Manoj
-
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
మనోజ్, కోడలు మౌనికతో ప్రాణహాని ఉందన్న మోహన్ బాబు
-
‘వీక్షణం’ ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు: హీరో రామ్ కార్తీక్
థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ‘వీక్షణం’లో అలాంటి హుక్ పాయింట్స్ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో తెలియజేసే చిత్రమిది’ అన్నారు యంగ్ హీరో రామ్ కార్తిక్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వీక్షణం’. కశ్వి హీరోయిన్. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న థియేటర్స్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీరో రామ్ కార్తిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...⇢ గతేడాది నేను ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి "వీక్షణం" మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ "వీక్షణం" కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి.⇢ ఈ సినిమాలో నేను సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది.⇢ నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు.⇢ ఈ సినిమాలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.⇢ ప్రస్తుతం వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. -
వెంకటేష్గారి మాటే ‘వీక్షణం’కి మూలం
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ– ‘‘ఎమ్బీఏ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో డీఎఫ్టీ కోర్సు పూర్తి చేశా. ‘జార్జి రెడ్డి, జోహార్’ వంటి చిత్రాలకు పనిచేశాను. ఓ సందర్భంలో వెంకటేష్గారితో మాట్లాడే అవకాశం లభించింది. ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే.. మన పని మనం చూసుకోకపోవడమే’ అని అన్నారాయన. ఈ లైన్ నాకు ఎగ్ట్జైటింగ్గా అనిపించింది. ‘వీక్షణం’ కథకు ఈ లైన్ మూలం. సంతోషంగా జీవిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం వల్ల అతని జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ–‘‘కోటిగారి దగ్గర వర్క్ చేశాను. ఎమ్ఎస్ రాజుగారి ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రానికి సంగీతం అందించాను. మ్యూజిక్ డైరెక్టర్గా ‘వీక్షణం’ రెండో చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి’’ అని పేర్కొన్నారు. -
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్లో విషాదంశామీర్పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
'అలాంటి వారు ముందుగా సినిమా చూడండి'.. ఎమర్జన్సీపై ఆదిపురుష్ రచయిత!
ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమర్జన్సీ చిత్రానికి ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీకి సిక్కు కమ్యూనిటీ ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ మూవీ రిలీజ్ను అడ్డుకోవద్దని వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాపై కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ చంపింది నిజం కాదా? అని వారిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని చంపింది సిక్కులు కాదా? అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా పంజాబ్లోని అమృత్సర్లో బ్లూ స్టార్ ఆపరేషన్ సమయంలో మరణించిన ఖలిస్తాన్ ఉద్యమ నాయకులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే గురించి రచయిత ప్రస్తావించారు. ఈ చిత్రంలో జర్నైల్ సింగ్ను ఉగ్రవాదిలా చూపిస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన అతను ఉగ్రవాది కాదా? అని ముంతశిర్ ప్రశ్నించారు. దయచేసిన భింద్రావాలేను హీరోగా గుర్తించవద్దని సిక్కు సమాజాన్ని కోరాడు.ఎమర్జన్సీ కంటెంట్పై అభ్యంతరం చెప్పే ముందు సినిమాను చూడమని వారిని కోరారు. ధైర్యమైన సిక్కు సమాజం సినిమా విడుదలకు భయపడుతుందని తాను నమ్మడం లేదన్నారు. వారు భారతదేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. అలాంటి ధైర్యం కలిగిన వారు కేవలం సినిమాకే భయపడుతారంటే ఎవరు నమ్ముతారని మనోజ్ అన్నారు. కాగా.. ఎమర్జన్సీ మూవీ రిలీజ్ను అడ్డుకోవాలంటూ సెన్సార్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని హితవు పలికారు. ఇది పూర్తిగా భావవ్యక్తీకరణ, వాక్ స్వాతంత్య్ర హక్కును హరించడమేనని తెలిపారు. సినిమాపై నిరసనలు తెలిపే వారు.. ముందుగా థియేటర్లలో విడుదలై చూసిన తర్వాత.. అందులో తప్పులుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.కాగా.. కంగనా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్ర పోషించింది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ కూడా నటించారు. అయితే ఈ మూవీపై ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కంగనా రనౌత్కు తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఒక వర్గానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయంటూ న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఆమెతో పాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
దంచికొట్టిన కరుణ్ నాయర్.. మహరాజా ట్రోఫీ మైసూర్దే!
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ చాంపియన్గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. 12 మ్యాచ్లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్ ఫామ్ కొనసాగించాడు.పోటీలో ఆరు జట్లుకాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్లో గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, హుబ్లి టైగర్స్ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్, హుబ్లి సెమీ ఫైనల్ చేరుకున్నాయి.ఫైనల్కు చేరుకున్న మైసూర్, బెంగళూరు జట్లుఅయితే, మొదటి సెమీస్ మ్యాచ్లో బెంగళూరు బ్లాస్టర్స్ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ జరిగింది.మనోజ్ భండాగే పరుగుల విధ్వంసంబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ కార్తిక్ 71, కెప్టెన్ కరుణ్ నాయర్ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్రేటు 338.46 కావడం గమనార్హం.ఫలితంగా మైసూర్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్ వారియర్స్ ఈ ఏడాది టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. Mysuru hold out Bengaluru; clinch the TITLE!A Karun Nair-led #MysuruWarriors do it in style against #BengaluruBlasters in the Maharaja Trophy final 🏆🙌#MaharajaTrophy | #KarunNair | #MWvBB | #Final2024 pic.twitter.com/GbuDDJyHeV— Star Sports (@StarSportsIndia) September 1, 2024 -
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్లో ఆయన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా
ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ పదవికి మనోజ్ సోని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ఐదేళ్లు పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. అయితే.. మనోజ్ సోనీ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సమాచారం. గత ఏడాది ఏప్రిల్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరిన మనోజ్ సోనీ.. మే 16, 2023న చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్గా ఆయన పనిచేశారు.ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో మనోజ్ సోనీ రాజీనామా సంచలనం రేపుతోంది. అయితే గత కొన్ని రోజుల ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు సమాచారం. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరీక్షతోనే ఐఏఎస్కు ఎంపికైన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఇటీవల అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది.కాగా, మనోజ్ సోని రాజీనామా చేయడం వెనుక.. మనోజ్ సోని సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
ఈ తారల ‘ముందస్తు’ జాతకాలివే..
2024 లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఏ సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉండబోతోందో ‘ముందస్తు’గా వెల్లడయ్యింది.మనోజ్ తివారీప్రస్తుత ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ సీటుపైనే ఎక్కువ చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్లో మనోజ్ తివారీ విజయం ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి.పవన్ సింగ్భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ బీహార్లోని కరకట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై పోటీకి ఎన్డీఏ ఉపేంద్ర కుష్వాహను రంగంలోకి దింపింది. అయితే కరకట్ సీటు పవన్ సింగ్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.కంగనా రనౌత్హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ పోటీకి దింపింది. ఆమెతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తలపడ్డారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కంగనా రనౌత్ విజయాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిర్హువాఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ లోక్సభ స్థానం నుంచి భోజ్పురి గాయకుడు, నటుడు నిర్హువాను బీజేపీ పోటీకి దింపింది. ఇదేస్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ బరిలోకి దిగారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్లో నిరాహువాదే పైచేయి అని వెల్లడయ్యింది.హేమామాలినిబాలీవుడ్ నటి హేమామాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానం నుంచి మూడోసారి పోటీకి దిగారు. పలు ఎగ్జిట్ పోల్స్లో హేమ మాలినిదే పైచేయి అని వెల్లడయ్యింది.రవి కిషన్ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి రవికిషన్ పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం రవికిషన్ ఇక్కడి నుంచి సునాయాసంగా గెలుస్తారు. గోరఖ్పూర్ స్థానం బీజేపీకి కంచుకోట. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నాథ్ ఆదిత్యనాథ్ స్వస్థలం. -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి సదరు మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా? (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్లో చరణ్ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) బాలీవుడ్లోని టాప్ రైటర్స్లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. 'తేరే మిట్టి', 'గల్లియన్', 'కౌన్ తుజే' లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే 'బాహుబలి' హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మార్చిపోయారు. అలాంటిది రైటర్ మనోజ్ ముంతాషిర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘14డేస్ లవ్’
మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మిస్తున్నారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కానుంది. ‘కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో ఈ సినిమా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు నాగరాజు బోడెం ఈ చిత్రాన్ని తీర్చి దిద్డాడు’ అని నిర్మాతలు పేర్కొన్నారు. అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ నటించిన ఈ చిత్రానికి కిరణ్ వెన్న పాటలు.. యష్కే బాజి బీజీఎం అందించారు. -
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
వివాదాలు లేని వ్యక్తులకే చైర్మన్ పదవి
-
యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ!
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)’ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం సహకరించాలని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ మొదలు పోస్టుల భర్తీ వరకు యూపీఎస్సీ తరహాలోనే జరిగేలా తగిన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్రెడ్డి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్తో, అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వినతిపత్రాలు సమర్పించారు. తగిన సహకారం అందించండి మంత్రి ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులతో కలసి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్కుమార్లతో రేవంత్ భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంశంపై చర్చించారు. వివాద రహితంగా పరీక్షల నిర్వహణ, నియామకాల్లో పారదర్శకత విషయంలో సహకరించాలని వారిని కోరారు. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మరక అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు. ఏడాది చివరికల్లా రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో చేపట్టే నియామకాల్లో నూతన విధానాలు, పద్ధతులను పాటించాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి.. కమిషన్ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందని పేర్కొన్నారు. తాము రాజకీయ ప్రమేయం లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని.. అవకతవకలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని చెప్పారు. సీఎం దృష్టి సారించడం అభినందనీయం టీఎస్పీఎస్సీ నియామకాల ప్రక్రియపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించడం అభినందనీయమని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పేర్కొన్నారు. యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని.. సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నానికి తాము సహకారం అందిస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్తోపాటు సభ్యులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ భేటీలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు కూడా పాల్గొన్నారు. రక్షణశాఖ భూములను రాష్ట్రానికి ఇవ్వండి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో రాష్ట్ర బృందం భేటీ అయి చర్చించింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణం, విస్తరణ కోసం.. రక్షణశాఖ పరిధిలో ఉన్న పలు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్నాథ్సింగ్ను సీఎం రేవంత్ కోరారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని.. అక్కడ రక్షణశాఖ పరిధిలో ఉన్న కాస్త భూమిలో మినహా మిగతా భాగం పూర్తయిందని వివరించారు. ఆ భూమిని వెంటనే బదిలీ చేస్తే.. నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తుందన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కరీంనగర్–రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో.. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్రింగు రోడ్డు జంక్షన్ వరకు 11.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణం కోసం 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్ హైవే (ఎన్హెచ్–44)పై కూడా కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్రోడ్డు వరకు 18.30 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించామని.. ఇందులో 12.68 కిలోమీటర్ల మేర నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలు, భవిష్యత్తులో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాల కోసం మరో 56 ఎకరాల రక్షణ శాఖ భూములను బదిలీ చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్కు ప్రత్యేక నిధులివ్వండి 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2019–20 నుంచి 2023–24 వరకు ఏటా రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1,800 కోట్లు రావాల్సి ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. -
పద్నాలుగు రోజుల ప్రేమ
మనోజ్ పుట్టూర్, చాందినీ భాగవని జంటగా నాగరాజు బోడెం దర్శకత్వం వహించిన చిత్రం ‘14 డేస్ లవ్’. అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమా జనవరి 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ లవ్ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ‘14 డేస్ లవ్’ రూపొందింది. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే కోణంలో ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది’’ అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
మనోజ్, చాందిని హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం "14 డేస్ లవ్". ఈ చిత్రాన్ని నాగరాజు బోడెం దర్శకత్వంలో తెరకెక్కించారు. సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దాసరి హరిబాబు నిర్మించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అన్న కోణంలో దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కుటుంబ సంప్రదాయ విలువలతో రూపొందించినఈ చిత్రం జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్, అంజలి, ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ కీలక పాత్రలు పోషించారు. -
ఆదిపురుష్ కి రికార్డు స్థాయిలో TRP
-
యాదాద్రి కలెక్టరేట్లో దంపతుల ఘర్షణ
భువనగిరి క్రైం: కొద్దికాలంగా తనతో సఖ్యతగా ఉండటంలేదన్న కోపంతో భర్తపై కత్తితో దాడి చేసింది ఓ భార్య. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్లో ఆత్మకూర్(ఎం) మండల వ్యవసాయశాఖ అధికారిణిగా పనిచేస్తున్న నర్ర శిల్ప, అదే కార్యాలయంలో తన కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న మాటూరి మనోజ్గౌడ్ను గతేడాది జూన్ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా 3నెలల క్రితం మనోజ్గౌడ్ యాదగిరిగుట్టకు డిప్యూటేషన్పై వెళ్లి అనంతరం సెలవుపై వెళ్లాడు. శుక్రవారంతో సెలవులు పూర్తికావడంతో విధులకు హాజరుకావడానికి రిపోర్ట్ చేసేందుకు కలెక్టర్ట్కు వచ్చాడు. అదేసమయంలో భర్తతో మాట్లాడేందుకు శిల్ప దగ్గరకు వెళ్లింది. గొడవల నేపథ్యంలో వారిద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శిల్ప కత్తి తీసుకుని మనోజ్పై దాడి చేయగా..అతడి వీపు, మెడపై తీవ్రగాయాలయ్యాయి. సహోద్యోగులు వెంటనే వారిని అడ్డుకుని మనోజ్ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్లోని ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శిల్పను వివరణ కోరగా..మనోజ్ కొంతకాలంగా తనతో సఖ్యతగా ఉండటం లేదని ఇదే విషయం మాట్లాడేందుకు రాగా తనపై కత్తితో దాడి దిగాడని చెప్పారు. దీంతో ఆత్మరక్షణార్థం అతడి వద్ద ఉన్న కత్తిని లాక్కుని దాడి చేసినట్లు చెప్పారు. శిల్ప, మనోజ్ తండ్రి ఉపేందర్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జడంగే చెప్పారు. -
తెలంగాణలో ఇద్దరికి జాతీయ సేవాపథకం అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద సేవకు గుర్తింపుగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఏటా ఇచ్చే జాతీయ సేవా పథకం అవార్డు– 2021–22ను తెలంగాణకు చెందిన ఇద్దరు దక్కించుకున్నారు. హనుమకొండకు చెందిన గుండె పరశురాములు, హైదరాబాద్కు చెందిన దావెర మనోజ్ ఖన్నా చేపట్టిన స్వచ్ఛంద సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి అవార్డులు అందజేశారు. గుండె పరశురాములు స్వచ్ఛంద సేవ హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు గుండె పరశురాములు మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలపై చొరవ చూపేవారు. 1,300 మొక్కలు నాటిన పరశురాములు 10 రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో వాల్పోస్టర్లు, షార్ట్ ఫిల్మ్ల ద్వారా అవగాహన కల్పించారు. ఉజ్వల యోజన, పీఎం జీవన్బీమా యోజన, పీఎం జన్ధన్ యోజన తదితర పథకాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాల గురించి దత్తత గ్రామాల్లో అవగాహన కల్పించారు. పథకాలపై మనోజ్ ఖన్నా ప్రచారం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీరు మనోజ్ ఖన్నా ఉజ్వల యోజన, పీఎం జీవన్బీమా యోజన, పీఎం జన్ధన్ యోజన వంటి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత, పోక్సో చట్టాలపై దత్తత గ్రామాల్లో 650పైగా కార్యక్రమాలు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు నిర్వహించారు. ఇతర వలంటీర్లతో కలిసి శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, కోవిడ్ వేళ పేద పిల్లలకు ఆహారం సేకరించి అందించడం వంటి పనులు చేశారు. మనోజ్ రక్తదాన శిబిరాల ద్వారా 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
స్మిత, మనోజ్ ఎపిసోడ్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్పేట్ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. మనోజ్కు స్మిత ఫేస్బుక్ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్ కౌన్సిలింగ్కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో సిద్ధార్ధ్పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మరోవైపు.. తమను మనోజ్ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్ను చూడగానే మనోజ్ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్ గిప్ట్గా ఇచ్చిన ఏయిర్ గన్తో సిద్ధార్థ్పై మనోజ్ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
శామీర్పేట్ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్ నటుడు
శామీర్పేట్ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దార్థ్పై నటుడు మనోజ్ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు నటుడు మనోజ్. గన్ ఫైర్ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లో కాల్పులు జరిపిన మనోజ్ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు. అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్ అనే ఓ వ్యక్తి గన్ ఫైర్ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్ క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో సిద్ధార్థ దాస్పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల మనోజ్.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar) చదవండి: శామీర్పేట్ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్ ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్ను అందరిముందే అవమానించిన స్టార్ హీరో -
శామీర్పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్తో కలిసి బంజారాహిల్స్లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో సిద్ధార్థ దాస్పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. గన్లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
సాక్షి, రంగారెడ్డి: శామీర్పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. భర్త సిద్దార్థ్తో(42) విడిపోయిన స్మిత గ్రంథి.. మనోజ్తో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్పై స్మిత కొడుకు ఫిర్యాదు మనోజ్పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్పల్లిలోని ఫిడ్జ్ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్పేటలోని శాంతినికేతన్ రెడిసెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. పిల్లల కోసం రావడంతో ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్లోని సెలబ్రిటీ క్లబ్లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ను చూసి ఆగ్రహించిన మనోజ్.. ఎయిర్ గన్తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు. సిద్ధార్థ్, స్మిత మధ్య విడాకుల కేసు సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్లో హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. నేడు సిద్ధార్థ్ తన పిల్లలను చూడటానికి రిసార్ట్కు రాగా మనోజ్ ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడని తెలిపారు. చదవండి: పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి -
నాపై అసభ్యకరమైన పదాలు వాడారు: ఆదిపురుష్ రైటర్ భావోద్వేగం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిలిం 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇంకా సినిమాలోని కొన్ని డైలాగ్స్పైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా డైలాగ్స్పై వస్తున్న విమర్శలపై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా స్పందించారు. ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తానని.. వారిని బాధపెట్టేలా ఉన్న డైలాగులను తొలగిస్తామని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్లో రాస్తూ.. 'ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని గౌరవించడం రామాయణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం. ఆదిపురుష్ కోసం చాలా డైలాగ్స్ రాశాను. కానీ కొన్నింటి దగ్గర సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. నేను సీత, రాముని కోసం రాసిన డైలాగ్స్కు ప్రశంసలు దక్కలేదు. నా సొంత సోదరులే సోషల్ మీడియాలో నాపై, నా తల్లిపై అసభ్యకరమైన పదాలు వాడారు. ప్రతి తల్లిని తన తల్లిగా భావించే శ్రీరాముడిని చూసిన సోదరులకు హఠాత్తుగా ఎందుకంత కోపం వచ్చింది. కానీ నాపై సనాతన ద్రోహి అనే ముద్ర వేసేందుకు మీరు ఎందుకు తొందరపడ్డారో తెలియడం లేదు. మేము సనాతన సేవ కోసమే ఆదిపురుష్ని సృష్టించాం. నా డైలాగ్స్కు నేను లెక్కలేనన్ని వాదనలు ఇవ్వగలను. కానీ ఇది మీ బాధను తగ్గించలేదు. కొన్ని డైలాగులు మిమ్మల్ని బాధపెట్టాయని గ్రహించిన నేను.. సినిమా నిర్మాత, దర్శకుడితో కలిసి ఓ నిర్ణయం తీసుకున్నా. ఈ వారంలోనే అభ్యంతరకరంగా ఉన్న డైలాగ్స్లో మార్పులు చేస్తాం' అని పేర్కొన్నారు. रामकथा से पहला पाठ जो कोई सीख सकता है, वो है हर भावना का सम्मान करना. सही या ग़लत, समय के अनुसार बदल जाता है, भावना रह जाती है. आदिपुरुष में 4000 से भी ज़्यादा पंक्तियों के संवाद मैंने लिखे, 5 पंक्तियों पर कुछ भावनाएँ आहत हुईं. उन सैकड़ों पंक्तियों में जहाँ श्री राम का यशगान… — Manoj Muntashir Shukla (@manojmuntashir) June 18, 2023 -
ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్
-
మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి గెటప్ సరిగా లేదని విమర్శలొచ్చాయి. తాజాగా ఈ విమర్శలపై ఆదిపురుష్ కథ రచయిత స్పందించారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న విమర్శలకు రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా సమాధానమిచ్చారు. (ఇది చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి!) మనోజ్ ముంతశిర్ మాట్లాడుతూ.. 'మేము తీసింది రామాయణం కాదు.. మేము రామాయణం నుంచి స్ఫూర్తి పొందాం. ఈ విషయాన్ని మేం డిస్క్లైమర్లో కూడా ప్రస్తావించాం. రామాయణంలో జరిగే యుద్ధంలో కేవలం ఓ భాగం ఆధారంగానే ఆదిపురుష్ను తెరకెక్కించాం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కూడా. దీని గురించి మరోసారి వివరణ ఇస్తున్నా. మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను తీశాం. అంతే కానీ మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు.' అని అన్నారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్పై తాజాగా రచయిత ఇచ్చిన వివరణపై సినీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో!. (ఇది చదవండి: నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో ) -
ఆదిపురుష్ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు
దేశవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రామ్ చరణ్, కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, గాయని అనన్య బిర్లా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) ఇప్పుడు తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక జంట కూడా ఆ క్లబ్లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు వారు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. 'ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలి. ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి' అని మంచు మనోజ్, భూమా మౌనిక అన్నారు. (ఇదీ చదవండి: కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?) -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
మోదీకి 1500 కోట్ల విలువ చేసే ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన అంబానీ
-
ఐపీఎల్ బెట్టింగ్ భారీగా పట్టుబడ్డ డబ్బు
-
మిత్రులను కలిపే బెలూన్ దౌత్యం?
