jadeja
-
ఐసీసీ టెస్టు జట్టులో బుమ్రా, జడేజా, జైస్వాల్
దుబాయ్: గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్–2024’ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. 11 మందితో కూడిన ఈ జట్టుకు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను సారథిగా ఎంపిక చేయగా... జట్టులో బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రూపంలో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ ఎంపిక కాగా... శ్రీలంక నుంచి కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా... టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కెరీర్లో 20కి లోపు సగటుతో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా రికార్డుల్లోకెక్కిన బుమ్రా... ఇటీవల‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జడేజా గతేడాది 527 పరుగులు చేయడంతో పాటు... 48 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఆసీస్తో సిరీస్లో ప్రధాన ప్లేయర్లంతా విఫలమైన చోట చక్కటి ప్రదర్శన కనబర్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... గతేడాది 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1556) అగ్రస్థానంలో ఉండగా... జైస్వాల్ రెండో ‘ప్లేస్’లో నిలిచాడు. 23 ఏళ్ల జైస్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది విలియమ్సన్ 1013 పరుగులు చేయగా... శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ 1049 పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోపీ’అందించిన ఆసీస్ సారథి కమిన్స్ 2024లో 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 306 పరుగులు చేశాడు. మరోవైపు ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’లో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్కూ చోటు దక్కలేదు. గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటంతో మన ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. వన్డే జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత అసలంక కెపె్టన్గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: కమిన్స్ (కెప్టెన్ ; ఆ్రస్టేలియా) యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా (భారత్), డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (ఇంగ్లండ్), విలియమ్సన్, హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక). -
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్రౌండరే అయినా అటు బ్యాట్తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్కు తోడు చక్కటి బ్యాటింగ్తో అతడు ఈ సిరీస్పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్లో బౌలింగ్కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
434 పరుగుల తేడాతో...
విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ప్రతాపం... బౌలింగ్లో జడేజా మాయాజాలం... వెరసి భారత్ చరిత్రకెక్కే విజయం సాధించింది. మ్యాచ్ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్ ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. రాజ్కోట్: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్ ‘బజ్బాల్’ ఆట కుదేలైంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్ యాదవ్ (2/19), అశ్విన్ (1/19) స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. యశస్వి ‘డబుల్’... ఓవర్నైట్ బ్యాటర్లు శుబ్మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కుల్దీప్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 55 పరుగులు జోడించారు. గిల్ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్ (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్స్లు) తన కెరీర్లో రెండో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్కు 172 జోడించడం విశేషం. స్పిన్ ఉచ్చులో పడి... కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్ బజ్బాల్ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్ పిచ్పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్ మాయాజాలంలో పోప్ (3), బెయిర్స్టో (4), రూట్ (7) తేలిగ్గానే పడిపోయారు. జట్టు స్కోరు 50 వద్దే రూట్తో పాటు స్టోక్స్ (15), రేహాన్ అహ్మద్ (0) అవుటయ్యారు. మార్క్ వుడ్ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడంతో ఇంగ్లండ్ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్ కూడా తీశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319; భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్ (రనౌట్) 4; పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 3; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 15; ఫోక్స్ (సి) జురేల్ (బి) జడేజా 16; రేహన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 0; హార్ట్లీ (బి) అశ్విన్ 16; వుడ్ (సి) జైస్వాల్ (బి) జడేజా 33; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్: బుమ్రా 8–1– 18–1, సిరాజ్ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్ 8–2–19–2, అశ్విన్ 6–3–19–1. 3 వరుస టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ వరుసలో వినోద్ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 9 స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుల సంఖ్య. అనిల్ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు. 12 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా అక్రమ్ (12 సిక్స్లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్ సమం చేశాడు. 28 రాజ్కోట్ టెస్టులో భారత్ సిక్స్ల సంఖ్య. ఒకే టెస్టులో అత్యధిక సిక్స్లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్ సవరించింది. 48 ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్లు. ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్ 47 సిక్స్లు కొట్టింది. -
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
మోహిత్ కి పాండ్య పాఠాలు చెప్పడం ఏంటి ..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
చెన్నై పాంచ్ పటాకా
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
మనసున్న మారాజు.. జామ్సాహెబ్, ఎవరీ మారాజు?
రష్యా దురాక్రమణతో ఉక్రేనియన్లు లక్షలాదిగా శరణార్ధులవుతున్న దృశ్యాలు చూస్తున్నాం! ప్రాణాలరచేతిలో పెట్టుకొని వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లొవేకియా తదితర దేశాలు సరిహద్దులు తెరిచి ఆశ్రయమిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో మానవ సంక్షోభం తలెత్తలేదని నిపుణులు వర్ణిస్తున్నారు. ఇలాంటి సందర్భమే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పలు యూరప్ దేశాలకు ఎదురైంది. ఆ సమయంలో వారికి నేనున్నానంటూ ఒక భారత మహారాజు అక్కున చేర్చుకున్నారు. అనాథలమైపోయామని బాధ పడొద్దంటూ ఆయన యుద్ధ శరణార్ధులకు ఆశ్రయం కల్పించారు. ముఖ్యంగా హిట్లర్ దురాక్రమణతో కకావికలమైన పోలాండ్కు ఆ మహారాజు అండగా నిలిచారు. పోలాండ్ చిన్నారులకు ఒక తండ్రిలా మారారు. నిజానికి ఆ సమయంలో భారత్లో బ్రిటిష్ పాలన నడుస్తోంది. సొంత ఖండానికి చెందిన వారే అయినా పోలాండ్ శరణార్ధులను అనుమతించకూడదని భారత్లో బ్రిటిష్ అధికారులు నిర్ణయించుకున్న సమయంలో మహారాజా దిగ్విజయ్సింహ్జీ రంజిత్సింహ్జీ జడేజా వారికి ఆశ్రయం ఇచ్చి మనసున్న మారాజని నిరూపించుకున్నారు. గుజరాత్లోని నవానగర్ సంస్థానాధిపతైన దిగ్విజయ్ సింహ్జీని ప్రజలు గౌరవంగా జామ్సాహెబ్ అని పిలుస్తారు. నన్ను మీ బాపూ అనుకోండి! 1942లో సోవియట్ సైన్యం పోలాండ్ పైకి వచ్చినప్పుడు 2 నుండి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికి పైగా పిల్లలని ఒక నౌకలో ఎక్కించి శరణార్థులుగా పంపించారు. వీళ్లకు ఎవరూ ఆశ్రయమివ్వలేదు. చివరకు భారత్లో వలస పాలకులు కూడా శరణార్థుల సాయానికి ఆటంకాలు కల్పించారు. యుద్ధం కారణంగా అనాథలైన పోలాండ్ పిల్లల వెతలు చూసి జామ్సాహెబ్ చలించిపోయారు. బ్రిటీష్ అధికారుల ఆటంకాలు లెక్కచేయకుండా పోలండ్ పిల్లల ఓడను తన రాజ్యంలోని రోసి పోర్టుకు ఆయన ఆహ్వానించారు. అక్కడకు సమీపంలోని బాలచడి నగర సరిహద్దుల్లో పోలండ్ శరణార్ధుల కోసం కుటీరాలు ఏర్పాటు చేయించారు. ‘‘నన్ను మీ బాపూ (తండ్రి) అనుకోండి! మీకు ఏ లోటూ రాదు’’ అని వారికి అభయం ఇచ్చారు. యుద్ధం కారణంగా ఇల్లూ వాకిలి వదిలిన పోలండ్ వాసులు సొంతింట్లో ఉన్న భావన కలిగించాలని ఆయన అనేక సదుపాయాలు కల్పించారు. దాదాపు 640 మంది శరణార్ధులు మహారాజు వద్ద ఆశ్రయం పొందారు. ఆ తర్వాత 1946 లో వారిని తిరిగి పోలాండ్ పంపించారు. శరణార్ధులకూ హక్కులుంటాయి! శరణార్ధుల్లో ఒకరు జామ్సాహెబ్ ఆతిథ్యం గురించి చెబుతూ ‘‘ఆ సమయంలో మాకు పునరావాస కేంద్రాల్లో ఇస్తున్న ఉడికించిన పాలకూర నచ్చలేదు. దీంతో స్ట్రయిక్ చేద్దామని నిర్ణయించుకున్నాం! ఈ విషయం బాపూ (జామ్సాహెబ్) కు తెలిసింది. వెంటనే వంటగాళ్లకు ఆ కూర వండవద్దని ఆదేశించారు. నిజానికి శరణార్ధులుగా ఉన్న మాకు డిమాండ్లు చేసే హక్కుంటుందని మేం భావించలేదు. కానీ ఆయన అతిచిన్న విషయంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు’’ అని తెలిపారు. పొలండ్, పోలిష్ రిపబ్లిక్ గా ఏర్పాటు అయిన తర్వాత ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్‘ అవార్డును ఆయనకు ప్రకటించింది. ఇప్పటికీ పోలండ్వాసులు మహారాజా పెద్ద మనసును మరిచిపోలేదు. ఆయన ఆశ్రయం పొంది అనంతరం పోలండ్ తిరిగివెళ్లిన వాళ్లు ‘సర్వైవర్స్ ఆఫ్ బాలచడి’’ పేరిట బృందంగా ఏర్పడ్డారు. జామ్సాహెబ్కు ఆజన్మాంతం తామంతా రుణపడ్డామని వీళ్లు చెప్పేవాళ్లు. తమ కృతజ్ఞతకు గుర్తుగా వార్సాలో ఆయన పేరిట స్క్వేర్ ఆఫ్ గుడ్ మహారాజా అని ఒక కూడలి ఏర్పాటు చేసుకున్నారు. 2014లో అక్కడ ఒక పార్కు కూడా ప్రారంభించారు. అందులో ఆయన స్మారక చిహ్నం స్థాపించారు. ఎవరీ మారాజు? జామ్ సాహెబ్గా ప్రసిద్ధి చెందిన రాజా దిగ్విజయ్సింగ్జీ రంజిత్సింగ్జీ జడేజా (1895–1966) యదువంశీ రాజ్పుత్ వంశానికి చెందినవారు. ప్రఖ్యాత క్రికెటర్ రంజిత్సింగ్జీ ఈయనకు మేనమామ. యూనివర్సిటీ కాలేజ్ లండ¯Œ లో విద్యాభ్యాసం చేశారు. 1919లో బ్రిటిష్ ఆర్మీలో సెకండ్ లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టారు. 1947 వరకు లెఫ్టినెంట్–జనరల్ గా బ్రిటీష్ఇండియన్ ఆర్మీ నుంచి గౌరవ భృతి పొందారు. 1935లో ఆయనకు మహా రాజకుమారి బైజీ రాజ్ శ్రీ కంచన్ కున్వెర్బా సాహిబాతో వివాహమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నవానగర్ను యునైటెడ్ స్టేట్ ఆఫ్ కతియావార్లో విలీనం చేశారు. – శాయి ప్రమోద్ -
ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్కింగ్స్ బ్యాట్స్మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం. పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది. -
ఇషాంత్ అవుట్
క్రైస్ట్చర్చ్: కివీస్ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్లో ఉన్న ఇషాంత్ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్ (5/68) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్లో ఎదురుదెబ్బ తగిలినా... బ్యాటింగ్లో మాత్రం యువ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్నెస్తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్లోలేని వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్తో పాటు కెప్టెన్ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటింగ్ పిచ్! క్రైస్ట్చర్చ్ వికెట్ బ్యాటింగ్కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్మెన్కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్మెన్ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక. -
రోహిత్ డబుల్ సఫారీ ట్రబుల్
రాంచీ టెస్టులో భారత్కు రెండో రోజే పట్టు లభించింది. తొలి రోజు సెంచరీని డబుల్ సెంచరీగా మలచి రోహిత్ పలు రికార్డులను కొల్లగొట్టగా, రహానే ఖాతాలో కూడా శతకం చేరింది. జడేజా, ఉమేశ్ కూడా తలా ఓ చేయి వేయడంతో భారీ స్కోరుతో భారత్ చెలరేగింది. ఆదివారం ఏకంగా 4.67 రన్రేట్తో భారత్ పరుగులు సాధించడం విశేషం. అనంతరం వేసిన ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికాను టీమిండియా ఒక ఆటాడుకుంది. 9 పరుగులకే ఓపెనర్లను వెనక్కి పంపి రాబోయే ప్రమాదానికి సంకేతాలు పంపింది. అప్పుడే పొడిబారిన పిచ్పై బంతి అష్టవంకర్లు తిరుగుతుండటంతో తడబడుతున్న సఫారీలు ఎంత వరకు నిలబడగలరో చూడాలి. మొదటి రోజులాగే ఆదివారం కూడా వెలుతురులేమి సమస్యగా మారడంతో 63.3 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జోరు కొనసాగుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం జుబేర్ హమ్జా (0 బ్యాటింగ్), డు ప్లెసిస్ (1 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్లకు 497 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (255 బంతుల్లో 212; 28 ఫోర్లు, 6 సిక్సర్లు) టెస్టు కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయగా.... అజింక్య రహానే (192 బంతుల్లో 115; 17 ఫోర్లు, 1 సిక్స్) శతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 267 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా (119 బంతుల్లో 51; 4 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లలో లిండేకు 4 వికెట్లు దక్కాయి. రోహిత్ అదే జోరు... ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 117తో బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ శర్మ రెండో రోజు కూడా చక్కటి షాట్లతో అలరించాడు. సఫారీ పేసర్లు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇన్గిడి వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను 199 బంతుల్లో 150 పరుగుల మార్క్ను అందుకున్నాడు. ఆ తర్వాత అతను మరింత వేగంగా ద్విశతకం దిశగా దూసుకుపోయాడు. 179 పరుగుల వద్ద పీట్ బౌలింగ్లో దక్షిణాఫ్రికా చేసిన ఎల్బీ అప్పీల్ను అంపైర్ తిరస్కరించాడు. డు ప్లెసిస్ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంతో రోహిత్కు మరో అవకాశం దక్కింది. నోర్జే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 190ల్లోకి చేరుకున్న ‘ముంబైకర్’ లంచ్ సమయానికి 199 వద్ద నిలిచాడు. విరామం తర్వాత పీట్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదడంతో రోహిత్ డబుల్ సెంచరీ పూర్తయింది. అదే ఓవర్లో అతను మరో సిక్స్ కొట్టాడు. అయితే మరో నాలుగు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. రబడ బంతిని హుక్ షాట్ ఆడబోయిన రోహిత్ ఫైన్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చాడు. రాణించిన జడేజా... తొలి రోజు 83 పరుగులతో అజేయంగా నిలిచిన రహానేకు ఆదివారం సెంచరీ చేరుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు. ముగ్గురు పేసర్ల ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన అతను ఆ తర్వాత నోర్జే బౌలింగ్లో కవర్ పాయింట్ దిశగా సింగిల్ తీసి 169 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2016 తర్వాత స్వదేశంలో రహానే సెంచరీ చేయడం ఇదే తొలిసారి. శతకం సాధించిన కొద్ది సేపటికే లిండే బౌలింగ్లో కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. . లిండేకు ఇది తొలి టెస్టు వికెట్ కాగా, క్లాసెన్కు తొలి క్యాచ్. మరోసారి ఆరో స్థానానికి ప్రమోట్ అయిన జడేజా తనదైన శైలిలో చకచకా పరుగులు సాధించాడు. సాహా (24)తో కలిసి ఆరో వికెట్కు 47 పరుగులు, అశి్వన్ (14)తో ఏడో వికెట్కు అతను 33 పరుగులు జోడించాడు. 118 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా ఎప్పటిలాగే ‘కత్తి సాము’ సంబరాలు చేసుకున్నాడు. అయితే తర్వాతి బంతికే అతను వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికాకు సంకటం... ప్రత్యర్థి భారీ స్కోరు ఎదురుగా కనిపిస్తుండగా ఈసారైనా కొంత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రాత ఏమీ మారలేదు. వెలుతురులేమితో ఆట ఆగిపోవడానికి ముందు సాగిన ఐదు ఓవర్లలోనే జట్టు బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఎల్గర్ (0)ను షమీ అవుట్ చేయగా, ఉమేశ్ వేసిన తర్వాతి ఓవర్లో డి కాక్ (4) వెనుదిరిగాడు. తొలి టెస్టు ఆడుతున్న నదీమ్ రెండు ఓవర్లు కూడా మెయిడిన్గా వేయగా... హమ్జా, డు ప్లెసిస్ కలిసి తడబడుతూ 22 బంతుల్లో ఒక పరుగు చేసి ఎలాగో ఆట ముగించగలిగారు. రికార్డుల వరద... ఆదివారం వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు... తాజా సిరీస్లో రోహిత్ శర్మ తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగినప్పుడు బ్యాటింగ్ శైలి, దూకుడులో వీరూతో పోలికలు మొదలయ్యాయి. భవిష్యత్ సంగతేమో కానీ ప్రస్తుతానికి మాత్రం రోహిత్ తన సీనియర్ను మరపించాడు. రాంచీ టెస్టులో సిక్సర్తో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడైతే సరిగ్గా అందరికీ సెహ్వాగే గుర్తుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో సెంచరీ మార్క్ను కూడా సిక్సర్తోనే అందుకున్నాడు. తాజా డబుల్తో రోహిత్ అనేక చెప్పుకోదగ్గ ఘనతలు నమోదు చేశాడు. ►4సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్ తర్వాత టెస్టులు, వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్మన్ రోహిత్. ►1ఒకే సిరీస్లో ముగ్గురు భారత బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. వైజాగ్లో మయాంక్, పుణేలో కోహ్లి ద్విశతకాలు సాధించారు. అయితే 1955–56లో న్యూజిలాండ్తో సిరీస్లో మూడు డబుల్ సెంచరీలు నమోదైనా...వీటిలో రెండు వినూ మన్కడ్ చేయగా, మరొకటి పాలీ ఉమ్రీగర్ సాధించాడు. ►99.84స్వదేశంలో రోహిత్ బ్యాటింగ్ సగటు. 18 ఇన్నింగ్స్లలో అతను 6 సెంచరీలు, 5 అర్ధసెంచరీలతో 1298 పరుగులు చేశాడు. సొంతగడ్డపై కనీసం 10 ఇన్నింగ్స్లు ఆడిన బ్యాట్స్మెన్ సగటుల జాబితా తీసుకుంటే ఆ్రస్టేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (98.22)కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. ►529ఈ సిరీస్లో రోహిత్ చేసిన పరుగులు. గావస్కర్ (3 సార్లు), సెహ్వాగ్, వినూ మన్కడ్, బుద్ది కుందేరన్ తర్వాత ఒకే సిరీస్లో 500కు పైగా పరుగులు చేసిన ఐదో భారత ఓపెనర్ రోహిత్. అయితే 3 టెస్టుల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లి (610), సెహా్వగ్ (544), గంగూలీ (534) తర్వాత రోహిత్ నాలుగో స్థానంలో నిలవగా, వీవీఎస్ లక్ష్మణ్ (503) ఐదో స్థానంలో ఉన్నాడు. ఉమేశ్ మెరుపులు... 6, 6, 0, 1, 6, 0, 6, 0, 6, అవుట్... ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్ జోరు ఇది. 10 బంతులు ఆడిన అతను ఏకంగా 31 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. లిండే వేసిన తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాదిన అతను పీట్ ఓవర్లో సింగిల్ తీశాడు. లిండే తర్వాతి ఓవర్లోనే మిగతా మూడు సిక్స్లు కొట్టిన ఉమేశ్... అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయతి్నంచి అవుటయ్యాడు. ఇది ఉమేశ్కు టెస్టుల్లో అత్యధిక స్కోరు. ‘లేదంటే ఏదో జరిగిపోయేది’ ఓపెనర్గా ఆడటం నాకు దక్కిన మంచి అవకాశం. దానిని సమర్థంగా వాడుకోవడం నాకు ఎంతో అవసరం. లేదంటే ఏదో జరిగిపోయేదే.ఆ విషయం నాకు తెలుసు. నా గురించి మీడియా మొత్తం ఎంతో రాసి పడేసేది. ఇప్పుడు నాలుగు మంచి మాటలే రాయగలరు. బ్యాటింగ్ చేసేటప్పుడు మనకు రికార్డుల గురించి తెలియదు. అయితే భవిష్యత్తులో నేను ఆడటం ఆపేసిన తర్వాత ఈ రికార్డుల గురించి తెలుసుకుంటా. ‘ఓపెనర్గా మూడు టెస్టులే ఆడాను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల గురించి అతిగా ఆలోచించడం లేదు. విదేశాల్లో ఓపెనింగ్ చేసినా ఆట మూలసూత్రాలు ఒక్కటే. ఏ బంతిని ఆడాలి, దేనిని వదిలేయాలో అర్థం చేసుకోవాలి. విదేశీ సిరీస్లు నాకు పెద్ద సవాల్లాంటివని తెలుసు. దాని కోసం సిద్ధంగా ఉన్నా’ –రోహిత్ శర్మ -
అతడు భుజం గాయంతోనే ఆసీస్కు వచ్చాడు
ఏ మూడ్లో ఉన్నాడో... ఏ ఉద్దేశంతో అన్నాడో కాని... ఆటగాళ్ల ఫిట్నెస్పై తన మాటల ద్వారా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కొత్త వివాదానికి తెరలేపాడు. పెర్త్ టెస్టు ఓటమిపై విమర్శల నుంచి వ్యక్తిగతంగా తప్పించుకోలేకపోగా... కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన దానికి భిన్నమైన వివరణ ఇచ్చి మరింత బోర్లాపడ్డాడు. అటువైపు బీసీసీఐనీ ఇరకాటంలోకి నెట్టాడు. అర్ధరాత్రి వివరణ ఇచ్చుకునేలా చేశాడు. ఇటువైపు ఈ మొత్తం చర్చకు కారణమైన ‘జడేజా 70–80 శాతం ఫిట్నెస్’... అసలు జట్టు సభ్యుల గాయాలు, వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియాకు నిర్దిష్టమైన ప్రణాళిక ఏమీ లేదన్న విషయాన్ని మరోసారి చాటింది. మెల్బోర్న్: ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి ఫిట్గా లేడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రకటించాడు. రెండో టెస్టు సమయానికి అతడు 70–80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని... అందుకనే తుది జట్టులో ఆడించలేదని పేర్కొన్నాడు. జడేజా 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో జరిగే మూడో టెస్టులో ఆడిస్తామంటూ చిత్రమైన వివరణ ఇచ్చాడు. ‘స్వదేశంలో రంజీ ఆడుతున్నప్పుడే జడేజా భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు ఇంజెక్షన్లు తీసుకున్నాడు. అవి ప్రభావం చూపేందుకు కొంత సమయం పట్టింది’ అని ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో వివరించాడు. పెర్త్ ఓటమిపై విమర్శలకు స్పందిస్తూ ‘జట్టుకు ఏది మేలనుకున్నామో అదే చేశాం. సుదూరాన ఉన్నవారు మాట్లాడటం సులువు. మేమిప్పుడు దక్షిణ ధ్రువాన ఉన్నాం’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై రెండు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని, బ్యాట్స్మన్ రోహిత్శర్మ పరిస్థితి మెరుగైందని తెలిపాడు. దక్షిణాఫ్రికాలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఇంగ్లండ్లో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా... వరుసగా మూడో విదేశీ పర్యటనలోనూ ఆటగాళ్ల గాయాలపై టీమిండియాలో దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. జట్టు సభ్యుల వాస్తవ ఫిట్నెస్ను విస్మరించి చివరివరకు ఆడించడం... తీరా అది వికటించి విమర్శల పాలవడం కోహ్లి సేనకు సాధారణమైపోయింది. ఈ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో పాటు బీసీసీఐదీ తప్పున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ముగిసిన పెర్త్ టెస్టులో ‘జడేజా ఉదంతమే’ దీనంతటికీ బలమైన సాక్ష్యం. అసలేం జరిగింది? రెండో టెస్టుకు ముందు రోజే జడేజా, భువనేశ్వర్ సహా భారత్ 13 మందితో జట్టును ప్రకటించింది. అంతకుముందు బీసీసీఐ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అందరూ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని తేలిపోయింది. అయితే, పిచ్ స్వభావం రీత్యా అంటూ నలుగురు పేసర్లతో దిగాడు కోహ్లి. కానీ, ఈ వ్యూహం వికటించింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ టీమిండియాను దెబ్బకొట్టాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఆడిన భారత ప్రణాళికను అందరూ తప్పుబట్టారు. అయితే రవీంద్ర జడేజాను ఆడించే ఆలోచన తమకు రాలేదని మ్యాచ్ ముగిశాక విరాట్ వివరణ ఇచ్చాడు. మరోవైపు వివిధ కార ణాలతో జడేజా ఐదుగురు ఆటగాళ్లకు సబ్స్టిట్యూట్గా మైదానంలో సుదీర్ఘ సమయం ఫీల్డింగ్ చేశాడు. బంతిని బలంగా విసరాల్సి వచ్చే బౌండరీ లైన్ దగ్గరే ఎక్కువసేపు ఉన్నాడు. కోహ్లి వివరణ, ఫీల్డింగ్కు దింపిన తీరునుబట్టి చూస్తే జడేజా ఫిట్గా ఉన్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడేం జరిగింది? టెస్టు ఓటమిపై విమర్శల పరంపర కొనసాగుతుండగానే, ఆదివారం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి... జడేజా 70 నుంచి 80 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడని, లేనిపోని ఇబ్బంది ఎందుకనే పెర్త్ మ్యాచ్ ఆడించలేదని ప్రకటించాడు. ఇది పూర్తి అసంబద్ధంగా ఉండటంతో పెద్ద సంచలనమైంది. ఏ స్థాయి ఆటగాడినైనా వంద శాతం ఫిట్గా ఉంటేనే మైదానంలోకి దింపుతారు. మరి అలా లేని జడేజాను 13 మందిలో ఎలా చేర్చారు? ఎడమ భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న అతడిని సబ్స్టిట్యూట్గా ఎలా పంపారు? తప్పని పరిస్థితుల్లో అనుకున్నా... బౌండరీల వద్ద ఎలా ఉంచుతారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనర్థం చూస్తే... ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు కారణాలు చెప్పబోయిన రవిశాస్త్రి బయటకు తెలియని జడేజా గాయం గురించి చెప్పేశాడు. అతడు 80 శాతం ఫిట్నెస్తో ఉన్నా మెల్బోర్న్లో ఆడిస్తామంటూ మరో పూర్తి విరుద్ధ ప్రకటన చేశాడు. అంతేకాక, ‘మీరు జడేజా గురించి అడిగారు. నేను చెప్పాను. ఇక జట్టు ఎంపికపై ఎలాంటి సందేహాలు లేవనుకుంటా? ఉంటే... అది మీ సమస్య’ అని మీడియాకు చురకలేశాడు. ఇదేం తీరు? జడేజా విషయం తెలిశాక కూడా అతడిని 13 మందిలో చేర్చడం పొరపాటే. ఎలాగూ నలుగురు పేసర్ల వ్యూహమే సరి అంటూ, స్పిన్నర్ను ఆడించమని కోహ్లి చెప్పాడు కాబట్టి అతడి స్థానంలో కుల్దీప్ పేరు ఉంచితే సరిపోయేది. అలాకాకుండా జడేజాతో ఏకంగా ఫీల్డింగ్ కూడా చేయించారు. ఇప్పటికే అశ్విన్కు ఫిట్నెస్ ఇబ్బందులున్న నేపథ్యంలో ఒకవేళ గాయం పెద్దదై జడేజా సిరీస్కే దూరమైతే ఏం చేసేవారు? ఇదే విధంగా ఇంగ్లండ్లో గాయం ఉన్నా అశ్విన్ను సౌతాంప్టన్ టెస్టులో ఆడించారు. ప్రత్యర్థి స్పిన్నర్ మొయిన్ అలీ విజృంభించిన చోట అతడు విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. తద్వారా జట్టు నిర్ణయానికి వ్యక్తిగతంగా బలయ్యాడు. బీసీసీఐ నష్ట నివారణ రవిశాస్త్రి వ్యాఖ్యలకు దుమారం రేగడంతో బీసీసీఐ నష్ట నివారణకు దిగింది. జడేజా పూర్తి ఫిట్నెస్తో ఉన్నందుకే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశామని ప్రకటించింది. ఈ మేరకు మెల్బోర్న్ సమయం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక వివరణ ఇచ్చింది. ‘ఎడమ భుజం గాయం నుంచి జడేజా కోలుకుంటున్నాడు. మెల్బోర్న్ టెస్టుకు అందుబాటులో ఉంటాడు. స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అతడికీ ఇబ్బంది తలెత్తింది. నవంబరు 2న ముంబైలో ఇంజక్షన్ తీసుకున్నాడు. తర్వాత సౌరాష్ట్ర తరఫున రంజీ ఆడి... ఎలాంటి ఇబ్బంది లేకుండా 64 ఓవర్లు వేశాడు. ఫిట్గా ఉన్నట్లు తేలడంతోనే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశాం’ అని పేర్కొంది. నవంబరు 30న సీఏ ఎలెవెన్తో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మరో ఇంజక్షన్ తీసుకున్నాడని వివరించింది. పెర్త్ టెస్టుకు ముందు నెట్స్లో జడేజా ప్రాక్టీస్ చేసినా... అది స్థాయికి తగినట్లు లేకపోవడంతో తుది జట్టులోకి తీసుకోలేదని పేర్కొంది. -
బిగిసింది పట్టు...
