Parupalli Kashyap
-
ఎంత కాలం విదేశీ కోచ్లను తెచ్చుకుంటారు?.. జీతాలు పెంచుతాం!
భారత బ్యాడ్మింటన్ మాజీ నంబర్వన్, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత అనూప్ శ్రీధర్ రిటైర్మెంట్ తర్వాత.. దాదాపు దశాబ్ద కాలంగా కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్నేళ్లలో కోచ్గా అతడికి మంచి పేరు ఉంది. ఇటీవలి కాలంలో పీవీ సింధు, లక్ష్య సేన్లతో కూడా కలిసి అనూప్ పని చేశాడు. ఇప్పుడు అనూప్ సింగపూర్ జాతీయ జట్టు కోచింగ్ బృందంలో భాగం అవుతున్నాడు. సింగపూర్ టీమ్కు అదనపు సింగిల్స్ కోచ్గా అనూప్ శ్రీధర్ నియమితుడయ్యాడు. ఇక వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ కూడా ఏడాది క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికి అమెరికాలోని ఒక క్లబ్కు కోచ్గా వెళ్లాడు. కోచ్గా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్లకు మెంటార్గా ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీ విజయాల్లో భాగంగా ఉన్న మొహమ్మద్ సియాదతుల్లా కూడా ఇదే బాటలో నడిచారు.సంవత్సరం క్రితమే అమెరికాలోని ఒరెగాన్ అకాడమీలో కోచ్గా చేరాడు. శ్రీధర్, సియాదత్ భారత్కు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లతో పని చేసిన వారే. అయితే ఆర్థికపరంగా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి వీరికి తగినంత మద్దతు లభించలేదు. కోచ్లకు ‘బాయ్’ ఇచ్చే తక్కువ ఫీజుతో పని చేస్తూ వచ్చిన వీరు తగిన అవకాశాల కోసం వలస వెళ్లారు. పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా కోచింగ్ వైపుఇప్పుడు పారుపల్లి కశ్యప్, గురుసాయిదత్ కూడా ఆడటాన్ని పక్కన పెట్టి కోచింగ్ వైపు వచ్చారు. ఇప్పటికే శ్రీకాంత్, ప్రణయ్, ప్రియాన్షు రజావత్లకు ట్రైనర్లుగా వ్యవహరిస్తున్న వీరు... చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంలో యువ ఆటగాళ్లు తరుణ్ మన్నేపల్లి, అన్మోల్ ఖర్బ్, అనుపమ ఉపాధ్యాయ, రక్షితలకు శిక్షణ ఇస్తున్నారు.మరోవైపు మాజీ ఆటగాళ్లు మను అత్రి, సుమీత్ రెడ్డి కూడా కోచింగ్ వైపు వచ్చేయగా... సీనియర్ కోచ్ అరుణ్ విష్ణు భారత జట్టును వీడి నాగపూర్లోని సొంత అకాడమీకి వెళ్లిపోయాడు. ప్రస్తుత స్థితిలో శిక్షణకు భారత కోచ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నా... ‘బాయ్’ ఇచ్చే స్వల్ప జీతాల కారణంగా వారు ముందుకు వచ్చి భారత జట్టులో కలిసి పని చేయలేకపోతున్నారు. మాజీ ఆటగాళ్లను చూస్తే అరవింద్ భట్, చేతన్ ఆనంద్, గుత్తా జ్వాల సొంత అకాడమీలు నిర్వహించుకుంటున్నారు. ‘భారత కోచ్లకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎవరూ ఎక్కువ కాలం సాగలేరు. దాదాపు 10 వేల డాలర్ల నెల జీతానికి విదేశీ కోచ్లను తీసుకోవడంలో తప్పు లేదు.బాగా సంపాదించుకోవచ్చుఅయితే వారిలో నాలుగో వంతు కూడా భారత కోచ్లకు ఇవ్వడం లేదు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ సమయంలోనే జీతాలు పెంచి రూ.50 వేలు చేశారు. ఇది చాలా తక్కువ మొత్తం. అందుకే భారత జట్టుతో కలిసి పని చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భారత కోచ్గా వ్యవహరించడం గొప్ప గౌరవమే. కానీ ఏ అమెరికాలాంటి దేశానికి వెళితే బాగా సంపాదించుకోవచ్చు. సొంత అకాడమీ పెట్టినా మంచి అవకాశాలుంటాయి’ అని అరుణ్ విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల భారత మహిళల సింగిల్స్ కోచ్గా ఇర్వాస్యా ఆది ప్రతమ (ఇండోనేసియా), డబుల్స్ కోచ్గా టాన్ కిమ్ హర్ (మలేసియా)లను ‘బాయ్’ నియమించింది. ఎంత కాలం విదేశీ కోచ్లను తెచ్చుకుంటారు?