతీయోత్పత్తి (GDP) 8.4 శాతానికి పెరిగింది. సుమారు 100 శాతానికి పైగా జీడీపీ పుంజుకుంది. సేవ రంగం, తయారీ రంగాల్లో పూర్తి పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా జీడీపీ పుంజుకోవడానికి సహాయపడింది. ప్రైవేట్ రంగంలో రికవరీ మొదటి త్రైమాసికంలో 88 శాతం నుంచి రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగింది. సరఫరా విభాగంలో వ్యవసాయ రంగంలో జీవీఏ దాని ప్రీ-పాండమిక్ స్థాయి కంటే ఎక్కువగా కొనసాగుతోంది. తయారీ , నిర్మాణ రంగాలు కూడా వాటి ప్రీ-పాండమిక్ స్థాయిలను అధిగమించి భారత వృద్ధికి కీలక చోదకాలుగా ఉద్భవించాయి. చదవండి: ద్రవ్యోల్బణం ఆందోళనలు ? పడిపోతున్న రూపాయి విలువ ! -
8.3 శాతం వృద్ధికి అవకాశం
వాషింగ్టన్: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 8.3 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చని తాజాగా అంచనా వేసింది. పెరిగిన ప్రభుత్వ పెట్టుబడులు, తయారీని పెంచేందుకు ఇస్తున్న ప్రోత్సాహకాలు వృద్ధికి తోడ్పడతాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కరోనా రెండో విడత ప్రబలడానికి ముందు ఈ ఏడాది ఆరంభంలో వేసిన అంచనాల కంటే ఇది తక్కువేనని తెలిపింది. కరోనా రెండో విడత ప్రభావంతో ఆర్థిక రికవరీ నిలిచిపోయిందని.. వాస్తవానికి రికవరీ క్షీణించినట్టు కొన్ని సంకేతాల ఆధారంగా తెలుస్తోందని ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ అన్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన నివేదికలో భారత్ జీడీపీ వృద్ధి 2021–22లో 7.5–12.5 మధ్య ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరగడం తెలిసిందే. దీంతో తన తాజా అంచనాల్లో దిగువ స్థాయికి వృద్ధి అంచనాలను సవరించినట్టు టిమ్మర్ పేర్కొన్నారు. కరోనా రెండో విడత ప్రభావం ఆర్థిక వ్యవస్థమీద ఎక్కువే ఉందన్నారు. కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరం కార్మిక, వ్యవసాయ సంస్కరణలు అవసరానికి అనుగుణంగానే ఉన్నాయని టిమ్మర్ అభిప్రాయపడ్డారు. ఇవి ఆర్థిక వ్యవస్థలో వెలుగు చూడని సామర్థ్యాలని బయటకు తీసుకొస్తాయని చెప్పారు. సామాజిక భద్రతా వ్యవస్థల కోసం నిధులను ఏర్పాటు చేయడం వంటివి సంఘటిత రంగంలోని కారి్మకులకే కాకుండా.. అసంఘటిత రంగంలోని వారికీ మేలు చేస్తుందన్నారు. ‘‘భారత్లో అమలు చేస్తున్న ఎన్నో స్వల్పకాలిక ఉపశమన చర్యలు దీర్ఘకాలం కోసం కాదు. దేశం మొత్తానికి సంబంధించి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సంస్కరణలు (కారి్మక, వ్యవసాయ) ఆ దిశలోనే ఉన్నాయి. కానీ, అదే సమయంలో చేయాల్సింది ఎంతో ఉంది’’ అని టిమ్మర్ వివరించారు. -
భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
గత నాలుగు సంవత్సరాల నుంచి భారత జీడీపీ వృద్ది రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా రాకతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో -7.96 శాతం వృద్ది రేటును భారత్ను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతం మేర పడిపోయింది. 2021-2022 జీడీపీ రేటు 8.3 శాతం..! తాజాగా ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలను చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ 8.3 శాతం నమోదుచేస్తోందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 20.1 శాతంగా నమోదుచేసింది. కరోనా రాకతో దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా జీడీపీ 24.4 శాతం మేర తగ్గింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..! కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్తో సతమతమైనా భారత జీడీపీ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంకు తన నివేదికలో...కరోనా వ్యాక్సినేషన్, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, గృహ ఆదాయాల(నెలసరి, వార్షిక ఆదాయాలు) పెరుగుదల వంటి అంశాలు భారత జీడీపీ పెరుగుదలను నిర్ణయిస్తోందని పేర్కొంది. గృహా ఆదాయాల్లో రికవరీ ఉంటేనే..భారత ఎకానమీ పునరుద్దరణ ఉంటుందని తెలిపింది. గృహా ఆదాయాల్లో పెరుగుదల కన్పిస్తేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో జీడీపీ పెరుగుదలలో మార్పు కన్పిస్తోందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఏదేమైనా, భారత్లో వివిధ రంగాలలో ఆర్థిక పునరుద్ధరణ అసమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాలు 2021 లో స్థిరంగా కోలుకున్నప్పటికీ, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మహిళలు, స్వయం ఉపాధి వ్యక్తులు, చిన్న సంస్థలు వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాంతో పాటుగా దక్షిణాసియా దేశాల్లో అనేక ఆర్థిక రంగాల్లో లింగ అసమానతలు భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మెర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2021–22లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఐక్యరాజ్యసమితి కమిషన్ (యూఎన్ఈఎస్సీఏపీ) మంగళవారం విడుదల చేసిన తన సర్వే ఆధారిత నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 1. మహమ్మారి భారత్ వ్యాపార క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. దీనితో 2020–21లో ఆర్థిక వ్యవస్థ 7.7% క్షీణిస్తుంది. బేస్ ఎఫెక్ట్సహా ఆర్థిక క్రియాశీలత మళ్లీ ప్రారంభం కావడంతో 2021–22లో వృద్ధి రేటు 7%గా ఉండే వీలుంది. 2. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15–మే 3, మే 4–మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొ లగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊ పందుకోవడంతో మూడో త్రైమాసికంలో స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ దాదాపు ఇదే స్థాయి వృద్ధి రేటు నమోదుకావచ్చు. 3. కేంద్ర రుణ సమీకరణలకు సంబంధించి వడ్డీ వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచడం, బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రతను అందుపులో ఉంచడం దేశం ముందు ఉన్న ప్రస్తుత పెద్ద సవాళ్లు. 4. వర్ధమాన ఆసియా–పసిఫిక్ దేశాల సగటు వృద్ధిరేటు 2021లో 5.9 శాతం ఉండే వీలుంది. 2022లో ఇది 5 శాతానికి తగ్గవచ్చు. 2020లో ఆయా దేశాల ఉత్పత్తి రేటు 1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. 5. బేస్ ఎఫెక్ట్ వల్ల 2021లో భారీ వృద్ధి రేటు (వీ నమూనా) కనిపించినప్పటికీ, తిరిగి ఎకానమీ ‘కే’ నమూనా రికవరీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి రికవరీ రేటు విస్తృత ప్రాతిపదికన, ఏకరీతిన కాకుండా విభిన్నంగా ఉండే అవకాశం ఉంది. 6. ఆసియా, పసిఫిక్ దేశాలు కేవలం వృద్ధిమీదే దృష్టి పెడుతున్నాయి తప్ప, ఉపాధి కల్పన, సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డానికి చర్యలు వంటి అంశాలపై శ్రద్ధ పెట్టడం లేదు. మహమ్మారి వల్ల ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో దాదాపు 8.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలో పడిపోయారు. వారు రోజుకు కేవలం 1.90 డాలర్లు (రూ.145కన్నా తక్కువ) సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. 7. వృద్ధి ప్రణాళికల్లో ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వర్ధమాన దేశాల్లో సైతం దిగువన ఉన్న ఎకానమీలకు అంతర్జాతీయ సహకారం అందాలి. కోవిడ్ను ఎదుర్కొనడంలో చైనా పటిష్ట చర్యలు తీసుకుంది. ఈ కారణంగానే 2020 నాల్గవ త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించగలిగింది. చైనా రిక వరీ మున్ముందూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. -
జీడీపీ ఊతం : దుమ్మురేపుతున్న మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి.సోమవారం ఆరంభంలోనే దూకుడు మీదున్నకీలక సూచీలు ఆ తరువాత కూడా తమ హవా కొనసాగిస్తున్నాయి. ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ సంకేతాలతోపాటు, జీడీపీ నంబర్లు మార్కెట్లని మెప్పించడంతో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు జంప్ చేసింది. తద్వారా సెన్సెక్స్ తిరిగి 50 వేల ఎగువకుచేరింది. నిఫ్టీ 238 పాయింట్లుఎగిసి 14766 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంక్ కూడా జోరుగా ట్రేడ్ అవుతోంది. ఆటో ,ఐటీ,బ్యాంకింగ్, సహా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. దీంతో పాటు మీడియా, ఫైనాన్స్ ఆయిల్ రంగ షేర్ల లాభాలు మార్కెట్కు ఊతమిస్తున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ , యూపిఎల్ కోల్ఇండియా లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, హిందాల్కో నష్టపోతున్నాయి. -
ఎలక్ట్రానిక్ తయారీయే.. రూ.లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ తయారీని పెంచడం ఒక్క చర్యతోనే జీడీపీకి ట్రిలియన్ డాలర్లు (రూ.74లక్షల కోట్లు) మేర సమకూరుతుందని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ విషయంతో తనకు ఎటువంటి సందేహం లేదంటూ, దీన్ని తప్పకుండా సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలైన యాపిల్, శామ్సంగ్ తదితర సంస్థలకు భారత్లో కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉందని, వీటితోపాటు వీటి కాంట్రాక్టు తయారీ సంస్థలు సైతం భారత్లో ఉత్పత్తిని విస్తరించనున్నాయని అసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.370 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ‘‘ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీలు), ల్యాప్టాప్లు, ఐవోటీ ఉత్పత్తుల విషయంలో భారత్కు అపార సామర్థ్యాలున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీలో అంతర్జాతీయంగా అతిపెద్ద కేంద్రంగా భారత్ అవతరించాలన్నది ఆలోచన’’ అని మంత్రి ప్రసాద్ వివరించారు. దేశంలో నైపుణ్యాలు, ఆవిష్కరణల సామర్థ్యాలు, అధిక జనాభా అనుకూలతలు అన్నవి భారత్ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసేందుకు సరిపోతాయన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించిందని.. రూ.10 లక్షల కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీలు సంసిద్ధతను ప్రకటించాయని తెలిపారు. ఇందులో రూ.7 లక్షల కోట్ల మేర ఎగుమతులకు ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. -
క్యూ3లో యూఎస్ జీడీపీ 33 శాతం అప్
వాషింగ్టన్: కోవిడ్-19 వేధిస్తున్నప్పటికీ యూఎస్ ఆర్థిక వ్యవస్థ క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఏకంగా 33.1 శాతం పురోగమించింది. వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 33.1 శాతం వృద్ధిని సాధించింది. వెరసి తొలుత వేసిన వృద్ధి అంచనాలను ఆర్థిక వ్యవస్థ ఎలాంటి మార్పులు లేకుండా సాధించినట్లయ్యింది. కాగా.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికమని ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా తెలియజేశారు. 1947 నుంచి గణాంకాలు నమోదు చేయడం ప్రారంభించాక 1950లో మాత్రమే దేశ జీడీపీ ఒక త్రైమాసికంలో అత్యధికంగా 16.7 శాతం పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు, హౌసింగ్, ఎగుమతులు భారీగా పుంజుకున్నప్పటికీ.. స్థానిక ప్రభుత్వాల వినిమయంతోపాటు, వినియోగ వ్యయాలు తగ్గడం, నిల్వలు పెరగడం వంటివి బలహీనపడినట్లు గణాంకాలు వివరించాయి. మాంద్య పరిస్థితులు ఈ ఏడాది క్యూ4(అక్టోబర్- డిసెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మైనస్లోకి జారుకునే వీలున్నట్లు యూఎస్ విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్వేవ్లో భాగంగా తిరిగి కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు వ్యవస్థలకు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా క్యూ4లో ప్రతికూల వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది విశ్లేషకులైతే మహామాంద్యం ముప్పు పొంచిఉన్నట్లు అంచనా వేస్తుండటం గమనార్హం. కాగా.. వార్షిక ప్రాతిపదికన యూఎస్ జీడీపీ తొలి క్వార్టర్లో 5 శాతం క్షీణించగా.. క్యూ2లో మరింత అధికంగా 31.4 శాతం క్షీణించిన విషయం విదితమే. క్యూ2లో లాక్డవున్లు, ఉద్యోగాల కోత తదితర అంశాలు ప్రభావం చూపాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టపోయిన ఉత్పాదకతను తిరిగి సాధించడం అంత సులభంకాదని, కోవిడ్-19 మరోసారి కల్లోలం సృష్టిస్తుండటంతో వచ్చే ఏడాది(2021) తొలి త్రైమాసికం(జనవరి- మార్చి)లోనూ దేశ జీడీపీ మైనస్లోకి జారుకునే అవకాశమున్నదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. -
జీడీపీ పరుగులు పెట్టేలా ప్రత్యేక ప్యాకేజీ: నిర్మల