ఎదురుగా గుండెలు గుభేల్మనేలా కొండంత స్కోరు... కనీసం ఇద్దరు మూడంకెల స్కోరు చేస్తేనే దీటైన సమాధానం ఇవ్వగల పరిస్థితి! కానీ, వెస్టిండీస్... షమీ పేస్ను ఎదుర్కొనలేక, అశ్విన్ త్రయం స్పిన్కు తాళలేక చేతులెత్తేసింది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే వరుస కట్టారు! వెరసి... రాజ్కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. మిగిలి ఉన్న మూడు రోజుల ఆటలో ఎంత పోరాడినా నిలవడం ప్రత్యర్థికి కష్టమే! భారత్ శనివారమే మ్యాచ్ను ముగించినా ఆశ్చర్యం లేదు. రాజ్కోట్: ఏమాత్రం సవాలు విసరని బౌలింగ్ను ముందుగా బ్యాట్స్మెన్ ఆటాడుకున్నారు... అనంతరం అంతంతమాత్రం అనుభవం ఉన్న ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను బౌలర్లు కుప్పకూల్చారు! మొత్తమ్మీద సొంతగడ్డపై తమజట్టు ఎంత పటిష్టమైనదో చూపుతూ టీమిండియా రాజ్కోట్ టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. అద్భుత శతకంతో మొదటి రోజు యువ ఓపెనర్ పృథ్వీ షా వేసిన బలమైన పునాదిని శుక్రవారం రెండో రోజు విరాట్ కోహ్లి (230 బంతుల్లో 139; 10 ఫోర్లు), రవీంద్ర జడేజా (132 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) మరింత బలపరిచారు. వీరికి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (84 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడు తోడవడంతో తొలి ఇన్నింగ్స్ను భారత్ 649/9 వద్ద డిక్లేర్ చేసింది. బిషూ నాలుగు, లూయిస్ రెండు వికెట్లు పడగొట్టగా... గ్రాబియెల్, ఛేజ్, బ్రాత్వైట్లకు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం బ్యాటింగ్ దిగిన విండీస్... పేసర్ షమీ (2/11) ధాటికి, అశ్విన్ (1/32), జడేజా (1/9), కుల్దీప్ యాదవ్ (1/19)ల మాయకు కుదేలైంది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ 94/6తో నిలిచింది. రోస్టన్ ఛేజ్ (27 బ్యాటింగ్), కీమో పాల్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరుకు ఇంకా 555 పరుగులు వెనుకబడి ఉన్న ఆ జట్టు కనీసం ఫాలోఆన్ను తప్పించుకోవడమూ కష్టమే. నిలిచేవారేరి? ఆడేవారేరి? భీకరంగా సాగిన భారత బ్యాటింగ్కు పూర్తి భిన్నంగా నడిచింది పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్. ఏ బ్యాట్స్మన్ కూడా పట్టుమని 10 ఓవర్లు నిలిచేలా కనిపించలేదు. జట్టులో సీనియర్, కీలక బ్యాట్స్మన్, ఈ టెస్టుకు కెప్టెన్ అయిన ఓపెనర్ బ్రాత్వైట్ (2)... షమీ రెండో ఓవర్లోనే బౌల్డయ్యాడు. నోబాల్ అనే అనుమానంతో పలుమార్లు పరిశీలించినా, చివరకు థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. షమీ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ కీరన్ పావెల్ (1) వికెట్ల ముందు దొరికిపోయాడు. షై హోప్ (10), హేట్మైర్ (10) నిలదొక్కుకోవడానికి చూసినా అది అతి కొద్దిసేపే. అశ్విన్... హోప్ వికెట్లను గిరాటేశాడు. అతడి తదుపరి ఓవర్లోనే మిడాన్లోకి బంతిని కొట్టి పరుగుకు యత్నించిన హేట్మైర్... జడేజా డైరెక్ట్ హిట్కు రనౌటయ్యాడు. స్లిప్లో రహానే క్యాచ్తో సునీల్ ఆంబ్రిస్ (12)ను జడేజా వెనక్కుపంపాడు. వికెట్ కీపర్ డౌరిచ్ (10)ను కుల్దీప్ బలిగొన్నాడు. దీంతో విండీస్ 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఛేజ్కు జత కలిసిన కీమో పాల్... సిక్స్, ఫోర్తో దూకుడు చూపాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడో సెషన్లో 29 ఓవర్లను ఎదుర్కొన్న వెస్టిండీస్ 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రధాన బ్యాట్స్మెన్ అంతా ఔటైనందున శనివారం ఆ జట్టు లోయరార్డర్ను పడగొట్టడం భారత్కు పెద్ద కష్టమేమీ కాదు. తద్వారా భారీ ఆధిక్యం దక్కడం ఖాయం. అయితే, కోహ్లి ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడిస్తాడో? లేక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్కు దిగుతాడో చూడాలి. ఆ ముగ్గురూ ఆడుతూ పాడుతూ... ఓవర్నైట్ స్కోరు 364/4తో శుక్రవారం కొనసాగిన టీమిండియా స్కోరు కోహ్లి, పంత్ జోరైన బ్యాటింగ్తో చకచకా ముందుకు సాగింది. కోహ్లి అడపాదడపా షాట్లు కొట్టగా... రిషభ్ సహజ శైలిలో ఆడాడు. కీమో పాల్ బౌలింగ్లో ఫోర్, సిక్స్తో అర్ధ శతకం అందుకున్నాడు. తర్వాత ఛేజ్, బిషూల ఓవర్లలోనూ ఇదే తరహాలో బాది పరుగులు పిండుకున్నాడు. 18 బంతుల్లోనే అతడు వ్యక్తిగత స్కోరు 42 నుంచి 83కు చేరుకోవడం విశేషం. అవతలి ఎండ్లోని కోహ్లి అప్పటికి చేసివని 22 పరుగులే కావడం గమనార్హం. మరికాసేపటికే బిషూ బౌలింగ్లో ఫైన్ లెగ్లో బౌండరీ బాదిన కెప్టెన్ కెరీర్లో 24వ శతకాన్ని అందుకున్నాడు. అయితే, శతకం చేసే ఊపులో కనిపించిన పంత్... బిషూ గూగ్లీని షాట్ కొట్టే యత్నంలో షార్ట్ థర్డ్మ్యాన్లో పాల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 133 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జడేజా సైతం బ్యాట్ ఝళిపించడం తో లంచ్కు ముందే స్కోరు 500 దాటింది. లంచ్–టీ జడేజా సెషన్... విరామం నుంచి వస్తూనే లూయిస్ బౌలింగ్లో బౌండరీ బాదిన కోహ్లి ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగుల మార్కు దాటాడు. అదే ఊపులో బిషూ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కోహ్లి ఔటయ్యాక జడేజా విజృంభణ మొదలైంది. ఈ మధ్యలో అశ్విన్ (7), కుల్దీప్ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఫిఫ్టీ అనంతరం సిక్స్లు, ఫోర్లతో జడేజా మరింత ధాటిగా ఆడాడు. అతడికి ఉమేశ్ యాదవ్ (22; 2 సిక్స్లు) సహకరించాడు. 79 పరుగుల వద్ద దక్కిన లైఫ్ను సద్వినియోగం చేసుకుంటూ భారీ షాట్లతో 90ల్లోకి వచ్చాడు. కానీ, అప్పటికే 9 వికెట్లు పడటంతో అతడి సెంచరీ పూర్తవుతుందా? అనే అనుమానం కలిగింది. దీనికి తగ్గట్లే కొంత ఉత్కంఠ నెలకొన్నా షమీ (2 నాటౌట్) సహకరించాడు. బ్రాత్వైట్ బౌలింగ్లో మిడాఫ్ లోకి బంతిని కొట్టి పరుగు తీయడంతో టెస్టుల్లో జడేజా తొలి శతకం పూర్తయింది. ఆ వెంటనే కోహ్లి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. సొంతగడ్డపై జడేజాలం... ఇంగ్లండ్తో ఐదో టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శన, ఏడాది పైగా విరామంతో వన్డేల్లో చోటుతో ఆసియా కప్ ఫైనల్లో విలువైన పరుగులతో మళ్లీ జనం నాట్లో నానుతున్న జడేజా... సొంతగడ్డపై టెస్టులో శుక్రవారం అంతా తానే అయి కనిపించాడు. లోయరార్డర్ అండగా సిక్స్లు బాది తొమ్మిదేళ్ల కెరీర్లో తొలి శతకం నమోదుతో కర్ర సాము చేసిన ఈ ఆల్ రౌండర్... ప్రత్యర్థి ఇన్నింగ్స్లో ఓ రనౌట్ (హేట్మైర్), ఓ వికెట్ పడగొట్టాడు. ఇందులో రనౌట్ను కొంత విచిత్రం అనిపించేలా చేశాడు. అదెలాగంటే, అశ్విన్ బౌలింగ్లో హేట్మైర్ బంతిని మిడాన్లోకి ఆడి ఆంబ్రిస్ను పరుగుకు పిలిచాడు. కానీ, తర్వాత వెనక్కుతగ్గాడు.ఈలోగా ఆంబ్రిస్ స్ట్రయికర్ క్రీజు వద్దకు వచ్చేశాడు. దీంతో ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకేవైపు ఉండిపోయారు. బంతిని అందుకున్న జడేజా... అశ్విన్కు ఇవ్వకుండా వికెట్లను పడగొట్టేందుకు నింపాదిగా రాసాగాడు. అవకాశాన్ని గమనించిన హేట్మైర్ పరుగుకు యత్నించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ కంగారుపడగా, జడేజా వేగం పెంచి బంతిని వికెట్లకేసి కొట్టాడు. దగ్గరగా ఉన్నప్పటికీ త్రో తరహాలో బంతిని విసిరాడు. అది తగలకుంటే పరిస్థితి ఏమిటన్న రీతిలో అశ్విన్, కోహ్లి అతడికేసి చూడటం, తర్వాత కులాసాగా నవ్వడం గమనార్హం. కోహ్లి సంబరాలు లేకుండానే: సరైన సవాల్ ఉంటేనే కోహ్లికి మజానేమో? దీటైన ప్రత్యర్థిపై ఆడితేనే ఆనందమేమో...? శుక్రవారం అతడి బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంది మరి. టెస్టులంటే అమితాసక్తి చూపే భారత కెప్టెన్ అందులో సెంచరీ చేస్తే ఆకాశమే పాదాక్రాంతమైనట్లు రెండు చేతులూ చాచి గర్జనలాంటి అరుపుతో సంబరం చేసుకుంటాడు. రాజ్కోట్లో మాత్రం ఇవేమీ లేకుండానే అతడి శతకాభివాదం సాగిపోయింది.అసలు తాను మూడంకెలను చేరుకున్నాడా లేదా అని అభిమానులకు అనుమానం కలిగేలా అత్యంత సాధారణంగా బ్యాట్ను పైకెత్తాడు. ఈ శతకం అమ్మకు అంకితం... గతంలో 80లు, 90లు చేసినా సెంచరీలుగా మల్చలేకపోయా. ఈ రోజు మాత్రం ఎలాంటి చెత్త షాట్లు కొట్టదల్చుకోలేదు. అందుకే ఉమేశ్, షమీలతో ఎప్పటికప్పుడు మాట్లాడా. శతకం చేసి తీరాలని నాకు నేను సంకల్పించుకున్నా. స్థిరంగా ఆడకుంటే ఒత్తిడిలో పడతాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోదల్చుకున్నా. ఇంగ్లండ్లోనూ ఇదే ఆలోచనతో ఉన్నా. ఈ సెంచరీ మా అమ్మకు అంకితం. - జడేజా ►124 టెస్టుల్లో 24 సెంచరీలు చేసేందుకు కోహ్లి తీసుకున్న ఇన్నింగ్స్ల సంఖ్య. బ్రాడ్మన్ (66 ఇన్నింగ్స్) మాత్రమే ఇంతకంటే వేగంగా 24 సెంచరీలు చేశాడు. సచిన్కు 125, గావస్కర్కు 128 ఇన్నింగ్స్లు పట్టాయి. ►30 టెస్టులు, వన్డేలు కలిపి కెప్టెన్గా కోహ్లి సెంచరీల సంఖ్య. నాయకుడిగా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పాంటింగ్ (41), గ్రేమ్ స్మిత్ (33) అతనికంటే ముందున్నారు. ►24 టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. తాజా శతకంతో సెహ్వాగ్ (23)ను అధిగమించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (51), రాహుల్ ద్రవిడ్ (36), సునీల్ గావస్కర్ (34) మాత్రమే అతనికంటే ఎక్కువ సెంచరీలు చేశారు. ►3 వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు చేసిన కోహ్లి ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. ►1 జడేజాకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి సెంచరీ. తన 218వ మ్యాచ్లో అతను ఈ మార్క్ను అందుకున్నాడు ► 649 టెస్టుల్లో విండీస్పై భారత్కిదే అత్యధిక స్కోరు. గత రెండేళ్లలో భారత్ 600 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం ఇది ఎనిమిదోసారి. -
భారత్- అఫ్గానిస్తాన్ మ్యాచ్ టై
-
ఊరించి... ఉత్కం‘టై’
దుబాయ్: చివరి ఓవర్లో విజయానికి భారత్కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్ ఈ మ్యాచ్లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్ సగర్వంగా ఆసియా కప్ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు తొలి వికెట్కు 110 పరుగులు జోడించారు. నేడు జరిగే చివరి సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్తో ఆడుతుంది. రాణించిన నబీ... అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచిన అంశం ఓపెనర్ షహజాద్ అద్భుత బ్యాటింగ్. టాప్–6 లో మిగతా ఐదుగురు విఫలమైన చోటు అతనొక్కడే మెరుపు ప్రదర్శనతో జట్టును నడిపించాడు. దీంతో పాటు చివర్లో నబీ ఆడిన ఇన్నింగ్స్ అఫ్గాన్కు గౌరవప్రదమైన స్కోరును అందించింది. అనుభవం తక్కువగా ఉన్న భారత పేసర్లు తడబడటంతో షహజాద్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 పరుగుల వద్ద మిడాఫ్లో సునాయాస క్యాచ్ను రాయుడు వదిలేయడంతో బతికిపోయిన షహజాద్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది. అయితే స్పిన్నర్లు రంగప్రవేశం చేసి మరో ఎండ్లో అఫ్గాన్ లైనప్ను దెబ్బ తీశారు. 17 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. అహ్మదీ (5), రహ్మత్ (3)లను జడేజా ఔట్ చేయగా... వరుస బంతుల్లో హష్మతుల్లా (0), అస్గర్ (0)లను కుల్దీప్ పెవిలియన్ పంపించాడు. అయితే షహజాద్ మాత్రం జోరు తగ్గించలేదు. తన ధాటిని కొనసాగించిన అతను చహర్ బౌలింగ్లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టి 88 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆ సమయంలో జట్టు స్కోరు 131 కాగా, షహజాద్వే 103 పరుగులు ఉండటం అతని బ్యాటింగ్ దూకుడును చూపిస్తోంది. ఎట్టకేలకు జాదవ్ ఈ మెరుపు బ్యాటింగ్కు ముగింపు పలికాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాఫ్లో క్యాచ్ ఇవ్వడంతో షహజాద్ ఆట ముగిసింది. అయితే మరో ఎండ్లో నబీ కూడా ధాటిని ప్రదర్శించాడు. 45 బంతుల్లోనే అతనూ హాఫ్ సెంచరీ సాధించి 48వ ఓవర్లో వెనుదిరిగాడు. చివరి పది ఓవర్లలో అఫ్గానిస్తాన్ 63 పరుగులు చేసింది. సెంచరీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్కు కొత్త ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన రాహుల్, రాయుడు అఫ్గాన్ బౌలర్లపై చెలరేగారు. 10 పరుగుల వద్ద రాయుడుకు అదృష్టం కలిసొచ్చింది. ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యే అవకాశం కనిపించినా... అఫ్గాన్ జట్టు రివ్యూ కోరకపోవడంతో బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు దూసుకుపోయారు. ముఖ్యంగా గుల్బదిన్ వేసిన 4 ఓవర్ల స్పెల్లో భారత్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు రాబట్టింది. ముందుగా 43 బంతుల్లో రాయుడు అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయిన అతను వెనుదిరిగాడు. తర్వాతి బంతికే హాఫ్ సెంచరీని చేరుకున్న రాహుల్ కూడా తక్కువ వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. దురదృష్టవశాత్తూ ధోని (8) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అహ్మదీ బౌలింగ్లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించగా... భారత్ అప్పటికే రివ్యూ కోల్పోవడంతో మరో అవకాశం లేకపోయింది. రీప్లేలో బంతి లెగ్స్టంప్కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. పాండే (8) మరోసారి తనకు లభించిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. జాదవ్ (19) రనౌట్ కాగా, కార్తీక్ (66 బంతుల్లో 44; 4 ఫోర్లు) కూడా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత అనుభవం లేని భారత బ్యాటింగ్ తీవ్ర ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. -
బంగ్లాపై భారత్ ఘనవిజయం
-
జడేజా పరుగుల వేగం కంటే...
కర్ణాటక, బొమ్మనహళ్లి : క్రికెటర్ జడేజా పరుగుల వేగం కంటే దేశంలో పెట్రోల్ ధర వేగంగా పెరుగుతోందని ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఇంగ్లాండ్లో జరుగుతున్న భారత్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా చేసిన పరుగుల కంటే భారత దేశంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు. జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన రవీంద్ర జడెజా 86 పరుగులు చేశారని, దేశంలో పెట్రోల్ ధర రూ. 87 ఉందని ఆమె తన ట్వీట్లో ఎద్దేవా చేశారు. -
ఎటువైపో ఈ ‘టెస్టు’
ఓపెనింగ్ శుభారంభం ఇవ్వలేదు. టాపార్డర్ సంయమనంతో ఆడలేదు. ఇక భారత మిడిలార్డర్ ఏం చేస్తుంది? టెయిలెండర్ల ఆట ఎంతసేపు... అని తేలిగ్గా నిట్టూర్చిన క్రికెట్ అభిమానులకు తెలుగు తేజం విహారి, జడేజా షాక్ ఇచ్చే ప్రదర్శన ఇచ్చారు. మొదట కుదురుగా ఆడుకున్నారు. తర్వాత ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుండటంతో ఈ టెస్టు రసకందాయంగా మారింది. ఎటువైపు మొగ్గేది నేటి ఆటతో తేలుతుంది. లండన్: ఇక ఆఖరి టెస్టు ఫలితం ఏకపక్షం కాబోదు. ఆతిథ్య జట్టే గెలుస్తుందన్న అంచనాలు నిలబడవు. గెలిచే బరిలో భారత్ కూడా ఉండే అవకాశముంది. ఇదంతా ఇద్దరి ఆటతీరుతో మారిపోయింది. ఆరు వికెట్లు పారేసుకున్న భారత బ్యాటింగ్కు తొలి టెస్టు ఆడుతోన్న తెలుగు తేజం గాదె హనుమ విహారి (124 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) ఊతమిస్తే... లోయర్ మిడిలార్డర్లో రవీంద్ర జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిపత్యానికి గండిపడింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లలో 292 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆతిథ్య జట్టుకు కేవలం 40 పరుగుల ఆధిక్యమే లభించింది. అండర్సన్, స్టోక్స్, మొయిన్ అలీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్టు ఇన్నింగ్స్ ఆడుతోన్న కుక్ (125 బంతుల్లో 46 బ్యాటింగ్; 3 ఫోర్లు)తోపాటు కలిసి కెప్టెన్ రూట్ (43 బంతుల్లో 29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. షమీ, జడేజా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అర్ధ శతకాలతో... ఓవర్నైట్ స్కోరు 174/6తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్ను విహారి, జడేజాలిద్దరూ ఆదుకున్నారు. తొలి సెషన్లో వీరిద్దరు నెలకొల్పిన కీలక భాగస్వామ్యం ఇంగ్లండ్ ఆధిక్యాన్ని బాగా తగ్గించింది. ముందుగా క్రీజులో పాతుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరు ఆ తర్వాత పరుగులు జోడించడంపై దృష్టి పెట్టారు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ ఎంత కవ్వించినా షాట్ల జోలికి వెళ్లకుండా నింపాదిగా ఆడారు. తొలి గంటలో 33 పరుగులు వచ్చాయి. అలా 63వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. అడపాదడపా జడేజా బ్యాట్కు పనిచెప్పినా... విహారి మాత్రం కుదురుగా ఆడాడు. ఈ క్రమంలోనే తెలుగు కుర్రాడు తన తొలి టెస్టులోనే 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తద్వారా కరుణ్ నాయర్ను కాదని కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేశాడు. ఈ సెషన్ సాగుతున్న కొద్దీ ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైంది. అయితే లంచ్ విరామానికి ముందు ఎట్టకేలకు మొయిన్ అలీ ఈ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 237 పరుగుల వద్ద విహారి కీపర్ బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఏడో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో ఇషాంత్ క్రీజ్లోకి రాగా లంచ్ తర్వాత పరుగుల బాధ్యతను పూర్తిగా జడేజా తీసుకున్నాడు. అవతలి బ్యాట్స్మెన్కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు. 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 332; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) కరన్ 37; ధావన్ ఎల్బీడబ్ల్యూ (బి) బ్రాడ్ 3; పుజారా (సి) బెయిర్ స్టో (బి) అండర్సన్ 37; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 49; రహానే (సి) కుక్ (బి) అండర్సన్ 0; విహారి (సి) బెయిర్స్టో (బి) మొయిన్ అలీ 56; రిషభ్ పంత్ (సి) కుక్ (బి) స్టోక్స్ 5; జడేజా (నాటౌట్) 86; ఇషాంత్ శర్మ (సి) బెయిర్స్టో (బి) మొయిన్ అలీ 4; షమీ (సి) బ్రాడ్ (బి) రషీద్ 1; బుమ్రా (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (95 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–6, 2–70, 3–101, 4–103, 5–154, 6–160, 7–237, 8–249, 9–260, 10–292. బౌలింగ్: అండర్సన్ 21–7–54–2, బ్రాడ్ 20–6–50–1, స్టోక్స్ 16–2–56–2, కరన్ 11–1–49–1, మొయిన్ అలీ 17–3–50–2, రషీద్ 10–2–19–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ (బ్యాటింగ్) 46; జెన్నింగ్స్ (బి) షమీ 10; మొయిన్ అలీ (బి) జడేజా 20; రూట్ (బ్యాటింగ్) 29, ఎక్స్ట్రాలు 9; మొత్తం (43 ఓవర్లలో 2 వికెట్లకు) 114. వికెట్ల పతనం: 1–27, 2–62. బౌలింగ్: బుమ్రా 12–4–26–0, ఇషాంత్ శర్మ 7–3–11–0, షమీ 10–3–32–1, జడేజా 14–2–36–1. శభాష్... విహారి దేశవాళీ మ్యాచ్ల్లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకునే హనుమ విహారి అరంగేట్రం చేసిన అంతర్జాతీయ మ్యాచ్లో జట్టును ఆదుకున్నాడు. సరిగ్గా టెస్టులకు సరిపోయే ఇన్నింగ్స్ను తన మొదటి టెస్టులోనే పరిచయం చేశాడు. ఆరో నంబర్లో సరిగ్గా నప్పే బ్యాట్స్మన్గా టీమ్ మేనేజ్మెంట్లో ఆశలు పెంచాడు. జడేజాతో కలిసి తొలి సెషన్లో విహారి చేసిన అర్ధశతక పోరాటం ఏ మాత్రం తీసిపోనిది. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇన్నింగ్స్ను బాధ్యతాయుత బ్యాటింగ్తో గాడిన పెట్టాడు. వికెట్ను కాపాడుకుంటూ... ఒక్కో పరుగును జత చేస్తూ... పరుగుల పయనాన్ని అర్ధసెంచరీ దాకా సాగించాడు. జడేజా కూడా విహారికి అండగా నిలువడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ జోడీని తొందరగా విడగొట్టేందుకు కెప్టెన్ రూట్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా విహారి ఏకాగ్రతను కోల్పోలేదు. ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రం టెస్టులోనే అర్ధసెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్మెన్గా విహారి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ, ద్రవిడ్లు ఒకే టెస్టులో ఈ ఘనత సాధించారు. ఈ దిగ్గజాల సరసన విహారి నిలిచాడు. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్కు మొదటి ఇన్సింగ్స్లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
జడేజా వరుస క్యాచ్ల్లో విఫలం
-
జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకుని టీమ్ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్ ట్రోఫీకి దూరమైన అశ్విన్ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్ ఇండియా స్క్వాడ్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్కు కరుణ్ నాయర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా జట్టు మార్చ్ 14 నుంచి 18 వరకు నాగపూర్లో జరగనున్న మ్యాచ్లో రంజీ ట్రోఫీ చాంపియన్స్తో తలపడనుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు: కరుణ్ నాయర్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, ఆర్. సమర్థ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎస్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అన్మోల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్పుత్, నవ్దీప్ సైనీ, అతీత్ -
6,7,8 నిలిచేవారెవరు?