‘సాంకేతిక అంశాలు నేర్పించడం మాత్రమే కోచ్ పని కాదు. టోర్నీలకు సంబంధించి సరైన మార్గనిర్దేశనం, గాయాల విషయంలో జాగ్రత్తలు వంటి అన్ని అంశాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైనా మన భారత కోచ్లపై విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. రిటైర్డ్ ఆటగాళ్లకు సరైన గుర్తింపు, జీతాలు, అవకాశాలు ఇస్తే మనమూ అత్యుత్తమ ప్లేయర్లను తయారు చేయవచ్చు. ఎంత కాలం విదేశీ కోచ్లను తెచ్చుకుంటారు’ అని పారుపల్లి కశ్యప్ ప్రశ్నించాడు.జీతాలు పెంచుతాంతాజా పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా... దీనిని చక్కదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘నాలుగు నెలల క్రితం భారత జట్టు సహాయక సిబ్బంది జీతాలు పెంచాం. ట్రైనర్లు, ఫిజియోథెరపిస్ట్లు అప్పటి వరకు తీసుకుంటున్న మొత్తంతో పోలిస్తే 50–75 శాతం పెంచాం. ఇక తర్వాతి వంతు కోచ్లదే. జాతీయ క్యాంప్లో ఉన్న కోచ్ల జీతాలను త్వరలోనే సవరిస్తాం’ అని ఆయన చెప్పారు. చదవండి: విరాట్ కోహ్లి కీలక ప్రకటన -
మావారి తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్.. (ఫొటోలు)
-
భార్య అంటే శ్రీకాంత్కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్ను శ్రీకాంత్ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్గా ఎదిగిన శ్రీకాంత్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్లో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్.. స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్: భర్తతో కలిసి సైనా సందడి (ఫొటోలు)
-
Anant -Radhika: రాయల్ టెంట్ అదుర్స్! వీడియో షేర్ చేసిన సైనా
Anant Ambani Radhika Pre Wedding: అంబానీల వారసుడు అనంత్- రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సెలబ్రిటీ లోకం తరలివెళ్లింది. క్రీడా, సినీ ప్రముఖులు గుజరాత్లో సందడి చేస్తూ అంబానీ కుటుంబ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్దంపతులు కూడా జామ్నగర్కు విచ్చేశారు. ఈ నేపథ్యంలో సైనా.. ‘‘పర్ఫెక్ట్ అంబానీ వెడ్డింగ్’’ పేరిట తాము ఉండబోయే రాయల్ టెంట్ టూర్ వీడియో షేర్ చేసింది. ముందస్తు పెళ్లి వేడుకల కోసం వచ్చే అతిథుల కోసం దాదాపు అరవై దాకా ఈ టెంట్లు వేయించినట్లు తెలుస్తోంది. పచ్చని మైదానంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ తాత్కాలిక నివాసాన్ని నాలుగు గదులుగా విభజించారు. ఇందులో లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్రూం హైలైట్గా నిలిచాయి. ఇండోర్ ప్లాంట్లను కూడా జతచేసి మనసుకు హాయి కలిగించేలా.. అన్ని రకాల సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దారు. సైనా నెహ్వాల్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నుంచి రామ్చరణ్- ఉపాసన దంపతులు కూడా అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు జామ్నగర్కు వెళ్లారు. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
బంజారాహిల్స్లో కెఫేలో సందడి చేసిన తారలు (ఫొటోలు)
-
తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది. అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు. కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్కు టార్చ్బేరర్లా నిలిచిన స్టార్ షట్లర్. అమ్మా నాన్న అండతో.. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్గా మార్చలేవని తండ్రికి అనిపించింది. పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు. నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. హర్వీర్కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది. సైనా ప్లేయర్గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు. ఎవరి వల్లా కాలేదు కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు. అయినా సరే ఒక ప్లేయర్గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి. అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. నడిచొచ్చిన విజయాలు సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది. 