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలియజేశారు. ఇటీవల కనిపిస్తున్న డిమాండ్ తాత్కాలికమైనదికాదని..ఇకపైనా పటిష్టంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు నిదర్శనంగా వెల్తువెత్తిన జీఎస్టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు తదితరాలను ప్రస్తావించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. గత 11 రోజులుగా పటిష్ట రికవరీ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఆర్థిక పురోగతికి దన్నునిచ్చేందుకు సహాయక ప్యాకేజీలో భాగంగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి సీతారామన్ ఇంకా ఏమన్నారంటే.. హైలైట్స్ - ఎరువుల సబ్సిడీ కింద రైతులకు రూ. 65,000 కోట్ల కేటాయింపు. - జాతీయ మౌలిక సదుపాయాల పెట్టుబడి నిధి(ఎన్ఐఐఎఫ్)కి రూ. 6,000 ఈక్విటీ పెట్టుబడులు. తద్వారా 2025కల్లా ఎన్ఐఐఎఫ్ రూ. 1.1 లక్షల కోట్లను సమీకరించగలుగుతుంది. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చగలుగుతుంది. - గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి రూ. 10,000 కోట్ల అదనపు కేటాయింపులు. - రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కు బూస్ట్- డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను సంబంధిత ఉపశమన చర్యలు- సెక్షన్ 43సీఏలో సవరణలు! - ఆత్మనిర్భర్ తయారీ పథకంలో భాగంగా 10 చాంపియన్ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించనున్నారు. - ఈ పథకం విలువ రూ. 1,45,980 కోట్లు. - అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీకు రూ. 18,100 కోట్లు - ఎలక్ట్రానిక్, టెక్నాలజీ ప్రొడక్టులు రూ. 5,000 కోట్లు - ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు రూ. 57,042 కోట్లు - ఫార్మాస్యూటిక్స్, ఔషధాలు రూ. 15,000 కోట్లు - టెలికం, నెట్వర్కింగ్ ప్రొడక్టులు రూ. 12,195 కోట్లు - టెక్స్టైల్ ప్రొడక్టులు రూ. 10,683 కోట్లు - అధిక సామర్థ్యంగల సోలార్ పీవీ మాడ్యూల్స్ రూ. 4,500 కోట్లు - వైట్ గూడ్స్(ఏసీలు, లెడ్) రూ. 6,328 కోట్లు - స్పెషాలిటీ స్టీల్ రూ. 6,322 కోట్లు - స్వావలంబన పథకంలో భాగంగా 12 రకాల చర్యలను ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా మార్చి- సెప్టెంబర్ మధ్య కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి కొత్తగా ఉద్యోగ కల్పనకు చర్యలు. రూ. 15,000 కంటే తక్కువ వేతనాలు ఆర్జించేవారికి ఈ పథకం వర్తించనుంది. 2020 అక్టోబర్ 1 నుంచీ రెండేళ్లపాటు ఈ పథకం అమలులో ఉంటుంది. - ఈఎల్సీజీ పథకంకింద రూ. 2.05 లక్షల కోట్లను కేటాయించాం. 61 లక్షల రుణగ్రహీతలకు రూ. 1.52 లక్షల కోట్ల రుణాలు విడుదలయ్యాయి. - 21 రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలమేరకు రూ. 1681 కోట్లను పీఎం మత్స్యసంపద పథకానికి కేటాయించాం. - పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకంలో భాగంగా రూ. 26,889 కోట్ల పీఎస్యూ బ్యాంకుల పోర్ట్ఫోలియోలను కొనుగోలు చేసేందుకు అనుమతించాం. - ప్రత్యేక లిక్విడిటీ పథకంలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు రూ. 7,227 కోట్లు విడుదలయ్యాయి. - 39.7 లక్షల మంది అసెసీలకు రూ. 1,32,800 కోట్లను ఆదాయపన్ను రిఫండ్స్గా చెల్లించాం. -
ఇక వచ్చే ఏడాదే జీడీపీ ‘వెలుగు’
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇక ఈ ఏడాది ఉండబోదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీపీఎం) సభ్యుడు నీలేష్ షా సూచించారు. మార్చి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) లేదా జూన్ త్రైమాసికం (2021 ఏప్రిల్–జూన్)లోనే భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి వస్తుందని ఆయన అంచనావేశారు. సంక్షోభ స్థితి నుంచి అవకాశాల బాటకు భారత్ మళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన అన్నారు. ఇందుకు సంస్కరణలే మార్గమని బుధవారం స్పష్టం చేశారు. నీలేష్ షా ప్రస్తుతం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు పెరుగుదలకు ఆశావాదమే కారణమవుతోందని కూడా ఆయన విశ్లేషించారు. మార్కెట్లు గత గణాంకాలను కాకుండా, భవిష్యత్వైపు దృష్టి సారిస్తున్నాయని అన్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ నిర్వహించిన ఒక వెబ్నార్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి అవకాశాలవైపు వెళ్లడం అంశాన్ని ఆయన విశ్లేషిస్తూ, ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుంచి కంపెనీలు బయటకు వచ్చేయాలనుకుంటున్నాయి. దీనిని భారత్ అవకాశంగా తీసుకోవాలి. కంపెనీలు భారత్లోకి రావడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. ఈ దిశలో పాలనా, ఆర్థిక సంస్కరణలను చేపట్టాలి’’ అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, విద్యుత్ వ్యయాలు తగ్గడం వంటి చర్యలను భారత్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, చమురు ధరలు తక్కువగా ఉండడం, సానుకూల వ్యవసాయం వంటి అంశాలు భారత్కు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు మంచి వ్యాపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నాలుగు రెట్ల వృద్ధి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వీటిలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య 2.5 కోట్లయితే వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచాలన్నది పరిశ్రమ లక్ష్యంగా ఉందని వివరించారు. -
11 ఏళ్ల కనిష్టస్ధాయిలో జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ : 2019-20 ఆర్ధిక సంవత్సరంలో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో 4.2 శాతంగా నమోదైంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసంలో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన 4.1 శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. కాగా 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం అంచనా వేయగా వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో కేవలం 4.2 శాతానికే పరిమితమైంది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీడీపీ వృద్ధి గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కోవిడ్-19 లాక్డౌన్తో తయారీ, సేవా రంగాలు నిలిచిపోయిన క్రమంలో జీడీపీ వృద్ధిపై అది పాక్షిక ప్రభావం చూపింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.1 శాతం మేర వృద్ధి సాధించింది. చదవండి : తీవ్ర సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ: గోల్డ్మెన్ సంస్థ -
7.4 శాతం వృద్ధిని సాధిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణ , కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో ఆయన కీలక విషయాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై సమీక్షిస్తూ చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఆయన భారత్ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసిందన్నారు. అంతేకాదు కరోనా సంక్షోభం ఉంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని చెప్పారు. 2021-22 నాటికి భారత్ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. జీ-20 దేశాల్లో మెరుగ్గా ఉన్నాం. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. భారత్ 1.9 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్లో ఏప్రిల్ నెలలో ఆహార ధరలు ఏకంగా 2.4శాతం పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఫిబ్రవరి 6 నుండి మార్చి 27 వరకు జిడిపిలో లిక్విడిటీ ఇంజెక్షన్ 3.2 శాతంగా ఉందన్నారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత) ఇతర చర్యలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ లక్షలాది దీర్ఘకాలిక రెపో ఆపరేషన్ (టిఎల్టిఆర్ఓ) ద్వారా అదనంగా రూ .50 వేల కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థలకు రూ .50 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తక్షణమే వీటిని అందించనున్నామన్నారు. ఆర్బీఐ చర్యల ఫలితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు ద్రవ్యత గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నుండి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఆర్బీఐ పర్యవేక్షిస్తోందని పేర్కొన్న ఆయన, మార్చిలో ఎగుమతుల సంకోచం 34.6 శాతంగా ఉందని, 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మార్చిలో ఆటోమొబైల్ ఉత్పత్తి, అమ్మకాలు బాగా తగ్గాయని, విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయిందని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఉటంకించారు. మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. సత్యాసత్యాల మధ్యలో మన మనుగడ కొనసాగుతోంది. చీకటిని చీల్చుతూ వెలుగు రేఖ వస్తుందంటూ గాంధీజీ మాటలను గుర్తు చేసుకోవడం విశేషం. -
కరోనా వార్తలే కీలకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసుల పోకడను బట్టే దేశీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఈ వారం స్టాక్ మార్కెట్ల కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని వారంటున్నారు. దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్తో రూపాయి మారకం విలువ కదలికలు, ముడి చమురు ధరల గమనం....ఈ అంశాలు కూడా ఈ వారం మార్కెట్పై ప్రభావం చూపుతాయని విశ్లేషణ. ఫిచ్ అంచనా ప్రభావం!: 2020–21లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పడిపోతుందన్న ఫిచ్ అంచనా మార్కెట్పై ప్రభావం చూపవచ్చు. నేడు వెలువడే (సోమవారం) సేవల రంగం పీఎమ్ఐ గణాంకాలు, 9న ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్పై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం.... కాగా కరోనా వైరస్ కేసులను బట్టే దేశీ, విదేశీ స్టాక్ మార్కెట్ల తీరు ఉంటుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మార్కెట్ ఇప్పటికే చెప్పుకోదగిన స్థాయిలో కరెక్షన్కు గురయిందని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. మహావీర్ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) సెలవు. అలాగే గుడ్ఫ్రైడే (ఈ నెల 10న) సందర్భంగా కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనున్నది. భారీ విదేశీ నిధులు వెనక్కి..: కరోనా వైరస్ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ను దెబ్బతీయడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ నుంచి గత నెలలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.61,973 కోట్లు, బాండ్ మార్కెట్ నుంచి రూ.56,211 కోట్లు వెరసి రూ.1.18,184 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి. -
‘కోవిడ్’పైనే దృష్టి..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టాక్ మార్కెట్ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు (6.9 శాతం), నిఫ్టీ 879 పాయింట్లు (7.2 శాతం) నష్టపోయాయి. శుక్రవారం ఒక్కరోజులోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనంగా నమోదైంది. ఇంతటి పతనానికి కారణమైన కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారంలో సూచీలు కోలుకునేనా..? కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఇంకేం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్లో కోవిడ్–19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్.. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు సైతం సోకడం మరింత కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు మార్కెట్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం పట్ల ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడం అనే అంశం ముడిపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. జీడీపీ 4.7 శాతంగా నమోదైంది. ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా మార్కెట్ నిలదొక్కుకునేదని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలు, కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ సూచీలను నడిపిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం... మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా.. సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అమెరికా మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుంది. మరోవైపు శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్పై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆదివారం వెల్లడైన ఆటో రంగ ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ విక్రయాలు గత నెలలో 1.6% పడిపోయాయి. ఫిబ్రవరిలో రూ. 6,554 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) గతనెల్లో రూ. 6,554 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరి 3–28 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 1,820 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 4,734 కోట్లను వీరు కుమ్మరించారు. మార్కెట్ గతవారం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ.. వీరి పెట్టుబడులు ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. -
స్థిరత్వం శుభ సంకేతం!
