margadarsi chit funds
-
మార్గదర్శిది 45 ఏళ్ల నయవంచన
-
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాల కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకల సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియర్ డబ్బులు ఎగ్గొట్టిందని తన వాదనలు వినాలంటూ కోర్టుకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. న్యాయం స్థానం తీర్పును రిజ్వర్ చేసింది. విచారణలో మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ‘45ఏళ్ల నయ వంచన. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలు పెట్టాల్సిందే. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఫైనాన్సియర్కు వత్తాసు. సుప్రీం కోర్టు సూచన మేరకే ప్రతివాదిగా ఆర్బీఐ. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చింది.క్రిమినల్ చర్యలకు హెచ్యూఎఫ్ సభ్యులే బాధ్యులు. కఠినశిక్ష విధించకుంటే ఇలాగే ఫైనాన్షియర్లు పుట్టుకొస్తారు. దేశమే ప్రమాదంలో పడి పోయే ప్రమాదం ఉంది’అని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
ఆదాయపన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ
-
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే
-
రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందే.. మార్గదర్శి కేసులో ఆర్బీఐ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్బీఐ వాదనలు వినిపించాయి. విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.అదే సమయంలో మార్గదర్శి సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
మార్గదర్శి మోసాల కేసు మూత?
-
‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ
-
‘మార్గదర్శి’ మోసాల కేసు మూత
ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించి మార్గదర్శి చిట్ఫండ్పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ దర్యాప్తు సంస్థతో చెప్పించింది.సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని గతంలో బల్లగుద్ది గట్టిగా వాదించిన సీఐడీ.. చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడితో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలను రుజువు చేసేవి కావంటూ నిస్సహాయంగా చేతులెత్తేసింది. ఈమేరకు మార్గదర్శి చిట్ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు దర్యాప్తు సంస్థ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా స్వరం మార్చడం వెనుక సీఎం చంద్రబాబు ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబు డైరెక్షన్లో.. ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థ నడుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రాజగురువు రామోజీ లేనప్పటికీ ఆయన కుటుంబం పట్ల చంద్రబాబు సర్కారు రాజభక్తిని చాటుకుంటూనే ఉంది! రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా... ఆర్బీఐ సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా అక్రమ డిపాజిట్లను సేకరించిన వ్యవహారంలో రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులను రక్షించేందుకు ఎంత చేయాలో అంత చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు రామోజీ కుటుంబానికి ఆర్థికంగా అత్యంత కీలకమైన మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల విషయంలో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఇప్పటికే ఉపసంహరింప చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత బరి తెగించింది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్పై కేసు నమోదే ‘పొరపాటు..’ అంటూ సీఐడీ చేత చెప్పించింది. అంతేకాక ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలు ఏవీ కూడా మార్గదర్శి చిట్ఫండ్పై పెట్టిన కేసును నిరూపించేవిగా లేవంటూ సీఐడీతో ఏకంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించింది. మార్గదర్శి చిట్పై కేసు నమోదు ‘పొరపాటు..’ (మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్) అంటూ సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేయించింది. ఇక ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అనుమతి మంజూరు చేయడమే తరువాయి. తద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలు ఎప్పటికీ బహిర్గతం కాకుండా శాశ్వతంగా సమాధి కట్టాలని బాబు సర్కారు నిర్ణయించింది. ఒకవైపు తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆర్బీఐ బహిర్గతం చేయగా.. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలకు ఆధారాల్లేవని ఏపీ హైకోర్టులో సీఐడీ చేత చెప్పించడం గమనార్హం. మరో కీలక విషయం ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల కేసు విచారణకు వచ్చిన రోజే.. ఏపీ హైకోర్టులో మార్గదర్శి చిట్ఫండ్స్కు అనుకూలంగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయడం. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి చిట్ఫండ్స్కి చెందిన రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లను ఆ సంస్థ చేత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపసంహరింప చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మార్గదర్శిపై కేసు నమోదు చేయడం ‘పొరపాటు’ అంటూ సీఐడీ దాఖలు చేసే తుది నివేదికను సంబంధిత కోర్టు ఆమోదిస్తే చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించినట్లే! మార్గదర్శి చిట్ఫండ్స్పై కేసు క్లోజ్ అయినట్లే!!చిట్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ...మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2023 మార్చి 10న సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా అదే రోజు రామోజీరావు, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్స్ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. అనంతరం మార్గదర్శి చిట్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్ చేసింది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ సంస్థ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్ను 2023 మార్చి 29న అరెస్ట్ చేసింది. అనంతరం సంబంధిత కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.అప్పట్లో మార్గదర్శికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన సీఐడీశ్రవణ్ కుమార్ అరెస్ట్ను, రిమాండ్ను ప్రశ్నిస్తూ ఆయన భార్య నర్మదతో పాటు శ్రవణ్ కుమార్ కూడా ఆశ్చర్యకరంగా ‘హెబియస్ కార్పస్’ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ‘అనుకూల’ వ్యక్తులు ఉండటంతోనే అసాధారణ రీతిలో వీరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా సాగింది. ఈ పిటిషన్ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ చాలా గట్టిగా వాదనలు వినిపించింది.ఆధారాల్లేవంటూ తాజాగా కౌంటర్మార్గదర్శి చిట్ఫండ్ విషయంలో కేసు నమోదు చేయడం పొరపాటు అని సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేయనున్నామంటూ హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో నివేదించింది. సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు సీఐడీ అదనపు డీజీని అనుమతి కోరినట్లు సీఐడీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్ తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపారు. ఆధారాలు చాలకపోవడంతో మార్గదర్శిపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అనుమతి కోరుతూ అప్పటి దర్యాప్తు అధికారి రాజశేఖరరావు సీఐడీ అదనపు డీజీకి గత ఏడాది ఆగస్టు 12న లేఖ రాశారని, ఆ లేఖను పరిశీలించిన అదనపు డీజీ మార్గదర్శి చిట్ఫండ్పై కేసు మూసివేతకు ఆగస్టు 16న అనుమతినిచ్చారని పేర్కొన్నారు. దీంతో తుది నివేదిక సిద్ధం చేసి కోర్టులో దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అదనపు డీజీని కోరామన్నారు.నాడు కీలక ఆధారాలు ఉన్నాయన్న సీఐడీ..వాస్తవానికి మార్గదర్శి చిట్ఫండ్స్ అవకతవకలపై దర్యాప్తు జరిపిన సీఐడీ పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించింది. ఇదే విషయాన్ని గతంలోనే హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాల కేసులో సంస్థ యజమాని శైలజా కిరణ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ వినిపించిన వాదనల సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. మార్గదర్శి చిట్ఫండ్కు వ్యతిరేకంగా కీలక ఆధారాలున్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దంటూ గట్టిగా వాదనలు వినిపించింది. సీఐడీ సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలు, అవకతవకలకు కీలక ఆధారాలున్నాయని అప్పుడు తేల్చి చెప్పిన సీఐడీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించింది. తాము సేకరించిన మౌఖిక, రాతపూర్వక ఆధారాలేవీ కూడా మార్గదర్శి చిట్ఫండ్ అక్రమాలను రుజువు చేసేవిగా లేవంటూ నిస్సిగ్గుగా, నిస్సహాయంగా చేతులెత్తేసింది.మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు..సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం.. చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం.. తక్కువ వడ్డీ చెల్లించడం.. చెల్లింపులు ఎగవేయడం.. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో మచ్చుకు కొన్ని! చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్ఫండ్స్ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. తన వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టి పెట్టుకున్న మొత్తాలను మార్గదర్శి రొటేషన్ చేస్తూ వస్తోంది. చట్ట ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. కానీ మార్గదర్శిలో అలా ఉంచకుండా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి. -
మార్గదర్శి కేసులను నీరుగారుస్తున్నారు: పొన్నవోలు
-
హైకోర్టు సాక్షిగా బయటపడ్డ మార్గదర్శి అబద్దాల చిట్టా
-
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండాలని హైకోర్టుకు తెలిపిన ఆర్బీఐ
-
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
రామోజీరావు పట్ల మరోసారి భక్తి చాటుకున్న చంద్రబాబు
-
అందుకే పెద్దిరెడ్డి పేరును చంద్రబాబు రోజూ తలుచుకుంటున్నారు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత మిథన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.అనంతరం, మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. పుంగనూరులో మేము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజూ తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. అది ప్రభుత్వ భూమి కాదని 1968లోనే గెజిట్ విడుదల చేసింది. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెపుతున్నాయి. ఆ భూమి ఎకర విలువ నాలుగు లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం భూమి విలువ మూడు కోట్లు మాత్రమే ఉంటుంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. రాజకీయ కక్షతోనే మాపైన కేసులు పెడుతున్నారు. పై కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదు. చంద్రబాబు కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నారు. గతంలో మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారని మాపైన ఆరోపణలు చేశారు. రకరకాల కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు డిస్టిలర్లో భాగం ఉందన్న ఆరోపణలు రుజువు చేయాలి. మాపై ఇప్పటి వరకు ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. చంద్రబాబు ఆరోపణలు రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలి. కూటమి కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ జగన్కు విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితులు. ఆయన పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాను. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. ఎంపీలు ఎవరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లరు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇదే సమయంలో పోలవరం ఎత్తుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తారన్న అంశంపై మంత్రి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణం సహారా కుంభకోణాన్ని మించింది. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందని సుప్రీంకోర్టుకు ఆర్బీఐ స్పష్టం చేసింది. వేలాది మంది డిపాజిటర్లు మార్గదర్శి వల్ల నష్టపోయారు. నేను పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాను. న్యాయస్థానంలో కూడా కేసులు వేస్తాను అని చెప్పారు. ఇదిలా ఉండగా.. పెద్దిరెడ్డి, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు ఇద్దరూ క్లాస్మేట్స్ అని చెప్పారు. అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని అంటూ కామెంట్స్ చేశారు. -
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
మార్గదర్శి కేసులో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
-
మార్గదర్శి కేసు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.కాగా, చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,. -
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్డ్రైవ్లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్డ్రైవ్లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్డ్రైవ్లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్డ్రైవ్లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్డ్రైవ్ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్డ్రైవ్లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్కుమార్కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్డ్రైవ్లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్కుమార్ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్డ్రైవ్లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్డ్రైవ్లో ఇచ్చిన డేటాను అరుణ్కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్కుమార్కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాతాదారుల వివరాలను పిటిషనర్ ఉండవల్లి అరుణ్కుమార్కు పెన్డ్రైవ్లో ఇవ్వాల్సిందేనని కోర్టు గురువారం ఆదేశించింది. ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు.. పెన్డ్రైవ్లో వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ఈ సందర్భంగా మార్గదర్శి తరఫు లాయర్ను ప్రశ్నించింది న్యాయస్థానం. ఉండవల్లికి పెన్డ్రైవ్లోని వివరాలు ఇవ్వాల్సిందేనని కోర్టు తెలిపింది. ఎస్ క్రో అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరివో మార్గదర్శి చెప్పాలంటూ ఉండవల్లి కోర్టులో వాదనలు వినిపించారు. చందాదారులు ఎందుకు డబ్బులు తీసుకోవటం లేదో మార్గదర్శి చెప్పాలన్నారు. తాను బాధిత ప్రజల కోసం పోరాడుతున్నానని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. లూద్రా లాగా లిటిగెంట్ కోసం పోరాటం చేయటం లేదని తెలిపారు. అనంతరం పిటిషన్ విచారణను వాయిదా వేసింది.చదవండి: ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు -
వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు
-
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
మార్గదర్శి విజ్ఞప్తికి అంగీకరించని హైకోర్టు!
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసు విచారణ సందర్భంగా.. ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను మీడియా ముందుకు వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలని మార్గదర్శి భావించింది. అయితే.. అందుకు హైకోర్టు బ్రేకులు వేసింది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపిస్తున్న ఉండవల్లి.. తరచూ మీడియా ముందుకు వచ్చి మార్గదర్శి అవినీతి తుట్టెను కదిలిస్తున్నారు. దీంతో ఆయనను మీడియా ముందుకు రానివ్వకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసింది మార్గదర్శి. అయితే.. విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం మార్గదర్శి లాయర్ సిద్ధార్థ లూథ్రాకు స్పష్టం చేసింది. ఈ తరుణంలో.. లూథ్రా తీరుపై ఉండవల్లి అరుణ్కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.‘‘సుప్రీం కోర్టు సూచన మేరకు ఈ కేసులో హైకోర్టుకు సహకారం అందిస్తున్నా. నేను ఏ ఒక్కరి తరఫు లాయర్ కాదన్నది గుర్తుంచుకోవాలి. మీడియాతో నేను మాట్లాడి మూడు నెలలు దాటింది. మార్గదర్శి లాయర్ తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు.అనంతరం.. ఉండవల్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణ జరపకుండా ఉండవల్లికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని మార్గదర్శి లాయర్కు తేల్చి చెప్పింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ
-
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
మార్గదర్శి వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..
-
వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్డ్రైవ్లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఇంటిపేర్లు, అడ్రస్లు లేకుండానే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్లు చూపించారు.చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్కుమార్ పేరు కాజ్లిస్ట్లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది. -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా..? లేదా..? ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి చెబుతూ, దీనికయ్యే ఖర్చంతా ఆ సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని.. దీనికి వ్యయం ఎంతవుతుందో మార్గదర్శికి చెప్పాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఖర్చు వివరాలు చెప్పిన వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఫైనాన్సియర్స్కు తేల్చి చెప్పింది. డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేస్తూ పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను ఆ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వాస్తవాలను నిగ్గు తేల్చాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 (హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు)న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్ జగన్ హయాంలో), మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించడం కోసం నోటీసులు జారీ చేయాలని గత విచారణ సందర్భంగా రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికయ్యే ఖర్చు ఎవరు భరించాలన్నది సందిగ్ధంగా మారడంతో రిజిస్ట్రీ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి పైన పేర్కొన్న ఆదేశాలు ఇచ్చింది. -
నోటీసుల యాడ్స్ కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలి: హైకోర్టు
-
మార్గదర్శి కోసం ముసుగు తీసేసాడు: Undavalli Arun Kumar
-
చంద్రబాబు చరిత్రకే ఇదో మాయని మచ్చ: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: చంద్రబాబు నాయుడు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఎంగా చంద్రబాబు స్పందించిన తీరుపై ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసేయటం దారుణం. అధికారంలోకి రాంగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారు.. అన్నట్టే చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇది. డిపాజిట్లు విషయంలో ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉంది. అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్ స్క్రిప్షన్ కొనసాగించింది. మార్గదర్శికి సహాయం చేయాలనుకున్నా... చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదు.చంద్రబాబు చరిత్రలోనే ఇదో అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుంది. అయినా కేసు ఆగే పరిస్థితి లేదు..కేసు కొనసాగుతుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు. ఎన్నికల అఫిడవిట్ 900 కోట్లు తన ఆసెట్ గా చంద్రబాబు చూపారు. చంద్రబాబు భార్య రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తమ ఆస్తి 25 వేల కోట్లు ఉన్నట్టు చూపారు. చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్టు ఎవరు ఫిర్యాదు చేయలేదు. అని ఉండవల్లి అన్నారు. మార్గదర్శి చేసిన పని తప్పేనని రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ఇప్పటికే ఫైల్ చేసింది. చిట్ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నా మార్గదర్శి అనేక వ్యాపారాలు చేసింది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఇవన్నీ లిస్టయి అయి ఉన్నాయి. కేవలం ప్రజలు డబ్బుతోనే రామోజీరావు వ్యాపారాలు అన్నీ చేశారు... వైఎస్ జగన్ ప్రభుత్వంలో మార్గదర్శి చిట్ఫండ్ బ్రాంచీలను మూసేశారు. అయినా ఖాతాదారులు మాత్రం పోలేదు. వారి ఖాతాలన్నీ తెలంగాణలో ఇతర బ్రాంచ్ లకు తరలించారు. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో మార్గదర్శిని వ్యతిరేకించరని తెలుసు. ప్రభుత్వం పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటారని అనుకోలేదు. ఇటువంటి పనులు చేసే ముందు చంద్రబాబు ఆలోచించుకోవాలి కనీసం ప్రజలు ఏమనుకుంటారోనని కూడా ఆలోచించలేదు’అని ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబు ఆస్తులు వేలకోట్లు పైమాటే మార్గదర్శిలో ఉన్న మొత్తం అమౌంట్లో 70శాతం అన్ అకౌంటబుల్. ఇది ఖచ్చితంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది. దేశంలోనే అత్యధిక ఆస్తులు రూ.900 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్లో చంద్రబాబే దాఖలు చేశారు. సబ్ రిజిస్టార్ వేల్యూయే రూ.900 కోట్లు ఆస్తులుగా చంద్రబాబు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో అయితే ఆ మొత్తం విలువ కొన్నివేల కోట్లు ఉంటుందని ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు తగదుఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో పెద్దగా లేవు. పీఎస్ఆర్ ఆంజనేయులు మంచి అధికారి.... చంద్రబాబు హయాంలో కూడా మంచి పోస్టుల్లోనే పనిచేశారు. ఆయనపై అవినీతి కేసులు నమోదైనట్లు నేనెప్పుడూ వినలేదు. ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్షసాధింపు చేయడం సరికాదు’అని ఉండవల్లి అరుణ కుమార్ చెప్పారు. విజయవాడ పరిస్థితి దారుణంవిజయవాడ వరదల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. -
దుష్ట రక్షణకు రిటర్న్ గిఫ్ట్.. బయటపడ్డ భారీ క్విడ్ ప్రోకో
-
ఈనాడుకు బాబు గిఫ్ట్.. కిలాడీతో వల.. దొరికిపోయిన ఎల్లో మీడియా..
-
రిచ్ అండ్ పవర్ ఫుల్.. ఏం చేసినా తప్పు కాదు..
-
హైకోర్టు కీలక నిర్ణయం.. మార్గదర్శికి బిగ్ షాక్
-
మార్గదర్శికి హైకోర్టు భారీ షాక్
-
‘నల్ల’ ఖజానా
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ బాగోతం అంతా మేడిపండు చందమేనన్నది స్పష్టమైంది. నిగనిగలాడే మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులే ఉంటాయి. నీతులు వల్లించే రామోజీ కుటుంబానికి చెందిన ‘మార్గదర్శి’ డిపాజిట్ల గుట్టు విప్పితే నల్లధనం బట్టబయలవుతుంది. అక్రమార్జనను మార్గదర్శిలో గుట్టు చప్పుడు కాకుండా దాచిన టీడీపీ పెద్దల బండారం గుట్టు వీడుతుంది. అందుకే తాము సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెల్లడించేందుకు రామోజీ కుటుంబం మొండికేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు సహకరిస్తోంది. భారీగా నల్లధనం దందా...మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు భారీస్థాయిలో నల్లధనం దందా సాగించారు. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. ఆ అక్రమ డిపాజిట్ల ముసుగులో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. అందులో సింహభాగం టీడీపీ పెద్దలవేనని స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే నిధులు ఎలా వచ్చాయో వెల్లడించాల్సి ఉంటుంది. భూములు, ఇతర స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టినా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తే వారి అక్రమార్జన బట్టబయలవుతుంది.అందుకే నల్లధనాన్ని రామోజీరావుకు చెందిన ‘మార్గదర్శి’లో డిపాజిట్లుగా పెట్టారు. కేంద్ర ఆదాయపన్ను చట్టం సెక్షన్ 269 ప్రకారం రూ.20 వేలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో తీసుకోకూడదు. కానీ, మార్గదర్శి ఫైనాన్సియర్స్లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే సేకరించడం గమనార్హం. ఆ నిధులను తమ కుటుంబ వ్యాపార సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు వాడుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడులుగా పెట్టారు.తద్వారా తమ ఫిల్మ్ సిటీ భూముల విలువ, మ్యూచ్వల్ ఫండ్స్లో తమ పెట్టుబడులు భారీగా పెరిగేలా చేసుకుని తమ అక్రమ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేలా కథ నడిపించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా సాగించిన ఈ దందాతో అటు టీడీపీ పెద్దలు, ఇటు రామోజీరావు కుటుంబం భారీగా అక్రమ ఆస్తులను వెనకేసుకున్నారు.రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి?రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రూ.2,610.38 కోట్ల డిపాజిట్లలో రూ.1,864.10 కోట్లు తిరిగి చెల్లించేశామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి? ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు. ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని, బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలకు కొమ్ముకాస్తోంది. -
చందాదారులెవరు?.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 11వతేదీకి వాయిదా వేసింది. డిపాజిట్ల నిగ్గు తేలాలన్న ‘సుప్రీం’ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావు (ఇటీవల మృతి చెందారు)పై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. అయితే అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్సార్ సీపీ హయాంలో) సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును 2024 ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని పేర్కొంది. మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ కౌంటర్లో తేల్చింది... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా మరోసారి విచారణ ప్రారంభించింది. సీనియర్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదుల జాబితాలో చేర్చింది. గత విచారణ (ఈనెల 6వ తేదీన) సందర్భంగా కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇవ్వాలన్న ఆర్బీఐ వినతికి అంగీకరిస్తూ ఇకపై ఈ పిటిషన్లను మోషన్ లిస్ట్లో పేర్కొనాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేసిన డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధం, అక్రమమేనని, అందుకు బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని నివేదిస్తూ ఈ నెల 13న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ సుజోయ్పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, కోర్టు సహాయకులుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదితోపాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు, ఆర్బీఐ న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి హాజరయ్యారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ చట్టం 45 (ఎస్)ను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందని ఈ సందర్భంగా ఉండవల్లి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని ఆధారంగా మార్గదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నివేదించారు. దాదాపు 70 వేల మంది చందాదారుల వివరాలను 1,500కిపైగా పేజీల్లో మార్గదర్శి సుప్రీం కోర్టుకు సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు కూడా పెన్డ్రైవ్లో అందజేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ సుజోయ్పాల్ స్పందిస్తూ.. వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ మేరకు ఆర్బీఐ, మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్డ్రైవ్లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
KSR Live Show: ప్రభుత్వం వాళ్లదే అయినా.. RBI రిపోర్ట్ ఇచ్చిందంటే ..!