చైనా విభజన వ్యూహాలను ఎండగట్టడానికి... సాక్ష్యాధారాలతో దొరికిన బెలూన్ వివాదాన్ని ఉపయోగించుకోవచ్చని అమెరికా ఆశలు పెట్టుకుంటోంది. నిఘా కోసం ఇంత పాత టెక్నాలజీని ఉపయోగించాలని చైనా ఎందుకనుకుందో అర్థం చేసుకోవడం కష్టం. దౌత్యపరమైన కీలక క్షణాల్లో ఇలాంటి రెచ్చగొట్టే పనులను నిర్వహించడంలో చైనీయులు ఆరితేరినవారని అందరికీ తెలుసు. చైనా దుష్ప్రవర్తనపై స్పందించడంలో చాలాసార్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిత్రులనూ, పొత్తుదారులనూ ఒకటి చేయడానికి అమెరికా ఈ ఉదంతాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటుంది. బహుశా చైనాకు బెలూన్ ఉదంతం ద్వారా సంభవించే అత్యంత నష్టదాయకమైన అంశం ఏమిటంటే, దాని ఎత్తుగడలు సగటు అమెరిన్ దృష్టిని ఆకర్షించడమే. గత నవంబర్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య బాలిలో చర్చలు జరిగిన తర్వాత రానున్న నెలల్లో అమెరికా, చైనా సంబంధాలలో ఉద్రిక్తతలు సడలిపోతాయని భావించారు. ఈ నెలలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ప్రథమ సందర్శనకు చైనీయులు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాతే నిఘా కోసం ఉపయోగించారని చెబుతున్న చైనా స్పై బెలూన్ని అమెరికా కూల్చి వేసిన ఘటన చోటుచేసుకుంది. నిఘా కోసం ఇంత పాత టెక్నాలజీని ఉపయోగించాలని చైనా ఎందుకనుకుందో అర్థం చేసుకోవడం కష్టం. అమెరికాపై నిఘా పెట్టడానికి చైనావద్ద అత్యధునాతన శాటిలైట్ నెట్వర్క్ ఉంది. కానీ అమెరికా గగనతల రక్షణ యంత్రాంగ స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికీ, కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ని చౌక మార్గంలో సేకరించడానికీ అమెరికా లాగే చైనా కూడా ఇలాంటి విధానాలను ఉపయోగించడానికి ప్రయోగాలు చేస్తోందని భావిస్తున్నారు. మరోవైపున చైనా ఈ ఘటనను తేలిగ్గా తీసుకుంది. అది వాతావరణ బెలూన్ మాత్రమేనని చెబుతూనే, తన వాతావరణ సేవల విభాగ అధిపతిని తొలగించింది. అయితే ఈ నిఘా బెలూన్ విషయాన్ని తక్షణం గుర్తించలేకపోయిన అమెరికా ఇప్పుడు మాత్రం తాను కొంతకాలంగా బెలూన్ల ద్వారా సాగుతున్న నిఘా వ్యవహా రాలను పసిగడుతూ వస్తున్నట్లు పేర్కొంది. అమెరికా అతిగా స్పంది స్తోందనీ, ‘అంతర్జాతీయ సంప్రదాయాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందనీ’ అలాగే ‘సారుప్యం గల ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన మార్గాలను ఉపయోగించుకునే హక్కు బీజింగ్కు ఉంద’నీ చైనా నొక్కిచెబుతోంది. మరో వైపున దాదాపు 61 మీటర్ల పొడవైన భారీ బెలూన్ ఖండాంతరాలు దాటి, తన అణ్వాయుధాలకు సంబంధించిన కీలక విభా గాలకు నిలయమై ఉన్న ఒక రాష్ట్రంపై విహరించడాన్ని అమెరికా అసలు విస్మరించలేదు. 2022 జనవరిలో ఇదేవిధమైన బెలూన్ కాకతాళీయంగా అండమాన్, నికోబార్ దీవులపై కనిపించగా దాన్ని ఫొటో తీశారు కూడా. కొన్ని రోజుల క్రితం అలాస్కా, కెనడాలపై మరో రెండు గుర్తు తెలీని ఎగిరే వస్తువులను కూల్చివేశారు. అమెరికా విదేశాంగ శాఖ అధికారి అభిప్రాయం ప్రకారం, చైనా ఈ నిఘా బెలూన్లను అయిదు ఖండాల్లో 40 పైగా దేశాల్లోని గగన తలంపై ఉపయోగిస్తోంది. అత్యంత ఎత్తులో ఎగిరే యూ–2 ఎయిర్ క్రాఫ్ట్ ఈ బెలూన్ని చాలా దగ్గరనుంచి ఫొటోతీసి, దానిలో సౌర శ్రేణులు, బహుళ యాంటెన్నాతోపాటు కమ్యూనికేషన్లను గుర్తించ గలిగిన పరికరం కూడా ఉన్నట్లు కనుగొంది. తాను స్వాధీనపర్చుకున్న బెలూన్ శిథిలాలను అమెరికా విశ్లేషిస్తుండటంతో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలకు గురైన చైనా కంపె నీలు ఈ బెలూన్ పనితీరు సామర్థ్యానికి సంబంధించిన ఆధారాలను అందించాయి. యుద్ధవిమానం కంటే ఎత్తులో ఎగిరేలా డిజైన్ చేసిన ఎయిర్షిప్ డెవలపర్ కూడా వాటిలో ఉంది. అలాగే శాటి లైట్లతో,కృత్రిమ మేధస్సుతో ఏరియల్ వెహికిల్స్ని నియంత్రించే పేటెంట్ హోల్డర్ కూడా ఉంది. యాంటీ మిసైల్ డిఫెన్స్లు, కమ్యూనికేషన్లలో దాని పాత్ర, డేటా రిలే, నిఘా, ఇంటెలెజెన్స్ కార్యకలాపాల్లో భాగంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ భూమికి 15 నుంచి 80 కిలోమీటర్ల పైన ఉన్న అంతరిక్షంపై ఆసక్తి చూపుతోంది. యుద్ధవిమానం, ఉపగ్రహాల మధ్య ఉన్న అంత రాన్ని పూరించే ప్రయత్నాల్లో భాగంగా బెలూన్ ఉపయోగాన్ని చూడ వచ్చు. సుహృద్భావం కోసం ప్రత్యర్థి ఇలాంటి పనులను పెద్దగా లెక్కలోకి తీసుకోబోడని భావిస్తూ... దౌత్యపరమైన కీలక క్షణాల్లో ఇలాంటి రెచ్చగొట్టే పనులను నిర్వహించడంలో చైనీయులు ఆరి తేరినవారని అందరికీ తెలుసు. 2013లో చైనా ప్రధాని లీ కెకియాంగ్ భారత సందర్శన సమయంలోనే అక్సాయ్ చిన్ ప్రాంతంలోని దెప్సాంగ్ బల్జ్లోని వై–జంక్షన్ వద్ద వారు దిగ్బంధనను అమలు చేశారు. కెకియాంగ్ సంద ర్శనను రద్దు చేస్తానని భారత్ హెచ్చరించిన తర్వాతే ఈ దిగ్బంధాన్ని చైనా ఎత్తివేసింది. తర్వాత 2014లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత సందర్శన సమయంలోనే లద్దాఖ్లోని చుమర్ వద్ద ఉన్న వాస్త వాధీన రేఖ వద్ద భారత భూభాగంలోని ఎల్తైన ప్రాంతంలో రహదారి నిర్మాణానికి పీఎల్ఏ (చైనా సైన్యం) ప్రయత్నించింది. అయితే భారతీయులూ, ఇప్పుడు అమెరికన్లూ ఇలాంటి ఘటన లను బహిరంగపర్చాలని నిర్ణయించుకున్నారు. అమెరికన్లు బెలూన్ను కూల్చివేశారు. ఇప్పుడు అమెరికా సముద్ర జలాల నుంచి బెలూన్ శిథిలాలను సేకరిస్తున్నారు. బీజింగ్ విభజన వ్యూహాలను ఎండగట్ట డానికి సాక్ష్యాధారాలతో దొరికిన బెలూన్ వివాదాన్ని ఉపయోగించు కోవచ్చని అమెరికా ఆశలు పెట్టుకుంటోంది. బహుశా చైనాకు బెలూన్ ఉదంతం ద్వారా సంభవించే అత్యంత నష్టదాయికమైన అంశం ఏమిటంటే, దాని ఎత్తుగడలు సగటు అమెరిన్ దృష్టిని ఆకర్షించడం. మరెన్నడూ జరగని విధంగా అమెరికా నడిబొడ్డుపై చైనా నిఘా బెలూన్ ఎగరడం వారి దృష్టిలో పడింది. మొదట తీవ్రంగా మాట్లాడిన అమెరికా... బెలూన్ ఆపరేషన్ గురించి షీ జిన్పింగ్కు వ్యక్తిగతంగా తెలీదని చెప్పడం ద్వారా చైనా నాయకత్వాన్ని ఈ వ్యవహారంలోంచి బయట పడేయడానికి ఒక దారి కల్పించినట్లుంది. అయితే దేశాధ్యక్షుడి అను మతి లేకుండా ఇంత తీవ్రాతితీవ్రమైన ఇంటెలిజెన్స్ వెంచర్కి చైనా సాహసించడం కష్టమనిపిస్తుంది. 2014లో చుమర్ ఘటనల సందర్భంగా పీఎల్ఏని అక్కడి నుంచి ఉపసంహరించుకుంటామని జిన్పింగ్ మొదట్లో వాగ్దానం చేశారు. కానీ బీజింగ్కి ఆయన తిరిగి వెళ్లిన వారం రోజుల తర్వాతే దీనిపై ఒప్పందం కుదిరింది. బ్లింకెన్ చైనా సందర్శన వాయిదా పడింది. ఆయన సందర్శనకు తిరిగి ఏర్పాట్లు జరగవచ్చు గాక. వార్షిక జాతీయ ప్రజా కాంగ్రెస్ సదస్సుతో చైనా తలమునకలు కానున్నందున, నూతన ప్రధాని ఎంపికతో సహా కొత్త ప్రభుత్వ మార్పుల సమయంలో... విలువైన సమయం వృ«థా కావచ్చు. కానీ చర్చల పునరుద్ధరణ సమయానికి బెలూన్ ఉదంతం అమెరికాను కాస్త మానసికంగా ముందంజలో ఉంచవచ్చు. చైనా వస్తూత్పత్తికి చెందిన అపార శక్తిని కలిగి ఉన్న ప్పటికీ, అనేక ప్రపంచ దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తలెత్తడానికి ప్రయత్నిస్తునప్నప్పటికీ అది దాని లక్ష్య సాధనలో విఫల మయిందని అమెరికా నమ్ముతోంది. ఇటీవలే అమెరికన్ కాంగ్రెస్లో ఆనవాయితీగా చేసే ‘స్టేట్ ఆఫ్ ద యూనియన్’ ప్రసంగంలో బైడెన్ బీరాలు పలికారు. ‘‘నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందు, చైనా పీపుల్స్ రిపబ్లిక్ తన అధికారాన్ని ఎలా పెంచుకుందీ, ప్రపంచంలో అమెరికా ఎలా పతనం అయిందీ అనే కథే ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. చైనాతో అమెరికా స్పర్థాత్మక సంబంధాన్ని కోరుకుంటోంద’’ని బైడెన్ స్పష్టం చేశారు. ‘‘కానీ గత వారం మనం స్పష్టంగా పేర్కొన్నట్లుగా చైనా మన సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా ఉన్నట్లయితే, మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం తగు చర్య తీసుకుంటాము. మనం ఆ పనే చేశాము కూడా (బెలూన్ కూల్చివేత గురించిన ప్రస్తావన)’’. భీకర యుద్ధాల్లో గెలవడం మాత్రమే కాదు, సమాచార, ప్రజాభి ప్రాయ యుద్ధాలను కూడా గెలవడం ఈ యుగం లక్షణం అనేది గుర్తెర గాలి. బీజింగ్ దుష్ప్రవర్తనపై స్పందించడానికి కొన్నిసార్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న మిత్రులను, పొత్తుదారులను ఒకటి చేయడానికి అమె రికా ఈ ఉదంతాన్ని వాడుకుంటుంది అనడంలో సందేహం లేదు. మనోజ్ జోషి వ్యాసకర్త రీసెర్చ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(’ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో -
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి క్షేమంగా చేరుకున్న మనోజ్
-
నిద్రమాత్రలు మింగిన నటుడు.. మరో నటుడిపై కేసు నమోదు
మోడల్, బాడీబిల్డర్, నటుడు మనోజ్ పాటిల్ను ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్పై కేసు నమోదైంది. ఈ కేసును నటుడితో పాటు మరో ముగ్గురిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మనోజ్పాటిల్ గురువారం ఓషివారాలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది ఉదయం ఒంటి గంట సమయంలో జరగగా గమనించిన ఆయన కుంటుంబ సభ్యులు కూపర్ ఆసుపత్రికి తరలించారు. అతని వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాహిల్ ఖాన్పై కేసు నమోదు చేశారు. సాహిల్ ఖాన్ తన కొడుకును మానసికంగా వేధించాడని మనోజ్ పాటిల్ తల్లి మీడియాకి తెలిపింది. అది ప్రాణాలను తీసుకునే దాకా వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదైన అనంతరం నటుడు సాహిల్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాజ్ ఫౌజ్దార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఢిల్లీకి చెందిన అతనికి మనోజ్ రూ.2 లక్షలు తీసుకుని, గడువు ముగిసిన స్టరాయిడ్స్ ఇచ్చాడని తెలిపాడు. దీంతో గుండె, చర్మ సమస్యలు వచ్చాయని చెప్పాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా రాజ్ ఫౌజ్దార్ను ఇబ్బంది పెట్టాడని పేర్కొన్నాడు. లావాదేవీలకి సంబంధించిన అన్ని రసీదులు చూపించి సహాయం చేయమని కోరగా, అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాను. అంతేకానీ నాకు ఈ విషయానికి ఏం సంబంధం లేదు’ అని సాహిల్ ఖాన్ తెలిపాడు. మరోవైపు ఇంతకుముందే సాహిల్ సోషల్ మీడియాలో తన ఇమేజీని దెబ్బతీస్తున్నాడని ఆరోపిస్తూ మనోజ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈ బాడీబిల్డర్ మేనేజర్ తెలిపాడు. -
జర్నలిస్ట్ మనోజ్ సోదరుడు ఫిర్యాదు
చిలకలగూడ : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జర్నలిస్ట్ మనోజ్కుమార్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని సోదరుడు సాయికుమార్ చిలకలగూడ ఠాణాలో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కరోనాతో బాధపడుతు తనతోపాటు సోదరుడు మనోజ్కుమార్ ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీఆస్పత్రిలో అడ్మిట్ అయ్యామన్నారు. గాంధీ అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన సోదరుడు మనోజ్కుమార్ ఈనెల 7వ తేదిన మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన సోదరుడు మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ సూపరింటెండెంట్, నోడల్ అధికారి, సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరాడు. -
ముఖేష్ అంబానీని ముందుండి నడిపించినా..