2014 డిసెంబర్ 13... వేదిక అడిలైడ్. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మ్యాచ్ చివరి రోజు లక్ష్యం 364. మురళీ విజయ్ (99), విరాట్ కోహ్లి (141) అద్భుతంగా ఆడుతున్నారు. భారత్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇంతలో శతకం చేజార్చుకుంటూ విజయ్ అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సింది 122 పరుగులే. మరో ఎండ్లో కోహ్లి పాతుకుపోయాడు. కానీ... తర్వాత అతడికి సహరించేవారు కరవయ్యారు. 78 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. (ఈ జట్టులో అశ్విన్, జడేజా లేరు). 2015 నవంబర్... చండీగఢ్లో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జడేజా (38), అశ్విన్ (20) ఎనిమిదో వికెట్కు 42 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్లో వీరిద్దరిదే రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండు జట్ల తరఫున స్వల్ప స్కోర్లు నమోదైన ఈ టెస్టులో భారత్ 108 పరుగులతో గెలిచింది. ...ఈ రెండు ఉదాహరణలు స్వదేశంలో అయినా, విదేశంలో అయినా టెస్టుల్లో 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగినవారి ప్రాధాన్యతను చాటుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేపడితే ప్రధాన బ్యాట్స్మెన్కు అండగా నిలుస్తూ, తమవంతుగా పరుగులు చేస్తూ భారీ స్కోరుకు దోహదపడటం, రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు నిచ్చెనలా నిలవడం ఈ స్థానాల్లో ఆడేవారి బాధ్యత. ఒకవేళ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమైతే ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పిస్తూ గౌరవప్రదమైన స్కోరుకు పాటుపడటం వీరి విధి. స్వదేశంలో ఈ విషయంలో మన జట్టుకు ఢోకా లేదు. కూర్పు మారిపోయి అదనంగా పేసర్ను ఆడించాల్సిన విదేశాల్లోనే ఈ ఇబ్బందంతా. భారత్ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి ప్రకారం ఓపెనర్లు, పుజారా, కోహ్లి, రహానే/రోహిత్లు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా తొలి అయిదు స్థానాల్లో వస్తారు. ఆరో నంబరు వికెట్ కీపర్గా వృద్ధిమాన్ సాహాది. ఇక్కడ ఎలాగూ స్పిన్ పిచ్లే కాబట్టి అశ్విన్, జడేజా 7, 8 స్థానాల్లో ఆడేవారు. మ్యాచ్ పరిస్థితులరీత్యా కొంత మారినా అటుఇటుగా ఈ ముగ్గురిది మాత్రం ఇదే బ్యాటింగ్ ఆర్డర్. బయట మాత్రం ఇది చెల్లుబాటు కాదు. విదేశాల్లో కూర్పు మార్పు... అయిదుగురు బ్యాట్స్మెన్, కీపర్, ఒక ఆల్రౌండర్, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు. బహుశా సఫారీ టూర్లో ఇదే భారత్ వ్యూహం. అలవాటైన వికెట్లపై మన బ్యాట్స్మన్ స్వదేశంలో పరుగుల వరద పారించేవారు. లోయర్ ఆర్డర్ ఆడినా, ఆడకున్నా ప్రభావం కనిపించేది కాదు. విదేశాల్లో విజయం సాధించాలంటే మాత్రం సమష్టిగా ఆడాల్సిందే. చివరి శ్రేణిలోని బౌలింగ్ ఆల్రౌండర్లు... టాప్, మిడిలార్డర్కు దన్నుగా నిలవాల్సిందే. వారు తమవంతుగా 20లు 30లైనా జత చేయాలి. అయితే పూర్తి పేస్ పిచ్లుండే దక్షిణాఫ్రికాలో ఒక్క స్పిన్నర్తోనే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 6, 7 స్థానాల్లో సాహా, హార్దిక్ పాండ్యా, 8లో అశ్విన్ వస్తారు. సరిగ్గా వీరే గెలుపునకు కీలకం అవుతారు. దేశంలో నంబర్వన్ టెస్టు కీపర్గా పేరున్న సాహా... మూడేళ్ల క్రితం ఆసీస్లో కీలక సమ యంలో అనవసర దూకుడు కనబర్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది వెస్టిండీస్లో శతకం సాధించి వాటికి తగిన జవాబిచ్చాడు. తెలివైన క్రికెటర్గా అశ్విన్ ఎక్కడైనా ఉపయోగపడేవాడే. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడిని కాచుకుంటూ వీరు నమోదు చేసే భాగస్వామ్యాలే జట్టుకు విలువైనవిగా మారతాయనడంతో సందేహం లేదు. హార్దిక్ ఏం చేస్తాడో...? పేస్ ఆల్రౌండర్గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇటీవలే లంకపై అరంగేట్రం చేసిన పాండ్యా శతకం కూడా సాధించాడు. భారీ హిట్టింగ్తో బ్యాట్స్మన్గా నిరూపించుకున్న పాండ్యా... తన పేస్ పదును చూపాల్సిన సమయం వచ్చింది. మ్యాచ్ స్థితికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ‘కోహ్లికి పాండ్యా ఒక ఆయుధం’ అన్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలకూ సార్థకత చేకూర్చిన వాడవుతాడు. అచ్చొచ్చే(నా) ‘9’ 9... ఈ సంఖ్యను చాలామంది ఇష్టపడతారు. ఇదే సంఖ్య సఫారీ పర్యటనలో భారత జట్టుకూ ఎంతోకొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థానంలో బ్యాటింగ్ వచ్చేది పేసర్ భువనేశ్వర్. కొంతకాలంగా బౌలింగ్లో 140 కి.మీ. వేగం అందుకుంటున్న భువీ బ్యాటింగ్లోనూ ఓ చేయి వేస్తున్నాడు. శ్రీలంకతో వన్డేలో బ్యాట్స్మెన్ విఫలమైన చోట అతడు సాధించిన అర్ధ సెంచరీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. స్ట్రోక్స్ ఆడటంలోనూ భువీ మెరుగయ్యాడు. ఈ నేప థ్యంలో దక్షిణాఫ్రికాలోనూ జట్టు బ్యాటింగ్ ప్రయోజనాలకు ఉపయోగపడతామో చూడాలి. చేజారితే మ్యాచ్ పోయినట్లే... అవి అసలు సిసలు పేస్ పిచ్లు... బ్యాట్ అంచులకు తగిలిన బంతి స్లిప్లోకి వచ్చేందుకు క్షణం కూడా పట్టదు. అలాంటివాటిని ఒడిసిపట్టాలంటే ఫీల్డర్కు ఓపికతో పాటు తీక్షణత అవసరం. గతంలో భారత్కు ఈ ఏరియాలో రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ వంటివారు పెట్టని కోటగా ఉండేవారు. ప్రస్తుత జట్టులో రహానే తప్ప... స్లిప్ స్పెషలిస్టుల లోటు కనిపిస్తోంది. ఇతడికి తోడుగా మరో చురుకైన ఆటగాడిని ఎంచుకోవాలి. కోహ్లి... ఇటీవలి శ్రీలంక సిరీస్లో తరచూ స్లిప్ ఫీల్డర్లను మార్చి ప్రయోగం చేసినా ఫలితం రాబట్టలేకపోయాడు. పైగా విలువైన క్యాచ్లు నేలపాలయ్యాయి. ఇదే తీరు ఎల్గర్, ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ వంటి బ్యాట్స్మన్ ఉన్న దక్షిణాఫ్రికాపైనా కొనసాగితే విజయం గురించి ఆలోచించడం సాహసమే అవుతుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేసే ఇలాంటివారి క్యాచ్లు చేజారిస్తే మ్యాచ్లో తిరిగి కోలుకోవడం కష్టం. ధావన్ సిద్ధం... జడేజా అనుమానం! భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అస్వస్థత జట్టును కలవరపరుస్తోంది. రేపటి నుంచి కేప్టౌన్ టెస్టు ప్రారంభమవుతుండగా... అతను వైరల్ జ్వరం బారిన పడ్డాడు. ‘ధావన్ ఫిట్గా ఉన్నాడు. చీలమండ గాయంతోనే సఫారీకి బయల్దేరిన అతను తొలి టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ తెలిపింది. రెండు రోజులుగా వైరల్ జ్వరం బారిన పడిన జడేజాను బీసీసీఐ వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతను తుది జట్టులో ఉండేది లేనిది శుక్రవారమే తెలుస్తుంది. -
అశ్విన్, జడేజా శైలి మార్చుకోవాలి: రహానే
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలిద్దరు దక్షిణాఫ్రికా పిచ్లకు అనుగుణంగా తమ బౌలింగ్ శైలి మార్చుకోవాలని భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానే సూచించాడు. జాతీయ టీవీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘సొంతగడ్డపైనే కాదు విదేశాల్లోనూ వాళ్లిద్దరు విజయవంతం కావాలి. భారత పిచ్లపై ఎలా బౌలింగ్ వేయాలో వాళ్లకు బాగా తెలుసు. అలాగే విదేశీ పిచ్లపై కూడా తెలుసుకోవాలి. మొయిన్ అలీ (ఇంగ్లండ్), లయన్ (ఆసీస్) దేశం మారితే వాళ్ల శైలి మార్చుకుంటారు. భిన్నమైన శైలితో ఫలితాలు రాబడతారు’ అని అన్నాడు. కెప్టెన్ కోహ్లి, కోచ్ రవి శాస్త్రిలు జట్టులోని ఆటగాళ్లందరికీ మద్దతుగా ఉంటారని, బాగా రాణించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చాడు. -
అశ్విన్, జడేజాలకు మళ్లీ నిరాశ
ముంబై: సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు మరోసారి వన్డే జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే ఆరు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనే 17 మంది సభ్యుల భారత జట్టును శనివారం ప్రకటించారు. ఈ పర్యటనలో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు మణికట్టు స్పిన్ ద్వయం యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లపైనే సెలెక్టర్లు నమ్మకముంచారు. వీరికితోడుగా అక్షర్ పటేల్ను తీసుకున్నారు. గాయం కారణంగా శ్రీలంక సిరీస్కు దూరమైన బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ చోటు నిలబెట్టుకోగా... ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ పునరాగమనం చేశాడు. బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తొలి విదేశీ పర్యటన చేయనున్నాడు. ఇటీవల టెస్టు జట్టుకే పరిమితం చేస్తున్న పేసర్ మొహమ్మద్ షమీని వన్డేలకూ పరిగణనలోకి తీసుకోవడం విశేషం. లంకతో వన్డేలకు జట్టులోకి ఎంపిౖకైన సిద్దార్థ్ కౌల్ను పక్కన పెట్టారు. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 1, 4, 7, 10, 13, 16 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, షమీ, బుమ్రా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్. -
'నవ' చరిత్రకు 'ఏడు' కావాలి
టీమిండియా బౌలర్లు లంక తొలి ఇన్నింగ్స్ను ముగించారు. బ్యాట్స్మెన్ ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. మళ్లీ ఆఖరి రోజు బౌలర్ల వంతు వచ్చేసింది. ఢిల్లీ టెస్టు గెలిచేందుకు... మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో కైవసం చేసుకునేందుకు ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది భారత్. పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఐదో రోజు మూడో సెషన్కు ముందే లంకను చుట్టేసినా ఆశ్చర్యం లేదు! న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్ విజయానికి భారత్ మూడు (3 వికెట్లు) అడుగులు వేసింది. మూడో టెస్టులో ఇక ఒక రోజు ఆటే మిగిలుంది. 7 వికెట్లు అడ్డుగా ఉన్నాయి. కాలుష్యం కాటేయకపోతే... ఆటలో అంతరాయం లేకపోతే... ఆఖరి టెస్టును, 2–0తో సిరీస్ను... గెలుచుకునేందుకు బౌలర్లు చెమటోడ్చితే చాలు! సఫారీ పర్యటనకు టీమిండియా కొండంత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావొచ్చు. ఒకవేళ అనూహ్య పరిస్థితుల నడుమ ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా భారత్ 1–0తో సిరీస్ను సొంతం చేసుకుంటుంది. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా తొమ్మిది సిరీస్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా రికార్డును సమం చేసి ‘నవ’ చరిత్రను సృష్టిస్తుంది. మొదట 356/9 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 వద్ద ముగిసింది. కెప్టెన్ చండిమాల్ (361 బంతుల్లో 164; 21 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్ బెస్ట్ స్కోరు చేశాడు. ఇషాంత్ (3/98) బౌలింగ్లో చివరి వికెట్గా నిష్క్రమించాడు. తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్లో 52.2 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ధావన్ (91 బంతుల్లో 67; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (58 బంతుల్లో 50; 3 ఫోర్లు), రోహిత్ శర్మ (49 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వేగంగా... వన్డేలాగా.. భారత ఆటగాళ్లు ఒకే రోజు బంతితో, బ్యాట్తో ప్రతాపం చూపారు. ఆఖరి టెస్టులో ఆధిపత్యం చాటారు. తొలి ఇన్నింగ్స్లో 163 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న భారత్ రెండో ఇన్నింగ్స్లో ఓవర్కు 4.7 రన్రేట్ చొప్పున పరుగులు చేసింది. లంచ్కు ముందే... 29 పరుగులకే విజయ్ (9), రహానే (10) వికెట్లను కోల్పోయినప్పటికీ మ్యాచ్లో మరింత పట్టుబిగించేందుకు ధావన్, పుజారా (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) వేగం పెంచారు. మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 30వ ఓవర్లో 100 పరుగులు దాటించారు. అనంతరం కాసేపటికే పుజారాను డిసిల్వా అవుట్ చేశాడు. దీంతో క్రీజులో ధావన్కు జతయిన కెప్టెన్ కోహ్లి ధాటిగా ఆడాడు. అతని అండతో ధావన్ 83 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ధావన్ నిష్క్రమణ తర్వాత రోహిత్ శర్మ రావడంతో స్కోరు పుంజుకుంది. కోహ్లి, రోహిత్లు వన్డే తరహాలో పరుగులు చేశారు. కోహ్లి 55 బంతుల్లో 3 ఫోర్లతో అర్ధసెంచరీ చేసిన వెంటనే గమగే బౌలింగ్లో అవుటయ్యాడు. తర్వాత జడేజా క్రీజులోకి వచ్చాడు. రోహిత్ అర్ధ శతకం పూర్తికాగానే కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ లంకకు 410 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జడేజా 5-2-5-2 రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను జడేజా దెబ్బమీద దెబ్బ తీశాడు. తన ఐదు ఓవర్ల స్పెల్లో ఓపెనర్ కరుణరత్నే (13), నైట్ వాచ్మన్ లక్మల్ (0)లను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు షమీ వేసిన అద్భుత బౌన్సర్ను ఎదుర్కోలేక సమరవిక్రమ (5) గల్లీలో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా విజృంభణకు శ్రీలంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ►1 మూడు టెస్టుల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా, ఓవరాల్గా నాలుగో క్రికెటర్గా కోహ్లి (610 పరుగులు) గుర్తింపు పొందాడు. గూచ్ (ఇంగ్లండ్; 752 పరుగులు భారత్పై 1990లో), లారా (విండీస్; 688 పరుగులు శ్రీలంకపై 2001లో), మొహమ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్; 665 పరుగులు విండీస్పై 2006లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ► 3 మూడు టెస్టుల సిరీస్లో ఐదు లేదా అంతకంటే తక్కువ ఇన్నింగ్స్ ఆడి 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో క్రికెటర్ కోహ్లి. బ్రాడ్మన్ (806 పరుగులు దక్షిణాఫ్రికాపై 1931లో), యూసుఫ్ ( 665 పరుగులు విండీస్పై 2006లో) మొదటి ఇద్దరు. ►1ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ కోహ్లి. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 243, రెండో ఇన్నింగ్స్లో 50 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు గావస్కర్ (289 పరుగులు; 107, 182 నాటౌట్ విండీస్పై 1978లో కోల్కతాలో) పేరిట ఉంది. ► 7 ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, అర్ధ సెంచరీ చేసిన ఏడో కెప్టెన్ కోహ్లి. గతంలో గావస్కర్, గూచ్, టేలర్ (ఆస్ట్రేలియా), ఫ్లెమింగ్ (న్యూజిలాండ్), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), పాంటింగ్ (ఆస్ట్రేలియా) ఈ ఘనత సాధించారు. ► 1 భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్లో మూడుసార్లు 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్ కోహ్లి. 2014–2015 బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో 692 పరుగులు (నాలుగు టెస్టుల్లో), గతేడాది ఇంగ్లండ్పై 655 పరుగులు (ఐదు టెస్టుల్లో) చేశాడు. గావస్కర్, ద్రవిడ్ రెండుసార్లు ఇలా చేశారు. ► 3 క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్ కోహ్లి. ఈ ఏడాది 46 మ్యాచ్ల్లో 2,818 పరుగులు చేశాడు. లంకతో వన్డేలు, టి20 లకు విశ్రాంతి తీసుకోవడంతో అతను ఈ ఏడాది చివరి మ్యాచ్ ఆడేశాడు. సంగక్కర (2014లో 48 మ్యాచ్ల్లో 2,868 పరుగులు), పాంటింగ్ (2005లో 46 మ్యాచ్ల్లో 2,833 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
అశ్విన్, జడేజాలకు మొండిచేయి
న్యూఢిల్లీ: సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు సెలక్షన్ కమిటీ మళ్లీ మొండిచేయి చూపింది. న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు వారిద్దరిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అశ్విన్ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున మ్యాచ్లు ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో జట్టు సభ్యులైన బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్, పేస్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, షమీలను కివీస్ సిరీస్ కోసం తప్పించారు. అయితే వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్, యువ పేసర్ శార్దుల్ ఠాకూర్లకు జట్టులో స్థానం కల్పించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. తన భార్య అనారోగ్యం వల్ల అతను ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఆడలేదు. వెస్టిండీస్లో పర్యటించిన కార్తీక్ చివరి సారిగా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 32 ఏళ్ల ఈ వికెట్ కీపర్ ఆసీస్తో ముగిసిన టి20 సిరీస్కు ఎంపికైనప్పటికీ... ఆడే అవకాశం రాలేదు. ఈ నెల 22న ముంబైలో జరిగే తొలి వన్డేతో కివీస్తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. 25న పుణేలో రెండో వన్డే, 29న కాన్పూర్లో మూడో వన్డే జరుగుతాయి. భారత వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రహానే, మనీశ్ పాండే, జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, అక్షర్, కుల్దీప్ యాదవ్, చహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్. -
నా టాప్ ర్యాంకుకు వీరే కారణం: జడేజా
న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్ లేపిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తను ఈ ప్రతిభ సాధించడానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలే కారణమని అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న జడేజా.. తాజా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్ లో ఆల్ రౌండర్ల విభాగంలో కూడా ప్రథమ స్థానం సాధించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిభ సాధించడానికి కోహ్లి, ధోనిలే కారణమని జడేజా ట్వీట్ చేశాడు. ‘ధోని, కోహ్లితో పాటు తన ఫోటోకు క్యాఫ్షన్గా నా ప్రయాణంలో టెస్టు ఆల్రౌండర్, బౌలింగ్ విభాగంలో తొలి స్థానం దక్కించుకోవడం ధోని, కోహ్లి, నా అభిమానులు, బీసీసీఐ, టీమిండియా మద్దతు వల్లే సాధ్యమైందని’ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన జడేజా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 438 రేటింగ్ పాయింట్లతో జడేజా టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. My humble journey 2 be #1 Test AllRounder & bowler was possible due 2 @msdhoni @imVkohli, my fans & family #bcci #icc #teamindia #rajputboy pic.twitter.com/hoGdslikT4 — Ravindrasinh jadeja (@imjadeja) August 8, 2017 -
అదే జోరు... అదే ఫలితం..
-
ఈ జట్టు ఇంకా దూసుకెళ్తుంది
వరుస టెస్టుల్లో 600 పైచిలుకు పరుగులు చేసిన భారత జట్టుకు ఎదురీదడం అంత సులభం కాదు. రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కు భారీ ఆధిక్యం లభించింది. అయితే ఫాలోఆన్లో కరుణరత్నే, కుశాల్ మెండిస్లు పోరాడారు. ఇది పరాజయాన్ని ఆలస్యం చేస్తుందే తప్ప ఓటమిని దూరం చేయదని వారిద్దరికి బాగా తెలుసు. ఇక్కడ వాతావరణం తప్ప ఇంకేదీ లంకను ఆదుకోలేదు. నిజానికి ఈ ఇద్దరూ బాగా ఆడారు. ఓపెనర్ కరుణరత్నే చక్కని స్ట్రోక్స్తో అలరించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. ఇక మెండిస్ కూడా అంతే. గతేడాది ఇతను ఆస్ట్రేలియాపై 176 పరుగులు బాదిన ప్రదర్శనను మర్చిపోలేం. ఈ టెస్టులో అతను స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆడుతున్నంత సేపు స్పిన్నర్లపై పట్టు కనబరిచాడు. డ్రైవ్, కట్ ఇలా చక్కని షాట్లు అతని బ్యాట్ నుంచి జాలువారాయి. మెండిస్ నిష్క్రమణ తర్వాత కరుణరత్నే, మాథ్యూస్ల భాగస్వామ్యం కూడా లంక ఇన్నింగ్స్ను కాసేపు నడిపించింది. అయితే భారీ ఆధిక్యం దృష్ట్యా భారత శిబిరాన్ని ఇదేమంత కలవరపర్చలేదు. స్వల్ప విరామంలో జడేజా కరుణరత్నేతో పాటు మాథ్యూస్ను బోల్తాకొట్టించడంతో ఇక లంక పతనం ఊపందుకుంది. ఎడం చేతి బ్యాట్స్మెన్పై రౌండ్ ద వికెట్ బౌలింగ్తో జడేజా ఫలితాలు రాబట్టాడు. ఈ మ్యాచ్ కూడా నాలుగు రోజుల్లోనే ముగియడానికి స్పిన్నర్లే కారణం. బౌలింగ్, బ్యాటింగ్, పుష్కలమైన ఆల్రౌండ్ నైపుణ్యమున్న ఈ జట్టు (భారత్) ఇక ముందు కూడా మరిన్ని విజయాలు సాధిస్తుంది. సునీల్ గావస్కర్ -
అదే జోరు... అదే ఫలితం
►రెండో టెస్టులోనూ భారత్దే విజయం ►శ్రీలంకపై ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో గెలుపు ►సిరీస్ 2–0తో కైవసం ►జడేజా మాయాజాలం ►12 నుంచి చివరి టెస్టు రెండేళ్ల క్రితం శ్రీలంకలోనే భారత్ జైత్రయాత్ర మొదలైంది. అప్పటి నుంచి టీమిండియా వరుస సిరీస్ విజయాలతో దూసుకెళుతోంది. ఈ పర్యటనలో ఇన్నింగ్స్ తేడాతో... చరిత్రకెక్కే విజయాన్ని సాధించి భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్నూ కైవసం చేసుకుంది. తద్వారా వరుసగా అత్యధిక సిరీస్లు గెలిచిన జట్ల జాబితాలో ఇంగ్లండ్ (8) సరసన సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మరో సిరీస్ గెలిస్తే 9 వరుస సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ అందుకుంటుంది. కొలంబో: లంకగడ్డపై భారత్ మళ్లీ లంకను శాసించింది. మరో రోజు మిగిలుండగానే రెండో టెస్టును... మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2–0తో గెలిచింది. రెండో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. లంకలో ఇన్నింగ్స్ తేడాతో గెలవడం భారత్కిదే మొదటిసారి. భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (5/152) ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను స్పిన్తో దెబ్బ కొట్టాడు. దీంతో ఆదివారం 209/2 ఓవర్నైట్ స్కోరుతో ఫాలోఆన్ ఆడిన శ్రీలంక 116.5 ఓవర్లలో 386 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ కరుణరత్నే (307 బంతుల్లో 141; 16 ఫోర్లు) శతకం సాధించాడు. మిగతా వారిలో ఏంజెలో మాథ్యూస్ 36, డిక్వెలా 31 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా, అశ్విన్ చెరో 2 వికెట్లు తీశారు. అజేయ అర్ధశతకంతో పాటు 7 (రెండు ఇన్నింగ్స్ల్లో) వికెట్లు తీసిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చివరి టెస్టు 12 నుంచి పల్లెకెలెలో జరుగుతుంది. కరుణరత్నే శతకం: గెలుపెలాగో అసాధ్యం కాబట్టి అంతరం తగ్గించే పనిలో... ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కరుణరత్నే, పుష్పకుమార (16) నింపాదిగా ఆడారు. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేద్దామనుకున్నా భారత బౌలర్ల జోరు దృష్ట్యా అది ఎంతోసేపు సాగలేదు. ఇన్నింగ్స్ 66వ ఓవర్లోనే కరుణరత్నే 95 పరుగుల వద్ద ఔటయ్యేవాడు! కానీ... జడేజా వేసిన ఆ ఓవర్లో షార్ట్ లెగ్లో ఉన్న రాహుల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయాడు. ఆ మరుసటి ఓవర్లోనే కరుణరత్నే 224 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో అశ్విన్, జడేజా చెరో వికెట్ తీసి లంక పతనానికి బాటలు వేశారు. ఆ తర్వాత కరుణరత్నేకు మాథ్యూస్ జతయ్యాడు. ఇద్దరు లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. జడేజా వికెట్ల వేట: రెండో సెషన్లో భారత స్పిన్నర్ల ధాటికి లంక బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు క్రీజులో నిలిచే అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్ 96వ ఓవర్లో జడేజా వేసిన బంతిని కరుణరత్నే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. గ్లౌవ్స్ను తాకుతూ వెళ్లిన బంతి నేరుగా రహానే చేతుల్లో పడింది. తర్వాత మాథ్యూస్, పెరీరా (4) ఇద్దరూ జడేజా బౌలింగ్లోనే స్టంపౌటయ్యారు. అనంతరం ధనంజయ డిసిల్వా (17)ను కూడా జడేజానే ఔట్ చేయగా, డిక్వెలాను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. 386 స్కోరు వద్ద ప్రదీప్ (1) వికెట్ తీసిన అశ్విన్ లంక ఇన్నింగ్స్ను ముగించాడు. ►1 లంకలో భారత్కిది తొలి ఇన్నింగ్స్ విజయం. ఓవరాల్గా 8 టెస్టుల్లో నెగ్గింది. వరుసగా నాలుగు టెస్టుల్లో గెలిచింది. ► 3 టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు (అశ్విన్, జడేజా) అర్ధసెంచరీలతో పాటు ఐదేసి వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి మాత్రమే. ► 4 ఏడాది కాలంలో నాలుగు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న ఏకైక క్రికెటర్ జడేజా. ► 2009 ఫాలోఆన్లో ఇద్దరు బ్యాట్స్మెన్ (మెండిస్, కరుణరత్నే) సెంచరీలు చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి. చివరి సారిగా గంభీర్, లక్ష్మణ్లు న్యూజిలాండ్ పర్యటనలో (2009)లో ఈ ఘనత సాధించారు. ఓవరాల్ టెస్టు క్రికెట్లో ఇది 14వ సారి మాత్రమే. -
రవీంద్ర జడేజా రికార్డు
కొలంబో:టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ ర్యాంకులో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు సాధించిన జడేజా.. 150వ టెస్టు వికెట్ ను సాధించాడు. తద్వారా అత్యంత తక్కువ టెస్టుల్లో ఈ మార్కును చేరిన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా తొలి స్థానంలో నిలిచాడు. ఇక్కడ వినోద్ మన్కడ్ , టీ లాక్, డెరిక్ అండర్ వుడ్, రంగనా హెరాత్ లను ను జడేజా అధిగమించాడు. వీరంతా 40 టెస్టుల్లో 150 వికెట్లు సాధించిన లెఫ్టార్మ్ స్పిన్నర్లు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా ఈ రోజు ఆటలో డిసిల్వాను పెవిలియన్ కు పంపడం ద్వారా జడేజా 150వ టెస్టు వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు కెప్టెన్ చండిమాల్ ను జడేజా అవుట్ చేశాడు. -
రెండో టెస్టులోనూ మనోళ్లదే హవా
-
రెండోదీ మనవైపే
►సాహా, జడేజా అర్ధ సెంచరీలు ►అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శన ►భారత్ తొలి ఇన్నింగ్స్ 622/9 డిక్లేర్డ్ ►శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 50/2 లంక గడ్డపై టీమిండియా మళ్లీ 600 పరుగులు చేసింది. రెండో టెస్టులోనూ బ్యాట్స్మెన్ గర్జించారు. టెయిలెండర్ల అసాధారణ పోరాటపటిమతో వరుసగా ఈ మ్యాచ్లోనూ ఆలౌట్ కాకుండా భారీ స్కోరు బాదేసింది. తద్వారా టెస్టును, సిరీస్ను సొంతం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. కొలంబో: లంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాట్స్మెన్ సమష్టిగా కదం తొక్కారు. దీంతో మరోసారి 600 పరుగులు అవలీలగా సాధ్యమయ్యాయి. అశ్విన్ (92 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (134 బంతుల్లో 67; 4 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (85 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఓవర్నైట్ స్కోరు 344/3తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్ను 158 ఓవర్లలో 622/9 భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో హెరాత్కు 4, పుష్పకుమారకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. అశ్విన్ (2/38) ఓపెనర్లను అవుట్ చేశాడు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ప్రస్తుతం శ్రీలంక, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకంటే 572 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ తొడ కండరాల గాయంతో మిగతా సిరీస్కు దూరమయ్యాడు. సెషన్–1 పుజారా, రహానే తొందరగానే... ఓవర్నైట్ బ్యాట్స్మెన్, సెంచరీ హీరోలు పుజారా (232 బంతుల్లో 133; 11 ఫోర్లు, 1 సిక్స్), రహానే (222 బంతుల్లో 132; 14 ఫోర్లు) తమ క్రితం రోజు స్కోరుకు పెద్దగా పరుగులేమీ జత చేయలేదు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే కరుణరత్నే బౌలింగ్లో పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. ‘డీఆర్ఎస్’తో బౌలర్ ఈ ఫలితాన్ని రాబట్టాడు. దీంతో నాలుగో వికెట్కు 217 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అశ్విన్తో కలిసిన రహానే జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. ఐదో వికెట్కు 63 పరుగులు జోడించాక పుష్పకుమార బౌలింగ్లో రహానే స్టంపౌట్ కావడంతో భారత్ 442/5 స్కోరు వద్ద లంచ్కు కెళ్లింది. ఓవర్లు: 30, పరుగులు: 98, వికెట్లు: 2 సెషన్–2 టెయిలెండర్ల జోరు అప్పటికే కీపర్ సాహాతో కలిసి కుదురుగా ఆడుతున్న అశ్విన్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కాసేపటికే హెరాత్ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. టెస్టుల్లో అతనికిది 11వ అర్ధశతకం. తర్వాత సాహాకు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో పాండ్యా (20 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్ను సమర్పించుకున్నాడు. దీంతో 496 స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్ను కోల్పోయింది. తర్వాత సాహా... జడేజా అండతో 113 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. పుష్పకుమార, పెరీరా బౌలింగ్లో జడేజా 2 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 550 పరుగులకు చేరింది. మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను ముగించారు. ఓవర్లు: 30, పరుగులు: 111, వికెట్లు: 2 సెషన్–3 వడివడిగా 600 వైపు... విరామంలో కెప్టెన్ కోహ్లి నుంచి డిక్లేర్ సంకేతం అందుకున్న సాహా, రవీంద్ర జడేజా వేగం పెంచారు. ఈ ప్రయత్నంలో హెరాత్ బౌలింగ్లో సాహా స్టంపౌట్గా నిష్క్రమించాడు. 70 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జడేజాకు, షమీ (19; 2 సిక్సర్లు) జతయ్యాడు. ఇద్దరు ధాటిగా ఆడారు. హెరాత్ ఓవర్లో షమీ వరుసగా రెండు భారీ సిక్స్లు బాదాడు. అతని మరుసటి ఓవర్లో జడేజా మరో సిక్సర్ కొట్టాడు. దీంతో కేవలం 8 ఓవర్లలోనే భారత్ 69 పరుగులు చేసింది. చివరకు 622/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి లంకకు బ్యాటింగ్ అవకాశమిచ్చింది. ఇక్కడే కోహ్లి వ్యూహం ఫలించింది. కెప్టెన్ తనమీద ఉంచిన నమ్మకాన్ని అశ్విన్ వమ్ము చేయలేదు. లంక ఓపెనర్లు తరంగ (0), కరుణరత్నే (45 బంతుల్లో 25; 2 ఫోర్లు)లను పెవిలియన్ చేర్చి... జట్టును కష్టాల్లో పడేశాడు. ఆట నిలిచే సమయానికి కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్), చండిమాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవర్లు: 8, పరుగులు: 69, వికెట్లు: 2 (భారత్), ఓవర్లు: 20, పరుగులు: 50, వికెట్లు: 2 (శ్రీలంక) ⇒1 శ్రీలంకలో వరుస టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్లో 600 పైచిలుకు పరుగులు చేసిన తొలి జట్టు టీమిండియా. ⇒ 4 టెస్టుల్లో 200 వికెట్లు, 2000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడు అశ్విన్. ⇒ 4 అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతంగా ఈ ఘనత (200 + 2000) సాధించిన నాలుగో ఆటగాడిగా అశ్విన్ (51 టెస్టులు) రికార్డులకెక్కాడు. బోథమ్ (ఇంగ్లండ్, 42 టెస్టులు), కపిల్ (50 టెస్టులు), ఇమ్రాన్ (పాక్, 50 టెస్టులు) ముందు వరుసలో ఉన్నారు. -
కుప్పకూలిన శ్రీలంక.. భారత్కు భారీ ఆధిక్యం
శ్రీలంక 291 ఆలౌట్ గాలె: భారత్-శ్రీలంక తొలి టెస్టులో మూడో రోజు ఆటలో లంక 291 పరుగులకే కుప్పకూలింది. లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసిన లంక బ్యాట్స్మెన్ మరో రెండు పరుగులు జోడించి చివరి వికెట్ను కోల్పోయింది. జడేజా బౌలింగ్లో కుమారా(2) క్లీన్ బౌల్డ్ కావడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ అసేల గుణరత్నే మ్యాచ్కు దూరం కావడంతో లంక 10 మందితోనే బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. ఇక ఒంటరి పోరాటం చేసిన పెరీరా (92 నాటౌట్) శతకం చేజారింది. ఓవర్నైట్ స్కోరు 154/5తో లంక బ్యాట్స్మెన్ మాథ్యూస్(54 బ్యాటింగ్), దిల్రువన్ పెరీరా(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆచితూచి ఆడిన వీరిద్దరు జట్టు స్కోరు రెండు వందలు దాటించారు. అనంతరం జడేజా బౌలింగ్లో సెంచరీ దిశగా దూసుకెళ్లున్న మాథ్యూస్ (89) స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో అవుటయ్యాడు. జడ్డూ వేసిన 59 ఓవర్లో మాథ్యూస్ విరాట్ కోహ్లీకి చిక్కి పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ 6 వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన లంక కెప్టెన్ హెరాత్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకో లేకపోయాడు జడేజా వేసిన 66 ఓవర్లో రహానే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ప్రదీప్ కూడా పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అవ్వడంతో శ్రీలంక 280 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మరో 11 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ 309 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత బౌలర్లలో జడేజా(3), షమీ(2), పాండ్యా, ఉమేశ్, అశ్విన్ తలో వికెట్ దక్కిచ్చుకున్నారు. -
అటు బౌలింగ్లో... ఇటు బ్యాటింగ్లో
►తొలి రోజు భారత్దే పూర్తి ఆధిపత్యం ►శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్ 187 ఆలౌట్ ►కుల్దీప్, జడేజా మాయాజాలం ►భారత్ తొలి ఇన్నింగ్స్ 135/3 కొలంబో: శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ సన్నాహాలను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/14), రవీంద్ర జడేజా (3/31)లతో పాటు పేసర్ షమీ (2/9) మెరుపు బౌలింగ్ ధాటికి శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ (ఎస్ఎల్బీపీ) జట్టు బెంబేలెత్తింది. శుక్రవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో తొలి రోజే శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 55.5 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గుణతిలక (97 బంతుల్లో 74; 11 ఫోర్లు), తిరిమన్నె (125 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత్ తొలి రోజు ముగిసేసరికి 30 ఓవర్లలో మూడు వికెట్లకు 135 పరుగులు చేసింది. గాయం కారణంగా మూడు నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ (58 బంతుల్లో 54; 7 ఫోర్లు) తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. క్రీజులో విరాట్ కోహ్లి (46 బంతుల్లో 34 బ్యాటింగ్; 4 ఫోర్లు), రహానే (38 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి. తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఎల్బీపీ జట్టును గుణతిలక, తిరిమన్నె జోడి ఆదుకుంది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట రెండో వికెట్కు ఏకంగా 130 పరుగులు జోడించింది. అయితే 38వ ఓవర్లో తిరిమన్నె వికెట్ను జడేజా తీయడంతో లంక బోర్డు పతనం ప్రారంభమైంది. అటు షమీ, కుల్దీప్ కూడా ఉచ్చు బిగించడంతో ఈ జట్టు కేవలం 48 పరుగులను మాత్రమే జోడించి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా ‘చైనామన్’ కుల్దీప్ను ఎదుర్కోవడంలో లంక ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ కూడా ప్రారంభంలో త్వరగానే వికెట్లను కోల్పోయింది. ముకుంద్ (0), పుజారా (12)లను ఆరంభంలోనే ఫెర్నాండో పెవిలియన్కు పంపాడు. అయితే రాహుల్ మాత్రం తన ఫామ్ను చాటుకున్నాడు. చకచకా ఫోర్లు బాదుతూ వేగంగా అర్ధ సెంచరీ చేశాడు. ఇక కోహ్లి, రహానేకు కూడా మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇప్పటికే వీరి మధ్య నాలుగో వికెట్కు అజేయంగా 43 పరుగులు వచ్చాయి. తొలి టెస్టుకు కెప్టెన్ చండిమాల్ దూరం భారత్తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కెప్టెన్గా నియమితుడైన దినేశ్ చండిమాల్ న్యుమోనియా కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో జట్టు సారథిగా రంగన హెరాత్ వ్యవహరించనున్నాడు. తొలి టెస్టు ముగిశాక వైద్యుల సూచనల మేరకు రెండో టెస్టులో చండిమాల్ను ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటామని టీమ్ మేనేజర్ గురుసిన్హా తెలిపారు. -
జడేజా టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం వెల్లడించిన ఈ జాబితాలో జడేజా 898 పాయింట్లతో నంబర్వన్గా ఉన్నా డు. అశ్విన్ (865) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరు మినహా మిగతా భారత బౌలర్లెవరూ టాప్–10లో లేరు. -
భారీగా దెబ్బతీసింది ఆ ఇద్దరి బౌలింగే!