భారత్ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ‘‘స్థిరత్వం’’గా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు. సీఎన్బీసీ టీవీ 18 బిజినెస్ లీడర్షిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్–19 వైరస్ విషయంలో తక్షణం భయపడాల్సింది ఏదీ లేదన్నారు. అయితే సమస్యలు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే మాత్రం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. -
ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికం(క్యూ3)లో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) జూలై–సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2019 ఏప్రిల్–జూన్)లో వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2018–19) డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం వృద్ధి రేటు తగ్గేందుకు దారితీసినట్టు ఎన్ఎస్వో తెలిపింది. వృద్ధి గణాంకాలు ఇవీ... ►డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.7 శాతం వృద్ధి రేటు 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 4.3 శాతం తర్వాత తక్కువ స్థాయి. ►2019 ఏప్రిల్–డిసెంబర్ వరకు తొమ్మిది నెలలకు జీడీపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.3 శాతంగా ఉంది. ►తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 5.2 శాతం వృద్ధి చెందగా, తాజా ఇది 0.2 శాతం మేర తగ్గింది. ►వ్యవసాయ రంగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం నుంచి 3.5 శాతానికి పుంజుకుంది. ►నిర్మాణ రంగంలో జీవీఏ 6.6 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. మైనింగ్ రంగంలోనూ జీవీఏ 4.4 శాతం నుంచి 3.2 శాతానికి దిగొచ్చింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలోనూ జీవీఏ 0.7 శాతం మేర తగ్గింది. ►వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ విభాగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8 శాతం నుంచి 5.9 శాతానికి పరిమితమైంది. ►ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం 2019–20లో రూ.1,34,432గా ఉంటుంది. 2018–19లో ఉన్న తలసరి ఆదాయం రూ.1,26,521తో పోలిస్తే 6.3 శాతం అధికం. ద్రవ్యలోటు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును రూ.7,66,846 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, జనవరి చివరికే (10 నెలల కాలం) రూ.9,85,472 కోట్లకు ( 128.5 శాతం) చేరింది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. క్షీణత ఇక ముగిసినట్టే: ఆర్థిక శాఖ దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్టాన్ని చూసేసిందని (బోటమ్డ్ అవుట్) కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని అకనమిక్ అఫైర్స్ విభాగం కార్యదర్శి అతాను చక్రవర్తి ప్రకటించారు. కీలక పారిశ్రామిక రంగాల్లో వృద్ధి డిసెంబర్, జనవరి నెలల్లో పుంజుకున్నట్టు చెప్పారు. -
సంస్కరణలతోనే భారత్ భారీ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - 2018లో భారత్ వృద్ధి 6.8 శాతం. 2019లో ఇది 5.7 శాతానికి తగ్గింది. ఆయా ప్రతికూల అంశాల నేపథ్యంలో ప్రభుత్వం పలు ద్రవ్యపరమైన సంస్కరణలను చేపట్టింది. ఈ దన్నుతో 2020లో వృద్ధి 6.6 శాతానికి రికవరీ కావచ్చు. అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేol9టరీ, సంస్థాగత సంస్కరణలు కీలకం. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకద్రవ్య నిల్వల విషయంలో ఉన్న సానుకూలతలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశం. - భారత్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20) జీడీపీ వృద్ధి రేటు 5%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–21)లో 5.8–5.9% శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంది. - ప్రతి ఐదు దేశాల్లో ఒకదేశం తలసరి ఆదాయం ఈ ఏడాది స్థిరంగా ఉండడమో లేక తగ్గుతుండడమో జరిగే అవకాశం ఉంది. అయితే తలసరి ఆదాయం 4 శాతం పైగా పెరిగే అవకాశం ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. - ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక బలహీనత సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే వీలుంది. - అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితితో యూరోపియన్ యూనియన్లో తయారీ రంగం బలహీనత నెలకొంది. తీవ్ర సవాళ్లు ఉన్నా.. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రాంతంగా తూర్పు ఆసియా కొనసాగనుంది. ఇక చైనా వృద్ధి 2019లో 6.1%, 2020లో 6%గా ఉండొచ్చు. 29యేళ్ల కనిష్టానికి చైనా వృద్ధి 2019లో చైనా వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోయింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశీయ డిమాండ్ మందగమనం, అమెరికాతో 18 నెలల వాణిజ్య యుద్ధం దీనికి ప్రధాన కారణాలని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. -
రిస్క్ కు వెరవడమే మందగమనానికి కారణం
ముంబై: పాలనా ప్రమాణాలు పెంచుకోవాలంటూ పెరిగిన రాజకీయ, నియంత్రణపరమైన ఒత్తిళ్ల మధ్య కంపెనీల బోర్డులు పనిచేస్తున్నాయని, ఫలితంగా కంపెనీలు రిస్క్ కు దూరంగా ఉండడమే ప్రస్తుత ఆర్థిక మందగమనానికి కారణమని హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రి వ్యాఖ్యానించారు. రిస్క్కు వెరిసే లక్షణం కారణంగా బ్యాంకర్లు రుణాలపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, ఇది మారకపోతే భారతదేశ సహజ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దేశ జీడీపీ వృద్ధి 2019–20 ఆరి్థక సంవత్సరానికి 5 శాతం లోపునకు (ఇది 11 ఏళ్ల కనిష్టం) పరిమితం కావచ్చంటూ కేంద్ర గణాంక విభాగం అంచనాలు వెలువడిన సమయంలో కేకిమిస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవే. ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ఆర్థిక వృద్ధి క్షీణతకు కారణాల్లో.. బ్యాంకులకు రిస్క్ పెద్ద తలనొప్పిగా మారడం కూడా ఒకటి. బ్యాంకులు ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాయి. వ్యవస్థలో ఎంతగానో నిధుల లభ్యత (లిక్విడిటీ) ఉంది. నిధులకు కొరతేమీ లేదు’’అని వాస్తవ పరిస్థితిని కేకిమిస్త్రి వివరించారు. అంటే కంపెనీలకు రుణా లు తగినంత లభించకపోవడానికి నిధుల సమస్య కాదని, రిస్క్ విషయంలో మారిన బ్యాంకుల వైఖ రే కారణమని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. రుణాల విషయంలో రిస్క్ తీసుకునేం దుకు అయిష్టంగా ఉన్నంత కాలం ఆరి్థక వ్యవస్థపై ప్రభావం చూపిస్తూనే ఉంటుందని మిస్త్రి అన్నారు. -
జీడీపీ వృద్ధి 5 శాతం లోపే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ 2020 మార్చి మధ్య) 5 శాతం దిగువనే నమోదవుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం జాతీయ ఆదాయ తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. జీడీపీ వృద్ధి 2019–20లో 5 నుంచి 4.5 శ్రేణిలోనే ఉంటుందని ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్, రేటింగ్ దిగ్గజ సంస్థలు అంచనావేశాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతం. జీడీపీ వృద్ధిరేటు 5 శాతం దిగువకు పడిపోతే అది 11 సంవత్సరాల కనిష్టస్థాయి అవుతుంది. ఎన్ఎస్ఓ తాజా విశ్లేషణ ప్రకారం, 2019–20లో తయారీ రంగం భారీగా దెబ్బతిననుంది. 2018–19లో 6.2 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధిరేటు 2019–20లో 2 శాతానికి పడిపోతుందని ఎన్ఎస్ఓ అంచనావేసింది. అలాగే వ్యవసాయం, నిర్మాణ, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి రంగాలు కూడా ప్రతికూల ఫలితాలను నమోదుచేసే అవకాశం ఉందని వివరించింది. అయితే మైనింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ వంటి రంగాల్లో కొంత సానుకూలత ఉండొచ్చని ఎన్ఎస్ఓ అంచనావేసింది. ఆర్బీఐ అంచనాలకన్నా తక్కువ! ..: తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ గత నెల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5 శాతానికి తగ్గించేసింది. అక్టోబర్ నాటి సమీక్షలో వృద్ధి అంచనా 6.1 శాతం. ఇప్పుడు 5 శాతం కన్నా లోపే వృద్ధి రేటు ఉంటుందని ఎన్ఎస్ఓ అంచనావేస్తుండడం గమనార్హం. 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. చమురు ధరల మంటతో ఇబ్బందే: డీబీఎస్ ముడి చమురు ధరలు తీవ్రంగా ఉంటే, అది భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సింగపూర్ బ్యాంకింగ్ గ్రూప్– డీబీఎస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇప్పటికే రూపాయి రెండు నెలల గరిష్టం... 72 స్థాయికి పడిపోయిన విషయాన్ని గుర్తుచేసింది. తలసరి ఆదాయ వృద్ధి 6.8 శాతం భారత్ నెలవారీ తలసరి ఆదాయం 2019–20లో 6.8 శాతం పెరిగి రూ.11,254కు చేరుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ అంచనావేసింది. 2018–19లో తలసరి ఆదాయం రూ.10,534. వార్షికంగా చూస్తే, తలసరి ఆదాయం 6.8 శాతం వృద్ధితో రూ. 1,26,406 నుంచి రూ.1,35,050కి పెరుగుతుంది. కాగా వృద్ధిరేటు 10% (2018–19) నుంచి 6.8 శాతానికి పడిపోతుండడం గమనార్హం. -
భారత్లో ఆర్థిక మందగమనం
వాషింగ్టన్: భారత్లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► నిజానికి భారత్ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. ► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది. ► బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది. ► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. ► వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది. ► బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి. ► ప్రస్తుతం 2019–20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే. ► భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం. ► కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం. ► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.1 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్లో ఏడీబీ పేర్కొంది. రెండవసారి కోత...: నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఐఎఫ్ఎస్సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ ఏర్పాటుకు లోక్సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్లోని గాంధీ నగర్లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్ పరిధిలో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
ఈసారి 5 శాతంలోపే వృద్ధి
