gopireddy srinivasa reddy
-
‘బాబూ.. ప్రజలకు వైద్యం ముఖ్యమా లేక ఎయిర్పోర్టులా?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేటీకరణపైనే ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రయివేటీకరణ చేస్తున్నారు? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలను మూసివేయడం దారుణం. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రయివేటీకరణ మీదే ఉంటుంది. ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదు. కానీ, వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో సీటుకు కోటిన్నర వరకు వసూలు చేస్తారు. దాని వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి. తాము అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యార్థుల దగ్గర వసూలు చేయమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారు.ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. 2,450 జనరల్ సీట్లను చంద్రబాబు వలన రాష్ట్రం కోల్పోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్మించి, పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు?. ప్రైవేటీకరణ అవసరం ఏముంది?. చంద్రబాబు వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇక ముందు పని చేసే డాక్టర్లే ఉండరు. ప్రజలకు విమానాశ్రయాలు ముఖ్యమా?.. మెడికల్ కాలేజీలు ముఖ్యమా? అని ప్రశ్నించారు. -
ఆరోగ్యశ్రీ ప్రైవేట్పరం.. ప్రజల ప్రాణాలతో వ్యాపారమా బాబూ?: గోపిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన వెల్లడించారు.గోపిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:దురుద్దేశ ఆలోచన. చర్యలు:కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీకి కేటాయించి నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఒక అద్భుతమైన పధకంగా గుర్తింపు పొందింది. వైఎస్సార్ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా అందరి మన్ననలను అందుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఈ పథకాన్ని పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు. ప్రాణాంతకమైన గుండె జబ్బులకు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్న ఎందరో పేదలకు ఈ ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా వారి ప్రాణాలను కాపాడింది. ఈ పథకం వల్ల ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యాన్ని పొందారు. ముఖ్యమంగా గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేర్లు మారాయే తప్ప ఈ పథకాన్ని తీసేసే సాహసం ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది.బీమా సంస్థకు అప్పగిస్తే..:ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి, బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. అదే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించినా, చికిత్స వ్యయంలో కేవలం రూ.2.5 లక్షల వరకు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పొందాల్సి వస్తుంది.ఆ ప్రొసీజర్లన్నింటినీ అనుమతిస్తారా?:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించి, మొత్తం 3257 ప్రొసీజర్లను అనుమతించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి చేతులు దులుపుకుంటే, మరి ఆ మొత్తం ప్రొసీజర్లను ఆ బీమా కంపెనీ కవర్ చేస్తుందా? అది ఖరీదైన వైద్యానికి చెల్లింపులు చేస్తుందా?. ఉదా: కాంక్లియార్ ఇంప్లాంటేషన్కు దాదాపు రూ.6.5 లక్షల చొప్పున రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయా? అందుకు బీమా కంపెనీ ఒప్పుకోకపోతే, రోగుల పరిస్థితి ఏమిటి?.ఎందుకంటే, బీమా కంపెనీలు 60 ఏళ్లు దాటిన వారికి, ఏదైనా దీర్ఘకాల వ్యాథులతో బాధ పడుతున్న వారికి, బీమా చెల్లింపుల్లో పలు ఆంక్షలు విధిస్తాయి. బీమా ప్రీమియం చెల్లించిన తరువాత ఏడాది, కొన్ని వ్యాధులకు కనీసం మూడేళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తాయి. ఉదా: హిప్ రీప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఆ సర్జరీ చేసేవాళ్లు. మరి ఇదే చికిత్సకు ప్రైవేటు బీమా కంపెనీలు కనీసం ఏడాది పాటు వెయిటింగ్ పీరియడ్ తరువాతే అంగీకరిస్తాయి. బీమా కంపెనీలు ఎప్పుడైనా, ఏదో ఒక విధంగా క్లెయిమ్స్ తగ్గించుకోవాలనే చూస్తాయి. అందుకే చిన్న చిన్న అంశాలను కూడా సీరియస్గా తీసుకుని క్లెయిమ్స్ నిరాకరిస్తుంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని ప్రొసీజర్లను బీమా కంపెనీ ఆమోదిస్తుందా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ:చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ గుర్తుకు వస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు కూడా అంతే. గ్రామాల్లో అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు, నాడు గత ప్రభుత్వం ప్రారంభించిన 10,300 విలేజ్ హెల్త్క్లినిక్స్ను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. వాటిని జగన్గారు ప్రారంభించారనే కోపంతో వాటిని పనికి రాకుండా చేశారు. 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ హయాంలో తీసుకువస్తే, వాటిలోని సీట్లను కూడా ప్రైవేటుపరం చేసేలా విధానాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో అది ప్రభుత్వ బాధ్యత:ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణం. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థకు అప్పగిస్తే, ఆస్పత్రులన్నీ ఆ కంపెనీ చుట్టూ తిరిగి, క్లెయిమ్స్ పొందాల్సి వస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలవు? కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్యశ్రీ నిబంధనలను వెంటనే మార్చుకుని ప్రజలకు అవసరమైన సేవలను అందించారు. అదే బీమా సంస్థ నిర్దేశించే నిబంధనలు మార్చాలంటే చాలా జాప్యం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజల ఆరోగ్యానికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వానికి ఏదైనా జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే బీమా కంపెనీ పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కాదు.ఆలోచన వీడండి:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద 45,10,645 మందికి ఉచితంగా వైద్య సేవలందించి వారి ఆరోగ్యాలకు అండగా నిలిచింది. అందుకు రూ.13,421.43 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన వీడాలి. నిరుపేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందించే ఆ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలి. అందుకే ప్రజల మనోభావాలు, వారి అవసరాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.ఇదీ చదవండి: టార్గెట్ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్సీపీకూటమి ప్రభుత్వానికి తొలి నుంచే..:ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నుంచే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయి పడింది. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆపేసిన ఆస్పత్రులు, ఈనెల 6 నుంచి వాటిని పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే మందు, ప్రభుత్వం ఏ కసరత్తు చేసింది? కనీసం ఆస్పత్రులు, వైద్య రంగం ప్రతినిధులతో అయినా మాట్లాడారా? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు నాలుగైదు గంటల్లో ప్రైవేటు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ అనుమతి రావడం చాలా కష్టం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద దాదాపు 300 మంది కేవలం క్లెయిమ్లపైనే పని చేసేవారు. మరి బీమా కంపెనీ ఆ స్థాయిలో పని చేస్తుందా?లోకేష్ సొంత మనుషులు.. బీమా కంపెనీ:మంత్రి నారా లోకేష్ తన సొంత మనుషులతో బీమా కంపెనీని పెట్టించి, వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది తమకు కావాల్సిన వారికి దోచిపెట్టే ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన ఉన్న పథకం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందిన పథకం ఇది. దీనిని కూడా నిర్వీర్యం చేయాలని అనుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, పోరాడతామని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
సరస్వతి భూములపై పవన్ కామెంట్స్ కు దిమ్మతిరిగే కౌంటర్
-
జగన్ అంటే బాబుకు వణుకు.. మంత్రి అనితను పంపించి..
-
దేవునితో నీ నీచ రాజకీయం మానుకో.. బాబుపై ఫైర్
-
సూపర్ 6 అమలు జరగడం లేదు...
-
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో ప్రభుత్వానికి నష్టమా?