15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి. చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే. కొన్ని ఘనతలు... ►ఒలింపిక్ కాంస్య పతకం ►వరల్డ్ చాంపియన్షిప్లో ఒక రజతం, ఒక కాంస్యం ►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ►ఆసియా క్రీడల్లో కాంస్యం ►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం ► సూపర్ సిరీస్ ఫైనల్స్లో రజతం భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు ► పద్మశ్రీ, పద్మభూషణ్లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్రత్నలతో సైనా నెహ్వాల్ను గౌరవించింది. ఆ పతకం ఒక మణిహారం.. 2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగతం.. 2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్
తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 40వ ర్యాంకర్ కశ్యప్ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. కశ్యప్నకు 3 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–ఇషాన్ (భారత్) జంట 19–21, 12–21తో హూ పాంగ్ రోన్–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్ యా– సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Taipei Open 2022: క్వార్టర్స్లో కశ్యప్
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. డబుల్స్లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్డ్ డబుల్స్లో దూసుకెళుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది. -
51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్.. క్వార్టర్కు కశ్యప్
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు. కశ్యప్ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్ చేతిలో ఓడింది. మిక్సడ్ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. -
కశ్యప్, మిథున్ ముందంజ.. మాళవికకు తొలి రౌండ్లోనే చుక్కెదురు
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్, మిథున్ మంజునాధ్ తొలి రౌండ్లో సునాయాస విజయాలు సాధించగా.. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్కు చుక్కెదురైంది. హైదరాబాద్ కుర్రాడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో స్థానిక ఆటగాడు చి యు జెన్పై 24-22, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా.. మిథున్ మంజునాథ్ 21-17, 21-15 తేడాతో కిమ్ బ్రున్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. వీరితో పాటు కిరణ్ జార్జ్, ప్రియాన్షు రజత్లు కూడా తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్ 21-10, 15-21, 14-21 తేడాతో తైపీ షట్లర్ లియాంగ్ టింగ్ యు చేతిలో ఖంగుతినగా.. కిసోనా సెల్వదురై సమియా ఫరూఖీ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్ల ముందుంజ.. పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీలు అర్జున్-కపిల, ఇషాన్ బట్నాగర్-కృష్ణప్రసాద్లు తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై విజయాలు నమోదు చేయగా.. రవికృష్ణ-ఉదయ్ కుమార్, గర్గా-పంజలా జోడీలు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి. మిక్సడ్ డబుల్స్లో భారత స్టార్ జోడీ ఇషాన్ బట్నాగర్-తానిషా క్రాస్టో .. స్వెత్లాన జిల్బర్మెన్-మిషా జిల్మర్మన్ జంటను ఓడించి ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. చదవండి: కామన్ వెల్త్ గేమ్స్కు ముందు భారత్కు భారీ షాక్..! -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్ అవుతుందో..
సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్వే’’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించిన విషయం విదితమే. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన సైనా భర్త కశ్యప్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనాను ఉద్దేశిస్తూ సిద్దార్థ్ చేసిన ట్వీట్పై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ని పంజాబ్లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండిస్తూ ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ఈ ఘటనను తాను ఖండిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ ఆమె ట్వీట్పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #Rihanna’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్ రచ్చకు దారి తీసింది. ఇప్పటికే సిద్ధార్థ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వెంటనే అతడి ట్వీట్ తొలిగించాలంటూ జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. సైనా తండ్రి కూడా సిద్ధార్థ్ ట్వీట్పై స్పందిస్తూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సోమవారం ట్విట్టర్లో సిద్ధార్థ్ ట్వీట్పై అసహనం వ్యక్తం చేశాడు. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful @Actor_Siddharth — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 చదవండి: Salmana Khan-Samantha Lockwood: సల్మాన్తో సీక్రెట్ డేటింగ్పై నటి సమంత క్లారిటీ సిద్ధార్థ్ను ట్యాగ్ చేస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ కాస్తా మంచి పదాలు ఎంచుకోండి. ఈ రితీలో మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా హర్టింగ్గా అనిపించింది. మీరు ఇవి కూల్ వర్డ్స్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు’ అంటూ సిద్ధార్థ్కు కశ్యప్ చురకలు అంటించాడు. అలాగే సైనా నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా ఇంటర్య్వూలో స్పందిస్తూ.. ‘అతడు ఏం చెప్పాడో ఖచ్చితంగా నాకు తెలియదు. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరుస్తాడని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 -
కశ్యప్కు గాయం... ఆరు వారాలు ఆటకు దూరం
భారత వెటరన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కామన్వెల్త్గేమ్స్ మాజీ చాంపియన్ అయిన ఈ తెలుగుతేజం గత నెలలో హైదరాబాద్లో జరిగిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో కాలి పిక్క కండరాల గాయానికి గురయ్యాడు. దీని నుంచి కోలుకునేందుకు 35 ఏళ్ల కశ్యప్కు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. తిరిగి మళ్లీ అతను మార్చిలో బరిలోకి దిగే అవకాశముంది. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
లక్ష్యసేన్కు నిరాశ
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్ 21–23, 15–21తో ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు. 54 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో లక్ష్యసేన్ తొలి గేమ్ను చేజేతులా కోల్పోయాడు. ఇరు ఆటగాళ్ల మధ్య ఆధిక్యం పలుమార్లు మారిన తొలి గేమ్లో లక్ష్యసేన్ ఒక దశలో 18–14తో ఆధిక్యంలో ఉన్నాడు. కీలక సమయంలో మొమోటా చాంపియన్ ఆటతో వరుసగా ఆరు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలోకి వచ్చాడు. వెంటనే తేరుకున్న లక్ష్యసేన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి 21–20తో గేమ్ పాయింట్కు వెళ్లాడు. మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించిన మొమోటా వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్లో మరింత దూకుడు కనబర్చిన జపాన్ షట్లర్ మ్యాచ్ను ముగించేశాడు. మరో పోరులో కశ్యప్ 11–21, 14–21తో లోహ్ కీన్ య్యూ (సింగపూర్) చేతిలో వరుస సెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–అర్జున్ ద్వయం 20–22, 13–21తో చోయ్ సొల్జ్యూ– కిమ్ వోన్హూ (కొరియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్లో ప్రసాద్–జుహి దేవాంగన్ జోడీ 12–21, 4–21తో జన్సెన్– లిండా ఎఫ్లర్ (జర్మనీ) జంట చేతిలో ఓడాయి. -
శ్రీకాంత్, కశ్యప్ ఇంటిముఖం
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ (భారత్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 11–21, 21–15, 12–21తో ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో... కశ్యప్ 13–21, 20–22తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు 21–11, 21–17తో సోనియా (మలేసియా)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–14, 21–12 తో బెన్యాప–నుంతకామ్ (థాయ్లాండ్) జోడీపై... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–10తో నిఖర్ గార్గ్ (ఇంగ్లండ్)–అనిరుధ (భారత్) జంటపై గెలిచాయి. టోర్నీకి ముందు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో ముగ్గురు భారత ఆటగాళ్లకు, సహాయక సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రాగా... మంగళవారం మళ్లీ నిర్వహించిన పరీక్షలలో అందరికీ నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. -
కరోనా బారిన కశ్యప్...