ముంబై : ఆయనకు కెమేరాల మెరుపులంటే మోజులేదు..టీవీ స్క్రీన్లపై మెరవాలనే ఆసక్తీ లేదు. ఒంటిచేత్తో రూ వేల కోట్ల కార్పొరేట్ డీల్స్ను ఖరారు చేయగల సత్తా ఉన్నా నలుగురిలో పేరుకోసం తహతహలాడే తత్వం కాదు. భారత కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీని ముందుండి నడిపించే శక్తే అయినా ప్రచార పటాటోపాలకు వెనుకుండే వ్యక్తి..ఆయనే మనోజ్ మోదీ. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీకి మనోజ్ మోదీ కుడిభుజం అని కార్పొరేట్ వర్గాలు చెబుతుంటాయి. గుంభనంగా, బహిరంగ వేదికల్లో పెద్దగా కనబడని మోదీని ముఖేష్కు అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఫేస్బుక్తో 570 కోట్ల డాలర్ల భారీ డీల్ సంప్రదింపుల్లో మోదీ కీలక పాత్ర పోషించారు. పెట్రోకెమికల్స్ నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీలకు ముఖేష్ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే లక్ష్యంలో మనోజ్ మోదీ చురుగ్గా వ్యవహరించారు. రిలయన్స్ జియోలో మరికొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టే ఒప్పందాల్లోనూ ఆయనదే కీలక పాత్రని కార్పొరేట్ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోదీ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. సంస్ధాగత నిర్మాణంపై రిలయన్స్ ప్రచారం చేసుకోకున్నా అంబానీ, మనోజ్ మోదీల సాన్నిహిత్యం ఎలాంటిదో పరిశ్రమ వర్గాలకు తెలుసని, కీలక ఒప్పందాలను ఇరువురు ఖరారు చేస్తూ పకడ్బందీగా వాటి అమలుతీరుకు పూనుకుంటారని వెంచర్ క్యాపిటల్ సంస్థ కలారి క్యాపిటల్ పార్టనర్స్ ఎండీ వాణి కోల పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోల్లో డైరెక్టర్గా వ్యవహరించే మనోజ్ మోదీ కంపెనీ ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ ముందుంటారు. చదవండి : ఫోర్భ్స్ జాబితాలో మళ్లీ ముఖేష్ -
గాంధీ ఆస్పత్రిలో మనోజ్ పేరుతో వార్డు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి, కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్ షాతో భేటీ) ఈ క్రమంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం వైరస్ బారిన పడ్డారు. ఇలా ఇప్పటికే 16 మందికి వైరస్ సోకగా, వారిలో సకాలంలో వైద్యసేవలు అందక జర్నలిస్టు మనోజ్ మృతి చెందడం, జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. సచివాలయ బీట్ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
ఆర్మీ కొత్త చీఫ్గా మనోజ్
న్యూఢిల్లీ: దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను కొత్తగా ఏర్పాటైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్)కు అధిపతిగా కేంద్రం నియమించడంతో.. ఆర్మీ వైస్చీఫ్గా ఉన్న జనరల్ మనోజ్æ ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో పెరిగిన చైనా దూకుడు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో 13 లక్షల సైన్యానికి అధిపతిగా మనోజ్ బాధ్యతలు చేపట్టారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంస్కరణలను పట్టాలకెక్కించే బాధ్యత ఆయనపైనే పడింది. కాగా, సీడీఎస్ ఆధ్వర్యంలో నడిచే సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను ఏర్పాటు చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన మనోజ్(59)నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో శిక్షణ పొందారు. 1980లో సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్లో చేరారు. 37 ఏళ్ల సర్వీసులో చైనాతో 4వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న ఈస్టర్న్ కమాండ్తోపాటు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లలో ఉగ్రవ్యతిరేక చర్యల్లో పాల్గొన్నారు. కశ్మీర్లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు నాయకత్వం వహించారు. శ్రీలంక వెళ్లిన శాంతి పరిరక్షణ దళంలోనూ, మయన్మార్లోను మూడేళ్లపాటు పనిచేశారు. సేనా పతకం, విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఈయన అందుకున్నారు. ఉగ్రమూలాలపై దాడి చేసే హక్కుంది పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆ దేశంలోని ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్కు ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎం.ఎం. మనోజ్ స్పష్టం చేశారు. పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలపై ముచ్చటించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉగ్ర మూకల ఏరివేత, వారి నెట్వర్క్ను నిర్వీర్యం చేయడంతో పాక్ ఆర్మీ పరోక్ష యుద్ధ వ్యూహం బెడిసికొట్టింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి’ అని తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చైనా సరిహద్దులో పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో దృష్టంతా ఇప్పుడు పశ్చిమ సరిహద్దుల నుంచి ఉత్తర సరిహద్దుకు మారింది. ఉత్తర సరిహద్దుల్లో సన్నద్ధతను, సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్నాం’అని తెలిపారు. ఎప్పుడైనా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేలా సైన్యాన్ని సన్నద్ధం చేయడంపైనే తన దృష్టంతా ఉందని జనరల్ మనోజ్ అన్నారు. కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం రక్షణ శాఖలో కొత్తగా సైనిక వ్యవహారాల విభాగం(డీఎంఏ)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొట్టమొదటి సీడీఎస్గా నియమితులైన జనరల్ బిపిన్ రావత్ దీనికి నేతృత్వం వహించనున్నారని ప్రభుత్వం మంగళవారం తెలిపింది. త్రివిధ దళాలకు మాత్రమే సంబంధించిన కొనుగోళ్లను, మిలటరీ కమాండ్ల పునర్వ్యవస్థీకరణ, అన్ని కమాండ్లను సమన్వయ పరుస్తూ వనరులను గరిష్టంగా వినియోగపడేలా చూడటం డీఎంఏ బాధ్యతని పేర్కొంది. త్రివిధ దళాల అవసరాలకు తగ్గట్లుగా కొనుగోళ్లు, శిక్షణ, సిబ్బంది నిర్వహణ చేపట్టడం తోపాటు దేశీయ తయారీ ఆయుధాల వినియోగాన్ని పెంచడం దీని లక్ష్యమని తెలిపింది. ఇందుకు సంబంధించి 1961 నాటి భారత ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చేపట్టేందుకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారని పేర్కొంది. కాగా, సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని, దేశం తిరోగమనంలో పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం: జనరల్ రావత్ పాక్, చైనాల నుంచి సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సైన్యం పునర్వ్యవస్థీకరణ, ఆధునీకరణ పదవీ కాలంలో తాను సాధించిన అతిపెద్ద విజయాలని పేర్కొన్నారు. సీడీఎస్గా ప్రభుత్వం నియమించడంతో ఆయన మంగళవారం ఆర్మీ చీఫ్గా బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సైనిక వందనం స్వీకరించారు. అనంతరం జనరల్ రావత్ మాట్లాడుతూ.. మూడేళ్ల పదవీ కాలంలో తనకు సహకరించిన సైనిక శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త చీఫ్ నేతృత్వంలో సైన్యం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీడీఎస్ హోదాకు సంబంధించిన షోల్డర్ ర్యాంక్ బ్యాడ్జీ, కారుజెండా, టోపీ, యూనిఫాం గుండీలు, బెల్ట్ -
హిజ్రాను వివాహమాడిన యువకుడు
చిత్తూరు : తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందు బెంగళూరుకు చెందిన మనోజ్ శుక్రవారం రాత్రి సబీ అనే హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఆలయం ముందు వివాహ తంతు జరుగుతుంటే స్థానికులు, భక్తులు ఆశ్చర్యపోయి చూశారు. హిజ్రాలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అవును..వాళిద్దరూ ఒకటయ్యారు... మరోవైపు ఓ హిజ్రాను మరో హిజ్రా పెళ్లాడిన సంఘటన తిరుపతిలోని దామినేడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఇందిరమ్మ గృహాల్లో నివసిస్తున్న హిజ్రాలలో ఓ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇదేంటి ఒక హిజ్రా, ఇంకో హిజ్రాను పెళ్ళి చేసుకోవటం ఇదేమి విచిత్రం అనుకున్నా సరే వారిద్దరూ పెళ్ళి అనే బంధంతో ఒకటయ్యారు. కేవలం దాంపత్య సుఖం మాత్రమే కాదని, ఒకరికి ఒకరు కష్టాల్లో, సుఖాల్లో తోడు నీడగా ఉండాలని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. -
ఎవరో చూస్తుంటారు
రాత్రి పది దాటింది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది ఊర్మిళ. మనోజ్ తలుపులు మూసి బోల్టు పెట్టి ఊర్మిళను గాఢంగా కౌగిలించుకుని ముద్దులు కురిపించాడు.‘‘మనోజ్! ఏంటి అంత తొందర? ఈ రాత్రి అంతా మనదే’’ గోముగా అతన్ని అల్లుకుని గుసగుసలాడింది ఊర్మిళ.‘‘తొందరే మరి! వారం దాటింది మనం కలిసి. నిన్ను తలచుకోని క్షణం లేదనుకో. కనులు మూసినా నీవాయె, కనులు తెరిచినా నీవాయె. నిద్ర పట్టడం లేదు...’’‘‘ఏం చేద్దాం? మా ఆయనకు డే డ్యూటీ. సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడు. పగలు నువ్వు రావడం బాగుండదు. ఇంటికి ఎవరో ఒకరు వచ్చేస్తుంటారు. పట్టుబడితే అసలుకే మోసం మనోజ్. అర్థం చేసుకో..’’‘‘ఓకే.. ఓకే.. సుమన్గాడికి విడాకులిచ్చేయ్. తర్వాత మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా గడుపుదాం..’’ అన్నాడు మనోజ్ ఆమెను బెడ్రూమ్లోకి నడిపిస్తూ.‘‘అదంత ఈజీ కాదులే..! చూద్దాం! ఇప్పుడు సుమన్తో ఏం ప్రాబ్లమ్?’’‘‘ప్రాబ్లమా? వాడికి నైట్డ్యూటీలు ఉంటేనే మనకు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లేకపోతే నరకమే కదా?’’‘‘నరకం అనుభవిస్తేనే స్వర్గసుఖాల విలువతెలుస్తుంది’’ అని పకపక నవ్వింది ఊర్మిళ.ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు. కాసేపటికి కాలింగ్బెల్ మోగింది. ఉలిక్కిపడ్డాడు మనోజ్. భయపడిపోయింది ఊర్మిళ. ఇద్దరూ హడావుడిగా మంచం మీద నుంచి లేచి డ్రెస్ చేసుకోసాగారు.‘‘ఎవరు ఈ టైమ్లో వచ్చింది?’’ అడిగాడు మనోజ్. ‘‘ఏమో! ఎవరైనా రిలేటివ్స్ వచ్చారేమో? నువ్వు ఇక్కడే ఉండు. నేను లైట్ ఆర్పి వెళతాను’’ అంటూ ఊర్మిళ లైట్ స్విచాఫ్ చేసి, బెడ్రూమ్ తలుపులు మూసి హడావుడిగా వెళ్లి బోల్టు తీసింది.తలుపు తెరవగానే ఎదురుగా భర్త కనిపించే సరికి భయంతో వణికిపోయింది ఊర్మిళ. రేగిన జుట్టు, అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీర, ముఖంలో భయం చూసి ‘‘నిద్రపోయావా?’’ వ్యంగ్యంగా అడిగాడు సుమన్.‘‘ఆ.. ఔనండీ! నిద్రపోతున్నాను. ఏంటి అప్పుడే వచ్చారు?’’ వణుకుతున్న కంఠంతో అన్నది ఊర్మిళ.‘‘ఎందుకంటే..? నువ్వు గుర్తొచ్చావు. చాలా రోజులైంది కదా.. ఆ సుఖంలేక’’‘‘చాలారోజులెక్కడా?’’‘‘ఇరవైనాలుగు గంటలే నాకు చాలా రోజులైనట్టుగా అనిపిస్తోందోయ్!.. పద..’’ అంటూ ఊర్మిళను బెడ్రూమ్లోకి లాక్కెళ్లసాగాడు సుమన్.‘‘అయ్యో! అదేంటండీ! ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. డ్రెస్ మార్చుకుని, స్నానంచేయండి..ఎందుకు తొందర..?’’ నవ్వుతూ అన్నది ఊర్మిళ.‘‘స్నానం చేద్దాంలే.. ఆ తర్వాత..’’ అంటూ బెడ్రూమ్లోకి లాక్కెళ్లాడు ఊర్మిళను.స్విచ్ వేశాడు. మంచం మీద ఉన్న మనోజ్ లేచి కూర్చున్నాడు. తని ముఖం నెత్తురు చుక్కలేనట్టు తెల్లగా పాలిపోయింది. తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనకుండా నిలబడ్డాడు. సుమన్ పెద్దపులిలా మనోజ్ మీద పడ్డాడు. బూతులు తిడుతూ అందినచోటల్లాతన్నసాగాడు. మనోజ్ దెబ్బలు కాచుకుంటూ ఉన్నాడు.‘‘నిన్ను చంపేస్తారా!...’’ అంటూ సుమన్ వంటగదిలోకి పోయి చాకు చేతిలోకి తీసుకున్నాడు.‘‘వద్దండీ.. ప్లీజ్..! తప్పయింది. వదిలేయండి. ఇక ముందు అతన్ని రానీయను..’’ అంటూ ఊర్మిళ సుమన్ రెండు కాళ్లూ పట్టుకుని నిలువరించింది.ఆ సమయంలో మనోజ్ పారిపోయాడు.‘‘తప్పుడు ముండా! ఏం లోటు జరిగిందే వాడిని తగులుకున్నావు? పరువు తీస్తున్నావే దరిద్రగొట్టుదానా’’ అంటూ కొట్టసాగాడు.‘‘తప్పయిందండీ.. ప్లీజ్ క్షమించండి..’’ అంటూ ఏడుస్తోంది ఊర్మిళ.‘‘ఈసారి వాడు వచ్చినట్టు తెలిసిందో? ఇద్దరినీ చంపేస్తా..’’ ఆయాసపడుతూ అన్నాడు సుమన్.∙∙ నాగార్జునసాగర్ రిజర్వాయర్లో పోతోంది లాంచి. సుమన్ ఊర్మిళ పక్కపక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. సుమన్ చల్లగాలి పీలుస్తూ దూరంగా కనిపిస్తున్న కొండలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.ఇంతలో ఊర్మిళ సెల్ మోగింది.‘‘హలో.. హలో..’’ అన్నది.‘‘సరిగా వినపడ్డం లేదు..’’ అంటూ లేచి డెక్ మీదకు వెళ్లింది. ‘‘హలో.. ఎక్కడున్నావు?’’ అటు నుంచి ప్రశ్నించాడు మనోజ్.‘‘లాంచీలో పోతున్నాం. ఇప్పుడు రిజర్వాయర్ మధ్యలో ఉన్నాం. ఎందుకు ఫోన్ చేశావు అనవసరంగా..?’’ విసుగ్గా అన్నది ఊర్మిళ.‘‘ఏం లేదు. గుర్తుచెయ్యడానికి చేశాలే. నాగార్జున కొండ పైకి వెళ్లిన తర్వాత మ్యూజియమ్ చూస్తారు. తర్వాత అక్కడి నుంచి రోడ్డు ఉంటుంది. రీ కన్స్ట్రక్షన్ చేసిన బౌద్ధ స్థూపాలు, అవీ ఉంటాయి. వాటిని చూస్తూ కొండ చివరకు తీసుకెళ్లు వాడిని. అటు పక్క కొండపై నిలబడితే కింద రిజర్వాయర్ కనిపిస్తూఉంటుంది. సమయం చూసి వాడిని బలంగా నెట్టెయ్. నీళ్లలో పడిపోతాడు. ఛస్తాడు బద్మాష్!... తర్వాత గట్టిగా అరుస్తూ మ్యూజియమ్ వైపు వెళ్లు..’’మనోజ్ చెబుతుంటే.. ‘‘సరేనే, మల్లికా.. ఉంటాను’’ అంటూ వచ్చేసింది సుమన్ దగ్గరకు.‘‘ఎవరు?’’ అనుమానంగా చూస్తూ అడిగాడు సుమన్.‘‘మా ఫ్రెండ్ మల్లిక..’’ అన్నది నవ్వుతూ.సుమన్ ఆమె చేతిలోని సెల్ఫోన్ లాక్కుని చూశాడు. స్క్రీన్ మీద అంతకు ముందు మాట్లాడిన నంబర్, మల్లిక అనే పేరు కనిపించాయి. మనోజ్ నంబర్ను మల్లిక అని సేవ్ చేసుకుంది ఊర్మిళ తెలివిగా.లాంచి నాగార్జున కొండకు ఆనుకుని ఆగింది. ఒక్కొక్కరే దిగారు. లాంచి కెప్టెన్ అనౌన్స్ చేశాడు వెళ్తున్న వారిని ఉద్దేశించి..