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.మీకు నష్టమేంటి బాబూ?ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్షమించరాని నేరంజగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంవైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
ఏపీకి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు
-
టీడీపీ నాయకుల వేధింపులకు మరో ఉద్యోగి బలి
-
రెడ్ బుక్ పై కాదు వ్యవసాయంపై దృష్టి పెట్టండి.. టీడీపీపై గోపిరెడ్డి ఫైర్
-
నిమ్మల పై గోపిరెడ్డి సెటైర్లు
-
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
-
కార్యకర్తల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం
-
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్రెడ్డి తెలిపారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
ఇక ఉరుకునేదేలేదు.. టీడీపీ నేతలకు గోపిరెడ్డి వార్నింగ్
-
నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటమి ఖాయమని తేలిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు దగ్గరుండి తన అనుచరులు, బౌన్సర్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిపై దాడులు చేయించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కారు డ్రైవర్ హరితో పాటు ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి, మరో యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.టీడీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిముందు ఉన్న మూడు కార్లు, ఆయనకు చెందిన ఆస్పత్రి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో మధ్యాహ్నం 2గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న బూత్ లోపలికి టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబు, 20 మంది గూండాలు, బౌన్సర్లతో వచ్చారు. అంతకుముందు అదే బూత్కు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని మాత్రమే అనుమతించిన పోలీసులు ఇతర నాయకులను లోపలికి అనుమతించలేదు. అరవిందబాబు 20 మందితో రావటాన్ని బూత్లో ఏజెంట్గా ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు గంటెనపాటి గాబ్రియేలు ప్రశ్నించారు. దీంతో అరవిందబాబు గాబ్రియేలుపై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసులు అరవిందబాబుకు రక్షణ ఇస్తూ గాబ్రియేలు, అతడితో పాటు ఉన్న మరో నాయకుడు గోగుల మనోహరయాదవ్ను కొట్టారు. అరవిందబాబు బూత్ నుంచి బయటకు రాగానే అక్కడే కనిపించిన ఎమ్మెల్యే డ్రైవర్ హరిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తిరిగి వెళ్లిపోతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్దకు రాగానే ఆయన ఇంటిపైన, ఆస్పత్రిపైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా రాళ్లు, సీసాలు, కర్రలతో వారిపై టీడీపీ గూండాలు ఎదురు దాడికి దిగారు.పోలీసుల వ్యాన్లపై రాళ్లు వేశారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా లెక్కచేయని టీడీపీ గూండాలు మళ్లీ గోపిరెడ్డి ఇంటిపైన దాడికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. దాడులు చేయడానికి టీడీపీ గూండాలు, బౌన్సర్లు ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేత అరవిందబాబు ఒంగోలు, హైదరాబాద్, చెన్నైల నుంచి భారీ ఎత్తున బౌన్సర్లను రప్పించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నరసరావుపేటలోని తన ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. మారణాయుధాలతో మళ్లీ దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే హింసాత్మక సంఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. తనను కేవలం రెండుకార్లు మాత్రమే వాడాలని చెప్పి.. శ్రీకృష్ణదేవరాయలు మూడుకార్లు, అరవిందబాబు ఏడుకార్లతో తిరిగినా అధికారులు చూసీచూడనట్లుగా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
ముస్లింల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీతో బాబు రహస్య ఒప్పందం
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా చినతురకపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, నేడు చంద్రబాబు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి బీజేపీ పెద్దలతో కాళ్లబేరాలకు దిగాడని విమర్శించారు. బీజేపీ విధించిన మూడు షరతులకు టీడీపీ అంగీకరించిందని చెప్పారు. ముస్లింలకు కల్పిస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్ను తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా రద్దుచేస్తామని బీజేపీ కేంద్ర నాయకుడు అమిత్షా ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారన్నారు. అలాగే ప్రత్యేకహోదా ఊసే ఎత్తవద్దన్న బీజేపీ పెద్దల మాటలకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా చంద్రబాబు మద్దతు తెలిపి బీజేపీతో పొత్తును ఖాయం చేసుకున్నారని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ వలన లబి్ధపొందిన గ్రామాల్లో చినతురకపాలెం ఒకటన్నారు. 2007 వరకు కనీసం ఇంజినీరింగ్ చదివిన వారు కూడా గ్రామంలో లేరని, పేదరికం కారణంగా ఉన్నతవిద్యకు గ్రామ విద్యార్థులు దూరమయ్యారని తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ నాలుగుశాతం, ఫీజు రీయింబర్స్మెంట్ వలన గ్రామంలో విద్యావిప్లవం వ చ్చిందన్నారు. నేడు 29 మంది వైద్యులు గ్రామం నుంచి వచ్చారని, దీనికి నాలుగుశాతం రిజర్వేషన్ కారణమని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీతో కాళ్లబేరానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో రహస్య ఒప్పందం మేరకు ముస్లిం రిజర్వేషన్ను రద్దుచేస్తే వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. -
బాబు జైల్లో.. లోకేష్ ఢిల్లీలో పవన్ షూటింగ్ లో ఎమ్మెల్యే సెటైర్లు
-
స్కిల్ స్కామ్ జరగలేదని మాత్రం టీడీపీ చెప్పడం లేదు
-
‘మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే’
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డాeరు. మాచర్ల టీడీపీ ఇంచార్జి విధ్వంసానికి సూత్రధారి అని అంబటి రాంబాబు విమర్శించారు. దాడులు చేయాలని చంద్రబాబు బహిరంగం సభల్లోనే రెచ్చగొట్టా మాట్లాడిన సంగతిని గుర్తు చేశారు. ప్లాన్ ప్రకారమే మాచర్లలో టీడీపీ నేతలు దాడులు చేశారని అంబటి స్పష్టం చేశారు. ‘మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డి’ మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డేనని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దారునంగా కొట్టారని, బ్రహ్మారెడ్డి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, వైఎస్సార్సీపీ ప్రశాంత వాతావరణ కోరుకుంటోందన్నారు. చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, హింస, నేర ప్రవర్తనతో ఎన్నికల్లో గెలవలేరన్నారు. -
చంద్రబాబు రాజకీయంలో పవన్ కల్యాణ్ బలిపశువు : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
-
ప్రశాంతతను చెడగొట్టడమే టీడీపీ ధ్యేయం
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రశాంతతను చెడగొట్టడమే ధ్యేయంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడేం జరిగినా దానికి రాజకీయ రంగు పులిమి నరసరావుపేటలో బంద్లు, ఆందోళనలు చేసి శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తూ.. ప్రజల్లో ప్రశాంతతను చెడగొట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. హత్యకు గురైన మాచర్ల మండలం దుర్గికి చెందిన కంచర్ల జాలయ్యకు నేరచరిత్ర ఉందని, అతడో రౌడీషీటర్ అని గుర్తు చేశారు. అతడి హత్య రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్నారు. బ్రహ్మారెడ్డి ఇన్చార్జి అయ్యాకే.. మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 2009లో బ్రహ్మారెడ్డి నియోజకవర్గాన్ని విడిచి గుంటూరు వెళ్లాక 2022 వరకు 13 ఏళ్లపాటు ఎటువంటి ఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఆయన తిరిగి వచ్చాకే ఇలాంటి ఘటనలు ప్రారంభమయ్యాయనే విషయం అర్థమవుతోందన్నారు. సత్తెనపల్లికి చెందిన ఓ విద్యార్థి హత్య జరిగితే «నరసరావుపేటలో ధర్నా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. జొన్నలగడ్డలో ఓ మహిళకు అన్యాయం జరిగిందంటూ ధర్నా చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారన్నారు. ఎక్కడ ఘటన జరిగితే అక్కడ ఆందోళన చేస్తే తప్పేమీ లేదన్నారు. ఏ ఘటనకు స్పందించాలో, దేనికి స్పందించకూడదో నరసరావుపేట టీడీపీ ఇన్చార్జికి తెలియదన్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటే గుండెనొప్పి వచ్చినట్టు సెంటిమెంట్ డ్రామాకు తెరతీసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడన్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ వారిని కనీసం పోలీస్ స్టేషన్కు కూడా రానివ్వలేదన్నారు. ఇప్పడేదో బుద్ధిమంతులు మాదిరిగా చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారన్నారు. అధికారం కోసం పాకులాడుతూ.. 12 కేసులు పెట్టించుకున్నవారే టీడీపీ కార్యకర్తలంటూ వారిని రెచ్చగొడుతున్నారన్నారు. ఎక్కడో ఏదో జరిగితే నరసరావుపేటలో ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. -
రోడ్డుపై ధర్నాకు దిగిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
నారా లోకేష్ ఏంటి నీ హైడ్రామాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
లోకేష్ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు: లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ‘‘ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని’’ గోపిరెడ్డి అన్నారు. ఇవీ చదవండి: ‘శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు’ లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస -
‘విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర అని, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్దు ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. కోటప్పకొండను దర్శించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. చదవండి: టీడీపీని బతికించుకునేందుకు దిగజారుడు రాజకీయం -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా
సాక్షి, గుంటూరు : నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి : కరోనా భారత్: 30 లక్షలు దాటిన కేసులు) -
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా
-
బాబు ఆలోచనా ధోరణి మారలేదు
-
బాబు ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నారు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కలిసే ఎన్నికలు ఆపారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తే వీళ్లు కుట్రలతో వాయిదా వేయించారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగి ఉంటే రూ.5800 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉండేదన్నారు. అధిక పర్యాటకులు వచ్చే గోవాలో ఈ నెల 23న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేరళ సీఎం కూడా అదే చెప్పారు కరోనాకు పారాసిటమాల్ వేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టడం, హేళన చేయడం సరికాదని గోపిరెడ్డి హితవు పలికారు. కేరళ ముఖ్యమంత్రి కూడా పారాసిటమాల్ వాడాలని శానిటేషన్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వ్యాధి తగ్గడానికి పారాసిటమాల్ మాత్రమే డ్రగ్ ఆఫ్ ఛాయిస్ అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయన్నారు. అంతేకాక కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ప్రణాళికతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్లో 114 కరోనా కేసులు నమోదయ్యాయని, దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖలో రెండు వందల బెడ్లు, ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. (ఎన్నికల వాయిదా: అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకం ) -
‘పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు కూడా లేరు’
-
నిప్పునంటూ బాబు డబ్బాలు కొట్టుకున్నారు
-
‘అగ్రిగోల్డ్ను లోకేష్కు అప్పగించాలని చూశారు’
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మోసం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి అగ్రిగోల్డ్ సమస్య ప్రజలను వేధిస్తోందన్నారు. అగ్రిగోల్డ్ యజమాన్యం ఆస్తుల విలువ రూ.10వేల కోట్లు కాగా, ప్రజలకు చెల్లించాల్సింది రూ.7వేల కోట్లు అని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థను నారా లోకేష్కు అప్పజెప్పాలని టీడీపీ ఒత్తిడి చేసిందని, అగ్రిగోల్డ్ యజమాన్యం నిరాకరించడంతో..వారిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. నవంబర్ 7న గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి వెల్లడించారు. -
పైరవీలు చేసేవారిని దూరం పెట్టండి..
సాక్షి, గుంటూరు: అధికారులు అవినీతి రహితంగా పనిచేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫోన్ ద్వారా స్వీకరించారు. తన పేరు చెప్పుకుని పైరవీలు చేసేవారిని దూరంగా పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. పలు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే..అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
చంద్రబాబూ..బురద చల్లడం మానుకో!