-
KSR Live Show: రామోజీ రావు రాజ్యాంగానికి అతీతుడు.. మార్గదర్శి మోసానికి గాను భారతరత్న
-
రామోజీ అవినీతి సామ్రాజ్యం
-
మార్గదర్శి మోసాలకు శిక్ష తప్పదు
సాక్షి, అమరావతి: రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడని తాము ముందు నుంచి చెబుతున్నామని, తాజాగా హైకోర్టులో ఆర్బీఐ దాఖలు చేసిన అఫిడవిట్తో అది నిరూపితమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మీడియా ముసుగులో రామోజీ యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘించి అవినీతి పునాదుల మీద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిరి్మంచారని ధ్వజమెత్తారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూళ్లపై సీఎం చంద్రబాబు ఏనాడూ కన్నెత్తి చూడలేదని విమర్శించారు. తాము ఎన్ని నేరాలు చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాలో రామోజీ వారసులు ఉన్నారని చెప్పారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ⇒ దశాబ్దాల పాటు రామోజీ అక్రమ డిపాజిట్ల సేకరణ, మార్గదర్శిలో భారీ కుంభకోణాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ వెలికితీశారు. ఆర్బీఐ చట్టం సెక్షన్–45(ఎస్) ప్రకారం ఆ డిపాజిట్ల సేకరణ నేరమని ఉండవల్లి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శిపై విచారణ మొదలైంది.⇒ మార్గదర్శి ద్వారా రామోజీరావు 2006 నాటికి చట్ట విరుద్ధంగా రూ.2,610 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించారు. నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై చర్యలకు ఆదేశిస్తే చంద్రబాబుతోసహా రామోజీరావు మద్దతుదారులంతా పత్రికా స్వేచ్ఛపై దాడిగా దు్రష్పచారం చేశారు. ⇒ మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై ఆర్బీఐ ప్రకటన చేసిన నేపథ్యంలో బాధ్యులు, ఆ సంస్థలో డైరెక్టర్లపై కోర్టులో విచారణ తప్పదు. శిక్ష కూడా తప్పదు. ⇒ ఎక్కడ, ఏ ఆఫీసులో చిత్తు కాగితాలు తగలబెట్టినా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం టీడీపీ, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారింది. ఏ ఆఫీస్లో చెత్త కాగితాలు కూడా తగలెట్టొద్దంటూ జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ⇒ పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతో స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. అన్నింటి పనులు ఒకేసారి మొదలు పెట్టినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అంగీకరించినందున వారి తప్పిదాన్ని వారే ఒప్పుకున్నారు. -
‘మార్గదర్శి’ అక్రమాల నిగ్గు తేల్చాల్సిందే: అంబటి
సాక్షి, గుంటూరు: రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని.. అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘రామోజీరావు వైపు 2006 వరకు ఏ వ్యవస్థ చూడలేదన్నారు.‘‘మార్గదర్శిపై ఆనాడు ఉండవల్లి అరుణ్కుమార్ ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. ఉండవల్లిపై కూడా రామోజీ పరువునష్టం దావా వేశారు. ఈ కేసును కొట్టేయమంటూ రామోజీ పిటిషన్ కూడా వేశారు. కేసు కొట్టేసినట్టు కూడా ఏ పేపర్లోనూ రాలేదు. 2016 డిసెంబర్లో ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసును కొట్టేయడం సరికాదని, విచారించాలని సుప్రీంకు వెళ్లారు. దీంతో విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది. మార్గదర్శి డిపాజిట్లపై విచారణ జరగాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది’’ అని అంబటి రాంబాబు వివరించారు.సంబంధిత వార్త: మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం‘‘రామోజీరావు చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు. దుష్టచతుష్టయంలో రామోజీరావు కూడా ఉన్నారు. ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారు. రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదు. ఎన్ని నేరాలు చేసినా తమను ఎవరూ పట్టించుకోకూడదని రామోజీ వారసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు పట్టదు’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘రామోజీరావు ఆర్థిక నేరస్థుడని మేం ముందునుంచి చెప్తున్నాం. ఈ కేసును బతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్కుమార్ను కోరుతున్నా. చిట్ఫండ్ పేరుతో చేసిన నేరాలపై ఉండవల్లి పోరాడాలి’’ అని అంబటి సూచించారు.సంబంధిత వార్త: అంతా నల్లధనం దందానే!2006 నాటికి రూ. 2610 కోట్లు అక్రమ వసూళ్లు..‘‘హెచ్యూఎఫ్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం నేరమని ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టు విభజన చివరి రోజు కేసును కొట్టేయాలంటూ రామోజీరావు క్వాష్ పిటిషన్ వేశారు. 2006 నాటికి 2610 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారు. రామోజీరావు చనిపోయినా వారి కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలి. తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అవినీతి కార్యక్రమాలను చేసుకోవడంలో రామోజీరావు ఒకరు’’ అని అంబటి పేర్కొన్నారు.రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు‘‘వైఎస్ జగన్పై పుంఖాను పుంఖాలుగా తప్పుడు వార్తలు రాశారు. ఉదయం లేచినదగ్గర్నుంచి వైసీపీ పై దాడి చేసే ప్రయత్నం చేయడం దారుణం. మార్గదర్శి కేసులో రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్.. ఆర్థిక నేరగాడు. మార్గదర్శి చిట్ ఫండ్ చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకమే. మార్గదర్శిపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు‘‘రాజమండ్రి ఆర్అండ్ఆర్ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుల్లో చెత్తకాగితాలు తలేస్తుంటే ఎందుకు దిగజారిపోతున్నారు. చెత్త తగలబడితే స్కామ్ జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. చెత్త నుంచి స్కాములు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కావాలనే మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు. మేం దేనికీ భయపడం. వైఎస్సార్సీపీ పార్టీ ధైర్యంలోంచి పుట్టింది. మా పై బురద చల్లాలలని చూస్తున్నారు’’ అని అంబటి మండిపడ్డారు. మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు‘‘పోలవరం ఇష్యూ పై చంద్రబాబు, రామానాయుడికి చర్చకు రావాలన్న నా రిక్వెస్ట్ను విరమించుకుంటున్నా. అన్నీ సైమన్ టేనియస్ గా ప్రారంభించామని తెలిసో తెలియకో మంత్రి రామానాయుడు నిజం ఒప్పేసుకున్నాడు. ఇంక దీనిలో చర్చించడానికేం లేదు.’’ అని అంబటి చెప్పారు.కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు‘‘మా సమయంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే స్కామ్కు అవకాశమెక్కడుంటుంది? కక్షసాధింపు చర్యల్లో ఉండవని చంద్రబాబు చెబుతున్నాడు. కానీ చెప్పే మాటలకు చేతలకు తేడా ఉంది. మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. కక్ష సాధింపు చర్యల వెనుక మనిషి చంద్రబాబు.. బుర్ర లోకేష్ది. రామోజీరావును సపోర్ట్ చేసిన వారు ఆర్బీఐ అఫిడవిట్కు ఏం సమాధానం చెబుతారు?. స్కిల్ స్కామ్లో చంద్రబాబు కూడా రామోజీరావు ఎదుర్కున్న పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
అంతా నల్లధనం దందానే!
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ అనే బోర్డు ఉంటుంది... కానీ ఎక్కడా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే బోర్డు మాత్రం ఉండదు. అయినా మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లోనే గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థను రామోజీరావు నిర్భయంగా నిర్వహించారు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు దశాబ్దాలపాటు ససేమిరా అన్నారు. కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు.డిపాజిట్దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమరి్పంచిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అన్నారు.అక్రమాల సినిమాలో త్రిపాత్రాభినయం – హెచ్యూఎఫ్ కర్త, ప్రొప్రైటర్, చైర్మన్ పేరుతో కనికట్టు – ఆర్బీఐని బురిడీ కొట్టించి అక్రమ డిపాజిట్ల దందా సాక్షి, అమరావతి: చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్ము దోచుకునేందుకు చెరుకూరి రామోజీరావు ఏకంగా త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్గా, చైర్మన్గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. అక్రమంగా డిపాజిట్ల దందా సాగించారు.డిపాజిట్ పత్రాలపై హెచ్యూఎఫ్ కర్తగా: మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్దారులకు పత్రాలను జారీ చేసింది. ఆ పత్రాలపై తనను తాను ‘హెచ్యూఎఫ్ కర్త’ అని పేర్కొంటూ రామోజీరావు సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్గా...: మార్గదర్శి ఫైనాన్సియర్స్ చెక్కుల దగ్గరకు వచ్చేసరికి రామోజీరావు ‘ప్రొప్రైటర్’గా మారారు. అక్రమ డిపాజిట్లను కాలపరిమితి తరువాత ఇచ్చే చెక్కులపై ఆయన ‘ప్రొప్రైటర్’ అని సంతకం చేశారు.బోర్డు మీటింగ్లో చైర్మన్గా..మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగ్ల విషయం వచ్చేçÜరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగ్ మినిట్స్ బుక్లోనూ, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. -
మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం
సాక్షి, అమరావతి: “నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక..! అన్నది తమ నినాదమని ఈనాడు పత్రిక నీతులు వల్లిస్తూ ఉంటుంది. నిజానికి రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా ‘ఈనాడు’ ఆ అరాచకాలకు దశాబ్దాలుగా రక్షణ కవచంలా నిలుస్తోంది!! మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? పాత్రికేయ పైశాచికత్వం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తుంది. అందుకే 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రి నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక అంతగా దుష్ప్రచారానికి తెగబడింది. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత కూడా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడింది. తదనంతరం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు బరితెగించి విష ప్రచారం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వక్రభాష్యం చెబుతూ రోజుకో రీతిలో బురద జల్లింది. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రోజుకో రీతిలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నది అక్షరసత్యం. రామోజీరావు ముమ్మాటికీ ఆర్థిక ఉగ్రవాది అనే వాస్తవాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడంతోనే ఈనాడు అంతగా విషం చిమ్మిందన్నది నిరూపితమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన నివేదికే ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్లో ఈనాడు ముసుగులో రామోజీ పాల్పడ్డ కుట్రలు తేటతెల్లమయ్యాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో వాస్తవాలను వెల్లడిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ సమరి్పంచిన నివేదిక లోగుట్టును విప్పింది.ఆర్థిక దోపిడీని అడ్డుకున్నారనే అక్కసుతోనే నాడు వైఎస్సార్కు వ్యతిరేకంగా దుష్ప్రచారం‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు దశాబ్దాలుగా సాగించిన ఆర్థిక దోపిడీకి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతో 2006లో వైఎస్సార్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రామోజీరావు అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారని, అప్పటికే ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని నిగ్గు తేల్చింది. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు అక్రమాలను ప్రశ్నించడం కాదు కదా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆయన పేరు పలికేందుకు సాహసించ లేదు. ఈ క్రమంలో అశేష ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమకు ఏ రాజగురువూ అవసరం లేదని, ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్షగా భావించి దృఢ సంకల్పంతో వ్యవహరించారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ మూసివేయడంతో రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం పునాదులు కదలిపోయాయి. దశాబ్దాలుగా తాను సాగిస్తున్న ఘరానా మోసానికి వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకట్ట వేయడాన్ని ఆయన సహించలేకపోయారు. దాంతో పట్టరాని ఆక్రోశం, విద్వేషంతో వైఎస్సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో నిత్యం పేజీలకు పేజీలు తప్పుడు వార్తలు రాయించారు. యావత్ వైఎస్సార్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దు్రష్పచారానికి తెగించారు. అయితే రామోజీ బ్లాక్ మెయిల్ పాత్రికేయానికి వైఎస్ రాజశేఖరరెడ్డి వెరవలేదు. ఆయనతో ఏమాత్రం రాజీ పడలేదు. తలొగ్గిన తరువాత ప్రభుత్వాలు ఆ అక్రమాలకు అండగా చంద్రబాబువైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి ఈనాడు రామోజీరావుకు జీహుజూర్ అన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్థిక అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వమే కేసు పెట్టిందనే విషయాన్ని విస్మరించి నీరుగార్చారు. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిని కలసి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల గురించి ప్రస్తావించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని ఎంత కోరినా ఆలకించలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో రామోజీరావు అక్రమాలకు రక్షణ లభించింది. దాంతో గుట్టుచప్పుడు కాకుండా మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును క్లోజ్ చేసేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్లో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం ద్వారా రామోజీ అక్రమాలకు రక్షణగా నిలిచింది.అక్రమాల పుట్ట మార్గదర్శి చిట్ఫండ్స్.. నిగ్గు తేల్చినందుకే జగన్పై దుష్ప్రచారంరామోజీ నెలకొల్పిన మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా ఆర్థిక అక్రమాల పుట్టేనని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. చందాదారుల ఫిర్యాదులతో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించడంతో అక్రమాలు బట్టబయలయ్యాయి. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా రామోజీరావు చందాదారుల సొమ్మును తమ కుటుంబ వ్యాపార సంస్థల్లో, మ్యూచ్వల్ ఫండ్స్లలో అక్రమంగా పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించారు. చందాదారులకు ప్రైజ్మనీ ఇవ్వకుండా రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. బ్రాంచి కార్యాలయాల్లోని నగదు నిల్వలలను హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. నకిలీ చందాదారుల ముసుగులో నల్లధనం దందా సాగించారు. డమ్మీ చెక్కులతో మోసగిస్తూ చందాదారులను ఇబ్బంది పెట్టి వారి ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇలా మార్గదర్శి చిట్ఫండ్స్ యథేచ్ఛగా పాల్పడుతున్న అక్రమాలన్నీ ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ కేసులో నిందితులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజ కిరణ్లను సీఐడీ అధికారులు హైదరాబాద్లోని వారి నివాసానికి వెళ్లి విచారించారు. తన ఇంటికి పోలీసులు రావడం ఇదే తొలిసారని రామోజీరావు సీఐడీ అధికారులతో వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ తమ అక్రమాలకు అడ్డుకట్ట వేయడాన్ని రామోజీరావు సహించలేకపోయారు. వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ అక్రమ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలడం ఖాయమని, తమకు శిక్ష పడటం ఖాయమని గ్రహించారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో దుష్ప్రచారానికి తెగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు వక్రభాష్యం చెబుతూ నిరాధార ఆరోపణలతో రోజుకో రీతిలో బురదజల్లారు. సత్యం నినదించడం కాదు... దోపిడీ వర్ధిల్లాలి అదే ఈనాడు నినాదం.. విధానం రామోజీరావు తన ఆత్మనే ఈనాడు పత్రికగా ... ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ అనే జ్యోతిని వెలిగించి పత్రిక తెచ్చారని ఇటీవల ఈనాడు స్వర్ణోత్సవాల్లో ఘనంగా ప్రకటించారు. ఈ మాటలు వినటానికి ఎంత అందంగా ఉంటాయో ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఈనాడు పాత్రికేయం అంత పైశాచికంగా ఉంటుందన్నది 50 ఏళ్లుగా రోజూ నిగ్గుతేలుతున్న అక్షర సత్యం. రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది మార్గదర్శి ఫైనాన్సియర్స్, మార్గదర్శి చిట్ఫండ్స్ అయితే.. ఆ ఆర్థిక ఉగ్రవాదానికి రక్షణ కవచంగా ఈనాడు పత్రికను వాడుకున్నారన్నది సీఐడీ దర్యాప్తులు, ఆర్బీఐ నివేదికల సాక్షిగా వెల్లడైన వాస్తవం. మార్గదర్శి చిట్ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుటుంబం వాటాలను అక్రమంగా తన కోడలు పేరిట రామోజీ బదిలీ చేసుకున్నారు. ఈనాడు కార్యాలయాలు జాతీయ రహదారులు, నగరాల్లోని రహదారులను కబ్జా చేసినా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. తమకు పోటీగా ఉన్న ఉదయం పత్రికను దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం...అనంతరం సంపూర్ణ మద్యపాన నిషేద ఉద్యమాన్ని ఈనాడు నెత్తిన పెట్టుకుంది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేసింది. ఇక 1995లో ఆనాటి సీఎం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబు భాగస్వామి రామోజీ. అందుకు ప్రతిగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి రామోజీ ఫిల్మ్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఫిల్మ్ సిటీ పేరిట కబ్జా చేసిన రామోజీరావుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ఇక ఈనాడు స్వర్ణోత్సవ వేడుకల్లో ఆ పత్రిక ప్రతినిధులు మాట్లాడుతూ 2006లోనూ 2022లోనూ ఈనాడు పత్రికపై ప్రభుత్వాలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించడం విడ్డూరంగా ఉంది.ఇకనైనాప్రభుత్వాలు స్పందిస్తాయా? మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇరు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 20న తమ అభిప్రాయాన్ని తెలపాల్సి ఉంది. ఇకనైనా డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడతాయా? లేక ఈనాడు ప్రాపకం కోసం రామోజీ కుటుంబ ఆర్థిక దోపిడీకి వంత పాడి మౌనంగా ఉండిపోతాయా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాదాపు 18 ఏళ్లుగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో మునుముందు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.18 ఏళ్లు నెట్టుకొచ్చారు6.11.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులపై చర్యలు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవల్లి ఫిర్యాదు.13.11.2006: ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపింది. ఆర్బీఐ మార్గదర్శి వివరణ కోరింది. 30.11.2006: తాము సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రామన్న మార్గదర్శి. ఇకపై డిపాజిట్లు వసూలు చేయవద్దని మార్గదర్శికి ఆర్బీఐ ఆదేశం.19.12.2006: మార్గదర్శి ఫైనాన్సియర్స్కు సంబంధించిన సమాచారం, డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ.19.12.2006: వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఎన్.రంగాచారిని నియమిస్తూ జీవో నంబర్ 801 జారీ. మార్గదర్శి అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అదీకృత అధికారిగా టి.కృష్ణరాజు నియామకం జీవో 800 జారీ. 27.12.2006: రంగాచారి, కృష్ణరాజుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మార్గదర్శి, రామోజీరావు పిటిషన్.29.12.2006: మార్గదర్శిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనంటూ ఆర్బీఐ లేఖ. 29.12.2006: ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీ హైకోర్టులో పిటిషన్.19.2.2007: ఎన్.రంగాచారి మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. 19.2.2007: రంగాచారి నియామక జీవోపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.23.2.2007: రంగాచారి నియామకం విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మార్గదర్శి, రామోజీ రావు.23.1.2008: మార్గదర్శి అక్రమాలపై నాంపల్లి కోర్టులో అదీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు. 13.7.2009: అదీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు వ్యక్తిగత హాజరుకు నాంపల్లి కోర్టు ఆదేశం 20.7.2009: నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రామోజీ. 3.8.2009: రామోజీ పిటిషన్ను కొట్టేస్తూ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు.7.9.2009: అదీకృత అధికారి తరఫున వాదనలు వినిపించేందుకు ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి, రామోజీ పిటిషన్. 27.11.2009: వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి, రామోజీ 17.10.2010: ప్రత్యేక పీపీ నియామకంపై మార్గదర్శి పిటిషన్ మూసివేత 1.7.2011: మార్గదర్శి అక్రమాల కేసులో విచారణను కొన్ని సెక్షన్లకే పరిమితం చేయాలంటూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసిన నాంపల్లి 18.7.2011: నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రామోజీ హైకోర్టులో పిటిషన్ 26.07.2011: మార్గదర్శి అక్రమాలపై దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలంటూ హైకోర్టులో రామోజీ, మార్గదర్శి పిటిషన్ 2011: రామోజీ, మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 2014: రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 18.9.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదల చేయాలంటూ మార్గదర్శి, రామోజీ అనుబంధ పిటిషన్ 12.10.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలుపుదలకు సుప్రీంకోర్టు నిరాకరణ 31.12.2018: నాంపల్లి కోర్టులో మార్గదర్శి, రామోజీరావుపై అ«దీకృత అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసిన హైకోర్టు 16.12.2019: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ 17.10.2022: డిపాజిటర్ల పరిరక్షణ చట్టంపై మార్గదర్శి, రామోజీరావు గతంలో దాఖలు చేసిన పిటిషన్ను మూసేసిన హైకోర్టు 9.4.2024: మార్గదర్శిపై అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన దర్మాసనం. మార్గదర్శి అక్రమాలపై నిగ్గు తేల్చాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా నిరూపితమైంది. ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు లేకున్నా సరే మార్గదర్శి ఎండీగా ఉన్న ఆయన కోడలు శైలజ కిరణ్, భాగస్వాములుగా ఉన్న వారి కుటుంబ సభ్యులను చట్టపరంగా శిక్షించాలి. అంతేకాదు మార్గదర్శి మొత్తం అక్రమాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – వొగ్గు గవాస్కర్, న్యాయవాదిరామోజీ కుటుంబం బాధ్యత వహించాల్సిందే మార్గదర్శి అక్రమాలు నిరూపితమయ్యాయి. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు ప్రస్తుతం లేకున్నా సరే ఆ హెచ్యూఎఫ్లోని ఇతర సభ్యులు బాధ్యత వహించాల్సిందే. వసూలు చేసిన డిపాజిట్లకు కనీసం పదిరెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతరత్రా శిక్షలకు రామోజీ కుటుంబ సభ్యులు అర్హులు. కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది, విజయవాడ సొంత ఆడిట్ కుదరదు∙ నిజాలు నిగ్గు తేలాల్సిందే ∙ మార్గదర్శికి స్పష్టంచేసిన సుప్రీం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల బాగోతాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పట్లో చెరుకూరి రామోజీరావు చేయని కుతంత్రం లేదు... ఎంతగా అంటే ‘అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్మును డిపాజిట్దారులకు చెల్లించేశాం... ఆ విషయాన్ని మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’అంటూ కనికట్టు చేసేందుకు యతి్నంచారు. కానీ, ఆ కుతంత్రాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లోనే తిప్పికొట్టింది. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదు అని తేల్చిచెప్పింది. డిపాజిట్దారులకు తిరిగి చెల్లించారో... లేదో... నిర్దారించాల్సిందిగా మార్గదర్శి ఆడిటర్లు కాదు... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అని విస్పష్టంగా ప్రకటించింది. డిపాజిట్లు చెల్లించేశాం...మా ఆడిటర్లులెక్క తేల్చేశారు.. సుప్రీంకోర్టులో రామోజీ వితండవాదం రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,610.38కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు సుప్రీంకోర్టులో అడ్డగోలు వాదనలతో కనికట్టు చేయాలని యతి్నంచారు. తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని సంబంధిత డిపాజిట్దారులకు చెల్లించేశామని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. మొత్తం రూ.2,610.38 కోట్ల అక్రమ డిపాజిట్లలో 2023, జూన్ 30నాటికి 1,247మంది డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని చెప్పారు. కేవలం రూ.5.31కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి నివేదిక సమరి్పంచారని... అన్ని లెక్కలు సరిపోయాయని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులు, వారికి చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు.అదేం కుదరదు.. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే – స్పష్టంచేసిన సుప్రీంకోర్టు రామోజీరావు తరఫు న్యాయవాదుల వాదనలను ఏప్రిల్లోనే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే... మీ దగ్గర పని చేసే ఆడిటర్లు నివేదిక ఇస్తే సరిపోదు. ఆ నివేదికను పరిగణలోకి తీసుకోము’ అని స్పష్టం చేసింది. ఎందుకంటే రూ.5వేలు డిపాజిట్చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా అని కూడా వ్యాఖ్యానించింది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఉండవల్లి అరుణ్కుమార్ను కూడా పారీ్టగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ న్యాయస్థానం విచారించాలని తీర్పునిచి్చంది. డిపాజిట్లు తిరిగి చెల్లించినది.. లేనిది పరిశీలించేందుకు ఓ జ్యుడిíÙయల్ అధికారిని నియమించాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. -
హైకోర్టులో మార్గదర్శికి ఆర్బీఐ దిమ్మదిరిగే కౌంటర్..
-
పాపం పండింది.. ఇక చిప్ప కూడే..
