mamata benarjee
-
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
దోషులకు ఉరిశిక్ష విధించాలి: సీఎం మమత
కోల్కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో దోషులకు మూడు నెలల్లో ఉరిశిక్ష విధించాలని పోలీసులను కోరారు. శనివారం దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలీలోని ఓ కాలువలో పదేళ్ల బాలిక శవమై కనిపించిన విషయం తెలిసిందే. ‘నేరానికి రంగు, కులం, మతం లేదు. పోక్సో చట్టం కింద కుల్తాలీ కేసు నమోదు చేసి మూడు నెలల్లోగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరుతున్నా. ఏదైనా నేరం నేరమే. దానికి మతం లేదా కులం లేదు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారం కేసుల్లో దర్యాప్తు జరగుతున్న సమయంలో మీడియా విచారణ చేయటం ఆపివేయాలి’ అని అన్నారు.మరోవైపు.. బాలిక హత్యాచారంపై ఆదివారం దక్షిణ 24 పరగణాలలో నిరసనలు చెలరేగాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, అగ్నిమిత్ర పాల్ నిరసనల్లో పాల్గొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నామని పోలిసులు తెలిపారు. సౌత్ 24 పరగణాల పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలీ మీడియాతో మాట్లాడారు. ‘‘బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా సాయంత్రం తప్పిపోయింది. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం(నిన్న) విచారణ ప్రారంభించాం. విచారణ తర్వాత ఈ రోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. బాలికను తానే హత్య చేశానని నిందితుడు చెప్పాడు. ప్రభుత్వం ఇటువంటి కేసులపై చాలా సీరియస్గా ఉంది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని తెలిపారు. అయితే... ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అత్త ఆరోపణలు చేశారు. బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అవయవాలు విరిగిపోయాయని అన్నారామె. నిందితులకు శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.చదవండి: వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్లో మరో దారుణం -
కోల్కతా: విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు
కోల్కతా: కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో బెంగాల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె ద్వారా తమ నిరసనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిపిన చర్చల అనంతరం 42 రోజుల విరామం తర్వాత జూనియర్ డాక్టర్లు బెంగాల్ వ్యాప్తంగా శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక.. తమ డిమాండ్లలో కొన్నింటికి సీఎం మమత ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు పేర్కొన్నారు. కానీ, ఔట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు.చదవండి: కోల్కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!‘‘ఈరోజు తిరిగి విధుల్లో చేరడం ప్రారంభించాం. జూనియర్ ఈ ఉదయం నుంచి అవసరమైన, అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాల్లో తిరిగి సేవలు ప్రారంభించారు.కానీ ఔట్ పేషెంట్ విభాగాల్లో ఇంకా చేరలేదు. ఇది పాక్షికంగా విధులను ప్రారంభించడం మాత్రమే. నా తోటి ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాలకు బయలుదేరారు. అక్కడ ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించడానికి ‘అభయ క్లినిక్లు’(వైద్య శిబిరాలు) ప్రారంభిస్తారు’’ అని సమ్మె చేసిన డాక్టర్లలో ఒకరైన అనికేత్ మహతో తెలిపారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య ఇటీవల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. అయితే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని ప్రకటించారు. కానీ, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. చదవండి: కోల్కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు -
దీదీ వ్యాఖ్యలు సరికాదు: జూ.డా. తల్లి ఆవేదన
కోల్కతా: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. డాక్లర్లు, వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. మరోవైపు.. డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సీఎం మమత చేసి వ్యాఖ్యాలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఘటన ఆమె చేసి వ్యాఖ్యలు సరైనవి కాదని.. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఎప్పుడూ మా కూతురుతో దుర్గా పూజ జరుపుకునేవాళ్లం. రాబోయే రోజుల్లో మేము దుర్గా పూజనే కాదు మరే ఇతర పండలు జరుపుకోలేము. సున్నితమైన అంశంపై ఆమె(మమతను ఉద్దేశించి) అలా ఎలా మాట్లాడతారు?. మా కూతురిని తిరిగి తీసుకురాగలరా. సీఎం మమత కుటుంబంలో ఇలాంటి దారుణ ఘటన ఆమె ఇలాగే మాట్లాడేవారా? నా బిడ్డకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం మమత అడ్డుకోవాలని చూస్తున్నారు. మా కూతురి మరణంతో మా ఇంట్లో దీపం వెళ్లిపోయింది. మా కూతురిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం డిమాండ్ను చేస్తున్నవారిని కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మమత మాట్లాడుతూ.. ‘‘ నిరసన చేస్తున్న ప్రజలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దుర్గా ఉత్సవాలపై దృష్టి సారించండి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో దుమారం రేపుతున్నాయి.చదవండి: Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా? -
కోల్కతా కేసు: ‘బాధితురాలి తల్లిదండ్రులకు లంచం ఇవ్వలేదు’
కోల్కతా: కోల్కతా ఆర్టీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఇవ్వజూపినట్లు ఓ వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం మమత స్పందిస్తూ.. బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వపై చేస్తున్న అసత్య ఆరోపణలని అన్నారు.‘నేను బాధితురాలి తల్లిదండ్రులకు ఎటువంటి డబ్బులు ఇవ్వజూపలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలు మాత్రమే. బాధితురాలి తల్లిదండులు ఒకటి చెప్పాను. తమ కూతురి జ్ఞాపకం కోసం ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా. ఆర్జీ కర్ ఆస్పత్రిలో నిరసనల తర్వాత రాజీనామా చేస్తానని కోల్కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ వినీత్ గోయల్ అన్నారు. దుర్గాపూజకు ముందు శాంతిభద్రతలు తెలిసినవారిని సీపీగా నియమించాలని యోచిస్తున్నాం. తమ ప్రభుత్వంపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఇందులో లెఫ్ట్ పార్టీలు సైతం పాలుపంచుకుంటున్నాయి. కొందరు పొరుగు దేశంలో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం పేరుతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. కానీ వాళ్లు ఇండియా, బంగ్లాదేశ్ అనేవి రెండు వేర్వేరు దేశాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు’’ అని అన్నారు.#WATCH | Howrah: West Bengal CM Mamata Banerjee says, "We are fulfilling all the requirements of CISF... This is all a conspiracy hatched by the central government and some leftist parties. They are involved in this conspiracy... We are not stopping you for anything... There are… pic.twitter.com/9zGOqjWSSL— ANI (@ANI) September 9, 2024‘ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు మొదటినుంచీ ప్రయత్నించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదు. పోస్ట్మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్స్టేషన్లోనే వెయిట్ చేయించారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా.. ఓ సీనియర్ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేశారు. మేం దాన్ని తిరస్కరించాం’ అని బాధితురాలి తండ్రి మాట్లాడినట్లు ఇటీవల ఓ విడియో వైరల్ అయింది. అదే రోజు మరో వీడియో కూడా కూడా వైరల్ అయింది. అందులో బాధితురాలి తల్లిదండ్రులు.. ‘పోలీసులు డబ్బులు ఇవ్వజూపారని మేము అనలేదు. మా కూతురికి న్యాయం జరగాలని కోరాం’ అని తెలిపారు. దీనిపై అదేరోజు టీఎంసీ ప్రతిపక్ష బీజేపీపై ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని మండిపడింది. -
‘ఉన్నావ్, హత్రాస్ ఘటనల్లో ఏం న్యాయం చేశారు?’
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా మహిళలపై హత్యాచార నేరాలు జరగకుండా ఉండేందుకు సామాజిక సంస్కరణలు అవసరమని సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆర్జీకర్ హత్యాచార ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ సాక్షిగా మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. మహిళలపై ఇటువంటి దారుణ ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయని, బీజేపీ పాలిత గుజరాత్, యూపీలో బాధితులకు న్యాయం ఏళ్లతరబడి కూడా అందడం లేదని ప్రస్తావించారామె. ఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. 2020లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, 2013లో బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం, గత వారం బీజేపీ పాలిత రాజస్థాన్లోని జైపూర్లో ప్రభుత్వ హాస్పిటల్ ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం జరిగాయి. ఆయా ఘటనల్లో ఏం న్యాయం చేశారో బీజేపీ వాళ్లు చెప్పగలరా? అని ప్రశ్నించారామె. అదేవిధంగా బెంగాల్లోని నార్త్ పరగణాలలో జరిగిన హత్యాచారం కేసులో శిక్ష విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. ఇదే కేసులో కలకత్తా హైకోర్టు ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి, మరో ఇద్దరి మరణశిక్షను తగ్గించిన తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారామె. ఉన్నావ్, హత్రాస్ దారుణ ఘటనల్లో బాధితురాలికి న్యాయం జరగలేదని మాత్రం ఎవరూ మాట్లాడరని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు.వాస్తవానికి.. మహిళలపై దారుణమైన నేరాలు, లైంగిక దాడులు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఆ రాష్ట్రాలో జరిగిన ఘటనలకు న్యాయం జరగటం లేదని, పశ్చిమ బెంగాల్లో కోర్టు న్యాయం లభిస్తోందని తెలిపారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను తీసుకురాని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు.. మహిళలపై దారుణాలు జరుగుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె. మీరు(బీజేపీ) తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లే తాను కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీదీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టానికి ‘అపరాజిత’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I express my condolences to the girl who was raped, murdered and to her family. When the RG Kar incident took place on the night of 9th August, I was in Jhargram. On 10th August, the body was found, and on 12th… pic.twitter.com/TjTZS1gJnc— ANI (@ANI) September 3, 2024#WATCH | Kolkata: At the West Bengal Assembly, CM Mamata Banerjee says, "...I had written two letters to the Prime Minister, but I did not get any reply from him, rather I got a reply from the Minister of Women and Child Development, but I also replied to his reply and informed… pic.twitter.com/XKmSOWDj3B— ANI (@ANI) September 3, 2024 -
వాళ్లనెప్పుడూ బెదిరించలేదు: మమతా బెనర్జీ
కోల్కతా: తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమంలో చేసిన ప్రసంగంపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారామె. తాను డాక్టర్లను బెందిరించలేదని బీజేపీ ఆరోపణలకు సీఎం మమత కౌంటర్ ఇచ్చారు. ‘నేను వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. వారి ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసినవారిని నేను ఎప్పుడూ బెదిరించలేదు. నేను బెదింరించినట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు. అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించాను. నా ప్రసంగంలో ఉపయోగించిన పదాలు శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినవి అని స్పష్టం చేశాను. సాధువు సైతం కొన్ని సమయాల్లో స్వరం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరాలు, నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ ప్రస్తావన తీసుకొని మాట్లాడాను’ అని మమత స్పష్టం చేశారు.I detect a malicious disinformation campaign in some print, electronic and digital media which has been unleashed with reference to a speech that I made in our students' programme yesterday. Let me most emphatically clarify that I have not uttered a single word against the…— Mamata Banerjee (@MamataOfficial) August 29, 2024 అయితే బుధవారం సీఎం మమత బెనర్జీ తన ప్రసంగం డాక్టర్లను బెదిస్తున్నట్లు ఉందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ విద్యార్థి విభాగంలోని విద్యార్థుల పని కుట్రదారుల ముసుగు విప్పడం, వారిని భయపెట్టడమని సీఎం మమత అన్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యతో ఆమె నిరసన తెలిపే డాక్టర్లను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. -
నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత
Updates బెంగాల్లో బీజీపీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్కు పంపుతాము. ఆయన ఆమోదించకపోతే మేము రాజ్భవన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది. గవర్నర్ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.Kolkata | West Bengal CM Mamata Banerjee says, "Next week, we will call an Assembly session and pass a Bill within 10 days to ensure capital punishment for rapists. We will send this Bill to the Governor. If he doesn't pass, we will sit outside Raj Bhavan. This Bill must be… pic.twitter.com/GQFPvTStZX— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్సోల్ రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.#WATCH | Asansol, West Bengal: BJP workers stage a protest demanding justice for woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital pic.twitter.com/ZBKJzdOYuG— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ బీజేపీ బంద్ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారు’’ అని అన్నారు. #WATCH | Union Minister and West Bengal BJP President Sukanta Majumdar says, "Kolkata HC has given us the permission for seven-day Dharna. We will start it from tomorrow...We welcome their verdict...There is no democracy here, police cannot stop firing but only stop BJP's… https://t.co/5ASm6Tg990 pic.twitter.com/zfzKuGmIK1— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో 12 గంటల బీజేపీ బంద్లో బీజేపీ నేత కారుపై జరిగిన కాల్పుల్లో డ్రైవర్ మృతి చెందాడు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో 12 గంటల బీజేపీ బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.#WATCH | Kolkata: Union Minister and West Bengal BJP President Sukanta Majumdar joins the protest. BJP has called for a 12-hour 'Bengal Bandh'. (Visuals from Baguiati Mor) pic.twitter.com/n4uXjilIQE— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.West Bengal | Two people got injured in the attack and firing incident on the BJP leader Priyangu Pandey's car, earlier today, in Bhatpara of North 24 Parganas pic.twitter.com/MO2x3vxabB— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ హింసాత్మకంగా మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్ సింగ్ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 "Bombs thrown, vehicle fired on": BJP's Priyangu Pandey claims TMC workers attacked him during Bengal BandhRead @ANI Story | https://t.co/GUPWv28WrO#BJP #TMC #BengalBandh #PriyanguPandey pic.twitter.com/TGlNUNugOg— ANI Digital (@ani_digital) August 28, 2024 పశ్చిమ బెంగాల్లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్లో భాగంగా నందిగ్రామ్లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు. #WATCH | Nandigram | West Bengal LoP Suvendu Adhikari joins BJP's protest, call for 12-hour 'Bengal Bandh'.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna… pic.twitter.com/iLDff6ra2H— ANI (@ANI) August 28, 2024 కోల్కతా బాటా చౌక్లో బంద్ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బంద్లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.#WATCH | West Bengal | Police detains protesting BJP party workers at Kolkata's Bata Chowk12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/vt7MaQjZCv— ANI (@ANI) August 28, 2024 #WATCH | West Bengal | Police detains BJP leader Locket Chatterjee who joined protest after BJP's call for 12-hour 'Bharat Bandh' at Kolkata's Bata Chowk pic.twitter.com/Zd8eAiH0mF— ANI (@ANI) August 28, 2024 బంద్ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్ బంద్ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.#WATCH | West Bengal: BJP MLA Ashok Kirtania says, "Bandh is going on...Police were not able to do anything, therefore, the workers of TMC are here, Mamata sent them...We will not move from here, we will continue the fight..." pic.twitter.com/z4YubShK3h— ANI (@ANI) August 28, 2024సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.#WATCH | Siliguri, West Bengal: 12-hour 'Bengal Bandh' called by the BJP to protest against the state government; security deployed in the area The bandh has been called after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/K8oIGYs5tx— ANI (@ANI) August 28, 2024 బీజేపీ చేపట్టిన బంద్ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.#WATCH | North 24 Parganas | TMC Party workers protest against BJP's 12-hour 'Bengal Bandh' call for today.Train services were disrupted between Bangaon-Sealdah which is now being reinstated pic.twitter.com/ISyiQqBlv6— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్ ధరించారు. ‘‘ఈ రోజు బంద్ ఉంది. కావున తాను హెల్మెట్ ధరించాను’’ అని బస్ డ్రైవర్ తెలిపారు.#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of Government bus in Howrah seen wearing helmetsA bus driver says, "Today is bandh, so we are wearing helmets..." pic.twitter.com/b5GHHD4Ocq— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో బీజేపీ బంద్ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది#WATCH | West Bengal | Police detains protesting BJP workers at Alipurduar.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/tJuKKgMGum— ANI (@ANI) August 28, 2024పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ బెంగాల్లో కొనసాగుతోంది.పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్కు సహరించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. బంద్ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.#WATCH | Kolkata, West Bengal: BJP leader Agnimitra Paul says, "They are going around with a disgusting attitude. They have all become spineless. Police have invalidated the orders of the Supreme Court... They used water canons mixed with chemicals on the protestors... They are… https://t.co/MP0SU69Wwc pic.twitter.com/Dkhj7g5e2Y— ANI (@ANI) August 28, 2024 పశ్చిమ బెంగాల్ల్లో ఇవాళ(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.#WATCH | Kolkata: BJP leader Agnimitra Paul reviews the 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government. pic.twitter.com/AAvoFWrjuj— ANI (@ANI) August 28, 2024ఈ బంద్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.बंगाल कल बंद है#KolkataDoctorDeathCase #bengal_band_haipic.twitter.com/IIUK0rMY0Q— Rastra Janmat (@Rastrajanmat360) August 27, 2024 కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్బగాన్, ఈస్ట్బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్బాల్ మ్యాచ్ను కోల్కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కోల్కతా డాక్టర్ కేసు: 42 డాక్టర్లపై బదిలీపై బీజేపీ ఫైర్
కోల్కతా: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆదేశాల మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు కూడా నిలిపివేశారు. మరోవైపు.. 42 మంది డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం బదిలీపై చేయటంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిస్పందిస్తూ బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మండిపడ్డారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ కోల్కతా మెడికల్ కాలేజీ, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆమె ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా నిరసలను తెలపడానికి ఈ రెండు మెడికల్ కాలేజీలు కేంద్రాలుగా ఉన్నాయి. అందుకే వాటిని సీఎం మమత టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు మెడికల్ కాలేజీల నుంచి ఐదుగురు ప్రొఫెసర్లు బదిలీ చేయబడ్డారు. ఇది సీనియర్ డాక్టర్ల సంఘాన్ని భయపెట్టేలనే ప్రయత్నం. మమతా బెనర్జీ ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు?. ఆగస్టు 16న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 8 పేజీల బదిలీ ఉత్తర్వుల జాబితాను జారీ చేసింది. ఇది ఇప్పటికే గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఇక.. బదిలీ చేయబడిన 42 మంది డాక్టర్లలో ఇద్దరు డాక్టర్ల సంగీతా పాల్, డాక్టర్ సుప్రియా దాస్ గతంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో పని చేశారు. -
కూటమిలో కీలకమైనా.. దీదీపై కాంగ్రెస్ నేత విమర్శలు
కోల్కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు. మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. మరోపైపు.. లోక్సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
‘అయోధ్య ఎంపీకే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
ఎన్డీయే కూటమిపై బెంగాల్ సీఎం మమత సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: ఎన్డీయే కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమంలో తామ పార్టీ పాల్గొనటం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆమె శనివారం టీఎంసీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదు. 400 సీట్లు గెలుస్తామన్న వారు(బీజేపీ) కనీస మెజార్టి మార్క్ కూడా సాధించుకోలేకపోయింది. వెంటనే ఇండియా కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తుందని చెప్పటం లేదు. ... కానీ, పరిస్థితులు మారటాన్ని మేము ఆసక్తిగా చూస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు?’’ అని మమత అన్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు అయింది.మరోవైపు.. గురువారం జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖేర్గే మాట్లాడుతూ.. బీజేపీ తమను పాలించవద్దని ప్రజలు సైతం గ్రహిస్తారని అన్నారు. ఇక.. ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. రేపు (ఆదివారం) ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
కాక్ద్వీప్/మయూర్భంజ్/బాలాసోర్: ‘వికసిత్ భారత్’ సాకారం కావాలంటే ‘వికసిత్ బెంగాల్’ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశి్చమ బెంగాల్లోకి అక్రమ వలసలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని, స్థానిక యువతకు దక్కాల్సిన అవకాశాలను చొరబాటుదార్లు కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రజల భూములను, ఆస్తులను లాక్కుంటున్నారని, ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం పాకులాడుతోందని, అసలైన ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ముస్లింలకు ఓబీసీల పేరిట తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారిచేస్తోందని విమర్శించారు. బెంగాల్లోకి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పశ్చిమ బెంగాల్లోని కాక్ద్వీప్, ఒడిశాలోని మయూర్భంజ్, బాలాసోర్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... దేశ భద్రతను పణంగా పెడుతున్నారు ‘‘ఇతర దేశాల్లో మత హింస కారణంగా వలస వచి్చన హిందువులకు, మతువాలకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తోంది. సమాజంలో ఓ వర్గాన్ని మచి్చక చేసుకోవడానికి రాజ్యాంగంపై దాడి చేస్తోంది. ముస్లింలకు ఓబీసీ హోదా కలి్పంచడాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. కానీ, కోర్టు తీర్పును తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించడం లేదు. ఈ తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లింలను తప్పుదోవ పట్టిస్తోంది. దేశ భద్రతను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పణంగా పెడుతోంది. అక్రమ చొరబాట్లపై చర్యలు తీసుకోవడం లేదు. నవీన్ పటా్నయక్ అనారోగ్యం వెనుక కుట్ర! ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఆరోగ్యంగా హఠాత్తుగా క్షీణించిందని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ పటా్నయక్ తరఫున ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బలమైన లాబీ ఈ కుట్రకు తెరతీసిందా? అనే సందేహాలు లేకపోలేదు. నవీన్ బాబు ఆరోగ్యం క్షీణించడం వెనుక మిస్టరీ ఏమిటో బయటపడాలి. ఒడిశాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నవీన్ పటా్నయక్ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంపై కారణాలు తెలుసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం’’. అని మోదీ స్పష్టం చేశారు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది: నవీన్ పటా్నయక్ తన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
దేశానికి ప్రధానిగా మోదీ అవసరం లేదు: సీఎం మమత
కోల్కతా: తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కోల్కతాలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలు పాల్గొని మమత మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారు. అలా అయితే మోదీ తనకోసం ఒక దేవాలయం కట్టించుకొని అందులో కూర్చోవాలి. అంతేగాని దేశాన్ని ఇబ్బందుల పాలుచేయటం మానుకోవాలని సీఎం మమత ఎద్దేవా చేశారు.‘‘ఒక నేత మోదీని దేవుళ్లకే దేవుడు అంటారు.. మరో నేత పూరీ జగన్నాథ్ స్వామినే మోదీ భక్తుడు అంటారు. ఒకవేళ మోదీ దేవుడు అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. దేవుడు ఎప్పడు అల్లర్లను ప్రేరేపంచడు’’ అని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘‘అటల్ బిహారీ వాజ్పయి వంటి ఎంతోమంది ప్రధాన మంత్రులతో నేను కలిసి పనిచేశాను. వాళ్లు అందరూ నాతో ప్రేమగా మెలిగేవారు. మన్మోహన్సింగ్, రాజీవ్ గాందీ, పీవీ, దేవేగౌడ వంటి ప్రధానులతో పని చేశాను కానీ, మోదీ వంటి ప్రధానిని నేను చూడలేదు. ఇటువంటి ప్రధాని భరతదేశానికి అవసరం లేదు’’ అని మోదీపై సీఎం మమత ధ్వజమెత్తారు.ఇటీవల ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భౌతికంగా జన్మించలేదు. తనను భూమిపైకి దేవుడే పంపాడన్న విషయం తెలిసిందే. అదేవిధంగా బీజేపీ పూరీ పార్లమెంగ్ నియోజకవర్గ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడని వ్యాఖ్యానించిన సంగతి విధితమే. -
బెంగాల్ లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది: ప్రధాని
-
ఈవీఎం ట్యాంపరింగ్పై స్పందించిన ఈసీ
కోల్కతా: లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్పూర్లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో కూడా బీజేపీ ట్యాంపరింగ్కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్ను బరిలోకి దించింది. -
ప్రధాని మోదీ చిందేస్తే.. ఎలా ఉంటుంది!
లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖులపై మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్నట్లు నెట్టింట వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అలా తనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ యానిమేటెడ్ డాన్స్ వీడియోపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘మీలాగే నేను కూడా వీడియోలో నా డాన్స్ చూసి ఎంజాయ్ చేశా. ఎన్నికల సమయంలో ఇది చాలా అద్భుతమైన క్రియేటివిటీ. నిజంగా ఆనందం కలిగిస్తోంది’ అని మోదీ తన డాన్స్ వీడియో పోస్ట్ను ‘ఎక్స్’ లో రీట్వీట్ చేశారు.Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 అయితే ఈ వీడియోను క్రిష్ణా అనే నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘ఈ వీడియో పోస్ట్ చేయటం వల్ల నన్న ఎవరూ అరెస్ట్ చేరని నాకు తెలుసు’ కాప్షన్ జతచేశారు. దీనికి ప్రధాని మోదీ పైవిధంగా స్పందించటం గమనార్హం. ఈ యానిమేటెడ్ వీడియోలో మోదీ ప్రజల ముందు డాన్స్ చేసినట్లు కనిపిస్తారు.దీనికి కంటే ముందు ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. దీనిపై కోల్కతా పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేసిన యూజర్పై చర్యలు తీసుకున్నారు.Mamata Banerjee's video can get you arrested by Kolkata Police.Narendra Modi's video won't get you arrested.But, Modi is dictator. pic.twitter.com/Y42D6g2EJx— Incognito (@Incognito_qfs) May 6, 2024 దీంతో పలువురు నెటిజన్లు.. తమ వీడియోలపై ప్రధానిమోదీ, సీఎం మమత స్పందించిన తీరుపై చర్చించుకుంటున్నారు. ఇక.. ‘మోదీ కూల్ పీఎం’అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే.. మోదీ, మమత యానిమేటెడ్ డాన్స్ వీడియోలను పోస్ట్ చేసి.. ‘మమత బెనర్జీ వీడియో నిన్న కోల్కతా పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తుంది. అదే మోదీ వీడియో అయితే అరెస్ట్ కాము’అని కామెంట్ చేశారు.ఇక.. గతేడాది పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మోదీ వాయిస్తో వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటిని నెటిజన్లు సరదగా క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. -
సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్మెంట్ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
‘టీఎంసీని ఉగ్రసంస్థగా ప్రకటించి.. సీఎం మమతను అరెస్ట్ చేయాలి’
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని, సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. సందేశ్కాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుగుడు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ, సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవని తెలిపారు. ‘సందేశ్కాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవి. అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అప్పడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది. సందేశ్కాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం మమత బాధ్యత వహించాలి. సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని సువేందు డిమాండ్ చేశారు.Paschim Medinipur, West Bengal | Bengal Assembly LoP Suvendu Adhikari says, "All the weapons found in Sandeshkhali are foreign. Explosives like RDX are used in horrific anti-national activities. All these weapons are used by international terrorists. I demand to declare Trinamool… pic.twitter.com/IOfFUknMFL— ANI (@ANI) April 27, 2024 శుక్రవారం సందేశ్కాళీలో సీబీఐ జరిపిన సోదాల్లో టీఎంసీ సస్పెండెడ్ నేత షాజహాన్ షేక్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, ఒక పోలీసు తుపాకీ లభించింది. వాటిని సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ దాడులపై టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ (శుక్రవారం) సీబీఐ పలు చోట్ల సోదాలు చేపట్టింది’ అని ఆరోపణలు చేసింది.జనవరిలో ఈడీ అధికారులుపై టీఎంసీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి శుక్రవారం సీబీఐ పలు చోట్లు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక.. షాజహాన్ షేక్ను బెంగాల్ పోలీసులు ఫ్రిబవరి 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా పీఎం మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ. కేంద్ర ప్రభుత్వ నిధులతో మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15 తేదీన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాల సంబంధించి ఓటర్లకు ఫోన్ సందేశం పంపారని మండిపడ్డారు. బీజేపీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెడుతోందని దుయ్యబట్టారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని.. బీజేపీ ప్రభుత్వ ధనంతో ఓటర్లకు ఫోన్లో సందేశాలు పంపింది. మోదీకి అనకూలంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలకు పాల్పడి మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు’అని డెరెక్ ఓబ్రియన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానిమోదీ, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అందించిన లేఖలో డెరెక్ కోరారు. ఈ సందేశాలు పంపడాకి అయ్యే ఖర్చును కూడా బీజేపీ, నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చులో భాగం చేయాలని డెరెక్ ఓబ్రియన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే డెరెక్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. డెరెక్ ఈసీ, సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన అవి అసత్య ఆరోపణలని మండిపడింది. ఇలా చేయటం వల్ల టీఎంసీ వాళ్లు బెంగాల్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఎద్దేవా చేసింది. మోదీ పేరుతో పంపిన వాట్సాప్ సందేశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. -
CAA: ‘బెంగాల్లో నిర్బంధ శిబిరాలను అనుమతించం’
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు. అస్సాంలో ఉన్న విధంగా పశ్చిమ బెంగాల్కు నిర్బంధ శిబిరాలు అవసరం లేదని అన్నారు. ‘సీఏఏ అనేది ఎన్ఆర్సీ వంటిదే. అందుకే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్సాం ఉన్నట్లు మాకు నిర్బంధ కేంద్రాలు అవసరం లేదు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాము భూస్వాములం కాదని.. అప్రమత్తంగా ఉండే సంరక్షకులమని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టమని అన్నారు. శరణార్థులంతా ఇక్కడే శాశ్వతంగా స్థిరపడవచ్చని సీఎం మమత అన్నారు. బీజేపీ హిందూ మతాన్ని వక్రీకరిస్తోందని.. స్వామి వివేకనంద బోధనలు నుంచి హిందుత్వాన్ని వేరు చేస్తోందని మండిపడ్డారు. సీఏఏతో భారత ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సీఎం మమత దుయ్యబట్టారు. ఇక.. 2019లో విదేశీయులతో కూడిన నిర్బంధ కేంద్రాలను అస్సాం ప్రభుత్వ నోటీఫై చేసిన విషయం తెలిసిందే. వారికి శాశ్వత కేంద్రాల ఏర్పాటు చేసే వరకు జైళ్లను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని దిస్పూర్కు సుమారు 130 కిలోమిటర్ల దూరం మాటియా అనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్బంధ కేంద్రంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
‘మోదీ కలత చెందొద్దని.. భయపడ్డ మమతా’ టీఎంసీపై కాంగ్రెస్ విమర్శలు
కోల్కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన టీఎంసీ.. బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో టీఎంసీతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై ఆశలు పెట్టుకుంది. ఒంటరిగా పోటీచేస్తామని అన్నట్లుగానే.. తాజాగా మొత్తం అభ్యర్థుల జాబితాను టీఎంసీ విడుదల చేయటం గమనార్హం. టీఎంసీ అభ్యర్థులు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో పోరాడాలని ఎప్పటినుంచో భావిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ టీఎంసీకి కౌంటర్ వేశారు. ‘పశ్చిమబెంగాల్లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రకటిస్తూ వచ్చింది. అటువంటి ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలని.. ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇండియా కూటమిగి బీజేపీపై పోరాడాలని భావిస్తోంది’ అని జైరాం రమేష్ అన్నారు. The Indian National Congress has repeatedly declared its desire to have a respectable seat-sharing agreement with the TMC in West Bengal. The Indian National Congress has always maintained that such an agreement has to be finalised through negotiations and not by unilateral… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2024 పీఎంవోకు సమాచారం... టీఎంసీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. ‘భారతదేశంలో ఆమె వంటి ఓ నేతను నమ్మవద్దని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు నిరూపించారు. మమతా బెనర్జీ భయపడుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంటే ప్రధాని మోదీ బాధపడతారు. ఆమె ఇండియా కూటమి నుంచి వైదొలిగిన సమయంలో పీఎంఓకు సమచారం ఇచ్చారు. తన(మమతా) వల్ల మోదీ బాధపడకూడదని.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి పోరాటం చేయవద్దని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధిర్ రంజన్ ఆరోపణలు చేశారు. ఇక.. టీఎంసీ 9మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టడం గమనార్హం. అదే విధంగా ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇక.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ప్రాతినిధ్యం వహిసస్తున్న బహరాంపూర్ సెగ్మెంట్లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను బరిలోకి దించింది టీఎంసీ. ఇక్కడ అధిర్ రంజన్ ఐదు సార్లు విజయం సాధించారు. ఇండియా కూటమిలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ మూడు సిట్లను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ల సర్దుబాటు సరిగా లేదని మమతా బెనర్జీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. చదవండి: అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్ -
సందేశ్ఖాలీపై ఇండియా కూటమి మాట్లాడదేం: ప్రధాని మోదీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం బెంగాల్లోని ఆరమ్బాగ్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సందేశ్ఖాలీలోని మహిళల బాధల కంటే కొంతమంది ఓట్లు సీఎం మమతకు ముఖ్యమా? అని బెంగాల్ ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై విమర్శలు చేశారు. సందేశ్ఖాలీ మహిళల విషయంలో ఇండియా కూటమి మౌనం వహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్లో టీఎంసీ (మాత, భూమి, ప్రజలు) అనే నినాదాన్ని పలుకుతుంది. అలాంటిది సందేశ్ఖాలీ మహిళల విషయంలో టీఎంసీ ఏం చేసింది.? అని మోదీ ప్రశ్నించారు. సందేశ్ఖాలీ ఘటనపై దేశం మొత్తం కోపంగా ఉందని తెలిపారు. ఈ వ్యక్తులు చేసే పనులు చేసి సంఘ సంస్కర్త రాజా రామోహన్రాయ్ ఆత్మ శోకిస్తుందని మోదీ మండిపడ్డారు. ఇక.. సందేశ్ఖాలీ మహిళలపై లైంగిక దాడులు, వారి భూములును లాక్కోవడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్న టీఎంసీ నేత షాజహాన్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన షాజహన్ ఖాన్పై టీఎంసీ.. ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. -
పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతా ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ పోలీసు ఉన్నతాధికారిపై బీజేపీ నిరసనకారుడు కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి సందేశ్ఖాలీలో పర్యటించటం కోసం బీజేపీ కార్యకర్తలతో బయలుదేరారు. దీంతో అక్కడ నిషేదాజ్ఞలు ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసుల్లో.. ఉన్నతాధికారిగా ఒక సిక్కు అధికారి ఉన్నాడు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఒకరు ఆయన్ను ‘ఖలిస్థానీ’ అంటూ అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Today, the BJP's divisive politics has shamelessly overstepped constitutional boundaries. As per @BJP4India every person wearing a TURBAN is a KHALISTANI. I VEHEMENTLY CONDEMN this audacious attempt to undermine the reputation of our SIKH BROTHERS & SISTERS, revered for their… pic.twitter.com/toYs8LhiuU — Mamata Banerjee (@MamataOfficial) February 20, 2024 ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ (ట్విటర్) వేదికగా మండిపడ్డారు. ‘ఈ రోజు బీజేపీ పార్టీ వేర్పాటువాద రాజకీయాలకు తెరలేపటం సిగ్గుచేటు. ఈ ఘటనతో బీజేపీ రాజ్యాంగంలోని అన్ని పరిధిలు దాటింది. బీజేపీ వాళ్ల దృష్టితో టర్బన్ ధరించిన ప్రతి సిక్కు వ్యక్తి.. ‘ఖలిస్థానీ’. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ వాళ్లు సిక్కు సోదరసోదరీమనులను అవమానపరిచారు. వారి త్యాగాలను కించపరిచారు. తాము బెంగాల్ సామాజిక శ్రేయస్సుకు కట్టుబడి ఉంటాం. బెంగాల్ సామాజిక సామరస్యాన్ని భంగం కలిగించేవారిపై చట్టబద్దమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ఘటనపై సదరు పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడారు. ‘నేను టర్బన్ ధరించింనందుకు నన్ను ‘ఖలిస్థానీ’ అని బీజేపీ కార్యకర్తలు అన్నారు. నేను వారిపై చర్యలు తీసుకుంటా. తన మతంపై ఎవరూ దాడి చేయడానికి వీలు లేదు. నేను ఇతరుల వారి మతంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని పేర్కొన్నారు. చదవండి: Sandeshkhali: బెంగాల్ సర్కార్పై హైకోర్టు సీరియస్ -
‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’
ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఒక్కొక్కరుగా తమ పార్టీలు వైదొలుగుతన్నట్లు ప్రకటించటం వల్ల కాంగ్రెస్ ఢీలా పడిపోతుంది. ఇదే సమయంలో ఇండియా కూటమిపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ ఎక్కడ ఉందని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. బెంగాల్లో టీఎంసీ, పంజాబ్లో ఆప్.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తామన్న విషయం తెలిసిందే. మరోవైపు బిహార్లో కూడా నితీష్ కుమార్ ‘ఇండియా కూటమి’కి గుడ్బై చెప్పి బీజేపీలో చేరి మళ్లీ సీఎం అవుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’పై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి ’ అనేది దేశంలోని ఓటర్లలో అపనమ్మకాలను సృష్టించి.. వారిని మోసం చేయడానికే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో కూటమి కనిపించటం లేదన్నారు. ‘అసలు కూటమి అనేదే లేదు. అందులో ఉండే భాగస్వామ్య పార్టీలు బయటకు వెళ్తున్నాయి. బెంగాల్లో ఇండియా కూటమి లేదు. ప్రజలు, ఓటర్లను మోసం చేయడానికి ప్రతిపక్షాలు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. చివరికి సీపీఐ(ఎం) కూడా కూటమిలో లేమని ప్రకటించింది’ అని ఎంపీ దిలీప్ ఘోష్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మొత్తం ఒక్క సీటు కూడా గెవలకుండా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి సగం కంటే తక్కువ సీట్లకే పరిమితం కానుందని తెలిపారు. బిహార్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. అక్కడ విడిగా పోటీ చేయలేరు.. అలా అని కలిసి పోటీ చేయలేని పరిస్థితి ఉందని కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చదవండి: కేరళ గవర్నర్కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే? -
‘రాహుల్ యాత్రకు బెంగాల్లో కూడా అడ్డంకులు’
కోల్కతా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు సంబంధించిన మీటింగ్లకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ప్రభుత్వం అనుమతి ఇవ్వటంలేదని రాష్ట్ర కాంగెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ‘కొన్నిచోట్ల ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కావాలని రోడ్డు అడ్డగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. బహిరంగ సమావేశాలకు కొన్ని ప్రాంతాల్లో అనుమతి లభించటం లేదు. అస్సాంతో సహా.. ఈశాన్య భారతంలో ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ పలు సమస్యలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ కొన్ని చోట్ల రాహుల్ యాత్రకు మినహాయింపులు లభిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ శంతను సేన్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్లోని అధికార యంత్రాంగం రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా వ్యవహరిస్తోందని కౌంటర్ ఇచ్చారు. ‘బెంగాల్లో ‘ఇండియా కూటమి’ ఉనికి కోల్పోవటానికి అధీర్ రంజన్ బాధ్యత వహించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు బెంగాల్లో సమావేశాలు నిర్వహించుకున్నా..ఎవరికీ ఇబ్బందులు కలగవు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది’ అని శంతను సేన్ అన్నారు. ఇక.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయటానికి కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ కారణమని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధీర్ రంజన్.. బీజేపీ వారిలా మాట్లాడేవారని మండిపడ్డారు. రాహుల్ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్లోని కూచ్బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం, శనివారం ఆయన తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. 28వ తేదీన మళ్లీ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు రాహుల్ యాత్ర బిహార్లో ప్రవేశించనుంది. అటుపై 31న పశ్చిమ బెంగాల్లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్.. పశ్చిమ బెంగాల్ వెళ్లటం ఇదే తొలిసారి. అందుకే రాహుల్ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’ -
రాజకీయ సుద్దపూసలు... హిందుత్వం చుట్టూ సరికొత్త రాజకీయం
-
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
సార్వత్రిక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరనుంది. సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్తోపాటు పలు కీలక పార్టీల అధినేతలకు కూడా శ్రీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని వెల్లడించిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధానితో సహా బీజేపీ నేతృత్వంలోని కీలక నేతలు జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొంటే.. ఆ రోజు కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన.. మతం అనేది వ్యక్తి గతమైన విశ్వాసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె జనవరి 22న కోల్కతా సమీపంలోని కాళీఘాటకు వెళ్లి కాళీమాతను దర్శింకుంటానని తెలిపారు. అదేవిధంగా మత సామరస్యం పెంపొందాలని ర్యాలి చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాహుల్గాంధీ అస్సాంలో టెంపుల్ దర్శనం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు జనవరి 22న అస్సాంలోని ఓ గుడిని సందర్శిస్తారని తెలుస్తోంది. ఆ రోజు కాకుండా మరో రోజు.. రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాను రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేనని వెల్లడించారు. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తాను అయోధ్య రాముడిని చాలా సులువుగా దర్శించుకుంటానని తెలిపారు. అప్పటి వరకు రాముడి మందిరం పూర్తిగా నిర్మాణం అవుతుందన్నారు. ఇంకా ఆహ్వానం అందలేదు.. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రస్తుతానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందకపోవటం గమనార్హం. కానీ, ఆయన ఇప్పటికే రామ భక్తిలో నిండిపోయారు. జనవరి 22 రోజును ఢిల్లీ వ్యాప్తంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఆదేశించారు. సుందరకాండ పఠన కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో ఆప్ ప్రభుత్వం నిమగ్నమైంది. దేశ ప్రజలు కోరుకున్నవి జరగాలని అయోధ్య బాలరాముడికి ప్రార్థన చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే.. ‘మహా హారతి’ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనవరి 22న నాసిక్లోని కాలారామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భగవాన్ కాలారామ్కు ‘మహా హారతి’ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో నల్లరాతితో ఉన్న విగ్రహంలో రాముడు దర్శనం ఇస్తారు. రాముడు వనవాస సమయంలో నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో సీతా, లక్ష్మణులతో ఉండేవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జనవరి 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళనాడులో డీఎంకే పార్టీ.. ఆధ్యాత్మికత పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. గత నెలలోనే తాము అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరుకామని తెలిపారు. తాము మతాలకు సంబంధించిన విశ్వాసాలు గౌరవిస్తామని అన్నారు. అయితే రాజకీయ ముగుసులో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలపై నమ్మకం లేదన్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ కౌంటర్ బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ను ప్రారంభించాడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాలను బలోపేతం చేయటమే కాకుండా ఒడిశాలో బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్తో సహా ఇండియా కుటమి నేతలు.. బీజేపీ రామ మందిరాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా వాడుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని మండిపడుతున్నారు. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హజరుకాకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం అయోధ్య ముఖం చూడనన్న ప్రధాని మోదీ! -
TMC: నేతల్లో అంతరాలు లేవు.. మమతా నాయకత్వంలోనే..
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తమ పార్టీ నేతలందరూ ఐకమత్యంతో ఉన్నారని ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఇటీవల టీఎంసీలో సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి అంతరాలు తమ పార్టీ నేతల్లో లేవని సీఎం మమతా బెనర్జీ నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నామని అభిషేక్ స్పష్టం చేశారు. ఆయన 24 పరగణాల నియోజవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదని వస్తున్న వార్తలు కూడా అసత్యమని, పూర్తిగా ఆధారాలు లేనివని అన్నారు. తమ పార్టీలో సీనియర్, జూనియర్ నాయకులు అనే అంతరాలు ఎక్కడా లేవని తెలిపారు. తాము అంతా కలిసికట్టుగా సీఎం మమతా నాయకత్వంలోనే పని చేస్తున్నామని అభిషేక్ పేర్కొన్నాము. ఇక.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో ప్రచారంపై దృష్టి పెట్టానని తెలిపారు. అంతే కానీ, తాను పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడూ దూరంగా లేనని వెల్లడించారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. తనకు అప్పగించే ఏ బాధత్యనైనా పార్టీ కోసం తప్పకుండా పాటిస్తానని అన్నారు. చదవండి: దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య -
ఈడీ అధికారులపై దాడి.. బెంగాల్ గవర్నర్ ఫైర్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందా బోస్ తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బీపీ గోపాలికాను వివరణ ఇవ్వాలన్నారు. ఉత్తర 24 పరగణాలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేయడినికి వెళ్లగా.. ఆయన మద్దతుదారులు ఈడీ అధికారులపైకి దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. రేషన్ పంపిణీ కుంభకోణంలో షాజహాన్కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో శుక్రవారం ఈడీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలనుకున్నారు. ఈడీ సోదాలు.. షాజహాన్ మద్దతుదారులతో దాడులతో ఆందోళనకంగా మారాయి. ఈడీ అధికారులపై జరిగిన దాడిపై రాష్ట్రం గవర్నర్ ఆనందా బోస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ దాడులకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ హింస బాధ్యత మొత్తం ప్రభుత్వంపై ఉన్నదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు. ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘోరమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటన దుర్భరమైన పరిస్థితులకు దారి తీస్తోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని అనాగరిక విధ్వంసం నుంచి కాపాడాలని అన్నారు. ఇటువంటి విధ్వంసాలనను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలైమైతే.. రాజ్యాంగబద్దంగా తనకు ఉండే అధికారలతో తాను చర్యలు తీసుకుంటానని అన్నారు. West Bengal Governor CV Ananda Bose says, "It is a ghastly incident. It is alarming and deplorable. It is the duty of a civilised government to stop barbarism and vandalism in a democracy. If a govt fails in its basic duty, then the Constitution of India will take its course. I… pic.twitter.com/CH7Q12Qx7R — ANI (@ANI) January 5, 2024 అయితే ఈడీ అధికారులపై జరిగిన దాడులను ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడు చేయటం అనేది సిగ్గుపడవల్సిన ఘటన అని దుయ్యబట్టారు. నెలరోజుల నుంచి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లో పంపిణీ చేయాల్సిన సరుకులను సుమారు 30 శాతం దాకా లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ పంపిణీని పక్కదారి పట్టించడంలో మిల్లర్లు, పజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులు కుమ్మకైనట్లు ఈడీ ఆరోపిస్తుంది. చదవండి: రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్కు ఆహ్వానం -
స్వావలంబనకు చిహ్నం ‘వింధ్యగిరి’
కోల్కతా: భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ దేశ స్వావలంబనకు చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. గురువారం ఆమె కోల్కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్యార్డులో వింధ్యగిరిని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా ఏడు యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ‘ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’చేపట్టింది. 2019–22 వరకు అయిదు యుద్ధ నౌకలను నిర్మించి, నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యగిరి ఆరోది. ఆధునిక ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ తర్వాత భారత నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైల్స్ ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు. -
అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా
న్యూఢిల్లీ: లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశ పెట్టిన సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తారని అన్నారు. అమిత్ షా వ్యాఖలపై స్పందిస్తూ.. అమిత్ షా చెప్పింది కరెక్టే వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీలో అధికారాలపై పట్టు కోసం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఎలాగైనా పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న మొండి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం బిల్లును ప్రవేశ పెడుతూ అమిత్ షా ప్రతిపక్ష INDIA కూటమిని టర్గెట్ చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మీరంతా కొత్తగా ఏర్పడిన మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమంటూ వ్యాఖ్యలు చేశారు. సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ అమిత్ షా చెప్పింది వాస్తవం. ఢిల్లీలోనే పార్లమెంటు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం INDIA కూటమిదే. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే INDIA కూటమి ఏర్పడిందన్నారు. NDA బలహీనమైందని అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే మా కూటమి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామంటున్నారు. మాకు కూడా కాషాయమంటే ఇష్టమే... కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’ -