లండన్: భారత బౌలర్లపై ఎంతో నమ్మకంతో కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఒక్క భువనేశ్వర్ తప్ప ఎవరూ అంచనాల తగ్గట్టు రాణించలేదు. మొదటినుంచి దూకుడుగా ఆడిన పాకిస్థాన్ జట్టు టీమిండియా శిబిరాన్ని ఆరంభంలోనే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఫకర్ జమాన్ సెంచరీకితోడు.. చివర్లో దూకుడుగా హఫీజ్ అర్ధసెంచరీ చేయడంతో పాకిస్థాన్ 339 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. స్పిన్ బౌలింగ్లో 137 పరుగులు.. పాకిస్థాన్ బ్యాట్స్మెన్ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలోనూ భారత స్పిన్ బౌలర్లు విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో పరుగులు అడ్డుకుంటారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా.. ఇద్దరూ చేతులెత్తేశారు. అశ్విన్, జడ్డేజా కలిసి వేసిన 18 ఓవర్లో పాక్ బ్యాట్స్మెన్ 137 పరుగులు పిండుకోవడం.. పాక్ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. డేత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడిని తట్టుకొని నిలబడలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో మూడు నోబాల్స్, ఐదు వైడ్లు ఉన్నాయి. 10 ఓవర్లలో భువీ ఓ వికెట్ తీసుకొని.. 44 పరుగులు ఇచ్చి.. పాక్ ఎదురుదాడిలోనూ తట్టుకొని నిలబడ్డాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. భువీకి కాస్తో-కూస్తో తోడుగా నిలిచింది హార్దిక్ పాండ్యా మాత్రమే. పాండ్యా 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు. -
ధోని-జడేజా సెల్ఫీ వైరల్
లండన్: భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని-రవీంద్ర జడేజాల సెల్ఫీ ఒకటి ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందుకు 'సర్' అని ధోని ముద్దుగా పిలుచుకునే జడేజానే కారణం. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జట్టు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ధోని గుర్రు పెట్టి నిదురపోయాడు. ధోని ఆదమరిచి నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న జడేజా సెల్ఫీ తీశాడు. దాన్ని జడేజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అతను నిద్రనుంచి లేవడానికి ముందే ఆ దృశ్యాన్ని పిక్చర్ గా బంధిస్తా అని ఫోటో కింద ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ పోటోకు వేల సంఖ్యలు కామెంట్స్, వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ లో ఉన్న భారత్ జట్టు.. తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు తన తదుపరి మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. గురువారం లంకేయులతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. -
కోహ్లీ గడ్డంపై అనుష్క వార్నింగ్
బెంగళూరు: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మలు ఈ మధ్య తమ ప్రేమయాణాన్ని సోషల్ మీడియా ఆధారంగా బాహాటంగా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పోటోకు అనుష్క కామెంట్ చేసింది. ఐపీఎల్ సీజన్ లో న్యూలుక్ షేవింగ్ స్టైల్ తో కనబడుతున్న భారత క్రికెటర్ల ను అనుసరించనని కోహ్లీ చేసిన పోస్ట్ కు అనుష్క వార్నింగ్ కామెంట్ చేసింది. తొలుత గుజరాత్ లయన్స్ ఆటగాడు రవీంద్ర జడేజా న్యూలుక్ షేవింగ్ తో ఈ ట్రెండ్ కు తెరలేపగా , ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అనుసరించారు. ఈ స్టైల్ చూసిన కోహ్లీ కడుపుబ్బ నవ్వాడు. ఇలా జడేజా కొత్త స్టైల్ ను అనుసరిస్తూ ముంబై ఆటగాళ్లు హార్డిక్ పాండ్యా, రోహిత్ శర్మలు తమ న్యూ లుకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లపై స్సందించిన కోహ్లీ గడ్డం పెంచుకున్న తన ఫోటోకు క్యాప్షన్ గా ' సారీ బాయ్స్ నేను నా గడ్డం తీయడానికి సిద్దంగా లేను. అలా మీరు గొప్ప పనిచేశారు' అని ఇన్ స్ట్రాగ్రమ్ లో పోస్ట్ చేశాడు. దీనికి అనుష్క' నీవల్ల కాదు' అని కామెంట్ చేసింది. -
కొంప ముంచిన మెకల్లమ్ క్యాప్
రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 లో భాగంగ గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్ ను రక్షించింది.థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీ కి తగలడంతో గేల్ నాటౌట్ గా ప్రకటించాడు. అదే సమయంలో అది సిక్సర్ అయ్యింది. దీంతో క్యాప్ పెట్టుకోకున్నా గేల్ అవుటయ్యే వాడని లయన్స్ జట్టు సభ్యులు చింతించారు. గేల్ మాత్రం ఆ క్యాప్ కు ధన్యవాదాలు అన్నట్లు సైగ చేశాడు. ఇక జడేజా మాత్రం ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తరువాత ఇదే జోరును కొనసాగించిన గేల్ 23 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో హాప్ సెంచరీ సాధించాడు. -
జడేజా రాకతో లయన్స్ గాడిలో పడేనా?
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో ఆడిన రెండు మ్యాచ్ల్లో పరాజయం పొందిన గుజరాత్ లయన్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాకతోనైనా గాడిలో పడాలని భావిస్తోంది. గత సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఈ సీజన్ను మాత్రం ఓటమితోనే ప్రారంభించింది. కొల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రెండు మ్యాచ్ల్లో లయన్స్ ఘోర పరాభావంతో పాయింట్ల పట్టికలో చివరిస్ధానంలో నిలిచింది. ఈ రెండు మ్యాచ్ల్లో లయన్స్ ఓడిపోవడానికి బౌలింగ్ వైఫల్యమే కారణమని చెప్పవచ్చు. లయన్స్పై కోల్కతా10 వికెట్ల తేడాతో, హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందాయి. శుక్రవారం రాజ్కోట్లో జరిగే మ్యాచ్లోనైనా లయన్స్ శుభారంభం ఇస్తుందో చూడాలి. ఇక జట్టు కీలక ఆల్రౌండర్ జడేజా గాయంతో రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ చివరి టెస్టులో అతని వేలుకు గాయం అయింది. ఈ గాయంపై బీసీసీఐ వైద్యులు రెండు వారాల విశ్రాంతి తీసుకొమనడంతో ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో లేడు. రేపటి మ్యాచ్తో జడేజా ఈ సీజన్లో పునరాగమనం చేస్తున్నాడు. జడ్డూ రాకతో లయన్స్ బౌలింగ్ పటిష్టం కానుంది. అటు బ్యాటింగ్తో డెత్ ఓవర్లను జడ్డూ హిట్టర్గా ఎదుర్కొనున్నాడు. జట్టు ప్రాక్టిస్లో పాల్గొన్న మరో ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. బ్రెండన్ మెక్కల్లమ్, ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్, రైనా, దినేష్ కార్తీక్,లతో లయన్స్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. కానీ గత రెండు మ్యాచ్ల్లో మెక్కల్లమ్, ఫించ్లు విఫలమవడం, రైనా కేవలం తొలి మ్యాచ్లో 68 పరుగులు చేసిన రెండో మ్యాచ్లో విఫలమవడం జట్టును కలవరపెడుతుంది. దినేష్ కార్తీక్ రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ భారాన్ని తన భూజాలపై వేసుకున్న జట్టుకు బౌలింగ్ వైఫల్యంతో పరాజయం తప్పలేదు. గత రెండు మ్యాచ్ల్లో ప్రవీణ్కుమార్, శివిల్కౌశిక్, దావల్కులకర్ణి, బసిల్తంపి, తేజస్ బరోకాలు తమ స్ధాయికి తగ్గ బౌలింగ్ చేయకపోవడంతో లయన్స్కు ఓటమి తప్పలేదు. గత సీజన్లో రాణించిన దావల్కులకర్ణి ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్లో విఫలమయ్యాడు. జడేజా రాకతో లయన్స్ బౌలింగ్ పటిష్ట అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోం గ్రౌండ్ అయిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని లయన్స్ యోచిస్తోంది. -
గెలిపించాడు..గెలిచాడు!
-
గెలిపించాడు..గెలిచాడు!
ధర్మశాల: ఆస్ట్రేలియాతో తాజాగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా సాధించడంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర వెలకట్టలేనిది. టీమిండియా సిరీస్ విజయంలో ఆటగాళ్ల సమష్టి కృషి కారణమైనప్పటికీ, జడేజా గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. పుణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుని సిరీస్ ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా ముఖ్య భూమిక పోషించాడనేది కాదనలేని వాస్తవం. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన ఆస్ట్టేలియాకు ముచ్చెమటలు పట్టించాడు జడేజా. ఒకవైపు భారత ప్రధాన స్పిన్నన్ అశ్విన్ వికెట్ల వేటలో వెనకబడితే జడేజా మాత్రం విశేషంగా రాణించాడు. ఈ సిరీస్లో 25 వికెట్లు తీసి భారత్ సిరిస్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నాల్గో టెస్టులో మొత్తంగా నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్న జడేజా.. భారత్ ఓటమి పాలైన తొలి టెస్టులో సైతం ఐదు వికెట్లను సాధించడం ఇక్కడ విశేషం. ఇక బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించి ఆసీస్ నడ్డివిరిచిన జడేజా..రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తీశాడు. రాంచీలో డ్రాగా ముగిసిన మూడో టెస్టులో జడేజా మొత్తం 9 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.. మరొకవైపు బ్యాటింగ్ లో కూడా జడేజా తన పాత్రను బాగానే నిర్వర్తించాడని చెప్పాలి. ఈ సిరీస్ ఆరంభంలో బ్యాటింగ్ లో కొద్దిగా తడబడిన జడేజా.. చివరికొచ్చేసరికి తనదైన మార్కును చూపట్టాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన జడేజా.. ఆఖరి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో అర్ధ శతకం చేసి ఆధిక్యంలో నిలిపాడు. ఇలా సిరీస్ ను గెలవడంలో తన పాత్రను సమర్ధవంతంగా పోషించిన జడేజా.. అటు చివరి టెస్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను సొంతం చేసుకుని భళా అనిపించాడు. dddddddddd -
87 కొట్టు... ట్రోఫీ పట్టు...
-
87 కొట్టు... ట్రోఫీ పట్టు...
⇒విజయం దిశగా భారత్ ⇒ చెలరేగిన బౌలర్లు ⇒ జడేజా ఆల్రౌండ్ షో ⇒ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 137 ⇒ భారత్ లక్ష్యం 106 ∙ప్రస్తుతం 19/0 నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆధిక్యం దక్కేదెవరికి? చేతిలో నాలుగు వికెట్లున్న దశలో కనీసం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరునైనా అందుకోగలదా? రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు పరిస్థితిపై అంచనాలివి. అయితే మూడో రోజు సోమవారం భారత్ దుమ్ము రేపే ప్రదర్శనతో హల్చల్ చేసింది. ఆట ముగిసే సమయానికి మ్యాచ్నే తమ చేతుల్లోకి తెచ్చుకుంది. కట్ చేస్తే... తమ రెండో ఇన్నింగ్స్లో మరో 87 పరుగులు చేస్తే చాలు.. మ్యాచ్తో పాటు బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని సగర్వంగా అందుకుంటుంది. అత్యంత కీలకంగా మారిన తొలి సెషన్లో రవీంద్ర జడేజా తన అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ప్రత్యర్థి స్లెడ్జింగ్తో ఎంతగా రెచ్చగొడుతున్నా సహనం కోల్పోకుండా కీపర్ సాహాతో కలిసి అత్యంత విలువైన భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టాడు. ఏడో వికెట్కు వీరి మధ్య 96 పరుగులు జత చేరడంతో భారత్కు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత భారత బౌలర్ల విజృంభణకు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో విలవిల్లాడింది.. పేసర్లు ఉమేశ్, భువనేశ్వర్ పదునైన బౌన్సర్లతో బెంబేలెత్తించగా అటు స్పిన్నర్లు కూడా ఉచ్చు బిగించడంతో పర్యాటక జట్టు పరుగులు తీయలేక 137 పరుగులకే తోక ముడిచింది. దీంతో భారత్కు 106 పరుగుల స్వల్ప లక్ష్యం ఎదురవగా ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. అయితే బౌలర్లు రాజ్యమేలుతున్న ఈ పిచ్పై నాలుగో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. లక్ష్యం తక్కువే కదా.. అని ఏమరుపాటు చూపకుండా జాగ్రత్తగా ఆడితే భారత్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. ధర్మశాల: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో కోల్పోయిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీని భారత్ తిరిగి కైవసం చేసుకోవడం ఖాయమైంది. అద్భుతంగా సాగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ను దక్కించుకోవడానికి భారత జట్టు ఇంకా 87 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉండటంతో భారత్ ఘనవిజయాన్ని ఆపడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. మూడో రోజు సోమవారం రవీంద్ర జడేజా (95 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (102 బంతుల్లో 31; 2 ఫోర్లు) కీలక ఆటతీరుతో చెలరేగారు. దీంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 118.1 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కాగా 32 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. లయన్కు ఐదు, కమిన్స్కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్పై భారత బౌలర్లు మూకుమ్మడి దాడికి దిగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో కోలుకోలేకపోయింది. ఫలితంగా 53.5 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. మ్యాక్స్వెల్ (60 బంతుల్లో 45; 6 ఫోర్లు; 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. ఉమేశ్, జడేజా, అశ్విన్లకు మూడేసి వికెట్లు దక్కాయి. భువనేశ్వర్ కీలక స్మిత్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఆరు ఓవర్లలో 19 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రాహుల్ (18 బంతుల్లో 13 బ్యాటింగ్; 3 ఫోర్లు), మురళీ విజయ్ (18 బంతుల్లో 6 బ్యాటింగ్) ఉన్నారు. సెషన్ 1 జడేజా, సాహా నిలకడ సెషన్లో తొలి బంతికే జడేజాను అంపైర్ క్యాచ్ అవుట్గా ప్రకటించగా అతను రివ్యూకు వెళ్లాడు. ఇందులో కమిన్స్ వేసిన బంతి బ్యాట్ను తాకకుండా కీపర్ చేతుల్లోకి వెళ్లినట్టు తేలింది. మూడో బంతికే ఎల్బీ అప్పీల్ చేసినా ఈసారి అంపైర్ తిరస్కరించాడు. ఆ తర్వాత తన మరుసటి ఓవర్లో బౌండరీ బాదిన జడేజా లయన్ బౌలింగ్లో భారీ సిక్స్తో జోరును చూపాడు. అటు సాహా కూడా వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ సహకారం అందించాడు. 107వ ఓవర్లో సాహా అవుట్ కోసం ఆసీస్ రివ్యూకెళ్లినా నిరాశే ఎదురైంది. ఆ మరుసటి ఓవర్లోనే జడేజా 83 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అదే ఓవర్లో భారత్ కూడా ఆధిక్యంలోకి వెళ్లింది. 111వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్లో వరుసగా జడేజా ఫోర్, సిక్సర్ బాదాడు. అయితే అతడి మరుసటి ఓవర్లోనే జడేజా అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా తడబడింది. ఆరు ఓవర్లలో మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఓవర్లు: 27.1, పరుగులు: 84, వికెట్లు: 4 సెషన్ 2 వికెట్లు టపటపా ఆరంభ ఓవర్లలోనే ఆసీస్ బ్యాట్స్మెన్ను భారత పేసర్లు ఉమేశ్, భువనేశ్వర్ తమ బౌన్స్తో వణికించారు. మూడో ఓవర్లో భువీ బౌలింగ్లో వార్నర్ (6) ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో కరుణ్ నాయర్ వదిలేశాడు. కానీ మరుసటి ఓవర్లోనే ఉమేశ్ బౌలింగ్లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అతను అవుటయ్యాడు. ఇక తొమ్మిదో ఓవర్లో ఆసీస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భువీ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన స్మిత్ (15 బంతుల్లో 17; 3 ఫోర్లు) మూడో బంతికి నిర్లక్ష్యపు షాట్కు బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్లో ఉమేశ్.. రెన్షా (8) పనిపట్టడంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్వెల్ జట్టును ఆదుకున్నాడు. బౌండరీలతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. హ్యాండ్స్కోంబ్తో కలిసి నాలుగో వికెట్కు 56 పరుగులు జోడించాడు. టీ విరామానికి ముందు అశ్విన్ బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్ ఇచ్చిన క్యాచ్ను రహానే కన్నుమూసి తెరిచే లోపు అద్భుత రీతిలో పట్టుకున్నాడు. షాన్ మార్‡్షను జడేజా అవుట్ చేయడంతో జట్టు టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 25.3, పరుగులు: 92, వికెట్లు: 5 సెషన్ 3 జడేజా మాయాజాలం బ్రేక్ అనంతరం కూడా ఆసీస్ పరిస్థితి ఏమీ మారలేదు. వేడ్ ఎల్బీ కోసం భారత్ గట్టిగా అప్పీల్ చేసి రివ్యూకు వెళ్లినా నాటౌట్గా ప్రకటించారు. కొద్దిసేపటికే జోరు మీదున్న మ్యాక్స్వెల్ను అశ్విన్ ఎల్బీగా అవుట్ చేశాడు. అయితే మ్యాక్స్ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత వేడ్, కమిన్స్ (49 బంతుల్లో 12; 1 ఫోర్) జోడి పరుగులు పెద్దగా చేయకపోయినా దాదాపు 15 ఓవర్లు వికెట్ కాపాడుకున్నారు. అయితే 48వ ఓవర్ నుంచి జడేజా మేజిక్ చూపాడు. వరుసగా రెండు ఓవర్లలో కమిన్స్, ఒకీఫ్లను పెవిలియన్కు పంపించాడు. లయన్ను ఉమేశ్ అవుట్ చేయడంతో ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. 53వ ఓవర్లో వేడ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను అశ్విన్ అందుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఓవర్లో తనే ఆసీస్ చివరి వికెట్ను తీశాడు. అయితే 53.3వ బంతికి హాజల్వుడ్ ఇచ్చిన క్యాచ్ను విజయ్ క్యాచ్ తీసుకోగా అంపైర్.. థర్డ్ అంపైర్ రివ్యూకు వెళ్లాడు. అప్పటికే విజయ్ మైదానం వదిలి వెళ్లాడు. కానీ టీవీ రీప్లేలో బంతి కింద తాకినట్టుగా భావించి నాటౌట్గా ప్రకటించారు. దీంతో భారత్ కంగుతిన్నా మరో రెండు బంతుల్లోనే అతడిని ఎల్బీగా పెవిలియన్కు పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్లు: 28.2, పరుగులు: 45, వికెట్లు: 5 మరో వివాదంలో స్మిత్ బెంగళూరు టెస్టులో డ్రెస్సింగ్ రూమ్ రివ్యూతో వివాదం సృష్టించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈసారి బూతు పదాలు వాడి వార్తల్లో నిలిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో హాజల్వుడ్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న మురళీ విజయ్ అందుకున్నాడు. ఇది చివరి వికెట్ కావడంతో భారత్ సంబరాల్లో మునిగింది. అప్పటికే విజయ్ ఓపెనర్గా బరిలోకి దిగేందుకు పెవిలియన్కు చేరాడు. అయితే అంపైర్ సందేహించి టీవీ రీప్లే కోరగా అక్కడ బంతి ముందుగా నేలను తాకినట్టుగా తేలడంతో నాటౌట్గా ప్రకటించారు. దీంతో అంతా తిరిగి మైదానంలోకి చేరారు. అయితే విజయ్ అత్యుత్సాహంగా ముందుగానే పెవిలియన్కు చేరడాన్ని స్మిత్ సహించలేకపోయాడు. ఓ బూతు పదాన్ని వాడుతూ మోసగాడు అనడం టీవీల్లో కనిపించింది. ఈ వీడియోను ఆసీస్ బ్రాడ్కాస్టర్ అప్లోడ్ చేసింది. స్మిత్ వ్యవహారశైలిపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయాలని భారత బృందం భావిస్తోంది. ⇒ 6 ఈ సీజన్లో జడేజా చేసిన అర్ధ సెంచరీలు. కోహ్లి, విజయ్, రాహుల్ కూడా ఆరు చొప్పున చేశారు. ⇒ 3 ఓ సీజన్లో 500కు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసినమూడో ఆల్రౌండర్గా జడేజా. గతంలో కపిల్దేవ్, మిషెల్ జాన్సన్ మాత్రమే ఇలా చేశారు. ⇒ 0 జడేజా అర్ధ సెంచరీ చేసిన సందర్భంలో ఏ టెస్టును కూడా భారత్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్కు ముందు తను ఆరుసార్లు చేయగా ఐదుసార్లు నెగ్గి ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. ⇒ 2 ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక–105 వికెట్లు) తర్వాత భారత్పై అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా నాథన్ లయన్ (64 వికెట్లు) గుర్తింపు పొందాడు. స్మిత్ను బౌల్డ్ చేశాక భువనేశ్వర్ సంబరం ఉమేశ్ యాదవ్కు కెప్టెన్ రహానే అభినందన -
జడేజా హాఫ్ సెంచరీ..భారత్ ఆధిక్యం
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకం సాధించిన జడేజా.. చివరిదైన నాల్గో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టు కష్టాల్లో పడిన సమయంలో జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం సాధించాడు. దాంతో తిరిగి తేరుకున్న భారత్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 248/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు నిలకడగా ఆడుతూ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును లంచ్ లోపే అధిగమించింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు జడేజా-వృద్ధిమాన్ సాహాలు బాధ్యతాయుతంగా ఆడి టీమిండియా పైచేయి సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఒకవైపు జడేజా దూకుడును కొనసాగిస్తే, సాహా మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఈ జోడి 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన తరువాత జడేజా(63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే. -
భారత క్రికెట్లో 'డబుల్ ధమాకా'
► ఆటగాళ్ల వార్షిక ఫీజులు రెట్టింపు ► పుజారా, విజయ్, జడేజాలకు ప్రమోషన్ ►సురేశ్ రైనాకు దక్కని చోటు ►బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ల ప్రకటన న్యూఢిల్లీ: భారత టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారాకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్లలో ప్రమోషన్ లభించింది. గతంలో గ్రేడ్ ‘బి’లో ఉన్న పుజారాతో పాటు మురళీ విజయ్ని కూడా గ్రేడ్ ‘ఎ’లోకి చేరుస్తూ బోర్డు కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. వరల్డ్ నంబర్వన్ బౌలర్గా ఎదిగిన రవీంద్ర జడేజా కూడా ‘సి’ గ్రేడ్ నుంచి నేరుగా ‘ఎ’కు ప్రమోట్ కావడం విశేషం. ఈ అగ్రశ్రేణి జాబితాలో ఇప్పటి వరకు ధోని, కోహ్లి, అశ్విన్, రహానే మాత్రమే ఉండగా ఇప్పుడు పుజారా, విజయ్, జడేజా చేరికతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం ఇందులో ఉన్నవారికి ఏడాదికి రూ. 2 కోట్లు వార్షిక ఫీజుగా లభిస్తాయి. గతంలో ఈ జాబితాలో ఉన్నవారికి రూ. కోటి దక్కేవి. గ్రేడ్ ‘బి’లో 9 మంది ఆటగాళ్లు, గ్రేడ్ ‘సి’లో 16 మంది ఆటగాళ్లు ఉన్నారు. ‘బి’, ‘సి’ గ్రేడ్ల మొత్తాలను కూడా గత ఏడాదికంటే రెట్టింపు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగినప్పుడు లభించే మ్యాచ్ ఫీజుకు ఈ కాంట్రాక్ట్ మొత్తం అదనం. అక్టోబర్ 1, 2016 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. అయితే గత ఏడాది కాంట్రాక్ట్లు ప్రకటించిన సమయంలో భారత మహిళా జట్టు క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకుంటూ రెండు గ్రేడ్లుగా విభజించారు. ఈసారి వారి గురించి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆటగాళ్ల విజ్ఞప్తితో... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్రికెటర్ల కాంట్రాక్ట్ మొత్తం కూడా పెంచాలంటూ గత అక్టోబర్లో విజ్ఞప్తులు వచ్చాయి. కెప్టెన్ కోహ్లి అప్పటి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్తో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో కేవలం టెస్టులకు ప్రాధాన్యత పెంచేందుకు టెస్టు మ్యాచ్ ఫీజును రెట్టింపు చేసేందుకు మాత్రం ఠాకూర్ అంగీకరించారు. ఇతర అంశాలపై ఇంకా స్పష్టత రాకుండానే ఠాకూర్ నిష్క్రమించారు. ఇటీవలే బెంగళూరు టెస్టు తర్వాత కూడా కోహ్లి ఇదే అంశాన్ని ప్రత్యేకంగా సీఓఏ దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్లతో చర్చించిన అనంతరం సీఓఏ బృందం కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. రైనాకు నిరాశ... బీసీసీఐ 32 మందితో ప్రకటించిన జాబితాలో సురేశ్ రైనాకు చోటు దక్కకపోవడమే అనూహ్యం. గత ఏడాది అతను గ్రేడ్ ‘బి’లో ఉన్నాడు. వన్డే జట్టులో స్థానం లేకపోయినా... భారత టి20 జట్టు సభ్యుడిగా ఇటీవలే ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మూడు మ్యాచ్లు కూడా ఆడాడు. ఈ మ్యాచ్లన్నీ కూడా తాజా ఒప్పందాలు అమలు చేయబోతున్న తేదీ తర్వాత ఆడినవే. రైనాకు దిగువ గ్రేడ్కు కూడా పంపించకుండా పూర్తిగా కాంట్రాక్ట్ నుంచే తప్పించడం ఆశ్చర్యకర పరిణామం. ఇక అంబటి తిరుపతి రాయుడు, శిఖర్ ధావన్ గ్రేడ్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయారు. గత ఏడాది జాబితాలో లేని యువరాజ్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ సారి గ్రేడ్ ‘బి’లో స్థానం లభించింది. భారత్ తరఫున 3 టి20లు ఆడిన మన్దీప్ సింగ్, ఒకే ఒక టి20 ఆడిన రిషభ్ పంత్లకు తొలిసారి చోటు దక్కగా... భారత్ తరఫున ఇంకా అరంగేట్రం చేయని శార్దుల్ ఠాకూర్కు కాంట్రాక్ట్ దక్కడం మరో విశేషం. టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా రెట్టింపయ్యాయి. ఇకపై ఒక టెస్టు మ్యాచ్ ఆడితే ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు లభిస్తాయి. టెస్టుల్లో రిజర్వ్ ఆటగాడికి రూ. 7 లక్షలు దక్కుతాయి. ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు, ఒక్కో టి20 మ్యాచ్కు రూ. 3 లక్షలు అందజేస్తారు. కొత్త కాంట్రాక్ట్ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 2 కోట్లు): విరాట్ కోహ్లి, ధోని, అశ్విన్, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, రవీంద్ర జడేజా. గ్రేడ్ ‘బి’ (రూ. 1 కోటి): రోహిత్ శర్మ, భువనేశ్వర్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్ (ప్రమోషన్), వృద్ధిమాన్ సాహా (ప్రమోషన్). గ్రేడ్ ‘సి’ (రూ. 50 లక్షలు): శిఖర్ ధావన్ (దిగువకు), అంబటి తిరుపతి రాయుడు (దిగువకు), అమిత్ మిశ్రా, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, రిషభ్ పంత్ (వీరిలో మిశ్రా, అక్షర్, ధావల్ గత ఏడాది కూడా ‘సి’లోనే ఉండగా మిగతా 11 మందికి తొలిసారి కాంట్రాక్ట్ లభించింది) స్థానం కోల్పోయినవారు: సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కరణ్ శర్మ, శ్రీనాథ్ అరవింద్. -
కోహ్లి కసిగా...