-
‘మార్గదర్శి’ సంస్థ సేకరించిన డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే... బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలి... తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ నివేదిక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రామోజీ ఆర్థిక నేరగాడే
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్కు కూడా చైర్మన్గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి. ఆర్బీఐకి తెలియకుండానే...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటైంది. ఈ హెచ్యూఎఫ్కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్యూఎఫ్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకుకే తెలియదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది. ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది. దీంతో ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివరణ కోరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్యూఎఫ్)కు వర్తించదని మార్గదర్శి ఆర్బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి ఆర్బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లను కొట్టేసింది. మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్ కోసం కృష్ణరాజు ఫిర్యాదు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది. మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్యూఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్ 31వ తేదీన విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్చిట్ ఇచ్చేసిన న్యాయమూర్తి... డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్ అయింది. యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగంపత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. రంగాచారి నివేదికలోని కీలక అంశాలు ⇒ రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ⇒ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. ⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. ⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు. ⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. ⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు. ⇒ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు. -
ఆ డిపాజిట్లు చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్ను అడ్డు పెట్టుకుని రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు బహిర్గతం చేసింది. రామోజీ నిస్సందేహంగా ఆర్థిక ఉగ్రవాదేనని రుజువైంది. చట్ట విరుద్ధంగా దశాబ్దాల తరబడి ఆర్థిక దోపిడీకి తెగించారని తేటతెల్లమైంది. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ తాజాగా నివేదించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని తెలిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షి యర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్పుడు ఆరోపిత నేరాలకు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో తమపై దాఖలైన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది.సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పునర్విచారణ...చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గ దర్శి, దాని కర్త రామోజీరావులపై డిపాజిటర్ల పరి రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అంతకు ముందు హైకోర్టు తీర్పులో కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఈ ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు లోతు ల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణను ఆరు నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలు పెట్టింది. హైకోర్టులో నెంబర్ టూ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్లో ముఖ్యాంశాలివీ...సెక్షన్ 45 ఎస్ను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది...‘1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45 ఎస్ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన అన్ ఇన్కార్పొరేటెడ్లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 45 ఎస్ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఎస్ను సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు, అన్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారాన్ని సెక్షన్ 45 ఎస్ కింద ఆర్బీఐ నిషే«ధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగానీ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీల్లేదు’ అని ఆర్బీఐ తన కౌంటర్లో తేల్చి చెప్పింది.రెండేళ్ల జైలు.. రెండింతల జరిమానా‘చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలుకూ డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారాన్ని సెక్షన్ 45 టీ కట్టబెడుతోంది. సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలితే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి రెండింతల జరిమానా విధించవచ్చు. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధీకృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైనే ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది’ అని ఆర్బీఐ పేర్కొంది.హెచ్యూఎఫ్కు సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) లీగల్ పర్సన్ కాదు. ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా ఈ హెచ్యూఎఫ్ పని చేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్యూఎఫ్కు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై సెక్షన్ 45 ఎస్ వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం. హెచ్యూఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్లో హెచ్యూఎఫ్ను చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్బీఐ చట్టంలో చాప్టర్ 3 బీ, 3 సీలను చేర్చింది’ అని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్లో తెలిపింది.చట్ట విరుద్ధమన్న విషయాన్ని గతంలో హైకోర్టు పట్టించుకోలేదుహెచ్యూఎఫ్గా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధమన్న విషయాన్ని హైకోర్టు గతంలో పట్టించుకోలేదు. హెచ్యూఎఫ్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించింది. ఇవన్నీ మార్గదర్శి, రామోజీరావు సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించారన్న విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసినందుకు వీరికి సెక్షన్ 45ఎస్ (1), 45 ఎస్ (2) వర్తిస్తాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరించారనేందుకు ఇవన్నీ ప్రాథమిక ఆధారాలే. సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలి’ అని ఆర్బీఐ కౌంటర్లో అభ్యర్థించింది. కాగా రామోజీరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హెచ్యూఎఫ్ కర్తగా ఆ స్థానంలో ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ను చేర్చాలని (సబ్స్టిట్యూట్) కోరుతూ మార్గదర్శి ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అక్రమాలు బయటపడినందునే చెలరేగిన ‘ఈనాడు’ రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా.. ‘ఈనాడు’ ఆ అరాచకాలకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? అందుకే నాడు దివంగత వైఎస్సార్పై.. నేడు జగన్పై కట్టుకథలు అల్లుతూ దు్రష్పచారం చేస్తోంది. అక్రమాల సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం ప్రజల సొమ్ము దోచుకునేందుకు రామోజీరావు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్గా, చైర్మన్గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. 18 ఏళ్లుగా నెట్టుకొచ్చారు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుపై చర్యలు కోరుతూ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొలి ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వేసినా.. ఆర్బీఐ తప్పుబట్టినా రామోజీరావు మాత్రం 18 ఏళ్లుగా తన అక్రమ దందాను కొనసాగిస్తూ వచ్చారు. సొంత ఆడిట్ కుదరదు.. ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు‘డిపాజిట్దారులకు సొమ్మును చెల్లించేశాం... మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’ అంటూ కనికట్టు చేసేందుకు యత్నించారు. ఆ కుతంత్రాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు.. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదని, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. -
తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ
-
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్ఫండ్స్తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్ఫండ్స్కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రామోజీ రావు మార్గదర్శి స్కామ్ పై ఉండవల్లి సంచలన విషయాలు
-
మార్గదర్శి కేసులో సంచలన విషయాలు..!
-
అక్రమాల డొంక కదిలింది...రామోజీ ఇక జైలుకే..!
-
రామోజీరావు మార్గదర్శి కేసుపై నేను ఇంత ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం
-
ఇక రామోజీరావు తప్పించుకోలేడు.. కొమ్మినేని కామెంట్స్
-
రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా దాగుందన్నది స్పష్టమైంది. రామోజీ దేశద్రోహం అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్గా ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం. జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, మార్గదర్శి చిట్ఫండ్స్లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్ అనే ఇంగ్లిష్ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. 1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. ఆ సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్ఫండ్స్లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్ఫండ్స్లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది. -
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
-
రామోజీరావు పట్ల కూడా చట్టం చట్టప్రకారమే వ్యవహరిస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
-
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
ప్రజలను మోసం చేస్తూ రామోజీ రావు వ్యాపారాన్ని విస్తరించారు
-
పాపం పండింది..ఆరునెలల్లో...కటకటాలే..!
-
కాకి లెక్కలు కుదరవ్!
సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్ 30 నాటికి 1,247 మంది డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్లో అక్రమంగా డిపాజిట్ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం.. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు
సాక్షి, అమరావతి: ఆర్థిక ఉగ్రవాది పత్రిక నడిపితే ఎలా ఉంటుందో ‘ఈనాడు’ చాటి చెబుతోంది. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్లు సేకరించడమే అందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఆర్థిక నేరం గుట్టంతా రట్టవుతుండటం.. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో రామోజీరావు భయంతో వణికి పోతున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం దిశగా దూసుకెళ్తోందని టైమ్స్నౌ–ఈటీజీ, జీ న్యూస్ తదితర ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేలి్చచెప్పడం.. రాజకీయ విశ్లేషకులూ అదే మాట చెబుతుండటం రామోజీరావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోందని.. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోందంటూ వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతూ బుధవారం ‘ఈనాడు’లో ‘కుమ్మరించేస్తోంది’ శీర్షికన రోతరాతలు అచ్చేశారు. ఇటీవల ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీ, మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేస్తే.. ‘ఈడ్చికొట్టిన ఈసీ’ అంటూ శివాలెత్తిన రామోజీ.. మార్గదర్శి కుంభకోణంపై విచారించిన అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ అస్సాంకు పంపితే.. ‘కొల్లికి షాక్’ అంటూ కథనాన్ని అచ్చేసి సంబరపడ్డారు. ఈసీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తుంటే.. అడిగేవారు, అడ్డుకునేవారు లేరంటూ ఇప్పుడు ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం చూస్తే రామోజీరావు మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తోంది. ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుంటే.. ఏ రోజు లెక్కలు ఆ రోజే తేలుస్తుంటే.. ప్రతి మద్యం దుకాణానికి వైఎస్సార్సీపీ రూ.పది లక్షలు ముందస్తు చెల్లింపులు చేయడం ఎలా సాధ్యం అన్న ఇంగిత జ్ఞానం కూడా రామోజీరావుకు లేకుండా పోయింది. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే గురవింద రామోజీ సాకులు వెతుకుతూ రోత రాతలు అచ్చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది బాబే దేశంలో రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి, ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికల నుంచి ఓటుకు నోటుకు తెరతీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసిన సొమ్ముతోపాటు.. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బ్యాంకులను కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, ఎన్నారైలకు టికెట్లు ఇచ్చారు. కోట్ల కట్టలను వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియను ప్రారంభించారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరగా వేస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారిని కాదని రూ.900 కోట్లు ఫార్టీ ఫండ్గా ఇచ్చిన విద్యా వ్యాపారి పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. రూ.వందల కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చిన ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్ను గుంటూరు లోక్సభ స్థానం నుంచి, కాకర్ల సురేష్ ను ఉదయగిరి నియోజకవర్గం నుంచి, వెలిగండ్ల రామును గుడివాడ నుంచి, యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నుంచి, రియల్టర్ కేశినేని చిన్నిని విజయవాడ లోక్సభ స్థానం నుంచి.. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఫార్టీ ఫండ్ రూపంలో.. అభ్యర్థుల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను యథేచ్ఛగా వెదజల్లుతున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ అభ్యర్థులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వంటి వారిని కొనుగోలు చేస్తూ తమ వైపునకు తిప్పుకోవడానికి బాబు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభలకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నా జనం మొహం చాటేస్తున్నారు. కోట్ల కట్టలతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు రామోజీ కంటికి కన్పించలేదేమో! సరి కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం జన బలమే గీటురాయిగా.. ప్రజాసేవే ప్రామాణికంగా.. నిబద్ధతే పరమావధిగా కింది స్థాయి కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యానికి సరైన అర్థం చెప్పారు. శింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును, మడకశిర నియోజకవర్గం నుంచి ఉపాధి కూలీ ఈర లక్కప్పను, నెల్లూరు సిటీలో విద్యా వ్యాపారి కోటీశ్వరుడు నారాయణపై సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్ను, మైలవరం నియోజకవర్గం నుంచి రైతుబిడ్డ సర్నాల తిరుపతిరావును, కోటీశ్వరులు బరిలోకి దిగే నరసాపురం లోక్సభ స్థానం నుంచి న్యాయవాది గూడూరి ఉమాబాలను సీఎం వైఎస్ జగన్ బరిలోకి దించడం ద్వారా రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. లంచాలకు చోటులేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలను కొనసాగించి.. ఇచ్చిన మాటపై నిలబడి.. సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. దీంతో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రమే అందుకు నిదర్శనం. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మండుటెండైనా.. అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానసంద్రమే అందుకు తార్కాణం. ఓ వైపు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు, నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అభిమాన సంద్రం ఉప్పొంగుతుండటం.. మరో వైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడాన్ని చూస్తే రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభంజనమేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలూ అదే చెబుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రామోజీరావు.. శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని స్పష్టమవుతోంది. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
మార్గదర్శి క్లోజ్ ?.. జైలుకు రామోజీ..!
-
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం కోర్టు
-
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ తీర్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్కు, ఈ తాజా క్వాష్ పిటిషన్కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్కుమార్, రామోజీరావు, అన్క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
మార్గదర్శి అక్రమాల కేసులో నేడు కీలక విచారణ
సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. -
ఆ డబ్బులు మావే ఇచ్చేయండి
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ.. ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
మార్గదర్శి సిబ్బందిపై కేసు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖ అకౌంట్ అసిస్టెంట్ వి.లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్ మొదటి లైన్లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్.రమేష్ తెలిపారు. -
అడ్డంగా దొరికిన ‘మార్గదర్శి’.. కేసు నమోదు
సాక్షి,విశాఖపట్నం: మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శి సీతంపేట అకౌట్ అసిస్టెంట్ వీ లక్షణ్రావు, ఆఫీస్ బాయ్శ్రీనులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా మంగళవారం తనిఖీల్లో మార్గదర్శి సీతంపేట బ్రాంచి నుంచి రూ. 52 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. -
అర కోటికి ఆధారాలేవి రామోజీ?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అర కోటికి పైగా నగదు, చెక్కులతో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయి 24 గంటలు దాటినా ఇంతవరకు వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు తనిఖీల్లో ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. బుధవారం రాత్రి వరకు మార్గదర్శి సంస్థ ఉన్నతస్థాయి ఉద్యోగులెవరూ దానికి ఆధారాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును ఎన్నికల్లో పంపిణీ కోసం టీడీపీ నేతలకు అందించడానికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ నగదు వివరాలను సీజర్ యాప్లోకి అప్లోడ్ చేసి సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సీజర్స్ సిస్టమ్లో కేసు నమోదు చేశారు. జిల్లా సీజర్స్ కమిటీ బృందం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. తమ డబ్బే అని మార్గదర్శి అప్పీల్ చేసుకున్న తర్వాత ఐటీ అధికారులకు సమాచారమిస్తామంటున్నారు. ఆధారాలు చూపించకపోతే డబ్బును సీజ్ చేసి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీతంపేట బ్రాంచి నుంచే.. ఈ నగదు మొత్తం సీతంపేట బ్రాంచి నుంచి తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ద్వారకానగర్ యూనియన్ బ్యాంక్కు తీసుకెళ్తున్నామని చెప్పిన మార్గదర్శి సిబ్బంది ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ చూపించలేదని జిల్లా సీజర్స్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సుధాకర్ తెలిపారు. నిజంగా ఇది వారి డబ్బే అయితే అప్పీల్కి దరఖాస్తు చేసుకుంటే.. ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు. రూ.10 లక్షలకు పైబడి నగదు దొరికితే ఐటీ అధికారుల సమక్షంలోనే విచారణ జరుపుతామని చెప్పారు. ఐటీకి, ఎన్నికల కమిషన్కు స్పష్టమైన ఆధారాలు చూపించిన తర్వాత అన్నీ పక్కాగా ఉంటే నగదు తిరిగి అప్పగిస్తామని, లేదంటే నగదు, చెక్కుల్ని సీజ్ చేసి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తారా? సీతమ్మధారలో లీజుకు తీసుకున్న స్థలాన్ని కాజేసే కుట్రలో భాగంగా రోడ్డు విస్తరణలో స్థలానికి పరిహారం కోసం అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన చరిత్ర గురివింద రామోజీరావుది. అలాంటి డ్రామోజీ.. ఆధారాలు సమర్పించి నగదు తీసుకెళ్లకుండా, వేచి ఉండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా.. ఈ డబ్బు మార్గదర్శికి చెందింది కాదనీ, టీడీపీ నేతలకు అందించేందుకు తీసుకెళ్తున్న సొమ్మే అన్న అనుమానాలూ దృఢపడుతున్నాయి. డబ్బుని ఎలాగైనా దక్కించుకునేందుకు రామోజీరావు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడానికే ఇంత సమయం తీసుకుంటున్నారన్న వదంతులూ ఉన్నాయి. -
పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో ఎన్నికల్లో విజయం సాధించలేమని స్పష్టం కావడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ నోట్ల దందాకు తెరతీశారు. రూ.వేల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించేందుకు సన్నద్ధమయ్యారు. దశాబ్దాలుగా తన కుట్ర రాజకీయాల్లో భాగస్వాములైన ఈనాడు రామోజీరావు, పొంగూరు నారాయణలతోపాటు టీడీపీ బడా బాబుల వ్యాపార సంస్థలనే నల్లధనం డంపింగ్ యార్డులుగా మార్చేశారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు పచ్చనేతల షిప్పింగ్, ఆక్వా కంపెనీలను నల్లధనం కంటైనర్లకు గమ్యస్థానాలుగా చేసుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తరలిస్తున్న నల్లధనం బాగోతం ఇప్పటికే రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసుల సోదాల్లో బయటపడింది. కాకపోతే దొరికింది గోరంతే! గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసిన గిడ్డంగుల్లో టీడీపీ పెద్దలు గుట్టలు గుట్టలుగా అక్రమ నిధులు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. కుట్రలకు ‘మార్గదర్శి’ చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుట్రల్లో భాగస్వామి ఈనాడు రామోజీ మరోసారి నల్లధనం తరలింపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మీడియా ముసుగులో నిత్యం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఆయన మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలను టీడీపీ అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా మార్చారు. రోజూ చిట్ఫండ్స్ కార్యాలయాల ద్వారా టర్నోవర్ ముసుగులో అక్రమ నిధులను చాప కింద నీరులా టీడీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నారు. విశాఖలో ఎలాంటి పత్రాలు లేకుండా మార్గదర్శి కార్యాలయం నుంచి తరలిస్తున్న రూ.51.88 లక్షల నగదు, రూ.39.29 లక్షలు విలువ చేసే చెక్కులను తాజాగా పోలీసులు గుర్తించి జప్తు చేయడం తెలిసిందే. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ కేంద్రంగా సాగుతున్న నల్లధనం దందాలో పట్టుబడిన ఈ మొత్తం సముద్రంలో కాకి రెట్ట లాంటిదే. ఆర్థిక అక్రమాల కోసం మార్గదర్శి చిట్ఫండ్స్ మొదటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తోంది. విశాఖ బ్రాంచిలో మూడు రోజుల లావాదేవీల మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లు సోదాల సందర్భంగా మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది చెప్పారు. మూడు రోజులకే ఒక్క బ్రాంచిలో రూ.51.88 లక్షలు లావాదేవీల పేరుతో నల్లధనాన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు టీడీపీ సిద్ధపడిందో ఊహించవచ్చు. దీని ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్లే. రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు జనవరి నుంచి ఈ విధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ద్వారా అక్రమ నిధులు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా మార్గదర్శి కార్యాలయాల నుంచి రూ.వందల కోట్లను ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు స్పష్టమవుతోంది. 2022 నవంబరు నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు వేయడం లేదు. అయినా సరే ఈ స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటం వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలకు ఆదేశించి నగదు లావాదేవీల రికార్డులను తనిఖీ చేస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగ ఓట్ల బడి ‘నారాయణ’ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు ఎన్నికల అక్రమాల శిక్షణా కేంద్రాలుగా మారాయి. నారాయణ విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతారో తెలియదు కానీ ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలి? నోట్లు పంచి ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? అనేది టీడీపీ శ్రేణులకు పక్కాగా బోధిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలే ప్రధాన పాత్ర పోషించాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ హయాంలో అమరావతిలో భూదందాలో నారాయణ ‘ఎన్స్పైరా’ నుంచే అక్రమ నిధులు తరలించారన్నది సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల నెల్లూరులోని ఎన్స్పైరా కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. నారాయణ విద్యా సంస్థల నిర్వహణ వ్యయం పేరిట అక్రమ నిధులు తరలిస్తున్నట్లు బయటపడింది. ఈదఫా ఎన్నికల్లో మరింత బరి తెగించారు. ఎన్స్పైరా ముసుగులో అక్రమ నిధుల పంపిణీకి పైప్లైన్ను ఏర్పాటు చేయడం పచ్చ పన్నాగానికి పరాకాష్ట. జిల్లా కేంద్రాల్లోని నారాయణ విద్యా సంస్థలు, వాటి కార్యాలయాల నుంచే టీడీపీ అభ్యర్థులకు అక్రమ నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుల ముసుగులో చడీచప్పుడు కాకుండా కుట్రను అమలు చేసేందుకు ఉపక్రమించారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేస్తున్న మొత్తం, ఇతర వ్యయం పేరిట చూపిస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ అక్రమాల గుట్టు రట్టు కావడం ఖాయం. ఎన్నికల కమిషన్ నారాయణ విద్యా సంస్థల్లో సమగ్రంగా సోదాలు నిర్వహించి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. తీరం వెంట అక్రమ నిధుల డంపింగ్ యార్డులు రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని ఎన్నికల అక్రమాలకు చుక్కానిగా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం విశాఖ నుంచి నెల్లూరు వరకు టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా కంపెనీలను దొంగ నోట్ల కేంద్రాలుగా, అక్రమ నిధులను తరలించే కంటైనర్లుగా మార్చుకోవడం ఆయన బరి తెగింపు రాజకీయాలకు నిదర్శనం. బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో తరలిస్తున్న అక్రమ నిధులు మార్చి 28న పోలీసుల సోదాల్లో బయట పడటం గమనార్హం. విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరుల నుంచి సేకరించిన నిధులను లావాదేవీల ముసుగులో కంటైనర్ల ద్వారా మన రాష్ట్రంలోని పోర్టులకు తరలించడం ఆ పార్టీ పెద్దల లక్ష్యం. విశాఖ, కాకినాడ, నెల్లూరులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బడా బాబుల షిప్పింగ్ కంపెనీలు, ఆక్వా కంపెనీల గిడ్డంగులకు తరలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని పన్నాగం పన్నారు. ఇప్పటికే విశాఖపలోని ఓ షిప్పింగ్ కంపెనీ యజమానికి చెందిన గిడ్డంగులు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు అక్రమ నిధుల పంపిణీ కేంద్రాలుగా మారాయి. విశాఖ, భీమిలీ తీరప్రాంతంలోని టీడీపీకి బడాబాబుకు చెందిన ఓ హేచరీస్ కంపెనీ స్థావరంగా ఉత్తరాంధ్ర అంతటా అక్రమ నిధులు తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రీతిలో కాకినాడ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకరు తీరప్రాంతంలోని హేచరీలు, ఆక్వా కేంద్రాలు అడ్డాగా అక్రమ నిధులు తరలింపును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు కేంద్ర స్థానంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తెరతీసింది. రాష్ట్రమంతా పర్చూరు మోడల్ ఎన్నికల్లో రూ.వేల కోట్లను వెదజల్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే పన్నాగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో అమలు చేసిన పథకాన్ని ఈసారి మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన కుతంత్రం. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు ఇటీవల డీఆర్ఐ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. మండలాలు, పంచాయతీలవారీగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన విధానం, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, అందుకోసం నిధుల వ్యయం, ఓట్ల కొనుగోలు, దొంగ ఓట్ల పర్యవేక్షణకు వివిధ స్థాయిలో బాధ్యుల నియామకం తదితరాలతో ఓ బ్లూప్రింట్ను రూపొందించి ఎమ్మెల్యే సాంబశివరావు అమలు చేశారు. తన వ్యాపార సంస్థ నోవా అగ్రిటెక్ ఆర్థిక వ్యవహారాల ముసుగులో ఆ కుత్రంతాన్ని అమలు చేశారు. అదే రీతిలో బ్లూప్రింట్ను టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాలకు పంపి కుట్రను పక్కాగా అమలు చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. అందుకోసం మార్గదర్శి చిట్ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా, ఇతర కంపెనీలను వాడుకోవాలని కుతంత్రం రచించారు. చంద్రబాబు, లోకేశ్, రామోజీ, నారాయణ, పచ్చ కోటరీలోని ఇతర ముఖ్యులు సర్వం తామై ఈ ఎన్నికల కుతంత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం, రూ.వేల కోట్లు వెదజల్లడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అవసరమైతే భయోత్పాతం సృష్టించేందుకు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ ముఠా అక్రమ నోట్ల గిడ్డంగులపై వెంటనే దాడులు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ క్రియాశీలం కావడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బరితెగించిన రామోజీ...ఈసారి అడ్డంగా దొరికిపోయాడు
-
గురివింద బండారం బట్టబయలు
-
షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు
నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు. చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు. నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ -
మార్గదర్శి మోసాలను ఆధారాలతో బయటపెట్టిన బాధితులు