బీజేపీని ఇండియా ఓడించడం ఖాయం
కోల్కతా: 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయెన్స్) కూటమి బీజేపీని తప్పక ఓడిస్తుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అమరుల వార్షిక దినోత్సవ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘బీజేపీని ఓడించేందుకు 26 రాజకీయ పార్టీలు ఏకం కావడం సంతోషంగా ఉంది. వారందరికీ ధన్యవాదాలు. ఇకపై బీజేపీ çహారేగా.. భారత్ జీతేగా అనేదే మా నినాదం. మా భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఇండియా వేదికగానే జరుగుతాయి’అని ఆమె స్పష్టం చేశారు. కూటమి గెలుపుపైనే తన దృష్టంతా ఉందని, ఏ పదవినీ ఆశించడం లేదని తెలిపారు. దేశంలో శాంతిని, బీజేపీ ఓటమినే తాము కోరుకుంటున్నామన్నారు. ప్రజలు బీజేపీని అధికారం నుంచి తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని మమత తెలిపారు. 2024లోనూ బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్న విషయం మనందరం గుర్తుంచుకోవాలని చెప్పారు. మణిపూర్ సంక్షోభంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బేటీ బచావో’ మన కూతుళ్లను కాపాడుకుందాం పథకం ఇప్పుడు ‘బేఠీ జలావో’ మన కూతుళ్లను కాల్చివేద్దాంగా మారిందన్నారు. ప్రతిపక్ష కూటమిలోని నేతలంతా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు. -
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
-
ది కేరళ స్టోరీ బ్యాన్పై సుప్రీం కోర్టు స్టే
ఢిల్లీ: ది కేరళ స్టోరీ చిత్ర విషయంలో పశ్చిమ బెంగాల్ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. మమతా బెనర్జీ చిత్రప్రదర్శనపై విధించిన నిషేదాజ్ఞాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మే 8వ తేదీన బెంగాల్ ప్రభుత్వం ది కేరళ స్టోరీ సినిమాపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బ్యాన్పై ఫిల్మ్ మేకర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. బ్యాన్ ఎందుకు చేశారో వివరణ కోరుతూ మమతా బెనర్జీ సర్కార్కు నోటీసులు జారీ చేసింది సుప్రీం. వాస్తవాలను తారుమారు చేసి ఈ చిత్రం రూపొందించారని, పైగా సినిమాలో ద్వేషపూరిత ప్రసంగాలను ఉన్నాయని, ఈ సినిమాను ప్రదర్శిస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చనే ఉద్దేశంతోనే బ్యాన్ చేసినట్లు సుప్రీం నోటీసులపై బెంగాల్ ప్రభుత్వం బుధవారం వివరణ ఇచ్చుకుంది. ఈ క్రమంలో.. ఇవాళ్టి విచారణ సందర్భంగా బ్యాన్ ఆదేశాలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. చట్టపరమైన నిబంధనలతో చిత్రప్రదర్శన అడ్డుకోవాలని చూడడం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరతాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) సర్టిఫికెట్ జారీ చేసింది. కాబట్టి, శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. చట్టపరమైన నిబంధనలతో ఆపే యత్నం చేయకూడదు అని బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం అప్రకటిత బ్యాన్ను విధించిందని ది కేరళ స్టోరీ నిర్మాతలు సుప్రీంలో విడిగా మరో పిటిషన్ వేయగా.. స్టాలిన్ ప్రభుత్వానికి సైతం గతంలో సుప్రీం నోటీసులు పంపింది. అయితే.. ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ తాము ఎలాంటి నిషేధం విధించలేదని, ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులే స్వచ్చందంగా సినిమా ప్రదర్శన ఆపేశారంటూ తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. తమిళనాడు ప్రభుత్వ అఫిడవిట్ను సుప్రీం కోర్టు రికార్డు చేసింది. అంతేకాదు.. కేరళ స్టోరీ ప్రదర్శించబడే హాలు వద్ద తగిన భద్రత కల్పించాలని, ప్రేక్షకుల భద్రతకూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కేరళ హైకోర్టు ఆదేశాలను జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ సుప్రీంలో ఓ పిటిషన్ వేశారు. ఇదీ చదవండి: ది రియల్ కేరళ స్టోరీ గురించి తెలుసా? -
మమతా బనెర్జీ ఏం చేస్తుందో చూడండి..!
-
హౌరా రైల్వే స్టేషన్ లో హైడ్రామా
-
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
బీజేపీ జంప్జిలానీ ఎమ్మెల్యేకు ఈడీ షాక్?
ఢిల్లీ/కోల్కతా: టీచర్ల నియామక కుంభకోణం ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ సస్పెండెడ్ మంత్రి పార్థ ఛటర్జీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పార్థకు దగ్గరి సంబంధాలున్న అర్పితా ముఖర్జీ ఇంట నోట్ల గుట్టలు వెలుగు చూడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. ఇప్పుడు దర్యాప్తు సంస్థ లిస్ట్లో మరో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, రాయ్గంజ్ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కళ్యాణికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. అతిత్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కృష్ణ కళ్యాణి.. కళ్యాణి సోల్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఫుడ్ మ్యానుఫ్యాక్చురింగ్ కంపెనీని నడుపుతున్నారు. అయితే కోల్కతాకు చెందిన రెండు ఛానెల్స్తో ఆయన కంపెనీ నిర్వహిస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కంపెనీ ఆర్థిక లావాదేవీలపై గత కొంతకాలంగా ఈడీ నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో.. రేపో, మాపో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేయొచ్చని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. 2021లో బీజేపీ టికెట్ తరపున గెలుపొందిన కృష్ణ కళ్యాణి.. పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలోకి మారిపోయారు. ఆ టైంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఆయనపై బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీఎంసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ బాధ్యతలు వహిస్తున్నారు ఈయన. 2016లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న టైంలో టీచర్ నియామకాల అవకతవకలకు పాల్పడినట్లు పార్థా ఛటర్జీపై ఆరోపణలు వెల్లువెత్తగా.. ఆయన సన్నిహితురాలు.. నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ. 50 కోట్లకు పైగా నగదు, ఐదు కేజీలకు పైగా బంగారం బయటపడింది. అదంతా మంత్రి పార్థా ఛటర్జీ సొమ్మేనని, ఆయన తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకునే వాడంటూ అర్పిత వాంగ్మూలం ఇచ్చింది. ఇక రాజకీయ విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిడితో ఆయనపై వేటు వేస్తున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణంలో మాజీ కార్యదర్శి దోషే: కోర్టు -
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
-
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాంధీ మనవడు!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెర మీదకు గోపాల్కృష్ణ గాంధీ పేరు వినిపిస్తోంది. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారిల మనవడైన గోపాల్కృష్ణ గాంధీ.. పోటీలో నిలపాలనే ప్రతిపాదనను వామపక్ష పార్టీలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐఏఎస్, మాజీ దౌత్యవేత్త అయిన గోపాల్కృష్ణ గాంధీ.. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా పని చేశారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ గాంధీ పోటీ చేశారు కూడా. అయితే ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. ఇదిలా ఉంటే.. బుధవారం జరగబోయే విపక్షాల భేటీతో రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించబోయే ఈ భేటీకి దూరం జరిగాయి నాలుగు పార్టీలు. టీఆర్ఎస్, ఆప్, బీజేడీ, అకాలీదళ్ గైర్హాజరు కానున్నాయి. భేటీలో కాంగ్రెస్ ఉన్నందునా తాము భేటీకి దూరంగా ఉంటామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. విపక్షాలకు సీనియర్ నేత షాక్ -
రాష్రపతి ఎన్నికలపై విపక్షాల సమావేశం
-
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పెగాసస్ను చంద్రబాబు ఎవరి కోసం కొన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. పెగాసస్ వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికితీయాలని అన్నారు. ఈ సాఫ్ట్వేర్తో చంద్రబాబు ఏం చేశారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరి సంభాషణలు వినడానికి పెగాసస్ కొన్నారో తెలియాలని మండిపడ్డారు. ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగతనంగా వినడం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు అని ఎద్దేవా చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాన్ని బయట పెట్టిందని గుర్తుచేశారు. పెగాసస్ స్పైవైర్ కొనుగోళ్లు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఎవరి రహస్యాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ వ్యవహారం చేశారో బయటకు రావాలన్నారు. ఇది కేవలం ఏపీ వ్యవహారం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం భావించాలని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఫోన్ సమాచారం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని మండిపడ్డారు. ఇంత పెద్ద నేరానికి పాల్పడిన చంద్రబాబుపై చర్యలు అవసరమని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో సెక్షన్ 8 గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఓ సీనియర్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చెప్పిన దశలో చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. -
సాక్షి కార్టూన్ (04-02-2022)
-
సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్ మెసేజ్లు.. అనైతికమని ఎంపీ ఫైర్
కోల్కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు. గవర్నర్ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
మూడు స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఉప ఎన్నికలు జరిగిన దిన్హత, గోసబా, ఖర్దహా, శాంతిపూర్ నాలుగు నియోజకవర్గాల్లో అధికార తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ నాలుగు స్థానాల్లో ఓటమిపాలు కాగా ఏకంగా మూడు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ విజయం ప్రజల విజయం. విద్వేషంతో రాజకీయం చేసేవారిని కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే టీఎంసీని బెంగాల్ ప్రజలు ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బెంగాల్ను అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో నిలుపుతాము’ అని సీఎం మమతా ట్విటర్లో పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రియన్ స్పందిస్తూ.. ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ, సీపీఐ పార్టీలు రెండు, మూడు స్థానాల కోసం పోటీపడ్డాయని ట్వీటర్లో తెలిపారు. -
టీఎంసీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనాతా పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విటర్ వేదికగా విమర్శల పర్వం కొనసాగుతోంది. భబానీపూర్ జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీపై టీఎంసీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, భవానీపూర్లో జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఉద్దేశ పూర్వకంగా దూరంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్... ఎంపీ లాకెట్ ఛటర్జీపై ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా, టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఖండించారు. భబానిపూర్ ఉప ఎన్నికలకు దిలీప్ ఘెష్, సువేందు అధికారి క్యాంపెయిన్ చేశారని తెలిపారు. తాను.. ఉత్తర ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్గా అక్కడ దృష్టిపెట్టానని అన్నారు. ఈ ఉప ఎన్నికలలో 41 ఏళ్ల హైకోర్టు న్యాయవాది గ్రీన్ హర్న్ ప్రియాంక టిబ్రేవాల్.. మమత బెనర్జీకి వ్యతిరేకంగా బరిలో నిలబడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3 రానున్నాయి. Ha Ha! Don't worry. Mamatadi will win with large margin. U want this also. I know that u hv to write in favour of yr party. But still I thank u that even in this reply also u didn't mention the name of the bjp candidate. कहि पे निगाहे, कहि पे निशाना। Well done. https://t.co/3ew8YnUfP4 — Kunal Ghosh (@KunalGhoshAgain) September 27, 2021 చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమత, కేంద్రంలోనీ ఎన్డీయే ప్రభుత్వం మధ్య ఘర్షణ ఇంకా చల్లారడం లేదు. ఇటలీలో జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరగా విదేశాంగ నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇటలీలో అక్టోబర్లో జరుగబోయే ప్రపంచ శాంతి సదస్సుకు పోప్ ఫ్రాన్సిస్, జర్మన్ చాన్సలర్ ఆంజెలా, ఇటలీ ప్రధాని మారియోలు హాజరుకానున్నారు. మమతను సైతం ఇటలీ ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. అందులో పాల్గొనడానికి తనకు అనుమతి ఇవ్వాలని మమత కోరగా విదేశాంగ శాఖ నిరాకరించింది. దీదీకి గతంలో చైనాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు ఇటలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవాన్ష్ భట్టాచార్య దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: సైకిల్పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.. -
టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ
సాక్షి, కోల్కతా: టీఎంసీ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపణలు చేశారు. ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 9.10 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న కూడా బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్లో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఓ పేలుడు సంభవించింది. కొందరు వ్యక్తులు ఆయన ఇంటి గేటుపై బాంబులు విసిరారు.ఈ కేసు విచారణను ప్రస్తుతం ఎన్ఐఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. పేలుడు అనంతరం ఆయ మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులు వెనుక ఉందని ఆరోపించారు. తనను, తన సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగాల్లో ప్రస్తుతం గూండారాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను నార్త్ 24 పరగణాస్ అధ్యక్షుడు పార్థ భౌమిక్ ఖండించారు. ఆయా పేలుళ్లకు బీజేపీ ఎంపీనే ఏదో ఒక రకంగా కారణమైఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. చదవండి: బ్లాక్మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ -
మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ
కలకత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 294 స్థానాల్లో 213 ఎమ్మెల్యేలను గెలుచుకుని ముచ్చటగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే మమతా ఓటమి మాత్రం ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆరు నెలల్లోపు అసెంబ్లీ సభ్యురాలు కాకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందే. చదవండి: తండ్రిపై పోలీస్స్టేషన్లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు విసిరిన సవాల్ను స్వీకరించి నందిగ్రామ్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సవాళ్ల పర్వంలో త్రుటిలో పరాజయం పొందారు. ఆమెను బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచారు. సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్నారు. 16వ తేదీ ఉపసంహరణ. ఈ స్థానంతో పాటు మరో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
Mamata Banerjee: వ్యాక్సినేషన్ సరఫరాలో కేంద్రం వివక్ష
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రం తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం వ్యాక్సినేషన్ సరఫరా చేయడంలో తమ రాష్ట్రంపై వివక్షత చూపిస్తోందని అన్నారు. తాము 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలని మోదీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయినప్పటికీ కేంద్రం వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బెంగాల్లో ఎక్కడ వ్యాక్సిన్ను వృథా చేయలేదని అన్నారు. ఇప్పటివరకు 4 కోట్ల వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి తమకు ఇంకా 14 కోట్ల డోసులు అవసరమని తెలిపారు. బెంగాల్ ప్రజలందరకీ వ్యాక్సినేషన్ వేయటమే తమ లక్ష్యమని అన్నారు. కేంద్రం ప్రభుత్వం నల్లధనం బయటకు తెస్తామని అమలు చేయలేని వాగ్దానాలు చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేయగలిగే వాటిని మాత్రమే చేప్తామని తెలిపారు. ప్రజలకు పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని అన్నారు. నిన్న(మంగళవారం) పశ్చిమబెంగాల్లోని జల్సాయిగురి సదర్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కోసం స్థానికులు ఎగబడ్డారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. దీనిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం మమతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ వేయిస్తామని.. సంయమనం పాటించాలని కోరారు. చదవండి: వేరియంట్ల గుట్టు తేలుద్దాం..నమూనాల సేకరణ ఇలా -
అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులు కావు: మమత
కోల్కతా: ప్రదాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పాలసీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశానికి చెందిన ఆస్తులను అమ్మడాన్ని తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని, విభ్రాంతిని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఆయా ఆస్తులు ప్రధాని మోదీ, బీజేపీలకు చెందినవి కాదని విమర్శించారు. దేశ ఆస్తులను వారికి నచ్చినట్లుగా అమ్ముకోలేరని దుయ్యబట్టారు. చదవండి: నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె -
మమతా ఢిల్లీ పర్యటన.. విపక్షాల ఏకీకరణే ప్రధాన ఎజెండా
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఢిల్లికి వెళ్లనున్నారు. ఆమెతో పాటు తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ, యంఎస్ బెనర్జీలు హస్తినాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ అధినేత్రి, సోనియా గాంధీ, శరద్ పవార్ సహ విపక్ష నేతలందరిని కలువనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఏకీకరణ దిశగా మమతా బెనర్జీ పర్యటన సాగుతుందని టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా, ఈనెల 28న పత్రిపక్ష పార్టీలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అపాయింట్మెంట్ మమతా.. ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నట్లు తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీని తృణముల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సారథిగా ఏకగ్రవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మమతా ఇప్పటి వరకు 7 సార్లు ఎంపీగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమైందని మమతా బెనర్జీ విమర్షిస్తున్నారు. మమతా ఢిల్లీ పర్యటన గురించి టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ.. బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన పరిస్థితుల్లో 2024 విపక్షల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి రేసులో మమతా ముందు వరసలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని తెలిపారు. ఇక దీదీ ఢిల్లీ పర్యటన ప్రకటనతో హస్తిన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
నాడు ధిక్కరించిన మమత నేడు మోదీతో భేటీకి సిద్ధం
కలకత్తా: అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మమతా బెనర్జీ తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మే నెలలో యాస్ తుఫాను సమయంలో పశ్చిమ బెంగాల్ పర్యటనకు ప్రధాని మోదీ రాగా సీఎం మమత వ్యవహారించిన తీరు సంచలనమైన విషయం తెలిసిందే. ఐదు నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయింది. అనంతరం ఎన్నికలు జరిగాయి. మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడం ఆనవాయితీ. ఆమె బాధ్యతలు చేపట్టి రెండు నెలలకు పైగా అయినా ఇప్పటివరకు ప్రధానిని కలవలేదు. తాజాగా గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఎం మమత ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తాను ఢిల్లీ వెళ్తానని ప్రకటించారు. ‘రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తా. ప్రధానిని కలుస్తా. దాంతోపాటు రాష్ట్రపతిని కూడా కలుస్తా’ అని తెలిపారు. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది అధికారిక పర్యటన అని, రాజకీయ పర్యటన కాదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించేందుకు వెళ్తున్నారని స్పష్టం చేస్తున్నారు. అనంతరం రాష్ట్రపతిని కలిసి పెగాసెస్ ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇటీవల మమత మామిడిపండ్ల దౌత్యం కూడా నెరిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపించడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ పర్యటనలో మరికొందరిని కలిసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీటితో పాటు ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతు పలకనున్నారని సమాచారం. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరాటం తీవ్రం చేస్తానని మమత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిపక్ష నాయకులను కూడా మమత కలిసి చర్చించనున్నారని టీఎంసీ నేతలు చెబుతున్నారు. -
21న దేశవ్యాప్తంగా మమత ప్రసంగం ప్రసారం
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికార పీఠమెక్కిన టీఎంసీ, 2024 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ వ్యూహంలో భాగంగా ఏటా జూలై 21న జరిగే అమరవీరుల దినోత్సవం రోజు సీఎం మమతా బెనర్జీ ప్రసంగం బెంగాల్తోపాటు వివిధ రాష్రాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. బెంగాల్తోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, త్రిపురల్లో ఏర్పాటయ్యే భారీ స్క్రీన్లపై ఈ ప్రసంగాన్ని ప్రసారం చేయనుంది. అమరవీరుల దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ వర్చువల్గా బెంగాలీలో చేసే ప్రసంగం వివిధ భారతీయ భాషల్లోకి అనువదించి, ప్రసారం చేస్తామని టీఎంసీ నేత ఒకరు వెల్లడించారు. 21న దీదీ ప్రసంగాన్ని ప్రజలంతా చూసేలా గుజరాత్లోని పలు జిల్లాల్లో భారీ స్క్రీన్ టీవీలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రం తమిళనాడుపై కన్నేసిన టీఎంసీ.. దివంగత జయలలిత మాదిరి గా, మమతా బెనర్జీని ‘అమ్మ’గా పేర్కొంటూ ఇప్పటికే చెన్నైలో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. 1993లో ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్తో అప్పటి యూత్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ఆ ఘటన చోటుచేసుకున్న జూలై 21ని అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది. -
మమత పిటిషన్పై 12న విచారణ
కోల్కతా/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12న ఆ పిటిషన్పై విచారణ జరుపుతామని బుధవారం వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేసింది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) సూచించింది. మమతా బెనర్జీ పిటిషన్ను జస్టిస్ షంపా సర్కార్ విచారించారు. మొదటగా ఈ పిటిషన్ జస్టిస్ కౌశిక్ చంద్ర వద్దకు వెళ్లినప్పటికీ, విచారణ నుంచి ఆయనే స్వయంగా తప్పుకున్నారు. దీంతో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేశ్ బిందాల్ ఈ కేసును జస్టిస్ షంపా సర్కార్ ధర్మాసనానికి బదిలీ చేశారు. మమత పిటిషన్ను బదిలీ చేయండి నందిగ్రామ్లో తన గెలుపును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్రం వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మమత పిటిషన్పై పశ్చిమ బెంగాల్ బయట విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఈసీని కలవనున్న టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడంపై జూలై 15న కేంద్ర ఎన్నికల కమిషన్ను (సీఈసీ) కలవనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారిపై సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీకి ఎన్నిక కాని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎం పదవిలో ఉండగలరు. మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి గెలవాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు, శాసన సభ్యులు మరణించగా ఖాళీ అయిన మరో రెండు స్థానాలకు ఎన్నికలు ప్రకటించాలన్న డిమాండ్తో తృణమూల్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు థర్డ్ వేవ్ వచ్చేవరకు వేచి చూస్తున్నారా? అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఎన్నికల కమిషన్ను విమర్శించారు. -
బెంగాల్ మేలు కోసం ప్రధాని కాళ్లు పట్టుకుంటా: మమత
-
Mamata Banerjee: దీదీ పోటీచేసేది అక్కడి నుంచేనా?
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించి మూడోసారి పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కషి చేసిన ఆమె నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. బీజేపీ పక్కా వ్యూహంతో ఆమె స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో మమత దానిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంపై ఓ స్పష్టత వచ్చిందని సమాచారం. మమతా బెనర్జీ కోసం తన పదవిని వదులుకునేందుకు భవానీపూర్ ఎమ్మెల్యే ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ శుక్రవారం రాజీనామా చేసినట్టు సమాచారం. ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మమతా బెనర్జీ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. మమతా పోటీ చేసే స్థానంపై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. ఏం జరగనుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే భవానీపూర్ నుంచే మమత 2016లో గెలిచిన విషయం తెలిసిందే. ఆ స్థానం టీఎంసీకి కంచుకోట. దీంతో మమత గెలుపు సునాయాసమేనని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ -
West Bengal: ఇద్దరు మంత్రుల అరెస్ట్, టీఎంసీలో కలవరం
కలకత్తా: పశ్చిమబెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్ ఆపరేషన్లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్పై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్ హకీమ్ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. ఈ సంఘటనతో అగ్గి మీద గుగ్గిలమైన మమతా వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వారిద్దరితో పాటు తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. విచారణ చేపడుతున్నాయి. ఇటీవల బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్పెషల్ కోర్టులో చార్జ్షీట్ సీబీఐ దాఖలు చేసింది. దీంతో సీబీఐ దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. దీనిపై కొద్దసేపట్లో సీబీఐ అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. 2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో వీరంతా కెమెరా ముందే డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్రం కక్షపూరితంగా మంత్రులను అరెస్ట్ చేసిందని.. ఓటమితో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓడిపోయిన మమతాకు ఉన్న ఒకేదారి ఏమిటో తెలుసా..?