‘‘ఇప్పుడు పదిన్నరైంది. ఒంటిగంటకు లాంచి రిటర్న్ అవుతుంది. అప్పటికి లాంచి దగ్గరకు మీరంతా చేరుకోవాలి. మిస్సయ్యారంటే మళ్లీ సాయంకాలం నాలుగింటి వరకు వేరే లాంచి వచ్చి రిటర్న్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.’’ టూరిస్టులంతా మ్యూజియంలోకి ప్రవేశించారు. రెండువేల సంవత్సరాల కిందటి శిల్పాలు, బౌద్ధ సంస్కృతి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందినవి చూస్తూ గడుపుతున్నారు.‘‘రెండువేల సంవత్సరాల కిందట ఇక్కడ ఇక్ష్వాకులు రాజ్యం ఏలారు. నాగార్జునుడు యూనివర్సిటీ నడిపాడు. చైనా, జపాన్, టిబెట్, శ్రీలంక వంటి పదమూడు ఆసియా దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్య నేర్చుకుని వెళ్లేవారు.యుద్ధాల వల్లనో, కృష్ణానది వరదల వల్లనో విజయపురి నగరం కాలగర్భంలో కలిసిపోయింది. పురావస్తు శాఖ 1926 లో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించడంవల్లయూనివర్సిటీ ప్రాంతం మునిగిపోయింది. శిల్పాలు, బౌద్ధారామాలు వగరైనా ఈ కొండ మీద మ్యూజియమ్లో ఉంచారు.’’గైడ్ చెబుతున్నది శ్రద్ధగా వింటూ కదులుతున్నారు. గంట తర్వాత టూరిస్టులు మ్యూజియం బయటకు వచ్చారు. ‘‘ఏమండీ మనం బౌద్ధ స్థూపాలు చూద్దాం. కొండ మీద అన్నీ రీ కన్స్ట్రక్షన్ చేశారట..’’ అన్నది ఊర్మిళ ఉత్సాహంగా.‘‘సరే.. పద..’’ అన్నాడు సుమన్.ఇద్దరూ కలసి బౌద్ధ స్థూపాలు చూస్తూ కొండ చివర ఒడ్డుకు చేరుకున్నారు. కొండ కింద సముద్రంలా కనిపిస్తోంది రిజర్వాయర్. కనుచూపు మేర అంతా నీరే.‘‘ఎంత బాగుందో ఈ సీన్. సముద్రం ఒడ్డున నిల్చున్నట్టు ఉంది..’’ అన్నది ఊర్మిళ పరవశించిపోతూ.‘‘ఊ..’’ అంటున్నాడు సుమన్.ఊర్మిళ అటూ ఇటూ చూస్తోంది. కొన్ని క్షణాల్లో సమయం చూసి సుమన్ని కొండ పైనుంచి తోసెయ్యడమే తరువాయి. ఊర్మిళ కబుర్లు చెబుతూ సమయం కోసం చూస్తున్నది. రెండు చేతులూ ముందుకు చాచి సుమన్ని నెట్టబోయింది.ఇంతలో ఒక యువకుడు పొదలమాటు నుంచి హఠాత్తుగా వచ్చి ఊర్మిళను బలంగా నెట్టాడు. ఊర్మిళ బొమ్మలా గాలిలో ఊగుతూ రిజర్వాయర్లోకి పడిపోయింది.‘‘వెల్డన్ శేఖర్..’’ అన్నాడు సుమన్ తమ్ముడిని అభినందిస్తూ.‘‘అన్నయ్యా! నిన్ను మర్డర్ చేయాలనే నాగార్జునకొండ ట్రిప్వేసింది. మనం అలెర్ట్గా ఉండబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈపాటికి నీళ్లలో కొట్టుకుపోతూ ఉండేవాడివి’’ అన్నాడు శేఖర్.తర్వాత సుమన్ పరుగెత్తుతూ అరవసాగాడు..‘‘నా వైఫ్ కొండపై నుంచి జారి నీళ్లలో పడిపోయింది.. ప్లీజ్ హెల్ప్..’’ కాసేపటికి జనం గుమిగూడారు అక్కడ. సుమన్ ఏం జరిగిందో చెబుతున్నాడు. గజ ఈతగాళ్లు నీళ్లలోకి దిగారు. ఊర్మిళను లాక్కువచ్చారు. అప్పటికే ఆమె ప్రాణం వదిలింది. ‘‘నాగార్జున కొండ చూడడానికి వెళ్లిన టూరిస్ట్ ఊర్మిళ ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి రిజర్వాయర్లో పడిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించడానికి ప్రయత్నించారు గాని, కాపాడలేకపోయారు. ఊర్మిళ మరణించింది. ఆమె భర్త భార్య మరణాన్ని తట్టుకోలేక విలపించడం టూరిస్టులందరినీ కలచివేసింది.’’వార్త అన్ని న్యూస్పేపర్లలోనూ వచ్చింది. సుమన్, శేఖర్ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు.తాము ఎత్తుకు పైఎత్తు వేసి ఊర్మిళను మట్టుబెట్టారు. లేకపోతే ఊర్మిళ ప్రియుడి సాయంతో సుమన్ని హత్యచేసి ఉండేది అనుకుని సంతోషించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన సుమన్, తమ్ముడికి కాల్ చేశాడు.‘‘నా ఫ్రెండ్ ఫారిన్ నుంచి జానీవాకర్ తెచ్చాడు. నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాం. నువ్వూ వచ్చి జాయిన్ అవ్వు..’’సుమన్ ఇంట్లో పార్టీ మొదలైంది. కాసేపటికి కాలింగ్బెల్ మోగింది. శేఖర్ వెళ్లి తలుపు తీశాడు.ఎదురుగా పోలీసు ఇన్స్పెక్టర్, కొందరు కానిస్టేబుల్స్.‘‘మిస్టర్ సుమన్ నిన్ను, నీ తమ్ముడు శేఖర్ని అరెస్టు చేస్తున్నాం..’’ సుమన్ దగ్గరకు వచ్చి చెప్పాడు ఇన్స్పెక్టర్.‘‘సార్! నన్ను, నా తమ్ముడిని అరెస్టు చేస్తున్నారా? ఎందుకు?’’ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు సుమన్.‘‘ఎందుకా? నీ భార్యను కొండపై నుంచి నీళ్లలోకి తోసి చంపినందుకు..’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘నో.. ఊర్మిళ కాలుజారి పడింది..’’ గట్టిగా అన్నాడు సుమన్.‘‘సరే! ఇది చూడు..’’ అంటూ సెల్ఫోన్లో వీడియో చూపించాడు.శేఖర్ వేగంగా వెళ్లి ఊర్మిళను నెట్టేయడం, అన్నదమ్ములిద్దరూ షేక్హేండ్ ఇచ్చుకుంటూ పగలబడి నవ్వడం కనిపించింది.సుమన్, శేఖర్ బిత్తరపోయారు. భయంతో గడగడ వణికిపోయారు. తాము చేసిన పని ఎవరు షూట్చేసి పోలీసులకు పంపారో అర్థంకాలేదు.‘‘మిస్టర్ సుమన్! నేరం చేసేవాడు తమను ఎవరూ చూడటం లేదనుకుంటారు. కాని ఎవరో చూస్తుంటారు. ఒక టూరిస్ట్ మీరు చేసిన ఘాతుకం వీడియో షూట్ చేసి మాకు పంపబట్టి మీరు దొరికిపోయారు. తెలుసుకోండి.. నేరందాగదు..’’ చెప్పాడు ఇన్స్పెక్టర్.పోలీసు కానిస్టేబుల్స్ అన్నదమ్ములిద్దరికీ బేడీలు వేసి వ్యాన్ ఎక్కించారు. - వాణిశ్రీ -
శిశిరానికి సెలవిచ్చా...
‘‘నేను వెడుతున్నాను...’’ కాఫీ తాగేసి లేచాడు మనోజ్.‘‘సరే... మంచిది!’’ ముభావంగా చెప్పింది సంహిత.‘‘అయామ్ సారీ, నా వల్ల నీవు హర్ట్ అయినట్టయితే...’’ ఫార్మల్గా చెప్పాడు.అభావంగా చూసింది. అతను వెళ్ళిపోయాడు వాకిట్లో వేసిన ముగ్గుతో పాటుగా, ఆమె హృదయాన్ని తొక్కుకుంటూ. అప్పటివరకూ కంటి చివరలో నిలిచిన కన్నీటి కణం ఇక ఆగలేనట్టు జారిపడింది ఆమె చెక్కిలి పైకి...గుండెల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి వెల్లువై ఒక్కసారిగా ఎగసింది... అంతే... రెండు చేతుల్లో తల దాచుకొని వెక్కి వెక్కి రోదించసాగింది సంహిత. ‘అయిపోయింది... ఒక అధ్యాయం ముగిసింది... ఇక నాకోసం నేను బ్రతకాల్సిందే...’ తనకు తానే సమాధానం చెప్పుకుంది. స్టవ్ మీద టీ పెట్టి, సిమ్ చేసి, ముఖం కడుక్కోవటానికి ఉపక్రమించింది. ‘‘ఏయ్, నీకేమైనాపిచ్చా? అతనలా తెగేసిచెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోతే చేతకాని దానిలాగా ఎందుకు ఊరుకుంటావు? ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు నువ్వు పనికిరానిదానివయ్యావా? నీలో ఉన్న లోపాలు ఇప్పుడు మీరు విడిపోవటానికి కారణం అయ్యాయటనా? అసలు పెళ్లి చేసుకున్నది ఎందుకట, ఇలా మధ్యలో విడిపోవటానికా? ఆ కాగితాలపై ఎందుకు సంతకాలు పెట్టావు?’’ కోపంగా అడిగింది వాసంతి.‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మగవాడితో సిగ్గు విడిచి ‘నువ్వే కావాలి, నన్ను వదిలేయకు’ అని ఎలా చెప్పమంటావు వాసూ? నేనూ మనిషినే కదా, అంత అవమానాన్ని ఎలా సహించగలనే?’’ ‘‘సంహీ... నేను వెళ్లి అడుగుతాను... పెళ్ళంటే ఏమైనా బొమ్మలాటా, కాసేపు ఆడుకుని బోర్ కొట్టగానే మానేయటానికి? నీ జీవితం ఏమైపోవాలి?’’‘‘ఏమీ అయిపోలేదు, అవ్వదు...’’ కూల్ గా చెప్పింది సంహిత. ‘‘అతను రాకముందు నా జీవితం ఉంది, ఇప్పుడూ ఉంది, ఇకపై కూడా ఉంటుంది. అంతే...’’‘‘అసలు ఏం జరిగింది చెప్పు?’’గతమనే గవాక్షపు తలుపులు తెరిచింది సంహిత. ‘‘జీవితంలో నాకు చాలా కలలున్నాయి... వాటిని నెరవేర్చుకోవాలి... నాతో పాటుగా మీరు కూడా ఆ పథంలో అడుగేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు...’’ పెళ్లి చూపుల్లో మనోజ్ కి టీ కప్పు అందిస్తూ అన్నది సంహిత.‘‘కలలా? ఏమిటవి?’’ కాజువల్గా అడిగాడు, గాలికి ఎగిరే ఆమె చీర కొంగును చూస్తూ...ఆమె ఒక్కోటీ చెబుతూ ఉంటే ముఖం అదోలా పెట్టాడు. ఆ తర్వాత అనాసక్తిగా విన్నాడు. ‘‘సంహితా, ఆర్యూ సీరియస్?’’‘‘యస్... అయామ్...’’‘‘కలలంటే ఇవా? చక్కగా ఒక పెద్ద స్థలం కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకోవాలి...పెద్ద కారు కొనుక్కోవాలి. మనకి ఇద్దరు పిల్లలు ఉండాలి. వాళ్లకి చాలా ఖరీదైన స్కూల్లో చదువు చెప్పించాలి. ఖరీదైన ఫర్నిచర్, పెయింటింగ్స్ మన ఇంట్లో ఉండాలి. రిచ్ లైఫ్ కావాలి మనకి...అవీ కలలంటే...తెలుసా?’’‘‘అదికాదు మనోజ్, నేను చెప్పేది విన్నారు కదా, అర్థం అయిందా మీకు?’’ కంగారుగా అన్నది సంహిత.‘‘చక్కగా అర్థమైంది. నువ్వు చాలా తరచుగా రక్తదానం చేస్తావు. ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్లి ఆదుకుంటావు. అనాథ పిల్లలకూ, వృద్ధులకూ సాయం చేస్తావు. ఇవే కదా... నేను వీటిని అభ్యంతర పరచను. వీటిని కలలంటే ఎలా? ఇవి నీ నిత్యకృత్యాలు. కాకపోతే నా కలలు ఇప్పుడే చెప్పాను కదా, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం ఇద్దరమూ చేద్దాము... సరేనా?’’‘అభ్యంతర పరచను’ అనగానే పొంగిపోయింది సంహిత. ‘‘మరి, ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చానా?’’ నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు, మనోజ్.క్రీగంట సిగ్గుతో అతన్ని చూస్తూ చేయి విడిపించుకుని లోపలి గదిలోనికి వెళ్ళిపోయింది, సంహిత. మిగిలిన విషయాలు అన్నీ పెద్దవాళ్ళే నిశ్చయించారు. మనోజ్ ఒక్క రూపాయి కూడా కట్నం వద్దనటంతో, ఆ వ్యక్తిత్వానికి దాసోహం అయిపొయింది సంహిత మనసు. ‘‘చక్కగా ఇద్దరం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం...ఐదు లక్షల రూపాయల చిట్ మొదలు పెడదాం...’’ పెళ్ళయిన వారం రోజులకు చెప్పాడు మనోజ్.‘‘ఉహు కుదరదండీ... నాకు కమిట్ మెంట్స్ ఉన్నాయి...’’ ‘‘కమిట్ మెంట్స్? అవేమిటి?’’‘‘నేను ‘సత్య’ అనే పాపను అడాప్ట్ చేసుకున్నాను. హోమ్లోఉంటుంది. ఆ పాపకి నెలకి చదువుకు అయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను...’’ చెప్పింది.‘‘సరి సర్లే, ఇప్పటివరకూ భరించావుగా ... ఇక మానేయ్...’’ తేలికగా చెప్పాడు మనోజ్.‘‘అలా ఎలా వీలవుతుంది?’’‘‘అవుతుందోయ్... రేపు మనకే పిల్లలు పుడతారు... అలాంటప్పుడు పరాయి పిల్లలు, వాళ్ళ ఖర్చులు మనకెందుకు చెప్పు?’’ ఆమెను మాట్లాడనీయకుండా చేతుల్లో బంధించాడు. మరో రోజు ఇద్దరూ ప్రగాఢ ప్రణయావేశంలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ కాల్ రాగానే బయలుదేరుతూ ఉంటే వద్దన్నాడు. ‘‘లేదండి, యాక్సిడెంట్... చాలా ప్రమాదంలో ఉన్నాడు పేషెంట్... నేను వెళ్లి బ్లడ్ ఇవ్వాలి... ప్లీజ్...’’ చెబుతూనే త్వరగా రెడీ అయి, తన బైక్ మీద వెళ్ళిపోయింది సంహిత. ఇంకో రోజు అతను వద్దని అంటున్నా, ఒక అంధురాలైన విద్యార్థినికి పరీక్ష వ్రాయటానికని స్క్రయిబ్గా వెళ్ళింది... ఈ రెండు సంఘటనలూ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధాన్ని ప్రారంభింప జేసి, మనసులమధ్య దూరాన్ని ఎక్కువచేసాయి.అతనిదంతా డబ్బు జాగ్రత్త, విపరీతమైన పొదుపు. ఆమె పాత డ్రెస్సులు, చీరలు ఎవరికీ ఉచితంగా ఇవ్వనీయడు. ‘సెకెండ్ హాండ్ లో అమ్మేస్తే బోలెడు డబ్బు కదా!’ అంటాడు. పుస్తకాలు, పత్రికలూ కొనుక్కోనీయడు. లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవచ్చు కదా అంటాడు... అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత సంహిత మొత్తం ఇంటి పనీ, వంట పనీ తానే చేయాలి. ఇటు చెంచా తీసి అటు పెట్టడు. ఏదైనా తనకి ఇష్టమైన మూవీ గురించి కాని, పుస్తకం గురించి కానీ చర్చించుదామంటే అతనికి ఆసక్తి ఉండదు. ‘ఊ..ఊ..’ అంటూ అటు తిరిగి పడుకుంటాడు. నిరాశగా నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ మిగల్లేదు సంహితకు. గొడవలు పడటం ఇష్టం లేని సంహిత, అతను అడిగిన డబ్బు ఇచ్చేసి, మిగిలిన దాంతో కష్టపడి సర్దుకుంటోంది. ఈలోగా సంహిత తండ్రికి ఆరోగ్యం పాడై, ఏవో టెస్టులు చేయించుకోవలసి వచ్చి, సంహిత దగ్గరకు వస్తే తానే ఆయన్ని లాబ్ కి తీసుకుపోయి పరీక్షలు జరిపించింది. వాటికీ, డాక్టర్ ఫీజుకీ, మందులకీ ఇంచుమించు ఐదారువేల దాకా ఖర్చయింది. తనకు చెప్పకుండా ఆ డబ్బు ఖర్చు చేసినందుకు చాలా రాద్ధాంతం చేసాడు మనోజ్. అతను డబ్బు మనిషి అనీ, ‘డబ్బు’ ను తప్ప మనుషులను ప్రేమించడనీ అర్థమైంది సంహితకు... ‘పిల్లలు పుడితే అతనే మారతాడమ్మా...’ అనునయంగా చెప్పింది తల్లి. అదే ఆశతో కాలం గడుపుతోంది సంహిత... ఎంతకాలం ఎదురు చూసినా తాను తల్లీ కావటం లేదు, మనోజ్ కూడా మారలేదు. పైగా సంహిత తనకు అనుకూలంగా మారలేదని అతనికి అంతులేని కోపం. ‘‘ఇలా ఎంతకాలం? మనకి పిల్లలు పుట్టే సూచనలేవీ కనపడటం లేదు... సంహితా, నీతో నేను ఆనందంగా ఉండలేను... మనం విడిపోదాం’’ ఒకరోజు చెప్పాడు మనోజ్.‘‘మనో... ఏమిటంటున్నారు? చాలా తప్పు. మనం విడిపోవటానికా పెళ్లి చేసుకున్నది?’’ ‘‘కాదు కానీ, నీ తెంపరితనం నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాకు అనుకూలంగా ఉండవు... నీకు ఖర్చులెక్కువ. నాకన్నా అనాథలూ, దిక్కు లేని వాళ్ళూ ప్రాణం...ఏదో పెళ్ళికి ముందు సరదా పడ్డావు, నన్నడిగితే నువ్వు పెళ్లి తర్వాత మారతావని అనుకుని మాటిచ్చాను... కాని నువ్వు మారలేదు, మారవు కూడా... అందుకే నాకు నీమీద ఇష్టం పోయింది...యస్... ఐ హేట్ యూ...’’‘‘ఇష్టం అనేది ఒకసారి కలిగాక పోతుందా మనోజ్? మీరు ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు... నా వైపు నుంచి మీరు సానుకూలంగా ఆలోంచించవచ్చు కదా.. మీ పాటికి మీరు నా మీద ఇష్టాన్నే చంపేసుకున్నారు. కానీ మీరంటే నాకు మాత్రం చాలా ప్రేమ!’’ ఆవేదనగా చెప్పింది సంహిత.‘‘హు...ప్రేమ! నీ ఆశయాల మీదా, నీ ఆదర్శాల మీదా మాత్రమే నీకు ప్రేమ... అందుకే వాటిని వదులుకోలేవు నీవు నాకోసం.. అలాంటప్పుడు నేనే నిన్ను వాటికి వదిలేసి వెళ్ళిపోవటం న్యాయం... మ్యూచువల్ కన్సెంట్ మీద విడాకులు తీసుకుందాం...’’ స్థిరంగా చెప్పాడు మనోజ్. ‘‘అది వాసూ నా పెళ్లి కథ...నువ్వు చాలా కాలంగా ఇక్కడ లేకపోవటం వలన, నీ కాంటాక్ట్ నంబర్ నా దగ్గర లేకపోవటం వలన నా విషయాలు ఏవీ నీకు ఇప్పటివరకూ తెలియవు. అతనికి నా వ్యాపకాలు మైనస్ చేసుకుని, నా డబ్బును ప్లస్ చేసిన తర్వాత అతనికే మిగిలిన నేను కావాలి... అతని కన్నా ముందుగా నా జీవితంలోకి వచ్చిన వాటిని, వారిని నేను వదులుకోలేను కదా...’’ ముగించింది, సంహిత. ఆమె మొబైల్ మ్రోగింది... అవతలి వాళ్ళు చెబుతున్నది వింటున్నంత సేపూ సంహిత ముఖంలో ఆందోళన... ఫోన్ కాల్ ముగించి చెప్పింది... ‘‘పాప సత్యకి ఆరోగ్యం బాగాలేదు... అర్జెంట్ గా నేను ఆర్ఫనేజ్ కి వెళ్ళాలి... ఇక సత్యను అక్కడ ఉంచలేను, ఇంటికి తీసుకు వచ్చేస్తాను...’’ దృఢంగా అన్నది లేస్తూ.‘‘వీళ్ళకోసం నీ కాపురం వదులుకున్నావా?’’‘‘కాపురం కోసం ‘వీళ్ళని’ వదులుకోలేను... అలా చేస్తే నన్ను నేను చంపుకున్నట్టే... నాకు జీవించాలని ఉంది వాసూ... లెటజ్ గో...’’ సంహిత ముఖంలో కొత్తవెలుగు గోచరించింది వాసంతికి. నండూరి సుందరీ నాగమణి -