న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి కూడా ఇందుకు కారణం కానుందని పేర్కొంది. అటు బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం .. వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా వ్యాపించే రిస్కులు పొంచి ఉన్నాయని, రుణ వృద్ధిపై ఇవి కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల తయారీ రంగానికి, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది. 2019–20 వృద్ధి అంచనాలను ఇటీవలే ఆర్బీఐ 6.1% నుంచి 5%కి కుదించిన నేపథ్యంలో తాజా ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆర్బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు.. సోమవారం ట్రేడింగ్పై ప్రభావం చూపనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్పైనే తాజా డేటా ప్రభావం ఉండనుండగా.. మీడియం టెర్మ్లో మార్కెట్ పథంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు సూచీలను నిలబెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీíసీ) సమావేశం 3న (మంగళవారం) ప్రారంభమై, 5న (గురువారం) ముగియనుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటుపై ఎంపీసీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ రీసెర్చ్ విశ్లేషకులు రాహుల్ గుప్తా అంచనావేశారు. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగా తయారీ, పారిశ్రామిక రంగాలు మందగమనంలో ఉన్నందున మళ్లీ వృద్ధి రేటును గాడిలో పెట్టడం కోసం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విశ్లేషించారు. ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ అదితి నాయర్, ప్రభుదాస్ లిల్లాధర్ కూడా పావు శాతం తగ్గింపును అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆటో సేల్స్, ఆర్థికాంశాల ప్రభావం.. ఈ వారంలో ఆటో, టెలికం రంగాల షేర్లు మార్కెట్ దృష్టిని ఆకర్షించనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. దేశీ ఆటో రంగ నవంబర్ నెల అమ్మకాలు ఆదివారం వెల్లడికాగా.. మారుతీ సుజుకీ విక్రయాలు 1.9%, టాటా మోటార్స్ అమ్మకాలు 25% క్షీణతకే పరిమితం అయ్యాయి. అంతక్రితం నెలల్లో వరుసగా భారీ తగ్గుదలను నమోదుచేసిన ఆటో రంగ కంపెనీలు.. ఇక నుంచి గాడిన పడవచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మరోవైపు, ట్యారిఫ్లను పెంచుతూ టెలికం రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ... భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నవంబర్ నెల్లో రూ. 22,872 కోట్లు వెచ్చించారు. ఈక్విటీ మార్కెట్లో రూ.25,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డెట్ మార్కె ట్ నుంచి రూ. 2,358 కోట్లు వెనక్కితీసుకున్నారు. -
భారత్లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
ఈ ఏడాది వృద్ధి 5 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్బీఐ ఎకోరాప్ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ఇది 2013 మార్చి తర్వాత అత్యంత కనిష్ట వృద్ధి రేటు. ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గిపోవడం, విమాన ప్రయాణికుల్లో క్షీణత, ప్రధాన రంగాల్లో వృద్ధి ఫ్లాట్గా ఉండటం, నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వంటివి రెండో త్రైమాసికంలో వృద్ధిని తగ్గించనున్నట్లు ఎస్బీఐ ఎకోరాప్ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 6.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. కీలక రేట్లలో భారీ కోత? వృద్ధికి ఊతమిచ్చేందుకు గాను ఆర్బీఐ డిసెంబర్లో జరిగే పాలసీ సమీక్షలో భారీ రేట్ల కోత దిశగా అడుగు వేయవచ్చని ఎస్బీఐ ఎకోరాప్ తన నివేదికలో పేర్కొంది. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 1.35% మేర కీలక రేట్లను తగ్గించింది. అక్టోబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ సైతం 2019–20 జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం. -
ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్ కీలక సమీక్ష
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్ఎస్డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్కుమార్ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్ఎస్డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. దేశ జీడీపీ వృద్ధి జూన్ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్బీఎఫ్సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్ తెలిపారు. సెబీ చైర్మన్ అజయ్త్యాగి, ఐఆర్డీఏఐ చైర్మన్ సుభాష్చంద్ర కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు ‘ప్యాకేజీ’ జోష్..!
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో అత్యంత కీలకమైన ఎగుమతులు పుంజుకునేందుకు, రియల్ ఎస్టేట్ రంగంలో జోష్ నింపడం కోసం రూ.70,000 కోట్ల ప్యాకేజీని శనివారం ప్రకటించారు. వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు పలు ఉద్దీపన చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో ప్రకటన చేసి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును నిలబెట్టేందుకు శతవిధాల ప్రయతి్నస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచి్చంది. ఈ జోష్తో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడి ప్రధాన సూచీలు ఊర్థ్వ ముఖంగా ప్రయాణించే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉద్దీపన చర్యల అంశానికి అంతర్జాతీయ సానుకూలతలు జతైతే మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. రానున్న పండుగల సీజన్లో వినియోగదారుల వ్యయం ఏ విధంగా ఉండనుందనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ కొనుగోళ్లు జరిగేందుకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ విశ్లేíÙంచారు. ఆరి్థక అంశాలపై మార్కెట్ దృష్టి..! ఆగస్టు నెల టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) డేటా సోమవారం విడుదలకానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వల సమాచారం, జూన్తో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ డేటా శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక గోవాలో జీ ఎస్టీ కౌన్సిల్ శుక్రవారం సమావేశంకానుంది. ఎఫ్ఓఎంసీ సమావేశం ఈవారంలోనే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం.. మంగళ, బుధవారాల్లో జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గేందుకు అవకాశం ఉందని అబాన్స్ గ్రూప్ చైర్మన్ అభిõÙక్ బన్సాల్ అన్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన వడ్డీ రేటు నిర్ణయాన్ని గురువారం ప్రకటించనుంది. సెపె్టంబర్లో రూ.1,841 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) సెపె్టంబర్లో ఇప్పటివరకు రూ.1,841 కోట్ల పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈనెల 3–13 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,031 కోట్లను ఉపసంహరించుకున్నట్లు తేలింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.3,872 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి రూ.1,841 కోట్లుగా డేటాలో వెల్లడయింది. ఇక ఈక్విటీ, డెట్ మార్కెట్లలో కలిపి ఆగస్టులో రూ.5,920 కోట్లు, జూలైలో రూ.2,986 కోట్లను వీరు ఉపసంహరించుకున్నారు. -
జీడీపీకి ఫిచ్ కోత..
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రేటింగ్ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది. అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు వెనక్కి లాగుతున్నప్పటికీ... బలమైన విదేశీ మారక నిల్వలతో మధ్య కాలానికి వృద్ధి పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్–జూన్) 5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ‘‘దేశీయ డిమాండ్ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్మెంట్ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’’ అని వివరించింది. -
'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా 300 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ మరో రెండు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు మంగళవారం అనుమతించింది. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను తిహార్ జైలుకు పంపకుండా, గృహ నిర్బంధంలోనే ఉంచి విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఆయనకు తాత్కలిక ఉపశమనం లభించింది. అయితే మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5% అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. మోదీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం ఐదు వేళ్లను చూపారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ముందంజలో ఉన్నభారత్, ఏప్రిల్-జూన్లో నమోదైన జీడీపీ వృద్ధితో చైనా కంటే వెనుకబడి ఉంది. -
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు రెండవ త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో కేవలం 6.2 శాతంగా నమోదయ్యింది. గడచిన 27 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదుకావడం చైనాలో ఇదే తొలిసారి. అమెరికా వాణిజ్య యుద్ధం, బలహీన గ్లోబల్ డిమాడ్ వంటి అంశాలు వృద్ధి పడిపోడానికి కారణమని చైనా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) జీడీపీ రేటు 6.4 శాతంగా నమోదయ్యింది. 2019 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) చైనా జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 45.09 ట్రిలియన్ యన్స్ (దాదాపు 6.56 ట్రిలియన్ డాలర్లు) అని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 2018లో చైనా వృద్ధి రేటు 6.6 శాతం. 2019లో కేవలం 6 నుంచి 6.5 శాతం శ్రేణిలోనే వృద్ధిరేటు ఉంటుందని చైనా అంచనా వేస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. చైనా జీడీపీలో 54.9 శాతం వెయిటేజ్ ఉన్న సేవల రంగం మొదటి ఆరు నెలల కాలంలో 7 శాతం పురోగతిని నమోదుచేసుకుంది. -
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులు
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వంలో రెండో సారి మంత్రి అయిన నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖలైన జాతీయ రహదారులు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు సంబం ధించి బృహత్ ప్రణాళికలను ప్రకటించారు. రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాదీ, ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తిని (జీడీపీ)ని పెంచుతామన్నారు. 22 హరిత ఎక్స్ప్రెస్వేల నిర్మాణంతోపాటు రూ.15 లక్షల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేపట్టనున్నారు. అర్ధంతరంగా నిలిచిపోయిన రహదారి ప్రాజెక్టులను వచ్చే వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గడ్కరీ వివరించారు. విద్యుత్ గ్రిడ్ తరహాలో రహదారుల గ్రిడ్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సమావేశాల్లో మోటారు వాహనాల బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు.2017లో లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉందని, అయితే గత ఫిబ్రవరిలో లోక్సభ నిరవధికంగా వాయిదా పడటంతో బిల్లు మురిగిపోయిందని అన్నారు. కొత్త మంత్రి వర్గం ఆమోదం లభించిన వెంటనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. -
నిర్మలా సీతారామన్కు కత్తి మీద సామే!