సాక్షి, గుంటూరు: సచివాలయ పరీక్షలను సైతం రాజకీయం చేస్తున్నారని చంద్రబాబుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నిజంగానే ప్రశ్నాపత్రం లీకైతే ఆ రోజే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీ మహిళకు ర్యాంకు వస్తే.. పేపర్ లీకు అంటారా అని దుయ్యబట్టారు.టీడీపీ బురద చల్లుడు రాజకీయాలు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఏనాడయినా ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.సచివాలయ పరీక్షలను రాజకీయ కోణంలో చూసి.. నీచ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 58 కోట్లు ఆదా అయిందని తెలిపారు. -
‘ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతల అరాచకాలపై నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తిపోట్లకు గురైన వెంకటరెడ్డిని శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. చంద్రబాబు పునరావాస కేంద్రంలోని వ్యక్తే కత్తితో దాడి చేశాడని విమర్శించారు. ఆ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే దాడులు చేస్తూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
రాజధానిపై వదంతులు నమ్మవద్దు
సాక్షి, రొంపిచర్ల(గుంటూరు) : రాజధాని అంశంపై టీడీపీ నాయకులు చేస్తున్న వదంతులు నమ్మవద్దని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. రొంపిచర్లలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారే గానీ రాజధానిని మారుస్తామని చెప్పలేదన్నారు. రాజధానిని నిర్మించాలంటే రూ.50 వేల కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం 34 వేలు ఎకరాలు తీసుకుందని, కానీ కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ప్రాంతం భూకంపాలు, వరదలకు నిలయంగా ఉంటుందని చెప్పిందని గుర్తు చేశారు. అక్కడ రాజధాని వద్దని చెప్పినా టీడీపీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ముందుగానే 2 వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఇప్పటికే విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నాయకుల కోసమే రాజధాని అమరావతిలో ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఈ భూముల్లో పునాదులు 30 మీటర్ల లోతు నుంచి వేయాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీకి కూడా 100 అడుగుల లోతు నుంచి పునాదులు వేయాల్సి వచ్చిందన్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని జిల్లాలో గల జోన్–1, 2 పరిధిలో వరి పండించుకునేందుకు సాగునీరు అందుతుందన్నారు. వరి పంట సాగు చేసేందుకు విత్తనాలు కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే రొంపిచర్ల మార్కెట్యార్డులో 1000 క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 56 వేల టన్నుల యూరియా, 28 వేల టన్నుల ఎరువులు సిద్ధం చేశామని చెప్పారు. -
నరసరావుపేట పరువు తీసేశారు...
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్ను కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ...‘ కోడెల వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్లు ఉంది. ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్ను దోచుకున్న ఘనుడు. అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి, దాన్ని ఎలా తీసుకువెళతారు?. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారు. అవసరం అయితే మేం చందాలు వేసుకొని కొనిస్తాం. కోడెల.. నరసరావుపేట నియోజకవర్గం పరువు తీసేశారు. చదవండి: చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..! నరసరావుపేట వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కోడెల వల్ల నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇప్పటికే కే ట్యాక్స్ పేరుతో దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారు. కోడెల కుమారుడు వెయ్యి బైక్లకు ట్యాక్స్ కట్టకుండా రిజిస్టర్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్లు బుకాయిస్తున్నారు. తప్పుడు తేదీలతో హడావుడిగా లేఖ రాశారు. వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను షోరూంలో పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఇంకా ఘోరమైన దోపిడీలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐ ఫోన్లు కూడా అమ్ముకున్నారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు తన ఫార్మా కంపెనీ వర్కర్లకు అమ్ముకున్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా? -
‘ప్రపంచంలో ఇలాంటి స్పీకర్ మరొకరు ఉండరు’
సాక్షి, గుంటూరు : అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఫర్నీచర్ను తానే తీసుకున్నట్టు శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఒప్పుకున్నారు. ఎవరైనా వస్తే ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేస్తా.. లేకపోతే విలువ ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానని చెప్తున్నారు. ఇక కోడెల వ్యవహారంపై నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. కోడెల లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసిన కోడెల.. చివరికి దొంగతనానికి పాల్పడటం దారుణమని అన్నారు. (చదవండి : చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల శివప్రసాద్..!) కొట్టేసిన ఫర్నీచర్ని గుంటూరులోని గౌతమ్ హోండా షోరూమ్లో పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారులు నిలదీయడంతో చేసిన తప్పును ఒప్పుకున్నారని, ప్రపంచంలో కోడెల లాంటి స్పీకర్ మరొకరు ఉండరని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పరువు పోతుందనే ఉద్దేశంతో ఇంకా కొన్ని విషయాలు బయటపెట్టడం లేదని శ్రీనివాస్రెడ్డి అన్నారు. కోడెలకు డబ్బులు కావాలంటే తామంతా చందాలు వేసుకుని ఇస్తామని హితవు పలికారు. రాష్ట్రం విడిపోవడంతో అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్, కంప్యూటర్లు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు. ఈ క్రమంలో కొంత ఫర్నీచర్ మాయమైంది. అప్పుడు కోడెల శివప్రసాదరావు ఏపీ స్పీకర్గా ఉండటంతో ఆయనపై ఆరోపణలొచ్చాయి. -
సినిమా వాళ్ళని నమ్మొద్దు: పృథ్వి
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో 'కోడెల టాక్స్'తో వ్యాపారులంతా నష్టాలపాలయ్యారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పృథ్వి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నరసరావుపేట కోటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 30 ఏళ్ళపాటు వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ను 25 ఏళ్ళు పరిపాలిస్తారని జోస్యం చెప్పారు. వైఎస్ జగన్ ఇంత భారీ మెజారిటీతో గెలిచినా సినీ పెద్దలకి కనబడలేదని ధ్వజమెత్తారు. సినిమా వాళ్ళని ఎప్పుడూ నమ్మవద్దని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 32 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కోడెల! మీపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలే..
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కోడెలపై కేసులు పెట్టే ధైర్యం చేయలేకనే ఇప్పుడు పెడుతున్నారని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గోపిరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేటలో మీరు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? ఏ స్పీకర్ అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? అని కోడెలను ప్రశ్నించారు. స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్ని సార్లు తిట్టారో గుర్తులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెల అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, అన్నా క్యాంటీన్లలో భోజనం కూడా మింగేశారని ఆరోపించారు. వందలు, వేల మంది ‘కే టాక్స్’ మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ‘కే టాక్స్ ’పై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని, లేదా సీబీసీఐడీ వేయాలని కోరారు. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. కోడెల కుమారుడు, కుమార్తె కోట్లు దోచుకుతిన్నారని, ప్రభుత్వ శాఖల్లో కూడా కోట్లు మింగేశారని అన్నారు. వీటి అన్నిటిపై విచారణ జరిపించాలని కోరారు. ‘కే టాక్స్’ ఇష్యూ పక్కదోవ పట్టించడానికే టీడీపీ కార్యకర్తలపై దాడి అంటున్నారని మండిపడ్డారు. -
చట్టసభలకు ఐదుగురు ఏఎంసీ విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ)లో వైద్య విద్యను అభ్యసించిన ఐదుగురు డాక్టర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరు లోక్సభ, నలుగురు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీగా డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి విజయం సాధించారు. ఆమె ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. అనంతరం అనకాపల్లిలో ఆస్పత్రి ఏర్పాటు చేసి లక్షకు పైగా సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు) చేసిన వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు ఏఎంసీలో వైద్య విద్య పూర్తి చేసుకుని పలాసలో వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా విశాఖ ఏంఎంసీలోనే వైద్య విద్య అభ్యసించారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్ డీబీవీ స్వామి కూడా ఏఎంసీ పూర్వ విద్యార్థే. కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డాక్టర్ ఎం.జగన్మోహనరావు కూడా విశాఖ ఏఎంసీలోనే వైద్యవిద్య అభ్యసించారు. వీరిలో వెంకట సత్యవతి, అప్పలరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికల్లో గెలుపొందగా.. డీబీవీ స్వామి తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థులు ఒకే ఎన్నికల్లో ఇంతఎక్కువ మంది చట్టసభలకు వెళ్లడం ఇదే ప్రథమమని, ఇది తమకు గర్వకారణమని ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ ‘సాక్షి’తో చెప్పారు. వీరిని త్వరలో విశాఖలో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. -
ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసంలో విషాదం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సుబ్బాయమ్మ (85) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బాయమ్మ మృతి పట్ల పలువురు పార్టీ నేతలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి సంతాపం తెలిపారు. కాగా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబుపై గెలుపొందారు. -
వైఎస్సార్సీపీలో చేరిన డాక్టర్ అశ్వినీకాంత్
నరసరావుపేట రూరల్/సాక్షి, హైదరాబాద్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మేనల్లుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అశ్వినీకాంత్, ఆయన సతీమణి డాక్టర్ వీరవల్లి రమ్య వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జనసేనలో క్రియాశీలంగా పనిచేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వేర్హౌజింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు, ఆయన సతీమణి భారతి, అనుచరులు హైదరాబాద్లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి) -
సీఈవోను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
ఇద్దరు డాక్టర్ల మధ్యే పోటీ
సాక్షి, నరసరావుపేట : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులుగా డాక్టర్లు పోటీ పడుతున్నారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోటీ పడుతున్నారు. డాక్టర్ గోపిరెడ్డి పది రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. డాక్టర్ చదలవాడను తమ అభ్యర్థిగా టీడీపీ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డాక్టర్లు, అందునా ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు కావడం గమనార్హం. -
నరసరావుపేటలో ఉద్రిక్తత..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 12వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అయితే ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు తమ వార్డులోకి రావద్దంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. -
3కోట్ల మంది డేటా ఎలా సేకరించారు?