ప్రీమియం ఫ్యాన్ల మార్కెట్లో ఆటంబర్గ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్, సమర్థవంతమైన మోటార్ల తయారీలో ఉన్న ముంబై కంపెనీ ఆటంబర్గ్ టెక్నాలజీస్ ప్రీమియం ఫ్యాన్ల మార్కెట్లో పోటీపడుతోంది. వచ్చే రెండేళ్లలో ప్రీమియం విభాగంలో 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ కో–ఫౌండర్ మనోజ్ మీన సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘బీఎల్డీసీ టెక్నాలజీతో రూపొందిన కంపెనీ ఫ్యాన్లు 65 శాతం విద్యుత్ను ఆదా చేస్తాయి. ఖరీదు రూ.3,000 ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఫ్యాన్ల విపణి 6 శాతం వార్షిక వృద్ధితో రూ.10,000 కోట్లుంది. ఇందులో ప్రీమియం విభాగం వాటా 15 శాతం కాగా, వృద్ధి ఏకంగా 20 శాతముంది. గృహోపకరణాల్లో వాడేందుకు వీలుగా సమర్థవంతమైన మోటార్లకై గోద్రెజ్, వోల్టాస్లు మా కంపెనీతో చర్చిస్తున్నాయి. వచ్చే ఏడాది మిక్సర్ గ్రైండర్ను ప్రవేశపెట్టనున్నాం’ అని వివరించారు. -
తర్వాత ఎవరు?
మనోజ్, ప్రియాంక శర్మ జంటగా కమల్ కామరాజు ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత ఎవరు’. జి. కృష్ణప్రసాద్, కె. రాజేష్ దర్శకత్వంలో లక్ష్మిరెడ్డి కె, రాజేష్ కోడూరు నిర్మించారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లాంచ్ చేశారు. మరో జర్నలిస్ట్ చందు రమేశ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. చిత్ర దర్శకులు కృష్ణప్రసాద్, రాజేష్ మాట్లాడుతూ ‘‘రియాలిటీ బేస్డ్ థ్రిల్లర్ మూవీ ఇది. నలుగురు కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన టీమ్కి థ్యాంక్స్. ఆగస్టు 3న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకులకు, నిర్మాతలకు థ్యాంక్స్. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మనోజ్. కథానాయిక ప్రియాంక శర్మ పాల్గొన్నారు. -
యూత్ కోసం రియాలిటీ షో
‘ఫస్ట్ టైమ్ మన యూత్ కోసం తెలుగులో ఒక రియాలిటీ షో వచ్చిందిరా’ అంటూ ప్రారంభమయ్యే ‘తరువాత ఎవరు’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కమల్ కామరాజు, భరణి, మనోజ్, ప్రియాంక శర్మ, యషికా మౌల్కర్, సాయి కిరణ్ ముఖ్య తారలుగా జి.కృష్ణప్రసాద్, కె.రాజేష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. హ్యాపీ ఎండింగ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మిరెడ్డి కె., రాజేష్ కోడూరి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ– ‘‘తరువాత ఎవరు’ టైటిల్లోనే సినిమా కథ మొత్తం ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ చాలా గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా ఉందని అంటున్నారు. అదే థ్రిల్ సినిమా మొత్తం ఉంటుంది. తప్పకుండా యువతను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ, మా థ్రిల్లర్ సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది’’ అన్నారు ప్రధాన పాత్రధారులు. సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, ఎడిటర్ ఆవుల వెంకటేష్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పాళయంకోట కలెక్టరేట్ ముందు విద్యార్థి బంధువులు రాస్తారోకో చేశారు. వివరాలు.. శివగంగై జిల్లా కరియూర్కి చెందిన బాలమురుగన్ కుమారుడు మనోజ్ (18). ఇతను నెల్లై సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజినీర్ కళాశాలలో బీఈ సివిల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మనోజ్ హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మున్నీర్పల్లం పోలీసులు అక్కడికి వచ్చి పరిశీలించారు. అనంతరం మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాళయంకోట ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం మనోజ్ బంధువులు, విద్యార్థులు పాళయంకోట ఐకిరవుండులో ఉన్న కలెక్టరేట్ ముందు రాస్తారోకో చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న పాళయంకోట జాయింట్ పోలీసు కమిషనర్ విజయకుమార్, పోలీసులు అక్కడికి వచ్చారు. చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
‘ఇలాంటి ఆర్మీ చీఫ్ను ఎన్నడూ చూడలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్పై ఆర్జేడీ నేత మనోజ్ జా తీవ్ర విమర్శలు చేశారు. ఆర్మీ చీఫ్ ఎప్పుడు చూసినా మీడియాలోనే ఉంటున్నారని అన్నారు. వారాంతము 24గంటలపాటు ఆయన మీడియాలోనే నానుతున్నారని, ఇలాంటి ఆర్మీ చీఫ్ను తాను ఇంత వరకు చూడలేదని విమర్శించారు. గతంలో వచ్చిన ఆర్మీ చీఫ్లు ఎంతో చక్కగా పనిచేసేవారని, చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వచ్చే వారని తెలిపారు. ఇప్పటి ఆర్మీ చీఫ్ కంటే కూడా బాగా పనిచేశారని చెప్పారు. జమ్ముకశ్మీర్ పాఠశాలల తీరుపైన, విద్యార్థులు, కాలేజీ యువకులపైన బిపిన్ రావత్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో మనోజ్ జా స్పందించారు. రావత్ మాటలు వింటే జనాలు కంగారు పడతారని, అభద్రతా భావంలోకి వెళతారని, ఆయన అలా మాట్లాడకూడదని హితవు పలికారు. జమ్ముకశ్మీర్లో మొత్తం యువత తప్పుదారి పడుతోందని, అక్కడి మదర్సాలు కూడా అశాంతికి పరోక్షంగా కారణం అవుతున్నాయని, వాటిపై కొంత నియంత్రణ అవసరం అని అన్నారు. దీనిపై పలువురు విమర్శలు చేశారు. -
హీరో నేను కాదు.. అజయ్ – మంచు మనోజ్
‘‘ఒక్కడు మిగిలాడు’ కథ వినగానే ఆ కథకి గౌరవం ఇవ్వాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా. శ్రీలంకను బేస్ చేసుకుని తీసిన సినిమా కాదిది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చేసిన చిత్రం’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో మనోజ్ మాట్లాడుతూ– ‘‘సిరియాలో ఓ చిన్నారి మృతదేహం నీటిలో కొట్టుకుని వచ్చిన ఫోటో చూసినప్పుడు ప్రపంచం ఉలిక్కి పడింది. ఓ ఫొటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనే ఆలోచనతో అజయ్ ఈ సినిమా చేశాడు. ఈ చిత్రానికి హీరో నేను కాదు... అజయ్ ఆండ్రూస్. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్న రోజునే మన దేశం ముందుకెళుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్తో క్యారీ చేశాడు. టీమ్ చేసిన ఈ మంచి ప్రయత్నం చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నా’’ అని నారా రోహిత్ అన్నారు. ‘‘విజువల్స్ చూస్తుంటే మంచి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టీజర్లో మనోజ్ పర్ఫార్మెన్స్ చూసి థ్రిల్లయ్యా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ తెలిపారు. అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ – ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే టెంపోలో ఉంటుంది. పాటలు ఉండవు. ఇలాంటి సినిమా చేయడానికి రెండు పిల్లర్స్ కావాలి. మొదటి పిల్లర్ మనోజ్గారు. రెండో పిల్లర్ నిర్మాతలు. బ్రతకడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడనే సామాన్యుడి వేదన ఈ సినిమాలో కనపడుతుంది. నా ముత్తాత, తాతలు స్వాతంత్య్ర సమరయోధులు. నాన్న, మావయ్యలు ఆర్మీలో పనిచేశారు. అందుకనే ఈ డిఫరెంట్ కంటెంట్ను సినిమాగా తీశా’’ అన్నారు. ‘‘ఏడాదికి పైగా ఈ సినిమాతో జర్నీ చేశాం. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన మూవీ ఇదే’’ అన్నారు ఎస్.ఎన్. రెడ్డి. అనీషా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్బేడీకి షాక్
టీ.నగర్: పుదుచ్చేరిలో ఏడుగురు ఎమ్మెల్యేల బోర్డు అధ్యక్షుల పదవీకాలాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో గవర్నర్ కిరణ్బేడి నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ అనూహ్య పరిణామాలతో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీ అయ్యారు. పుదుచ్చేరిలో 30కి పైగా బోర్డు అధ్యక్షుల పదవులు కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు, పార్టీ నిర్వాహకులకు అందజేయడం పరిపాటి. 2016 మేలో కాంగ్రెస్–డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ధనవేలు, విజయవేణి, బాలన్, తీప్పాయిందాన్, జయమూర్తి ఐదుగురు డీఎంకేలో శివ, గీతా ఆనందన్ బోర్డు అధ్యక్షులుగా పదవులు చేపట్టారు. ఏడుగురు బోర్డు అధ్యక్షులు ఏడాదిపాటు మాత్రమే పదవుల్లో కొనసాగే వీలుంది. అంతేకాకుండా వారి కార్యనిర్వహణ సామర్థ్యాన్ని బట్టి వారు పదవుల్లో కొనసాగే అవకాశం ఉందనే నిబంధన మేరకు గవర్నర్ కిరణ్బేడి అంగీకారం తెలిపారు. ఇలావుండగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా బోర్డు అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించేందుకు మంత్రి వర్గం నిర్ణయించి గవర్నర్కు ఫైలు పంపింది. అయితే దీన్ని నిరాకరించిన గవర్నర్ బోర్డు అధ్యక్షుల ఏడాది కాలం కార్యాచరణ నివేదికను కోరుతూ నిషేధం విధించారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలు బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగలేక తప్పుకున్నారు. తర్వాత ఈ ఫైలును ఏకాభిప్రాయం కుదరలేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కిరణ్బేడి పంపారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ముఖ్యమంత్రి నారాయణస్వామి కలిసి బోర్డు అధ్యక్షుల పదవీ కాలం కొనసాగింపునకు అనుమతిని ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చారు. కేంద్ర హోంశాఖ నుంచి గురువారం పుదుచ్చేరి గవర్నర్, ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సతీష్కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు మళ్లీ బోర్డు అధ్యక్షుల పదవుల్లో కొనసాగేందుకు అనుమతి అందజేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొద్ది రోజుల్లో బోర్డు అధ్యక్షులందరూ తమ పదవులను అందుకోనున్నారు. పుదుచ్చేరి సీఎస్ బదిలీ: గవర్నర్తో విభేదాల కారణంగా పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా బదిలీకి గురయ్యారు. పుదుచ్చేరి 2016 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పాటైంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కిరణ్బేడీని గవర్నర్గా నియమించగా కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా హోదా పెంచబడింది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వెళ్లకుండా పుదుచ్చేరిలో పనిచేస్తూ వచ్చారు. ఇలావుండగా గవర్నర్గా బాధ్యతలు చేపట్టగానే కిరణ్బేడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోసాగారు. దీంతో సీఎం నారాయణసామితో ఘర్షణ వైఖరి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా మనోజ్ ఫరిదా నిలిచారు. ఆ తర్వాత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారంలోను కేంద్ర హోంశాఖకు వ్యతిరేకంగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నట్లు గవర్నర్, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి చీఫ్ సెక్రటరీ మనోజ్ ఫరిదా అకస్మికంగా ఢిల్లీకి బదిలీ అయ్యారు. ఆయనకు బదులుగా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చిన అశ్విన్కుమార్ పుదుచ్చేరికి నియమితులయ్యారు. ఆయన త్వరలో పుదుచ్చేరికి వచ్చి పదవీ భాద్యతలు స్వీకరించనున్నారు. -
మహేశ్గారితో నటించే చాన్స్ చేజారింది!
‘దేవిశ్రీ ప్రసాద్ సినిమా ప్రారంభంలో చిన్నపాటి భయం ఉండేది. కానీ, సినిమా చూశాక హ్యాపీగా ఉంది. మూడు పాత్రల మధ్య జరిగిన అసాధారణ ఘటన వల్ల ఎలాంటి పరిణామాలు జరిగాయన్నదే చిత్రకథ’’ అని మనోజ్ నందం అన్నారు. పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రల్లో శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందిని చిత్రం ‘దేవి శ్రీ ప్రసాద్’. యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న విడుదల కానుంది. మనోజ్ నందం మాట్లాడుతూ– ‘‘గతేడాది నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి, 25 రోజుల్లో పూర్తిచేశాం. అయితే చిన్న నిర్మాతలు, సమస్యల వల్ల విడుదల ఆలస్యమైంది. వెంకటేష్గారికి మా సినిమా నచ్చడంతో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. సినిమాటోగ్రాఫర్ ఫణి మంచి విజువల్స్ అందించారు. సంగీత దర్శకుడు కమ్రాన్గారు నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. నా మరో చిత్రం ‘మనసైనోడు’ నవంబర్లో రిలీజవుతుంది. ‘వీరభోగ వసంతరాయులు’లో మంచి పాత్ర చేస్తున్నా. మహేశ్బాబుగారి సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది’’ అన్నారు. -
ఆ క్రీడ నా కుమారుడిని బలితీసుకుంది!