భుజం గాయంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ భాగం పెవిలియన్కే పరిమితమైన కోహ్లి రెండో ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే జట్టును నడిపించాడు. అతను మైదానంలో ఉంటే జట్టులో ఉండే ఉత్సాహమే వేరు. జడేజా బౌలింగ్లో వార్నర్ బౌల్డ్ కాగానే విరాట్ తన కసినంతా ప్రదర్శించాడు. గాయమైన తన కుడి భుజంపై చేయి వేసి చూపిస్తూ ఆవేశంగా అరిచాడు. మూడో రోజు తనను వ్యంగ్యంగా అనుకరించిన మ్యాక్స్వెల్కు ఈ రకంగా అతను బదులిచ్చాడు. అంతకుముందు బ్యాటింగ్లో భారత్ దూసుకుపోతుండటంతో ఒక దశలో హాజల్వుడ్ స్లెడ్జింగ్కు కూడా దిగాడు. అయితే పుజారా చాలా ప్రశాంతంగా ‘వెళ్లి స్కోరు బోర్డు చూసుకో’ అని ఒకే మాటలో జవాబిచ్చేశాడు. భారత్ 4, ఆసీస్ 0 సిరీస్ ఆరంభం నుంచి భారత్కు కలిసిరాని డీఆర్ఎస్ నాలుగో రోజు మాత్రం బాగా అచ్చివచ్చింది. ఏకంగా నాలుగు సార్లు రివ్యూ భారత్కు అనుకూలంగా రావడం విశేషం. ఇందులో రెండు సార్లు భారత్ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందగా, మరో రెండు సార్లు ఆసీస్ రివ్యూ చేసి భంగపడింది. ఆటలో మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. పుజారా 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం హాజల్వుడ్ అప్పీల్ చేశాడు. అవుట్గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ క్రిస్ గఫానీ తన వేలు చాలా వరకు పైకెత్తారు. అయితే ఆసీస్ ఆటగాళ్ల అప్పీల్లో పెద్దగా బలం లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దాంతో ఒక్కసారిగా ఆలోచన మార్చుకొని చేతిని తన నెత్తి మీదికి పోనిచ్చి హ్యాట్ను సవరించుకోవడం విశేషం! -
విజయం ఊరిస్తోంది!
►గెలుపుపై కన్నేసిన భారత్ ► రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 23/2 ► భారత్ తొలి ఇన్నింగ్స్లో 603/9 డిక్లేర్డ్ ►పుజారా డబుల్ సెంచరీ, సాహా శతకం క్రీజ్లో నిలబడ్డ సమయం 672 నిమిషాలు... ఎదుర్కొన్న బంతులు 525... ఓపిక, ఏకాగ్రత, పట్టుదలకు కొత్త పాఠాలు నేర్పిస్తూ చతేశ్వర్ పుజారా ప్రదర్శించిన అమూల్యమైన ఆట ఇది. ప్రత్యర్థి బౌలర్లు బంతులు విసిరి విసిరి అలసిపోయి ఇక అవుట్ చేయడం మా వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసిన వేళ... పుజారా డబుల్ సెంచరీతో భారత్ను మరో చిరస్మరణీయ విజయం ముంగిట నిలిపాడు. స్కోరు సమం చేస్తే చాలనుకున్న స్థితి నుంచి ఆధిక్యం అలా అలా పెరుగుతూ పోయి మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చే విధంగా రాచబాట వేశాడు. మరో ఎండ్ నుంచి వహ్వా అనిపించేలా ‘బుద్ధి’మాన్ సాహా శతకంతో ఇచ్చిన సహకారం కూడా రాంచీ టెస్టును అనూహ్య మలుపు తిప్పింది. వరుసగా రెండు సెషన్ల పాటు వికెట్ ఇవ్వకుండా వీరిద్దరు సాగించిన సున్నిత విధ్వంసానికి ఆసీస్ నిర్ఘాంతపోయింది. భారత్లో తొలి ఇన్నింగ్స్ స్కోరే కీలకం, 450 పరుగులు కూడా సరిపోవు అంటూ పదే పదే భయపడిన స్మిత్ మాటే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. సరిగ్గా మూడు నెలల క్రితం ముంబైలో ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 477 పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఫలితం ఇప్పుడు కంగారూలను కూడా వెంటాడుతున్నట్లుంది. ఆఖరి రోజు స్పిన్కు అనుకూలించే పిచ్పై భారత్కు చిన్నపాటి లక్ష్యం విధించినా గెలుపుపై ఆశ పెంచుకోవచ్చు అని భావించిన ఆస్ట్రేలియాకు సీన్ రివర్సయింది. ఇప్పుడు తమ జట్టే అలాంటి పిచ్పై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. జడేజా దెబ్బకు ఇప్పటికే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ రోజంతా నిలబడగల గడం ఆ జట్టు శక్తికి మించిన పని కావచ్చు! రాంచీ: నాలుగో రోజు అనూహ్య మలుపు తిరిగిన మూడో టెస్టులో భారత్ విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్లో 152 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్లో అప్పుడే 2 ఆసీస్ వికెట్లను పడగొట్టేసింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్ (14), లయన్ (2) అవుట్ కాగా, రెన్షా (7 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చతేశ్వర్ పుజారా (525 బంతుల్లో 202; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా, వృద్ధిమాన్ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్కు 4 వికెట్లు దక్కగా, 3 వికెట్లు తీసేందుకు ఒకీఫ్ ఏకంగా 77 ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. స్పిన్కు భీకరంగా స్పందిస్తున్న పిచ్పై ఆఖరి రోజు సోమవారం ఆసీస్ ముంగిట పెద్ద సవాల్ నిలిచింది. చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నట్లయితే పరుగులతో పని లేకుండా కేవలం ‘డ్రా’ కోసం ప్రయత్నించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ కావడంతో ఆసీస్ ముందుగా భారత్ ఆధిక్యాన్ని అధిగమించాల్సి ఉంది. కాబట్టి వికెట్ కాపాడుకోవడమే కాకుండా పరుగులు కూడా చేయడం అవసరం. ఆపైన కూడా మరిన్ని పరుగులు చేసి భారత్కు లక్ష్యాన్ని నిర్దేశించడం ఆ జట్టుకు దాదాపు అసాధ్యం కావచ్చు! సెషన్–1: కలిసొచ్చిన అదృష్టం నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్ తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోయేది. కమిన్స్ బౌలింగ్లో అంపైర్ సాహాను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. అయితే రివ్యూ కోరిన భారత్ సానుకూల ఫలితం పొందింది. అనంతరం పుజారా, సాహా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరగా, భారత బ్యాట్స్మెన్ అంతే సంయమనంతో వాటిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా పుజారా 150 పరుగుల మైలురాయిని చేరుకోగా, ఆ తర్వాత కొద్ది సేపటికి సాహా 100 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పుజారా 157 పరుగుల వద్ద ఉన్నప్పుడు లయన్ బౌలింగ్లో అంపైర్ ఎల్బీ ఇచ్చినా...రివ్యూలో పుజారా నాటౌట్ అని తేలింది. 51 పరుగుల వద్ద సాహా ఇచ్చిన క్యాచ్ను వేడ్ వదిలేయడంతో భారత కీపర్ బతికిపోయాడు. 59 పరుగుల వద్ద సాహా కీపర్ క్యాచ్ అవుట్ కోసం ఆస్ట్రేలియా రివ్యూ చేసినా ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. ఈ సెషన్లో పదో ఓవర్లోనే వాతావరణం మారిపోయి వెలుతురు మందగించడంతో ఫ్లడ్లైట్లను వెలిగించాల్సి వచ్చింది. ఓవర్లు: 31, పరుగులు: 75, వికెట్లు: 0 సెషన్–2: కొనసాగిన జోరు లంచ్ తర్వాత భారత జోడి తమ ధాటిని కొనసాగించింది. వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఆసీస్ బౌలర్లు కొన్ని సార్లు అద్భుతమైన బంతులు విసిరినా... వికెట్ తీయడానికి మాత్రం అవి సరిపోలేదు. ఆసీస్ స్కోరును అధిగమించిన అనంతరం పుజారా, సాహా వేగంగా దూసుకుపోయారు. 82 పరుగుల వద్ద కమిన్స్ విసిరిన బంతి సాహా ఛాతీని తాకుతూ వెళ్లగా స్లిప్లో స్మిత్ అందుకున్నాడు. అయితే చేతికి తాకిందని భావించి స్మిత్ రివ్యూ కోరగా మరోసారి అది వృథా ప్రయత్నమే అయింది. ఓవర్లు: 27, పరుగులు: 68, వికెట్లు: 0 సెషన్–3: జడేజా దూకుడు విరామం అనంతరం తొలి బంతికే సింగిల్ తీసి 214 బంతుల్లో సాహా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే 521 బంతుల్లో పుజారా డబుల్ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు వేగంగా స్కోరు పెంచే ప్రయత్నంలో షాట్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్లో పుజారా క్యాచ్ ఇవ్వగా... కొద్ది సేపటికే సాహా కూడా అదే తరహాలో అవుట్ కావడంతో ఆసీస్ కాస్త సేదతీరింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శించిన జడేజా తనదైన శైలిలో బౌండరీలు కొట్టాడు. లయన్, ఒకీఫ్ బౌలింగ్లో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. తొమ్మిదో వికెట్కు 54 పరుగులు జోడించిన అనంతరం ఉమేశ్ (16) అవుటైనా... జడేజా అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాతే భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నాలుగో రోజు కనీసం ఎనిమిది ఓవర్లు ఆడాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ తడబడింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన వార్నర్ (14) ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే జడేజా బౌలింగ్లో అతను క్లీన్బౌల్డయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే జడేజా నైట్వాచ్మన్ లయన్ (2)ను కూడా బౌల్డ్ చేయడంతో ఆట ముగిసింది. ఓవర్లు: 22, పరుగులు: 100, వికెట్లు: 3 (భారత్) ఓవర్లు: 7.2, పరుగులు: 23, వికెట్లు: 2 (ఆస్ట్రేలియా) ►1 టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన భారత క్రికెటర్గా చతేశ్వర్ పుజారా (525 బంతులు) గుర్తింపు. రాహుల్ ద్రవిడ్ (495 బంతులు; పాకిస్తాన్పై 2004) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు. ► 2 భారత గడ్డపై ఓ ఇన్నింగ్స్లో అత్యధిక ఓవర్లు వేసిన రెండో బౌలర్గా ఒకీఫ్ (77 ఓవర్లు) నిలిచాడు. హసీబ్ అహసాన్ (పాక్–84 ఓవర్లు; 1961లో) అగ్రస్థానంలో ఉన్నాడు. ► 6 ఆస్ట్రేలియాపై రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఆరో బ్యాట్స్మన్ పుజారా. వ్యాలీ హామండ్ (6), బ్రియాన్ లారా (3), గ్రేమ్ పొలాక్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ (2) ఈ జాబితాలో ఉన్నారు. ► 53 ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టులో 53 ఏళ్ల తర్వాత ఓ బ్యాట్స్మన్ 500 కంటే ఎక్కువ బంతులు ఆడాడు. చివరిసారి 1964లో కెన్ బారింగ్టన్ (ఇంగ్లండ్–624 బంతులు) ఈ ఘనత సాధించాడు. -
జడేజా ఆల్ రౌండ్ షో.. భారత్ పైచేయి
-
జడేజా ఆల్ రౌండ్ షో.. భారత్ పైచేయి
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు భారత్ పైచేయి సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 360/6తో స్టార్ట్ చేసిన భారత్.. ఓ వైపు బ్యాటింగ్ లో ఆదివారం 3 వికెట్లు కోల్పోయి 243 అదనపు పరుగులు స్కోరు బోర్డుకు జతచేసి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ కు దిగిన ఆసీస్ పతనాన్ని జడేజా ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ బ్యాట్స్ మన్లకు పరీక్ష పెట్టాడు. బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా(55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆపై బౌలింగ్ లో రెండు వికెట్లు తీశాడు. ఆట నిలిపివేసే సమయానికి ఆసీస్ 7.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 23 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ (14), నైట్ వాచ్ మెన్ నాథన్ లియోన్ (2)లను భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన వరుస ఓవర్లలో పెవిలియన్ బాట పట్టించాడు. భారత్ ఇంకా 129 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారా డబుల్ 'వంద'నం.. సాహా సెంచరీ ఓవర్ నైట్ స్కోరు 130తో ఉన్న చతేశ్వర్ పుజారా నాలుగో రోజు ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఆసీస్ పై రెండో డబుల్ సెంచరీని సాధించాడు. అనంతరం పుజారా(525 బంతుల్లో 202; 21 ఫోర్లు) ఏడో వికెట్ గా లియోన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పుజారాతో కలిసి సెంచరీ వీరుడు వృద్ధిమాన్ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 199 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని అందించాడు. జడేజా మెరుపు ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ (55 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచాడు. ఓకీఫ్ బౌలింగ్ లో ఉమేశ్ యాదవ్(16) ఇచ్చిన క్యాచ్ ను వార్నర్ పట్టడంతో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 603 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. -
రాణించిన జడేజా.. రాహుల్ హాఫ్ సెంచరీ
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(102 బంతుల్లో 67; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మూడో టెస్టులో రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత జట్టు 40 ఓవర్లలో రాహుల్ వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది. మరో వికెట్ పడకుండా విజయ్, పుజారా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్(42 నాటౌట్), చటేశ్వర్ పుజారా(10 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(178 నాటౌట్; 361 బంతుల్లో 17 ఫోర్లు) భారీ సెంచరీ సాధించి అజేయంగా నిలవడంతోపాటు సాధించడంతోపాటు మ్యాక్స్ వెల్(104;185 బంతుల్లో 9 ఫోర్లు) శతకంతో రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌటైంది. భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో రాణించడంతో ఆసీస్ జోరుకు బ్రేకులు పడ్డాయి. 299/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ ఆదిలో కుదురుగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాడు మ్యాక్స్ వెల్ తాను అరంగేట్రం చేసిన భారత జట్టుపైనే తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ జోడి 191 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. ఆపై వికెట్ కీపర్ వేడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరు 64 పరుగుల జోడించి తరువాత వేడ్(37;50 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. జడేజా బౌలింగ్ లో సాహాకు క్యాచ్ ఇచ్చిన వేడ్ అవుటయ్యాడు. ఆసీస్ జోరుకు జడేజా బ్రేకులు! జడేజా ఐదు వికెట్ల ఇన్నింగ్స్తో (5124) రాణించడంతో ఐదు వందల పరుగులు చేసేలా కనిపించిన ఆసీస్ 451 పరుగులకు ఆలౌటౌంది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 102వ ఓవర్లో మాక్స్ వెల్ (104) ఇచ్చిన క్యాచ్ ను సాహా పట్టడంతో ఔటయ్యాడు. ఆ తర్వాత 116వ ఓవర్లో నాలుగో బంతికి వేడ్(37)ను ఆరో వికెట్ గా ఔట్ చేసిన జడేజా అదే ఓవర్ లో చివరి బంతికి కమిన్స్ ను డకౌట్ చేయడంతో ఆసీస్ 395 పరుగుల వద్ద ఏడో వికెట్ ను నష్టపోయింది. లంచ్ సమయానికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఓకీఫ్ (25 పరుగులు)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత లియాన్(1)ను జడేజా ఔట్ చేశాడు. ఆసీస్ చివరి ఆటగాడు హెజల్ వుడ్(0)ను రాహుల్ విసిరిన బంతిని జడేజా వికెట్లకు విసిరి రనౌట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. -
సాహాహ్హహ్హహ్హ...
తొలి రోజు సీరియస్గా సాగుతున్న రాంచీ టెస్టులో భారత కీపర్ వృద్ధిమాన్ సాహా కాస్త వినోదం పంచాడు! స్మిత్ను ఎలాగైనా అవుట్ చేసేందుకు అతను పడిన కష్టం మైదానంలో నవ్వులు పూయించింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్లో జడేజా వేసిన బంతిని స్మిత్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్కు తగలకుండా స్మిత్ కాళ్ల మధ్యలోకి చేరింది. అప్పటికే బంతి ‘డెడ్బాల్’గా మారిపోయినా సాహా మాత్రం పట్టు వదల్లేదు. స్మిత్ కాళ్ల మధ్య నుంచి బంతిని లాగి మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు! ఈ క్రమంలో అతను స్మిత్ వైపు వెళ్ళగా, సాహా ఏం చేస్తున్నాడో అర్థం కాక స్మిత్ కూడా వెనక్కి జరిగిపోయే ప్రయత్నం చేశాడు. చివరకు నియంత్రించుకోలేక స్మిత్ కిందపడిపోయాడు కూడా. అయినా సరే, అతని మీద పడి బంతిని చేజిక్కించుకున్న తర్వాత సాహా క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. ఇదంతా చూసిన అంపైర్ ఇయాన్ గౌల్డ్కు నవ్వు ఆగలేదు. భారత జట్టు సభ్యులందరూ కూడా బిగ్గరగా నవ్వేశారు. ఇంత జరిగినా సాహా మాత్రం ఇంకా సీరియస్గానే అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడటం మరింత హాస్యాన్ని పండించింది. మరోవైపు 97 పరుగుల వద్ద ఉన్న స్మిత్ మాత్రం ఈ మొత్తం ప్రహసనంలో గంభీరంగానే ఉండి ఎక్కడా తన ఏకాగ్రతను కోల్పోలేదు. -
బంగ్లాదేశ్ కథ ముగించేశారు
► ఏకైక టెస్టులో భారత్ ఘన విజయం ► 208 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు ► చివరి రోజు 65.3 ఓవర్ల పాటు పోరాటం ► చెరో 4 వికెట్లు తీసిన జడేజా, అశ్విన్ ఊహించిన ఫలితమే వచ్చింది. కాకపోతే కాస్త ఆలస్యంగా. బలహీన ప్రత్యర్థిని తొందరగా చుట్టేద్దామని భారత్ భావించినా... ఆట ఐదో రోజు రెండు సెషన్ల వరకు సాగింది. ఎట్టకేలకు ఆఖరి రోజు 65.3 ఓవర్ల పోరాటం అనంతరం బంగ్లాదేశ్ తలవంచింది. స్పిన్, పేస్ కలగలిసి కొట్టిన దెబ్బకు ఆ జట్టు కోలుకోలేకపోయింది. సొంతగడ్డపై భారత్ తన హవా కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా ఆరో టెస్టు సిరీస్ సొంతం. కెప్టెన్గా పరాజయమనేదే లేకుండా వరుసగా 19 టెస్టులు. సొంతగడ్డపై సీజన్లో ఆడిన 9 టెస్టుల్లో ఎనిమిదో గెలుపు. కోహ్లి నాయకత్వంలో టీమిండియా జోరు కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ వేదికగా టెస్టు బేబీలను చిత్తు చేసి మన బృందం ఇదే ఉత్సాహంతో మరి కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా జట్టుకు సవాల్ విసిరేందుకు సై అంటోంది. హైదరాబాద్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ల తర్వాత భారత్ చేతిలో మట్టికరవడం బంగ్లాదేశ్ వంతు అయింది. ముందుగా బ్యాటింగ్, ఆ తర్వాత స్పిన్తో పాటు పేస్ బౌలింగ్ కూడా తమ వంతు పాత్ర పోషించడంతో బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్కు భారీ విజయం దక్కింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ 208 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఓవర్నైట్ స్కోరు 103/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్లో 250 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (149 బంతుల్లో 64; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్లో 100.3 ఓవర్లు ఆడగలగడం విశేషం. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు చెరో 4 వికెట్లు దక్కగా, మిగతా రెండు వికెట్లు పేసర్ ఇషాంత్ శర్మకు లభించాయి. డబుల్ సెంచరీ సాధించిన కోహ్లికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెషన్–1: కీలక ఆటగాళ్లు పెవిలియన్కు చివరి రోజు 90 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుందామనే ఆశతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. జడేజా వేసిన ఈ ఓవర్లో షకీబ్ అల్ హసన్ (22) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్పై కచ్చితత్వంతో వేసిన ఈ బంతి టర్న్, బౌన్స్ కారణంగా అనూహ్యంగా దూసుకొచ్చి షకీబ్ గ్లవ్స్కు తగిలిన అనంతరం షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతుల్లో పడింది. ఈ దశలో మహ్ముదుల్లా, ముష్ఫికర్ (23) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. జడేజా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మహ్ముదుల్లా కొద్ది సేపటికే 115 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కీలక సమయంలో నిర్లక్ష్యమైన ఆటతీరుతో కెప్టెన్ తన జట్టును మరింత కష్టాల్లో పడేశాడు. అశ్విన్ బౌలింగ్లో ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడిన ముష్ఫికర్ మిడాఫ్లో జడేజాకు సునాయాస క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు అశ్విన్ ఓవర్లోనే మహ్ముదుల్లా ఫోర్, సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. ఓవర్లు: 31, పరుగులు: 99, వికెట్లు: 2 సెషన్–2: బంగ్లా పతనం లంచ్ వరకు జాగ్రత్తగా వికెట్ను కాపాడుకున్న షబ్బీర్ రహమాన్ (22) విరామం తర్వాత కొద్ది సేపటికే ఇషాంత్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 51 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. కీలకమైన మహ్ముదుల్లా వికెట్ కూడా ఇషాంత్కే దక్కింది. అతని షార్ట్ పిచ్ బంతిని పుల్షాట్ ఆడబోయిన మహ్ముదుల్లా లాంగ్లెగ్లో భువనేశ్వర్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. కొద్ది సేపు పోరాడిన మెహదీ హసన్ (23)తో పాటు తైజుల్ (6)లను జడేజా పెవిలియన్ పంపించగా, తస్కీన్ (1)ను చివరి వికెట్గా అవుట్ చేసి అశ్విన్ భారత్కు విజయాన్ని అందించాడు. ఓవర్లు: 33.3, పరుగులు: 48, వికెట్లు: 5 రెండు సార్లు రివ్యూ బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ అవుట్ సమయంలో కాస్త డ్రామా చోటు చేసుకుంది. అశ్విన్ బౌలింగ్లో తస్కీన్ ఆడిన బంతి ఫీల్డర్ చేతుల్లో పడింది. భారత్ అప్పీల్ చేయడంతో ముందుగా క్యాచ్ అవుట్గా భావించిన అంపైర్ ఎరాస్మస్, దానిని థర్డ్ అంపైర్ను నివేదించారు. రీప్లేలో బంతి బ్యాట్కు తగల్లేదని తేలడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించేశారు కూడా. అయితే ఈ సమయంలో కోహ్లి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరాడు. మరోసారి రీప్లేలు చూసిన తర్వాత బంతి స్టంప్కు తగులుతోందని తేలడంతో తస్కీన్ అవుట్ కావడం... భారత జట్టులో సంబరాలు షురూ అయిపోయాయి. ► 19 కోహ్లి నాయకత్వంలో భారత్ వరుసగా 19 టెస్టుల్లో ఓటమి లేకుండా కొనసాగుతోంది. గతంలో గావస్కర్ (18) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. ► 6 భారత్కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం. గతంలో ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో జట్టు వరుసగా ఐదు సిరీస్లు గెలిచింది. ► 15 కెప్టెన్గా కోహ్లికి 23 టెస్టుల్లో ఇది 15వ విజయం. ► 2 ఇంగ్లండ్ (2012లో) తర్వాత భారత్లో రెండు ఇన్నింగ్స్లలోనూ వందకు పైగా ఓవర్లు ఆడిన రెండో పర్యాటక జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. -
విజయానికి 7 వికెట్లు
గెలుపు బాటలో భారత్ బంగ్లాదేశ్ విజయలక్ష్యం 459 ప్రస్తుతం 103/3 స్పిన్నర్ల జోరు మొదలు సొంతగడ్డపై భారత్ విజయ యాత్రలో మరో మ్యాచ్ చేరడానికి రంగం సిద్ధమైంది. పది వికెట్లు కూల్చే లక్ష్యంలో ఇప్పటికే ముగ్గురిని పెవిలియన్ పంపించిన టీమిండియా ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టింది. పిచ్ స్పిన్కు అనుకూలించడం ప్రారంభమైపోయింది, వాతావరణం సమస్యా లేదు... మన విజయాన్ని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడూ అటు వైపు లేడు. మిగిలిన ఏడు వికెట్ల లాంఛనాన్ని ఎంత త్వరగా ముగిస్తారన్నదే తేలాల్సి ఉంది. భారత గడ్డపై తొలిసారి టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న బంగ్లాదేశ్కు టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోలేని లక్ష్యం ఎదురుగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చూపినా... రెండో సారి అదే తరహాలో ఆడటం అంత సులువు కాదు. ప్రధాన బ్యాట్స్మెన్ నిష్క్రమించిన నేపథ్యంలో మరో 90 ఓవర్లు ఆడి మ్యాచ్ను కాపాడుకోవడం వారికి శక్తికి మించిన పనే కానుంది. వెరసి బంగ్లాదేశ్కు ఈ టెస్టు ఒక పాఠంగా మిగిలిపోవచ్చు. హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 459 పరుగుల అతి భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (21 బ్యాటింగ్), మహ్ముదుల్లా (9 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. బంగ్లా విజయం కోసం మరో 356 పరుగులు చేయాల్సి ఉంది. చివరి రోజు ఇది దాదాపు అసాధ్యం కాబట్టి ఆ జట్టు ‘డ్రా’ కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పటికే అశ్విన్, జడేజాలకు పట్టు చిక్కిన నేపథ్యంలో భారత్ విజయానికి చేరువైనట్లే. అంతకుముందు ఉదయం బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 388 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (262 బంతుల్లో 127; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్కు 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బౌలర్లకు కాస్త విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లి సేన ఫాలోఆన్ ఇవ్వకుండా మళ్లీ బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపించింది. తమ రెండో ఇన్నింగ్స్లో ధాటిగా ఆడుతూ 29 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చతేశ్వర్ పుజారా (58 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. సెషన్–1: ముగిసిన బంగ్లా ఆట ఓవర్నైట్ స్కోరు 322/6తో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్కు మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన నాలుగో బంతిని ఆడలేక మెహదీ హసన్ (51) క్లీన్బౌల్డయ్యాడు. కొద్ది సేపటికే తైజుల్ (10) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో 87 పరుగుల వద్ద ఉన్న ముష్ఫికర్కు తస్కీన్ (8) కాసేపు అండగా నిలిచి సెంచరీ చేయడానికి సహకరించాడు. ఇషాంత్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత అదే ఓవర్లో ముష్ఫికర్ ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్లో ఫైన్లెగ్ దిశగా ఫోర్ కొట్టి శతకం అందుకున్న ముష్ఫికర్... అశ్విన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. అయితే తస్కీన్ను జడేజా అవుట్ చేయగా, ముష్ఫికర్ను అవుట్ చేసి అశ్విన్ 250వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. విరామానికి ముందు భారత్ ఒక ఓవర్ ఆడింది. ఓవర్లు: 23.5, పరుగులు: 66,వికెట్లు: 4 (బంగ్లాదేశ్) ఓవర్లు: 1, పరుగులు: 1, వికెట్లు: 0 (భారత్) సెషన్–2: భారత్ దూకుడు భారీ ఆధిక్యం ఉన్నా, ఫాలోఆన్ ఇవ్వకుండా బ్యాటింగ్కు దిగిన భారత్ ఊహించినట్లుగానే ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. తస్కీన్ బౌలింగ్లో విజయ్ (7), రాహుల్ (10) తొందరగానే నిష్క్రమించినా, భారత్ ఎక్కడా జోరు తగ్గించలేదు. పుజారా, కోహ్లి (40 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టారు. షకీబ్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన కోహ్లి, అదే ఓవర్లో మరో షాట్కు ప్రయత్నించి షార్ట్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చాడు. 4 పరుగుల వద్ద షకీబ్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రహానే (28; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరుగా ఆడాడు. అయితే షకీబ్ బౌలింగ్లోనే అతను వెనుదిరిగాడు. అదే ఓవర్లో జడేజా (16 నాటౌట్) ఇచ్చిన క్యాచ్ను మెహదీ వదిలేయగా, భారత్కు 11 పరుగులు వచ్చాయి. రెండో సెషన్ చివరి ఓవర్లో 57 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. టీ విరామం ప్రకటించగానే భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 5.48 రన్రేట్తో పరుగులు సాధించడం విశేషం. ఓవర్లు: 28, పరుగులు: 158: వికెట్లు: 4 సెషన్–3: స్పిన్ తిరిగింది... టెస్టు మ్యాచ్ను కాపాడుకునే లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు భారత స్పిన్ ఉచ్చులో చిక్కింది. క్రీజ్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో కొత్త బంతిని అశ్విన్ చేతిలో పెట్టి కోహ్లి ఫలితం పొందాడు. అశ్విన్ బౌలింగ్లో బంతి తమీమ్ ఇక్బాల్ (3) బ్యాట్ను తాకుతూ గల్లీలో ఉన్న కోహ్లి చేతుల్లో పడింది. అయితే ముందుగా భారత ఆటగాళ్లంతా ఎల్బీ కోసం అప్పీల్ చేసినా, ఆ వెంటనే కోహ్లి క్యాచ్ కోసం రివ్యూకు వెళ్లాడు. సమీక్షలో భారత్కు అనుకూలంగా రావడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో సర్కార్, మోమినుల్ (63 బంతుల్లో 27; 3 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి రెండో వికెట్కు 60 పరుగులు జోడించి నిలదొక్కుకుంటున్న దశలో భారత్ మళ్లీ దెబ్బ వేసింది. జడేజా, అశ్విన్ల బౌలింగ్లో స్లిప్లో రహానే రెండు క్యాచ్లు అందుకోవడంతో సర్కార్, మోమినుల్ నాలుగు పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత మహ్ముదుల్లా, షకీబ్ 10.5 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఓవర్లు: 35, పరుగులు: 103, వికెట్లు: 3 ►1 అత్యంత వేగంగా 250 వికెట్లు పడగొట్టిన బౌలర్గా అశ్విన్ (45 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ (48 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. భారత్ తరఫున 250 వికెట్లు తీసేందుకు కుంబ్లేకు 55 టెస్టులు పట్టా యి. అశ్విన్ టెస్టుల్లోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచి అతనికంటే ఎక్కువ వికెట్లు కూడా ఎవరూ తీయలేకపోవడం విశేషం. 5 ఏళ్ల 95 రోజుల్లో అతను ఈ ఘనత సాధించాడు. ► 1 ఒకే టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు, వికెట్ కీపర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కోహ్లి, సాహా, ముష్ఫికర్ ఈ మ్యాచ్లో శతకాలు బాదారు. -