సాక్షి, అమరావతి : డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు వైఎస్సార్సీపీ నేతలు కాసు మహేందర్ రెడ్డి, లావు కృష్ణ దేవరాయలుతో కలిసి ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా ఎలా లీకయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు డేటా ఇచ్చిందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం 60లక్షలకు మించి లేదు.. కానీ 3 కోట్ల మంది డేటా ఎలా సేకరించారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం అక్రమంగా సేకరించిన డేటానే అన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించిన డేటా ద్వారా టీడీపీ నాయకులు తమ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల ఓట్లల్లో అక్రమాలు జరిగాయన్నారు. ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (‘ఐటీ గ్రిడ్స్’లో మరోసారి సోదాలు) -
‘కోడెల జీవితమంతా అరాచకమే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై వైఎస్సార్సీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరులో శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..అవినీతి అరాచకాలకు కోడెల కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో కోడెల కుటుంబం వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆరోపించారు. స్పీకర్ వ్యవస్థనే భ్రష్టుపట్టించిన ఘనుడు కోడెలని విమర్శించారు. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. నలుగురు ఏకంగా మంత్రులుగా ప్రమాణం చేస్తుంటే ఏంచేశారని అడిగారు. ఇసుక లారీలను అర్ధరాత్రి రోడ్డు మీద ఆపేసి మీ సొంత అవసరాలకు వాడుకోలేదా అని ప్రశ్నించారు. చెప్పుకుంటూ పోతే కోడెల జీవితమంతా అరాచకమేనన్నారు. నిప్పునని చెప్పుకునే కోడెల కోటప్పకొండ మీద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. -
‘కోడెల అంత అవినీతి ఏ స్పీకర్ చేయలేదు’
సాక్షి, గుంటూరు : రాజకీయ చరిత్రలో ఏ స్పీకర్ కూడా చేయలేని అవినీతిని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కోడెల వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. గతంలో కోడెల ఆస్పత్రిలో బాంబు పేలి జనం చనిపోతే.. ఆ కేసును బీజేపీ నేత ఆద్వానీని అడ్డం పెట్టుకొని మాఫీ చేయించుకున్న ఘనుడు కోడెల అని విమర్శించారు. ఇసుక, రేషన్, ఆర్టీసీ.. ఇలా అన్నింటిలోనూ కోడెల కుమారుడు, కుమార్తె అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కోడెల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం : గోపిరెడ్డి అసెంబ్లీ సిగ్గుపడేలా స్పీకర్ కోడెల వ్యవహరించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి తోలి శాసన సభకు స్పీకర్ గా ఉండటం అసెంబ్లీకే సిగ్గుచేటన్నారు. అన్నాక్యాంటిన్లోనూ కోడెల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.కోడెల అవినీతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని చెప్పారు. దమ్ముంటే కోడెల శివప్రసాద్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేయటంతో పరిస్థితి అదుపుతప్పింది. అంజుమన్ కమిటీ స్థల వివాదంలో ఉదయం ఎమ్మెల్యే గోపిరెడ్డి ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ధర్నాకు పోటీగా గోపిరెడ్డి ఇంటిముందు హల్చల్ చేశారు. ఇరు వర్గాల మోహరింపుతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు చేతులు దాటిపోతుండటంతో పోలీసులు కలుగజేసుకుని వారిని చెదరగొట్టారు. -
స్పీకర్ కోడెలపై గోపిరెడ్డి ఫైర్!
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్రావుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. కోడెల స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 'డీమార్ట్' నిర్మాణం కోసం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు అడిగిన లారీ ఓనర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే ఒక్కో ప్లాట్కు 50వేలు లంచం అడుగుతున్నారని తెలిపారు. సొంత పార్టీలో ఉండేవారిని సైతం కోడెల కుమారుడు వదలటం లేదన్నారు. వీరి అక్రమాలకు జనం ఓట్ల రూపంలోనే సమధానం చెప్తారని అన్నారు. -
టీడీపీ కార్యకర్తల రభసపై ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: తన ఇంటిముందు టీడీపీ కార్యకర్తలు రభసకు దిగడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు అల్లర్లు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు, బొల్లా బ్రహ్మానాయుడులు కూడా డీఎస్పీని కలిశారు. అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అల్లర్లు సృష్టించి బెదిరించాలని చూడటం సరైన పద్దతి కాదన్నారు. టీడీపీ నాయకులకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గోపిరెడ్డి ఇంటి ముందు దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి ముందు వేడుకలు చేసుకోవడానికి టీడీపీ కార్యకర్తలకు ఎవరు అనుమతి ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో అల్లర్లు సృష్టిస్తే సహించేదిలేదన్నారు. -
టీడీపీ కార్యకర్తల హల్చల్: నరసరావుపేటలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలు హద్దుమీరుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరుకున్న కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు కోడెల శివరామ్ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. టీడీపీ ఫ్లెక్సీలు చూపుతూ.. నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది సరైన పద్దతి కాదంటూ అభ్యంతరం వ్యకం చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తరిమికొట్టారు. -
వారిని లోకేషే కాపాడుతున్నారు : గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ రాష్ట్ర కన్వినర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం చేయమని ధర్నా చేస్తే చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనవసర ఆర్భాటాలకు చేసే ఖర్చును బాధితులకు ఇస్తే వారి సమస్యలు కొన్నైనా తీరేవన్నారు. అగ్రిగోల్డ్ యజమానులను మంత్రి లోకేష్ కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 260 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోతే..140 మందికి మాత్రమే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధితులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఓటమి భయంతోనే కుట్రపూరిత దాడి: టీజేఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్పై దాడి కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. జగన్పై దాడి ఘటనలో ముఖ్యమంత్రి, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. మాటల దాడి చేస్తూనే..రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందించడమే వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన అన్ని స్థాయిల్లో జరుగుతోందని, జగన్ను ఉద్దేశించి టీడీపీ నేతలు మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ శాంతి కాముకులు అని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని చేతకాని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. కుట్ర ఆధారిత రాజకీయాలనే బాబు నమ్ముకున్నారని అన్నారు. జగన్పై దాడిని కేంద్రస్థాయి సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గరుడ ప్లానంతా చంద్రబాబుదే: గోపిరెడ్డి గుంటూరు: ఓటమి భయంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బరితెగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపైనే హత్యాయత్నానికి ఉసిగొల్పారని అన్నారు. ఆపరేషన్ గరుడ ప్లానంతా చంద్రబాబుదేనని ఇప్పుడు స్పష్టం అవుతోందని వెల్లడించారు. శివాజీని అరెస్టు చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించాయని, ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే హత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఒక టీడీపీ నేతలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. -
రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
-
ఓట్ల తొలగింపుతో టీడీపీ చిల్లర రాజకీయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీకి అనుకూలురైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తూ టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఓట్లు తొలగింపు ద్వారా అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సిసోడియాను మంగళవారం గోపిరెడ్డి కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 4 వేలు ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యారని ఈ సందర్భంగా చెప్పారు. ఇలా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ అనుకూలుమైన నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు తొలగించడానికి టీడీపీ కుట్ర చేస్తోందన్నారు. ఇందుకోసం నగర దీపికలు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ వినియోగించుకుంటోందని చెప్పారు. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లు, ఊళ్లలో ఉన్నవారిని వలస పోయినట్లు చూపించి ఓట్లు తొలగిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజాక్షేత్రంలో గెలవలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు ఒత్తాసు పలికి వైఎస్సార్సీపీ ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తానిచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిస్తామని ఎన్నికల అధికారి హామీ ఇచ్చారని చెప్పారు. ఓట్ల తొలగింపు విషయంలో కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు అప్రమత్తం కావాలని గోపిరెడ్డి సూచించారు. ఓటరు జాబితాలో తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో ఓటు లేకపోతే ఎందుకు తొలగించారో సంబంధిత అధికారులను నిలదీయాలన్నారు. ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులకు గోపిరెడ్డి సూచించారు. గోపిరెడ్డి వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సచివాలయానికి వచ్చారు. -
‘ఆ ధైర్యంలేకే టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోంది’’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అడ్డదారిలోనైనా సరే అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజక వర్గంలో నాలుగు నుంచి ఐదు వేల ఓటర్లను తొలగించడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం దీని కోసమే నగర దీపికలు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లుగా, ఊళ్లో ఉన్నవాళ్లు వలస పోయినట్లుగా చూపించి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్లే టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జాగ్రత్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలికి ఓట్లను తొలగిస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాబట్టి... వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఓటరు జాబితాలో తమ ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ లేనట్లైతే ఎందుకు తొలగించారో సంబంధిత అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. -
అక్రమ మైనింగ్కు ఖాకీ కవచం