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో మూడోసారి అద్భుత మెజార్టీ స్థానాలతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్కు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోవడం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 217 ఎమ్మెల్యేలు గెలిచారనే సంతోషం మమతాకు లేకుండాపోయింది. అయితే ఆరు నెలల వరకు మమతాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారానికి ఎలాంటి అడ్డు లేదు. కాకపోతే ఆరు నెలల వరకు ఎలాగైనా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ఎన్నికై ఉండాలి. లేకపోతే ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశాన్ని కోల్పోతుంది. శాసనమండలి పశ్చిమబెంగాల్లో లేకపోవడంతో ఎమ్మెల్సీగా ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ ముందు ఉన్న ఒకే మార్గం ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే కావాల్సిందే. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా తీవ్రంగా ఉండడంతో పశ్చిమబెంగాల్లోని సంసర్గంజ్, ముర్షిదాబాద్ స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించలేదు. ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట మమత పోటీ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకచోట మమత గెలిస్తే ముఖ్యమంత్రిగా సేఫ్గా ఉంటుంది. లేకపోతే ఆమె స్థానంలో మరొకరిని నియమించాల్సి వస్తుంది. అయితే రెండు స్థానాలు కాబట్టి బీజేపీ తీవ్ర శక్తులు ఒడ్డి మమతాను ఓడించే ప్రయత్నం చేస్తుంది. తాజా ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కన్నా మమతను నందిగ్రామ్లో ఓడించేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. మమతను ఓడిస్తామని చేసిన శపథం నెరవేర్చుకుంది. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు జరిగే ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ దృష్టి సారించింది. మమతను ఓడించి మరొకసారి మమతకు షాకిచ్చేలా వ్యూహం రచిస్తోంది. చదవండి: అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
మమతా మ్యాజిక్: బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా స్పందించారు. ఈ విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు. దీనిపై తాము ఆత్మ పరిశీలన చేసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు దీదీకే పట్టం కట్టారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమెనే సీఎం కావాలని కోరుకున్నారన్నారు. బెంగాల్ ఎన్నికల్లోతమ పార్టీ వైఖరి, వైఫ్యల్యం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫలితాల తీరుపై ఆరా తీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందని కైలాష్ తెలిపారు. అలాగే బీజీపీ ఎంపీలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటం చూసి తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. సంస్థాగత సమస్యలా, లేక ఇన్సైడర్, ఔట్సైడర్ చర్చ వల్లా అన్నది చూడాలి. కాగా రాష్ట్రంలోని 292 నియోజకవర్గాలలో 201 స్థానాల్లో అధిక్యాన్ని ప్రదర్శిస్తూ బెంగాల్లో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అటు బీజేపీ 82 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంఠను రాజేసీన నందీగ్రామ్లో చివరికి మమత 1200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం. చదవండి : మోదీకి షాకిచ్చిన దీదీ: వైరలవుతున్న మీమ్స్ వ్యూహకర్తగా తప్పుకుంటున్నా, విశ్రాంతి కావాలి: ప్రశాంత్ కిశోర్ -
మమతకు చెమటలు పట్టిస్తున్న సువేందు
-
నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ
లేటెస్ట్ అపడేట్ : నందిగ్రామ్ ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ కోలకత: పశ్చిమబెంగాల్లో నందీగ్రామ్ ఎన్నికల ఫలితం కీలకంగా మారింది. క్షణ క్షణానికిమారుతున్న ఆధిత్యంతో నరాలు తెగే ఉత్కంఠను రాజేస్తోంది. సమీప ప్రత్యర్ధి,బీజేపీ అభ్యర్థి సువేందుపై ప్రారంభంలో వెనుకబడిన మమతా, ఆ తరువాత లీడింగ్లోకి వచ్చారు. 16వ రౌండ్ ముగిసే సమయానికి సువేందుకు కంటే కేవలం 6 ఓట్లు వెనకబడి ఉన్నారు. దీదీ-సువేందు మధ్య నెలకొన్ని హోరాహోరీ పోరు టీ20 మ్యాచ్ను తలపిస్తోంది. చివరిదైనా 17వ రౌండ్ ఫలితంపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటి లీడింగ్లో దూసుకుపోతుండగా ముఖ్యమంత్రి మమత మాత్రం వెనకంజలో ఉండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలకమైన స్థానంలో దూసుకుపోతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు, అప్పటి మంత్రి సువేందు అధికారిని తనవైపు తిప్పుకున్న బీజేపీ నందీగ్రామ్నుంచి గట్టిపోటీ ఇస్తోంది. తొలి రౌండ్నుంచీ వెనుకంజలో ఉన్న దీదీ నాలుగు రౌండ్ల తరవాత కూడా సువేందుకంటే 8 వేలకు పైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు. నందిగ్రామ్లోమమతను తాను 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా చేయలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగుతానని సవాల్ చేసిన అధికారి ఆ దిశగా సాగి పోతున్నారు. అయితే క్షణక్షణానికి మారుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి ఫలితం వచ్చేవరకు నందీగ్రామ్ ఫలితంపై ఉత్కంఠకు తెరపడదు. కాగా టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన, మాజీమంత్రి సువేందు అధికారి సవాల్కు ప్రతిసవాల్గా నందీగ్రామ్నే మమత ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అటు టీఎంసీ 200 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, -
‘నా ఫోన్ను ట్యాప్ చేశారు’: ముఖ్యమంత్రి
గల్సీ (పశ్చిమ బెంగాల్): పోలింగ్ బూత్ వద్ద భద్రతా బలగాల కాల్పుల తర్వాత ఆ మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని తాను ఆదేశించానని చెబుతున్న ఆడియో టేప్ వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘నా ఫోన్ను ట్యాప్ చేశారు. ఈ మొత్తం వివాదంపై నిజానిజాలు రాబట్టేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తాను’ అని మమత ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గల్సీలో జరిగిన సభలో మమత ప్రసంగించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పోల్చుకుంటే తృణమూల్ కాంగ్రెస్తో ఏ పార్టీ సాటిరాలేదని మమత వ్యాఖ్యానించారు. ‘వంట చేస్తున్నామా.. ఇంటి పని చేస్తున్నామా అనేది సహా మా దినచర్య మొత్తం మీద బీజేపీ నిఘా పెట్టింది అని ఆరోపించారు. అయితే ఈ కుట్రలో మా పాత్ర లేదు అని బీజేపీ చెబుతోంది. మరోవైపు ఈ ఆడియో టేప్ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘ఆ ఆడియో టేప్ నకిలీది. అలాంటి సంభాషణ జరగనే లేదు. అయినా, కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేయడం ఆశ్చర్యంగా ఉంది’ అని టీఎంసీ వ్యాఖ్యానించింది. -
ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్’ అనక తప్పదు
కలకత్తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడు విడతల పోలింగ్ ముగియగా ఐదు దశ పోలింగ్ ఉండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఇంకా హాట్హాట్గా ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు బెంగాల్పైనే ప్రధాన దృష్టి సారించాయి. ఈ క్రమంలో తాజాగా గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నాడు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాడు. మే 2వ తర్వాత మమతా బెనర్జీ ‘జై శ్రీరామ్’ అనక తప్పదని స్పష్టం చేశాడు. ఆ విధంగా అనిపిస్తామని పేర్కొన్నాడు. ఎన్నికల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘హిందూత్వ రాజకీయం’ అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలపై స్పందన యోగి ఆదిత్యనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. హుగ్లీ జిల్లా కృష్ణరామ్పూర్లో నిర్వహించిన ప్రచార సభలోభాయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రోమియోలను కటకటాల పాలవుతారని తెలిపారు. సీఏఏ ఉద్యమానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి ఓటు బ్యాంక్ కోసం వెంపర్లాడుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 9వ తేదీకి ఆఖరి దశ పోలింగ్ ఉంది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. -
‘కూల్.. కూల్ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’: మోదీ
కోల్కత్తా: ‘మేం పక్కా 200 సీట్లు గెలుస్తాం.. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా గెలుస్తాం.. మీలాగా సీజనల్ భక్తులం కాదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్తో తెలిసింది.. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్లో గురువారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మమత బెనర్జీపై విమర్శలు చేస్తూనే తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూల్ కూల్.. 200 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మొదటి దశ పోలింగ్తో అధికంగా గెలుస్తామని తెలుస్తోంది. ప్రజల గళానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.’ అని పేర్కొన్నారు. నేను ఆలయాలకు వెళ్లడం గర్వంగా భావిస్తా.. మీలాగా పూటకోలాగ ఉండను’ అని బంగ్లాదేశ్ పర్యటనపై తృణమూల్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ ఘాటుగా బదులిచ్చారు. నేను ఆలయాన్ని సందర్శించడం తప్పా? అని ప్రజలను పశ్నించారు. మమతాకు కాషాయ వస్త్రాలు, దుర్గ మాత నిమజ్జనాలు, జై శ్రీరామ్ నినాదాలు అన్నీ ఆక్రోశం తెప్పిస్తున్నాయని తెలిపారు. బెంగాల్లో బీజేపీ హవా.. కమలం హవా కొనసాగుతుందని.. రెండో దశ పోలింగ్కు వస్తున్న ఓటర్లను చూస్తుంటే తెలుస్తోందని మోదీ పేర్కొన్నారు. -
నా ఆందోళనను పంచుకోండి: మమత లేఖ వైరల్
కోల్కత్తా: ‘రండి.. ఏకమవుదాం.. నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా జత కడుదాం’ అని బీజేపీయేతర పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలు ముగియగానే చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చారు. మొత్తం ఏడు ప్రధానాంశాలపై మమత లేఖ రాస్తూ వారికి పంపించారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మమతా పంపారు. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని మమతా గుర్తుచేశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘నేను మీకు లేఖ రాస్తున్నా. నా తీవ్రమైన ఆందోళనను మీతో పంచుకోవాలనుకుంటున్నా..’ అంటూ మమతా లేఖ మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దారుణంగా దాడి చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని లేఖలో మమత ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విధానాలు, నైతిక విలువలు బీజేపీకి వ్యతిరేకమని, అలాగే వదిలేస్తే దేశానికే ప్రమాదం అని గుర్తుచేశారు. ఆ పార్టీపై పోరాటానికి అన్ని పార్టీలు ఏకం కావాలని, అలాగైతేనే ఓడించగలమని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును మమత ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం కాకుండా పూర్తిస్థాయి లెఫ్టినెంట్ ప్రభుత్వం నడిపించేలా కొత్త చట్టం తెస్తోందని ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సూచించారు. రెండుసార్లు కేజ్రీవాల్ ఓడించారని, మళ్లీ గెలిచే నమ్మకం లేకనే ఈ కొత్త తెస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి మున్సిపల్ స్థాయికి తీసుకొస్తోందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిణామాలతో బీజేపీ ఏక పార్టీ అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని మమత స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా ఇతర పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. మమత లేఖ పంపినది వీరికే.. శరద్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్టాలిన్, ద్రవిడ మున్నేట కజగమ్ (డీఎంకే) ఉద్దవ్ ఠాక్రే, శివసేన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవీన్ పట్నాయక్, బిజూ జనతాదళ్ (బీజేడీ) తేజస్వి యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చదవండి: ‘టార్చ్లైట్’ విసిరివేత: కోపమేలా కమల్ హాసన్ -
ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైంది: మమతా బెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎల్పీజీ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసనగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం సిలిగురిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్యాస్ బండ ప్లకార్డులు పట్టుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు బీజేపీ సిద్ధమైందని మండిపడ్డారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని ఓట్లు టీఎమ్సీకి వేయండని ఆమె చెప్పారు. మహిళలు బెంగాల్లో క్షేమంగా లేరని మోదీ అంటున్నారని, మరి బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో మహిళలు సురక్షితంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ పాదయాత్రలో పార్టీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్లు పాల్గొన్నారు. మర్చి 27 నుంచి ప్రారంభమయ్యే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. చదవండి: బెంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనమైంది -
బెంగాల్లో సివంగిదే గెలుపు.. మేము పోటీ చెయ్యం
ముంబై: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, టీఎంసీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై శివసేవ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశ వ్యాప్తంగా బెంగాల్లో శివసేన పోటీచేస్తుందా?లేదా? ఆసక్తి నెలకొంది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపాం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దీదీ వర్సెస్ అన్ని పార్టీలు’ అన్న రీతీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాము మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడటం కోసం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నిజమైన బెంగాల్ సివంగి అని సంజయ్ రౌత్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. pic.twitter.com/enjd4sfiwx — Sanjay Raut (@rautsanjay61) March 4, 2021 చదవండి: ‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు -
బెంగాల్ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనపరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ను ఆహ్వానించకపోవడం.. ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పి సీఎం స్థాయిలో మమత బడ్జెట్ ప్రసంగం చేశారు. దీదీ చర్యపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగం ఏది, ఆర్థిక మంత్రి ఎక్కడ, మీరెందుకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పి నిరసనకు దిగారు. అవేవి పట్టించుకోకుండా మమత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ సమావేశాలను బహిష్కరించారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో చట్టాలు చేసే కీలకమైన శాసనసభలో మతపరమైన నినాదాలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తీరును ఖండించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానుండడంతో రూ.2.99 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మమత సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి మమత వివరించారు. -
ఆపరేషన్ బెంగాల్.. అంత ఈజీ కాదు!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విలక్షణమైన పోటీకి సంబంధించిన ప్రచార దృశ్యాలు బయటికొస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కేవలం సన్నాహకాలు మాత్రమే. ఎందుకంటే ఇప్పటివరకు రోడ్ షోలు, ర్యాలీలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇంట్లో భోజనం చేయడం వంటి ఎన్నికల స్టంట్స్ చేసినప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార టీఎంసీని గద్దె దింపాలని ఉవ్విళూరుతున్న కమలదళం ఆశలు అనుకున్నంత సులువుగా సాధ్యమయ్యే పరిస్థితులు బెంగాల్ రాజకీయాల్లో కనిపించట్లేదు. ప్రస్తుతం జరుగుతున్న మాటల యుద్ధం, పోటాపోటీ దాడులు చూస్తుంటే బెంగాల్ బరిలో నిజమైన రాజకీయ యుద్ధం ప్రారంభం అయినట్లుగా అనిపించట్లేదు. సాక్షి, కోల్కతా: టీఎంసీని దెబ్బతీసేందుకు తూర్పు మిడ్నాపూర్ భూమిపుత్రుడైన సువేందు అధికారిని తమ జట్టులో చేర్చుకున్న కమలదళం, తమ బలాన్ని మరింత పెంచుకొనేందుకు పెద్ద సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను తమవైపు తిప్పుకున్నప్పుడే సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఏమేరకు పొందగలుగుతుందన్న దానిపై ఇప్పుడు జరుగబోయే ఎన్నికలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇన్నేళ్ళుగా నామమాత్రంగా ఉనికిని చాటుకున్న బీజేపీ, అక్కడ ఉన్న సాంస్కృతిక వైరుధ్యాన్ని తట్టుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ స్థానిక పరిస్థితులను ఎంతవరకు తట్టుకొని ఓటర్లను తమవైపు తిప్పుకోగలదనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు సంస్థాగతపరంగా బీజేపీలో ఉన్న ఖాళీలను ఇప్పుడు టీఎంసీ సహా ఇతర పార్టీల నుంచి తరలివస్తున్న నాయకులతో భర్తీ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా జాతీయస్థాయి నాయకత్వానికి కనిపిస్తున్నప్పటికీ, బీజేపీ వర్క్ కల్చర్కు ఇంత తక్కువ సమయంలో ఆ నాయకులు ఏ విధంగా సర్దుకొని ముందుకు వెళ్ళగలుగుతారనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే టీఎంసీ వంటి పార్టీలో క్రమశిక్షణ అనేది ఏరకంగా ఉంటుందనేది జగమెరిగిన విషయం. అంతేగాక ఎప్పటినుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులకు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వస్తున్న నాయకులకు మధ్య ఉండే అంతరాలను ఏమేరకు సర్దుబాటు చేయగలుగుతారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. అయితే టీఎంసీ నుంచి వస్తున్న నాయకుల కారణంగా పార్టీకి రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 200కు పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కమలదళానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలుస్తారనే 294 మంది అభ్యర్థులు కూడా లేరనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో గెలుపు గుర్రాలపై ఆశలతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో బీజేపీ టీఎంసీ బీ టీంగా మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గెలుపు సులువేం కాదు బెంగాల్లో గెలవాలని తొందరపడుతున్న బీజేపీ, ఎన్నికల సమయంలో ఒక్కటొక్కటిగా సవాళ్ళను ఏరకంగా ఎదుర్కుంటుందనేది ఒక సమస్యగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 40.3 శాతం ఓట్లతో 18 లోక్సభ స్థానాలు గెలిచిన బీజేపీ ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి, బెంగాల్లో గెలుపు అనేది సునాయాసంగా కనిపిస్తుండవచ్చు కానీ, అది అంత సులువు కాదనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎంతో కీలకమైన సీఎఎ, ఎన్ఆర్సీ అమలు అంశాలను గతేడాది డిసెంబర్ 20న, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక ప్రెస్ మీట్లో కేంద్ర హోంమంత్రి కోల్డ్ స్టోరేజ్లోకి పంపారు. దీని ప్రభావం ఏమేరకు బీజేపీపై ఉంటుందనే అంశంపై చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మమతా బెనర్జీకి ఎంత కీలకమో, బీజేపీకి కూడా అంతే కీలకం. ఒకవేళ బెంగాల్లో బీజేపీ కాషాయ జెండా ఎగురవేస్తే దేశవ్యాప్తంగా తమ ఇమేజ్ను పునరుద్ధరించుకొనేందుకు, తమ సత్తా ఏంటో చూపించుకొనేందుకు ఇదొక మంచి అవకాశంగా కమలదళం భావిస్తోంది. అయితే గత కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఇటీవల జరిగిన బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చివరి వరకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీని వద్దనుకొని ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హర్యానాలో మెజారిటీ సాధించకపోవడంతో, ఇతర పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వచ్చింది. రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ను గద్దె దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కాస్తా ఫెయిల్ అయింది. కమలదళం ప్లాన్స్ సక్సెస్ కాలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య, ఆర్థిక ఒడిదుడుకులు, ప్రగతి మందగించడం, సుమారు రెండు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం వంటి అనేక అంశాలు బీజేపీకి రాజకీయ సవాళ్లుగా మారాయి. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్ వంటి రాష్ట్రంలో 294 సీట్లలో 200 సీట్లు గెలుచుకోవాలనే బీజేపీ లక్ష్యం కాస్త కఠినమైనదే. ఇటీవల విడుదలైన ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ సైతం మమతాబెనర్జీ కాషాయదళానికి కషాయం తాగించడం ఖాయమనే ప్రకటించింది. అయితే మమతా బెనర్జీని గద్దెదింపే లక్ష్యంతో శాయశక్తులు ఒడ్డి పనిచేస్తున్న కమలదళం, అన్ని అడ్డంకులను తట్టుకొని ఏమేరకు విజయం సాధిస్తుందనేది వారి రాజకీయ ఎత్తుగడలే నిర్ణయిస్తాయి. మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు కీలక నాయకులు పార్టీని వదిలి వెళుతున్న సమయంలో కార్యకర్తల్లో ఎలాంటి నిత్సేజం రాకుండా ఉండేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు వేగవంతం చేశారు. తూర్పు మిడ్నాపూర్ నుంచి సువేంధు అధికారి బీజేపీలో చేరిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను కాపాడుకొనేందుకు అతని ప్రత్యర్థి అఖిల్ గిరిని తెరపైకి తేవడమేకాకుండా, అతనికి జిల్లా బాధ్యతలను అప్పగించి తమ దగ్గర ప్రత్యామ్నాయ నాయకుల కొరత ఏమాత్రంలేదని మమతా బెనర్జీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. అంతేగాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నుంచి బరిలో దిగేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే నందిగ్రామ్తోనే సాధ్యమని దీదీ అర్థం చేసుకున్నారు. మరోవైపు కొందరు టీఎంసీ నాయకులు తమకు అనుకూలంగా పార్టీ కార్యక్రమాలను మార్చుకోవడంతో పార్టీ నాయకత్వం అభాసుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిగా బలపడలేదనే విషయానికి ఇలాంటి ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. అయితే పార్టీలోకి వచ్చే ప్రతీ నాయకుడికి పనిచేసేందుకు తగినంత అవకాశమిస్తామని, బీజేపీ కోసం పనిచేసేందుకు వచ్చే నాయకులు ఒక నిర్ణయం తీసుకొని పని ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవల చేసిన ప్రకటన పార్టీ తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. ఒకవేళ ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు పునరావృతం అయితే కొత్తగా చేరిన వారిని సైతం తొలగించే ప్రక్రియ జరుగుతుందని పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీకి ఇలాంటి క్రమశిక్షణ లోపించిన చర్యలను భరించాల్సిన గత్యంతరం తప్ప వేరే అవకాశం ఏదీ లేదనేది స్పష్టమౌతోంది. అలాంటి నాయకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం మాత్రం అసాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు ఇతర రాజకీయపార్టీల్లో అసంతృప్త నాయకులకు బీజేపీలో చేరడం అనేది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. -
కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బెంగాల్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయన్నారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై బెంగాల్లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ ఆ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్పై రావాలంటూ శనివారం సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన సీఎం మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అప్రజాస్వామిక శక్తులు, విస్తరణవాద కాంక్షతో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి ముందు పశ్చిమ బెంగాల్ ఎన్నడూ తల వంచదు. రాష్ట్ర యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఈ విధానాన్ని మేం ఒప్పుకోము. బెంగాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్లను డిప్యుటేషన్పై రమ్మన్న భారత ప్రభుత్వ ఆదేశాలపై మా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐపీఎస్ కేడర్ రూల్ 1954లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్ ప్రకారం ఈ ఆదేశాలు, అధికార దుర్వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది.. రాష్ట్ర న్యాయ వ్యవస్థపై దురాక్రమణ వంటిది. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. రాజ్యాంగ వ్యతిరేకం. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. ఈ చర్య అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని మమత కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా ఐపీఎస్ అధికారులు భోలనాథ్ పాండే (డైమండ్ హార్బర్ ఎస్పీ), ప్రవీణ్ త్రిపాఠి (డీఐజీ, ప్రెసిడెన్సీ రేంజ్), రాజీవ్ మిశ్రా (ఏడీజీ, సౌత్ బెంగాల్) నడ్డా బెంగాల్ పర్యటనకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.(చదవండి: ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా) GoI’s order of central deputation for the 3 serving IPS officers of West Bengal despite the State’s objection is a colourable exercise of power and blatant misuse of emergency provision of IPS Cadre Rule 1954. (1/3) — Mamata Banerjee (@MamataOfficial) December 17, 2020 -
షాకింగ్గా ఉంది..
-
సీఎం మమతాపై గవర్నర్ అసంతృప్తి
కోల్కతా: స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జగదీప్ ధంఖర్ నిర్వహించిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. కార్యక్రమానికి సంబంధించి ముందుగా సమాచారం అందిచినా సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం కోల్కతాలోని రెడ్రోడ్లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులను రాజ్భవన్లో జరిగే ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా హాజరు కాలేదు. దీంతో సీఎం లేకుండానే గవర్నర్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గవర్నర్ పక్కన ఏర్పాటు చేసిన కుర్చి ఖాళీగా కనిపించింది. (ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం) ప్రస్తుతం గవర్నర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మమతా పాల్గొనకపోవటం చర్చనీయంశంగా మారింది. ‘రాజ్భవన్లో స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భద్రత కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవటంలో మనం మరింత ఎదగాలి’ అని ఆయన ట్విటర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచితన ధోరణి అని ట్వీట్ చేశారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం) -
అగ్నిమాపక శాఖ మంత్రికి కరోనా పాజిటివ్
కోల్కతా: కరోనాకు ధనిక, పేద తేడా లేవు. హోదా, అధికారం అనే భేదం అసలే తెలియదు. తాజాగా పశ్చిమ బెంగాల్కు చెందిన అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ తేలడంతో వారిద్దరినీ స్వీయ నిర్భందంలో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే మంత్రి సుజిత్ బోస్ గత కొద్ది రోజులుగా అంఫన్ తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మంత్రి కరోనా బారిన పడటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా బెంగాల్లో ఇప్పటిదాకా.. 4,536 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 229 మంది మరణించారు. మరో 1,668 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: మాతృభూమి ఎండీ కన్నుమూత; ప్రధాని సంతాపం