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల మధ్య 2014లో నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధాని అయ్యారు. నాడు అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు సవ్యంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ చమురు ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. అందుకని నాడు భారత్ ‘స్వీట్ స్పాట్’లో ఉందని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. అందుకనే దేశంలో పెద్ద నోట్ల రద్దుకు మోదీ సాహసించారు. దానివల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా, రెండంకెలు దాటుతుందనుకున్న జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 5.8 శాతానికే పరిమితం అయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని ఆశిస్తే పెద్ద నోట్లను రద్దు చేసిన ఏడాదిలోగా దాదాపు కోటి ఉద్యోగాలు పోయాయి. ఆ మరుసటి సంవత్సరానికి నిరుద్యోగ సమస్య 6.1 శాతంతో 49 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. పన్ను వసూళ్లలో ఐదేళ్లలో ఏనాడు బడ్జెట్ అంచనాలు భర్తీ కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించే నాటికి అటు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి, వాణిజ్య ఆంక్షల కారణంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వంలో మొదటి సారి ఆర్థిక మంత్రి బాధ్యతలు నిర్వహిస్తోన్న నిర్మలా సీతారామన్కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్డడం కత్తిమీద సామే. దేశ జీడీపీ వృద్ధి రేటును రెండంకెల్లోకి తీసుకెళతామని అరుణ్ జైట్లీ తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే సవాల్ చేసి, నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు రెండంకెల వృద్ధి రేటును సాధించడం సీతారామన్కు కూడా సుదూర స్వప్నమే. దేశవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేయడంలో ఇప్పటికీ ఎంతో గందరగోళం నెలకొని ఉంది. ముందు దాన్ని సరిదిద్దడంతోపాటు అంచనాల మేరకు జీఎస్టీని రాబట్టడం సీతారామన్ తక్షణ కర్తవ్యం. కొత్త ఉద్యోగాల కోసం కొత్త పరిశ్రమల కోసం, విదేశీ పెట్టుబడుల కోసం కృషి చేయడం అవసరం. పీఎం–కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం చేయడంతోపాటు వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం ఎంతైన అవసరం. -
మరో విడత ఆర్బీఐ రేట్ల కోతకు చాన్స్
దేశ జీడీపీ వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 5.8 శాతానికి పడిపోయిన నేపథ్యంలో జూన్ తొలి వారంలో జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్బీఐ ఎంపీసీ ప్రకటనలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6 శాతం)ను పావు శాతం మేర (25 బేసిస్ పాయింట్లు) తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 6.1 శాతానికి తగ్గొచ్చన్నది డీబీఎస్ గ్రూపు అంచనా వేసినా అంతకన్నా తక్కువకు ఈ రేటు పడిపోయిన విషయం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ఎంపీసీ రెండో ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3న ప్రారంభమై 6న ముగుస్తుంది. 5న సెలవుదినం కావడంతో 6వ తేదీన ప్రకటన విడుదల కానుంది. ‘‘జీడీపీ వృద్ధి గణాంకాలను బట్టి ఆర్బీఐ పాలసీ కమిటీ జూన్ 6న రేట్లను నిర్ణయిస్తుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.75 శాతం చేస్తుందని భావిస్తున్నాం. దీంతో కలిపితే 2019లో 75 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు అవుతుంది’’ అని డీబీఎస్ నివేదిక పేర్కొంది. ఆర్బీఐ ఎంపీసీ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో పావు శాతం చొప్పున మొత్తం అర శాతం మేర రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. 35–50 బేసిస్ పాయింట్ల వరకూ: ఎస్బీఐ రీసెర్చ్ ఎస్బీఐకి చెందిన పరిశోధన విభాగం సైతం జీడీపీ రేటు మార్చి త్రైమాసికంలో 6.1 శాతానికి పడిపోతుందని తన తాజా ఎకోరాప్ నివేదికలో అంచనా వేసింది. అయితే దీనికంటే తక్కువరేటు నమోదయ్యింది. 2018–19లో వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అయితే, విశ్లేషకుల అంచనాల కంటే వృద్ధి గణాంకాలు ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 35–50 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించొచ్చన్నది ఎస్బీఐ ఎకోరాప్ అంచనా. ఎప్పుడూ 25 బేసిస్ పాయింట్లు లేదంటే దానికి రెట్టింపు అన్న విధానంలో కాకుండా మధ్యస్థంగా తగ్గించడం ద్వారా భవిష్యత్తు పాలసీ విధానంపై కొత్త సంకేతాలు పంపొచ్చని అభిప్రాయపడింది. లిక్విడిటీ పెంపు చర్యలు ‘‘ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగానే ఉండడంతో ఇప్పుడు దృష్టి ద్రవ్య, మానిటరీ పాలసీపైకి మళ్లింది. వృద్ధి పెంపునకు ఉత్ప్రేరకంగా నిలవడంతోపాటు, వినియోగం, ప్రైవేటు పెట్టుబడులను పెంచే విధంగా పాలసీ ఉండాలి’’ అని కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్ శక్తి ఏకాంబరం తెలిపారు. రేట్లను 25–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు లిక్విడిటీ పెంపు చర్యలను కూడా ఆశించొచ్చన్నారు. బడ్జెట్ నిర్ణయాలతో ద్రవ్య పరిస్థితుల తీరును, ఖర్చులను ఆర్బీఐ పరిశీలిస్తుందన్నారు. అలాగే, అంతర్జాతీయ అంశాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఇక రేటింగ్ ఏజెన్సీ ఇక్రా మాత్రం ఆర్బీఐ కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించొచ్చని పేర్కొంది. వేచి చూసే ధోరణితో జూలైలో బడ్జెట్ సమయంలో ద్రవ్య విధానాలపై ప్రభుత్వ ప్రకటనలను పరిశీలించొచ్చని తెలిపింది. ‘‘ఎంపీసీ ఇప్పటికే వరుస తగ్గింపులను చేపట్టింది. ఈ తగ్గింపుల వల్ల రుణాల రేట్లు తగ్గడం, రుణాల జారీ పెరగడం అన్నది ఇంకా ఆచరణలో కనిపించాల్సి ఉంది’’ అని ఇక్రా పేర్కొంది. -
దేశ ఆర్థిక వృద్ధి దారుణంగా నెమ్మదించింది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దారుణంగా నెమ్మదించిందనీ, స్థూల ఆర్థిక సూచీలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. సమాచారాన్ని దాయడం, తమకు ఇష్టమొచ్చినట్లుగా దాన్ని మార్చడంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారని చిదంబరం ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దోషాలతో కూడిన వివరాలు ఇస్తోంది. బహుశా ఆర్థిక వ్యవస్థకు ఇదే బలహీనమైన సమయం కావచ్చు. బీజేపీ హయాంలో భారీగా దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థను బాగుచేయడానికి తర్వాతి ప్రభుత్వం భారీగానే కష్టపడాల్సి ఉంటుంది’ అని చిదంబరం పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితి ఏంటనేది ఎన్ఎస్ఎస్వో, సీఎస్వో లెక్కలు చూస్తే అర్థమవుతుందన్నారు. -
జీడీపీ వృద్ధి రేటు కోత!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉంది. ►దివాలా చట్టం 2016 కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది. ►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది. ►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది. 2018–19లో ఈ రేటు 2.7 శాతం. ►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. -
నాలుగేళ్లలో... 5జీ: ట్రాయ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది’’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో మీడియా కంటెంట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కంటెంట్ను అందించడంపై మీడియా పరిశ్రమ మరింతగా దృష్టి పెడితే, కంటెంట్ వినియోగం గణనీయంగా పెరగగలదని గుప్తా తెలిపారు. మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది. 5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్ స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. కేవలం 5జీకే చైనా బడ్జెట్ సుమారు 500 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, నిర్దాక్షిణ్యమైన పోటీ వల్ల భారత టెలికం పరిశ్రమ పెను సవాళ్లమయంగా మారిందని అరుణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారీ పెట్టుబడులను ఆకర్షించేంత లాభదాయకత, వ్యాపార అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పారామె. ‘‘దేశీ టెలికం పరిశ్రమమ ఇప్పుడిప్పుడే విప్లవాత్మకమైన మార్పులను చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిలకడగా మూడు దశాబ్దాల పాటు భారత్ 9– 10 శాతం మేర వృద్ధి చెందాలంటే డిజిటల్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇందుకోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది వన్ ప్లస్ 5జీ ఫోన్.. 5జీ టెక్నాలజీ సేవలకు ఉపయోగపడే స్మార్ట్ఫోన్ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నట్లు చైనా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ వన్ప్లస్ వెల్లడించింది. ముందుగా యూరప్లో దీన్ని ప్రవేశపెడతామని స్నాప్డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వన్ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. టెలికం ఆపరేటర్ ఈఈ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మరింత శక్తిమంతమైన స్నాప్డ్రాగన్ 855 చిప్తో ఇది రూపొందుతుందని పీట్ చెప్పారు. -
భారత్ వృద్ధికి ఫిచ్ కోత
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ మందగమన సంకేతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ తాజాగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించటం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ముందుగా వెలువరించిన వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 7.2 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఫిచ్ పేర్కొంది. జూన్లో 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసి... సెప్టెంబర్లో దాన్ని పెంచటం గమనార్హం. అధిక భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటివి వృద్ధి అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలుగా రేటింగ్ దిగ్గజం తెలియజేసింది. 2017–18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకగా... తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో 7.1 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికంటే తక్కువగానే ఫిచ్ అంచనాలుండటం గమనార్హం. ఇక 2019–20 ఏడాదికి వృద్ధి రేటు 7 శాతం, 2020–21లో 7.1 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. సెప్టెంబర్లో అంచనా వేసిన 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లకు కూడా కోత పడింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈ ఏడాది క్యూ2 వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం. ► వినియోగం రేటు 8.6 శాతం నుంచి 7 శాతానికి బలహీనపడినప్పటికీ.. ఇంకా మెరుగ్గానే కనబడుతోంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. 2016–17ద్వితీయార్థం నుంచీ పెరుగుతున్నాయి. ► దిగుమతుల అంతకంతకూ పెరిగిపోవడంతో వాణిజ్య లోటు మరింత ఎగబాకవచ్చు. ► వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య విధానాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చు(ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది). ► ప్రభుత్వం వ్యయాలను పెంచడం ద్వారా.. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు భారీగా నిధులను వెచ్చిండం వల్ల జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి పడిపోకుండా అడ్డుకట్ట పడింది. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► బ్యాంకింగ్ రంగం ఇంకా అధిక మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క ఐఎల్అండ్ఎఫ్సీ డిఫాల్ట్ తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లకు ద్రవ్య సరఫరా తగ్గి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ► రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవ కాశాలున్నాయి. ఇటీవలి కాలంలో తగ్గిన ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, రూపాయి పతనం కారణంగా దిగుమతుల భారం కావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ► ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం రూపాయి క్షీణతకు మరింత ఆజ్యం పోస్తాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలు యథాతథం.. ఈ ఏడాది (2018) ప్రపంచ వృద్ధి అంచనాలను యథాతథంగా 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. వచ్చే ఏడాది( 2019) అంచనాల్లోనూ (3.1%) మార్పులు చేయలేదు. మరోపక్క, చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. గత అంచనాలను కొనసాగించింది. ఇక ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిలో కొంత కోతకు అంగీకరించే అవకాశం ఉందని... దీనివల్ల ప్రస్తుత స్థాయి నుంచి ముడిచమురు ధరలు కొంత పుంజుకోవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. ‘2018 ఏడాదికి సగటు క్రూడ్(బ్రెంట్) బ్యారెల్ ధర 72.5 డాలర్లుగా ఉండొచ్చు. వచ్చే ఏడాది అంచనా 65 డాలర్లలో మార్పులేదు. 2020 అంచనాలను మాత్రం 57.5 డాలర్ల నుంచి 62.5 డాలర్లకు పెంచుతున్నాం’అని ఫిచ్ తెలిపింది. కాగా, అక్టోబర్ ఆరంభంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు రేటు 85 డాలర్ల నుంచి నవంబర్ ఆఖరి నాటికి 60 డాలర్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. -
ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏడాది నాటికి భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మనం ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ఫ్రాన్స్ను అధిగమించామని, వచ్చే ఏడాది బ్రిటన్ను తోసిరాజని ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలే తక్కువ వృద్ధి రేటుతో సాగుతుండగా రానున్న పది, ఇరవై సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక విధానాల రూపకల్పనలో పేరొందిన ఎన్సీఏఈఆర్ పునరుద్ఘాటించింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం సమసిపోతున్న సంకేతాలతో భారత్ వృద్ధి రేటు ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. -
మన్మోహన్కు అనుకూలంగా రిపోర్టు..