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు/ఏఎన్యూ/ తాడేపల్లి రూరల్/ పిడుగురాళ్ల: మైనింగ్ అక్రమాలపై పరిశీలనకు ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సోమవారం పల్నాడులో పర్యటించకుండా టీడీపీ సర్కారు పోలీసుల ద్వారా అడ్డుకుంది. పల్నాడుతోపాటు గుంటూరు జిల్లావ్యాప్తంగా అష్టదిగ్బంధం చేయడం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలందరికీ నోటీసులు జారీ చేయడంతోపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిస్తూ పల్నాడులో 144 సెక్షన్ విధించి అక్రమ క్వారీయింగ్ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ పర్యటించకుండా అడ్డుకున్నారు. మైనింగ్ అక్రమాల పరిశీలనకు బయల్దేరిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్దే అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. పార్టీ నేత కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను నరసరావుపేటలో ఇంటి వద్దే అడ్డుకున్నారు. నడికూడిలో రైలు దిగిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి ఆయన స్వగ్రామానికి తరలించారు. ఊరూరా పోలీసులు పల్నాడులో పలు చోట్ల విపక్ష పార్టీ నేతలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్భందించారు. అక్రమ క్వారీయింగ్ జరుగుతున్న పిడుగురాళ్ళ, మాచవరం, దాచేపల్లి మండలాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించి బైండోవర్ చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను జల్లెడ పట్టారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ఏ నలుగురు కలిసి ఉన్నా కేసులు నమోదు చేస్తామంటూ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ చర్యలను తీవ్రంగా నిరసించిన వైఎస్సార్సీపీ నేతలు పది రోజుల్లోగా క్వారీలను సందర్శించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాసు ఇంటికి భారీగా చేరుకున్న శ్రేణులు పోలీసులు తెల్లవారుజామునే గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇళ్లను ముట్టడించి గృహ నిర్భంధం చేయడంతో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారి ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు 144 సెక్షన్ విధించి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు లెక్క చేయకుండా కాసు మహేష్రెడ్డి ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నాయకులు యెనుముల మురళీధర్రెడ్డి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని కాసుకు మద్దతుగా నిలిచారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల కంటపడకుండా.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ పోలీసుల కంటపడకుండా నరసరావుపేటలోని కాసు మహేష్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎస్పీతో మాట్లాడి కాసు మహేష్రెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసానుపల్లి, నడికూడి, కోనంకిలో జరిగిన మైనింగ్ అక్రమాలను వివరించారు. గంట గడువు కోరి స్పందించని పోలీసులు అనంతరం దాచేపల్లికి బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలను నరసరావుపేటలోని కాసు మహేష్రెడ్డి ఇంటి గేటు బయట పెద్దఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాచేపల్లి వెళ్లేందుకు తననైనా అనుమతించాలని కాసు మహేష్రెడ్డి కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామని గంట సమయం ఇవ్వాలని పోలీసులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. అయితే ఆ తరువాత కూడా పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో పది రోజుల్లోగా మైనింగ్ ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ప్రకటించారు. సంతకానికి బొత్స ససేమిరా తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, పార్టీ జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణను కాజ టోల్గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్స్టేషన్కు కాకుండా దుగ్గిరాల స్టేషన్కు తరలించారు. బొత్సను అడ్డుకోవడానికి నిరసనగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ధర్నాకు దిగారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి, పెదకూరపాడు సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కావటి మనోహర్నాయుడు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్రావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి ధర్నాలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు వర్షంలోనే స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు ఉదయం 11.20 గంటల నుంచి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా 3 గంటల పాటు స్టేషన్ వరండాలోనే బొత్సను నిర్భంధించారు. సంతకం చేస్తే వదిలిపెడతామన్న పోలీసుల ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. మేమేమైనా దొంగలమా? రౌడీలమా? దోపిడీ చేసేవాళ్లని వదిలేసి మమ్మల్ని సంతకాలు చేయమనడం ఏమిటని బొత్స ప్రశ్నించారు. రాత్రి అయినా సరే ఇక్కడే పడుకుంటానని, సీఎంకు చెప్పినా డీజీపీకి చెప్పినా భయపడబోనని, సంతకం చేసేది లేదని బొత్స స్పష్టం చేయడంతో చివరకు ఆయన్ను పంపించారు. మీడియాపై పోలీసుల చిందులు బొత్సను పోలీస్స్టేషన్లో నిర్భంధించనట్లు తెలియడంతో ఈ వార్త కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను లోపలకు రావద్దని, ఫొటోలు తీయవద్దని పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అప్పటికే చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలంటూ మీడియా సిబ్బంది వద్ద కెమెరాలు లాక్కోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మాచర్లలో పిన్నెల్లి, గామాలపాడులో జంగా గృహ నిర్భంధం వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను మాచర్లలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఆర్కే ఇంటి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆయన స్వగ్రామమైన గామాలపాడులో పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఈ విషయం తెలియడంతో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్లో బయలుదేరిన ఆయన్ను నడికూడిలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు రైలు 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం టీజీవీని కారంపూడి మండలం గాదెవారిపల్లెలోని ఆయన స్వగృహానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు. పోలీసుల తీరు పట్ల కృష్ణారెడ్డి మండిపడ్డారు. -
మైనింగ్లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే వారికి భయం
-
ప్రతిపక్షం గొంతు నొక్కడం దారుణం
నరసరావుపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును వినపడనీయకుండా అణచివేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అవినీతికి చిరునామాగా కోడెల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సభను జరగనీయకుండా తనతో పాటు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. స్థల వివాదంలో తాను లూథరన్ అంధుల పాఠశాల ఉన్న ఏఈఎల్సీ సంస్థ చైర్మన్ను కలిశానని చెప్పారు. ఆయన తాము ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న వారు కూడా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తాము లీజుకు తీసుకోలేదని, కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. తాము లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకొస్తే వెంటనే తమ ఖర్చులతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు ప్రకటించారన్నారు. ఈ వ్యవహారంలో నకిలీ లీజు అగ్రిమెంట్ను టీడీపీ నాయకులు సృష్టించారని గోపిరెడ్డి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు సాయితేజ డెవలపర్స్ పేరుపై ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకున్నారని, దానిలో ఏడుగురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారని గోపిరెడ్డి వివరించారు. వారిపేర్లు బయటపెట్టకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లే బయటపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. గుంటూరులో సంగతి మాట్లాడరే ? గుంటూరులో ఏఈఎల్సీకి చెందిన ఆరు ఎకరాలు మంత్రి నక్కా ఆనందబాబు చేతిలో ఉన్నాయని గోపిరెడ్డి చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన గ్రాండ్ హోటల్ నాగార్జున ఏఈఎల్సీ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్థలం లీజుకు తీసుకొని రమేష్ హాస్పిటల్స్ నిర్మించేందుకు ఇచ్చారన్నారు. వీరందరూ టీడీపీకి చెందినవారేనని గుర్తు చేశారు. వీరు తీసుకున్నప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేయలేదని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కేవలం సంబంధం లేని వ్యవహారాన్ని తనకు చుట్టి తనపై బురదచల్లేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కల్తీ పాలు, టీటీడీ లేఖలు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఏ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరినా వారు స్వీకరించటం లేదని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం వారి చేతిలో ఉన్నా తనపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. తన ప్రమేయం లేదని తెలిసే కేసులు పెట్టలేదన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని, ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి సామ్రాట్ శివరాం స్పీకర్ డాక్టర్ కోడెల కుమారుడు శివరామ్ అవినీతికి చిరునామాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేస్తున్న వ్యక్తే తమపై నిందలు మోపుతున్నాడన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో సుబ్బారావుకు చెందిన 17 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఏడు ఇళ్లు నాశనం చేసి సుమారు 10 వేల కోళ్లను తిన్నారన్నారు. నరసరావుపేట పలనాడు రోడ్డులో ఎస్ఎస్ఎన్ కళాశాల అధ్యాపకుడికి చెందిన రూ.5 కోట్ల స్థలాన్ని, నల్లపాడులో సాంబిరెడ్డి అనే వ్యక్తికి చెందిన 2.5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. తాను తిరుపతి పాదయాత్రకు వెళుతూ లక్షలు వసూలు చేశారనే శివరామ్ విమర్శలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వెంకటేశ్వరస్వామి పాదయాత్రను కూడా రాజకీయం చేసిన దుర్మార్గుడు శివరామ్ అన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లోఫర్స్ అంటూ శివరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్కు వెళతామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకుండానే సత్తెనపల్లి, నరసరావుపేటలలో దోచుకున్న రూ.150కోట్ల డబ్బుతో గుంటూరులో కేఎస్పీ మాల్ నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రి హెచ్చరించినా రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో పాటు సత్తెనపల్లిలో బాలాజీ స్వీట్స్ నుంచి నెలకు రూ.50వేలు వసూలు చేస్తున్నాడన్నారు. చివరకి తన పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా డబ్బులు వసూలుచేస్తూ వారే తనకు బలమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ఎంపీపీ మట్టి తోలుకున్నాడని నాలుగు రోజుల పాటు జైలులో పెట్టించాడన్నారు. తన ఇంటిలో బాంబులు పేలి నలుగురు కార్యకర్తలు చనిపోతే ఇప్పటివరకు ఆ కుటుంబాలను ఆదుకోలేదని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులు ఆరు గంటల పాటు మైకు ఇచ్చి స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే తప్పు లేనిదీ... ఏ తప్పూ చేయని తాము సభ పెట్టుకుంటామంటే హౌస్ అరెస్టుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ నేరం చేశాడని అరెస్టు చేశారు: బొల్లా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఏ నేరం చేశాడని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాలా ప్రజలను దోచుకుంటున్న వీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఏ.హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా పాల్గొన్నారు. నరసరావుపేటలో నియంతృత్వ పాలన ? నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో నియంత పాలన కొనసాగుతుందా అన్నట్లు శనివారం వాతావరణం కనిపించింది. ఎటుచూసినా ఖాకీలు గుంపులు గుంపులుగా లాఠీలు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీనంతటికీ టీడీపీ నేతల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసరటమే కారణంగా కన్పిస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే ఎక్కడ తమ అవినీతి పుట్ట పగులుతుందోనని కలవరపాటుతో అధికార పార్టీ కుట్ర చేసి సభను భగ్నం చేసింది. 144 సెక్షన్ అస్త్రాన్ని ఉపయోగించి నియోజకవర్గ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఇతరులనెవ్వరిని అటుగా అనుమతించలేదు. దీంతో పాటు మల్లమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయ సెంటర్, పల్నాడు బస్టాండు, ఆర్టీసి బస్టాండు వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా డివైడర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అటుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో ప్రజానీకం అసౌకర్యానికి గురైయ్యారు. పోలీసుల అదుపులో పట్టణం మూడు సబ్ డివిజన్ల అధికారులు, సిబ్బందితో పాటు గుంటూరు నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లలో 10 నుంచి 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 వాహనాల్లో పోలీసులు గస్తీ తిరిగి జనాలను చెదరగొడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. మరో ఐదు రోజుల పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా పోలీసులు ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం ఖాయం. -
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహనిర్బంధం, ఉద్రిక్తత
గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారం విషం కక్కుతోంది. పాలక పార్టీకి ఓ రూలు, ప్రతిపక్షానికో రూలు అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమానికి 144 సెక్షన్తో మోకాలడ్డారు. సాక్షి, నరసరావుపేట : పట్టణంలో అధికార యంత్రాంగం, పారదర్శకతకు పాతరేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోంది. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన విమర్శలను నిగ్గు తేల్చుకునేందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బహిరంగ చర్చకు వెళ్లకుండా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అడ్డుకోవడమే లక్ష్యం : నరసరావుపేట, సత్తెనపల్లిలో జరిగిన అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకుంటే టీడీపీ నేతలు రాజీనామాకు సిద్ధపడాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అయితే బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకులు నోరు విప్పితే తమ అవినీతి ఎక్కడ బట్టబయలు అవుతుందోనన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. బహిరంగ సభ, ర్యాలీలను ఎలాగైనా అడ్డుకోవాలనకున్న అధికార పార్టీనేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మూడురోజుల పాటు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు నిషేధిత ప్రాంతమైన ఆర్డీవో ఆఫీసు సెంటర్లో ఆందోళన జాతర చేపట్టినప్పుడు అధికారులకు గుర్తుకురాని నిబంధనలు ప్రతిపక్షం ర్యాలీ చేస్తానన్నప్పుడు మాత్రం అకస్మాత్తుగా గుర్తుకువచ్చాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి 144 సెక్షన్ పేరుతో మోకాలడ్డారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ఇన్చార్జి తహసీల్దార్ జి.శ్రీనివాస్ 144 సెక్షన్ అమలు చేయాలని శుక్రవారం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సాకును అసరాగా చూపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ర్యాలీకు అనుమతులు ఇవ్వకూడదనేది అధికార పార్టీ కుట్ర. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు మూడు రోజుల పాటు న్యాయస్థాన ప్రాంగణాలకు కూతవేటు దూరంలో గల ఆర్డీవో అఫీసు సెంటర్లో నానా యాగీ చేసినా, ప్రజలు, వ్యాపారస్తులు మూడు రోజుల పాటు ఇబ్బందులు పడినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని తేటతెల్లమవుతోంది. నాలుగో తేదీ వరకు 144 సెక్షన్ అమలు : ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో 144 సెక్షన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ కోరిన నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశా. జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. –శ్రీనివాస్, తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య : ఏఈఎల్సీ ఆస్తుల అన్యాక్రాంతం వ్యవహారంలో రాజకీయ సవాళ్ల వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. 144 సెక్షన్ అమల్లో వున్న కారణంగా నిరసనలు, బహిరంగ సభలు నిషేధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –ఏవీ శివప్రసాద్, సీఐ తహసీల్దార్ జారీచేసిన 144 సెక్షన్ ఉత్తర్వులు -
కిడ్నీ రాకెట్ సూత్రధారులను అరెస్టు చేయకపోతే పోరాటం
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అసలు సూత్రధారులను పక్కన పెట్టి, కేవలం డీల్ కుదిర్చిన మధ్యవర్తులనే అరెస్టు చేశారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనుక చక్రం తిప్పిన బడా వ్యాపారి ప్రమేయాన్ని, రాజకీయ జోక్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శుక్రవారం నరసరావుపేటలో మీడియా మాట్లాడుతూ ప్రధాన నిందితులను అరెస్టు చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో అసలైన దోషులను తప్పించి కేవలం మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చేయడం హేయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. అసలైన నిందితులను అరెస్టు చేయకపోతే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని రామ్కీ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో పోలీసులు నామమాత్రపు దర్యాప్తు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు, కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారినే అరెస్టు చూపించారంటే పోలీసుల దర్యాప్తు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసులో రెవెన్యూ అధికారుల తప్పుందని, పెద్ద నాయకులు సిఫారస్ చేస్తేనే తహసీల్దార్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారని స్వయంగా ఎస్పీనే చెప్పారన్నారు. రెవెన్యూ అధికారులకు తెలియకుండా ఏవిధంగా అనుమతులు లభించాయనేది స్పష్టం కావాల్సిఉందన్నారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఆర్డీవో కార్యాలయంలో మూడుపత్రాలు తీసుకున్నట్లు సాక్ష్యాలు కూడా కార్యాలయంలో ఉన్నాయన్నారు. కపలవాయి విజయకుమార్ అనే వ్యాపారి కాల్ చేసినందునే సర్టిఫికెట్లు ఇచ్చామని తహసీల్దార్, జిల్లా ఎస్పీలు ఇద్దరూ చెప్పారన్నారు. వీరందరినీ వదిలేసి కేవలం దళారులనే బాధ్యులుగా చేయడం సరికాదన్నారు. నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారిందని, కిడ్నీ రాకెట్ వ్యవహారం ముగియకముందే ఎన్నికల కమిషన్ బీఎల్వోలకు ఇచ్చే పారితోషికం చెల్లింపుల్లో అవకతవకలు బయటపడ్డాయన్నారు. వారికి ఇవ్వాల్సిన డబ్బులను రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు స్వాహా చేశారని విమర్శించారన్నారు. ల్యాండ్ కన్వర్షన్ చేయాలంటే ఎకరానికి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. భూమి అడంగల్లో ఎక్కించాలంటే దానికొక ఫీజు నిర్ణయించి వసూలుచేస్తున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కాకుమాను సదాశివరెడ్డి, మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి , జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా తదితరులు ఉన్నారు. -
‘2018 కల్లా నీళ్లిస్తే రాజీనామా చేస్తాం’
సాక్షి, గుంటూరు : పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లిస్తే తామంతా రాజీనామ చేస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజీనామానే కాదని, రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు. తమ సవాల్ను ప్రభుత్వం స్వీకరించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తెచ్చింది.. కాలువలు తవ్వించింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయంలో కాలువలు తవ్వించారు కాబట్టే ఈ రోజు పట్టిసీమ నుంచి నీళ్లొస్తున్నాయని ఆయన అన్నారు. ఈ మూడేళ్లలో పోలవరంపై టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాల్సి ఉంటే అందులో పదోవంతు పనులు మాత్రమే జరిగాయి. -
కొండేపి నియోజకవర్గానికి గోపిరెడ్డి పాదయాత్ర
ఒంగోలు: గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తిరుమలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ నుంచి గురువారం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన ఈనెల 21 నుంచి ఈ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. -
జగన్ సీఎం కావాలని తిరుమలకు పాదయాత్ర
సాక్షి, గుంటూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి శనివారం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ... 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అలాగే మా నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవడం తధ్యమన్నారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 150 మంది పాల్గొంటారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. పాదయాత్రలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, మహ్మద్ ముస్తాఫా, పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబుతో పాటు ఇతర జిల్లా నాయకులు హాజరయ్యారు. -
అధికార పార్టీ గూండాగిరి