కేరళ: బ్లూవేల్ గేమ్ వలనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మహిళ పోలీసుకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే గత నెల 26న తిరువనంతపూర్కు చెందిన మనోజ్(16) ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ గత ఏడాది బ్లూవేల్ గేమ్ను డౌన్లోడ్ చేసుకుని, గేమ్కు సంబంధించి రోజుకో టాస్క్ పూర్తి చేస్తూ చివరి దశకు వచ్చాడు. అతనిలో రోజుకో మార్పు చోటుచేసుకునేదని తల్లి చెప్పింది. ఎవరినైనా చంపాలి లేకపోతే నేనైనా చావాలి అంటూ అందరిని ఆశ్చర్యపరిచే మాటలనే వాడని ఆమె పెర్కొన్నది. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడని కాకపోతే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడన్నది. చనిపోయే ముందు అతని ఫోన్లో ఆ గేమ్ని డిలీట్ చేశాడని చెప్పింది. బ్లూవేల్ గేమ్ వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్లను తక్షణం తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. -
పుష్కరం దాటాక డబుల్ డోస్
బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించిన మంచు మనోజ్ ‘దొంగ దొంగది’తో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం విడుదలై పుష్కరం (పన్నెండేళ్లు) దాటింది. ఇప్పటి వరకూ చేసిన అన్ని సినిమాల్లోనూ సింగిల్ క్యారెక్టర్లో కనిపించారు మనోజ్. తొలిసారి ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డబుల్ డోస్ అన్నమాట. ఈ చిత్రంలో ఆయన ఎల్.టి.టి.ఈ. మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్గా, స్టూడెంట్ లీడర్గా కనిపించనున్నారు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో పద్మజ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఎన్.రెడ్డి–లక్ష్మీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనీషా ఆంబ్రోస్ కథానాయిక. ఈరోజు (మే 20) మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న విద్యార్థి పాత్ర లుక్ను రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిలిటెంట్ లీడర్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మనోజ్ స్టూడెంట్ లుక్ కోసం దాదాపు 15 కేజీలు తగ్గారు. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం మామూలు విషయం కాదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకొచ్చాయి. జూన్ మొదటివారంలో ఆడియో, నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి. కోదండ రామరాజు, సంగీతం: శివ నందిగామ. -
ప్రపంచ చాంపియన్షిప్కు మనోజ్, కవీందర్, సతీశ్ అర్హత
తాష్కెంట్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్విని యోగం చేసుకున్న భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), కవీందర్ సింగ్ బిష్త్ (52 కేజీలు) ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్కు అర్హత సాధించారు. ఆసియా చాంపియన్షిప్లో భాగంగా చివరి రోజు జరిగిన ‘బాక్స్ ఆఫ్ బౌట్’లలో మనోజ్ 3–2తో లియు వీ (చైనా)పై... సతీశ్ 5–0తో ము హైపెంగ్ (చైనా)పై గెలుపొందగా... కవీందర్కు తన ప్రత్యర్థి సలామ్ అబ్దుల్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించింది. ఇంతకుముందే శివ థాపా, సుమీత్ సాంగ్వాన్, వికాస్ కృషన్, అమిత్ ప్రపంచ చాంపియన్షిప్ బెర్త్ సాధించారు. -
భారీ స్కాంపై మంచు వారి సినిమా
వరుస ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో మంచు ఫ్యామిలీ హీరోలు కథల ఎంపికలో కొత్త దనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన మంచు ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం రియలిస్ట్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ స్కాం నేపధ్యంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మంచు ఫ్యామిలీ హీరోలు. అమెరికా వాళ్లను మోసం చేసి కోట్ల కొద్ది డబ్బును వేనకేసుకున్న మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాంను సినిమాగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు తెలుసుకునేందుకు మంచు టీం థానే పోలీసులను సంప్రదించింది. అయితే ఈ విషయంలో మంచు ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియాకు సమాచారం అందకపోయినా బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మోహన్ బాబు
-
గుంటూరోడుకి చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాట సాయం చేశారు. రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రానికి చిరు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరోడు’ చిత్రానికి మెగాస్టార్ తన మాట ఇచ్చారు. ‘చిత్ర కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవిగారు తనదైన మాస్ స్టయిల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు’ అని దర్శకుడు తెలిపారు. ‘చిరంజీవిగారు మా చిత్రానికి మాట సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని మనోజ్ అన్నారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపైశ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ చిత్రం మార్చి 3న విడుదలవుతోంది. రాజేంద్రప్రసాద్, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వీ, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వసంత్, కెమెరా: సిద్ధార్థ రామస్వామి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రభు తేజ. -
మనోజ్ కెరీర్లో మైల్స్టోన్
మంచు మనోజ్ హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ థియేట్రికల్ ట్రైలర్ని మోహన్బాబు విడుదల చేశారు. ‘‘ట్రైలర్లో ప్రతి ఫేమ్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సత్య చక్కగా తెరకెక్కించారు. మనోజ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్స్టోన్గా నిలుస్తుందని ఆశిస్తున్నా’’ అని మోహన్బాబు చెప్పారు. ‘‘ఈ నెలాఖరున ఆడియో, ఫిబ్రవరి 10న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రభుతేజ, సంగీతం: శ్రీ వసంత్. -
గుంటూరోడు ట్రైలర్ వచ్చేసింది.!
-
మనోజ్ 210 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్లో శాంతి ఎలెవన్ బ్యాట్స్మన్ మనోజ్ కుమార్ (114 బంతుల్లో 210 నాటౌట్; 28 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో యూనివర్సల్ సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 299 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శాంతి ఎలెవన్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. మనోజ్ అజేయ డబుల్ సెంచరీతో యూనివర్సల్ సీసీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుమంత్ (60), కిరణ్ (41) ఆకట్టుకున్నారు. అనంతరం 363 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూనివర్సల్ సీసీ జట్టు 40 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. శాంతి ఎలెవన్ బౌలర్లలో బి. రాహుల్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. -
ప్రారంభమైన మంచు మనోజ్ కొత్త సినిమా
-
విడాకులిచ్చింది.. మళ్లీ కిడ్నాప్ చేసి పెళ్లి ...
సీబీసీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశం కేకే.నగర్: ఈ భర్త నాకు వద్దంటూ విడాకులు తీసుకున్న ఓ భార్య ఆస్తి కోసం అదే వ్యక్తిని కిడ్నాప్ చేసి మళ్లీ పెళ్లి చేసుకుంది. ఈ కేసుపై సీబీసీఐడీ విచారణ జరపాలని మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త రాజన్ కుమారుడు మనోజ్. ఇతడు మానసిక దివ్యాంగుడు. అయితే 2008లో మనోజ్కు, ప్రియదర్శిని అనే యువతితో మైలాపూర్ ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాది లోపే విడాకులు కోరుతూ ప్రియదర్శిని పిటిషన్ దాఖలు చేసింది. మానసిక దివ్యాంగుడనే విషయాన్ని దాచి మనోజ్ తో తనకు పెళ్లి చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ పరిస్థితిలో కోట్ల రూపాయల ఆస్తులతోపాటు కుమారుడిని సంరక్షించే బాధ్యతను తన మిత్రుడు ఆనందన్కు అప్పగించి మనోజ్ తండ్రి రాజన్ 2013లో మృతి చెందాడు. అనంతరం మనోజ్ను కూడలూరు మానసిక దివ్యాంగుల కేంద్రంలో చేర్పించారు. గత నెల కూడలూరుకు చెందిన న్యాయవాదితో పాటు వెళ్లిన ప్రియదర్శిని... మనోజ్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్లినట్లు దివ్యాంగుల కేంద్రం నిర్వాహకుల ద్వారా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలని ఆనందన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పిఎన్.ప్రకాష్ ... మనోజ్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని కనిపెట్టి సంరక్షణా కేంద్రంలో అప్పగించాలని పోలీసులను ఆదేశించారు. అయితే మనోజ్ను కిడ్నాప్ చేసి ప్రియదర్శిని మళ్లీ వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ కేసు న్యాయస్థానానికి చేరింది. దాంతో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రియదర్శిని మనోజ్ను మళ్లీ వివాహం చేసుకోవాలనుకుంటే అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని సూచించారు. అలా చేయకుండా న్యాయవాదితో కలిసి మనోజ్ను కిడ్నాప్ చేసి అతనికి సొంతమైన 1.67 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రియదర్శని సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తులు ఈ కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. -
లవ్.. కామెడీ.. యాక్షన్
మంచు మనోజ్ కొత్త చిత్రం అంగీకరించారు. ‘నా రాకుమారుడు’ ఫేమ్ ఎస్.కె.సత్య చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారాయన. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరుణ్ అట్లూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకుడు సత్య మాట్లాడుతూ -‘‘మనోజ్ క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలైట్. లవ్, కామెడీలతో కూడిన మాస్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు. త్వరలో కథానాయికని ఎంపిక చేసి, చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: సిద్దార్ధ రామస్వామి, సంగీతం: శ్రీ వసంత్. -
మనోజ్కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో మనోజ్ 66 కేజీ కేటగిరీలో 490 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. శివ కుమార్ 440 కేజీల బరువెత్తి రజతం, ఓంప్రసాద్ (420 కేజీలు) కాంస్యం నెగ్గారు. 74 కేజీ కేటగిరీలో జానకిరామ్ 637.5 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించాడు. రమేష్ (575 కేజీలు), చంద్రకాంత్ (437.5 కేజీలు) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 72 కేజీ కేటగిరీలో నిత్య స్వర్ణం నెగ్గింది. ఇతర విభాగాల విజేతలు 59 కేజీ కేటగిరీ: 1. కుమార్ (500 కేజీలు), 2. శ్రీశైలం (360 కేజీలు); 83 కేజీ కేటగిరీ: 1. చందర్ శంకర్ (662.5 కేజీలు), 2. బాలకృష్ణ (502.5 కేజీలు); 93 కేజీ కేటగిరీ: 1. శ్రీనివాస్ (625 కేజీలు), 2. శ్రీకాంత్ (480 కేజీలు); 105 కేజీ కేటగిరీ: 1. కార్తి (582.5 కేజీలు), 2. రాజత్ సింగ్ (375 కేజీలు); ప్లస్ 120 కేజీ కేటగిరీ: 1. సుమిత్ (747.5 కేజీలు). -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
చింతపల్లి మండలం దేవులాతండా వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా దర్శి మండలకేంద్రానికి చెందిన మనోజ్(3) అనే బాలుడు మృతిచెందగా..బాలుడి తల్లి సరస్వతి, తండ్రి రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదసమయంలో కారు మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండగా..బైక్ హైదరాబాద్ నుంచి దర్శి వెళ్తోంది. బైక్పై ప్రయాణిస్తోన్న వారు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘రియో’కు చేరువలో మనోజ్, సుమిత్
బాకు (అజర్బైజాన్): మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ఇద్దరు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మనోజ్ 2-1తో ఇస్మెతోవ్ ఐరిన్ స్మెతోవ్ (బల్గేరియా)ను ఓడించగా... సుమిత్ 3-0తో సందాగ్సురెన్ ఎర్దెనెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించాడు. 75 కేజీల విభాగంలో భారత్కే చెందిన వికాస్ కృషన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్కు చేరాడు. ఫైనల్కు చేరితేనే దేవేంద్రోకు రియో బెర్త్ ఖాయమవుతుంది. -
మానస...మనోజ్ అయ్యాడు..
కామారెడ్డి : తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మిదేవత ఇంటికి వచ్చిందని మురిసిపోయారు. చూడచక్కగా ఉన్న పాపకు మానస పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏడాది.. రెండేళ్లు.. మూడేళ్లు..పదేళ్లు గడిచాయి. అంతలోనే మానసకు కడుపులో నొప్పి రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. తల్లిదండ్రులు డాక్టర్ల వద్ద చూపించారు. రకరకాల పరీక్షలు, స్కానింగ్ తరువాత ఆమెలో మగ లక్షణాలున్నాయని తేల్చారు. గర్భాశయం, అండాశయం లేవని నిర్ధారించారు. పురుషాంగాలు లోపల ఉన్నాయని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్కు డబ్బు చాలానే ఖర్చవుతుందన్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి ఈ నెల 9న కరీంనగర్ జిల్లా ముస్తాబాద్లోని పీపుల్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపు లోపలి భాగంలో ఉన్న వృషణాలను బయటకు తీసి సరిచేశారు. ఇది అరుదైన ఘటనగా చెప్పారు. మానస పేరును మనోజ్గా మార్చేశారు. ఇప్పుడు మనోజ్గా కొత్త జీవితం మొదలైంది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య దంపతులు కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లో 20 ఏళ్లుగా నివసిస్తారు. రాజు బీడీ కంపెనీలో పనిచేస్తుండగా, లావణ్య బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. వారికి 2005 జూన్ 26న మానస జన్మించింది. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్లోని వాగ్దేవి పాఠశాలలో మానస చదువుతోంది. గత యేడాది 4వ తరగతి చదివింది. ఏడాదిగా సంఘర్షణ... మానస ఆడపిల్ల కాదని తెలిసిన నాటి నుంచి తల్లిదండ్రులు ఎంతో సంఘర్షణకు లోనయ్యా రు. తమ కూతురి సమస్య ఎలా పరిష్కారమవుతుందోనని ఆ తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యారు. కూతురిని వెంటబెట్టుకుని ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. బీడీలపైనే ఆధారపడ్డ ఆ దంపతులు కూతురిని కాపాడుకునేందుకు అప్పు లు చేసి మరీ ప్రయత్నాలు చేశారు. ఎలాగోలా ఆపరేషన్ చేయించారు. ఏడాది కాలం గా పడ్డ సంఘర్షణకు తెరపడడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. కాని మరో మూడు నెలలకు మరో ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పిన మీదట మరిన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలనేది ఆ తల్లిదండ్రులకు తీవ్ర సమస్యగా మారింది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం బీడీ కంపెనీలో పనిచేసే రాజు, బీడీలు చుట్టే లావణ్యల సంపాదన సంసారానికే సరిపోతుంది. అయితే తమ కూతురి సమస్యతో ఇబ్బందులు పడ్డ రాజు, లావణ్యలు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏడాదిపాటు తిరగడానికి, వైద్యానికి రూ. లక్షన్నర అప్పు చేశారు. చేసిన అప్పు తీర్చడం ఒక ఎత్తయితే, మరో ఆపరేషన్కు కావలసిన డబ్బులు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి భారంగా మారాయి. తమకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తుల మృతి
నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లికి చెందిన కొవ్వూరు ఏడుకొండలు(43), చిట్టమూరు మండలం జునపాటిపాలెం గ్రామానికి చెందిన దుక్కలూరి మనోజ్(16) నాయుడుపేటలోని మంజీరా వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్పై పెన్నేపల్లికి బయలుదేరారు. వారి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాలపాలైన మనోజ్ మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో కన్నుమూశాడు. -
ఆమె... దశాబ్దం తర్వాత అతడయ్యాడు
ముస్తాబాద్: అందమైన చిరునవ్వు.. అంతే అందమైన పేరు.. మానస. అందరు పిల్లల్లాగే పెరిగి పెద్దవుతున్న కొద్దీ మానసలో కొన్ని అసహజ మార్పులు..! ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా... ఆమెలో పురుష లక్షణాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ వైద్యుడు చింతోజు శంకర్ను సంప్రదించగా ఆయన శస్త్రచికిత్స నిర్వహించి మానసను మనోజ్గా మార్చారు. వివరాలివీ.. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గవ్వల రాజు, లావణ్య కూతురు మానస(11). వీరు ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. మానస అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టినప్పుడు కొంత పురుష అవయవాలతో జన్మించగా.. దానిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. మానస జన్మించినప్పుడు వృషణాలు పొత్తికడుపులో ఉండడంతో గమనించలేదు. స్త్రీ మర్మావయాలు కొంతమేరకు ఉండడంతో ఆమ్మాయిగానే భావించారు. అందరు ఆడపిల్లల్లాగే పెంచారు. ఇటీవల ఆమెలో పురుష లక్షణాలు కనిపిస్తుండటంతో గమనించిన తల్లిదండ్రులు కరీంనగర్, హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. మానసలో పురుష లక్షణాలు ఉన్నాయని, గర్భాశయం, అండాశయం లేవని వైద్యులు తేల్చారు. కానీ, శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. రెండు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లికి చెందిన కొర్రె వేణుకు స్త్రీ, పురుష జననాంగాలు ఉండగా, జిల్లాలోని ముస్తాబాద్లోని పీపుల్స్ హాస్పిటల్లో డాక్టర్ చింతోజు శంకర్ శస్త్రచికిత్స చేసి సరిచేశారని ‘సాక్షి’ లో వచ్చిన కథనం చూసిన మానస తండ్రి గవ్వల రాజు... డాక్టర్ శంకర్ను సంప్రదించాడు. బైలాటరల్ ఆర్కిటోపెక్సీగా పిలిచే అరుదైన కేసు అని డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. గర్భంలో ఉన్నప్పుడు వైక్రోమోజోం సరిగా ఎదగకపోవడంతో జెనెటిక్ సమస్య వచ్చిందన్నారు. మానసలో టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, శస్త్రచికిత్స ద్వారా మూత్రనాళం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లోనే కోలుకుంటుందని తెలిపారు. శస్త్రచికిత్సతో మానస జీవితం మారిపోయిందని, ఆమెను మనోజ్గా పిలుచుకుంటామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
అంతులేని నిరీక్షణ
తప్పిపోయిన తనయుడు మనోజ్ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపు కన్నబిడ్డ రాకకై తల్లి ఆరాటం చేతికి అందివచ్చిన కొడుకు నాలుగేళ్లుగా కనిపించక పోవటంతో కన్నతల్లిదండ్రుల ఆవేదనకు అంతులేదు. ఎక్కడైనా కొడుకు కనిపించకపోతాడా అన్న ఆశతో చూసి చూసి వారు కళ్లు కాయలు కాశాయి. ‘అమ్మా! ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంతవరకూ ఇంటికి రాలేదు. పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కనిపించినట్టే కనిపించి మాయమయ్యాడని కొందరు స్నేహితులు, బంధువులు చెప్పటంతో ఎప్పటికైనా ఇంటికి తిరిగి రాకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తున్న ఆ కన్నవారి ఆవేదనకు ఇది అక్షరరూపం. విజయలక్ష్మి, శివకుమార్ దంపతులు తొమ్మిదేళ్ల కిందట సామర్లకోట నుంచి వైజాగ్ వచ్చేశారు. ప్రహ్లాదపురంలో ఫర్నిచర్ వ్యాపారంలో స్థిరపడ్డారు శివకుమార్. వాళ్లకు ఇద్దరబ్బాయిలు విశ్వతేజ, మనోజ్. పెద్ద కొడుకు ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగి. చిన్నకొడుకు సింహాచలం అప్పన్న గుళ్లో సెక్యూరిటీ ఉద్యోగి. నాలుగేళ్ల కిందటి వరకు వారిది సంతోషమైన కుటుంబం. ఇలా సాగిపోతున్న వారి సంసారంలో ఒక పెద్ద కుదుపు. 2012 ఆగస్టు నెల23న ఎప్పటి లాగానే తండ్రీ కొడుకులు ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. మనోజ్ మధ్యాహ్నం మూడున్నరకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి ఏడున్నరకు స్నేహితుడి నుంచి అతడికో ఫోన్ వచ్చింది. ‘అమ్మా! ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా’ అని చెప్పిన వాడు ఇంత వరకు రాలేదు. ఒడిశాలో ఉన్నాడా!: ‘బాబెళ్లి నాలుగేళ్లయింది. ఆ రోజు... మనోజ్ ఇంటి నుంచి వెళ్లిన గంటకు కూడా రాకపోయేసరికి ఫోన్ చేశాను. అప్పటికే ఫోన్ స్విచాఫ్లో ఉంది. సినిమాకెళ్లాడేమో అనుకున్నాను. ఎంతరాత్రయినా రాలేదు. తెల్లా ర్లూ అలా కూర్చునే ఉన్నాను. ఉదయా న్నే మనోజ్ ఫ్రెండ్స్కు ఫోన్ చేశాం. ఎవరూ తమకేమీ తెలియదన్నారు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం. అంజనం వేయిస్తే ఒడిశాలో ఉన్నాడని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే అక్కడికి వెళ్లి బాబు ఫొటో చూపిస్తూ కనిపించిన అందరినీ అడిగాం. మజ్జిగైరమ్మ గుళ్లో కొందరు ‘ఇప్పుడే చూశాం’’ అన్నారు. అక్కడే హోటల్లో కూడా ‘ఇప్పుడే భోజనం చేసి వెళ్లాడు’ అని చెప్పారు. దాంతో మాకు కొండంత ఆశ కలిగింది. బాబు మాత్రం కనిపించలేదు. బాబు ఫొటో కనిపించిన సెక్యూరిటీ ఉద్యోగులందరికీ ఇచ్చాం. ఎన్నో పూజలు చేయించాం. ఓసారి మా వదినకు తిరుపతితో కనిపించాట్ట. తాను క్యూలైన్లో ఉండగా పదడుగుల దూరంలో కనిపించి ‘మనోజ్’ అని పిలవగానే ఆమెను చూసి పరుగెత్తుకు పోయాడని చెప్పింది. పెంబర్తి పోలీస్ స్టేషన్కైతే వందసార్లకంటే ఎక్కువగానే వెళ్లాం. పోలీసులు మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ దొరకలేదు’ అని కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు విజయలక్ష్మి. కొడుకుపై బెంగతోనే : క్షణక్షణం కుమారుడిపై బెంగతోనే తల్లి విజయలక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. ఈ నాలుగేళ్లలో రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. చిన్న కొడుకు ప్రతి చిన్న విషయాన్నీ తనతో చెప్పేవాడు. అలాంటిది ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడో అని తనను తానే ప్రశ్నించుకుంటోంది. అసలు ఉన్నాడో లేదో అనే భావన కలిగితేనే ఆమె హృదయం తల్లడిల్లిపోతోంది. తన సోదరుడి ఆచూకీ తెలిస్తే 97037 09619, 9391309803 నంబర్లకు తెలియజేయాలని మనోజ్ సోదరుడు విశ్వతేజ కోరుతున్నారు. సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం ఏ అమ్మాయినైనా ఇష్టపడి ఆ సంగతి చెప్పలేకపోయాడేమో? ఇంట్లో ఒప్పుకోరని నాతో కూడా చెప్పకుండా దాచాడేమో నా పిచ్చితండ్రి. ఒకవేళ అలాంటిదే ఉంటే బాబు ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానన్నా మాకు అభ్యంతరం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉంటే భార్యాబిడ్డలతో వస్తే సంతోషంగా గుండెలకు హత్తుకుంటాం. - విజయలక్ష్మి, మనోజ్ తల్లి -
చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఎలమంచిలి (పశ్చిమగోదావరి): ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ, వ్యసనాలతో పక్కదారి పట్టిన అతడు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును కొట్టేయబోయి స్థానికులకు చిక్కాడు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే బొరుసు మనోజ్ మద్యం, జూదానికి బానిసగా మారాడు. స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్లకు వచ్చిన అతడు... మంగళవారం సాయంత్రం బైక్పై వెళుతూ కాజా గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసు కాజేయబోయాడు. గొలుసు తెగి కిందపడిపోగా, అదే సమయంలో అతడి బైక్ కూడా ఆగిపోయింది. దీంతో స్థానికులు మనోజ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
వర్మ ఏం చెప్పారంటే..