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, బీజేపీ శ్రేణులకు పెద్ద షాకిస్తూ.. గత మూడు రోజుల క్రితం ఓ సంచలనాత్మక రిపోర్టు విడుదలైంది. మన్మోహన్ సింగ్ హయాంలోనే భారత్ అధిక వృద్ధి రేటు నమోదు చేసిందని స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రిపోర్టు పేర్కొంది. మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని ఆ నివేదిక సారాంశం. కానీ ఆ నివేదికతో బీజేపీ గుండెల్లో ఒక్కసారిగా గుబులు పట్టుకుంది. మరోవైపు నుంచి ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలోనే హఠాత్తుగా ఆ రిపోర్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ వెబ్సైట్ నుంచి మాయమైపోయింది. అంతేకాక ఆ నివేదిక కేవలం డ్రాఫ్ట్ రిపోర్టు మాత్రమేనని, దాని ఫైండిగ్స్ అధికారికమని ఎక్కడా కూడా చెప్పలేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఇండియా టుడే టీవీ పరిశీలనలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ వెబ్సైట్ నుంచి తొలగించిన ఆ రిపోర్టు, మరో వెబ్సైట్లో దర్శనమిస్తున్నట్టు తెలిసింది. రిపోర్టు కోసం ఒరిజినల్ లొకేషన్లో సెర్చ్ చేస్తే.. ఎలాంటి స్పందన లేదు. కానీ ఆ రిపోర్టు ప్రస్తుతం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్(ఎన్ఎస్సీ) పేజీలో ఉందని తెలిసింది. రిపోర్టుపై సలహాలు, సూచనలు కింద దీన్ని ఎన్ఎస్సీ సెక్షన్లో పొందుపరిచారట. ఎన్ఎస్సీ అనేది మినిస్ట్రీ వెబ్సైట్లో ‘అబౌట్ అజ్’ అనే సెక్షన్లో లిస్ట్ అయి ఉంటుంది. రిపోర్టును మరో ప్రాంతానికి తరలిస్తూ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మద్దతు తెలిపారు. ఆ రిపోర్టు ఇంకా ఫైనల్ కాదని, దానిపై ప్రభుత్వంలోనూ.. మంత్రిత్వ శాఖలోనూ ఇంకా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. కాగ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రూపొందించిన తాజా నివేదికలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న తొలినాళ్లలో (2006-07) 9.57 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 10.08 శాతానికి పెరిగిందని తెలిపింది. అయితే పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణ తర్వాత ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనేనని రిపోర్ట్ పేర్కొంది. -
చైనాను అధిగమిస్తూ..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసంలో చైనాను అధిగమిస్తూ భారత్ 7.7 శాతం జీడీపీ వృద్ధి నమోదు చేసింది. గత ఏడు క్వార్టర్లలో ఇదే అత్యంత గరిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. కాగా ఈ త్రైమాసంలో భారత్ ఏడు శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను అధిగమించి 7.7 శాతం వృద్ధి కనబరిచింది. వ్యవసాయంలో 4.5 శాతం, తయారీ రంగంలో 9.1 శాతం, నిర్మాణ రంగంలో 11.5 శాతం వృద్ధితో భారత్ మెరుగైన వృద్ధిరేటు సాధించింది. రాయ్టర్స్ పోల్లో మార్చి క్వార్టర్లో భారత్ 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు, ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పెట్రో ధరల పెంపు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ తగ్గించిన విషయం తెలిసిందే. -
పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే!
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) నిర్ణయించటంలో అనుసరించనున్న సూత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు. బడ్జెట్లో 2019 ఖరీఫ్ సీజన్లో పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘వాస్తవ ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబసభ్యుల శ్రమ వ్యయాన్ని కలపగా వచ్చిన మొత్తానికి 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధరగా నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. మద్దతు ధరపై అనుసరించిన విధానాన్ని వెల్లడించాలంటూ.. విపక్షాలు, వ్యవసాయ నిపుణులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం జైట్లీ ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం రైతుల వద్దనుంచి గోధుమ, వరి పంటలనే (రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేందుకు) సేకరిస్తున్నప్పటికీ.. 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. రైతులకు చేరటం లేదని జైట్లీ అంగీకరించారు. ‘రైతులకు ఎంఎస్పీ చేరాలనే లక్ష్యంతోనే బడ్జెట్లో ప్రతిపాదనలిచ్చాం. అన్ని పంటలకు ఒకే విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సాగుకు అయిన వ్యయం (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల ఖర్చులు, చెల్లించిన కూలీలు.. ఇతరత్రా), రైతు కుటుంబసభ్యుల శ్రమకు విలువకట్టిన మొత్తాన్ని కలుపుకుని దీనికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. భయంకరమైన డాక్టర్ చేతుల్లో.. యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పదేళ్లపాటు ‘భయంకరమైన డాక్టర్’ చేతిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ను చేర్చారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని జైట్లీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లను సభకు వెల్లడించారు. ప్రస్తుత వివరాలను సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ ప్రజలను మోసం చేసేదిగా ఉందని.. తృణమూల్, ఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఫేకూ ఫెడరలిజం (అవాస్తవ సమాఖ్య వ్యవస్థ), అహంకారాన్ని ఎన్డీయే ప్రదర్శిస్తోందని విమర్శించారు. పార్లమెంటు వాయిదా తీవ్రమైన నిరసనలు, సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయసభలు మర్చి 5కు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్సభ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అటు రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్లోకి దూసుకెళ్లటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే కాసేపు సభను నడిపించిన స్పీకర్ సుమిత్ర మహాజన్.. కొద్దిసేపటి తర్వాత మార్చి 5కు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి అర్ధభాగం ముగిసింది. రాజ్యసభలోనూ బడ్జెట్పై చర్చ జరగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వెల్లోనే బైఠాయించారు. అయితే ఏపీ ఎంపీలను బయటకు పంపి బడ్జెట్పై చర్చ, జీరో అవర్ను నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కోరారు. అయినా నిరసనలు ఆగకపోవటంతో వెంకయ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. బడ్జెట్పై చర్చ జరిగాక రాజ్యసభ మార్చి ఐదో తేదీకి వాయిదా పడింది. సీఏసీపీ సూచనల ప్రకారమే! ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్పీని నిర్ణయిస్తుంది. ఈ సంస్థ మూడు సూత్రాలను ప్రభుత్వానికి సూచించింది. ఏ2 (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీలు, ఇంధనం, నీటిపారుదల తదితర ఖర్చులు కలుపుకుని), ఏ2+ఎఫ్ఎల్ (ఏ2కు పంట ఉత్పత్తిలో పనిచేసినందుకు గానూ రైతు కుటుంబీకుల శ్రమను కలుపుకోవాలి), సీ2 (పై రెండు కలుపుకుని, పంటకోసం తన ఆస్తులు, బంగారం మొదలైనవి తాకట్టుపెట్టి తెచ్చిన మొత్తానికి వడ్డీ కలుపుకుని) అని మూడు వేర్వేరు విధానాలను ప్రతిపాదించింది. 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ వ్యవసాయ కమిషన్ కూడా పంట వ్యయానికి (ఏ2+ఎఫ్ఎల్) 50 శాతం ఎక్కువ మద్దతు ధర సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కూడా పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధిక మద్దతు ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. -
2018 ఆర్థిక సర్వే వచ్చేసింది...