-
బందిపోటు దొంగల్లా మార్గదర్శి యాజమాన్యం
-
పేద, మధ్య తరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసింది
-
రామోజీ మోసాలు.. మార్గదర్శి బాధితుల సంఘం ఏర్పాటు
సాక్షి, విజయవాడ: చిట్ఫండ్స్ పేరిట రామోజీరావు మోసాల నేపథ్యంలో మార్గదర్శి బాధితుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. ఈ మేరకు సంక్షేమ సంఘాన్ని బాధితులు రిజిస్టర్ చేశారు. ఈ క్రమంలో బాధితులు.. ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అనంతరం, మీడియా ముందు రామోజీ మోసాలను బాధితులు ఎండగట్టారు. ఆధారాలతో మార్గదర్శి మోసాలను బాధితులు బయటపెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి బాధితుల సంఘం ప్రెసిడెంట్ ముష్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మార్గదర్శిలో నేను మోసపోయాక గళం విప్పడం ప్రారంభించాను. పేద, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారు. చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నారు. మార్గదర్శి ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియట్లేదు. కర్నూలులో ఒక వ్యక్తికి మార్గదర్శి బెదిరింపుల కారణంగా పక్షవాతం వచ్చింది. మార్గదర్శిపై పోరాడుతున్న నాపైన కూడా కేసులు పెడుతున్నారు. నేను కోర్టుకు వెళ్తానంటే నువు బ్రాహ్మణుడివి ఏమీ చేయలేవు అని బెదిరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మార్గదర్శి బాధితుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ..‘మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోంది. కస్టమర్ల ఆస్తులు కొల్లగొడుతున్నారు. 43 చిట్లలో కేవలం నాకు వచ్చింది 8వేలు మాత్రమే. ఒక్కో చిట్కి 210 రూపాయలు ఇచ్చారు. నెలకు 40 నుండి 50 లక్షల ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు. చిట్ డిఫాల్ట్ అయితే ఆస్తులు అమ్ముకుంటారని మాకు తెలియదు. కోర్టుకు వెళ్తారనే భయంతో అప్పులు చేసి చిట్లు కట్టాము. కాల్ మనీ గుండాల్లా మా ఇంటికి వచ్చి కూర్చునే వారు. ఇంట్లోని బంగారం అమ్ముకున్నాం. డిఫాల్ట్ అయితే ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారని మాకు తెలియదు’ అని కామెంట్స్ చేశారు. మార్గదర్శి బాధితుల సంఘం సెక్రటరీ అన్నపూర్ణ దేవి మాట్లాడుతూ..‘చిట్ కట్టలేని స్థితికి తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళ టార్గెట్ కోసం ఎక్కువ చిట్లు కట్టేలా ఒప్పించారు. ఎంత కట్టినా డిఫాల్ట్ ఉందంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా కాపురాన్ని నాశనం చేశారు. మా ఇంటిని అటాచ్ చేశారు. ఆర్ధిక స్థోమత లేనివారిని కూడా చిట్లలో ఇరికిస్తున్నారు’ అని అన్నారు. -
మోసాలకు కేరాఫ్ అడ్రస్ మార్గదర్శి
-
ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే.. ఇళ్లు, కార్లు, ఫర్నీచర్, నగలు అన్నీ కొనుక్కోవచ్చు..’ ఇదీ టీవీ చానళ్లలో, హోర్డింగుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఊదరగొట్టే ప్రచారం. అది నిజమేనని నమ్మి మార్గదర్శి చిట్ఫండ్స్లో చేరిన చందాదారుల ఇళ్లల్లో ఆనందం ఆవిరవుతోందన్నది పచ్చి నిజం. కొత్త ఇళ్లు, కార్లు కొనుక్కోవడం దేవుడెరుగు.. ఉన్న ఇళ్లు, భూములు, బంగారం అమ్ముకుంటున్నా అప్పుల ఊబి నుంచి బయట పడటం లేదు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు. ఒక చిట్టీ అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా అప్పులు తీరవు.. సరికదా కాల్మనీ రాకెట్ను తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తుండటం రామోజీ ఆర్థిక అరచాకాలకు నిదర్శనం. విజయవాడకు చెందిన ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ కుటుంబానికి ఇలాంటి క్షేభే మిగిలింది. ఈ వెటర్నరీ వైద్యుడి కుటుంబ సభ్యులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఒక గ్రూపులో చందాదారుగా చేరారు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్చారు. ఆ చిట్టీ గ్రూపుల చందాలు చెల్లించడం కోసమంటూ మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తూ ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చూపించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఏకంగా 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్గా చూపించారు. అనంతరం ఆ కుటుంబం ఆస్తులను గుంజుకున్నారు. ఆ వెటర్నరీ వైద్యుడు జీపీఎఫ్ డబ్బులు రూ.35 లక్షలతోపాటు పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించినా ఇంకా అప్పులు తీరనే లేదు. కాల్మనీ రాకెట్ గుండాల మాదిరిగా మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వచ్చి అల్లరి చేసి మరీ వారి ఇంటిని వేలం వేయించారు. అంతటితో రామోజీ ఆగడాలు ఆగలేదు. విదేశాల్లో చదువుతున్న ఆ వెటర్నరీ డాక్టర్ కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. ఆ చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది.. ఎలా వేలం పాటలో పాల్గొంది.. అసలు తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే లేదు. ఆమె పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులే మోసం చేశారు. తలలు అమ్ముకున్నా తీరని అప్పులు జాతీయ బ్యాంకులుగానీ ప్రైవేటు బ్యాంకులుగానీ తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి తదనుగుణంగా రుణాలు ఇస్తాయి. రుణాలు చెల్లించే స్థోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం, ఆర్థిక స్థోమతను మించి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తోంది. దాంతో వాయిదాలు చెల్లించలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమకున్న కొద్దిపాటి ఆస్తులను తమకు ధారాదత్తం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందుకు విజయవాడకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ దీనగాధే తార్కాణం. ఇతను మార్గదర్శి చిట్ఫండ్స్లో రూ.2 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యునిగా చేరారు. తర్వాత మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేరితే ఆర్థికంగా కలసి వస్తుందని చెప్పడంతో మరో రెండు గ్రూపుల్లో సభ్యుడిగా చేరాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే ఏకంగా 20 గ్రూపుల్లో సభ్యునిగా చేర్పించేశారు. నెలకు రూ.50 వేలు వాయిదాల కిందే చెల్లించాల్సిన పరిస్థితి సృష్టించారు. చిట్టీ పాట పాడిన తర్వాత ప్రైజ్మనీ తీసుకునేందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీలను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు వేసి తిరస్కరించింది. వాయిదాల బకాయిలు చెల్లించేందుకు తమకున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్ నెలకు రూ.50 వేలు చిట్టీ వాయిదాలు ఎలా చెల్లించగలరని మార్గదర్శి చిట్ఫండ్స్ విచక్షణతో యోచించి ఉంటే ఆయనకు అంతటి దుస్థితి ఏర్పడేది కాదు. కానీ రామోజీ లక్ష్యం ఆయనకు ఉన్న ఒక్క ఇంటిని గుంజుకోవడమే. బరితెగించి రామోజీ ఆర్థిక ఆగడాలు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల్లో అత్యధికులది ఇలాంటి దుస్థితే. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు పక్కాగా తన కుట్రను అమలు చేస్తూ వారి ఆస్తులను కొల్లగొడుతున్నారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారిని మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టీ గ్రూపులో ప్రైజ్ మనీతో పాత చిట్టీ గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. మళ్లీ కొత్త చిట్టీ దగ్గరకు వచ్చేసరికి ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు చిట్టీ పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్మనీని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ.. సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్ఫండ్స్ పరం చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని.. చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్మనీ) ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీలో చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్.. తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని మాత్రం నెలల తరబడి జాప్యం చేస్తున్నా సరే ఒక్క రూపాయి వడ్డీ చెల్లించడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో 50 శాతం వరకు ఇటువంటి బాధితులే ఉండటం రామోజీ మోసాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. యథేచ్ఛగా చట్టం ఉల్లఘన ► ఎవరైనా ఓ చందాదారుడు చిట్టీ పాట పాడిన తర్వాత తగిన ష్యూరిటీలు చూపించకపోతే... ఆ చిట్టీ పాటను రద్దు చేయాలి. ఆ చిట్టీ గ్రూపునకు మళ్లీ పాట(వేలం) నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ ఆ నిబంధనను పాటించడం లేదు. ఆ చిట్టీ పాటను రద్దు చేయడం లేదు. కొత్తగా పాటను నిర్వహించడమూ లేదు. ఆ చిట్టీ పాట సక్రమంగా నిర్వహించినట్టు చూపిస్తూ ఆ ప్రైజ్మనీని వేరే ఖాతాల్లోకి మళ్లించేస్తోంది. ఆ చిట్టీ గ్రూపును యథావిథిగా కొనసాగిస్తోంది. దాంతో ఆ డిఫాల్టర్ చందాదారుడు తర్వాత నెలల వాయిదాలు కూడా చెల్లించాల్సినట్టు చూపిస్తూ అప్పుల ఊబిలోకి కురుకుపోయేలా చేస్తోంది. ► వాయిదాలు చెల్లించలేని చందాదారుడిని డిఫాల్టర్గా చూపించాలి. అంతవరకు ఆ చందాదారు చెల్లించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి కమీషన్ పోగా వెనక్కి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ అలా చేయడం లేదు. ఆ డిఫాల్టర్ చందాదారు మొత్తాన్ని మరో చిట్టీ బకాయి కింద జమ చేసినట్టు చూపిస్తూ.. ఇంకా బకాయిలు చెల్లించాలని రికార్డుల్లో ఆ చందాదరుని రుణగ్రస్తునిగా చూపిస్తోంది. ► ఎవరైనా ప్రైజ్మనీ తీసుకోని చందాదారు వాయిదాలు చెల్లించలేకపోతే డిఫాల్టర్గా ప్రకటించాలి. ఆ చందాదారునికి 14 రోజుల నోటీసు ఇచ్చి డిఫాల్టర్గా ప్రకటించినప్పటి వరకు చెల్లించిన వాయిదాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఆ మొత్తాన్ని నిర్దేశిత వడ్డీ రేటుతో కలిపి చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ ఈ నిబంధనను పాటించడం లేదు. అటువంటి చందాదారులను ఉద్దేశ పూర్వకంగా డిఫాల్టర్లుగా ప్రకటించకుండా కొనసాగిస్తూ వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ► చిట్ఫండ్ చట్టం ప్రకారం ప్రతి చిట్టీ గ్రూపు దేనికదే ప్రత్యేకం. ప్రతి చిట్టీ గ్రూపు ఒక ప్రత్యేక కంపెనీ వంటిది. ఒక చిట్టీ గ్రూపు చందాదారుగా చెల్లించిన మొత్తాన్ని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు చూపించకూడదు. ఈ నిబంధనను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉల్లంఘిస్తూ చందాదారులను ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యునిగా చూపిస్తూ... అన్ని చిట్టీ గ్రూపుల మొత్తాన్ని ఒకదానికి ఒకటి అనుసంధినిస్తూ చందాదారులను ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. బాధితులకు అండగా చట్టం, ప్రభుత్వం చిట్ఫండ్ కంపెనీల మోసాలు, ఆగడాల నుంచి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు కేంద్ర చిట్ఫండ్స్ చట్టం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. చిట్టీ గ్రూపుల డిఫాల్టర్ సభ్యుల విషయంలో అనుసరించాలిన నిబంధనలను కేంద్ర చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 22లో విస్పష్టంగా పేర్కొంది. అయితే దశబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ చట్టాన్ని వైఎస్సార్సీపీ పటిష్టంగా అమలు చేస్తోంది. చిట్ రిజిస్ట్రార్లతోపాటు ప్రభుత్వం వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్గదర్శి అక్రమాలు, వేధింపులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్తోపాటు ఇతర చిట్ఫండ్ కంపెనీల బాధితులు తమ సమస్యను తెలియజేసి న్యాయం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కేంద్ర చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 64 నుంచి 68 వరకు జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్కు విస్తృత అధికారాలున్నాయి. ఆయనకు జ్యుడీషియరీ అధికారాలను చట్టం కల్పించింది. చందాదారులు తమకు చిట్ఫండ్ కంపెనీ మోసం చేసిందీ.. వేధిస్తోంది.. అని భావిస్తే తగిన ఆధారాలతో జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయవచ్చు. తాము సరైన ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదని, తమను డిఫాల్టర్గా ప్రకటించి అప్పటి వరకు చెల్లించిన వాయిదాలను వెనక్కి ఇవ్వాలని.. తమ సమ్మతి లేకుండానే ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారని.. ఇలా ఎటువంటి సమస్యలపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆమేరకు ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే బాధితులు రాష్ట్ర స్థాయిలో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్లు 69, 70 ప్రకారం రాష్ట్ర చిట్స్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి తగిన న్యాయం పొందవచ్చు. -
‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్!
-
"మార్గదర్శి షట్టర్ క్లోజ్"..రామోజీ దుకాణం బంద్..
-
‘మార్గదర్శి’ మోసాలపై సంఘటిత పోరు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. మార్గదర్శి బాధితుల సమస్యలను వివరించడానికి ఈ నెల 28వ తేదీ బుధవారం 11 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని.. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమని శ్రీనివాస్ అన్నారు. వివరాలకు 99481 14455 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమ ఆర్థిక సామ్రాజ్యం.. ఆధారాలతో సహా బట్టబయలు కాగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆర్థిక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు..? ►ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు ►మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు ►ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు ►బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు ►చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) ►ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు ఇదీ చదవండి: ‘బ్లాక్’ కోబ్రా -
‘బ్లాక్’ కోబ్రా
మార్గదర్శి చిట్ ఫండ్స్ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్దారుల పాన్ నంబరు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. – సాక్షి, అమరావతి ఘోస్ట్ చందాదారులతో నల్ల దందా బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్’ మ్యాజిక్ మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో బ్యాలన్స్ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్ షీట్తో సరిపోవాలి. అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్ షీట్ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్క్యాష్ కావు. కేవలం చిట్స్ రిజి్రస్టార్, రిజర్వ్ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం. ‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
‘మార్గదర్శి’ మోసాలపై కలిసికట్టుగా పోరాటం: బాధితుల సంఘం
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్స్ మోసాలపై కలిసికట్టుగా పోరాడేందుకు బాధితులు సిద్ధమయ్యారు. మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ అవ్వగా, విజయవాడ కేంద్రంగా ఈ సంఘం పనిచేయనుంది. అందరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బాధితుల సంఘం పేర్కొంది. మోసపోయిన వారు తమను సంప్రదించాలని, తమ సమస్యలను 9849055267 నెంబర్కు పంపించాలని బాధితుల సంఘం తెలిపింది. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. ఇదీ చదవండి: ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే -
ముమ్మాటికీ ఆర్థిక నేరస్తుడే..
-
ఆర్బీఐ హెచ్చరిక..బద్దలవుతున్న రామోజీ బాగోతం
-
మార్గదర్శి ఫ్రాడ్ కేసులో రామోజీకి శిక్ష తప్పదు : అడ్వకేట్ శివరామి రెడ్డి
-
మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గట్టిగా మొట్టికాయ వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్కు విరుద్ధమని నివేదించింది. ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని, ఆర్బీఐ తరఫు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్లోని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పూర్తి వివరాలతో ఓ నోట్ను తమ ముందుంచాలని ఆర్బీఐని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభుత్వంతోపాటు పిటిషనర్ ఉండవల్లి అరుణ్కుమార్ను సైతం మార్గదర్శి చిట్ఫండ్ డిపాజిట్ల సేకరణ విషయంలో నోట్ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా.. విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు... ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు గాను చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (2018 డిసెంబర్ 31) అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని (ప్రస్తుతం ఎన్సీఎల్టీ సభ్యురాలు, అమరావతి బెంచ్) తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2019లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కోర్టు పరిధిలో ఉన్నా కూడా రూ.2వేల కోట్లు సేకరణ ఈ సందర్భంగా మార్గదర్శి, రామోజీరావుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు వెనక్కు ఇచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సీఐడీ నమోదు చేసిన ఫిర్యాదును కొట్టేసిందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ, మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసిందని, ఇందుకు సుప్రీంకోర్టు గతంలోనే అనుమతి మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో రూ.2 వేల కోట్లు సేకరించిందని వివరించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీ ఇన్ పర్సన్ (కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలను తానే వినిపించడం)గా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడినని తెలిపారు. తీసుకున్న డబ్బు వెనక్కు ఇచ్చేశారా? ఎవరు ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారు..? అన్న విషయాలు ముఖ్యం కాదన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అన్నదే ఇక్కడ చూడాల్సిన అంశమని తెలిపారు. హెచ్యూఎఫ్గా ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది నిజమో కాదో తేల్చాలని ఆయన కోర్టును కోరారు. ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా ఇక్కడే ఉన్నారని, ఆయన్ను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దీంతో ఆర్బీఐ తరఫు న్యాయవాది ఎంఆర్ రమేష్ బాబు స్పందిస్తూ, హెచ్యూఎఫ్గా సెక్షన్ 45ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో కూడా ఇలాగే డిపాజిట్ల సేకరణ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇలా 45ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని హైకోర్టుకు చెప్పారా? అని ప్రశ్నించింది. హైకోర్టులో మార్గదర్శి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో తాము ప్రతివాది కానందున ఈ విషయాలను హైకోర్టు ముందుంచలేదన్నారు. సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న విస్తృత ధర్మాసనం, అన్నీ వివరాలను నాలుగు పేజీల నోట్ ద్వారా తమ ముందుంచాలని ఇరుపక్షాలను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. వాదనలు వినిపించేందుకు అందరికీ అవకాశం ఇస్తామంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఈ విచారణకు మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్దార్థ లూత్రా, ఉండవల్లి తరఫున న్యాయవాదులు అల్లంకి రమేష్, అరుణా గుప్తాలు హాజరయ్యారు. ఇదీ మార్గదర్శి బాగోతం హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది. ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి ఫిర్యాదు మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతించింది. ఆ తర్వాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు సానుకూల స్టే ఉత్తర్వులిచ్చింది. ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు 2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 482 కింద మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అందువల్ల క్రిమినల్ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో, హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు 2018 డిసెంబర్ 31న మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. అందరూ హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. తీర్పు వెలువడిన కొంత కాలం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రజనీ 2021 సెప్టెంబర్లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అమరావతి బెంచ్ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్సీఎల్టీ పోస్టు ఖరారైంది. ఆర్బీఐ తొలిసారి వచ్చింది ఏళ్ల తరబడి మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంలో కీలక విషయాన్ని తెలపడానికి ఆర్బీఐ తొలిసారిగా కోర్టుకు వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తెలిపారు. కోర్టు విచారణ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి తరఫున పేరు మోసిన సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్ ప్రకారం డిపాజిట్లు సేకరణ చట్ట విరుద్ధమని న్యాయవాది రమేష్బాబు తెలిపారన్నారు. మార్గదర్శి, రామోజీరావు వంటి వారిపై కఠిన చర్యలు ఉంటేనే చిన్న చిన్న చిట్ఫండ్ మోసాలు కూడా అరికట్టవచ్చన్నారు. రామోజీరావు అరెస్టు కావాలనేది తన ఉద్దేశం కాదని, ఈ తరహా మోసాలు అరికట్టడమే తన అభిమతమని స్పష్టం చేశారు. తన సొంత జిల్లాలో ఇటీవలే రెండు చిట్ ఫండ్ కంపెనీల మోసాలు వెలుగు చూశాయన్నారు. ఏపీలో ఫైనాన్స్ పేరుతో వసూళ్లు తగ్గుముఖం పట్టాలంటే కోర్టు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 9 నాటి విచారణతో స్పష్టత వస్తుందని, చట్టవిరుద్ధంగా వసూళ్లకు పాల్పడే వారి ముక్కుకు తాడు పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. -
సుప్రీంకోర్టు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కీలక మలుపు
-
అమ్మ రామోజీ.. అన్నీ తెలిసి ఇన్ని తప్పులా?
సాక్షి, ఢిల్లీ: సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆర్బీఐ తొలిసారి నోరు విప్పింది. హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్యూఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్.బి.ఐ తరపు న్యాయవాది తెలిపారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన రామోజీరావు.. తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీసుకువచ్చారు. ఇదీ చదవండి: రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది? -
మార్గదర్శి చిట్ ఫండ్ స్కాంలపై నా దగ్గర కీలక ఆధారాలున్నాయి: మాజీ ఎంపీ ఉండవల్లి
-
మార్గదర్శి స్కాం..సుప్రీంకోర్టులో రామోజీ రావుకు బిగ్ షాక్
-
మార్గదర్శి స్కాం కేసులో రామోజీ రావుకు సుప్రీం కోర్ట్ షాక్
-
సుప్రీం కోర్టులో మార్గదర్శికి ఝలక్
-
నేడు సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసు విచారణ
-
Ramoji : రామోజీ వ్యాపారాల వెనక ఏం జరుగుతోంది?
మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్పై కొన్ని నెలలుగా ఏపీ సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. అయితే అసలు కంపెనీ స్వరూపం, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల వెనక ఏంజరుగుతోంది? ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో ఎన్ని దాచిపెట్టారు? ఎలాంటి ఫిర్యాదు తమపై రాలేదని చెప్పుకునే రామోజీ.. అసలు ఎన్ని నిబంధనలు పాటిస్తున్నారు? ఎన్ని ఉల్లంఘిస్తున్నారు? రికార్డుల్లో ఏముంది? హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం 1962 ఆగస్టు 31న మార్గదర్శి చిట్ఫండ్స్ ఏర్పడింది. ఇందులో చెరుకూరి రామోజీరావు 31 ఆగస్టు, 1962న డైరెక్టర్గా చేరారు. ఏప్రిల్ 29, 1995లో ఆయన కోడలు శైలజాకిరణ్, నవంబర్ 03, 2022న సురబత్తిని వెంకటస్వామి డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2021 మార్చి 31 నాటికి సంస్థ రెవెన్యూ/ టర్నోవర్ రూ.500 కోట్లు. రెండేళ్ల కిందట సంస్థ అస్తులు 9.24శాతం వార్షిక వృద్ధిరేటును నమోదు చేశాయి. అయితే ఇతరులకు చెల్లించాల్సిన రుణాలు 2.97శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ట్రేడ్ రిసివెబుల్స్ 17.91శాతానికి తగ్గాయి. స్థిరాస్తులు 3.66శాతం కుంగాయని కంపెనీ నివేదికలో పేర్కొంది. అయితే రామోజీ గ్రూప్ సంస్థల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు, నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం రెండేళ్ల కింద వాటి చెల్లింపుల మూలధన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.20.20కోట్లు డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.36.32కోట్లు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(తమిళనాడు)-రూ.50లక్షలు మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిడెట్(కర్ణాటక)-రూ.50లక్షలు మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కో ప్రైవేట్ లిమిటెడ్-రూ.52.02లక్షలు మార్గదర్శి ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.75లక్షలు ఉషాకిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.99లక్షలు బాలాజీ హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.65.06లక్షలు ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష రామోజీ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.2.06కోట్లు ఓం స్ప్రిచ్వల్ సిటీ(తెలంగాణ)-రూ.68లక్షలు ఓం స్ప్రిచ్వల్ సిటీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.26లక్షలు మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.44.77కోట్లు ఉషోదయ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1.80కోట్లు రామోజీ టూరిజం గేట్వే ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.9.44కోట్లు మార్గదర్శి హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.3.88కోట్లు మాన్పవర్ సెలక్షన్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష వెరైటీ మీడియా మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఆంధ్రప్రదేశ్)-రూ.1లక్ష బాల్భారత్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.1లక్ష, బాల్భారత్ అకాడమీ(తెలంగాణ)-రూ.1.10కోట్లు రామోజీ కిరణ్ ఫిల్మ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.50లక్షలు ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(తెలంగాణ)-రూ.24.87కోట్లు. ఈ సంస్థల అధీకృత విలువ(కంపెనీల వద్ద గరిష్టంగా ఉండే విలువ) ఎంతో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం లెక్కించే విలువతో పోలిస్తే కంపెనీ ఆస్తుల మార్కెట్ విలువ చాలారెట్లు ఎక్కువ. ఇన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తనకు తాను వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ గా అభివర్ణించుకునే రామోజీ.. ఈ సంస్థల ముసుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మార్గదర్శి ఫైనాన్స్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ వినియోగదారుల మొత్తాలను డిపాజిట్ చేశారు. కొన్ని కోట్ల రుపాయలను పక్కదారి పట్టించారు. ఇదేమంటే HUF పేరిట తమకు అనుమతి ఉందని, దానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి సలహా తీసుకున్నామని స్వయంగా బుకాయించారు. ఇప్పటివరకు ఆ జడ్జి ఎవరో బయటపెట్టలేదు ఈనాడు భవనాల కోసం వేర్వేరు వ్యక్తుల నుంచి భవనాలను లీజు తీసుకున్నారు. ఇక్కడితో ఆగలేదు. వాటిని తిరిగి ఇవ్వాలన్న బిల్డింగ్ ఓనర్లను ముప్పు తిప్పలు పెట్టారు. తన శక్తిని ఉపయోగించి ఎలాంటి కేసులు లేకుండా వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో పడ్డారు విశాఖలో లీజుకు తీసుకున్న భవనాన్ని రోడ్డు ఎక్స్ టెన్షన్ లో భాగంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించింది. ఈ మొత్తం బిల్డింగ్ ఓనర్ కు చెందాలి. కానీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కాస్తా తన జేబులో వేసుకున్నారు రామోజీ. ఇదేమని అడిగిన ఓనర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట ఓ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీ.. దీని కింద ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డాడో లెక్కే లేదు. కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. ఇదేంటని అడిగిన పేద రైతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఎన్నో సార్లు ఫిల్మ్ సిటీ ముందు రైతులు, కమ్యూనిస్టులు, సామాన్యులు ధర్నాలు చేసినా.. వాటన్నింటిని తొక్కించేశాడు. చిట్ ఫండ్స్ పేరిట జనం డబ్బులను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించాడు. నిబంధనల ఉల్లంఘించడమే కాకుండా.. తనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు లేవంటూ కొత్త పాట అందుకున్నాడు. అంతే తప్ప తాను తప్పు చేయలేదని మాత్రం చెప్పుకోలేదు. చంద్రబాబుతో బంధం పెరిగిన తర్వాత ముఖ్యంగా 1999-2004 మధ్య కాలంలో రామోజీ చేసిన అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఏ జీవో తయారయినా.. అది విడుదల కాకముందే రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ కార్యాలయానికి ఒక కాపీ ఫ్యాక్స్ రూపంలో వచ్చేది. రామోజీ దర్పానికి ఇది కేవలం మచ్చుతునక. పచ్చళ్ల తయారీలో ప్రామాణికంగా లేవని, అందులో ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలెన్నో ఉన్నాయని ఎన్నో సార్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పరిశోధనల్లో తేల్చినప్పటికీ.. వాటిని విజయవంతంగా బయటకు రాకుండా చూసుకున్నాడు. విచిత్రమేంటంటే.. ఇప్పుడు ఎల్లో మీడియా పేరిట చంద్రబాబు కోసం ఒక్కటయినా.. పత్రికలే.. ఒకప్పుడు రామోజీకి వ్యతిరేకంగా అక్రమాలన్నింటిని బ్యానర్లుగా అచ్చేసి వదిలారు. ఇక ఇటీవల బయటికొచ్చిన యూరీ రెడ్డి ఉదంతం మరింత విచిత్రం. తుపాకీతో బెదిరించి వారి కుటుంబానికి కేటాయించిన మార్గదర్శి వాటాలను రామోజీరావు బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని జీ జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్గా వ్యవహరించారు. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే..288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. ఇన్ని వ్యాపారాలున్నా నీతిమాలిన పనులకు పాల్పడం రామోజీకే చెల్లుతుంది. ఉన్నదాంతో తృప్తి పడకుండా అన్నీ నాకే కావాలనే దోరణితో బెదిరింపులు, దైర్జన్యాలకు ఒడిగట్టడం వెనక ఆంతర్యం తనకే తెలియాలి. -
రామోజీరావు, శైలజా కిరణ్ గురించి సంచలన విషయాలు..