చిత్రం: ఎటాక్, తారాగణం: మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్రాజ్, మంజుభార్గవి, రచన: సమీర్ చంద్ర, పాటలు: సిరాశ్రీ, కెమేరా: అంజి, సంగీతం: రవిశంకర్, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్ప్లే - దర్శకత్వం: రామ్గోపాల్వర్మ దర్శకుడెవరన్నదాన్ని బట్టి సిన్మా ఎలా ఉంటుందో ఒక ఊహ, అంచనా వస్తాయి. అందుకే, ‘ఎటాక్’ సిన్మాపై ఆసక్తి. కథగా - ‘ఎటాక్’ చాలా చిన్న పాయింట్! ఒక కుటుంబం లోని పెద్దపై జరిగిన ఎటాక్కు అతని కుమారుడు ప్రతీకారం తీర్చుకోవడం! వివరంగా చెప్పాలంటే... గురురాజ్ (ప్రకాశ్రాజ్) ఒకప్పుడు రౌడీలీడర్. కానీ, ఆ తరువాత అవన్నీ వదిలేసి, భవన నిర్మాణ రంగంలో గడుపుతుంటాడు. అతనికి భార్య (మంజుభార్గవి), ముగ్గురు కొడుకులు - కాళీ (జగపతి బాబు), గోపి (వడ్డే నవీన్), రాధాకృష్ణ (మంచు మనోజ్). ఒక స్థలం విషయంలో వచ్చిన తగాదా నేపథ్యంలో గుడి నుంచి వస్తున్న గురురాజ్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేయించారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతీకారానికి దిగిన అతని పెద్దకొడుకూ చనిపోతాడు. ఈ వ్యవహారంలో రౌడీ గ్యాంగ్ (అభిమన్యు సింగ్, పూనవ్ు కౌర్) చురుకుగా పాల్గొంటారు. స్థలం తగాదా ఉన్నవాళ్ళే ఈ హత్యలు చేశారా, మరొకరా అన్నది సస్పెన్స. దాన్ని హీరో ఎలా కనిపెట్టా డనేది పెద్దగా లేకున్నా, ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ. హాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’తో బాగా ప్రభా వితమైన వర్మకు ఇలాంటి గ్యాంగ్ వార్లు, పగలు, ప్రతీకారాలు ఇష్టమైన ముడి సరుకులు. వాటినెలా వండి వడ్డించాలన్నది ఆయనకు అనుభవైకవేద్యం. ‘గాయం’ రోజుల నుంచి ‘సర్కార్’ మీదుగా నిన్నటి మోహన్బాబు ‘రౌడీ’ దాకా ఆ ఫార్ములా వీలైనంత వాడారు. చాలాసార్లు సక్సెసూ సాధించారు. ఈసారి ఫ్లైకామ్ లాంటి ఆధునిక కెమేరా జ్ఞానం, ‘రక్తచరిత్ర’ నుంచి అందుకున్న చిత్రమైన నేపథ్య సంగీతం, పాటలతో తెరకెక్కించారు. మంచితనానికీ, చెడ్డతనానికీ మధ్య తేడా వివరిస్తూ, ‘దానవీరశూర కర్ణ’, ‘సంపూర్ణ రామాయణం’ లాంటి సిన్మాల సీన్లతో, పాటతో ‘ఎటాక్’ మొదలవుతుంది. ఆరంభంలోనే వచ్చే ప్రకాశ్రాజ్ హత్య ఘట్టం చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ‘నాన్న గారు ఏం చెప్పారంటే...’ అంటూ పదే పదే ఫ్లాష్బ్యాక్ సీన్సకి వెళుతూ కథ సాగుతుంది. క్రమంగా 107 నిమిషాల నిడివిలో ‘నేరాలు- ఘోరాలు’ ఎపిసోడ్ చూసిన భావన కలుగు తుంది. ప్రకాశ్రాజ్, జగపతిబాబు, వడ్డే నవీన్ లాంటి సీజన్డ ఆర్టిస్టులున్నారు. వారిని మరింత ఉపయోగించుకొనే సీన్స ఇంకా ఉండాలనిపిస్తుంది. మనోజ్ చేసినపాత్ర సెకండాఫ్లో విజృంభిస్తుంది. వెరసి, ఇది వర్మ మార్క ‘ఎటాక్’. -
రాక్షసుణ్ణి నిద్రలేపాను!
‘‘ఈ సినిమాకు ముందు సి. కల్యాణ్గారు నన్ను కలిసి ‘నువ్వు చేయాల్సిన సినిమాలివి కావు’ అంటూ రెండు గంటలు క్లాస్ పీకారు. నా నుంచి డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారన్నారు. చిరంజీవిగారి ‘కొట్టండి, తిట్టండి..’ అనే ఓ పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఓ పాట రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాటిట్యూడ్తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్రలేపా’’ అని దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్రాజ్ ప్రధానపాత్రల్లో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం ‘ఎటాక్’. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్ మేకింగ్లో రామ్గోపాల్వర్మ ఓ యూనివర్సిటీ లాంటి వ్యక్తి. కల్యాణ్గారి బ్యానర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని మంచు మనోజ్ తెలిపారు. ఈ వేడుకలో కథానాయికలు సురభి, పూనమ్ కౌర్, లైన్ నిర్మాత ప్రసాద్ గుమ్ములూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సహ నిర్మాత మలినేని లక్ష్మయ్య చౌదరి, గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మొండి ధైర్యం వల్లే... అన్నీ సాధించా!
మోహన్బాబు రూటే సెపరేటు...అసిస్టెంట్ డెరైక్టర్గా ఓ చినుకులా మొదలైంది ఆయన సినిమా జర్నీ. ఇప్పుడు మోహన్బాబు ఓ మహా సముద్రం! ఈ సముద్రంలోని ప్రతి కెరటమూ ఓ కథ చెబుతుంది. మోహన్బాబు జీవితంలోని మలుపులూ మెరుపులూ ఎప్పుడూ ఆసక్తికరమే. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా సంభాషిస్తూ, ఎన్నో విషయాలు పంచుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా జీవితాన్ని విశ్లేషించుకుంటే... దేవుడు ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకున్నాననే అనుకుంటున్నారా? అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ గొప్పది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను. నటుడు అయ్యేంతవరకు ‘మన జన్మకు సార్థకత ఏంటి?’ అని ఎప్పుడూ ఆలోచించలేదు. అయ్యాక కూడా పదేళ్లు ఏమీ అనుకోలేదు. ఆ తర్వాత మాత్రం సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన వైపుగా అడుగులు వేశా... వేస్తూనే ఉన్నా. ఆ అడుగులే నా జన్మకు ఓ సార్థకత తెచ్చాయి. ఇప్పటికిప్పుడు ఆ దేవుడు మీ ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మీరేం కోరతారు? ‘భగవంతుడా! కలలో కూడా ఊహించని మంచి జీవితాన్ని ఇచ్చావ్. కష్టాన్నే నమ్ముకున్నాను. దానికి ప్రతిఫలం ఇచ్చావ్’ అని ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆ తర్వాత దేశంలో పెరిగిపోయిన పేదరికాన్ని నిర్మూలించమని కోరుకుంటాను. ‘సమాజంలో అక్రమాలు పెరిగిపోతున్నాయ్. వాటిని రూపుమాపు తండ్రీ! పేదలను పేదలుగానే మిగిల్చేయకు.. మా అందరికీ ఓ మంచి దారి చూపించినట్లే వాళ్లకీ ఓ దారి చూపించు’ అని కోరుకుంటాను. జీవితంలో ఎక్కువ కష్టపడ్డాననే ఫీలింగ్ మీకెప్పుడైనా కలిగిందా? ఈ మధ్య అనిపిస్తోంది. అది కూడా ఏదైనా నొప్పి కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు! ‘మీ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టారు. శక్తికి మించి కష్టపడ్డారు’ అని డాక్టర్ అన్నప్పుడు ‘అవును కదా..’ అనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల ముందు ఒకసారి కెమేరామ్యాన్ విన్సెంట్ గారు షూటింగ్ లొకేషన్లో ‘మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని కష్టపడటం కొంచెం తగ్గించండి’ అన్నారు. అది నిజమనిపిస్తోంది. అవయవాలన్నీ పని చేస్తున్నాయ్... ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, శరీరం కష్టపడిన విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మీ ముగ్గురు పిల్లలు (లక్ష్మీప్రసన్న, విష్ణు, మనోజ్) తెలినవైనవాళ్లే. ఈ ఫీల్డ్కే పరిమితం కాకుండా వేరే ఏదైనా ఫీల్డ్కి వెళ్లి ఉంటే, ఆ తెలివితేటలకు తగిన న్యాయం జరిగి ఉండేదనే ఫీలింగ్ ఏమైనా ఉందా? మనోజ్ మాత్రమే సినిమాల్లోకి రావాలని కోరుకున్నాను. విష్ణుని ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలనుకున్నా. ఇంజినీరింగ్ కాలేజీలో స్టేజి మీద విష్ణు పర్ఫార్మెన్స్ చూసి, తనలో ఇంత మంచి నటుడు ఉన్నాడా? అనుకున్నా. విష్ణు కోరుకున్నట్లు గానే నటుణ్ణి చేశాను. సినిమాలకు పరిమితం కాకుండా ప్రీ-స్కూల్స్ నడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి 50 వరకూ స్కూల్స్ ఉన్నాయి. విద్యారంగంలో బాగా రాణిస్తున్నాడు. సినిమాలు తప్ప వేరే వ్యాపారం చేయనని మనోజ్ అన్నాడు. లక్ష్మికి ఒక స్కూల్ నిర్వహణ బాధ్యత ఇచ్చాం. అది చూసుకుంటూ సినిమాలు చేస్తోంది. ‘ఐయామ్ వెరీ హ్యాపీ’. భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, కోడళ్లు, అల్లుడు, మనవరాళ్లతో సంపూర్ణ జీవితం మీది. వృత్తిపరంగా మీరు సాధించిన సక్సెస్ని ఎక్కువ ఇష్టపడతారా? వ్యక్తిగత జీవితాన్నా? నేను కష్టపడి పైకొచ్చా. నా కష్టమే నాకిష్టం. కష్టపడి పైకొచ్చాను కాబట్టే భార్యా బిడ్డలను పోషించగలిగాను. పిల్లలను బాగా పెంచగలిగాను. నేను కష్టపడినదానికి నా పిల్లలు నా మాట వినకుండా ఎలా పడితే అలా ఉండి ఉంటే... ‘అయ్యో పిల్లలు అప్రయోజకులయ్యారే’ అని బాధపడేవాణ్ణి. నా పిల్లలు మంచి దారిలో ఉండటం వల్ల నా కష్టానికి ఒక అర్థం ఉంది. పదిమందీ మెచ్చుకునే పిల్లల్ని ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, గర్వంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘ఇలా చేసి ఉండాల్సింది కాదేమో..’ అని ఏదైనా విషయంలో మీకు అనిపిస్తూ ఉంటుందా? కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయంలో ‘అలా చేసి ఉండాల్సింది కాదేమో’ అనే ఆవేదన ఒకటుంది. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. బయటికి చెప్పను. మరి.. ‘ఇలా చేసి ఉంటే బాగుండి ఉండేదేమో’ అనుకునే విషయం ఏదైనా ఉందా? నేను తీసిన సినిమా ఫెయిలైనప్పుడు ‘ఇలా కాకుండా వేరేలా తీసి ఉంటే బాగుండేదేమో’ అనే ఫీల్ కలుగుతుంది. ఆ సినిమాల గురించి ఎప్పుడు తల్చుకున్నా ఇదే ఫీలింగ్. ఫెయిల్యూర్ అంటే గుర్తొస్తోంది.. మీరు ఆర్థికంగా బాగా డౌన్లో ఉన్నప్పుడు ‘అల్లుడుగారు’ సినిమా నిర్మించారట.. అది అటూ ఇటూ అయితే, అంతే సంగతులట. ఏమిటా మొండి ధైర్యం? ధైర్యం అన్నది నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఉంది. భయం ఎప్పుడూ లేదు. నా మొండి ధైర్యం వల్లే నేను అన్నీ సాధించాననుకుంటున్నాను. కానీ, మొండి ధైర్యం అనేది అందరికీ కలిసి రాదు. అప్పట్లో మీరు ప్రతినాయకుడిగా చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ దర్శకుడు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయనన్నారట? అది అసత్యం. అలాంటిది ఎప్పుడూ జరగలేదు. నాతో సినిమాలు తీయడానికే ఇష్టడ్డారు. నేను డేట్స్ ఇస్తే చాలనుకున్న సందర్భాలూ ఉన్నాయి. ‘పెదరాయుడు’ టైమ్లో నాతో సినిమా చేయడానికి రామారావుగారు, నాగేశ్వరరావుగార్లతో సినిమాలు తీసిన నిర్మాతలు ముందుకొచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. మీతో పాటు కెరీర్ ఆరంభించిన రజనీకాంత్, చిరంజీవి, ఆ తర్వాతి తరం పవన్ కల్యాణ్లతో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే... ఈ కాంబినేషన్ అనేది జరగని పని. జరిగితే నాకభ్యంతరం లేదు. ఈ మధ్య మీరు చేసిన ‘మామ మంచు-అల్లుడు కంచు’ మీ స్థాయికి తగ్గ సినిమా కాదేమో అనిపించింది? ఆ సినిమా రిలీజ్ అయ్యాక నాకూ అలానే అనిపించింది. నాకంత సంతృప్తినివ్వలేదు. సినిమాలపరంగా మీ ప్లాన్స్ ఏంటి? విష్ణుతో ‘భక్త కన్నప్ప’కి, మనోజ్తో ఓ సినిమాకి ప్లాన్స్ జరుగుతున్నాయి. వీటికి లక్ష్మీప్రసన్న నిర్మాత. పూర్తి వివరాలు మరో సందర్భంలో చెబుతాను. ఓ 30 -35 ఏళ్లు విపరీతంగా కష్టపడి సినిమాలు చేశారు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు కదా... ఎలా ఉంది? ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే న్యూస్ పేపర్స్ చదువుతాను. వాటిలో ఉన్న వార్తలు చూస్తుంటే అసహ్యం కలుగుతోంది. దోపిడీలు, అత్యాచారాలు... ఇలాంటి అక్రమాలకు సంబంధించిన వార్తలే ఎక్కువ. అడవిలో మృగాలు ఆహారం కోసం పోరాడుతున్నాయి. సమాజంలో మనుషులు ఎవరు గొప్ప అనే విషయంలో పోటీపడుతున్నారు. రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. ఇవన్నీ చూస్తుంటే ఆవేదనగా ఉంది. మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా. ఇంతకీ, ఈ బర్త్డే ఎలా జరుపుకోబోతున్నారు? ఎప్పటిలానే శ్రీ విద్యానికేతన్లో స్టూడెంట్స్ మధ్య జరుపుకుంటాను. మా నాన్నగారు మంచు నారాయణస్వామిగారి పేరు మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎంపిక చేసి, ‘బెస్ట్ టీచర్ అవార్డు’ ఇస్తుంటాను. కమిటీ నిర్ణయించిన టీచర్కే ఇస్తుంటాం. లక్ష రూపాయలు నగదు, శాలువాతో సత్కరిస్తాం. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తాం. నాన్నగారి పేరు మీద అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. -
ఘోర నేరాలపై శౌర్యం