♦ ఉచితంగా ఇసుక తోలలేదని కుటుంబంపై దాడి ♦ మహిళ మెడలో బంగారు ఆభరణాల దోపిడీ నరసరావుపేట టౌన్ : అధికార పార్టీ నాయకులు బుధవారం అర్థరాత్రి ఓ ఇంటిపై దాడికి పాల్పడి యువకుడ్ని తీవ్రంగా గాయపరచడంతో పాటు అడ్డొచ్చిన అతని తల్లి మెడలో బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బరంపేటకు చెందిన జమ్ముల నాగార్జున ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. ఇరవై రోజుల కిందట అధికార పార్టీకి చెందిన నాయకుడు కుంపటి రవి అతని వద్దకు వచ్చాడు. ఉచితంగా ఇసుక తోలాలని, లేకపోతే వ్యాపారం చేయకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతని మాటల్ని నాగార్జున బేఖాతరు చేయడంతో కక్ష పెంచుకున్న రవి బుధవారం అర్ధరాత్రి అతని అనుచరులతో నాగార్జున ఇంటి పైకి రాడ్లుతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేస్తుండగా అడ్డొచ్చిన నాగార్జున తల్లి అచ్చమ్మ మెడలో బంగారు నల్లపూసల గొలుసును లాక్కొని ఆమెను కిందకి నెట్టి వేశారు. సంఘటనలో గాయపడ్డ నాగార్జునను బంధువులు ఏరియా వైద్యశాలకు తరలించారు. దాడిని ఖండించిన ఎమ్మెల్యే నాగార్జునపై దాడిని తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని గురువారం పరామర్శించి విషయం తెలుసుకున్నారు. అధికార పార్టీ ముఠా ఈ చర్యకు ఒడిగట్టిందని, పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి వారి ఆగడాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మారణాయుధాలతో దాడిచేసి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులంతా యథేచ్ఛగా తిరుగుతున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, బాధితులకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. -
రికార్డుల కోసం పవిత్ర కార్యం అపవిత్రం
► అవినీతిలో కోడెల కుటుంబానికే గిన్నీస్ రికార్డు ► ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ► అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అవయవదానం ► దరఖాస్తు చేసిన వారందరితో ఒకసారి రక్తదానం చేయించండి ► ఏపీ స్పీకర్పైనే అత్యధిక కేసులు నరసరావుపేట: చాలా పవిత్రమైన అవయవదానం కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం అపవిత్రం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. తన కుమారుడు, కుమార్తె చేస్తున్న అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని, అవినీతిలో పోటీ పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేది స్పీకర్ కోడెల కుటుంబమే అన్నారు. అవయవాలు ఇచ్చేందుకు దరఖాస్తు చేసిన వారందరితో ఒకసారి రక్తదానం చేయిస్తే నిజంగా విజయవంతం అయినట్టుగా భావించవచ్చన్నారు. పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవయవదానం అనేది ఒక ప్రైవేటు కార్యక్రమమని, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, ప్రభుత్వ అధికారులైన డీఆర్డీఎ పీడీ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు ఏవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన పుట్టినరోజును నామమాత్రంగా జరుపుకొంటే స్పీకర్ అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు. ముందుగానే 250 కట్టల దరఖాస్తులు నమోదుచేసుకుని వచ్చి, అక్కడకు వచ్చిన వారికి కంకళాలు(ట్యాగ్) కట్టి విజయవంతమైందని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. వాస్తవానికి అక్కడకు వచ్చిన వారు వేరు, సంతకాలు చేసిన వారు వేరన్నారు. సంతకాలు చేసినవారెవరూ అక్కడకు రాలేదన్నారు. ఏపీ స్పీకర్పైనే అత్యధిక కేసులు దేశంలో ప్రస్తుతం అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకరే అని అన్నారు. ఆయనపై 22 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారన్నారు. ఇది నిజంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాల్సిందేనని ఎద్దేవా చేశారు. పోలీసులు న్యాయబద్ధంగా స్పీకర్ కుమారుడు, కుమార్తెలపై కేసులు పెట్టడం ప్రారంభిస్తే ఈ పాటికి వారు కూడా గిన్నీస్బుక్లోకి ఎక్కేవారన్నారు. జగన్ దీక్షతోనే రైతులకు మద్దతు ధర మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రైతుదీక్ష తర్వాతే కేంద్రం మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి చెప్పారు. దీక్ష విరమించిన 24 గంటల్లోనే మిర్చి క్వింటాలుకు రూ.5వేలు మద్దతు ధరతోపాటు ట్రాన్స్పోర్డు చార్జీల కింద రూ.1250 ప్రకటించిందన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, జిల్లా అధికార ప్రతినిది పిల్లి ఓబుల్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, నరసరావుపేట మండల అద్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాదర్బాషా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి, కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు పాల్గొన్నారు. -
జగన్కు జేసీ ప్రభాకరరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
► ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ ► నరసరావుపేటలో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మ దహనం నరసరావుపేట : వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని తులనాడిన జేసీ ప్రభాకరరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ప్రభాకరరెడ్డి క్షమాపణకు అసెంబ్లీలో డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై ప్రభాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు నరసరావుపేటలో ఆందోళన చేశారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మతో ఊరేగింపుగా మల్లమ్మ సెంటర్కు చేరుకున్నారు. జేసీ క్షమాపణ చెప్పాలని, సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మల్లమ్మ సెంటర్లో ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి, మద్యం సేవించి, రోడ్డుపై కూర్చుని సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ప్రభాకరరెడ్డికి సంస్కారంలేదనేది స్పష్టమయిందన్నారు. హత్యలు చేసి, అరాచకానికి పాల్పడి, డబ్బులు సంపాదించి లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రభాకరరెడ్డి ప్రతిపక్షనేత జగన్కు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పెట్టిన భిక్షతోనే జేసీ దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డి గెలుపొందారన్నారు. స్థాయిని మరిచి ప్రభాకరరెడ్డి ఈవిధంగా దూషించడాన్ని యావత్తు రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్.సుజాతాపాల్, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లి ఓబుల్రెడ్డి, వేముల శివ, షేక్.ఖాదర్బాషా, మల్లెల అశోక్, షేక్.సైదావలి, షేక్.మహబూబ్బాషా, విద్యార్థి విభాగ నాయకుడు ఆకాష్, బుజ్జి, కౌన్సిలర్లు మాగులూరి రమణారెడ్డి, షేక్.రెహమాన్, కారుమంచి మీరావలి తదితరులు పాల్గొన్నారు. కొమెరపూడిలో .. సత్తెనపల్లి : మండలంలోని కొమెరపూడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సెంటర్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
రైస్ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న జిల్లా రైస్మిల్లర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలోని పుష్కరిణి ఘాట్–1లో జిల్లా రైస్మిల్లర్ల అసోసియేషన్ తరఫున భక్తులకు కల్పిస్తున్న నిత్య అన్నదానం కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరపున జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డిని సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ పుష్కర స్నానం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారందరి ఆకలి తీర్చే విధంగా మిల్లర్లు చేయూతనివ్వడం ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి రోజూ 10 నుంచి 15 వేల మందివరకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న మిల్లర్లు అందరికీ ఆయన తన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్ఈసీ చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, మిల్లర్లు చలువాది బ్రహ్మయ్య, పి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
నరసరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి: ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని నర్సరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్తెనపల్లిలో ఓ ప్రవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ప్రత్యేకహోదా పై హామీ ఇచ్చినప్పటికీ దాని కోసం పోరాడక పోగా ప్రత్యేక ప్యాకేజి, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సున్నితమైన అంశమన్నారు. విడగొట్టిన చిన్న రాష్ట్రాలకు సహాయం చేయ కుండా ప్రత్యేక హోదా రాదని, అందరిని చల్లార్చే విధంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నచ్చ చెబుతుందన్నారు. వారితో పాటు గజ్జల వైద్యశాల వైద్యులు డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
విపక్షం ‘కేబుల్స్’ కట్!
-
అరాచకం
వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడి జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్, జెడ్పీటీసీ, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడికి తీవ్ర గాయాలు ఎమ్మెల్యే గోపిరెడ్డి కారు, పోలీసు జీపు అద్దాలు ధ్వంసం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ధర్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నరసరావుపేటలో వైఎస్సార్ సీపీనేతలపై టీడీపీ దాడికి తెగబడింది. ఘటనలో నల్లపాటి రామచంద్రప్రసాద్, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావుతో పాటు పార్టీ పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్, జెడ్పీటీసీ నూరుల్అక్తాబ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నరసరావుపేట : పట్టణంలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డాయి. అధికార బలంతో ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేస్తూ తిరిగి వారిపైనే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ వారి అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. ఎన్సీవీ కేబుల్ను రాఘవేంద్ర కమ్యూనికేషన్ పేరిట నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తుండగా.. కే-చానల్ను శాసనసభాపతి కుమారుడు డాక్టర్ కోడెల శివరామక ృష్ణ నిర్వహిస్తున్నారు. ఆదివారం వ్యూహాత్మకంగా సుమారు 300 మంది కేబుల్ ఆపరేటర్లు, టీడీపీ కార్యకర్తలు ఎన్సీవీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న నల్లపాటి రాము వర్గీయులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ వర్గీయులు కూడా అక్కడకు రావడంతో రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్అక్తాబ్ , పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్ఏ హనీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. హెడ్కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వరరావు కూడా గాయపడ్డారు. ఎమ్మెల్యేకు చెందిన క్వాలీస్ కారు అద్దాలను టీడీపీ వర్గీయులు రాళ్లతో ధ్వంసం చేశారు. అదే అదనుగా మరోసారి దాడి పోలీసులు నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని ఫిరంగిపురం పోలీస్స్టేషన్కు తరలించారు. అధికారుల తీరును నిరసిస్తూ, టీడీపీ దురాక్రమణను ఖండిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తుండగా ఇదే అదనుగా భావించి మరో మారు కేబుల్ కార్యాలయంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీలు, డిష్లు ధ్వంసం చేయటంతో పాటు హెచ్డీ సెట్ ఆఫ్ బాక్స్లు అపహరించుకెళ్లారు. అడ్డుకోబోయిన జీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు నల్లపాటి చంద్రంపై గడ్డపారతో దాడికి పాల్పడటంతో ఆయన ఎడమ చేయి విరిగింది. టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎన్సీవీ యాజమాన్యం తెలిపింది. -
విపక్షం ‘కేబుల్స్’ కట్!