బ్రేక్ లేకుండాబాదేశారు
-
బ్రేక్ లేకుండాబాదేశారు
భారత్ 687/6 డిక్లేర్డ్ ► కోహ్లి డబుల్ సెంచరీ ►వృద్ధిమాన్ సాహా శతకం ►రాణించిన రహానే, జడేజా ►బంగ్లాదేశ్ 41/1 వ్యక్తిగత మైలురాళ్లు, జట్టుగా కొత్త రికార్డులు, భాగస్వామ్యంలో కొత్త ఘనతలు... ఏం ఆడినా, ఎలా ఆడినా వెల్లువలా వచ్చి పడిన పరుగులు... ఒకవైపు మన బ్యాట్స్మెన్ తమలో తాము పరుగులు చేయడంలో పోటీ పడితే, అటు వైపు నుంచి ఫీల్డింగ్ వైఫల్యాలు, డీఆర్ఎస్ అన్నీ అండగా నిలిచాయి. ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిన భారత్ అద్భుత ప్రదర్శన ముందు ప్రత్యర్థి కకావికలమైంది. పరుగులు ఇవ్వడంలో ఐదుగురు బౌలర్ల సెంచరీ... పేసర్ల ప్రదర్శన జాలి పడేలా ఉంటే, నమ్ముకున్న స్పిన్నర్లు చేతులెత్తేశారు. క్యాచ్లు వదిలేశారు, రనౌట్ చేయలేకపోయారు, చిన్నపిల్లాడు కూడా చేయగలిగే స్టంపింగ్ కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క వ్యూహం పని చేయకపోగా, ఒక్కసారైనా డీఆర్ఎస్ వాడటం రాలేదు. భారత్లో టెస్టు మ్యాచ్ అంటే ఆట కాదని, ఇంకా తాము ‘బేబీ’లమేనని బంగ్లాకు ఈపాటికి అర్థమైపోయింది. ఫలితంగా భారత గడ్డపై తొలిసారి ఆడుతున్న టెస్టులో రెండో రోజే బంగ్లాదేశ్ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయింది. హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజే భారత్కు పట్టు చిక్కింది. కొండలాంటి స్కోరు నమోదు చేసిన టీమిండియా, అప్పుడే ప్రత్యర్థి జట్టు వికెట్ తీసి వేట మొదలు పెట్టేసింది. టీ విరామం తర్వాత కొద్ది సేపటికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 6 వికెట్ల నష్టానికి 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీని పూర్తి చేసుకొని పలు రికార్డులు నమోదు చేశాడు. వృద్ధిమాన్ సాహా (155 బంతుల్లో 106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కెరీర్లో రెండో సెంచరీ సాధించగా... అజింక్య రహానే (133 బంతుల్లో 82; 11 ఫోర్లు), రవీంద్ర జడేజా (78 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 14 ఓవర్లలో వికెట్ నష్టపో యి 41 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (24 బ్యాటింగ్), మోమినుల్ (1 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మరో 646 పరుగులు వెనుకబడి ఉంది. సెషన్ 1: ఆగని జోరు ఓవర్నైట్ స్కోరు 356/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఎక్కడా తగ్గలేదు. కోహ్లి బౌండరీలతో విరుచుకుపడగా, మరో ఎండ్లో రహానే 73 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రక్షణాత్మక ఫీల్డింగ్ వ్యూహాలు కొనసాగించడం కూడా భారత్కు కలిసొచ్చింది. కొద్దిసేపట్లోనే కోహ్లి 150 పరుగుల మార్క్ను కూడా చేరుకున్నాడు. ఎట్టకేలకు రహానేను అవుట్ చేసి తైజుల్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. రెండో రోజు వీరిద్దరు సరిగ్గా 100 పరుగులు జోడించారు. 180 పరుగుల వద్ద అంపైర్ కోహ్లిని ఎల్బీగా ప్రకటించినా... భారత కెప్టెన్ రివ్యూకు వెళ్లి సానుకూల ఫలితం పొందాడు. 4 పరుగుల వద్ద సాహాను స్టంపౌంట్ చేసే సునాయాస అవకాశాన్ని కూడా ముష్ఫికర్ వృథా చేశాడు. ఓవర్లు: 31, పరుగులు: 121, వికెట్లు: 1 సెషన్ 2: పరుగుల వరద విరామం తర్వాత మూడో ఓవర్లోనే భారత అభిమానులంతా ఎదురు చూసిన క్షణం వచ్చింది. తైజుల్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీ కొట్టి విరాట్ కేవలం 239 బంతుల్లో కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే అతను ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూలో నాటౌట్గా తేలేందుకు కొంత అవకాశం ఉన్నా... కోహ్లి ఈసారి సమీక్ష కోరకుండా నేరుగా పెవిలియన్కు వెళ్లిపోయాడు. ఈ దశలో జత కలిసిన సాహా, అశ్విన్ (45 బంతుల్లో 34; 4 ఫోర్లు) చకచకా పరుగులు జోడించారు. తస్కీన్ ఓవర్లో అశ్విన్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, షకీబ్ బౌలింగ్లో సాహా ఫోర్, సిక్స్ బాదాడు. మరో రనౌట్ అవకాశాన్ని వదిలేసుకున్న బంగ్లా, అదే ఓవర్లో అశ్విన్ను అవుట్ చేసి ఊరట పొందింది. సాహా, అశ్విన్ ఆరో వికెట్కు 74 పరుగులు జత చేశారు. జడేజా అవుట్ విషయంలో కూడా రివ్యూ కోరి బంగ్లా దానినీ వృథా చేసుకుంది. 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సాహా ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించాడు. ఓవర్లు: 32, పరుగులు: 143: వికెట్లు: 2 సెషన్ 3: మెరుపు బ్యాటింగ్ చివరి సెషన్లో సాహా, జడేజా మరింత దూకుడు ప్రదర్శించారు. తైజుల్ వేసిన ఓవర్లో ముందుగా భారీ సిక్సర్ కొట్టిన జడేజా తర్వాతి బంతికి అర్ధ సెంచరీ సాధించాడు. మరుసటి బంతినే మరో భారీ సిక్సర్గా మలచి సాహా 153 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు ఓవర్లలో జడేజా రెండు బౌండరీలు కొట్టిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు తమీమ్, సర్కార్ (15) జాగ్రత్తగా ఆరంభించారు. భువీ బౌలింగ్ను ఆచితూచి ఆడిన వీరిద్దరు ఇషాంత్ బౌలింగ్లో మాత్రం చెరో మూడు ఫోర్లు బాదారు. అయితే ఉమేశ్ వేసిన తొలి ఓవర్లోనే కీపర్కు క్యాచ్ ఇచ్చి సర్కార్ వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ నాటౌట్గా ప్రకటించినా, భారత్ రివ్యూకు వెళ్లి ఫలితం పొందింది. ఓవర్లు:13, పరుగులు: 67, వికెట్లు: 0 (భారత్) ఓవర్లు:14, పరుగులు: 41, వికెట్లు: 1 (బంగ్లాదేశ్) వేదిక ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా... పరుగులు వరద పారించడమే తన పని అన్నట్లు భారత కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్తో హైదరాబాద్లో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కోహ్లి డబుల్ సెంచరీ (246 బంతుల్లో 204; 24 ఫోర్లు) సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా నాలుగు సిరీస్లలో డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్, భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మాత్రమే వరుసగా మూడు సిరీస్లలో డబుల్ సెంచరీలు చేశారు. తాజా ‘డబుల్ సెంచరీ’తో కోహ్లి వీరిద్దరినీ అధిగమించాడు. ► 200 వెస్టిండీస్పై అంటిగ్వాలో జూలై, 2016లో ► 211 న్యూజిలాండ్పై ఇండోర్లో అక్టోబర్, 2016లో ► 235 ఇంగ్లండ్పై ముంబైలో డిసెంబర్, 2016లో ► 204 బంగ్లాదేశ్పై హైదరాబాద్లో ఫిబ్రవరి, 2017లో -
అశ్విన్, జడేజాలకు రెస్ట్
ముంబై:మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్తో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్కు భారత ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. ఇప్పటికే ఇంగ్లండ్ తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడిన నేపథ్యంలో ఈ ఇద్దరూ స్టార్ స్పిన్నర్లకు విశ్రాంతినిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో మరో ఇద్దరు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్లకు చోటు కల్పించారు.ఈ మేరకు సోమవారం జరిగిన సెలక్షన్ లో మిశ్రా, రసూల్ లు స్థానం దక్కించుకున్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు మిశ్రాను ఎంపిక చేసినా, అతనికి ఒక టెస్టు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. ఆ తరువాత అతనికి ఇంగ్లండ్ తో మిగతా టెస్టు సిరీస్లో, వన్డే సిరీస్లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ తో ట్వంటీ 20 సిరీస్ మిగిలి ఉండటంతో ఈ వెటరన్ను మరోసారి పరీక్షించదలచిన సెలక్టర్లు ఆ మేరకు అతనికి స్థానం కల్పించారు. మరొకవైపు జమ్మూ కశ్మీర్కు చెందిన పర్వేజ్ రసూల్కు తదుపరి టీ 20 సిరీస్లో ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఒక వన్డే మాత్రమే ఆడిన ఆల్ రౌండర్ రసూల్ కు మరొకసారి అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపారు. 2014, జూన్ లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పుడు రెండు వికెట్లతో రసూల్ ఫర్వాలేదనిపించాడు. జనవరి 26వ తేదీ నుంచి ఇంగ్లండ్-భారత జట్ల మధ్య మూడు ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది. -
జడేజా విజృంభణ
చెన్నై: ఇంగ్లండ్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో భారత స్సిన్నర్ రవీంద్ర జడేజా దూకుడు కొనసాగిస్తున్నాడు. జడేజా ఐదు వికెట్లు సాధించి ఇంగ్లండ్ టాపార్డర్ను కకావికలం చేశాడు. అలెస్టర్ కుక్ (49), జెన్నింగ్స్(54),రూట్(6), మొయిన్ అలీ(44), స్టోక్స్(23) లను అవుట్ చేశాడు. దాంతో టీ విరామం తరువాత ఇంగ్లండ్ 192 పరుగుల వద్ద ఆరో వికెట్ను నష్టపోయింది. మొయిన్ అలీని ఐదో వికెట్ గా జడేజా అవుట్ చేయగా ఆ తరువాత కొంత సేపటికి స్టోక్స్ ను అవుట్ చేశాడు. అంతకుముందు బెయిర్ స్టో(1)ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. ఇంకా సుమారు 20.0 ఓవర్లు పాటు ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకోగా, ఇంగ్లండ్ మాత్రం డ్రా కోసం పోరాడుతోంది. మరో నాలుగు వికెట్లను తీస్తే భారత్ ఖాతాలో సంచలన విజయం చేరుతుంది.12/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో అత్యంత నిలకడగా ఆడింది. ఆ తరువాత రెండో సెషన్ లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకోగా, మూడో సెషన్ ఆదిలోనే రెండు వికెట్లను నష్టపోయింది. ఆ తరువాత ఏడో వికెట్ ను మిశ్రా తీయగా, ఎనిమిదో వికెట్ ను ఉమేష్ యాదవ్ తీశాడు. ఏడో వికెట్ గా డాసన్(0) అవుట్ కాగా, ఎనిమిదో వికెట్ గా రషిద్(2) పెవిలియన్ చేరాడు. -
జడేజా అరుదైన ఘనత
చెన్నై:ఇంగ్లండ్ తో చివరిటెస్టులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చివరిరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్(49)ను జడేజా అవుట్ చేశాడు. జడేజా సంధించిన ప్రమాదకరమైన బంతిని కుక్ ఆడటంలో విఫలమై లెగ్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ 103 పరుగుల వద్ద తొలి వికెట్ ను నష్టపోయింది. అయితే కుక్ వికెట్ ను సాధించే క్రమంలో జడేజా ఒక అరుదైన ఫీట్ ను సాధించాడు. ఈ సిరీస్లో ఆరుసార్లు జడేజా బౌలింగ్ లో కుక్ అవుటయ్యాడు. ఇలా ఒక సిరీస్లో అత్యధికంగా ఒకే బౌలర్ చేతిలో కుక్ అవుట్ కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సిరీస్లో జడేజా బౌలింగ్ వేసే క్రమంలో కుక్ యావరేజ్ 12.50 గా నమోదైంది. నాల్గో టెస్టులో రెండు సార్లు జడేజాకు చిక్కిన కుక్.. ఐదో టెస్టులో రెండు సార్లూ జడేజా బౌలింగ్ లోనే అవుటయ్యాడు. అంతకుముందు మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ అవుట్ కాగా, తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో జడేజా బౌలింగ్ లో కుక్ పెవిలియన్ చేరాడు. ఈ రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఉదయం సెషన్లో 19.0 ఓవర్ తరువాత జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఈ తన ప్రయోగంలో కోహ్లి మరోసారి సఫలమయ్యాడు. జడేజా వేసిని 39.0 ఓవర్ నాల్గో బంతికి కుక్ అవుటయ్యాడు. ఆ తరువాత జెన్నింగ్స్(54) ను కూడా జడేజా పెవిలియన్ కు పంపాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. -
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
-
కరుణ్ ది గ్రేట్
►ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ ► అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు ► తొలి ఇన్నింగ్స్లో 759/7 డిక్లేర్డ్ ► టెస్టుల్లో భారత్కిదే అత్యధిక స్కోరు ► ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 12/0 బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కే సాధ్యం కాని ఫీట్ అది.. ఇప్పటి దాకా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక్కరంటే ఒక్కరే సాధించిన రికార్డు.. ఎంతో మంది మేటి బ్యాట్స్మెన్ కలలు కన్నా అందుకోలేని విన్యాసమది.. అలాంటి అరుదైన ట్రిపుల్ సెంచరీని యువ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ సాధించాడు. అదీ ఆడుతున్న మూడో టెస్టులోనే కావడం విశేషం. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్గా మలుచుకున్న తొలి భారత ఆటగాడయ్యాడు. ఈ సిరీస్లో ఈ మ్యాచ్కు ముందు అతడు చేసిన స్కోర్లు 4, 13 మాత్రమే.. ఈ స్థితిలో ఎవరైనా ఈ ఆటగాడి గురించి ఎక్కువగా ఊహిస్తారా? కానీ ఎవరి అంచనాలకు అందకుండా ఈ కర్ణాటక స్టార్ అనూహ్య రీతిలో సాగించిన విజృంభణక్రికెట్ పండితులనే ఆశ్చర్యపరిచింది. కుటుంబసభ్యుల సమక్షంలో అసమాన ఆటను ప్రదర్శించి ఈ టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. మరోవైపు ఈ మరపురాని ఆటతీరుకు తోడు అశ్విన్, జడేజా అర్ధ సెంచరీలు సాధించడంతో భారత జట్టు తమ టెస్టు చరిత్రలోనే అత్యధిక పరుగుల రికార్డునూ తమ ఖాతాలో వేసుకుంది.. చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత జట్టు రికార్డుల మోత మోగించింది. తన అరంగేట్ర సిరీస్లోనే కరుణ్ నాయర్ (381 బంతుల్లో 303 నాటౌట్; 32 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఎప్పటిలాగే భారత టెయిలెండర్లు అశ్విన్ (149 బంతుల్లో 67; 6 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (55 బంతుల్లో 51; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుగైన ఆటతో ఆకట్టుకోవడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 190.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 759 పరుగులకు డిక్లేర్ చేసింది. తమ టెస్టు చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. ద్విశతకం పూర్తి చేసుకున్న అనంతరం వన్డే తరహాలో రెచ్చిపోయిన నాయర్ 75 బంతుల్లోనే తన చివరి 103 పరుగులను సాధించడం విశేషం. అంతేకాకుండా సోమవారం ఒక్కరోజే తను 245 బంతుల్లోనే 232 పరుగులు సాధించడం అతని జోరును సూచిస్తోంది. జడేజా కూడా ఇదే స్థాయి జోరు చూపడంతో భారత ఇన్నింగ్స్లో పరుగులు వేగంగా వచ్చాయి. అలాగే అశ్విన్తో కలిసి నాయర్ ఆరో వికెట్కు 181 పరుగులు జత చేయగా, జడేజాతో కలిసి ఏడో వికెట్కు 138 పరుగులు అందించాడు. బ్రాడ్, డాసన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 282 పరుగులు వెనకబడిన దశలో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో కుక్ (3 బ్యాటింగ్), జెన్నింగ్స్ (9 బ్యాటింగ్) ఉన్నారు. సెషన్ – 1 తొలి సెంచరీ పూర్తి 391/4 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జోరును కనబరిచింది. చక్కటి నిలకడను ప్రదర్శిస్తూ కరుణ్, విజయ్ ఆటతీరు సాగింది. డాసన్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదిన కరుణ్.. స్టోక్స్ బౌలింగ్లో మరో చక్కటి బౌండరీతో 185 బంతుల్లో కెరీర్తో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఓవర్లోనే విజయ్ (76 బంతుల్లో 29; 4 ఫోర్లు) డాసన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. విజయ్ రివ్యూ కోరినా ఫలితం లేకపోయింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్కు 63 పరుగులు జత చేరాయి. అనంతరం నాయర్కు ఫామ్లో ఉన్న అశ్విన్ జత కలవడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో డిఫెన్స్కు ప్రాధాన్యత ఇచ్చిన అశ్విన్ పరుగుల ఖాతా తెరిచేందుకు 20 బంతులు తీసుకున్నాడు. ఓవర్లు: 27, పరుగులు: 72, వికెట్లు: 1 సెషన్ – 2 నాయర్, అశ్విన్ జోరు లంచ్ విరామం అనంతరం భారత బ్యాటింగ్లో జోరు కనిపించింది. మూడో ఓవర్లో కరుణ్ ఫోర్ బాదగా ఐదో ఓవర్లో అశ్విన్ సిక్సర్తో భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి ఓవర్లలోనూ ఇద్దరు బౌండరీల వర్షం కురిపిస్తూ సాగారు. రషీద్ వేసిన 155వ ఓవర్లో నాయర్ రివర్స్ స్వీప్ ఆడగా ఇంగ్లండ్ క్యాచ్ అప్పీల్కు వెళ్లింది. అయితే థర్డ్ అంపైర్ తిరస్కరించడంతో వారికి నిరాశే మిగిలింది. 115 బంతుల్లో అశ్విన్ సిరీస్లో నాలుగో అర్ధ సెంచరీని సాధించాడు. టీ బ్రేక్కు ముందు ఓవర్లో జెన్నింగ్స్ ఎల్బీ అవుట్ నిర్ణయాన్ని అశ్విన్ సవాల్ చేయగా రివ్యూలో అనుకూలంగా వచ్చింది. ఈ సెషన్ను వీరిద్దరు ఆటగాళ్లు ఓవర్కు నాలుగు పరుగుల చొప్పున సాధించారు. ఓవర్లు: 30, పరుగులు: 119, వికెట్లు: 0 సెషన్ – 3 నాయర్ తుఫాన్ ఇన్నింగ్స్ టీ బ్రేక్ అయిన రెండో ఓవర్లో మరోసారి ఫోర్తో నాయర్ తన సెంచరీని డబుల్గా మార్చాడు. అయితే కొద్దిసేపటికే అశ్విన్.. బ్రాడ్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో నాయర్ ఇచ్చిన క్యాచ్ను రూట్ వదిలేసాడు. ఇక జడేజా వచ్చీ రాగానే బ్యాట్కు పనిచెప్పాడు. బాల్ బౌలింగ్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అటు నాయర్ కూడా మేనేజిమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఇన్నింగ్స్లో దూకుడు చూపించాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 185వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జడేజా సిక్సర్తో భారత్ టెస్టుల్లో అత్యధిక స్కోరును అందుకుంది. 52 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం డాసన్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ తర్వాతే నాయర్ బౌండరీతో అరుదైన ట్రిపుల్ సాధించడంతో కెప్టెన్ కోహ్లి తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులు చేసింది. భారత్ ఓవర్లు: 25.4, పరుగులు: 177, వికెట్లు: 2 ఇంగ్లండ్: 5, పరుగులు 12, వికెట్లు 0 వికెట్ కోల్పోకుండా) 12. ఫోర్.. ఫోర్.. ఫోర్ కరుణ్ నాయర్ అద్భుత బ్యాటింగ్లో మరో అరుదైన ఫీట్ నమోదైంది. మామూలుగా ఏ ఆటగాడైనా సెంచరీకి అతి సమీపంలో ఉన్నప్పుడు సింగిల్ తీసేందుకు ప్రాధాన్యమిస్తాడే కానీ బౌండరీ కొట్టాలని ఏమాత్రం ప్రయత్నించడు. అయితే కరుణ్ ఒక్కసారి కాదు తన ‘మూడు’ సెంచరీలను ఇలాగే చేయడం విశేషం. 99 పరుగుల వద్ద ఫుల్ డెలివరీని ఆఫ్ సైడ్లో, 197 పరుగుల వద్ద కవర్స్ వైపు, 299 వద్ద పాయింట్ వైపు బౌండరీ కొట్టి అజేయంగా తన రికార్డు ఇన్నింగ్స్ను అందుకున్నాడు. 1 కెరీర్ మొదలయ్యాక తక్కువ ఇన్నింగ్స్ (3)లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2 భారత్ నుంచి ట్రిపుల్ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడు కరుణ్. గతంలో సెహ్వాగ్ రెండు సార్లు ట్రిపుల్ సాధించాడు. 3 ప్రపంచ టెస్టు క్రికెట్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన మూడో బ్యాట్స్మన్ నాయర్ కరుణ్ను అభినందిస్తున్న కోహ్లి ఇతర సభ్యులు -
మూడో టెస్టులో భారత్ ఘనవిజయం
-
అలవోకగా ముగించారు
మూడో టెస్టులో భారత్ ఘనవిజయం 8 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు సిరీస్లో 2-0తో ఆధిక్యం డిసెంబర్ 8 నుంచి నాలుగో టెస్టు గెలవడం కాస్త ఆలస్యం అరుుందేమో గానీ... గెలుపు మాత్రం అనాయాసంగానే వచ్చింది. ఊహించినదానికి భిన్నంగా నాలుగో రోజు ఆట చివరి సెషన్ వరకు వెళ్లినా, భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ముందుగా ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ పని పట్టిన కోహ్లి సేన, ఆ తర్వాత చిన్నపాటి లక్ష్యాన్ని వేగంగా చేరుకుంది. ఆల్రౌండర్ నైపుణ్యం భారత్కు విజయాన్ని అందించగా, బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లండ్ను దెబ్బ తీసింది. మూడో రోజే కీలక వికెట్లు కోల్పోయి వెనుకబడిపోయిన కుక్ బృందం... భారత్ను రెండోసారి బ్యాటింగ్కు దించడం మినహా ఎలాంటి ప్రతిఘటన, సంచలనం లేకుండానే తలవంచింది. గాయంతో బాధపడుతూనే హమీద్ చేసిన పోరాటం ఆ జట్టు కనీస పోటీ ఇచ్చేందుకు సరిపోకపోగా... జడేజా, షమీ బౌలింగ్తోపాటు పార్థివ్ పటేల్ మెరుపులతో మొహాలీలో మన జట్టు భాంగ్రా నృత్యం చేసింది. మొహాలీ: ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టు మూడో టెస్టులో అలవోక విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 78/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (179 బంతుల్లో 78; 6 ఫోర్లు), హసీబ్ హమీద్ (156 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, జయంత్, షమీ, జడేజా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 103 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.2 ఓవర్లలో 2 వికెట్లకు 104 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (54 బంతుల్లో 67 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు రవీంద్ర జడేజాకు దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్టులో సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. ఇక జట్టు సిరీస్ చేజార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదు. కొంత విరామం తర్వాత నాలుగో టెస్టు డిసెంబర్ 8 నుంచి ముంబైలో జరుగుతుంది. సెషన్-1: రూట్ అర్ధ సెంచరీ నాలుగో రోజు జడేజా తాను వేసిన తొలి ఓవర్లోనే నైట్ వాచ్మన్ బ్యాటీ (0)ని అవుట్ చేసి ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే బట్లర్ (18) కూడా వెనుదిరిగాడు. దూకుడుగా ఆడబోరుున బట్లర్, జయంత్ వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. చేతిగాయంతో ఓపెనింగ్ చేయలేకపోయిన హసీబ్ హమీద్ ఈ దశలో క్రీజ్లోకి వచ్చాడు. మరోవైపు జడేజా బౌలింగ్లో ఫోర్తో 147 బంతుల్లో రూట్ అర్ధసెంచరీ పూర్తయింది. 6 పరుగుల వద్ద హమీద్ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్ను పార్థివ్ వదిలేయగా... రూట్, హమీద్ కలిసి కొద్దిసేపు ఇంగ్లండ్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఏడో వికెట్కు 45 పరుగులు జోడించిన తర్వాత జడేజా ఈ జోడీని విడదీశాడు. స్లిప్లో ఒంటిచేత్తో రహానే అద్భుత క్యాచ్ పట్టడంతో రూట్ వెనుదిరిగాడు. ఓవర్లు: 32, పరుగులు: 78, వికెట్లు: 3 సెషన్-2: హమీద్ పోరాటం లంచ్ తర్వాత హమీద్, క్రిస్ వోక్స్ (47 బంతుల్లో 30; 3 ఫోర్లు) కలిసి మరి కొంత సేపు పోరాడారు. వోక్స్ కొన్ని చక్కటి షాట్లతో చకచకా పరుగులు సాధించగా... హమీద్ దుర్బేధ్యమైన డిఫెన్సతో భారత బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా నిలబడ్డాడు. ఈ స్థితిలో 82 ఓవర్ల తర్వాత కోహ్లి కొత్త బంతి తీసుకోవడంతో మ్యాచ్పై మన పట్టు బిగిసింది. షమీ కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే ఫలితం సాధించాడు. మొదటి బంతినే అతను బౌన్సర్ వేయగా వోక్స్ హుక్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో బంతి అతని హెల్మెట్కు తగిలి దాని స్టెమ్గార్డ్ పడిపోరుుంది. ఆందోళనతో కోహ్లి బ్యాట్స్మన్ వద్దకు వెళ్లి చూశాడు. కొంత చికిత్స తర్వాత వోక్స్ మళ్లీ బ్యాట్ పట్టాడు. అరుుతే తగ్గని షమీ తర్వాతి బంతినే మళ్లీ బౌన్సర్గా విసిరాడు. ఇది వోక్స్ బ్యాట్ హ్యాండిల్కు తగిలి గాల్లోకి లేవగా పార్థివ్ క్యాచ్ అందుకోవడంతో 43 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే మరో బౌన్సర్తో రషీద్ (0)ను కూడా షమీ పెవిలియన్ పంపించాడు. అరుుతే ఆ తర్వాత హమీద్ వేగంగా పరుగులు చేశాడు. అశ్విన్ వేసిన ఒక ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అశ్విన్ మరుసటి ఓవర్లో మరో సిక్స్తో 147 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు రెండో పరుగు తీసే ప్రయత్నంలో అండర్సన్ (5) రనౌట్ కావడంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే విజయ్ (0) వికెట్ కోల్పోరుుంది. మరోవైపు వోక్స్, అండర్సన్ వేసిన వరుస ఓవర్లలో పార్థివ్ రెండేసి బౌండరీలు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. ఓవర్లు: 20.2, పరుగులు: 80, వికెట్లు: 3 (ఇంగ్లండ్) ఓవర్లు: 6, పరుగులు: 33, వికెట్లు: 1 (భారత్) సెషన్-3: పార్థివ్ దూకుడు విరామం తర్వాత కూడా పార్థివ్ జోరు కొనసాగింది. రషీద్ వేసిన ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. పార్థివ్, పుజారా (25) కలిసి రెండో వికెట్కు 81 పరుగులు జోడించారు. అరుుతే విజయానికి మరో 15 పరుగుల దూరంలో రషీద్ బౌలింగ్లో స్వీప్ చేయబోరుు పుజారా వెనుదిరి గాడు. అరుుతే కోహ్లి (6 నాటౌట్) తో కలిసి పార్థివ్ మ్యాచ్ ముగిం చాడు. బ్యాటీ వేసిన బంతిని కవర్స్లో పార్థివ్ ఫోర్ కొట్టడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ఓవర్లు: 14.2, పరుగులు: 71, వికెట్లు: 1 ► 6 మొహాలీ మ్యాచ్తో భారత జట్టు వరుసగా 16 టెస్టుల్లో పరాజయం లేకుండా కొనసాగుతోంది. గతంలో 1985-87 మధ్య ఇండియా వరుసగా 17 టెస్టులు ఓడలేదు. ► 12 కెప్టెన్గా వ్యవహరించిన 20 టెస్టుల్లో కోహ్లికి ఇది 12వ విజయం. గతంలో ధోనికి కూడా తన తొలి 20 టెస్టుల్లో సరిగ్గా ఇలాగే 12 విజయాలు, 2 పరాజయాలు, 6 డ్రాలు ఉన్నాయి. -
ష్... మాటల్లేవ్!
మొహాలీ టెస్టులో వరుసగా మూడో రోజు కూడా కోహ్లి, స్టోక్స్ మధ్య ఘర్షణ కొనసాగింది. తొలి రోజు ఇద్దరూ మాటలతో కత్తులు దూస్తే... ఆ తర్వాత ఇద్దరూ సైగలతోనే తమ ‘భావాన్ని’ ప్రదర్శించారు! టెస్టు మొదటి రోజు స్టోక్స్ అవుటై వెళుతూ కోహ్లిని ఏదో అనడంతో అతను తిరిగి జవాబివ్వడం, ఆ తర్వాత స్టోక్స్ని తప్పు పట్టి ఐసీసీ హెచ్చరించడం తెలిసిందే. రెండో రోజు స్టోక్స్ బౌలింగ్లోనే కోహ్లి అవుటయ్యాడు. జట్టు సంబరాలు చేసుకుంటున్న సమయంలో ‘నేను మాత్రం ఏమీ మాట్లాడను’ అన్నట్లుగా స్టోక్స్ తన నోటిపై చేరుు పెట్టి చూపించాడు. సోమవారం కోహ్లి మళ్లీ అదే తరహాలో బదులిచ్చాడు. అశ్విన్ వేసిన చివరి ఓవర్లో బంతి స్టోక్స్ ప్యాడ్కు తగలడంతో అశ్విన్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించారు. అరుుతే కోహ్లి దీనిపై రివ్యూ కోరాడు. ఫలితం భారత్కు అనుకూలంగా రావడంతో స్టోక్స్ నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ సమయంలో కోహ్లి తన పెదాలను వేలితో మూసి అతడిని సాగనంపడం విశేషం! 2002లో ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఫ్లింటాఫ్, నాటి కెప్టెన్ గంగూలీ మధ్య వివాదాన్ని ఇది గుర్తుకు తెచ్చింది. నాడు ముంబైలో వన్డే గెలిచాక ఫ్లింటాఫ్ షర్ట్ విప్పి సంబరాలు చేసుకోగా, ఐదు నెలల తర్వాత లార్డ్స్లో విజయానంతరం గంగూలీ అదే చేసి చూపించాడు. -
మొహాలీ టెస్టులో విజయంపై భారత్ గురి
-
మన చేతుల్లోకి...