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది. జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎస్టీ, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్, సరళీకరణ, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరగడమని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016-17లో 8 శాతం పెరిగి 60.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి 55.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రతికూలంగా ఉంటూ వస్తున్న ఎగుమతులు 2016-17లో సానుకూలంగా మారాయని, 2017-18లో మరింత పెరుగునున్నట్టు పేర్కొంటోంది. మొత్తంగా 2017-18లో ఎగుమతులు వృద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. విదేశీ మారక నిల్వలు వార్షిక ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి, 409.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు ఆర్థిక సర్వే తెలిపింది. తయారీ రంగంపై ఓ గుడ్న్యూస్ను కూడా ఆర్థిక సర్వే ప్రకటించింది. తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో సేవల వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం, వ్యవసాయ వృద్ధి 2.1 శాతంగా ఉన్నట్టు అంచనావేసింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ ఉంటే... వచ్చే నెలల్లో 'పాలసీ విజిలెన్స్(విధాన నిఘా)' చేపట్టాలని పిలుపునిచ్చింది. 50 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు ఆర్థిక సర్వే రిపోర్టు చేసింది. స్వచ్ఛంగా పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగాయని తెలిపింది. ముఖ్యంగా పెద్ద వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు ఇన్ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ను ఆశిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషిస్తూ... బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గత 12 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఇరుసభల్లో ఈ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించింది. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభ ఫిబ్రవరి 1కి(గురువారానికి) వాయిదా పడింది. -
చైనాను బీట్ చేస్తాం..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ ఈ ఏడాది అత్యంత వేగంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థగా చైనాను అధిగమిస్తుందని, మన స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా అవతరిస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ దేశాలు అతితక్కువ వృద్ధి సాధిస్తున్న క్రమంలో భారత్ అందుకు విరుద్ధంగా పటిష్ట దీర్ఘకాల వృద్ధితో దూసుకుపోతుందని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 2-3 శాతం వృద్ధి సాధించడానికి ఇబ్బందులు పడుతుంటే భారత్ 7.5 శాతం వృద్ధి రేటుపై దృష్టిసారించిందని నివేదిక స్పష్టం చేసింది. వృద్ధిరేటులో చైనాను అధిగమిస్తుందని అంచనా వేసింది. ఇక భారత్ స్టాక్ మార్కెట్ నుంచి 6-8 శాతం కన్నా అధిక వృద్ధిని మదుపుదారులు ఆశించవచ్చని పేర్కొంది. భారత్లో ఆధార్, జన్థన్, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణలతో నూతన సమ్మిళిత మౌలిక వసతులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థకు... ఇక మంచిరోజులు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. 2018 క్యాలెండర్ ఇయర్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకింగ్, ఆర్థిక సేవల గ్రూప్ మెక్వైర్ తన నివేదికలో విశ్లేషించింది. ఇక 2018–19లో 8% వృద్ధి నమోదవుతుందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. భారత్ వృద్ధికి తగిన బాటలు పడుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి రేటు 7.1% నుంచి మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7%కి పడిపోయి, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వెలువడిన తాజా నివేదికలు కొంత ఊరటనిస్తున్నాయి. వృద్ధికి మూడు ప్రధాన కారణాలు: మెక్వైర్ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి మెక్వైర్ మూడు కారణాలను చూపింది. గ్రామీణ వినియోగం మెరుగుదల, ఎగుమతుల పురోగతి, ప్రభుత్వ వ్యయాల పెరుగుదల వృద్ధి పుంజుకోవడానికి దారితీస్తాయని పేర్కొంది. ప్రత్యేకించి బ్యాంకింగ్కు రూ.2.11 లక్షల కోట్ల ప్రభుత్వ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థకు పూర్తి సానుకూల అంశంగా వివరించింది. ఆర్థిక సంస్కరణలు దేశ వృద్ధిరేటు పటిష్టతకు దోహదపడతాయని వివరించింది. వృద్ధి లక్ష్యంగా బాటలు: మోర్గాన్స్టాన్లీ వృద్ధికి దోహదపడే అంశాలన్నీ 2018–19 నాటికి పటిష్టమవుతాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడుల్లో పురోగతిని భారత్ వృద్ధికి కారణంగా పేర్కొన్న మోర్గాన్ స్టాన్లీ, ఈ పరిణామం భారత్ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం 7.5 శాతంగా నమోదు కావడానికి దోహదపడుతుందని సంస్థ ఆసియా వ్యవహారాల చీఫ్ ఎకనమిస్ట్ చేతన్ ఆహ్యా పేర్కొన్నారు. -
జీడీపీకి నోట్ల రద్దు, జీఎస్టీ భారీ దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు భారీ రీక్యాపిటలైజేషన్కు ప్రకటించగా మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మరింత మందగించనుందని తాజాగా 30 మంది ఆర్థిక వేత్తల అంచనా తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టానికి పడిపోనుందని అంచనాలు వెలువడ్డాయి. మార్చి 2018 తో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కానుందని అంచనా. నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపార కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్ భారీగా క్షీణించనుందని రాయిటర్స్ పోల్ లో వెల్లడైంది 2014-15ఆర్థిక సంవత్సరంలో పరిచయం చేసిన కొత్త విధానం ప్రకారం భారత స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు.. 2018 మార్చ్తో ముగిసిన కాలానికి 6.7 శాతంగా నమోదు కావచ్చంటూ రాయిటర్స్ పోల్ లో తేలింది. ఇది గత నాలుగేళ్లలో అత్యంత కనిష్టం. అక్టోబర్ 12-124మధ్య నిర్వహించిన 30 మంది ఆర్థికవేత్తల అంచనాలను పరిగణలోకి తీసుకుని రాయిటర్స్ పోల్ ఈ అంచనాలను వెల్లడించింది. ముఖ్యంగా డిమానిటైజేషన తర్వాతి పరిస్థితులు.. ఒకేదేశం ఒకటే పన్ను అంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ల కారణంగా బిజినెస్ యాక్టివిటీ, కన్జూమర్ డిమాండ్లో విపరీతమైన ఒత్తిడి నెలకొంది. కరెన్సీ నిషేధం, కొత్త వస్తువులు, సేవల పన్ను (జిఎస్టి) వ్యాపార కార్యకలాపానికి అంతరాయం కలిగించి, వినియోగదారుల డిమాండ్ తగ్గడంతో ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత నెమ్మదించి నాలుగు సంవత్సరాల కిందికి దిగజారనుందని తెలిపింది. ఇప్పటికే అభివృద్ధి ఔట్లుక్పై రిస్క్ తగ్గినా.. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్పై ఒత్తిడి కొనసాగవచ్చని, ప్రైవేట్ క్యాపిటల్ ఖర్చులు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
జీఎస్టీపై విమర్శలకు కేంద్రం భారీ సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయన్న విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి త్రైమాసికంలో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) దారుణంగా పడిపోయిన దరిమిలా ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇస్తూ.. ఉపాధి కల్పనకు ప్రణాళికను ప్రకటించింది. ప్రతిష్టాత్మక ‘భారత్ మాల’కు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం కేంద్ర సచివాలయంలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. భారత్ మాల : దేశంలో ఉపాధి కల్పనే ధ్యేయంగా రోడ్లు, రవాణా రంగాలకు సంబంధించి కేంద్రం ఇదివరకే ప్రకటించిన ‘భారత్ మాల’ పథకానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. దేశాన్ని చుట్టివచ్చేలా 34, 800 కిలోమీటర్ల రహదారిని ‘భారత్ మాల’ లో భాగంగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.10లక్షల కోట్లు కాగా, అందులో సగం రూ.5.34లక్షల కోట్లును విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. తద్వారా 14.20కోట్ల మందికి ఉపాధి లభించనుందని వివరించారు. దీనితోపాటు ప్రతిష్టాత్మక మెగా హైవే ప్లాన్కు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వినియోగంలోఉన్న జాతీయ రహదారుల్లో తొమ్మిదింటిని రూ.6,258 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మూడేళ్లుగా దేశం దూసుకెళుతోంది : ప్రెజెంటేషన్కు ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. తాము చేపట్టిన సంస్కరణలు తప్పక మంచి ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాల్లో వృద్ధిరేటు పడిపోయింది నిజమే. అయితే అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గడిచిన మూడేళ్లుగా ఇండియా.. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచింది. జీఎస్టీ లాంటి భారీ సంస్కరణలు చేసినప్పుడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా, భవిష్యత్తులో తప్పక మంచి ఫలితాలు చూడొచ్చు’’ అని జైట్లీ చెప్పారు. మేం సిద్ధంగా ఉన్నాం : గడిచిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు తగ్గిన దరిమిలా తిరిగి వృద్ధి బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని జైట్లీ తెలిపారు. ఏం చెయ్యాలనేదానిపై ఇటు ఆర్థిక శాఖలోను, అటు ప్రధాని నరేంద్ర మోదీతోనూ నిత్యం మాట్లాడుతూనే ఉన్నామన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి జైట్లీ ప్రెస్మీట్కు అధిక ప్రాధాన్యం సంతరించుకోవడం గమనార్హం. -
వృద్ధి చక్రాలు వెనక్కి!
♦ 2017–18 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.7 శాతమే ♦ మూడేళ్ల కనిష్ట స్థాయికి; అంచనాలను మించిన పతనం ♦ నోట్ల రద్దు ప్రభావమేనన్న విశ్లేషకులు ♦ అంతక్రితం త్రైమాసికంలో ఇది 6.1 శాతం ♦ 2016–17 తొలి త్రైమాసికంలో ఏకంగా 7.9 శాతం న్యూఢిల్లీ: ఒకవైపు పన్ను సంస్కరణలు... మరోవైపు రివ్వున ఎగుస్తున్న స్టాక్ మార్కెట్లు... భారత ఆర్థిక వ్యవస్థ మెరిసిపోతున్నదనే సంకేతాలిస్తుండగా గురువారం వెలువడిన ఆర్థిక వృద్ధి రేటు గణాంకాలు మాత్రం దానిపై నీళ్లు చల్లేశాయి. 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్, క్యూ1) వృద్ధి కేవలం 5.7%గా నమోదయింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి– మార్చి మధ్య 4.6% కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తరవాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు 7.9% కావటం గమనార్హం. గతేడాది 4వ త్రైమాసికంలో కూడా 6.1% నమోదు కాగా... ఇపుడు దారుణంగా పడిపోవటం గమనార్హం. నవంబర్ 8న కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా 3 త్రైమాసికాల నుంచీ స్థూల దేశీయోత్పత్తి కిందకు జారుతోంది. నోట్ల రద్దు దెబ్బకు తయారీ రంగంలో ఉత్పత్తి భారీగా పడిపోవడం దీనికి ప్రధాన కారణం. తాజా గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసింది. జీవీఏ 5.6 శాతమే..! ఉత్పత్తి లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ(గ్రాస్ వాల్యూ యాడెడ్) గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి. దీని ప్రకారం జీవీఏ 5.6%గా నమోదైంది. అంతక్రితం త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో ఉంది. రంగాల వారీగా... జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన తయారీ రంగం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ విభాగంలో జీవీఏ వార్షికంగా భారీగా 10.7 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. వ్యవసాయం: జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో (అటవీ, ఫిషింగ్ సహా) కూడా తొలి త్రైమాసికంలో వృద్ధి స్వల్పంగా తగ్గి, 2.5 శాతం నుంచి 2.3 శాతానికి చేరింది. మైనింగ్: వృద్ధి 2.3 శాతం క్వారీయింగ్: వృద్ధి లేకపోగా – 0.7 శాతం క్షీణత. నిర్మాణం: 1.2 శాతం వృద్ధి ఆర్థిక, బీమా, రియల్టీ: వృద్ధి 2 శాతం వృత్తిపరమైన సేవలు: వృద్ధి రేటు 6.4 శాతం బడ్జెట్ లక్ష్యంలో 92.4 శాతానికి ద్రవ్యలోటు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) బడ్జెట్ లక్ష్యంలో ద్రవ్యోలోటు జూలై నెలాఖరుకు 92.4 శాతానికి చేరింది. వివరాల్లోకి వెళితే, 2017–18 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యం రూ.5,46,532 కోట్లు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలో 3.2 శాతం. దీనర్థం జీడీపీలో ద్రవ్యోలోటు 3.2 శాతం దాటకూడదన్నమాట (గత ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.5 శాతం) అయితే ఆర్థిక సంవత్సరం జూలై నాటికే ద్రవ్యలోటు రూ.5.04 లక్షల కోట్లకు చేరింది. అంటే 2017–18 బడ్జెట్ అంచనాల్లో ఇది 92.4 శాతం అన్నమాట. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ నిష్పత్తి 73.7 శాతంగా ఉంది. నోట్ల రద్దు కాదు... జీఎస్టీయే కారణం!! ఈ ఏడాది జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు సహా పలు రంగాలు ఉత్పత్తి చేయడాన్ని పక్కనబెట్టి, తమ వద్ద ఉన్న స్టాక్స్ విక్రయాలపై అధికంగా దృష్టి సారించాయి. ఇది జీవీఏ యథాతథంగా కొనసాగడానికి కారణమయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి నిల్వలు తగ్గడం, కొత్త ఉత్పత్తులు జరక్కపోవడం, సంబంధిత సర్దుబాటు అంశాలు జీడీపీపై కూడా ప్రభావం చూపాయి. జీడీపీ వృద్ధి తగ్గడానికి ఈ అంశాలే కారణం తప్ప, నోట్ల రద్దు కాదు. ఇప్పుడు జీఎస్టీ అమలుతో వృద్ధి పునరుత్తేజానికి వీలవుతుంది. – టీసీఏ అనంత్, చీఫ్ స్టాటిస్టీషియన్ పూర్తి ఏడాది 6.3 శాతమే..! జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడం జీఎస్టీ ప్రభావం వల్లనే. నిజానికి నా అంచనాకన్నా ఇది 40 బేసిస్ పాయింట్లు తక్కువ. ఈ నేపథ్యంలో మొత్తం ఏడాది వృద్ధి 6.3%గా ఉంటుందని బావిస్తున్నా. – ప్రణబ్ సేన్, మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ పరిస్థితులు మారాలి: పరిశ్రమలు జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం పట్ల పారిశ్రామిక వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. వ్యాపారాలకు తగిన పరిస్థితుల కల్పన ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్లు పీహెచ్డీసీసీఐ అధ్యక్షుడు గోపాల్ జీవరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు క్లిష్టమైన నిబంధనలను సడలించాల్సి ఉందనీ వివరించారు. కార్మిక చట్ట సంస్కరణలు జరగాలని, ఏకీకృత కార్మిక చట్టం దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణపై విధాన నిర్ణేతలు తక్షణం దృష్టి సారించాలని అసోచామ్ సూచించింది. ఇంతకన్నా తగ్గదు నిజానికి ఈ ఫలితం పట్ల కొంత ఆందోళన ఉంది. పరిశ్రమలు జీఎస్టీ కోసం చేసుకున్న ముందస్తు ఏర్పాట్ల వల్ల ఇది జరిగిందని భావిస్తున్నాం. వృద్ధి రేటు ఇంతకుమించి తగ్గదని భావిస్తున్నాం. భవిష్యత్ త్రైమాసికాల్లో భారీ వృద్ధిని సవాలుగా తీసుకుని, ఇందుకు తగిన చర్యలను కేంద్రం తీసుకుంటుంది. సేవల రంగం పుంజుకుంటుందని, పెట్టుబడులకు పునరుత్తేజం వస్తుందని భావిస్తున్నాం. వార్షిక జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని మా అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి, తగిన వర్షపాతం ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. ఆర్థిక సంస్కరణల ఫలితాలూ అందివస్తాయి. – అరుణ్జైట్లీ, ఆర్థిక మంత్రి చైనాకన్నా వెనకబడ్డాం... గత ఏడాది చివరి వరకూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే ఈ ఏడాది (2017) తొలి రెండు త్రైమాసికాల్లో (జనవరి–జూన్) చైనా వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. భారత్లో మాత్రం ఇది జారుతూ వరుసగా ఈ రెండు త్రైమాసికాల్లో 6.1, 5.7 శాతాలుగా నమోదయ్యింది. దీనితో వృద్ధి వేగం విషయంలో చైనాతో పోల్చితే భారత్ వెనకబడినట్లయ్యింది. ఎనిమిది రంగాల గ్రూప్ దిగాలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా ఉన్న ఎనిమిది పరిశ్రమల గ్రూప్ జూలై గణాంకాలూ నిరాశాకరంగా ఉన్నాయి. ఈ నెల్లో ఈ రంగాల ఉత్పత్తి రేటు కేవలం 2.4 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 3.1 శాతం. వార్షికంగా ఎనిమిది రంగాల పనితీరునూ వేర్వేరుగా చూస్తే...వృద్ధిలో... సహజ వాయువు: ఈ రంగంలో వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. బొగ్గు: ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 0.7 శాతానికి జారింది. స్టీల్: అసలు వృద్ధి లేని స్థాయి నుంచి భారీగా 9.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 5.4 శాతానికి ఎగసింది. క్షీణతలో... క్రూడ్ ఆయిల్: ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. క్షీణతలో కొనసాగుతోంది. –0.5 శాతం క్షీణత మరింతగా –1.8 శాతం క్షీణతకు జారింది. రిఫైనరీ ప్రొడక్టులు: 8 శాతం వృద్ధి రేటు –2.7 క్షీణతలోకి పడిపోయింది. ఎరువులు: క్రూడ్ ఆయిల్ తరహాలోనే ఈ రంగంలో కూడా క్షీణత –0.3 శాతం నుంచి –3.2 శాతానికి పెరిగింది. సిమెంట్: ఈ రంగంలో కూడా 0.7 శాతం వృద్ధి –2 శాతం క్షీణతకు పడింది. -
6.1 నుంచి 6.6 వరకూ...
⇔ తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధిపై అంచనాలు ⇔ నేడే గణాంకాల విడుదల న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్ త్రైమాసిక (2017, ఏప్రిల్–జూన్) గణాంకాలు ఆగస్టు 31వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో దీనిపై విభిన్న వర్గాల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. 6.1 శాతం నుంచి 6.6 శాతం శ్రేణిలో ఈ లెక్కలు ఉన్నాయి. జనవరి–మార్చి మధ్య జీడీపీ గణాంకాలు కేవలం 6.1 శాతంగా నమోదుకాగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 7.1 శాతం వృద్ధి నెలకొంది. ఇక నాల్గవ త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 5.6%గా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న గణాంకాలపై వివిధ సంస్థల అంచనాలు చూస్తే... నొమురా: తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 6.6% ఉంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొమురా అంచనావేసింది. కాగా, ఆర్థికాభివృద్ధి పరంగా డీమోనిటైజేషన్, జీఎస్టీ నుంచి నెలకొన్న ప్రతికూలతలు తొలగిపోతున్నట్లు నొమురా పేర్కొంది. ఇక్రా: జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతంగానే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇక జీవీఏ వృద్ధి రేటు 6.3 శాతానికి తగ్గుతుందని ఇక్రా అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 7.6 శాతం. వస్తు సేవల పన్ను అమలు, రూపాయి బలోపేతం వంటి అంశాలను ఇందుకు కారణంగా చూపింది. ఇక జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 7.4% నుంచి 3.9%కి పడిపోతుందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. తయారీ, విద్యుత్, గ్యాస్, జలవనరుల సరఫరా, నిర్మాణ రంగాల పేలవ పనితీరును ఇందుకు కారణంగా చూపింది. జీవీఏ–జీడీపీ... వ్యత్యాసం! ఉత్పత్తివైపు లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి. లాభాలు...: వివిధ సంస్థల అంచనాల ప్రకారం– జీఎస్టీ, డీమోనిటైజేషన్ ప్రతికూల ఫలితాలు క్రమంగా వీడిపోతాయి. దేశంలో నెలకొన్న డిమాండ్ మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం పైన నిలబెట్టే వీలుంది. తన వర్షపాతం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పురోగతికి దోహదపుడుతుంది. నష్టాలు...: ఇప్పటికీ డీమోనిటేజేషన్ ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోలేదు. దీనికితోడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో క్లిష్టత నెలకొంది. సేవలు, కార్పొరేట్ ఆదాయాలు, పెట్టుబడులు బలహీనంగానే ఉన్నా యి. ఇక పారిశ్రామిక వృద్ధి పేలవంగానే ఉంది. జీవీఏ వృద్ధి రేటు 7.3 శాతం: ఆర్బీఐ ముంబై: ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుందని ఆర్బీఐ2016–17 వార్షిక నివేదికలో పేర్కొంది. గతేడాది(2016–17) ఇది 6.6%. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 2017–18లో తొలి 6 నెలల్లో 2–3.5% శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ద్వితీయ భాగంలో ఈ రేటు 3.5–4.5% శ్రేణిలో ఉండొచ్చని వివరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2017–18లో కొంత రికవరీ జరిగే అవకాశం ఉందని నివేదికలో అభిప్రాయపడింది. ఆర్బీఐ రుణ రేటు తగ్గింపు ప్రయోజనం బ్యాంకింగ్ నుంచి అన్ని రంగాలకూ సమానంగా అందడంలేదన్న ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18లో ఇప్పటివరకూ 4 రాష్ట్రాలు వ్యవసాయ రుణ రద్దు ప్రకటన చేశాయని, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయని పేర్కొన్న ఆర్బీఐ, ఇది స్వల్ప కాలంలో ద్రవ్య క్రమశిక్షణపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్ మొండిబకాయిల భారం ఆందోళనకరమైనదేనని పేర్కొంది. -
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
-
వృద్ధిరేటును ఎక్కువ చూపించలేదు
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాక్షి, అమరావతి: వృద్ధి రేటును ఎక్కువగా చూపించలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. కావాలని ఎక్కువ చూపించామంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. యనమల మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక వృద్ధిలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఒక మెథడాలజీ ప్రకారం దీని లెక్కింపు జరుగుతుందన్నారు. 2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం 12.61 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పర్ క్యాపిటా ఇన్కం 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,08,163, 2016–17 అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం రూ.1,22,376 ఉందని వెల్లడించారు. జీఎస్డీపీ 2014–15లో రూ.5,26,470 కోట్లు, 2015–16లో రూ.6,09,934 కోట్లు, 2016–17లో 6,99,307 కోట్లు ఉందన్నారు. -
వృద్ధి రేటుకు ప్రభుత్వం సైతం కోత
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటికే జీడీపీ వృద్ధి రేటుపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న క్రమంలో ప్రభుత్వం సైతం వృద్ధి అంచనాలను తగ్గించేసింది. మూడేళ్ల కనిష్ట స్థాయిలో 7.1 శాతంగా మాత్రమే 2016-17 ఆర్థికసంవత్సర వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని ప్రభుత్వ గణాంకాలు చెప్పాయి. గణాంకాల చీఫ్ డాక్టర్ టీసీఏ అనంత్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వృద్ధి రేటు అంచనాలను ప్రకటించారు. 2015-16 లో ఈ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంది. అయితే అక్టోబర్ వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారమే ఈ అంచనాలు వెలువడ్డాయి. పెద్దనోట్ల రద్దు అనంతరం ఈ ప్రభావం ఏ మేర ఉండొచ్చనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో ఆర్థికవ్యవస్థ మందగించవచ్చని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. పలు రేటింగ్ ఏజెన్సీలు సైతం వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించాయి. నగదు కొరత దెబ్బతో మరికొంత శాతం పాటు వృద్ధి రేటు పడిపోయే అవకాశముందని తెలుస్తోంది. స్థూల ఆదాయ విలువ(జీవీఏ) కూడా 2016-17 ఆధారిత ధర ప్రకారం 7.0 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ విలువ 2015-16లో 7.2 శాతంగా ఉంది. తలసరి ఆదాయంలో వృద్ధి రేటు సైతం 2016-17 కాలంలో 5.6 శాతంగా నమోదయ్యే అవకాశముందని ప్రభుత్వ గణాంకాల్లో తెలిసింది. జీవీఏలో వ్యవసాయ రంగం గతేడాది 1.2శాతం కంటే 2016-17లో మంచి వృద్ధిని 4.1 శాతంగా నమోదుచేసిందని అనంత్ చెప్పారు.