-
షేర్ల కోసం తుపాకీతో రామోజీ రావు బెదిరింపు
-
రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు
సాక్షి, అమరావతి: ‘రామోజీరావు పచ్చి మోసం చేశారు. తొలుత మమ్మల్ని ఓ గదిలో నిర్బంధించి, తుపాకీతో బెదిరించి మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నించారు. ప్రాణా లు దక్కించుకొనేందుకు ఆయనిచ్చిన ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టి బయట పడ్డాం. షేర్లు మాత్రం బదిలీ చేయలేదు. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో మాకున్న 288 షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు బదలాయించుకున్నారు’ అని మార్గదర్శి చిట్ఫండ్స్ సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి చెప్పారు. తమ షేర్లను బదిలీ చేసి రామోజీ మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఐడీని, న్యాయస్థానాన్ని కోరారు. యూరి రెడ్డి మంగళవారం తన న్యాయవాది శివరామిరెడ్డితో కలిసి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామోజీరావు ఏ విధంగా తమ షేర్లను అక్రమంగా బదలాయించుకున్నదీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. తుపాకితో బెదిరించి.. మా తండ్రి జీజే రెడ్డి చనిపోయిన తరువాత మార్గదర్శి చిట్ఫండ్స్లో మా అన్నయ్య మార్టిన్ రెడ్డి, నేను మా వాటా షేర్ల కోసం ఎన్నో ఏళ్లు రామోజీరావును సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి 2016లో హైదరాబాద్లో ఆయన్ని కలిశాము. మాకు డివిడెండ్ కింద చెక్ ఇచ్చారు. ఆ తరువాత మా షేర్లపై సర్టిఫికెట్ అడిగితే ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మమ్మల్ని లోపల ఉంచి తలుపులు వేసేశారు. చాలాసేపటి తరువాత రామోజీరావు వచ్చి ఖాళీ స్టాంపు పేపర్లు ముందు పెట్టారు. వాటిపై సంతకాలు చేయమన్నారు. మేము నిరాకరించడంతో మా తలలకు తుపాకి గురి పెట్టి ‘సంతకాలు పెడతారా లేదా.. మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరు ఇక్కడ’ అని బెదిరించారు. అది ఆయన సామ్రాజ్యం. అంతా ఆయన మనుషులే. మా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఆ సమయంలో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడతామనుకోలేదు. ఆయనకు ఎదురు చెబితే ప్రాణాలు దక్కవన్నది అర్థమైంది. కేవలం ప్రాణాలు కాపాడుకొనేందుకే ఆ ఖాళీ స్టాంపు పేపర్లపై సంతకాలు చేసి బయటకు వచ్చాం. షేర్ల బదిలీకి మేము అంగీకరించలేదు. షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయలేదు. రామోజీరావు మాకు ఇచ్చిన చెక్ను కూడా నగదుగా మార్చుకోలేదు. చట్ట ప్రకారం ఇది చెల్లదు కంపెనీల చట్టం ప్రకారం ఏదైనా షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలంటే మూడు అంశాలు తప్పనిసరి. ప్రతిపాదన (ఆఫర్), ఆమోదం (యాక్సెప్టెన్సీ), ప్రతిఫలం బదిలీ (కన్సిడరేషన్) తప్పనిసరి. మా షేర్ల బదిలీ విషయంలో ఆ మూడూ జరగలేదు. షేర్లు బదిలీ చేస్తామని మేము ఎక్కడా చెప్పలేదు. అందువల్ల ప్రతిపాదనే లేదు. రామోజీరావు కోరినా మేము ఆమోదించలేదు. అందువల్ల యాక్సెప్టెన్సీ లేదు. మా షేర్ల బదిలీకి ప్రతిఫలంగా మాకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలమూ దక్కలేదు. కాబట్టి మేము షేర్లు విక్రయించామన్న రామోజీరావు వాదన చెల్లదు. ఆయన వాదన పూర్తిగా అబద్ధం, మోసపూరితం. చేతి అప్పు అంటూ బుకాయింపు మా తండ్రికి చేతి అప్పుగా ఇచ్చిన దానికి ప్రతిఫలంగానే మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి నిధిని సమకూర్చారని రామోజీరావు ముందుగా బుకాయించారు. చేతి అప్పు తీర్చాలి అంటే నగదు ఇస్తారు గానీ కంపెనీలో పెట్టుబడి పెడతారా అని మేము ప్రశ్నిస్తే రామోజీరావు సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం షేర్లు బదిలీ చేయాలని మమ్మల్ని తుపాకీతో బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో షేర్ల బదిలీ.. ఆర్వోసీకి ఫిర్యాదు మేము సమ్మతించకపోయినా, చెక్ను నగదుగా మార్చుకోకపోయినా మా వాటా 288 షేర్లను రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని 2017లో గుర్తించాం. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి వెళ్లి సంబంధిత పత్రాలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. పలు పత్రాల్లో మా సంతకాలను ఫోర్జరీ చేశారు. దీనిపై అప్పట్లోనే ఆర్వోసీకి ఫిర్యాదు చేశాను. సీఐడీ దర్యాప్తుతో ధైర్యం వచ్చి.. రామోజీరావు తుపాకీతో బెదిరించారని కొందరికి మా ఆవేదన చెప్పుకున్నా అప్పట్లో ఫలితం లేకపోయింది. దాంతో ఫిర్యాదు చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఆయన రాజకీయ పరపతి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్ము అక్రమ పెట్టుబడులకు మళ్లించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ రామోజీ, ఇతరులపై కేసు నమోదు చేసింది. సోదాలు నిర్వహిస్తోంది. దాంతో మాకు ధైర్యం వచ్చింది. అందుకే మార్గదర్శి చిట్ఫండ్స్లో మా షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని సీఐడీకి కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాము. సీఐడీ అధికారులు నాలుగైదు నెలలపాటు మా ఫిర్యాదును పరిశీలించారు. ఆధారాలు తెమ్మన్నారు. మేము ఇచ్చిన ఆధారాలను పరిశీలించారు. మా ఫిర్యాదు సరైనదే అని నిర్ధారించుకున్న తరువాతే కేసు నమోదు చేశారు. మూలధన నిధి ఏపీ నుంచే వచ్చింది కాబట్టి.. మా తండ్రి జీజే రెడ్డి కృష్ణా జిల్లాలోని తన వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్నే మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడిగా పెట్టారు. అంటే మూలధన నిధిని ఏపీ నుంచే సమీకరించారు. ఆ పెట్టుబడితోనే మా పేరిట 288 షేర్లు వచ్చాయి. ఆ షేర్లనే రామోజీరావు ఆయన కోడలు శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు. అందుకే ఈ కేసు ఏపీకి సంబంధించినదని న్యాయ నిపుణులు చెప్పారు. దాంతోనే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశాం. మాకు జరిగిన అన్యాయంపై సీఐడీని సంప్రదించాం. సీఐడీ, న్యాయస్థానం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేస్తాయని విశ్వసిస్తున్నాం. శైలజ పేరిట అప్పుడు 100 షేర్లే.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ పేరిట 2017 వరకు 100 షేర్లే ఉన్నాయి. జీజే రెడ్డి పేరిట మాత్రం 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి షేర్లను అక్రమంగా బదిలీ చేసిన తరువాత ప్రస్తుతం శైలజ కిరణ్ పేరిట 388 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి తప్ప మిగిలిన షేర్ హోల్డర్లంతా రామోజీ కుటుంబ సభ్యులే మార్గదర్శి చిట్ఫండ్స్లో ఆరుగురు షేర్ హోల్డర్లే ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థ ఏనాడూ పబ్లిక్ ఇష్యూ జారీ చేయలేదు. ఉన్న ఆరుగురు షేర్ హోల్డర్లలో అయిదుగురు రామోజీరావు కుటుంబ సభ్యులే. జీజే రెడ్డి ఒక్కరే బయట వ్యక్తి. ఆయన పేరిట ఉన్న షేర్లను కూడా అక్రమంగా శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఆ అక్రమ వ్యవహారానికి మార్గదర్శి చిట్ఫండ్స్లోని ఇతర షేర్ హోల్డర్లు.. అంటే రామోజీ కుటుంబ సభ్యులు సహకరించారు. రామోజీరావు పెద్ద గూడుపుఠాణికి పాల్పడ్డారు. -
రామోజీ నన్ను తుపాకీతో బెదిరించారు: యూరి రెడ్డి
-
నా తండ్రి పేరు మీద షేర్స్ ఉన్నాయి: యూరిరెడ్డి
-
రామోజీరావు, శైలజ క్వాష్ పిటిషన్.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీజేరెడ్డి షేర్లు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా మార్పు
-
రామోజీరావు, శైలజా క్వాష్ పిటిషన్.. హైకోర్టులో విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఏపీ హైకోర్టులో రామోజీరావు, శైలజా కిరణ్ క్వాష్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఫిర్యాదు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. మార్గదర్శిలో తన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో శైలజ పేరు మీదకు మార్చారని యూరిరెడ్డి ఆరోపించారు. తనను తుపాకీ బెదిరించి బలవంతంగా వాటా లాక్కున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజా కిరణ్లను నిందితులుగా చేర్చింది. సీఐడీ FIRను సవాలు చేస్తూ.. రామోజీరావు, శైలజా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి వరకు రామోజీపై తీవ్ర చర్యలు తీసుకోమని సీఐడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు బుధవారం వింటామని హైకోర్టు తెలిపింది. రామోజీ, శైలజా తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హజరయ్యారు. ఇప్పటికే స్కిల్ స్కామ్లో చంద్రబాబు తరపున లూథ్రా వాదిస్తున్న విషయం తెలిసిందే. సంబంధిత వార్త: షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు కాగా తన తండ్రి పేరు మీద మార్గదర్శిలో షేర్స్ ఉన్నాయని యూరిరెడ్డి తెలిపారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పెట్టుబడితో 288 షేర్లు తన తండ్రికి వచ్చాయని వెల్లడించారు. తన తండ్రి 1985లో చనిపోయినట్లు తెలిపారు. 2014లో మార్గదర్శిలో జీజే రెడ్డికి షేర్లు ఉన్నట్లు మీడియా ద్వారా తెలవడంతో 2016 సెప్టెంబర్ 29న తమ తండ్రి షేర్ల గురించి అడగడానికి సోదరుడు మార్టిన్రెడ్డి, యూరిరెడ్డి వెళ్లినట్లు చెప్పారు. సోదరులిద్దరిని గదిలో ఉంచి రామోజీ తన తుపాకీతో బెదిరించి వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి తెలిపారు. అనంతరం మార్గదర్శి చిట్ఫండ్స్లో వాటాదారు అయిన యూరిరెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జీజే రెడ్డి వారసులకు షేర్స్ ఉన్నాయి : అడ్వొకేట్ శివరాంరెడ్డి ‘మార్గదర్శి చిట్స్ 1962లో ప్రారంభం అయ్యింది. జీజే రెడ్డి అందులో ఫౌండర్. ప్రమోటర్. రూ. 5000తో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. జీజే రెడ్డి 1985 లో మరణించారు. మార్గదర్శిలో వీళ్ళ షేర్లపై యూరి రెడ్డికి తెలియదు. మార్గదర్శిలో జీజేరెడ్డికి షేర్స్ ఉన్నట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. 2014లో కూడా జీజే రెడ్డికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయి. 288 షేర్లు జీజే రెడ్డి కి ఉన్నాయి. ఓఆర్సీలో కూడా తనిఖీ చేస్తే షేర్లు ఉన్నాయని తేలింది 1995 నుంచి 2016 వరకు శైలజ కిరణ్కు కేవలం 100 షేర్లు ఉన్నాయి. యూరి రెడ్డికి ఆమె కంటే ఎక్కువగా 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి వారసులతో బలవంతంగా సంతకాలు పెట్టించి షేర్స్ బదిలీ చేయించుకున్నారు. యూరిరెడ్డి ప్రమేయం లేకుండానే ఆయన పేరు మీద ఉన్న షేర్లు మార్గదర్శికి బదిలీ చేశారు.. యూరిరెడ్డి షేర్లు శైలజా కిరణ్కు బదిలీ చేసినట్లు లెక్కల్లో చూపించారు. యూరిరెడ్డి షేర్లు బదలయించాల్సిన అవసరం లేదు. ఆయన్ను బెదిరించి సంతకాలు పెట్టించి అక్రమంగా షేర్లు బడలయించారు. యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశాక ఆక్టోబర్ 13 న కేసు నమోదు చేశారు.’ అని శివరాంరెడ్డి తెలిపారు -
షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు
సాక్షి, అమరావతి: ‘మీ షేర్లను బదిలీ చేస్తున్నట్లు సంతకాలు పెడతారా లేదా!?’.. ఓ గదిలో తలకు తుపాకి గురిపెట్టి మరీ ఇలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణభయంతో సంతకాలు చేసేస్తారు కదా. ఈ ఉదంతంలోనూ బాధితులు అదే పనిచేశారు. కానీ, ఇక్కడ తలకు తుపాకి పెట్టి బెదిరించింది ఎవరో కాదు.. చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. ఆ బాధితులు మరెవరో కాదు.. రామోజీరావుతో కలిసి మార్గదర్శి చిట్ఫండ్స్ స్థాపించిన జీజే రెడ్డి కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. ఇలా.. తుపాకితో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్లోని 288 షేర్లను తన కోడలు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు రామోజీ. ఆ ఒక్క సంతకమే కాకుండా మరికొన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో తతంగం కానిచ్చేశారు. ఆ విధంగా 2016 నాటికి రూ.1,59,69,600 మూలధన విలువ ఉన్న 288 షేర్లను అక్రమంగా కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈనెల 13న ఫిర్యాదు చేయడంతో రామోజీరావు అక్రమాల బండారం బట్టబయలైంది. జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. భారత్లో నివసిస్తూ తన కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన రెండో కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో రామోజీరావు, శైలజ కిరణ్లపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ కిరణ్లను నిందితులుగా చేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసు వివరాలివీ.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్ట్గా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ను 1962లో నెలకొల్పారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి 1985లో చెకోస్లోవేకియాలో చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. ఆ తర్వాత.. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీరావును చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయనేమీ చెప్పలేదు. పత్రికల ద్వారా తెలుసుకుని సంప్రదిస్తే.. మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మార్టిన్రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2016, సెప్టెంబరు 29న రామోజీరావు తనను కలిసేందుకు ఆ సోదరులు ఇద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన ఏళ్లకు సంబంధించిన డివిడెండ్ మొత్తాన్ని కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. తుపాకి పెట్టి బెదిరించి మరీ.. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద మార్టిన్రెడ్డిని సంతకం చేయమన్నారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016, అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీలేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు’ అని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందనిగానీ, తేదీగానీ ఆ ఫామ్పై లేవు. రామోజీరావు తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి వారు బయటకొచ్చారు. చెక్కు మార్చలేదు.. షేర్ల బదిలీకి అంగీకరించలేదు.. మరోవైపు.. ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ.. తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వారు నగదుగా మార్చుకోలేదు. ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకంచేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. అలాగే, రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. కానీ, ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో.. 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ.. మరోవైపు.. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మార్గదర్శి చిట్ఫండ్స్లో వాటాదారు అయిన యూరి రెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే రామోజీరావు కుతంత్రం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. మూలధన నిధి సేకరించింది ఏపీలోనే కాబట్టి.. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్హోల్డింగ్పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని.. కమ్యూనిస్ట్ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి రికమండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని, ఆపై చిట్ఫండ్కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్ అయ్యాడు? వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్పై నో అబ్జెక్షన్ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్ యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం. -
రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమే మార్గదర్శి
అతిపెద్ద కార్పొరేట్ మోసం మార్గదర్శి చిట్ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ తేల్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్లపై ఇప్పటికే కేసు నమోదు చేసింది. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్లో ఉన్న వాటాలను అటాచ్ చేసింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మార్గదర్శిలో ఏ ఏ అవకతవకలు.? - ఆదాయపు పన్ను శాఖ చట్టానికి వ్యతిరేకంగా అక్రమ నగదు లావాదేవీలు - మార్గదర్శి పేరిట చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు - ఖాతాదారులకు రూ.కోట్లలో బకాయిలు - బ్యాంకు అకౌంట్ల నిర్వహణలో అక్రమాలు - చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు (డిపాజిట్లకు అనుమతి లేదు) - ఖాతాదారులకు తెలియకుండానే చిట్ నుంచి డిపాజిట్లుగా మార్పు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించింది రామోజీ సంస్థ. మార్గదర్శి చిట్ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను ఇప్పటికే అటాచ్ చేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్లో 44.55 శాతం వాటా అటాచ్ అయింది. చదవండి: Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు (ఫోర్మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని రామోజీ తరపు మనుషులే పిటిషన్లు దాఖలు చేసినట్టు తేలింది. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు ఇప్పటికే వెల్లడించారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని CID స్పష్టం చేసింది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఎస్టేట్ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్ ‘చిట్ఫండ్ చట్ట నిబంధనల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరు, అనంతపురం, నర్సరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలోని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు ఉల్లంఘనలను, అక్రమాలను గుర్తించారు. దీంతో మార్గదర్శి.. చిట్ మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేసింది. సెక్యూరిటీ ముసుగులో డిపాజిట్లు ఆమోదించింది. బ్యాలెన్స్ షీట్లను కూడా సమర్పించలేదు. దీంతో రిజిస్ట్రార్లు సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా మార్గదర్శి చిట్ఫండ్స్, రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్ తదితరులపై కేసులు నమోదు చేశారు. దీన్ని భరించలేని రామోజీరావు తదితరులు మీడియా ముసుగులో ఈనాడులో తప్పుడు కథనాలతో సీఐడీపై విషం చిమ్మారు. తమ ఎస్టేట్ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్ను వాడుకుంటున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్న దుగ్దతోనే ఇదంతా చేశారు. కర్త, కర్మ, క్రియ రామోజీరావే ‘మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, కలోరమా ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరాలకు రామోజీరావే కర్త, కర్మ, క్రియ. ప్రజల నాడిని, మనస్సులను ఆయనకు కావాల్సిన విధంగా మార్చగలనని రామోజీరావు భావిస్తుంటారు. వ్యవస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, దాని పేరు ప్రతిష్టలను మంటగలపడాన్ని రామోజీరావు తదితరులు పిల్లాటగా భావిస్తుంటారు. వారి ప్రయోజనాలకు అతికేలా, ప్రతిష్టాత్మక సంస్థ సీఐడీపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ఈనాడులో కథనాన్ని ప్రచురించారు. సీఐడీపై యుద్ధం ప్రకటించారు. రామోజీరావు, ఆయన కుమారుడు, కోడలిని రక్షించేందుకు మిగిలిన నిందితులు సాయం చేశారు. -
మార్గదర్శి కేసు: దర్యాప్తునకు చెరుకూరి శైలజ సహకరించడంలేదు: ఏపీ సీఐడీ
-
చెప్పకుండా శైలజ దేశం దాటారు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని తెలిపింది. మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్ అవుట్ నోటీసులు (ఎల్వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదనలకు పిటిషనర్ల తరపు న్యాయవాది రెండు వారాల సమయం కోరడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కౌంటర్లో ఏపీ సీఐడీ వెల్లడించిన కీలక వివరాలు.. సొంత ప్రయోజనాల కోసం వేల కోట్లు మళ్లించారు మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని 37 బ్రాంచ్ల్లో ఆ సంస్థ రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు చిట్లు నడుపుతోంది. వీటిలో చందాదారులు పెద్దఎత్తున పెట్టుబడి పెట్టారు. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ, బ్రాంచ్ మేనేజర్లు వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని అక్రమ మార్గాల్లో సొంత సంస్థల్లోకి, మ్యూచ్వల్ ఫండ్స్లోకి మళ్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చందాదారులకు చెల్లింపుల్లో విఫలమయ్యారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, మోసం కిందికే వస్తాయి. మార్గదర్శి ఎండీ శైలజపై సీఐడీ ఏడు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు, కీలక ఆధారాలు తెలుసుకోవడానికి శైలజ విచారణ ప్రధానం. దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఆమె వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్ 6న విచారణలో ఆమె సహకరించలేదు. అంతేకాదు అధికారులు అడిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఆమెకు రాజకీయంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసు్తన్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే చందాదారులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వేలాది చందాదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు శైలజను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరాల్సివచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 22న నోటీసులు జారీ చేశాం. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్ 23న సమాధానం ఇచ్చారు. అనంతరం మే 12న, మే 22న రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె నిరాకరించారు. ఆమె ఇంట్లోనే విచారణ చేపడతామని చెప్పినా అంగీకరించలేదు. అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఎక్కడా అమెరికా వెళ్తున్న విషయం చెప్పలేదు. ఆ సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచి ఉంచారు. విచారణలో సహకరించకపోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం లేకుండా దేశం దాటి వెళ్లడం.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎల్ఓసీ జారీ చేయాల్సి వచ్చింది. శైలజ చర్యలు రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధం. బ్రాంచిలలో సోదాల సందర్భంగా అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై శైలజ నుంచి వివరణ తీసుకోవడం అత్యంత కీలకం. ఇంత పెద్ద ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు సాగుతుంటే.. విదేశాలకు వెళ్లడానికి ఆమె చెప్పిన కారణం ఓ సాకు మాత్రమే. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదు అని సీఐడీ కౌంటర్లో తెలిపింది. -
రామోజీ, శైలజాలకు బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. విచారణ 18కి వాయిదా.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు.. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ -
మార్గదర్శి ముసుగులో ఆర్థిక దోపిడీ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో చెరుకూరి రామోజీరావు అతి పెద్ద ఆర్థిక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని ఆర్థిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. కేంద్ర చిట్ఫండ్ చట్టంతోపాటు ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి ఆయన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘చిట్టీల మాటున చీకటి వ్యాపారం’ అనే అంశంపై సాక్షి టీవీ శుక్రవారం నిర్వహించిన చర్చా గోష్టిలో పలువురు నిపుణులు, ప్రముఖులు పాల్గొన్నారు. చందాదారుల నిధులను అక్రమంగా సొంత వ్యాపార ప్రయోజనాలకు మళ్లించడమే కాకుండా వారిని వేధించి ఆస్తులు సైతం రాయించుకున్న ఘనత మార్గదర్శి చిట్ఫండ్స్దేనన్నారు. న్యాయస్థానాల ద్వారా పరిష్కరించాల్సిన అంశాలను కూడా చిట్ రిజిస్ట్రార్కు అప్పగించి చంద్రబాబు ప్రభుత్వం రామోజీ అక్రమాలకు వత్తాసు పలికిందన్నారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రామోజీరావు తన కోడలు శైలజాకిరణ్కు అక్రమంగా షేర్లు కట్టబెట్టారని వెల్లడించారు. ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించిన రామోజీరావును అరెస్టు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రామోజీకి శిక్ష ఖాయం చట్టం కళ్లు గప్పి 1962 నుంచి చేస్తున్న ఆర్థిక అక్రమాల ఊబిలో రామోజీరావు పూర్తిగా కూరుకుపోయారు. ఆయన దాన్నుంచి బయటకు రాలేరు. ఆయన మా మామగారు కలిసే అన్నదాత పత్రికను పెట్టారు. రామోజీరావు ప్రజల డబ్బుతో చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని, ఏదో ఒక రోజు చట్టానికి దొరికిపోతారని మా మామ 30 ఏళ్ల క్రితమే చెప్పారు. రామోజీ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఘోస్ట్ చందాదారుల పేరిట భారీ ఎత్తున ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారు. చందాదారులుగా ఉన్నవారిలో చాలా మందికి అసలు ఆ విషయమే తెలియదు. వారి సంతకాలను ఫోర్జరీ చేసి వారి పేరిట అక్రమంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిట్ఫండ్ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారులకు చిట్టీ పాట మొత్తం చెల్లించకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది. రామోజీకి చట్ట ప్రకారం శిక్ష విధించమే మిగిలింది. – నాగార్జునరెడ్డి, ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఫెమా, ఫెరా చట్టాల ఉల్లంఘన చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొన్ని వందల చిట్ఫండ్ కంపెనీలను మార్గదర్శి వ్యాపార ప్రయోజనాల కోసం బలవంతంగా మూసివేశారు. చిట్టీ పాడుకున్న వ్యక్తి ఏ కారణంతోనైనా వాయిదాలు చెల్లించకపోతే చిట్ రిజిస్ట్రార్ దగ్గర కేసులు వేసి వేధించారు. అందుకు చంద్రబాబు ప్రభుత్వం సహకరించింది. కోర్టుల ద్వారా సివిల్ సూట్లు వేయాల్సిన సందర్భంలో చిట్ రిజిస్ట్రార్కు చంద్రబాబు ప్రభుత్వం హక్కులు కల్పించడం నిబంధనలకు విరుద్ధం. అదే అదనుగా చందాదారుల ఆస్తుల జప్తు, శాలరీ అటాచ్మెంట్లకు పాల్పడి రామోజీరావు తన సొంత ఆస్తులు పెంచుకున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు మూడు రాష్ట్రాలకు సంబంధించింది. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా చిట్స్ వేశారు. ఇది కచ్చితంగా ఫెరా, ఫెమా చట్టాల ఉలంఘనే. ఈ కేసులో రామోజీరావుకు నోటీసులు ఇవ్వడమే కాదు అరెస్టు చేయాలి. – అరుణ్ కుమార్, హైకోర్టు న్యాయవాది జీజే రెడ్డి దగ్గర గుమాస్తాగా చేరి మార్గదర్శి చిట్ఫండ్స్ రామోజీరావు ఆర్థిక అక్రమ సామ్రాజ్యం. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన గాదిరెడ్డి జగన్నాథరెడ్డి (జీజే రెడ్డి) దగ్గర రామోజీరావు గుమాస్తాగా చేరారు. తర్వాత పరిణామాలతో పలు కేసులతో జీజే రెడ్డి అదృశ్యమయ్యారు. అప్పటికి మార్గదర్శిలో రామోజీరావుకు కొద్ది షేర్లు మాత్రమే ఉండగా జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆయన ఆస్తులు, షేర్లు జప్తు చేయాలని ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కానీ జీజే రెడ్డి షేర్లను అప్పగించకుండా అలానే కొనసాగించి 2016లో శైలజా కిరణ్ పేరిట బదిలీ చేశారు. ఇప్పుడు వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు వరకు ఉండొచ్చు. ఆ షేర్లను శైలజా కిరణ్ పేరిట ఎలా బదిలీ చేశారు? అందుకు షేర్ వ్యాల్యూషన్ సర్టిఫికేషన్ ఎవరు చేశారు? ఎవరి ద్వారా విక్రయించారో రామోజీరావు వెల్లడించాలి. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఈ దిశగా దర్యాప్తు చేయాలి. – వెంకట్రామిరెడ్డి, కార్పొరేట్ న్యాయ నిపుణుడు ముసుగులో నల్లధనం దందా మార్గదర్శి చిట్ఫండ్స్ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న రామోజీరావు అధికారుల తనిఖీలకు ఎందుకు సహకరించడం లేదు? అక్రమాలకు పాల్పడ లేదంటే ఫైళ్లను చూపించాలి కదా? ఫిర్యాదు చేయలేదు కాబట్టి దొంగతనం జరిగినా, ఎవరినైనా హత్య చేసినా పోలీసు అధికారి చర్యలు తీసుకోకూడదా? రామోజీరావు అడ్డగోలు వాదన అలానే ఉంది. ఎవరైనా చందాదారులు తమ ఆర్థిక అవసరాల కోసమే చిట్టీ పాట పాడతారు. అప్పుడు కూడా చిట్టీ మొత్తం ఇవ్వకుండా డిపాజిట్గా మళ్లిస్తామంటే ఎలా? బ్యాంకులో డిపాజిట్ చేస్తే 7 శాతం వడ్డీ వస్తుంది. మార్గదర్శి అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తూ 4 శాతమే ఇస్తోంది. అది దోపిడీ కాదా? రూ.కోటికంటే ఎక్కువ డిపాజిట్లు చేసినవారు 800 మందికిపైగా ఉన్నారని వెల్లడైంది. అదంతా నల్లధనం దందానే కదా. – కొమ్మినేని శ్రీనివాసరావు, చైర్మన్, ఏపీ మీడియా అకాడమీ చందాదారుల సొమ్ముతో సొంత పెట్టుబడులు కేంద్ర చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల నిధులను తమ సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మళ్లించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును ఉషోదయ ఎంటర్ప్రైజస్, ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్ సంస్థల్లో 87 శాతం వాటా కింద తమ సొంత పెట్టుబడిగా మళ్లించారు. నిధులు ఎలా మళ్లించారన్నదానికి రామోజీరావు సమాధానం చెప్పాలి. 2014 నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ తమ చందాదారుల వివరాలను ఆంధ్రప్రదేశ్ చిట్ రిజిస్ట్రార్కు సమర్పించడం లేదు. హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చిట్ రిజిస్ట్రార్కు సమాచారం ఇవ్వబోమనడం సరికాదు. 37 బ్రాంచీల వివరాలను ఏపీ చిట్ రిజిస్ట్రార్కు సమర్పించాలి. – వై.నాగార్జున యాదవ్, చైర్మన్, ఏపీఈడబ్లూఐడీసీ -
మార్గదర్శి ఫైనాన్సియల్ పెద్ద స్కాం: ఏపీసీఐడీ
-
చందాదారులకు మార్గదర్శి బెదిరింపులు 'చెప్పింది చేయండి'
సాక్షి, అమరావతి: సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులను ఆ సంస్థ యాజమాన్యం బెదిరిస్తోందా? మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందా? ఇంతగా బరితెగించడం నిజమేనా? దీనిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారా? తదితర ప్రశ్నలన్నింటికీ సీఐడీ విభాగం అవునని స్పష్టం చేస్తోంది. ఘోస్ట్ చందాదారుల పేరిట అక్రమాలకు పాల్పడుతుండటాన్ని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీస్తుంటే బెంబేలెత్తిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా బెదిరింపులకు పాల్పడుతోందని కుండబద్దలు కొట్టింది. చందాదారులు, ఏజంట్లను మోసగిస్తూ మార్గదర్శి భారీగా అక్రమాలకు పాల్పడుతోందని పలువురు బాధితుల ఫిర్యాదుతో విశాఖపట్నం, విజయవాడ, నరసరావుపేటలో తాజాగా ఆ సంస్థపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫకీరప్పతో కలసి విలేకరుల సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఘోస్ట్ చందాదారుల పేరిట ఆర్థిక దందా ► మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రతి చిట్టీ గ్రూపులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద రాష్ట్రంలో 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల పేరిట భారీగా ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఆ 3 వేల మందికి తెలియకుండానే వారిని చందాదారులుగా చూపిస్తూ వారి పేరిట అక్రమంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఇతరత్రా సేకరించిన వారి గుర్తింపు కార్డులతో వ్యవహారం నడుపుతోంది. వారి సంతకాలను ఫోర్జరీ చేస్తూ తీవ్ర నేరానికి పాల్పడుతోంది. ► ఘోస్ట్ చందాదారుల పేరిట చెక్లు జారీ చేస్తున్నప్పటికీ, ఆ చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం వారి వద్దే అట్టిపెట్టుకుంటోంది. ఆ చెక్కుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం లేదు. బ్యాంకులో జమ చేయడం లేదు. ఇదో అతి పెద్ద ఆర్థిక మోసం. అలాంటి 3 వేల మంది ఘోస్ట్ చందాదారుల్లో వంద మందిని సీఐడీ విచారిస్తోంది. ► దాంతో బెంబేలెత్తిన మార్గదర్శి యాజమాన్యం ఆ ఘోస్ట్ చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని, తర్వాత తాము అన్నీ సెటిల్ చేస్తామని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ తన పీఏ శశికళ ద్వారా చందాదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అక్రమ డిపాజిట్లుగా నల్లధనం ► రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే తిరిగి బుకాయిస్తోంది. రాబోయే నెలలకు చిట్టీ గ్రూపులకు చెల్లించాల్సిన చందాలను అడ్వాన్స్గా జమ చేస్తున్నారని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అసలు చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే చందాదారుల పేరిట నాలుగైదు నెలల ముందే డిపాజిట్లు సేకరించిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. ► చిట్టీ గ్రూపులు మొదలు కాకుండానే ఎవరైనా చందాల మొత్తం చెల్లిస్తారా? ఎవరూ చెల్లించరు కాబట్టి అవి అక్రమ డిపాజిట్లే. రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు దాదాపు 2 వేల మందిలో రూ.కోటికి పైగా విలువైన అక్రమ డిపాజిట్లు చేసిన, చిట్టీ గ్రూపుల్లో చందాదారులుగా ఉన్న వారు ఏకంగా 800 మందికిపైగా ఉన్నారు. చాలా కంపెనీల పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. ► ఆ 800 మందికిపైగా డిపాజిట్దారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అంత భారీగా డిపాజిట్లు ఎలా చేశారు.. ఆ నిధులు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయనే కోణంలో విచారిస్తోంది. విజయవాడలో ఓ బిల్డర్ ఏకంగా రూ.50 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా ఉన్నారు. ► ఇలాంటి భారీ మొత్తాల డిపాజిట్దారులు, చిట్టీ గ్రూపుల్లో సభ్యుల గురించి ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా సీఐడీ సమాచారమిచ్చింది. అక్రమ డిపాజిట్ల ముసుగులో నల్లధనం చలామణిలోకి తీసుకువస్తున్నారా అన్నది సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఏజంట్లకూ కుచ్చుటోపి ► మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ చందాదారులు, ఏజంట్లను కూడా మోసగిస్తోంది. కుట్ర పూరితంగా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారి ఆస్తులు రాయించుకుంటోంది. దీనిపై చందాదారులు, ఏజెంట్లు, ఘోస్ట్ చందాదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పరిశీలించి తగిన ఆధారాలు ఉన్న వాటిపై సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. ► విజయవాడలో కోళ్ల ఫారం యజమాని బొండు అన్నపూర్ణా దేవి అనే మహిళను ఏకంగా 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్పించి ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. కుట్ర పూరితంగా విజయవాడలోని లబ్బీపేట, గుడివాడ మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆమె కుమార్తె ప్రియాంక సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. ష్యూరిటీలు ఇచ్చినా సరే కొర్రీలు వేస్తూ ఆమెను డిఫాల్టర్గా చూపిస్తూ వారి ఆస్తులు కూడా రాయించుకున్నారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. ఆమె రూ.14 కోట్ల విలువైన 65 చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా ఉన్నారు. ఆమె రూ.8 కోట్లు చందా మొత్తం చెల్లించారు. కానీ చిట్టీ పాట పాడితే ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.48 లక్షలు మాత్రమే. ఇందులో రూ.8 కోట్ల విలువైన 45 చిట్టీ గ్రూపుల్లో ఆమె రూ.1.7 కోట్లు చందా మొత్తంగా చెల్లిస్తే.. చిట్టీ పాట పాడిన తర్వాత ఆమె చేతికి ఇచ్చింది కేవలం రూ.8 వేలు. ఆమెను డిఫాల్టర్గా చూపిస్తూ వారి కుటుంబ ఆస్తులు కూడా రాయించుకుంటున్నారు. ► విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన పిలక లలిత కుమారి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఆమెను విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఘోస్ట్ చందాదారుగా చేర్చారు. ఆ విషయం తెలిసి ఆమె చిట్ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. అక్కడ ఉన్న పత్రాల్లో ఉన్న సంతకాలు చూసి అవి తాను చేయలేదని ఫోర్జరీ చేశారని తెలిపారు. ► ఆమె చిట్టీ పాడినట్టు.. ఆమెకు చిట్టీ మొత్తం చెల్లించినట్టు కూడా రికార్డుల్లో ఉంది. అందుకు ఇద్దరు సాక్షి సంతకాలు కూడా చేశారు. తనకు తెలియకుండానే తనను చందాదారుగా చేర్చడంతోపాటు తన సంతకాలు ఫోర్జరీ చేయడంపై లలిత కుమారి విశాఖపట్నం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో విశాఖపట్నం డాబా గార్డెన్స్ మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మార్గదర్శి చిట్ఫండ్స్ ఏజెంట్ కె.సంతోష్, సాక్షి సంతకాలు చేసిన జి.నరసింగరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ఎండీ శైలజ కిరణ్, ఆమె పీఏ శశికళ, విజయవాడ లబ్బిపేట బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావు, గుడివాడ బ్రాంచి మేనేజర్ వైవీవీడీ ప్రసాద్, పాతూరి రాజాజీ, పాపి నాయుడులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పల్పాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏజంట్నే ఆ సంస్థ మోసం చేసింది. ఏజంట్ సంతకాన్ని బ్రాంచి మేనేజర్ ఫోర్జరీ చేశారు. ఏజంట్ ఫిర్యాదుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మా కుటుంబాన్ని దోచేసి రోడ్డున పడేశారు – బోరున విలపించిన బొండు అన్నపూర్ణా దేవి ‘మార్గదర్శి చిట్ ఫండ్స్ మమ్మల్ని పూర్తిగా మోసం చేసి ఆర్థికంగా కుదేలయ్యేట్టు చేసింది. మా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మా ఆస్తులు, బంగారం, వృద్ధాప్యంలో అవసరాల కోసం దాచుకున్న మొత్తం అంతా మార్గదర్శి చిట్ ఫండ్స్కు ధారపోశాం. అయినా సరే ఇంకా మమ్మల్ని వేధిస్తూ మిగిలిన ఉన్న ఇంటిని కూడా తీసుకునేందుకు వేధిస్తోంది. మా కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడింది. నా భర్త ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడు. నేను కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాను. నేను మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఒక గ్రూపులో చందాదారుగా చేరాను. ఆ తర్వాత ఏకంగా 65 గ్రూపుల్లో నన్ను చందాదారుగా చేర్చింది. నిబంధనల ప్రకారం మేము ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్గా చూపించింది. మా ఆస్తులు తీసుకుంది. నా భర్త జీపీఎఫ్ డబ్బులు కట్టి, పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించాం. అయినా సరే ఇంకా బకాయి ఉన్నారంటూ మా ఇల్లు వేలం వేయించారు. మా ఇంటికి వచ్చి అల్లరి చేశారు. మా అమ్మాయి విదేశాల్లో వైద్య విద్య చదువుతోంది. ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది? ఎలా వేలం పాటలో పాల్గొంది? తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది? ఇంత దారుణంగా మార్గదర్శి చిట్ఫండ్స్ మమ్మల్ని మోసం చేసింది. మమ్మల్ని కుట్ర పూరితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం, మేనేజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.’ రూ.9.43 కోట్ల జగజ్జనని చిట్ ఫండ్స్ ఆస్తులు అటాచ్ కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడిన రాజమహేంద్రవరానికి చెందిన జగజ్జనని చిట్ ఫండ్స్కు చెందిన రూ.9,43,52,020 విలువైన స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. వాటిలో భవనాలు, భూములు, ఖాళీ స్థలాలతో కూడిన మొత్తం 12 స్థిరాస్తులను అటాచ్ చేయనుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ ప్రతిపాదనకు హోమ్ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై న్యాయస్థానం ఆమోదం కోసం సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. న్యాయస్థానం అనుమతి అనంతరం ఆ ఆస్తులను అటాచ్ చేస్తుంది. -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
మా జీవితాలను నాశనం చేసిన మార్గదర్శిపై చర్యలు తిసుకోవాలి
-
మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు
సాక్షి, విజయవాడ: ఏదైనా చిట్ఫండ్స్లో సేవింగ్స్ చేసేది ఆస్తులు కొనుక్కోవడానికే కాని.. అమ్ముకోవడానికి కాదని మార్గదర్శి బాధితురాలు అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శిలో ఎనిమిదేళ్లుగా చిట్లు వేసి వేధింపులు ఎదుర్కొన్నానని.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని సైతం అమ్మేసుకున్నానని.. తనలాంటి వాళ్ల జీవితాలను నాశనం చేసిన మార్గదర్శిపై చర్యలు తీసుకోవాలని కంటతడి పెట్టారామె. నా తల్లిదండ్రులు కొంత అమౌంట్ ఇచ్చారు. ఫ్రౌల్టీ ఫామ్ పెట్టుకుని.. ఆ తర్వాత మార్గదర్శిలో చిట్ వేశాను. మొదట్లో.. బాగానే ఇచ్చారు. దాని తర్వాత ఒత్తిడి చేసి ఒక చిట్ నుంచి రెండు.. రెండు నుంచి నాలుగు.. నాలుగు నుంచి ఎనిమిది.. ఇలా 90 చిట్ల వరకు తీసుకువెళ్లారు. ఆ ఆర్థిక భారాన్నంతా నా నెత్తి మీద రుద్దారు. వేసిన చిట్ డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడ్డారు. నేను వేసిన 17 చిట్స్లో నన్ను డిఫాల్ట్ చేశారు. మా గ్యారెంటీర్లను వేధించారు. మా ఇంటి పరువును బజారుకు కీడ్చేలా చేశారు. నా కూతుళ్ల పెళ్లి చేయలేకపోయా. వాళ్ల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు కూడా ఇచ్చేశా. నాలుగు ఫ్లాట్లు అమ్మించి డబ్బు కట్టించుకున్నారు. చదువుకున్న వాళ్లను కూడా సులువుగా మోసం చేయగలిగారు. ఇన్ని చిట్లు వేస్తే.. మాకు చివరగా వచ్చింది రూ.210 మాత్రమే. ఈ రకమైన కుట్రకు పాల్పడి.. తన లాంటివాళ్లెందరో రోడ్డున పడేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని ఆమె మీడియా సాక్షిగా అధికారులను కోరారు. బాధితురాలు అన్నపూర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారని.. ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలు పొందుపరిచామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ మీడియాకు వెల్లడించారు. -
సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారు
-
ప్రతీ నిబంధననూ మార్గదర్శి ఉల్లంఘించింది
సాక్షి, విజయవాడ: సీఐడీ విచారణపై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీపీ ఎన్ సంజయ్ పేర్కొన్నారు. మార్గదర్శి పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు. మార్గదర్శి మోసాలపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. చిట్స్ నిబంధనలను మార్గదర్శి పాటించడం లేదని విమర్శించారు. మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని సంజయ్ తెలిపారు. కోటికి పైగా చిట్స్ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు. సీఐడీ అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. ‘అన్ని రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఆక్షన్ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారు. 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరు. కంపెనీనే సొంతంగా చిట్స్ను తీసుకుంటుంది. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు ‘చెక్ ప్రిపేర్ అయినా లెడ్జర్లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్ అమౌంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ప్రతి చిట్ గ్రూపులో మోసాలు బయటపడ్డాయి. గోస్ట్ సబ్ స్క్రైబర్స్ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో మార్గదర్శిపైపోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కొందరు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్స్ నడుస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. అక్రమాలను కవర్ చేసుకుంటూ వార్తలు మార్గదర్శిలో అక్రమాలపై కవర్ చేసుకుంటూ ఈనాడులో రాసుకుంటున్నారు. మార్గదర్శికి అనుకూలంగా.. చిట్ ఫండ్ నిర్వహణలో తప్పులు లేనట్లు సొంత పేపర్లో రాశారు. మేము రాసిందే కరెక్ట్ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్లు ఉన్నారు. ఈనాడు రాస్తోంది కరెక్ట్ కాదు. అందుకే ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నాం. విచారణకి సహకరించరు.. పైగా రామోజీరావు, శైలజ కిరణ్లను మేము ప్రశ్నించకూడదు అంట, మార్గదర్సి చిట్స్ కార్యాలయాలలో తనిఖీలు చేయకూడదట. సీఐడీ బ్రాంచ్లలో తనిఖీ చేసినప్పుడు మార్గదర్సి రోజువారీ కార్యకలాపాలకి ఆటంకాలు సృష్టిస్తున్నారని తప్పువు వార్తలు రాస్తున్నారు. 3 వేల మందికి ఆ విషయమే తెలీదు మార్గదర్శిలో జరిగిన బిజినెస్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. కోటికి పైగా చిట్లో పాల్గొన్న వాళ్లు 800 మందికి పైగా ఉన్నారు. మార్గదర్సిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగింది. శైలజా పీఎం నుంచి బెదిరింపు ఫోన్లు జగజ్జనని కేసులో 9 కోట్ల ఆస్తులు అటాచ్ చేశాం. అనుమతులు లేకుండా చిట్ గ్రూప్ను ప్రారంభించారు. వేలం జరగకుండా నాలుగైదు చిట్లు ఎలా కట్టించుకుంటారు. అన్నపూర్ణ దేవిని శైలజ కిరణ్ పీఏ శశికళ నుంచి బెదిరింపు ఫోన్లు వెళ్తున్నాయి. ఇది సీఐడీ విచారణను అడ్డుకోవడం కాదా?. 3 వేల మందికి చిట్ కడుతున్నట్టు వాళ్ళకే తెలియదు.800 మంది అత్యధిక డబ్బులతో నడుస్తున్న చిట్ల వివరాలను ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపాం. విజయవాడలో ఒక బిల్డర్ 50 కోట్ల చిట్లు వేస్తున్నారు. అవి నగదా, చెక్ల రూపంలో చెల్లిస్తున్నారా..? అని విచారిస్తున్నాం’ అని తెలిపారు. అన్నపూర్ణ దేవి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపాం. ఫిర్యాదుదారు కుమార్తె ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విదేశాల్లో ఉన్న ప్రియాంక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వాళ్ళు ఫోర్జరీ సంతకంతో నష్టానికి వేలం పాట పాడించారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు ఏజెంట్లను మోసం చేస్తున్నారు. నరసరావుపేట బ్రాంచ్లో ఏజెంట్ సంతకాన్ని బ్రాంచ్ మేనేజర్ ఫోర్జరీ చేశారు. -ఫకీరప్ప, ఎస్పీ, సీఐడీ -
‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు
సాక్షి, అమరావతి: మార్గదర్శి తరహాలో పశ్చిమ బెంగాల్లో చిట్ఫండ్ కుంభకోణానికి పాల్పడిన ‘యూఆర్వో చిట్ఫండ్స్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. రామోజీరావు మాదిరిగానే చందాదారుల నిధులను మళ్లించిన యూఆర్వో చిట్ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చందాదారుల డబ్బులను తమకు చెందిన వివిధ వ్యాపార సంస్థలకు మళ్లించిన కేసులో ఆయన్ను అరెస్టు చేసి ఆయన్ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. బిశ్వప్రియ గిరికి న్యాయస్థానం సెప్టెంబరు 1 వరకు రిమాండ్ విధించింది. యూఆర్వో చిట్ఫండ్స్, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు ఒకే తరహాలో ఉన్నాయి. నిజానికి యూఆర్వో చిట్ఫండ్స్ కంటే మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలు అనేక రెట్లు పెద్దవి కావడం గమనార్హం. రూ.200 కోట్లు మళ్లించిన యూఆర్వో చిట్ఫండ్స్ యూఆర్వో చిట్ఫండ్స్ ప్రమోటర్, డైరెక్టర్ బిశ్వప్రియ గిరి ఈ కుంభకోణానికి సూత్రధారి. చిట్ఫండ్స్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేశారు. కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చందాదారుల సొమ్మును తమ సొంత వ్యాపార సంస్థల్లోకి మళ్లించారు. చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడ్డారు. రూ.200 కోట్లను ఇతర సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా మళ్లించారు. బిశ్వప్రియ గిరి కుటుంబానికే చెందిన అగ్రో ఇండస్ట్రీ, లైఫ్కేర్, ఆటోమోటివ్, హోటళ్లు–రిసార్టులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. చందాదారుల సొమ్మును తమ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారు. ఈ క్రమంలో చందాదారులకు సక్రమంగా చెల్లించలేక మోసానికి పాల్పడ్డారు. ఈడీ అధికారులు తనిఖీలు జరిపి పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేశారు. బిశ్వప్రియ గిరిని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. అంతకు మించి మార్గదర్శి మోసాలు యూఆర్వో చిట్ఫండ్స్ వసూలు చేసినట్లుగానే మార్గదర్శి చిట్ఫండ్స్ కూడా తమ చందాదారుల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది. 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పి రశీదు రూపంలో అక్రమ డిపాజిట్లు సేకరించింది. బిశ్వప్రియ గిరి తరహాలోనే రామోజీరావు కూడా చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించారు. తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో చిట్ఫండ్ చందాదారుల డబ్బును పెట్టుబడులుగా పెట్టారు. అంతేకాకుండా వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అక్రమ పెట్టుబడులుగా వాటిని మళ్లించారు. యూఆర్వో గ్రూప్నకు చెందిన బిశ్వప్రియ గిరి కేవలం కేవలం రూ.200 కోట్లు మాత్రమే మళ్లించగా రామోజీరావు అంతకు ఎన్నో రెట్లు అధికంగా రూ.వేల కోట్లను అక్రమంగా దారి మళ్లించడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అక్రమ పెట్టుబడులే రూ.1,035 కోట్లుగా ఉన్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గుర్తించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం, ఉషోదయ ఎంటర్ప్రైజస్లో 44.55 శాతం పెట్టుబడులుగా పెట్టారు. వాటి మార్కెట్ విలువ భారీగా ఉంటుదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్నిబట్టి యూఆర్వో చిట్ఫండ్స్ మోసాల కంటే మార్గదర్శి చిట్ఫండ్స్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. చందాదారుల నిధులను అక్రమంగా మళ్లించిన కేసులో యూఆర్వో చిట్ఫండ్స్ డైరెక్టర్ బిశ్వప్రియ గిరి అరెస్టు అయ్యారు. మరి అంతకంటే భారీగా చందాదారుల నిధులను మళ్లించిన రామోజీరావుపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల గురించి సీఐడీ విభాగం ఇప్పటికే ఈడీ ప్రధాన కార్యాలయానికి ఆధారాలతో సహా నివేదికను సమర్పించింది. -
మేమూ ‘మార్గదర్శి’లో చేరాం.. మోసపోయాం.. సీఐడీ వాట్సాప్ నంబర్కు ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, అమరావతి: ‘‘నేనూ మార్గదర్శిలో చేరా... ఓ మోపెడ్ కొనుక్కున్నా!.. ఓ ఇంటి వాడినయ్యా..!!’’ ఇలాంటి ప్రకటనలను నమ్మిన వేలాది మంది మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ చందాదారులు నిండా మునిగిపోయారు! ప్రతి నెలా కష్టార్జితం నుంచి పొదుపు చేసి మార్గదర్శి చిట్ఫండ్స్లో చిట్టీలు కడితే దారుణంగా మోసపోయామని ఆక్రోశిస్తున్నారు. చందాదారుల సొమ్మును తన కుటుంబ సభ్యుల సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించేసిన రామోజీరావు తాపీగా కూర్చోగా చందాదారులు మాత్రం మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని కూడా డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు... మరికొందరు చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్ మనీ) ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుతున్నారు.. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీగా చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్ఫండ్స్ తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని నెలల తరబడి జాప్యం చేస్తున్నా ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించడం లేదు.. ఇలా వేలాదిమంది మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసులను నమోదు చేసి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. మరోవైపు రాష్ట్రంలో నలుమూలల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద ఎత్తున సీఐడీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్కో చందాదారుడిది ఒక్కో వ్యధ! మూడు రోజుల్లో 300కిపైగా ఫిర్యాదులు మోసపోయిన మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు ఫిర్యాదు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. చందాదారులు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు ( 9493174065 ) అందుబాటులోకి తెచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్గదర్శి చందాదారులు పెద్ద సంఖ్యలో సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వాట్సాప్ నంబర్ అందుబాటులోకి రాకముందు సీఐడీకి దాదాపు వందకుపైగా ఫిర్యాదులు రాగా ఇప్పుడు మూడు రోజుల్లోనే మూడు వందల మందికి పైగా చందాదారులు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చందాదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తుండటంతో మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. చందాదారుల సొమ్ము సొంతానికి... మార్గదర్శి దివాళా అంచుకు కేంద్ర చిట్ఫండ్స్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రామోజీరావు పాల్పడిన ఆర్థిక అక్రమాలతో చందాదారులు నిండా మోసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును రామోజీరావు నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వ్యాపార సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజస్లలో పెట్టుబడిగా పెట్టారు. మరికొన్ని నిధులను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా తరలించేశారు. దాదాపు 2 వేలకుపైగా ఉన్న చిట్టీ గ్రూపుల చందాదారులు చెల్లించే చందా మొత్తంలో కొంత మొత్తాన్ని అటూఇటూ రొటేషన్ చేస్తూ దశాబ్దాలుగా మోసం చేస్తూ వచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలు బయటపడటంతో 2022 నవంబరు నుంచి కొత్త చిట్టీలు నిలిచిపోయాయి. మరోవైపు భారీగా చందాదారుల సొమ్మును రామోజీ తమ పేరిట స్థిర, చరాస్తులుగా మార్చేశారు. దీంతో ప్రసుత్తం చిట్టీ గ్రూపుల్లో ఉన్న దాదాపు 50 వేల మంది చందాదారులకు ప్రైజ్మనీని చెల్లించలేక మార్గదర్శి చిట్ఫండ్స్ చేతులెత్తేసింది. గత్యంతరం లేక దిక్కులు చూస్తోంది. రాష్ట్రంలోని 37 బ్రాంచీల పరిధిలో దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్ మనీ చెల్లించడం లేదని సమాచారం. గత 9 నెలల్లో రూ.1,620 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. మరోవైపు రశీదు రూపంలో సేకరించిన అక్రమ డిపాజిట్ల మొత్తాన్ని కూడా కాలపరిమితి ముగిసినా చెల్లించడం లేదు. వెరసి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ బకాయి పడిందని సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్లు సమాచారం. సీఐడీ సత్వర స్పందన చందాదారుల ఫిర్యాదుపై సీఐడీ విభాగం సత్వరం స్పందిస్తోంది. ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయని నిర్ధారణ కాగానే మార్గదర్శి చిట్ఫండ్స్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే మూడు కేసుల్లో మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసింది. ‘ఘోస్ట్’ చందాదారుడి పేరిట భారీ అక్రమ దందాకు పాల్పడిన కేసులో చీరాల మార్గదర్శి బ్రాంచి మేనేజర్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. సీఐడీకి మార్గదర్శి చందాదారుల ఫిర్యాదుల్లో కొన్ని.. ►విజయనగరంలో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుడు ఒకరు మొత్తం రూ.6 లక్షలు విలువైన నాలుగు చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చిట్టీ పాట పాడి రెండు ఎల్ఐసీ బాండ్లను ష్యూరిటీగా సమర్పించారు. రూ.5 లక్షలు, రూ.2 లక్షలు విలువైన రెండు బాండ్లను ష్యూరిటీగా ఇచ్చారు. ఆ చిట్టీ గ్రూపుల కాలపరిమితి ముగిసి నెలలు గడుస్తున్నా ఆయనకు ఎల్ఐసీ బాండ్లను తిరిగి ఇవ్వడంలేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్ను ఎన్నిసార్లు కలిసినా అరణ్య రోదనగానే మారింది. ►విశాఖపట్నంలో ఒక చందాదారుడు రూ.40 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడిగా చేరారు. 20 నెలలు వాయిదాలు చెల్లించిన తరువాత రూ.8 లక్షల నష్టానికి అంటే రూ.32 లక్షలకు చిట్టీ పాడారు. కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆయనకు చిట్టీపాట మొత్తం (ప్రైజ్మనీ) చెల్లించడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్ సరైన సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఆ చిట్టీగ్రూపులో పెద్ద సంఖ్యలో నకిలీ చందాదారులు ఉన్నట్టు తెలిసింది. ఆ వాయిదాలను మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యం చెల్లించడం లేదని చందాదారుడికి తెలిసింది. దీనిపై బ్రాంచి మేనేజర్ను ప్రశ్నించగా.. నీకు దిక్కున చోట చెప్పుకో, చిట్టీ మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయాడు. ►బాపట్లలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో ఒకరు సభ్యుడిగా చేరారు. కొన్ని నెలలు పాటు రూ.40 వేలు వాయిదాలు చెల్లించిన తరువాత ఆయన గ్రూప్ నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో మరొకరిని చందాదారుడిగా చేర్చారు. ప్రత్యామ్నాయ చందాదారుడిని చేర్చుకున్న తరువాత వైదొలగిన చందాదారునికి అప్పటికే చెల్లించిన వాయిదాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ఆ మొత్తం వెనక్కి ఇవ్వడం లేదు. దీనిపై బ్రాంచి మేనేజర్ను ప్రశ్నించగా చందాదారుడే తిరిగి మార్గదర్శి చిట్ఫండ్స్కు రూ.25 వేలు చెల్లించాలని దబాయిస్తున్నారు. ►వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒకరు నాలుగు చిట్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన చందా వాయిదా చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా రోజుకు రూ.500 చొప్పున జరిమానా వసూలు చేశారు. ఆ చందాదారుడు ఓ చిట్టీ గ్రూపులో పాట పాడి మూడు నెలలు దాటినా ప్రైజ్మనీ ఇవ్వడం లేదు. నిబంధనల మేరకు ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదు. దీనిపై సంబంధిత బ్రాంచి మేనేజర్ను ప్రశ్నించగా కంపెనీలో ప్రస్తుతం డబ్బులు లేవని అనధికారికంగా చెప్పడంతో చందాదారుడు నిర్ఘాంతపోయారు. ►విశాఖలో మరో చందాదారుడు రూ.5 లక్షలు చిట్ గ్రూపులో చేరి 38 నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లించారు. తన కుమారుడి చదువు కోసం చిట్టీ పాడేందుకు వెళ్లగా ఆయన పాడేసి డబ్బులు తీసేసుకున్నట్టు రికార్డుల్లో కనిపించింది. ఆయన పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమాన్యమే పాట పాడేసి డబ్బులు తీసేసుకున్నట్లు తెలిసింది. హతాశుడైన చందాదారుడు బ్రాంచి మేనేజర్ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వడం లేదు. (((అదో విష వలయం..! ))) మార్గదర్శి చిట్ఫండ్స్ తమ చందాదారులను పక్కా పన్నాగంతో అష్టదిగ్బంధనం చేస్తోంది. వారిని శాశ్వత రుణగ్రహీతలుగా మార్చేస్తూ వారి సంపాదననే కాకుండా ఆస్తులను కూడా కాజేస్తోంది. కొందరు చందాదారులను అనధికారికంగా పలు చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరుస్తోంది. ఆ విషవలయం నుంచి తప్పించుకోవడం చందాదారుల తరం కావడం లేదు. ఓ బాధితుడు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల బాగోతం బయటపడింది. ►ఓ చందాదారుడు మొత్తం రూ.4.72 కోట్ల విలువైన చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన రూ.3.33 కోట్ల విలువకు చిట్టీ పాటలు పాడారు. అంటే ఆయనకు రూ.3.33 కోట్లు చిట్టీ పాటల మొత్తం (ప్రైజ్మనీ)గా రావాలి. కానీ ఆయనకు మార్గదర్శి చిట్ఫండ్స్ చేతిలో పెట్టింది ఎంతో తెలుసా?కేవలం రూ.23లక్షలు. నివ్వెరపోయినచ ఆయన ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆ చందాదారుడికి తెలియకుండా ఆయన్ను ఎందరో చందాదారులకు ష్యూరిటీదారుడిగా నమోదు చేసేశారు. ►గతంలో ఆయనతో ఖాళీ కాగితాలపై తీసుకున్న సంతకాలతోపాటు మరికొన్ని సంతకాలను ఫోర్జరీ చేసి ఇరికించారు. ఆయన 65 చిట్టీ గ్రూపుల్లో సభ్యుడిగా చేరితే మార్గదర్శి చిట్ఫండ్స్ రికార్డుల్లో మాత్రం 90 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు నమోదు చేశారు. అంటే ఆయన సభ్యుడిగా చేరని 25 చిట్టీ గ్రూపులకు కూడా బకాయి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రైజ్మనీలో కోత విధించారు. దీనిపై ఆ చందాదారుడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నమోదైన 3 కేసులివీ... ►సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారుడిగా చేర్చారు. బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా ఆయన చందా చెల్లించినట్టు కనికట్టు చేశారు. ఆయన పేరిట ప్రతి నెల డివిడెండ్తోపాటు ఒక నెల ప్రైజ్మనీ మొత్తాన్ని కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ తమ ఖాతాలో వేసుకుంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే డివిడెండ్లు, ప్రైజ్మనీ కొల్లగొట్టి ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. తమ ఆధార్ కార్డును దుర్వినియోగంచేయడంతోపాటు తమకు తెలియకుండా చందాదారుడిగా చేర్చడంపై బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు చీరాల పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం మార్గదర్శి చీరాల శాఖ మేనేజర్ సురేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ►అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తరువాత రూ.4,61,989కు చిట్టీ పాట పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని ఆయన ష్యూరిటీ ఇచ్చిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని ఆయన మొత్తుకున్నా బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలను చూపించి బెదిరించారు. ఆ కాపీలు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ►కోరుకొండ విజయ్కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించిన తరువాత 2020 జూన్లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్ నిరాకరించారు. విజయ్కుమార్ తన స్నేహితుడు మల్లికార్జునరావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ప్రైజ్మనీ ఇవ్వలేమని చెప్పారు. నిజానికి మల్లికార్జునరావు చిట్టీ గడువు అప్పటికే తీరిపోయింది. తనను మార్గదర్శి యాజమాన్యం మోసం చేసిందని విజయ్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
‘ఘోస్ట్’ చందా.. మార్గదర్శి దందా!
సాక్షి, అమరావతి: ఈయన పేరు సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామస్తుడు. బాపట్ల జిల్లా చీరాలలోని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఓ చిట్టీ గ్రూపులో చందాదారుగా నమోదయ్యారు. ఈయన ఏనాడూ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయానికి వెళ్లలేదు. మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుగా చేరనే లేదు. కానీ చీరాల మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో మాత్రం ఆయన్ను చందాదారుగా నమోదు చేయడం గమనార్హం. విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సైన నిజం. దేశంలో ఇంత వరకు ఏ చిట్ ఫండ్స్ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం. ఇలా ఎందుకు చేశారంటే.. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని ‘ఘోస్ట్ చందాదారులు’ అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు. అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది. ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్ మనీ కూడా కొల్లగొడుతోంది. ఇలా వెలుగు చూసింది.. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాటు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్ ఫండ్స్పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘోస్ట్ చందాదారులతో భారీగా అక్రమాలు వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్ఫండ్ చట్టానికి విరుద్ధం. ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు. అప్పుల ఊబిలోకి చందాదారులు చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్ఫండ్స్ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్ ఫండ్స్కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది. అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్మనీ పొందుతున్నారు. ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్ఫండ్స్ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. వందకుపైగా ఫిర్యాదులు చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్ఫండ్స్పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్ఫండ్స్ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9493174065 కేటాయించింది. మూడు చోట్ల చీటింగ్ కేసులు నమోదు చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో మార్గదర్శి చిట్ ఫండ్స్పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్మెన్)లతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. ► సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ► అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ► కోరుకొండ విజయ్కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్ఫండ్స్ రాజమహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్ తిరస్కరించారు. విజయ్కుమార్ తన స్నేహితుడు మల్లికార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం మోసం చేసిందని విజయ్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఓ ‘నల్ల’ ఖజానా సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది. శని, ఆదివారాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్బుక్లోగానీ వారి పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది. కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం హడలెత్తిపోయింది. ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు. చీటింగ్కు ‘మార్గదర్శి’గా కడప మేనేజర్ కడప అర్బన్: మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల్లో కొత్త కోణం వెలుగుచూసింది. చందాదారులను మోసం చేసి అక్రమార్జనకు పాల్పడటంలో మార్గదర్శి యాజమాన్యమే కాదు.. సంస్థలో కొందరు మేనేజర్లు కూడా సిద్ధహస్తులేనన్న విషయాన్ని ఆ సంస్థ పూర్వపు ఉద్యోగులు వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ వైఎస్ఆర్ జిల్లాలో కడప బ్రాంచి మేనేజర్గా పనిచేస్తున్న డి. శేషుబాబు అక్రమార్జనను వివరిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీబీఐ విజయవాడ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఏజెంట్స్ కోడ్లతో చిట్లు భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించాడని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలివీ.. శేషుబాబు ఆయన సొంత ఏజెంట్ వి. శ్రీనివాసులరెడ్డి (ఏజెంట్ కోడ్ నం: సిపి0000160) కోడ్ ద్వారా ఎక్కువ మంది చిట్ సభ్యులను చేర్పించారు. ఎన్.వి బాలాజీ (ఏజెంట్ కోడ్ నం. జె0000088), గౌరి (ఏజెంట్ కోడ్ నం: జె0000167), ఎ.వి మహేష్ (ఏజెంట్ కోడ్ నం: సిపి000077)తో పాటు ఇంకా ఇతర ఏజెంట్ కోడ్లలో కూడా చిట్లు వేసి విపరీతంగా సంపాదించాడు. తనకు అనుకూలమైన వారికి తక్కువ బిడ్ అమౌంట్ కేటాయిస్తారు. మిగిలిన వారికి (స్టాఫ్) ఎక్కువ బిడ్ను మేనేజరే ఇంత అని నిర్ణయిస్తారు. పాట సమయానికి కస్టమర్ వచ్చినప్పుడు కూడా బిడ్ ఎక్కువగా వచ్చేట్లు ఉద్యోగులతో పాడిస్తాడు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో బంగారం, బెంగళూరులో సొంత ఇల్లు, కడపలో స్థలాలు, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు కూడా కొన్నారు. మిగిలిన మార్గదర్శి ఉద్యోగులను స్టాఫ్ కోడ్లతో చిట్స్ వేయమనీ వేధిస్తాడు. చెప్పినట్లు చేయకుంటే దుర్భాషలాడతాడు. దీంతో కొందరు సీనియర్ స్టాఫ్ వేరే సంస్థలకు వెళ్లిపోయారు. శేషుబాబు కొందరు ఖాతాదారులకు ఇవ్వాల్సిన గిఫ్ట్లను కూడా అమ్మేసుకున్నారు. ఆయనకు అనుకూలమైన ఉద్యోగులైన శివసతీష్, రిసెప్షనిస్టు వరలక్షుమ్మ కూడా ఏజెంట్ కోడ్లలో వేసుకోవడానికి ప్రాధాన్యత కల్పించాడు. శివసతీష్ చిట్టీ కమీషన్ డబ్బులను వడ్డీలకు ఇచ్చి మరింత సంపాదిస్తున్నాడు. పాట పాడటానికి ఎవ్వరూ రాకపోతే శేషుబాబు, శివసతీష్, వరలక్షుమ్మ కలిసి తక్కువ బిడ్ పోతున్నా ఎక్కువ బిడ్ పోయేలా చేస్తారు. దీనిద్వారా అసలైన చందాదారులకు వడ్డీ ఎక్కువ పడుతుంది. కస్టమర్లకు బిడ్ వచ్చిన తర్వాత కూడా డబ్బు ఇవ్వడానికి వీరు ఇబ్బందులకు గురిచేస్తారని వారు సీబీఐకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. మార్గదర్శి మేనేజర్ అరెస్ట్ సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్లో చిట్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్న వైనం బహిర్గతమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు బ్రాంచ్ మేనేజర్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి ఏఆర్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కోరుకొండ విజయ్కుమార్ మార్గదర్శిలో మోసంపై శనివారం టూటౌన్ సీఐ గణేష్కు ఫిర్యాదు చేశారు. విజయ్కుమార్ మార్గదర్శి చిట్స్లో 2019లో రూ.5 లక్షల చిట్ వేశారు. 50 నెలల కాల వ్యవధిలో నెలకు రూ.10 వేల చొప్పున చిట్కు నగదు చెల్లించాలి. తనకున్న ఆర్థిక అవసరాల రీత్యా ఆయన 2020 జూన్ 21వ తేదీన రూ.3 లక్షలకు చిట్ పాడారు. చిట్ డబ్బులు చెల్లించాల్సిన మార్గదర్శి మేనేజర్, బ్రాంచ్ అధికారులు ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. అదేమని ప్రశ్నిస్తే ఇద్దరి ష్యూరిటీ కావాలన్నారు. వాళ్ల కోరిక మేరకే ఇద్దరి ష్యూరిటీ తీసుకువచ్చారు. ఇప్పుడైనా చీటీ డబ్బులు ఇవ్వాలని కోరగా.. మీరు ఇతరులకు ష్యూరిటీ పెట్టారు. అది క్లియర్ చేస్తే మీ చీటీ డబ్బులు ఇస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. ష్యూరిటీకి సంబంధించిన డబ్బులు హెడ్ కానిస్టేబుల్ స్నేహితుడు చెల్లించేశారు. అయినా.. ఇతనికి రావాల్సిన రూ.3 లక్షలు ఇవ్వకుండా మూడేళ్లుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ సత్తి రవిశంకర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్ఫండ్ స్టార్టింగ్లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు ► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు. -
ఆందోళనలో మార్గదర్శి చందాదారులు
తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు. ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా? ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామోజీకి దెబ్బ! చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది. నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదొక్కటే దారి రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
‘మార్గదర్శి’ హ్యాండ్సప్