మొహాలీ టెస్టులో విజయంపై భారత్ గురి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 78/4 బ్యాటింగ్లో సత్తా చాటిన జడేజా, జయంత్ భారత టెస్టు చరిత్రలో తొలిసారి ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వచ్చిన బ్యాట్స్మెన్లు ఒకే ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీలు చేసిన వేళ... చివరి నలుగురు ఆటగాళ్లు కలిపి ఏకంగా 213 పరుగులు జోడించిన చోట... మన స్పిన్నర్లు వేసిన ఒక్కో బంతి ప్రత్యర్థికి ఒక్కో గండంలా కనిపిస్తున్న క్షణాన... ఇంగ్లండ్తో సిరీస్లో మరో టెస్టు విజయానికి కోహ్లి సేన రంగం సిద్ధం చేసుకుంది. 134 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్సలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కనీసం దానికి చేరువ కూడా కాకుండానే నాలుగు వికెట్లు కోల్పోరుు ఓటమిని ఆహ్వానిస్తోంది. మ్యాచ్ గెలిచేందుకు టాస్ గెలవడం మాత్రమే సరిపోదని ఇంగ్లండ్కు మొహాలీలో తెలిసొచ్చింది. భారత లోయర్ ఆర్డర్ అద్భుత బ్యాటింగ్ను అడ్డుకోలేక భారీ ఆధిక్యం సమర్పించుకున్న ఆ జట్టు, ఆ తర్వాత మన బౌలింగ్ ముందు నిలబడలేక మూడో రోజే మ్యాచ్పై ఆశలు వదిలేసుకునే స్థితిలో నిలిచింది. ఒకవేళ ప్రత్యర్థి కొంత పోరాడి చిన్నపాటి లక్ష్యం విధించినా... భారత్ అలవోకగా గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, జయంత్ బ్యాటింగ్, అశ్విన్ బౌలింగ్ ఆటలో హైలైట్గా నిలిచారుు. మొహాలీ: టెస్టుల్లో వరల్డ్ నంబర్వన్ హోదాకు తగిన రీతిలో భారత జట్టు సత్తా చాటింది. ఇంగ్లండ్తో సిరీస్లో ప్రతీ ఇన్నింగ్స్ కూ మెరుగు పడుతూ వచ్చిన మన ఆట మరింత పదునెక్కింది. జట్టులోని ముగ్గురు ఆల్రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేయడంతో మూడో టెస్టులో జట్టు విజయావకాశాలను మెరుగుపర్చుకుంది. మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలింది. జో రూట్ (36 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 56 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ఇంగ్లండ్ దానిని అధిగమించి అదనంగా ఎన్ని పరుగులు జోడించగలదో చూడాలి. అంతకుముందు 271/6 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 417 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (170 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించగా... స్పిన్నర్ జయంత్ యాదవ్ (141 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. సెషన్-1: జడేజా జోరు వోక్స్ వేసిన తొలి బంతికే అశ్విన్ (113 బంతుల్లో 72; 11 ఫోర్లు) కొట్టిన బౌండరీతో మూడో రోజు ఆట మొదలైంది. మొదటి అర్ధ గంటలో కొన్ని బంతులు భారత బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టి కాస్త ఉత్కంఠకు గురి చేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అశ్విన్, జడేజా జాగ్రత్తగా ఆడి నిలదొక్కుకోవడంతో వీరి భాగస్వామ్యం 97 పరుగులకు చేరింది. చివరకు స్టోక్స్ తాను వేసిన తొలి ఓవర్లో అశ్విన్ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. తన సహజశైలికి భిన్నంగా క్రీజ్లో నిలదొక్కుకుపోరుు కెరీర్లో తొలిసారి ఒకే ఇన్నింగ్సలో వంద బంతులు ఎదుర్కొన్న జడేజా, ఈ క్రమంలో 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 30, పరుగులు: 83, వికెట్లు: 1 సెషన్-2: రాణించిన జయంత్ లంచ్ తర్వాత కూడా జడేజా దూకుడు కొనసాగగా, మరోవైపు నుంచి జయంత్ రెగ్యులర్ బ్యాట్స్మన్ తరహాలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వోక్స్ వేసిన ఒక ఓవర్లో జడేజా ఏకంగా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. అరుుతే కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చినా, దానిని అతను చేజార్చుకున్నాడు. రషీద్ బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి లాంగాన్లో క్యాచ్ ఇచ్చాడు. జడేజా, జయంత్ ఎనిమిదో వికెట్కు 80 పరుగులు జోడించారు. అనంతరం జయంత్ మరింత బాధ్యతాయుతంగా ఆడి 132 బంతుల్లో తన తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. స్టోక్స్ వేసిన ఒక ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు సునాయాస క్యాచ్లు వదిలేసినా, అదే ఓవర్ చివరి బంతికి జయంత్ వెనుదిరిగాడు. స్టోక్స్ తన తర్వాతి ఓవర్లో ఉమేశ్ను కూడా అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స ముగిసింది. ఓవర్లు: 24.2, పరుగులు: 63, వికెట్లు: 3 సెషన్-3: అశ్విన్ మాయ తొలి ఇన్నింగ్సలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ పరిస్థితి రెండో ఇన్నింగ్సలోనూ మారలేదు. ఈసారి అశ్విన్ దెబ్బ వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. గాయంతో హమీద్ బ్యాటింగ్కు రాకపోవడంతో కుక్, రూట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. నాలుగు బంతుల వ్యవధిలో కుక్ రెండుసార్లు (ఎల్బీడబ్ల్యూ) డీఆర్ఎస్ మద్దతుతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్లో అంపైర్ తీర్పుపై కుక్ అప్పీల్కు వెళ్లాడు. అరుుతే ఆ తర్వాత చక్కటి బంతితో కుక్ (12)ను బౌల్డ్ చేసిన అశ్విన్, కొద్ది సేపటికే అలీ (5)ని కూడా పెవిలియన్ పంపించాడు. పార్థివ్ అద్భుత క్యాచ్కు బెరుుర్స్టో (15) వెనుదిరగ్గా... చివరి ఓవర్లో స్టోక్స్ (5)ను కూడా అవుట్ చేసి భారత్ మూడో రోజును విజయవంతంగా ముగించింది. ఓవర్లు: 38, పరుగులు: 78, వికెట్లు: 4 నన్ను నేను స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా ఊహించుకుంటూ పరుగులు చేయాల్సిన అవసరం లేదు. నేను అసలైన బ్యాట్స్మన్నే. ఇందులో కొత్తగా చెప్పేదేముంది. ఈసారి నెట్స్లో కాస్త ఎక్కువగా సాధన చేశాను. ఫస్ట్క్లాస్ క్రికెట్లో దాదాపు యాభై సగటుతో పరుగులు చేస్తూ వచ్చాను. నేను 90 పరుగులు చేయడం తొలిసారి కావచ్చేమో కానీ నేను బ్యాటింగ్ బాగా చేయగలనని నాకు తెలుసు. అందుకే తొందరపడకుండా జాగ్రత్తగా ఆడాను. భారత్ తరఫున ఆడిన ప్రతీ కీలక ఇన్నింగ్స గుర్తుంచుకోదగిందే. లార్డ్స్లో కూడా జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి అర్ధ సెంచరీ చేశాను. సెంచరీ కోల్పోవడం నిరాశ కలిగించలేదు. అదే షాట్తో నేను ఎప్పుడైనా సిక్సర్ కొట్టగలను కాబట్టి ఆ షాట్ ఆడటాన్ని తప్పు పట్టను. -రవీంద్ర జడేజా జడేజా ‘బ్యాట్’సాము... మూడో రోజు చక్కటి ఇన్నింగ్స ఆడిన రాజపుత్రుడు రవీంద్ర జడేజా మరోసారి తనదైన శైలిలో కత్తిసామును ప్రదర్శించాడు. అర్ధ సెంచరీ చేయగానే బ్యాట్ను కత్తి తరహాలో తిప్పుతూ అభివాదం చేశాడు. తొలి సారి రెండేళ్ల క్రితం లార్డ్స్ లో ఇలా చేసిన అతను ఇటీవల కాన్పూర్ టెస్టులోనూ దానిని చూపించాడు. ‘అది రాజ పుత్రుల ట్రేడ్మార్క్ స్టరుుల్. గ్రౌండ్లోకి నేను కత్తిని తీసుకురాలేను కాబట్టి అలా చేస్తాను’ అని వ్యాఖ్యానించిన ‘సర్’ జడేజా కాలి షూస్పై కూడా రాజ్పుత్ అని ముద్రించి ఉండటం విశేషం. -
ఆధిక్యానికి ఆపసోపాలు
తడబడిన భారత బ్యాటింగ్ ఆదుకున్న అశ్విన్, జడేజా భారత్ 271/6 ఇంగ్లండ్తో మూడో టెస్టు ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన తర్వాత మన జట్టు అలవోకగా భారీ ఆధిక్యం అందుకోగలదని అంతా అనుకుంటే ప్రత్యర్థి రివర్స్లో దెబ్బ కొట్టింది. మరో భారీ స్కోరు సాధించే దిశగా పునాది వేసుకొని రెండో రోజే కోహ్లి సేన పట్టు చేజిక్కించుకోగలదని భావిస్తే అచ్చం మన ఆట కూడా వారినే అనుసరించింది. రుణం తీర్చుకున్నట్లు ఇంగ్లండ్ కూడా క్యాచ్లు వదిలేసి కాస్త అవకాశం ఇచ్చినా దానిని పూర్తి స్థారుులో ఉపయోగించుకోలేక రెండో రోజు భారత బ్యాటింగ్లో అనూహ్య తడబాటు కనిపించింది. కోహ్లి, పుజారా 75 పరుగుల భాగస్వామ్యంతో జట్టు ముందుకు దూసుకుపోతున్న సమయంలో ఎనిమిది పరుగుల వ్యవధిలో పడిన మూడు వికెట్లు ఒక్కసారిగా జోరుకు బ్రేక్లు వేశారుు. ఆపద్బాంధవుడు కోహ్లి కూడా నిష్క్రమించిన దశలో మన జట్టు మరో 79 పరుగులు వెనుకబడి ఉంది. ఆధిక్యం దక్కడం సంగతి తర్వాత, దానిని కోల్పోయే ప్రమాదం కనిపించింది. అరుుతే ఆల్రౌండర్ పదానికి న్యాయం చేస్తూ అశ్విన్, జడేజా అజేయంగా 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఈ ఇద్దరితో పాటు జయంత్ కూడా కలిసి ఎంత ఆధిక్యం అందిస్తారనేదే మూడో రోజు కీలకం. మొహాలీ: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స ఆధిక్యానికి మరో 13 పరుగుల దూరంలో నిలిచింది. చక్కటి బౌలింగ్కు తోడు రెండు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనలు ఇంగ్లండ్కు ఆధిక్యంపై ఆశలు రేపినా... చివరకు భారత్ రెండో రోజును మెరుగైన స్థితిలోనే ముగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్సలో 6 వికెట్లకు 271 పరుగులు చేసింది. అశ్విన్ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 8 ఫోర్లు), రవీంద్ర జడేజా (59 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు కోహ్లి (127 బంతుల్లో 62; 9 ఫోర్లు), పుజారా (104 బంతుల్లో 51; 8 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీలు చేశారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 12 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, స్టోక్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 268/8తో తొలి ఇన్నింగ్సను కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు మరో 3.5 ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను కోల్పోరుు 283 పరుగులవద్ద ఆలౌటైంది. ఆధిక్యం దాదాపుగా ఖాయమైపోరుునా, మూడో రోజు మిగిలిన నాలుగు వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. సెషన్ 1: విజయ్ విఫలం రెండోరోజు ఆరంభంలోనే షమీ ఇంగ్లండ్కు షాకిచ్చాడు. తాను వేసిన మొదటి బంతికే రషీద్ (4)ను అవుట్ చేసిన అతను కొద్ది సేపటికే బ్యాటీ (1)ను కూడా పెవిలియన్ పంపించి ఇంగ్లండ్ ఇన్నింగ్సను ముగించాడు. అనంతరం పార్థివ్ పటేల్ (85 బంతుల్లో 42; 6 ఫోర్లు), విజయ్ (12) భారత ఇన్నింగ్సను ప్రారంభించారు. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు బరిలోకి దిగిన పార్థివ్ ఆత్మవిశ్వాసంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. వరుసగా రెండు ఫోర్లతో వోక్స్ బౌలింగ్లో జోరు కనబరిచాడు. మరో ఎండ్లో 11 పరుగుల వద్ద బట్లర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోరుున విజయ్, ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరుసటి ఓవర్లోనే స్టోక్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత మరో వికెట్ పడకుండా పుజారా, పార్థివ్ జాగ్రత్త పడ్డారు. ఓవర్లు: 25.5, పరుగులు: 75, వికెట్లు: 3 ఇంగ్లండ్: ఓవర్లు: 3.5, పరుగులు: 15, వికెట్లు: 2 భారత్: ఓవర్లు: 22, పరుగులు: 60, వికెట్లు: 1 సెషన్ 2: భారత్ ఆధిపత్యం లంచ్ విరామానంతరం ఆరంభంలోనే భారత్ పార్థివ్ వికెట్ను కోల్పోరుుంది. ఈ దశలో పుజారా, కోహ్లి కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్సను నిర్మించారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రరుుక్ రొటేట్ చేశారు. స్టోక్స్ బౌలింగ్లో రెండు వరుస ఫోర్లతో పుజారా వేగం పెంచాడు. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ వేసిన రెండో బంతి... పుజారా బ్యాట్కు తగిలి లెగ్సైడ్లోకి వెళ్లింది. అరుుతే దానిని అందుకోవడంలో కీపర్ బెరుుర్స్టో విఫలమయ్యాడు. అనంతరం 100 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తరుుంది. ఈ సెషన్లో వీరిద్దరు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓవర్లు: 29, పరుగులు: 88, వికెట్లు: 1 సెషన్ 3: ఆ ఇద్దరు ఆదుకున్నారు 148/2తో పటిష్ట స్థితిలో ఉన్న భారత్ టీ విరామం తర్వాత కష్టాల్లో పడింది. రషీద్ వేసిన రెండో బంతికే పుజారా భారీ షాట్కు ప్రయత్నించి సెషన్ ఆరంభంలోనే వికెట్ పారేసుకోగా... అతని మరుసటి ఓవర్లోనే రహానే (0) డకౌట్ అయ్యాడు. తర్వాత కోహ్లితో సమన్వయ లోపంతో తొలి టెస్టు ఆడుతున్న కరుణ్ నాయర్ (4) రనౌటయ్యాడు. బట్లర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ ఇంగ్లండ్కు ఈ వికెట్ను అందించింది. ఈ దశలో కోహ్లికి అశ్విన్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు వేగంగా ఆడి ఆరో వికెట్కు 10 ఓవర్లలో 48 పరుగులు జోడించారు. అరుుతే 111 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికి స్టోక్స్ బౌలింగ్లో కోహ్లి ఇచ్చిన క్యాచ్ను బెరుుర్స్టో అందుకోవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అశ్విన్, జడేజా కలిసి ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేశారు. చకచకా పరుగులు సాధిస్తున్న ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోరుుంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్నా...నాలుగు ఓవర్లలో భారత్ 21 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో అశ్విన్ 77 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవర్లు: 33, పరుగులు: 123, వికెట్లు: 4 ►2 టెస్టుల్లో ఒకే ఏడాది 500 పరుగులు చేసి 50 వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడు అశ్విన్. గతంలో కపిల్దేవ్ రెండు సార్లు ఈ ఘనత సాధించాడు. -
ఉఫ్... తొలి టెస్టు గట్టెక్కాం !
-
ఉఫ్... గట్టెక్కాం!
ఇంగ్లండ్తో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్ ఆఖరి వరకూ పోరాడిన కోహ్లి అండగా నిలిచిన అశ్విన్, జడేజా రెండో టెస్టు 17 నుంచి వైజాగ్లో లక్ష్యం పెద్దది... కాబట్టి గెలవడం సాధ్యం కాదు... 53 ఓవర్ల పాటు నిలబడితే మ్యాచ్ను డ్రా చేసుకోవచ్చు. తొలి ఇన్నింగ్సలో అందరూ బాగానే ఆడారు... అటు ఐదో రోజు ఉదయం సెషన్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడారు. కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదు... ఇలాంటి స్థితిలో రెండో ఇన్నింగ్స మొదలుపెట్టిన భారత్... వరుసగా వికెట్లు కోల్పోతూ ఓ దశలో ఓటమి ప్రమాదంలో పడింది. నమ్ముకున్న బ్యాట్స్మెన్ అంతా నిరాశపరిచినా... అశ్విన్, జడేజాల సహకారంతో కోహ్లి పోరాడటంతో భారత్ గట్టెక్కింది. ఇంగ్లండ్తో తొలి టెస్టును డ్రా చేసుకుని టీమిండియా ఊపిరి పీల్చుకుంది. రాజ్కోట్: పిచ్ చుట్టూ ఫీల్డర్ల మోహరింపు.... స్పిన్నర్లు వేసే బంతులను ఆడేందుకు బ్రేక్ డ్యాన్స చేసే బ్యాట్స్మెన్... భారత్లో జరిగే టెస్టు మ్యాచ్ల్లో ఆఖరి రోజు ఆటలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం సాధారణమైపోరుుంది. ప్రత్యర్థిని స్పిన్తో ఉక్కిరిబిక్కిరి చేసి మ్యాచ్లు గెలవడం భారత్కు అలవాటుగా మారింది. అరుుతే ఈసారి సీన్ రివర్స్ అరుుంది. ఇంగ్లండ్ జట్టు సంచలన ఆటతీరుతో భారత్ను ఆఖరి నిమిషం వరకూ వణికించింది. భారత్కు అలవాటైన శైలిలో ఆడిన కుక్ సేన తొలి టెస్టును పూర్తి ఆధిపత్యంతో ‘డ్రా’ చేసుకుంది. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆదివారం ఆఖరి రోజు 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 52.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లి (98 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు) చివరి దాకా పోరాడి మ్యాచ్ను డ్రా చేయగలిగాడు. అశ్విన్ (53 బంతుల్లో 32; 6 ఫోర్లు), రవీంద్ర జడేజా (33 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కెప్టెన్కు అండగా నిలబడ్డారు. ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్సలో 75.3 ఓవర్లలో మూడు వికెట్లకు 260 పరుగుల వద్ద ఇన్నింగ్సను డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్, కెప్టెన్ కుక్ (243 బంతుల్లో 130; 13 ఫోర్లు) సెంచరీ సాధించగా... హమీద్ (177 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు ఏకంగా 180 పరుగులు జోడించడం విశేషం. స్టోక్స్ (29 నాటౌట్) కూడా రాణించాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు లభించగా... అశ్విన్ ఒక వికెట్తో సంతృప్తి పడ్డాడు. తొలి ఇన్నింగ్స ఆధిక్యం 49 పరుగులు కలుపుకుని ఇంగ్లండ్కు మొత్తం 309 పరుగుల ఆధిక్యం లభించడంతో భారత్కు 310 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొరుున్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు టెస్టుల సిరీస్లో రెండు జట్లు ప్రస్తుతం 0-0తో సమఉజ్జీగా ఉన్నారుు. రెండో టెస్టు ఈ నెల 17 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. సెషన్ 1: ఓపెనర్ల జోరు ఇంగ్లండ్ ఓవర్నైట్ బ్యాట్స్మెన్ కుక్, హమీద్ నిలకడగా ఆడారు. 122 బంతుల్లో కుక్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ అడపాదడపా బౌండరీలతో మంచి భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ వెళ్లారు. ఓ ఎండ్లో కుక్ వేగం పెంచగా... రెండో ఎండ్లో హమీద్... మిశ్రా బౌలింగ్లో బౌలర్కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తన మరుసటి ఓవర్లోనే మిశ్రా... రూట్ను కూడా అవుట్ చేశాడు. రెండు వికెట్లు వెంటవెంటనే పడ్డా...కుక్ ఏ మాత్రం తడబడకుండా ఆడాడు. ఈ క్రమంలోనే 194 బంతుల్లో తన 30వ టెస్టు శతకం చేశాడు. ఓవర్లు: 29 పరుగులు: 97 వికెట్లు: 2 సెషన్ 2: భారత్ తడబాటు లంచ్ తర్వాత కుక్ మరికొంత వేగం పెంచాడు. వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో అశ్విన్ బౌలింగ్లో లాంగాఫ్లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ వెంటనే ఇన్నింగ్సను డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స రెండో ఓవర్లోనే వోక్స్ బౌలింగ్లో గంభీర్ సున్నాకే అవుటయ్యాడు. తొలి మూడు ఓవర్ల పాటు భారత్ ఒక్క పరుగు కూడా చేయలేదు. పుజారా, విజయ్ ఇద్దరూ ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. 13 పరుగుల వద్ద విజయ్, 10 పరుగుల వద్ద పుజారా ఇచ్చిన క్యాచ్లను ఇంగ్లండ్ ఫీల్డర్లు వదిలేశారు. పుజారా అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఈ సెషన్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్లు: 27.3 పరుగులు: 98 వికెట్లు: 3 సెషన్ 3: ఆఖర్లో ఉత్కంఠ టీ తర్వాత ఐదో ఓవర్లో విజయ్ను కూడా రషీద్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రహానే కూడా అలీ బౌలింగ్లో బౌల్డయ్యాడు. దీంతో కోహ్లి, అశ్విన్ కలిసి మరింత జాగ్రత్తగా ఆడారు. ఉన్నంతసేపు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ కంటే నిలకడగా ఆడిన అశ్విన్... అన్సారీ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సాహా రెండు ఫోర్లు కొట్టినా రషీద్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోరుుంది. అప్పటికి మరో 26 నిమిషాల ఆట మిగిలి ఉంది. ఈ దశలో కోహ్లి జతగా వచ్చిన జడేజా బాగా ఆడాడు. నిజానికి ఈ సమయంలో మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారేదే. అరుుతే జడేజా, కోహ్లి ద్వయం కలిసి ఆ ప్రమాదం జరగకుండా చేసుకున్నారు. ఆఖరి ఓవర్లో మూడు బంతులు వేశాక ఇక ఫలితం రాదు కాబట్టి ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. ఓవర్లు: 34.3 పరుగులు: 123 వికెట్లు: 4 ► 5 భారత్లో కుక్ చేసిన సెంచరీలు. భారత్లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా కుక్ రికార్డు సృష్టించాడు. ► 12 మ్యాచ్ మూడో ఇన్నింగ్సలో కుక్ చేసిన సెంచరీల సంఖ్య. సంగక్కర రికార్డును సమం చేశాడు. అలాగే ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్గా గూచ్ (11) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ► 12 స్వదేశంలో వరుసగా 12 విజయాల తర్వాత భారత్ ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది. చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ జట్టుతో డ్రా తర్వాత భారత్ ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్లూ గెలిచింది. ► 5 ఏడాదిలో వెరుు్య పరుగులు పూర్తి చేయడం కుక్కు ఇది ఐదోసారి. సచిన్ (6) తర్వాత స్థానంలో కుక్ ఉన్నాడు. హేడెన్, పాంటింగ్, సంగక్కర, లారా, కలిస్ కూడా ఐదు సార్లు ఏడాదిలో వెరుు్య పరుగులు చేశారు. -
‘స్పిన్’గుండంలో తిప్పేద్దాం!