కొన్ని కథలు కొత్తగా ఉంటాయి. మరికొన్ని కొత్తగా చెప్పాల్సి ఉంటాయి. చాలా కొద్దికథలే కొత్తగానూ, కొత్తగా చెప్పినట్లుగానూ ఉంటాయి. మొదటి రెండు రకాల సినిమాలూ తరచూ వస్తాయి. మూడో రకం సినిమాలు రావ డమే అరుదు. అలాంటి సినిమాలు తీసేవారూ అరుదే. అలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు రాత, దానితో పాటు తీత - రెండూ కత్తి మీద సామే. కానీ, ధైర్యం చేసి, దర్శక - నిర్మాతలు తెరపై చూపిన ‘శౌర్య’ం - ఈ ఫిల్మ్. చిన్న పాయింట్తో అల్లుకున్న 2 గంటల కథేమిటంటే, శౌర్య (మనోజ్) కోట్ల ప్రాజెక్ట్ సాధించినా, దాన్ని ప్రేమించిన అమ్మాయి నేత్ర (రెజీనా) కోసం వదులుకొనే కుర్రాడు. శివరాత్రి నాటి రాత్రి మొక్కు తీర్చేందుకు గుడిలో జాగారం చేస్తుంటే, హీరో పక్కనే హీరోయిన్ పీక తెగి, రక్తపు మడుగులో ఉంటుంది. ఆ నేరం హీరోపై పడుతుంది. డెత్బెడ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఒక నంబర్ రాసి, కన్ను మూస్తుంది. ఎంపీ కూతురైన హీరోయిన్కీ, హీరోకీ సంబంధమేంటి? ఆ నంబరేంటి? హీరోయే నిజంగా నేరం చేశాడా లాంటి వన్నీ సస్పెన్స నిండిన ఈ థ్రిల్లర్ లవ్స్టోరీలో తెరపై చూడాల్సినవి. గత ఏడాదే వివాహమైన మనోజ్ ఈ సినిమాలో పాత్ర కోసం బొద్దుగా, ముద్దుగా అయ్యారు. ఎమ్ఫార్మసీ చదివిన, హుందాతనం నిండిన ఉద్యోగిగా కాస్ట్యూమ్స్లో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. ఇక, హీరో ప్రేమికురాలిగా, పలుకుబడి ఉన్న ఎంపీ కూతురు నేత్రగా రెజీనాది అభినయపరంగా కాకున్నా, కథా పరంగా కీలక పాత్ర. ఎస్.ఐగా ప్రకాశ్రాజ్ది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్. హీరోయిన్ తండ్రిగా నాగినీడు, బాబాయ్గా సుబ్బరాజులది పాత్రోచిత నటన. కామిక్ రిలీఫ్ కోసం సినిమాలో హీరోయిన్ బావగా ‘ప్రభాస్’ శ్రీను, పోలీసు కానిస్టేబు ల్గా ‘షకలక’ శంకర్ లాంటివాళ్ళున్నారు. ‘చుచ్చూ పోయిస్తా!’ అంటూనే, లేని దయ్యానికి భయపడే మినిస్టర్గా బ్రహ్మానందం సెకండాఫ్లో ఎంట్రీ ఇస్తారు. ఆయనపై పాట అదనం. ఆ కాసేపు పక్కన పెడితే, మిగతా సినిమా అంతా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియల్ ఆఫ్ సీన్స్. చిత్రం: ‘శౌర్య’, తారాగణం: మంచు మనోజ్, రెజీనా కసండ్రా, ప్రకాశ్రాజ్, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం, ‘ప్రభాస్’ శ్రీను, రచన: గోపీ మోహన్, మాటలు: దశరథ్, కిశోర్ గోపు, సంగీతం: కె. వేదా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, కథ - దర్శకత్వం: దశరథ్, నిడివి: 121 నిమిషాలు, రిలీజ్: మార్చి 4 దర్శకుడు దశరథ్ సోదరుడైన వేదా ఇచ్చిన సంగీతం ఆయనలోని వైవిధ్య ప్రదర్శనకు ఉపకరిస్తుంది. కెమేరామన్, ఎడిటర్, ఫైట్స్ లాంటి సాంకేతిక విభాగాలన్నీ కథ, కథనానికి తగట్టుగానే ఉన్నాయి. మొదట క్యారె క్టర్ల పరిచయం, పీటముడిగా మారిన ఒక ఊహించని క్రైమ్లో అనుకోని మలుపుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ సమయంలో కోర్టులో హీరో చెప్పిన ఒక మాటతో ఊహించని ట్విస్ట్. దాంతో, ఇంటర్వెల్. ‘థ్రిల్ కంటిన్యూస్’ అనే ఇంటర్వెల్ కార్డ్కు తగ్గట్లే, ఫస్టాఫ్ తర్వాతా కథ సీరియస్గా సాగిపోతూ... ఉంటుంది. మరో అరగంటలో సినిమా ముగుస్తుందనగా, కథలో కొత్త వేగం వస్తుంది. ఓపిక పట్టినవాళ్ళకు సస్పెన్స్ వీడే అరగంట తప్పక బాగుంటుంది. పెచ్చరిల్లుతున్న కుల విద్వేషాలు, పరువు హత్యలనే సమకాలీన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం అభినందించాల్సిందే. అయితే, దాన్ని మనసును కదిలించే సెంటిమెంటల్ అంశాలతో కాకుండా, విభిన్నంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందించాలని భావించారు. ముడివీడనట్లు కనిపిస్తున్న ఒక నేరం తాలూకు మిస్టరీని సాల్వ్ చేయడం కోసం సస్పెన్స్ పంథాను ఆశ్రయించారు. అలా ఈ సినిమా పూర్తిగా ఆ దోవలో వెళ్ళింది. ఈ వ్యవహారంలో హీరోతో పాటు పోలీస్ ప్రకాశ్రాజ్, నేరస్థులూ మరింత కీలకంగా వ్యవహరిస్తే, కథకు ఇంకా ఊపు, ఉత్సాహం వచ్చేవి. మిస్టరీ సాల్వేషన్కి ఒకరు, దానికి వ్యతిరేకంగా మరొకరు వ్యవహరించడ మనే పంథాలో కలిసొస్తుంది. మొత్తం మీద, ప్రేమకథలోనే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల లాంటివి కలవడం ఒక కొత్తదనమే. అందుకే, టీవీలో కనిపించే ‘నేరాలు - ఘోరాలు’ లాంటి క్రైమ్స్టోరీలకు ఇది వినూత్నమైన వెండితెర ఆవిష్కారం. చాలాసార్లు మనం చూసి ఊహించే దానిలోనో, అవతలివాళ్ళు చెప్పే దానిలోనో కాక, అసలు నిజం వేరొకటి ఉంటుందని అవగాహన కల్పిస్తుంది. వెరసి, ఈ సినిమా ‘ఆనర్ కిల్లింగ్స్’ లాంటి ఘోర మైన నేరాలపై చూపిన ‘శౌర్యం’. - రెంటాల జయదేవ -
మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్
సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడానికైనా, బరువు పెరగడానికైనా సిద్ధపడిపోతారు కొంతమంది హీరోలు. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకునే హీరోల్లో మనోజ్ ఒకరు. దశరథ్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘శౌర్య’ నేడు విడుదలవుతోంది. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం కోసం మనోజ్ బొద్దుగా తయారయ్యారు. ఇక... మనోజ్ ముచ్చట్లు తెలుసుకుందాం... ♦ ‘శ్రీ’ నుంచి నాకు దశరథ్ గారు తెలుసు. ఆయన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంది. ఒకరోజు ఫోన్ చేసి, కథ చెబుతానంటే ఇంటికి రమ్మన్నాను. 30 నిముషాల్లో కథ చెప్పారాయన. ఆ కథ నచ్చింది. ఆ తర్వాత గెటప్ ఎలా ఉండాలనే విషయం గురించి చర్చించుకున్నాం. మామూలుగా నా సినిమాలంటే ఫైట్లు, డ్యాన్సులు కామన్గా ఉంటాయనుకుంటారు. అలాగే నేను కొంచెం రఫ్ లుక్లో కనిపిస్తాను. కానీ, తనకలా వద్దనీ, కొంచెం బొద్దుగా, క్యూట్గా ఉండాలనీ దశరథ్ చెప్పారు. దాంతో బాగా తినడం మొదలుపెట్టాను. కానీ, నా మజిల్ పవర్ మాత్రం తగ్గలేదు. అందుకని పప్పు-ఆవకాయ్-నెయ్యి బాగా తినడం మొదలుపెడితే, అప్పుడు బుగ్గలు వచ్చాయి. ప్యాంటు, షర్ట్ టక్ చేసుకుని, పక్క పాపిడి తీసి, నున్నగా దువ్వుకుని, ప్లెయిన్ షర్ట్స్ వేసుకుని లుక్ని సెట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం మొత్తం ఎనిమిది కిలోలు బరువు పెరిగాను. ♦ ఈ చిత్రకథ విషయానికొస్తే.. మొదటి పది నిమిషాల్లో ఇది ఎలాంటి సినిమా? అనేది తెలిసిపోతుంది. అక్కణ్ణుంచి ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు దశరథ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దశరథ్ తనను తాను ఊహించుకుని క్రియేట్ చేసిన పాత్రలో నేను నటించాను. మొత్తం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఇది పక్కా దర్శకుడి సినిమా. మొన్ననే మా ఫ్యామిలీ అంతా సినిమా చూశాం. సంగీత దర్శకుడు వేదాకి ఇది తొలి సినిమా అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేశాడు. ♦ నేనే సినిమా ఒప్పుకున్నా మా ఇంట్లోవాళ్లతో, ఇతరులతో షేర్ చేసుకోను. నాకు కథ, పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటాను. ఫైనల్గా అవుట్పుట్ చూపిస్తాను. జయాపజయాల గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే, మా నాన్నగారు కెరీర్లో శిఖరాగ్రంలో ఉన్నప్పుడూ చూశాను. డౌన్లో ఉన్నప్పుడూ చూశాను. అందుకే మాకు జయాపజయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. మా నాన్నగారు ఈ సినిమా చూసి, ‘చాలా సటిల్గా చేశావ్’ అని అభినందించారు. ♦ పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పు ఒక్కటే. ఐదు సంవత్సరాల క్రితం నుంచే మాకు పరిచయం ఏర్పడింది. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఐదేళ్లు ఎవరి కంటా పడకుండా తిరిగి, మ్యానేజ్ చేశాం. పెళ్లి తర్వాత అందరి కంటా పడేలా తిరుగుతున్నాం. అదే తేడా (నవ్వుతూ)! ♦ ‘కులం, డ్రగ్స్... ఈ రెండూ చాలా ప్రమాదకరం. దయచేసి ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వద్దు’ అని ఈ మధ్య యూత్కి చెబుతున్నాను. నా సినిమాను ఫలానా కులం వాళ్లే చూస్తారు... వేరే హీరోల సినిమాలు వాళ్ల కులం వాళ్లు చూస్తారు.. అనే పిచ్చి ఫిలాసఫీని నేను నమ్మను. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ♦ ఈరోజు మూడు సినిమాలు విడుదలవుతున్నాయ్. నాకు పోటీల్లాంటివి ఉండవు. ‘మనం ముగ్గురం పార్టీ చేసుకుందాం’ అని ఆ మిగతా రెండు సినిమాల వాళ్లతో నేను అన్నాను. ఇండస్ట్రీ ప్రస్తుతానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ప్రేక్షకులను నేను కోరుకునేది ఒక్కటే. అందరూ కలిసి నా సినిమాను థియేటర్లో చూడండి. పైరసీ చేయొద్దు. -
థ్రిల్లింగ్ లవ్స్టోరీ ఇది!
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లతో కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దశరథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం - ‘శౌర్య’. మంచు మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దశరథ్ చెప్పిన ముచ్చట్లు... డిఫరెంట్ లవ్స్టోరీ చేయాలని ‘శ్రీ’ చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లో, తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్లో ప్రేమకథలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ‘శౌర్య’లో ఎవరూ ఊహించని ప్రత్యేక కోణం ఉంటుంది. ఇదొక థ్రిల్లింగ్ లవ్స్టోరీ. ఫైట్లుండవు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మనోజ్ రెండు వేర్వేరు పాత్రల్లో నటించాడు. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘శ్రీ’ చిత్రం తర్వాత చాలా కాలానికి మళ్ళీ మనోజ్తో చేసిన చిత్రమిది. ఇప్పుడు కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రమూ తగ్గలేదు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నా కెరీర్లో జయాలు, అపజయాలు చూశా. ఆ రెండింటినీ సమానంగా చూడడం వల్లే సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. సినిమాలోని విషయం నచ్చితే ఆదరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో నాకు కొద్దిమంది స్నేహితులున్నారు. దర్శకుడు వీవీ వినాయక్, హీరోలు మనోజ్, ప్రభాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంచి స్నేహితులు. సినిమాలతో సంబంధం లేకుండా మేము రెగ్యులర్గా కలుస్తుంటాం. ప్రభాస్తో తప్పకుండా ఓ చిత్రం చేస్తా. ఆ వివరాలు త్వరలో చెబుతా. -
భిన్నమైన సంజీవని
‘‘ఈ కథతో సినిమా చేయగలరా లేదా అని చాలామంది మొదటినుంచీ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ మేం డెడికేషన్తో ఈ సినిమాను పూర్తి చేశాం. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది ’’ అని దర్శకుడు రవి వీడే అన్నారు. అనురాగ్, తనూజ, మనోజ్ ప్రధాన పాత్రల్లో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన ‘సంజీవని’ టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంగీత దర్శకుడు శ్రవణ్ కె.కె. తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ పాలడుగు. -
కొత్త కొత్తగా...
‘‘ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. భవిష్యత్తులో మనోజ్తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని రెజీనా చెప్పారు. మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న ‘శౌర్య’ సాంగ్ టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఇదొక థ్రిల్లింగ్ లవ్స్టోరీ అని, చిత్రీకరణ మొత్తం పూర్తయిందని దశరథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. ఇందులో మనోజ్ చాలా కొత్త కొత్తగా కనబడతారు. జనవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నందు, మధుమణి, శివారెడ్డి, జీవీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా, కెమెరా: మల్హర్భట్ జోషి. -
వైద్యురాలిపై అఘాయిత్యం
మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ తాగించి.. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అత్తాపూర్: మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ తాగించి వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం... ఉత్తర ప్రదేశ్కు చెందిన వైద్యురాలు (32) తన కుటుంబసభ్యులతో కలిసి రాజేంద్రనగర్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ గ్రామంలోని ఓ అపార్టుమెంట్లో ఉంటోంది. ఈమె ఇంటికి ఎదురు ఫ్లాట్లో రాజస్థాన్కు చెందిన మనోజ్(30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం వైద్యురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన మోజ్ ఆమెతో మాటాలు కలిపాడు. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే వైద్యురాలు మత్తులోకి జారుకోగా లైంగికదాడికి పాల్పడ్డాడు. కాగా, బాధితురాలు బుధవారం రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్కు వచ్చి తనపై మనోజ్ జరిపిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.