ఈనాడు రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది అయిన ‘మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ చేతులు ఎత్తేసిందా? చిట్టీల కాల పరిమితి తీరినప్పటికీ చందాదారులకు డబ్బులు చెల్లించడం లేదా? చెల్లించాల్సిన మొత్తాన్ని డిపాజిట్గా స్వీకరించి పబ్బం గడుపుతోందా? చాలా ఊళ్లలో చందాదారులు డబ్బుల కోసం మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ సంస్థ మేనేజర్లు ముఖం చాటేస్తున్నారా? కొందరికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ చందాదారుల సొమ్మును రామోజీరావు అక్రమంగా తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ఆ సంస్థ ఒట్టిపోయింది. చిట్టీలు పాడిన చందాదారులకు ప్రైజ్ మనీ చెల్లించలేక ముఖం చాటేస్తోంది. రాష్ట్రంలోని 37 బ్రాంచిల పరిధిలో వేలాది మంది చందాదారులకు చిట్టీల మొత్తం బకాయి పడింది. దాంతోపాటు అక్రమ డిపాజిట్ల కాల పరిమితి ముగిసినప్పటికీ చెల్లించకపోవడం గమనార్హం. మొత్తంగా కనీసం రూ.2 వేల కోట్లకుపైగా బకాయిలు పడటంతో మార్గదర్శి దుకాణం మూత పడే పరిస్థితికి వచ్చింది. స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా నిర్వహిస్తున్న సోదాల్లో ఆ సంస్థ అక్రమాలు భారీగా బయట పడుతున్నాయి. తద్వారా ఈ సంస్థ ఏ క్షణంలో అయినా పేలిపోయే నీటి బుడగ అని స్పష్టమవుతోంది. దివాలా అంచుకు మార్గదర్శి చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిధుల రొటేషన్ నిలిచి పోవడంతో పాత చిట్టీల చందాదారులకు చిట్టీ పాటల మొత్తం (ప్రైజ్ మనీ) చెల్లించడం తలకు మించిన భారంగా పరిణమించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 9 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్మనీ సక్రమంగా చెల్లించలేకపోతోందని స్టాంపులు– రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో మార్గదర్శి చిట్ఫండ్స్కు 37 బ్రాంచీలు ఉన్నాయి. బ్రాంచికి సగటున 35 మంది చొప్పున చందాదారులకు చిట్టీల మొత్తం బకాయి పడింది. అంటే దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్ మనీ చెల్లించడం లేదు. నెలకు రూ.260 కోట్ల టర్నోవర్ ఉండే మార్గదర్శి.. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్ల వరకు చిట్టీ పాటల ప్రైజ్ మనీగా ఇవ్వాల్సి ఉంది. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించక పోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 9 నెలలకు రూ.1,620 కోట్ల వరకు బాకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. 2022 నవంబర్కు ముందు చిట్టీలు పాడిన చందాదారులకు పూర్తిగా ప్రైజ్ మనీ చెల్లించకుండా రశీదు రూపంలో అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరు నెలల నుంచి రెండేళ్ల కాల పరిమితితో అక్రమ డిపాజిట్లు సేకరించింది. కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ 9 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపి మొత్తంగా దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ బకాయి పడినట్టు సీఐడీ అధికారుల సోదాల్లో వెలుగు చూసినట్టు విశ్వసనీయ వర్గాల సమచారం. ఏమండీ.. డబ్బులెప్పుడిస్తారు? 9 నెలలుగా చిట్టీ పాటల మొత్తం చెల్లించకపోవడంతో పెద్ద సంఖ్యలో చందాదారులు మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారితోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్లో రశీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారు కూడా తమ సొమ్ము కోసం ప్రాధేయపడుతున్నారు. ‘ఏమండీ.. మీ ఇబ్బందులతో మాకు సంబంధం లేదు. మా డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పండి. మీరు తప్పులు చేయబట్టే మాకీ ఇబ్బందులు’ అంటూ బాధితులు నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు. అక్కడక్కడ ఒత్తిడి తెస్తున్న ఒక సామాజికవర్గం వారికి మాత్రం చిట్టీల మొత్తం చెల్లిస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఇది నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లోనూ అలజడి ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచిల నుంచి నిధులను ఆంధ్రప్రదేశ్లోని బ్రాంచిలకు మళ్లించాలని ఆ సంస్థ భావించినట్టు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్లో చందాదారులను ముంచేసినట్టుగానే తమ నిధులను కూడా అక్రమంగా మళ్లిస్తారేమోనని ఆ రాష్ట్రాల్లోని చందాదారులు ఆందోళన చెందుతున్నారు. వారు ఆ రాష్ట్రాల్లోని బ్రాంచి మేనేజర్లను తరచూ సంప్రదిస్తూ తమ చిట్టీ పాటల మొత్తం వెంటనే చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసు కేసులు నమోదైతే తట్టుకోలేమని మార్గదర్శి యాజమాన్యం బెంబేలెత్తుతోంది. మొత్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్కు అన్ని దారులు మూసుకుపోయి ఆర్థికంగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు. 50 వేల మంది పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలోని 37 బ్రాంచిల పరిధిలో మార్గదర్శి చిట్ఫండ్స్కు 2022 నవంబర్ నాటికి దాదాపు లక్ష మంది చందాదారులు ఉండేవారు. మార్గదర్శి అక్రమాలు బయట పడటంతో ఆ తర్వాత కొత్త చిట్టీలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో 20 వేల మంది కొత్త చందాదారులు నిలిచిపోయారు. పాత చందాదారులు లక్ష మందిలో దాదాపు 50 వేల మందికి సంబంధించిన చిట్టీల కాల పరిమితి ముగిసింది. మిగిలిన 50 వేల మంది చందాదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. డిఫాల్ట్ ముసుగులో దందా డిపాల్ట్ చందాదారుల ముసుగులో మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఒక చందాదారుడు ఒక నెల చందా చెల్లించాక 8 నెలలు చందాలు చెల్లించకపోతే ఆయన/ఆమె డిఫాల్టర్ అవుతారు. అటువంటి డిఫాల్ట్ చందాదారులను చిట్టీ పాటకు అనుమతించకూడదు. కానీ 9 నెలల తర్వాత ఆ డిఫాల్ట్ చందాదారుని నుంచి బకాయి పడిన 8 నెలల చందాలకు చెక్కులు తీసుకున్నట్టుగా చూపిస్తున్నారు. ఆ చందాదారుని చిట్టీ పాటకు అనుమతిస్తున్నారు. ఆ చిట్టీ పాట ఆ చందాదారునికే వచ్చేట్టుగా చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే... అసలు అక్కడ డిఫాల్ట్ చందాదారుని పేరిట మార్గదర్శి చిట్ఫండ్సే ఈ దందా నడుపుతోంది. ఎందుకంటే ఆ చందాదారు ఇచ్చినట్టు చూపిస్తున్న చెక్కులను ఎన్క్యాష్మెంట్ కోసం బ్యాంకులో జమ చేయడం లేదు. అంటే చెక్కులు ఇచ్చినట్టు చూపడం.. చిట్టీ పాటకు అనుమతించడం అంతా బోగస్ అని సీఐడీ సోదాల్లో వెల్లడైంది. ఆ ముసుగులో నల్లధనాన్ని భారీగా చలామణిలోకి తీసుకువస్తున్నారన్నది స్పష్టమైంది. మరోవైపు డిఫాల్ట్ చందాదారులను అనుమతించడంతో సక్రమంగా చందాలు చెల్లించే చందాదారులు డివిడెండ్ నష్టపోతున్నారు. సర్కారు ‘అటాచ్మెంట్’ నిర్ణయం అగ్రిగోల్డ్ సంస్థ తరహాలో చందాదారులకు సొమ్ము చెల్లించలేక మార్గదర్శి చిట్ ఫండ్స్ చేతులెత్తేస్తే.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టినట్టు సమాచారం. కీలక పత్రాలు స్వాధీనం మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో సీఐడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లెడ్జర్లు, తేదీలు లేకుండా పెద్ద సంఖ్యలో చెక్కులు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలు, చందాదారుల బకాయిలకు సంబంధించిన పత్రాలు మొదలైనవి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
ఆర్థికంగా పతనం అంచున మార్గదర్శి చిట్ ఫండ్స్
-
మార్గదర్శిలో రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం
-
‘మార్గదర్శి’.. మరో ‘అగ్రిగోల్డ్’..!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఒక మేడి పండు అన్న నిజం వెలుగు చూసింది. పొట్ట విప్పి చూస్తే ఆర్థిక అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఫోర్జరీ సంతకాలతో మోసాలు.., చందాదారులకు తెలియకుండానే చిట్టీ పాటలు.., మేనేజ్మెంట్ టికెట్లు పేరిట బురిడీలు.., ఏజెంట్ల ద్వారా కనికట్టు.., బ్రాంచిల నుంచి ప్రధాన కార్యాలయానికి అక్రమంగా నిధులు మళ్లింపు.., నిధుల్లేక ఖాళీగా ఉన్న బ్యాంకు ఖాతాలు.. ఇలా మార్గదర్శి చిట్ఫండ్స్ లోగుట్టు ఆధారాలతో సహా వెలుగు చూసింది. చందాదారుల సొమ్ముతో రామోజీరావు అక్రమ వ్యాపార సామ్రాజ్యం విస్తరణకు మార్గదర్శి చిట్ఫండ్స్ ఇం‘ధనం’గా ఉపయోగపడుతోందన్నది రూఢీ అయ్యింది. అదే సమయంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ సొంత ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా ఉందన్న అసలు వాస్తవం వెల్లడైంది. చందాదారుల సొమ్ముకు ఏమాత్రం భద్రత లేదన్న విషయం ఆధారాలతో సహా బయటపడింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మార్గదర్శి చిట్ఫండ్స్ మరో అగ్రిగోల్డ్ కానున్నదన్నది విస్పష్టమైంది. వేలాదిమంది మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు నిండా మునిగిపోయే ప్రమాదం ఉందన్న విషయం రూఢీ అయింది. రాష్ట్రంలో ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ 37 శాఖల్లో స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో సంస్థ ఆర్థిక అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. కేంద్ర చిట్ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద కూడా పలు నేరాలకు సంస్థ యాజమాన్యం పాల్పడినట్టు వెల్లడైంది. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలపై ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ఏ–1గా, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ ఏ–2గా, బ్రాంచి మేనేజర్లు (ఫోర్మెన్) ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసి, చార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఈ కేసు దర్యాçప్తులో భాగంగా స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల బృందాలు చేపట్టిన సోదాలు గురువారం అర్ధరాత్రి కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బోర్డు తిప్పేయడమే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో పలు విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామోజీరావు ఘనంగా చెప్పుకొనే ఈ సంస్థ ఆర్థికంగా కుదేలవుతుందనేందుకు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. సంస్థ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అధికారులు సోదాలు చేస్తున్న 37 శాఖల బ్యాంకు ఖాతాల్లో వాటి చందాదారుల నిధులు లేవని వెల్లడైంది. అంటే చందాదారులు చెల్లించిన డబ్బును అక్రమంగా ప్రధాన కార్యాలయానికి తరలించేశారు. ఆ నిధులు ప్రధాన కార్యాలయం బ్యాంకు ఖాతాలో ఉన్నాయా అంటే అక్కడా లేవు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా రామోజీరావు సొంత వ్యాపార సంస్థల్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లించేశారు. వెరసి రాష్ట్రంలోని 37 మార్గదర్శి శాఖల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఆ శాఖల చందాదారులు చిట్టీ పాటలు పాడిన సొమ్ము (ప్రైజ్ మనీ)ని చెల్లించే స్థితిలో సంస్థ లేదన్న విషయం సోదాల్లో తేలింది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్న పరిస్థితే అని కూడా స్పష్టమైంది. కొత్తగా చిట్టీ వేసే చందాదారులు చెల్లించే చందా మొత్తంతో పాత చిట్టీల చందాదారులు పాడిన ప్రైజ్మనీని చెల్లిస్తూ ఇన్నాళ్లూ సంస్థ కనికట్టు చేస్తోంది. కానీ కేంద్ర చిట్ఫండ్ చట్టం–1982ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు వేయడంలేదు. అంటే 9 నెలలుగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్త చిట్టీలు, కొత్త చందాదారులు, కొత్తగా చందా మొత్తాలు రాక డిసెంబర్ ముందు మొదలు పెట్టిన వేలాది చందాదారులకు చిట్టీపాట ప్రైజ్మనీ చెల్లించడం మార్గదర్శి చిట్ఫండ్స్కు తలకుమించిన భారంగా పరిణమించింది. మరో వైపు చందాదారులకు చిట్టీపాట మొత్తం చెల్లించకుండా వాటిని అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తోంది. కాలపరిమితి తీరిన డిపా జిట్లు చందాదారులకు తిరిగి చెల్లించాలి. అందుకు కూడా మార్గదర్శి చిట్ఫండ్స్ వద్ద నిధులు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైజ్మనీ, డిపాజిట్ల చెల్లింపు సందేహాస్పదంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మూసివేతకు ముందు అగ్రిగోల్డ్ సంస్థ ఏ దుస్థితిలో ఉందో.. ప్రస్తుతం మార్గదర్శి చిట్ఫండ్స్ అదే ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటోందన్నది ఆధారాలతో సహా బయటపడినట్టు సమాచారం. మార్గదర్శి భవిష్యత్లో కూడా కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ఏ క్షణంలోనైనా బోర్డు తిప్పేస్తే చందాదారులు, డిపాజిట్దారులు నిండా మునిగిపోయే ప్ర మాదం ఉందన్నది స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. చందాదారులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అన్నీ అక్రమాలే.. ఇక చిట్టీ గ్రూపుల్లో మేనేజ్మెంట్ టికెట్ల చందాను మార్గదర్శి చిట్ఫండ్స్ వాస్తవంగా చెల్లించడమే లేదన్నది కూడా ఆధారాలతో వెల్లడైంది. ఏదైనా చిట్టీ గ్రూపులో కొన్ని టికెట్లు (సభ్యులు) ఖాళీగా ఉండిపోతే వాటిని మేనేజ్మెంట్ పేరిట నమోదు చేస్తారు. ఆ టికెట్ల చందా మొత్తాన్ని సంస్థ యాజమాన్యం చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్ఫండ్స్ 37 బ్రాంచిల్లోనూ సంస్థ పేరిట ఉన్న టికెట్ల చందాను చెల్లించడమే లేదు. అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు ఏవీ రికార్డుల్లో నమోదు కానేలేదు. కానీ మేనేజ్మెంట్ టికెట్లకు చెల్లించాల్సిన డివిడెండ్లు, టికెట్ల పేరిట చిట్టీ పాట పాడి ప్రైజ్మనీని మాత్రం తీసుకుంటోంది. అంటే రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడైంది. మార్గదర్శి సహాయ నిరాకరణ స్టాంపులు – రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాలకు మార్గదర్శి చిట్ఫండ్స్ అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు యత్నించింది. అధికార బృందాలు లోపలికి రాకుండా సిబ్బంది వాగ్వాదానికి దిగారు. సోదాల సందర్భంగా కీలక రికార్డులు చూపించేందుకు సిబ్బంది నిరాకరించారు. అధికారుల బృందాలకు సహకరించవద్దని మార్గదర్శి ప్రధాన కార్యాలయం శాఖలకు ఫ్యాక్స్ ద్వారా ఆదేశించడం గమనార్హం. ఈనాడు పాత్రికేయులను మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగుల పేరిట కార్యాలయాల్లోపల మోహరించారు. వారు సోదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈనాడు ప్రధాన కార్యాలయానికి చేరవేశారు. వారిచ్చిన సమాచారాన్ని వక్రీకరిస్తూ మీడియాలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా అధికారుల బృందాలను బ్లాక్ మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ విధంగా సోదాలను అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ అధికారుల బృందాలు నిబంధనలను పాటిస్తూ సోదాలు కొనసాగిస్తున్నాయి. ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా అక్రమాలు మార్గదర్శి చిట్ఫండ్స్ దశాబ్దాలుగా యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతోందన్నది పూర్తి ఆధారాలతో ఈ సోదాల్లో వెల్లడైంది. ఆ సంస్థ కేవలం చిట్ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలే కాదు.. ఐపీసీ చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడుతోంది. ప్రధానంగా చందాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. చిట్టీ గ్రూపుల పాటలు నిర్వహిస్తే కనీసం ఇద్దరు సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ కోరం కూడా లేకుండానే చిట్టీ పాటలు నిర్వహిస్తోంది. అందుకోసం చందాదారులు వచ్చినట్టుగా వారి సంతకాలను మినిట్స్ బుక్లో ఫోర్జరీ చేస్తోంది. అంతేకాదు కొందరు చందాదారులు వారు రాలేనందున వారి తరపున చిట్టీ పాటలో పాల్గొనేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ ఏజెంట్లకు అనుమతి (ఆథరైజేషన్) ఇచ్చినట్టుగా పత్రాలు కనిపించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ చందాదారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్టుగా అధికార బృందాలు గుర్తించాయి. ఆ సంతకాలు ఉన్న చందాదారులను అధికారులు సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. అసలు తాము ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వనేలేదని, తాము రాకున్నా వచ్చినట్టు మినిట్స్ బుక్లో నమోదు చేయడం ఏమిటని ఆ చందాదారులు తిరిగి ప్రశ్నించారు. అవి తమ సంతకాలు కావని, ఫోర్జరీవి అని స్పష్టం చేశారు. ఆ చందాదారుల అసలు సంతకాలను మార్గదర్శి చిట్ఫండ్స్ రికార్డుల్లో ఉన్న సంతకాలతో పోల్చి చూడగా అవి ఫోర్జరీ అనే విషయం స్పష్టమైంది. ఆ విధంగా ఏకంగా 70 శాతం చందాదారుల సంతకాలు ఫోర్జరీయేనని అధికారులు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి చిట్ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. కీలక పత్రాలు స్వాదీనం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలు, ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్్కలను జప్తు చేసి పంచనామా నిర్వహించారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా చందాదారుల వాంగ్మూలాలను నమోదు చేశారు. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్టైంది. ఈ సోదాలు శుక్ర, శనివారాలు కూడా కొనసాగే అవకాశాలున్నాయి. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
రామోజీ, శైలజాకిరణ్ మళ్లీ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్కు నోటీసులు జారీ చేశారు. వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్తోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మళ్లీ కూడా అదే వైఖరి రామోజీరావు, శైలజాకిరణ్కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు
-
మార్గదర్శి అక్రమాలపై చర్యలు ఉండకూడదా ?
-
మార్గదర్శిలో తీవ్రమైన అవకతవకలు
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్లో జరుగుతున్నవన్నీ తీవ్ర అంతర్గత అవకతవకలని, వాటి గురించి చందాదారులకు తెలిసే అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అందుకే వాటిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించింది. చందాదారులు ఫిర్యాదు చేయనంత మాత్రాన, మార్గదర్శి అక్రమాలు, అవకతవకలను ప్రశ్నించకూడదు, చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ గ్రూపుల మూసివేత ఏమాత్రం ఏకపక్ష నిర్ణయం కాదన్నారు. చట్టపరమైన తీవ్ర ఉల్లంఘనలను గుర్తించాకే 2022 డిసెంబర్లో ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి వివరణ కోరామన్నారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. అందుకు కారణాలను వివరిస్తూ మళ్లీ నోటీసు ఇచ్చామని తెలిపారు. అయినా కూడా మార్గదర్శి య«థేచ్ఛగా ఉల్లంఘనలను కొనసాగిస్తూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల నిలుపుదల విషయంలో అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసు ఇచ్చామన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా తాము వ్యవహరిస్తున్నట్లు మార్గదర్శి చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు. మార్గదర్శి వ్యాజ్యాలకు విచారణార్హత లేదు.. ఉల్లంఘనలను గుర్తించినప్పుడు.. వాటి విషయంలో తనంతట తాను (సుమోటో)గా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు చట్టం కల్పిస్తోందని ఏజీ శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు. చిట్ రిజిస్ట్రార్లు చట్టప్రకారం తమకున్న సుమోటో అధికారాన్ని ఉపయోగించి చర్యలకు ఉపక్రమించారన్నారు. 2008లో ఇచ్చిన జీవో ప్రకారం రిజిస్ట్రార్లకు అధికారాలను అప్పగించారని, చిట్ఫండ్ చట్టంలోని సెక్షన్ 48 (హెచ్) కింద చిట్ గ్రూపులను నిలిపేసేందుకు చర్యలు తీసుకునే సుమోటో అధికారం సైతం డిప్యూటీ రిజిస్ట్రార్లకు ఉందన్నారు. ప్రస్తుతం తాము జారీ చేసింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మార్గదర్శికి ఏమాత్రం అవకాశం లేదని తెలిపారు. అందువల్ల ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విస్తృత ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోర్టును అభ్యర్థించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు ముగించడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రకాశం జిల్లా చిట్ గ్రూపు వ్యవహారంలో న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ జారీ చేసిన పబ్లిక్ నోటీసుపై మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్లు వాదనలు వినిపించారు. బహిరంగ నోటీసు అమలును నిలిపేసి, ఆ నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
ఉండవల్లి అరుణ కుమార్ రామోజీ పై సంచలన వ్యాఖ్యలు...
-
మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం
-
స్తంభించిన మార్గదర్శి చిట్ఫండ్ వెబ్సైట్.. ఖాతాదారుల్లో అనుమానాలు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్ స్తంభించింది. నిర్వహణ సమస్య వలన నిలిచిపోయినట్లు మార్గదర్శి పేర్కొంది. త్వరలో పునరుద్ధరిస్తామంటూ మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ వెల్లడించింది. అకస్మాతుగా మార్గదర్శి వెబ్సైట్ స్తంభించడంపై ఖాతాదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం.. ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీఐడీ వెల్లడించింది. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ పేర్కొంది. చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్ -
ఇదో కార్పొరేట్ ఫ్రాడ్.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మార్గదర్శి వ్యవహారంలో అనేక అక్రమాలు గుర్తించామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని పేర్కొన్నారు. మార్గదర్శిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, సీఐడీ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ‘‘మార్గదర్శిపై నమోదైన ఏడు క్రిమినల్ కేసులపై విచారణ చేస్తున్నాం. ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులు అటాచ్ చేస్తూ హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆర్డర్స్ నంబర్ 104,116ల ద్వారా మొత్తంగా 1035 కోట్ల చరాస్తులు అటాచ్ చేశాం. కోర్డులోనూ అటాచ్ మెంట్ పిటీషన్ దాఖలు చేశాం. రెండు క్రిమినల్ కేసులలో 15 మందిపై చార్జిషీట్ వేశాం. ఈ రెండు కేసుల్లో ఏ1 రామోజీ రావు, ఏ2 శైలజాకిరణ్ తదితరులపై చార్జి షీట్ నమోదైంది’’ అని సీఐడీ ఎస్పీ పేర్కొన్నారు. చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? ‘‘మోసం, డిపాజిట్లు మళ్లించడంపై చిట్ ఫండ్ యాక్ట్గా కేసులు నమోదు చేశాం. మిగిలిన ఐదు కేసులలో విచారణ చివరి దశకి వచ్చింది. త్వరలోనే ఆ కేసుల్లోనూ ఛార్జి షీట్ నమోదు చేస్తాం. మార్గదర్శి చిట్ఫండ్ డిపాజిట్ దారులను మోసం చేసి నిధులు మళ్లించారు. డిపాజిట్ దారులు సంతకాలు పెట్టే ముందే పూర్తిగా కాగితాలు చదవాలి. డిపాజిట్ దారులు మోసపోకుండా మీడియా కూడా అవగాహన కలిగించాలి. ఇది కార్పొరేట్ ఫ్రాడ్’’ అని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. -
డిపాజిట్ దారుల సొమ్ముపై సుప్రీం కోర్టు జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
మార్గదర్శి కేసు: ఆగస్టు 4కి వాయిదా
-
మార్గదర్శి కేసు.. నేరం ఏపీలోనే జరిగింది!
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసు విచారణ వాయిదా పడింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ కేసు విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సిటీ రవికుమార్ , జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం సోమవారం తెలిపింది. ఇవాళ్టి వాదనల సందర్భంగా.. చిట్ ఫండ్ పేరుతో నిధులను సేకరించి దారి మళ్ళించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోనే నేరం జరిగిందని, కాబట్టి.. కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని వాదించారు. అయితే.. చిట్ ఫండ్ నిధులను హైదరాబాదు నుంచి మ్యూచువల్ ఫండ్ లోకి తరలించారని వాదించారు మార్గదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్ లోనే ఉంది కనుక తెలంగాణలోనే విచారణ జరపాలని వాదించారు. దీంతో.. ట్రాన్స్ఫర్ పిటిషన్లతో కలిపి ఈ కేసు విచారణ చేస్తామని పేర్కొన్న ధర్మాసనం, ఆగష్టు 4వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. -
మార్గదర్శి కేసు: రామోజీరావుకు షాక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్లో మోసాలపై మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ! -
మార్గదర్శి కేసు: నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: మార్గదర్శి చిట్ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మార్గదర్శి చిట్ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హైకోర్ట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ వెంకటనారాయణ భట్టిలతో కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, గత విచారణ సందర్భంగా ఆర్టికల్ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వివరించారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నేటికి(జులై 18కి) వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. -
మార్గదర్శిలో రూ.కోటి దాటి డిపాజిట్ చేసినవారు వేలల్లో