భారత్ బలం... ఇంగ్లండ్ బలహీనతా ఇదే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి కోహ్లి సేన మిగిలిన అన్ని జట్లతో పోలిస్తే భారత్ ఏ జట్టుకై నా టెస్టుల్లో జవాబు బాకీ ఉందంటే అది ఇంగ్లండ్కే. భారత్కు స్వదేశంలో ఓటమిని రుచి చూపించిన ఇంగ్లండ్ ఎనిమిదేళ్లుగా పైచేరుు సాధిస్తూనే ఉంది. అందుకే ఈసారి దీనిని ప్రతీకార సిరీస్గా భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రెండో ఆలోచన లేకుండా... ఐదు టెస్టులు జరగబోయే వేదికలన్నింటిలోనూ స్పిన్ పిచ్లు సిద్ధం చేయబోతున్నారు. మన బలం, ఇంగ్లండ్ బలహీనతా స్పిన్. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఒకే సెషన్లో స్పిన్నర్లకు పది వికెట్లు ఇచ్చేసిన ఇంగ్లండ్ ఈ స్పిన్ గుండంలో చిక్కుకోకుండా గట్టెక్కాలంటే తమ స్థారుుకి మించి ఆడాల్సి ఉంటుంది. ఇటు మన స్పిన్ త్రయం కుక్ సేనను చుట్టేసేందుకు సిద్ధమవుతుంటే... అటు ఇంగ్లండ్ నాణ్యమైన స్పిన్నర్ లేక తలపట్టుకుంది. క్రీడావిభాగం : యుద్ధమైనా, ఆటైనా... మన బలం ఏంటో తెలుసుకుని బరిలోకి దిగిన వాడు గట్టిగా నిలబడతాడు. ప్రత్యర్థి బలహీత కూడా తెలిసిన వాడు విజయం సాధిస్తాడు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందు భారత బృందం కూడా ఇలాగే ఆలోచించింది. వారి బలహీతను దృష్టిలో ఉంచుకుని పిచ్లు తయారు చేరుుస్తోంది. జట్టు ఎంపికలో కూడా స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ముగ్గురు స్పిన్నర్లతో ప్రతిసారీ జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు ఈసారి నలుగురితో జట్టును ప్రకటించారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు వీలుగా, ఆ సమీకరణానికి తగ్గట్లుగా వనరులను అందుబాటులోకి తెచ్చారు. ఈ సిరీస్ అంతటా దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. రెండో పేసర్గా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా ఉంటాడు కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడినా జట్టు సమీకరణం సరిగ్గా కుదరొచ్చు. అప్పట్లో అజహర్... ఇంగ్లండ్పై గెలవాలంటే ముగ్గురు స్పిన్నర్లతో ఆడటమే ఉత్తమం అని 1992-93 సీజన్లోనే అజహరుద్దీన్ చూపించాడు. కుంబ్లే (లెగ్ స్పిన్), రాజేశ్ చౌహాన్ (ఆఫ్ స్పిన్), వెంకటపతి రాజు (లెఫ్టార్మ్ స్పిన్)లతో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి, గూచ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ను 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఈసారి కూడా భారత్కు సరిగ్గా అలాంటి కూర్పు దొరికింది. ఆ ముగ్గురు స్పిన్నర్ల తర్వాత మళ్లీ అలాంటి కూర్పే దొరకడం కూడా ఇప్పుడే. ఈసారి అశ్విన్ (ఆఫ్ స్పిన్), జడేజా (లెఫ్టార్మ్ స్పిన్), అమిత్ మిశ్రా (లెగ్ స్పిన్) రూపంలో మూడు రకాల బౌలర్లు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మరోసారి అజహర్ తరహా వ్యూహంతో ఇంగ్లండ్ను చుట్టేయాలనేది భారత జట్టు ఆలోచన. హోమ్వర్క్ చేశారు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ తర్వాత భారత బృందం అశ్విన్, జడేజాలకు విశ్రాంతి ఇచ్చింది. కివీస్తో వన్డే సిరీస్ ముఖ్యమే అరుునా ఈ ఇద్దరూ ఇంగ్లండ్తో సిరీస్కు తాజాగా బరిలోకి దిగాలనేది జట్టు ఆలోచన. ఈ సిరీస్కు భారత్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. ఈ ఇద్దరు స్పిన్నర్లు కూడా విశ్రాంతి సమయంలో ఖాళీగా కూర్చోలేదు. అశ్విన్ ఓ కొత్త తరహా బంతి కోసం ప్రయత్నం చేశాడు. అలాగే ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ వీడియోలు చూశాడు. ముఖ్యంగా కుక్, రూట్ ఇద్దరే ఇంగ్లండ్కు కీలకం కాబట్టి, ఈ ఇద్దరిపై అశ్విన్ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాడని సమాచారం. ఇక జడేజా కూడా పూర్తి స్థారుులో ఈ సిరీస్ కోసం హోమ్వర్క్ చేశాడు. ఈ ఇద్దరితో పాటు అమిత్ మిశ్రా కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ప్రదర్శన, ముఖ్యంగా వైజాగ్ వన్డేలో తీసిన ఐదు వికెట్లు అమిత్ మిశ్రా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటాయనడంలో సందేహం లేదు. కాబట్టి భారత్ తమ ‘స్పిన్’ అస్త్రంతో పూర్తి స్థారుులో సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ ముగ్గురిలో గాయం లేదా మరేదైనా కారణంతో ఎవరైనా అందుబాటులో లేకపోతే నాలుగో స్పిన్నర్గా జయంత్ యాదవ్ అందుబాటులో ఉన్నాడు. నాలుగేళ్లలో మారిపోరుుంది ఇంగ్లండ్ జట్టు 2012లో భారత్లో పర్యటించే సమయంలోనూ స్పిన్ గురించి ఇలాంటి చర్చే జరిగింది. అరుుతే ఆ సిరీస్ను అనూహ్యంగా గెలుచుకుంది. అప్పటి లైనప్తో పోలిస్తే ఇప్పుడు రెండు జట్లలోనూ మార్పులు వచ్చారుు. నాలుగేళ్ల క్రితం అశ్విన్ జట్టులో ఉన్నాడు. నాలుగు టెస్టుల్లో కలిసి 14 వికెట్లు తీశాడు. నాడు భారత్కు మరో స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. తను ఆ సిరీస్లో 20 వికెట్లు తీశాడు. అరుుతే ఈ ఇద్దరూ ఆశించిన స్థారుులో వేగంగా వికెట్లు తీయలేకపోయారు. ఇదే సమయంలో అటు ఇంగ్లండ్ స్పిన్నర్లు మనవాళ్లకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. స్వాన్ 20, పనేసర్ 17 వికెట్లు తీశారు. నిజానికి భారత్ స్పిన్నర్లు, ఇంగ్లండ్ స్పిన్నర్లు సమానంగా వికెట్లు తీసినా... కీలక సమయంలో, విజయానికి అవసరమైన వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ స్పిన్నర్లు సక్సెస్ సాధించారు. అరుుతే ఈ నాలుగేళ్లలో పరిస్థితి మారింది. అశ్విన్ ఇప్పుడు ఓ డైనమైట్లా తయారయ్యాడు. మిగిలిన ఇద్దరూ ఫామ్లో ఉన్నారు. అటు ఇంగ్లండ్ మాత్రం గ్రేమ్ స్వాన్ రిటైరైన తర్వాత మరో నాణ్యమైన స్పిన్నర్ను వెతకడంలో విఫలమైంది. పనేసర్ కూడా కనుమరుగయ్యాడు. ప్రస్తుతం తుది జట్టులో ఉంటారని భావిస్తున్న స్పిన్నర్లకు పెద్దగా అనుభవం లేకపోవడం కూడా ఇంగ్లండ్కు కొంత మేరకు ప్రతికూలం. ఇంగ్లండ్ పరిస్థితి ఏమిటంటే... ఇంగ్లండ్ కూడా పిచ్ స్వభావాన్ని బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడానికి సిద్ధమై వచ్చింది. ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ మొరుున్ అలీ. తను తొలుత బ్యాట్స్మన్గానే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి వారికి ఆల్రౌండర్గా తన సేవలు అందుబాటులో ఉంటారుు. దీంతో జట్టు కూర్పు విషయంలో వారు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అరుుతే ప్రస్తుతం మొరుున్ అలీ ఫామ్ అంతగా బాగోలేదు. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్లో తను 11 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్సలో ఐదు వికెట్లు సాధించాడు. అరుుతే ఢాకాలో పూర్తి స్థారుులో స్పిన్కు అనుకూలించిన పిచ్పై తను విఫలమయ్యాడు. అలాగే లెగ్ స్పినర్ ఆదిల్ రషీద్ కూడా ఇంగ్లండ్ ప్రణాళికల్లో కీలకం. తను కూడా బంగ్లాదేశ్లో విఫలమయ్యాడు. తను రెండు టెస్టుల్లో ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బంగ్లాదేశ్లో అరంగేట్రం చేసిన జఫర్ అన్సారీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తన తొలి మ్యాచ్లో స్పిన్ వికెట్పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అరుుతే తను కూడా ఆల్రౌండర్ కావడం కొంత మేరకు ఇంగ్లండ్కు అదనపు బలం. ఓవరాల్గా ఇంగ్లండ్ కూడా భారత్ తరహాలో మూడు రకాల స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. అరుుతే ఈ ముగ్గురూ పూర్తి స్థారుులో ఫామ్లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. వీరితో పాటు హసీబ్ అహ్మద్ రూపంలో మరో లెగ్స్పిన్నర్ అందుబాటులో ఉన్నాడు. డకెట్, బ్యాటీ కూడా స్పిన్లో సహకరించలగులుతారు. భారత బ్యాట్స్మెన్ను తమకు ఉన్న స్పిన్ వనరులతో నియంత్రించడం కష్టం అని ఇంగ్లండ్కు తెలుసు. అందుకే ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ మాజీ దిగ్గజం సక్లైన్ ముస్తాక్ను సలహాదారుగా పిలిపించుకున్నారు. తనకు కేవలం 15 రోజుల వీసా లభించడంతో తొలి మూడు టెస్టుల వరకూ అందుబాటులో ఉంటాడు. గతంలో కూడా అడపాదడపా ఉపఖండంలో సిరీస్లకు ఇలా పాత తరం స్పిన్నర్లను సలహాదారుగా వాడుకున్నారు. ఇటీవల పాకిస్తాన్తో యూఏఈలో జరిగిన సిరీస్లోనూ సకై ్లన్ ఇంగ్లండ్ జట్టుతో పాటు పని చేశారు. ఆ సిరీస్లో కొంత వరకు ఫలితం సాధించగలిగారు. మరి భారత గడ్డపై ఇంగ్లండ్ స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. వాళ్ల రాణింపుపైనే ఈ సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. -
మిశ్రా మిస్సైల్
అమిత్ మిశ్రా... నిజానికి అంతర్జాతీయ క్రికెట్లోకి ధోని కంటే ముందు వచ్చాడు. దాదాపు 13 ఏళ్ల క్రితం తను తొలి వన్డే ఆడాడు. కానీ ఇప్పటికీ అతను ఆడిన వన్డేల సంఖ్య 36. అలా అని తనేమైనా ఫెరుులయ్యాడా?అంటే లేదు. 4.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 64 వికెట్లు తీశాడు. మరో 15 రోజుల్లో తనకు 34 ఏళ్లు నిండుతారుు. నిజానికి ఇది ఓ క్రికెటర్ రిటైర్మెంట్కు దగ్గరైన వయసు. కానీ మిశ్రా అలా కనిపించడం లేదు. రోజు రోజుకూ మరింత చురుగ్గా తయారవుతున్నాడు. ఒక రకంగా సుదీర్ఘ కెరీర్లో తన నైపుణ్యానికి తగిన గుర్తింపు మిశ్రాకు దక్కలేదు. అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత మారిన పరిణామాలు, కూర్పులతో మరో లెగ్ స్పిన్నర్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమైంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, ఆల్రౌండర్గా జడేజా లేదా మరో స్పిన్ ఆల్రౌండర్ కారణంగా లెగ్ స్పిన్నర్కు అవకాశం లేకపోరుుంది. నిజానికి ఈ సిరీస్లోనూ అశ్విన్కు విశ్రాంతి ఇవ్వకపోరుు ఉంటే మిశ్రా తుది జట్టులో ఉండేవాడు కాదేమో. ఇంతటి క్లిష్ట స్థితిలో కూడా తనకు లభించిన ప్రతి చిన్న అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్న మిశ్రాకు ఇంతకాలానికై నా గుర్తింపు లభించింది. కానీ మిశ్రా రాబోయే మ్యాచ్ల్లో కూడా తుది జట్టులో ఉంటాడా అనేదే అసలు ప్రశ్న. సాక్షి క్రీడావిభాగం షేన్ వార్న్, అనిల్ కుంబ్లే రిటైరైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో లెగ్ స్పిన్నర్ల వైభవం కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కానీ మొహాలీ వన్డేలో టేలర్, రోంచీ అవుటైన బంతులు, విశాఖపట్నంలో నీషమ్ అవుటైన బంతిని చూస్తే లెగ్ స్పిన్ కళను మిశ్రా బతికిస్తున్నాడని అనిపించింది. ఈ మూడు బంతులూ అద్భుతాలే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత మరోసారి అమిత్ మిశ్రా గురించి చర్చ మొదలైంది. వైజాగ్ వన్డేలో తను ఐదు వికెట్లు తీయడం ద్వారా... స్పిన్కు సహకరించే పిచ్లపై తన అవసరం ఎంత ఉందో మరోసారి చూపించాడు. రాబోయే ఇంగ్లండ్ సిరీస్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడితే మిశ్రా కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లే చాలనుకుంటే మరోసారి బెంచ్కే పరిమితం కావలసి వస్తుందేమో అనే ఆందోళన ఉంది. అరుుతే వన్డేల్లో ప్రదర్శన ద్వారా తను కచ్చితంగా టెస్టుల్లో తుది జట్టులోనూ రేసులోకి వచ్చాడు. వికెట్ల స్పెషలిస్ట్ జట్టుకు అవసరమైన సందర్భంలో వికెట్ తీయాలంటే మిశ్రా ఉండాలి. ‘మిశ్రాకు బంతి ఇస్తే కచ్చితంగా వికెట్ తీస్తాడు’ అన్ని స్థారుుల క్రికెట్లోనూ తనకు ఈ పేరు ఉంది. వన్డేల్లో మధ్య ఓవర్లలో బ్యాట్స్మెన్ భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడే సమయంలో వికెట్లు తీయడంలో తను నిపుణుడు. 2014లో బంగ్లాదేశ్లో జరిగిన టి20 ప్రపంచకప్లో మిశ్రా 10 వికెట్లు తీశాడు. అశ్విన్ 11 వికెట్లు తీయగా... రెండో స్థానం మిశ్రాదే. కానీ రెండేళ్ల పాటు తనకు మరో టి20 మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ తనను తీసుకోలేదు. జింబాబ్వేలో ద్వితీయశ్రేణి ఆటగాళ్లతో సిరీస్ ఆడిన సమయంలో మాత్రమే తనకు మళ్లీ అవకాశం వచ్చింది. నిజానికి దీనికి ఎవరినీ తప్పుబట్టలేం. మిశ్రా ఫీల్డింగ్లో బాగా నెమ్మది. బ్యాటింగ్లోనూ లోయర్ ఆర్డర్లో పెద్దగా ఉపయోగపడడు. ఈ రెండు కారణాల వల్ల తను కాస్త వెనకబడ్డ మాట వాస్తవం. అందుకే గత ఏడాది కాలంలో తను ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు కాస్త మెరుగయ్యాడు. నిజానికి తన బ్యాటింగ్ ఇంకాస్త మెరుగుపడితే కచ్చితంగా తను తుది జట్టులో ఉంటాడు. తన కెరీర్లో మిశ్రా ఐదు వన్డేల సిరీస్లో పూర్తిగా ఐదు మ్యాచ్లు ఇప్పటికి రెండుసార్లు మాత్రమే ఆడాడు. రెండు సందర్భాల్లోనూ ఒకసారి 18 వికెట్లు, ఒకసారి 15 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డుల జాబితాలో తొలి రెండు స్థానాలు మిశ్రావే. ఈ గణాంకం చాలు... తనకు పూర్తి స్థారుులో అవకాశం లభిస్తే ఏం చేయగలడో చెప్పడానికి. ఆశావహ దృక్పథం... నిజానికి జట్టుతో పాటే తిరుగుతూ తుది జట్టులో అవకాశం రాకుండా నెలలు నెలలు గడపడం చాలా కష్టం. మ్యాచ్లో లేకపోరుునా పూర్తిగా ఫిట్నెస్తో ఉండాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా కచ్చితంగా రాణించాలనే ఒత్తిడి ఉంటుంది. మానసికంగా కూడా ఇది చాలా కష్టం. అరుునా మిశ్రా నిరాశపడకుండా వేచి చూశాడు. ‘నా చేతుల్లో లేని అంశం గురించి నేనెప్పుడూ ఆలోచించను. నా ఫిట్నెస్ను, బ్యాటింగ్ను మెరుగుపరుచుకోవడమే నా చేతుల్లో ఉంది. అది తప్ప వేరే ఏదీ ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు నా పూర్తి సామర్థ్యంతో జట్టుకు ఉపయోగపడటమే క్రికెటర్గా నా లక్ష్యం’ అని మిశ్రా చెప్పాడు. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్లడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారీ మెరుస్తున్నాడు. అన్ని చోట్లా నిలకడ... కెరీర్ ఆరంభం నుంచి మిశ్రా ఫామ్లో లేడనో, సరిగా ఆడటం లేదనో మాట ఇప్పటివరకూ వినపడలేదు. రంజీల్లో హరియాణా జట్టుకు దశాబ్దానికి పైగా వెన్నెముకలా నిలిచాడు. అలాగే ఐపీఎల్లో మూడుసార్లు హ్యాట్రిక్ తీసిన ఒకే ఒక్క బౌలర్గా ఘనత సాధించాడు. భారత టెస్టు జట్టులోనూ ఏనాడూ నిరాశపరచలేదు. 2015లో శ్రీలంకలో జరిగిన సిరీస్లో ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఆడాలని కోహ్లి భావించడం మిశ్రాకు కలిసొచ్చింది. ఆ సిరీస్లో అశ్విన్కు ధీటుగా రాణించి 15 వికెట్లు తీశాడు. అప్పటి నుంచి జట్టుతో పాటే ఉన్నా... తుది జట్టులో అవకాశాలు పెద్దగా రాలేదు. నిజానికి మిశ్రా టాలెంట్ను భారత్ పూర్తిగా ఉపయోగించుకోలేదు. వయసు దృష్ట్యా తను మహా అరుుతే మరో మూడు, నాలుగేళ్లు ఆడతాడేమో. కాబట్టి కెరీర్ చివరి దశలో అరుునా తనకు అవకాశాలు పెరిగితే... అది భారత క్రికెట్కే మేలు చేస్తుంది. కుంబ్లే ప్రోత్సాహం నిజానికి మిశ్రా కెరీర్ ఆలస్యం కావడానికి కుంబ్లే కూడా ఓ కారణం. కుంబ్లే బాగా ఆడుతున్న సమయంలోనే మిశ్రా కెరీర్ కూడా మొదలైంది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లకు అవకాశం ఉండదు కాబట్టి సహజంగానే అవకాశాలు రాలేదు. 2008లో మొహాలీలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా కుంబ్లే అనారోగ్యం కారణంగా మిశ్రాకు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్లో తన తొలి ఇన్నింగ్సలోనే ఐదు వికెట్లు తీసి సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అదే సిరీస్లో తర్వాతి మ్యాచ్తోనే కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దీంతో మిశ్రాకు ఇక తిరుగులేదని భావించారు. కానీ మూడేళ్లలోనే పరిస్థితి మారిపోరుుంది. అశ్విన్ శకం మొదలైంది. అప్పటినుంచి ముగ్గురు స్పిన్నర్లు ఆడితే తప్ప మిశ్రాకు తుది జట్టులో చోటు లేని పరిస్థితి. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కుంబ్లే కోచ్గా డ్రెస్సింగ్రూమ్లోకి వచ్చాడు. ఒక లెగ్ స్పిన్నర్ బాధను మరో లెగ్ స్పిన్నర్ బాగా అర్థం చేసుకుంటాడన్నట్లు... మిశ్రా పరిస్థితి కోచ్కు అర్థమైంది. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో మూడు మ్యాచ్లకూ మిశ్రా డ్రెస్సింగ్రూమ్కే పరిమితమయ్యాడు. ‘ఆందోళన వద్దు. నీకూ సమయం వస్తుంది’ అని కుంబ్లే ధైర్యం చెప్పాడట. కోచ్ సలహాలు తన బౌలింగ్ శైలిలోనూ మార్పులు తెచ్చాయని చెప్పాడు. ‘ఫీల్డర్లను ఎలా సెట్ చేసుకోవాలి, బంతుల్లో మార్పులు లాంటి విషయాలతో పాటు మానసికంగా దృఢంగా తయారు కావడానికి కుంబ్లే సలహాలు ఉపయోగపడ్డారుు. అలాగే బ్యాటింగ్లో మెరుగుపడటం ఎందుకు కీలకమో వివరించాడు. అనిల్ భాయ్ సలహాలు నాలో ఎంతో మార్పు తెచ్చారుు’ అని మిశ్రా చెప్పాడు. -
'తిప్పి'కొట్టారు
♦ జడేజా, అశ్విన్ విజృంభణ ♦ తొలి ఇన్నింగ్సలో న్యూజిలాండ్ 262 ఆలౌట్ ♦ రెండో ఇన్నింగ్సలో భారత్ 159/1 ♦ విజయ్, పుజారా అజేయ అర్ధసెంచరీలు పిచ్ నుంచి కొంచెం సహకారం లభించినా ఎలా చెలరేగాలో అశ్విన్, రవీంద్ర జడేజాలకు తెలిసినంత ఎవరికీ తెలియదేమో! స్వదేశంలో ఏడాది కాలంగా స్పిన్ ట్రాక్లపై చెలరేగిపోతున్న ఈ ద్వయం కొత్త సీజన్నూ అంతే ఘనంగా ప్రారంభించింది. మూడో రోజు పిచ్పై లభించిన టర్న్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మ్యాచ్ను ‘తిప్పేసింది’. ఏడు పరుగుల వ్యవధిలో ఈ జోడీ ఏకంగా ఐదు వికెట్లు తీసి కివీస్ను కుప్పకూల్చింది. 255/5 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన న్యూజిలాండ్ 262 పరుగులకే ఆలౌటై... ఆత్మరక్షణలో పడింది. తొలి రెండు రోజులూ న్యూజిలాండ్ హవా నడిచిన కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోరుుంది. అశ్విన్, జడేజా కలిసి తొమ్మిది వికెట్లు తీసి భారత్కు తొలి ఇన్నింగ్స ఆధిక్యం అందిస్తే... బ్యాటింగ్లో టాపార్డర్ మరోసారి రాణించింది. బంతి తిరుగుతున్న పిచ్పై స్పిన్నర్లకు లైన్ దొరకకుండా ఆడి పుజారా, విజయ్ మ్యాచ్ను భారత్ చేతుల్లోకి తెచ్చేశారు. ఈ ఇద్దరి అజేయ అర్ధసెంచరీలతో భారత్ ఇప్పటికే 215 పరుగుల ఓవరాల్ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ఇదే తరహాలో సాగితే... భారత్ విజయాన్ని ఆపడం న్యూజిలాండ్కు అసాధ్యమే. అరుుతే అది నాలుగో రోజేనా..? లేక విజయం ఐదో రోజు అందుతుందా..? కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ప్రత్యర్థి ఆధిపత్యానికి భారత స్పిన్నర్లు గండికొట్టారు. పిచ్ నుంచి అందివచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/73), ఆర్.అశ్విన్ (4/93) కలిసి ఏకంగా తొమ్మిది వికెట్లు తీయడంతో కివీ రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడింది. దీంతో 152/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన జట్టు తమ తొలి ఇన్నింగ్సను 95.5 ఓవర్లలో 262 పరుగులకే ముగించాల్సి వచ్చింది. విలియమ్సన్ (137 బంతుల్లో 75; 7 ఫోర్లు), లాథమ్ (151 బంతుల్లో 58; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోంచి (83 బంతుల్లో 38; 6 ఫోర్లు), సాన్ట్నర్ (107 బంతుల్లో 32; 5 ఫోర్లు) కొద్ది సేపు క్రీజులో నిలవగలిగారు. అనంతరం తమ రెండో ఇన్నింగ్స ఆరంభించిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజులో మురళీ విజయ్ (152 బంతుల్లో 64 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (80 బంతుల్లో 50 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు అజేయంగా 107 పరుగులు జోడించారు. రాహుల్ (50 బంతుల్లో 38; 8 ఫోర్లు) వేగంగా ఆడాడు. ప్రస్తుతం భారత్ 215 పరుగుల ఆధిక్యంలో ఉండగా ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స: 318 న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స: గప్టిల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ యాదవ్ 21; లాథమ్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 58; విలియమ్సన్ (బి) అశ్విన్ 75; రాస్ టేలర్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 0; రోంచి ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 38; సాన్ట్నర్ (సి) సాహా (బి) అశ్విన్ 32; వాట్లింగ్ (సి అండ్ బి) అశ్విన్ 21; క్రెరుుగ్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 2; సోధి ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 0; బౌల్ట్ (సి) రోహిత్ (బి) జడేజా 0; వాగ్నర్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 262. వికెట్ల పతనం: 1-35, 2-159, 3-160, 4-170, 5-219, 6-255, 7-258, 8-258, 9-258, 10-262. బౌలింగ్: షమీ 11-1-35-0; ఉమేశ్ యాదవ్ 15-5-33-1; జడేజా 34-7-73-5; అశ్విన్ 30.5-7-93-4; విజయ్ 4-0-10-0; రోహిత్ 1-0-5-0. భారత్ రెండో ఇన్నింగ్స: రాహుల్ (సి) టేలర్ (బి) సోధి 38; విజయ్ బ్యాటింగ్ 64; పుజారా బ్యాటింగ్ 50; ఎక్స్ట్రాలు 7; మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1-52. బౌలింగ్: బౌల్ట్ 5-0-11-0; సాన్ట్నర్ 13-5-33-0; క్రెరుుగ్ 11-1-48-0; వాగ్నర్ 8-3-17-0; సోధి 7-2-29-1; గప్టిల్ 3-0-14-0. తొలి సెషన్: ఆరంభంలోనే మూడు వికెట్లు మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్కు ఆరంభంలోనే స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ షాక్ ఇచ్చారు. లాథమ్ను ఊరించే బంతితో అశ్విన్ ఎల్బీడబ్ల్యు చేశాడు. దీంతో రెండో వికెట్కు 124 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం బరిలోకి దిగిన రాస్ టేలర్ తానెదుర్కొన్న రెండో బంతికే జడేజా బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. మరో రెండు ఓవర్ల అనంతరం నిలకడగా ఆడుతున్న విలియమ్సన్ను అశ్విన్ ఓ అద్భుత బంతితో అవుట్ చేశాడు. దీంతో 11 పరుగుల (24 బంతులు) వ్యవధిలోనే మూడు వికెట్లు నేలకూలడంతో కివీస్పై ఒత్తిడి పెరిగింది. బంతి కూడా ప్రమాదకరంగా టర్న్ అవుతుండడంతో సాన్ట్నర్, రోంచి ఆచితూచి ఆడారు. అరుుతే 80వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడబోరుున రోంచి.. జడేజా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఐదో వికెట్కు వీరిద్దరూ 49 పరుగులు జత చేశారు. ఆ తర్వాత వికెట్ పడకుండా కివీస్ తొలి సెషన్ను ముగించింది. ఓవర్లు: 38, పరుగులు: 87, వికెట్లు: 4 రెండో సెషన్: వణికించిన జడేజా లంచ్ విరామనంతరం కివీస్ బ్యాట్స్మెన్ను జడేజా తన బంతులతో బెంబేలెత్తించాడు. మొదట అశ్విన్ తాను వేసిన తొలి బంతికే సాన్ట్నర్ను అవుట్ చేశాడు. బ్యాట్ ఎడ్జకు తాకిన బంతిని ఎడమ వైపు డైవ్ చేస్తూ కీపర్ సాహా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఆతర్వాత 95వ ఓవర్లో జడేజా కివీస్ను చావుదెబ్బ తీస్తూ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో కోలుకోలేకపోరుుంది. వరుస బంతుల్లో క్రెరుుగ్ (2), సోధిలను ఎల్బీగా అవుట్ చేసి... హ్యాట్రిక్ మిస్ అరుునా చివరి బంతికి బౌల్ట్ చిక్కడంతో పాటు జడేజా ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరుసటి ఓవర్లోనే వాట్లింగ్ (54 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను అశ్విన్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స ముగిసింది. కేవలం ఏడు పరుగుల వ్యవధిలోనే కివీస్ తమ చివరి ఐదు వికెట్లను కోల్పోరుుంది. ఆ తర్వాత 56 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్సను ఆరంభించిన భారత ఆటగాళ్లు కివీస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాహుల్ (50 బంతుల్లో 38; 8 ఫోర్లు) దూకుడు కనబరుస్తూ బౌండరీలతో చెలరేగాడు. 19వ ఓవర్ తొలి బంతికి తను స్లిప్లో క్యాచ్ ఇవ్వడంతో జట్టు టీ విరామానికి వెళ్లింది. ఓవర్లు: 10.5, పరుగులు: 24, వికెట్లు: 5 (కివీస్) ఓవర్లు: 18.1, పరుగులు: 52, వికెట్లు 1 (భారత్) మూడో సెషన్: పుజారా, విజయ్ అర్ధ సెంచరీలు టీ విరామం అనంతరం బరిలోకి దిగిన పుజారాతో పాటు విజయ్ కూడా ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించాడు. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్లోనే పుజారా రెండు ఫోర్లు బాదగా ఆ తర్వాత ఓవర్లో విజయ్ రెండు, పుజారా మరో బౌండరీ సాధించారు. 22వ ఓవర్లో విజయ్ ఎల్బీ కోసం కివీస్ చేసిన భారీ అప్పీల్ను అంపైర్ తిరస్కరించాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన విజయ్ ముందుగా 106 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మూడో రోజు ఆట ముగియడానికి ముందు పుజారా కొట్టిన షాట్ పారుుంట్లో ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ తలకు గట్టిగా తాకింది. అరుుతే తను హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అరుుతే పుజారా వెంటనే వెళ్లి అతడికి సారీ చెప్పాడు. ఇక ఆట చివరి ఓవర్లో పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 28.5, పరుగులు: 107, వికెట్లు: 0 2 ఓ ఇన్నింగ్సలో భారత బౌలర్లు ఆరుగురు బ్యాట్స్మెన్ను ఎల్బీడబ్ల్యు చేయడం ఇది రెండోసారి. 3 మరో మూడు వికెట్లు తీస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ నిలుస్తాడు. 5 ఇన్నింగ్సలో ఐదు వికెట్లకు పైగా తీయడం జడేజాకు ఇది ఐదోసారి. -
దులీప్ ట్రోఫీ చాంప్ ఇండియా బ్లూ
ఫైనల్లో రెడ్పై355 పరుగుల విజయం మ్యాచ్లో జడేజాకు పది వికెట్లు గ్రేటర్ నోయిడా: రవీంద్ర జడేజా (5/95, 5/76) స్పిన్ మాయాజాలంతో దులీప్ ట్రోఫీ తొలి డేనైట్ టోర్నీలో ఇండియా బ్లూ విజేతగా నిలిచింది. ఇక్కడి స్పోర్ట్స కాంప్లెక్స్ స్టేడియంలో బుధవారం ముగిసిన ఐదు రోజుల మ్యాచ్లో బ్లూ జట్టు 355 పరుగుల భారీ తేడాతో ఇండియా రెడ్పై ఘనవిజయం సాధించింది. జడేజా ఫస్ట్క్లాస్ క్రికెట్లో 10 వికెట్లు తీయడం ఇది ఆరోసారి. చివరి రోజు ఇండియా బ్లూ 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్సను డిక్లేర్ చేసింది. కుల్దీప్కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స ఆధిక్యం 337 పరుగులు కలుపుకొని ప్రత్యర్థి ముందు 517 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా రెడ్ రెండో ఇన్నింగ్సలో 161 పరుగులకే ఆలౌటైంది. ధావన్ 29, యువరాజ్ సింగ్ 21 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్సలో ఇండియా బ్లూ ఆరు వికెట్లకు 693 పరుగులకు డిక్లేర్ చేయగా... రెడ్ జట్టు 356 పరుగులకు ఆలౌయింది. -
లయన్స్ గర్జన
► తొలి మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► బ్రేవోకు నాలుగు వికెట్లు ► చెలరేగిన ఫించ్, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్కు ఘనమైన ఆరంభం లభించింది. ముందు బౌలింగ్లో ఆ తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన ఆ జట్టు లీగ్లో విజయంతో బోణీ చేసింది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్ అయిన రైనా, ఇప్పుడు కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. వోహ్రా, మురళీ విజయ్ల శుభారంభం తర్వాత పంజాబ్ను లయన్స్ బౌలర్లు కట్టడి చేశారు. ‘చాంపియన్’ బ్రేవో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బతీయగా... ఆ తర్వాత బ్యాటింగ్లో ఫించ్ మెరుపులు, చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడు గుజరాత్ను గెలిపించాయి. మొహాలి: ఐపీఎల్లో మొదటిసారి బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్లో లయన్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మురళీ విజయ్ (34 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బ్రేవో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం గుజరాత్ లయన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (47 బంతుల్లో 74; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. ఆకట్టుకున్న ఓపెనర్లు.. ఓపెనర్లు విజయ్, వోహ్రా దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవన్కు శుభారంభం అందించారు. ఫాల్క్నర్ వేసిన ఓవర్లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అదే ఓవర్లో బ్రేవో క్యాచ్ వదిలేయడంతో వోహ్రా బతికిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. తొలి వికెట్కు విజయ్, వోహ్రా 50 బంతుల్లో 78 పరుగులు జోడించిన అనంతరం జడేజా ఈ జోడీని విడదీశాడు. వోహ్రా, కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విజయ్ను కూడా జడేజా బౌల్డ్ చేశాడు. ఈ రెండు వికెట్ల తర్వాత లయన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్రేవో తన రెండో ఓవర్లో చెలరేగి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని స్లో బంతులకు మ్యాక్స్వెల్ (2), మిల్లర్ (15; 1 ఫోర్, 1 సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ దశలో స్టొయినిస్ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు), సాహా (25 బంతుల్లో 20) పంజాబ్ను ఆదుకున్నారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఐదో వికెట్కు 45 బంతుల్లో 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో బ్రేవో మళ్లీ సత్తా చాటి సాహా, స్టొయినిస్లను పెవిలియన్ పంపించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే గుజరాత్కు షాక్ తగిలింది. సందీప్ బౌలింగ్లో ముందుకొచ్చి ఆడబోయిన మెకల్లమ్ (0) స్టంపౌటయ్యాడు. అయితే ఫించ్ దూకుడుగా ఆడగా, ఉన్న కొద్దిసేపు రైనా (9 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించడంతో జట్టు ఇన్నింగ్స్లో వేగం తగ్గలేదు. వీరిద్దరు రెండో వికెట్కు 27 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం విశేషం. రైనా వెనుదిరిగినా... మరో ఎండ్లో ఫించ్ 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. ఫించ్, కార్తీక్ 38 బంతుల్లోనే 65 పరుగులు జత చేశారు. ఈ దశలో మరో భారీ షాట్కు ప్రయత్నించి ఫించ్ స్టంపౌట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత జడేజా (8) రనౌట్తో పాటు, కిషన్ (11) వెనుదిరగడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరో 14 బంతులు మిగిలి ఉండగానే కార్తీక్ మ్యాచ్ను ముగించాడు. ►1 బ్రెండన్ మెకల్లమ్ 42 ఇన్నింగ్స్ల తర్వాత ఐపీఎల్లో మరోసారి డకౌట్ అయ్యాడు. తొలి నాలుగు సీజన్లలో మెకల్లమ్ 35 ఇన్నింగ్స్లో నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు ► 4/22 ఐపీఎల్లో డ్వేన్ బ్రేవో తన వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ► 300 టి20 క్రికెట్లో డ్వేన్ బ్రేవో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా గుర్తింపు పొందాడు. 299 వికెట్లతో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (బి) జడేజా 42; వోహ్రా (సి) కార్తీక్ (బి) జడేజా 38; మిల్లర్ (బి) బ్రేవో 15; మ్యాక్స్వెల్ (బి) బ్రేవో 2; సాహా (సి) జడేజా (బి) బ్రేవో 20; స్టొయినిస్ (సి) ఫించ్ (బి) బ్రేవో 33; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; జాన్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-78; 2-91; 3-101; 4-102; 5-157; 6-157. బౌలింగ్: ప్రవీణ్ 4-0-25-0; సాంగ్వాన్ 2-0-21-0; ఫాల్క్నర్ 4-0-39-0; లడ్డా 2-0-21-0; జడేజా 4-0-30-2; బ్రేవో 4-0-22-4. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (స్టంప్డ్) సాహా (బి) సాహూ 74; మెకల్లమ్ (స్టంప్డ్) సాహా (బి) సం దీప్ 0; రైనా (సి) జాన్సన్ (బి) స్టొయినిస్ 20; కార్తీక్ (నాటౌట్) 41; జడేజా (రనౌట్) 8; ఇషాన్ కిషన్ (సి) శర్మ (బి) జాన్సన్ 11; బ్రేవో (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-1; 2-52; 3-117; 4-133; 5-151. బౌలింగ్: సందీప్ 3-0-21-1; జాన్సన్ 4-0-35-1; మోహిత్ 2.4-0-24-0; స్టొయినిస్ 2-0-27-1; అక్షర్ పటేల్ 2-0-17-0; సాహూ 4-0-35-1.