- అధికారపక్షం దాష్టీకం నరసరావుపేటలో టీడీపీ రాళ్లదాడి - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సహా పలువురికి గాయాలు - కర్నూలులో సీపీఎం చానల్పైనా దాడి - పోలీసు, రెవెన్యూ అధికారులే పాత్రధారులు నరసరావుపేట/కర్నూలు : అధికారపార్టీ పూర్తిగా బరితెగిస్తోంది. గిట్టని పత్రికలు, చానళ్లపై రకరకాల మార్గాలలో ప్రతాపం చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తన తప్పులను ఎత్తిచూపుతున్న కేబుల్ చానళ్ల నిర్వాహకులపైనా దాడులకు తెగబడుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో ఎన్సీవీ కేబుల్ కార్యాలయంపై జరిగిన రాళ్లదాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసుల సమక్షంలోనే కేబుల్ వైర్ల కత్తిరింపు జరగడం గమనార్హం కాగా.. దాడికి గురైన వైఎస్సార్సీపీ నేతలనే అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీ బరితెగింపునకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు కర్నూలులోనూ తెలుగుటీడీపీ నేతులు ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డారు. సీపీఎంకు చెందిన సీమ కమ్యూనికేషన్ చానల్ను రెవెన్యూ, పోలీసు అధికారులను ప్రయోగించి నిలిపివేయించింది. చానల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి వచ్చిన పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆందోళనకారులు దిగ్బంధించడంతో ఉద్రిక్తవాతావరణం చోటుచేసుకుంది. నరసరావుపేటలో టీడీపీ వర్గీయుల వీరంగం నరసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రామిరెడ్డిపేటలోని కేబుల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వారిపై కూడా టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్అక్తాబ్ తలకు, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఎ.హనీఫ్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు చెందిన క్వాలిస్ కారు ధ్వంసమవ్వగా.. పోలీసు జీపు అద్దం పగిలిపోయింది. అయితే పోలీసులు దాడికి పాల్పడిన వారిని వదిలేసి వైఎస్సార్సీపీ వర్గీయులైన ఎన్సీవీ అధినేత నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించడం గమనార్హం. ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా ఈ సంఘటనపై గాయపడిన నాయకులతో ఫిర్యాదు చేయించి ఆర్డీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యేడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధర్నాకు దిగారు. దాడి ఘటనను పూర్తిగా ఖండిం చారు. ఇంత కిరాతకమైన ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. కర్నూలులో తీవ్రస్థాయికి కేబుల్ వార్! కర్నూలు నగరంలో కేబుల్ వార్ తీవ్రస్థాయికి చేరింది. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ సిటీ కేబుల్ ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఏడాది కిందట సీపీఎం ఆధ్వర్యంలో సీమ కమ్యూనికేషన్ చానల్ను ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రసారాలు చేస్తున్నారంటూ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆరు నెలల కిందట కార్యాలయాన్ని సీజ్ చేశారు. దీంతో సీమ కమ్యూనికేషన్ నిర్వాహకులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని జీ నెట్వర్క్ అనుమతులతో ప్రసారాలను పునరుద్ధరించారు. ఇదే సమయంలో జెమినీ చానల్ ప్రసారాలకు సంబంధించిన అనుమతులు సైతం సీమ కమ్యూనికేషన్కే దక్కడంతో రెండు వర్గాల మధ్య కేబుల్ వార్ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే గతనెలలో మున్సిపల్ అధికారులు సీమ కమ్యూనికేషన్కు సంబంధించిన వైర్లను తొలగించడంతో ఆపరేటర్లు ఆందోళన చేశారు. తాజాగా ఆదివారం సాయంత్రం గాయత్రి ఎస్టేట్లో ఉన్న సీమ కమ్యూనికేషన్స్ చానల్పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపారు. అధికారుల నిర్బంధం : పీస్ చానల్ ద్వారా నిషేధిత ప్రసారాలను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు కర్నూలు ఆర్డీవో రఘుబాబు, డీఎస్పీలు రమణమూర్తి, వినోద్కుమార్,ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు చానల్ కార్యాలయాన్ని సీజ్ చేసేందుకు వెళ్లారు. వారిని సీపీఎం నాయకులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. మూడో అంతస్తులో చానల్ కార్యాలయం ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కిందికి దిగకుండా నిర్బంధించారు. -
ఉప్పలపాడులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
► రాస్తారోకోకు దిగిన గ్రామస్తులు ► 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి ► లేకుంటే ఆమరణ దీక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట రూరల్ : ఉప్పలపాడు ప్రధాన సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విగ్రహం చేయి పూర్తిగా విరిగిపోగా, ముఖంపై పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తులు కనిపించాయి. తెల్లవారుజామున గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్టీ మండల నాయకులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దెబ్బతిన్న విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో కలసి ఆయన వినుకొండ-గుంటూరు రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు జరిగిన రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ ఎస్సై సురేంద్రబాబు రాస్తారోకో వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. గతంలో ఒకసారి విగ్రహంపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదన్నారు. తాజా ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిందితులను గుర్తించకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు. పోలీసుల హామీతో ఎమ్మెల్యే గోపిరెడ్డి రాస్తారోకోను విరమించారు. దమ్ముంటే పగలు వచ్చి విగ్రహం మీద చేయి వేయండి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధైర్యం ఉంటే పగటి పూట విగ్రహం మీద చేయి వేయాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్న గ్రామంలో రెచ్చగొట్టేందుకే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు కొమ్మనబొయిన శంకర్యాదవ్, పిల్లి ఒబుల్రెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, గాబ్రియెల్, గోగుల మనోహర్, చల్లా నారాపరెడ్డి, శివయ్య, నంద్యాల సత్యనారాయణరెడ్డి, శనివారపు బ్రహ్మారెడ్డి, కాసా ఆంజనేయులు, మూరే రవింద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీని వీడే ప్రసక్తేలేదు
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని గుంటూరు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతారంటూ వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. -
విప్పర్ల చెరువును ఆధునీకరించండి..
► అప్పుడే నరసరావుపేట తాగు నీటి సమస్య పరిష్కారం ► స్టోరేజ్ ట్యాంక్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట వెస్ట్ : నరసరావుపేట పట్టణ ప్రజలకు భవిష్యత్లో తాగునీటి అవస్థలు తీరాలంటే రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో ఉన్న 200 ఎకరాల చెరువును రిజర్వాయర్గా మార్చాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. పట్టణ ప్రజల తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశారు. పట్టణానికి తాగునీటిని అందించే రావిపాడు శాంతినగర్ రిజర్వాయర్, నకరికల్లులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆదివారం ఆయన ప్రజారోగ్య శాఖ ఈఈ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. విప్పర్ల చెరువుకు సాగర్ మైనర్ కాలువ ద్వారా సరాసరి నీరు తరలుతున్నందున కొద్ది సమయంలోనె చెరువు నిండుతుందన్నారు. కేవలం రూ.30 లక్షల వ్యయంతో ఈ చెరువును రిజర్వాయర్గా మార్చవచ్చని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో పాటు విప్పర్ల చెరువు నీరు కూడా ఉంటే తాగునీటి అవస్థలకు పుల్స్టాప్ పెట్టవచ్చన్నారు. పది రోజులుగా సాగర్ కాలువల ద్వారా వస్తున్న నీరు ప్రస్తుతం నకరికల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో 15 శాతం మాత్రమే చేరిందని చెప్పారు. రోజు విడిచి రోజు ఇస్తే రెండు లేదా మూడు నెలలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ల్లో వర్షాలు పడితే కాలువలకు నీరు వదిలే అవకాశం ఉంటుందని ఎన్ఎస్పీ ఎస్ఈ తెలిపారన్నారు. అధికారుల విఫలం.. రిజర్వాయర్లను నింపటంలో కూడా అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేక విఫలమయ్యారని ఆయన తెలిపారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చుచేసి 20 మోటార్లను వినియోగించి రిజర్వాయర్లు నింపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు కార్పొరేషన్ మాదిరిగానే రూ.15 లక్షలతో 500 హార్స్ పవర్ ఇంజిన్ను కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే తక్కువ సమయంలోనే ట్యాంకును 50 శాతం వరకు నింపవచ్చన్నారు. అలాగే, కాలువ తూములను 2 నుంచి నాలుగైదు మీటర్లకు పెంచాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా కార్యదర్శులు షేక్ ఖాదర్బాషా, కందుల ఎజ్రా, కౌన్సిలర్లు ఉన్నారు. -
అధికారపక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేటవెస్ట్: అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అధికారపక్షం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ వారి హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ , నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు విమర్శించారు. ఆదివారం నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు మద్దతుగా వైఎస్సార్సీపీ చివరి వరకు తెలుగుదేశం ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తుందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శాసనసభలోకి రోజాను రానీయకపోవడం దారుణమని, కోర్టులో కంటెప్ట్ పిటిషన్ వేశామన్నారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. అసెంబ్లీలో ఆర్టికల్ 340 ప్రకారం రోజాను సస్పెండ్ చేసి కోర్టులో మాత్రం 212 ప్రకారం సస్పెండ్ చేశామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయన్నారు. స్పీకర్పై అవిశ్వాసంలో నోటీసు విషయంలోనూ అప్రజాస్వామికంగానే వ్యవహరించారన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు దారుణం: మర్రి మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు దారుణమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దృష్టిసారించకుండా ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. బొండా ఉమామహేశ్వరరావు, బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు, అనిత, దేవినేని ఉమామహేశ్వరరావు ధూళ్ళిపాళ్ళ నరేంద్రలు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. న్యాయస్థానాలపై అపారమైన గొరవం ఉన్నట్లుగా చంద్రబాబునాయుడు మాట్లాడతారని, తనకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడితే చట్టసభలపై కోర్టులకు అధికారం లేదంటాడన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్రెడ్డి, నరసరావుపేట మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు పాల్గొన్నారు.