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. కశ్యప్తోపాటు భారత ఇతర షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ఆర్ఎంవీ గురుసాయిదత్, ప్రణవ్ చోప్రాలకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. ‘ఈ నలుగురు ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం ఈ నలుగురిలో ఒకరికి కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కశ్యప్, గురుసాయిదత్, ప్రణవ్, ప్రణయ్లకు పాజిటివ్ రాగా... కశ్యప్ భార్య, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు నెగెటివ్ వచ్చింది. కొన్నిసార్లు తొలి పరీక్షలో ఫాల్స్ పాజిటివ్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దాంతో కొన్ని రోజులు వేచి చూశాక మళ్లీ పరీక్షకు హాజరు కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. సోమవారం వీరందరూ మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటారు’ అని పుల్లెల గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 25న వివాహం చేసుకున్న గురుసాయిదత్ ప్రాక్టీస్ నుంచి విరామం తీసుకోగా... మిగతా ఆటగాళ్లు గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. -
నన్నెందుకు పక్కన పెట్టారు
హైదరాబాద్: జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు తనను ఎంపిక చేయకపోవడంపై సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏ ప్రాతిపదికపైన ఎనిమిది మందికే అవకాశం ఇచ్చారని అతను సూటిగా ప్రశ్నించాడు. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ క్యాంప్ జరుగుతోంది. ఇందులో 2021 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందినే (సింధు, సైనా, శ్రీకాంత్, సాయిప్రణీత్, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, చిరాగ్, సాత్విక్) శిక్షణ కోసం ఎంపిక చేశారు. తాను కూడా ప్రస్తుతం ఒలింపిక్స్కు అర్హత సాధించే ప్రయత్నంలో ఉన్నానని, ఆ అవకాశం తనకూ ఉందని అతను గుర్తు చేశాడు. ‘నా దృష్టిలో ఎనిమిది మందినే అనుమతించడంలో అసలు అర్థం లేదు. నాకు తెలిసి ఒలింపిక్స్కు ముగ్గురు మాత్రమే ఇప్పటికే దాదాపుగా అర్హత సాధించారు. మిగిలినవారు అర్హత సాధించడం అంత సులువేం కాదు. ఈ జాబితాలో శ్రీకాంత్, మహిళల డబుల్స్ జోడి కూడా ఉన్నారు. సాయిప్రణీత్, శ్రీకాంత్ల తర్వాత నేను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 23వ స్థానంలో ఉన్నాను. నా పేరును ఎందుకు పరిశీలించలేదు’ అని కశ్యప్ అన్నాడు. ‘సాయ్’ స్పందించలేదు... ఈ జాబితాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూపొందించిందని, అందుకే కోచ్ గోపీచంద్ సలహాపై వారినే ఈ విషయంలో ప్రశ్నించినా... సంతృప్తికర సమాధానం రాలేదని కశ్యప్ అసహనం వ్యక్తం చేశాడు. ‘సాయ్ డీజీని నేను ఇదే విషయం అడిగాను. మరో 7–8 అర్హత టోర్నీలు మిగిలి ఉన్న ప్రస్తుత దశలో ఈ ఎనిమిది మందినే ఎంపిక చేయడానికి, తనను పరిగణలోకి తీసుకుపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించాను. ఒక రోజు తర్వాత ‘సాయ్’ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఉన్నతాధికారుల సూచనలతోనే ఈ పేర్లు చెప్పామని, వీరికి మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉన్నట్లుగా తాము భావించామని అన్నారు. ఆ ఎనిమిది మంది అనారోగ్యం బారిన పడకుండా ఒలింపిక్స్ వరకు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. అయితే వారంతా క్యాంప్లో ఉండటం లేదు. బయట తమకు నచ్చినవారిని కలుస్తున్నారు కూడా. మరి వారిని ఆరోగ్యంగా ఉంచుతామని అనడంలో అర్థమేముంది’ అని కశ్యప్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. గోపీచంద్ అకాడమీలో ప్రస్తుతం 9 కోర్టులు ఉంటే వేర్వేరు సమయాల్లో నలుగురు మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని... మిగిలిన సమయంలో తమకు శిక్షణకు అవకాశం ఇవ్వడంలో అభ్యంతరం ఏముందని అతను అన్నాడు. వీరి కోసం 9 మంది కోచ్లు, ఇద్దరు ఫిజియోలు కూడా పని చేస్తున్నారని గుర్తు చేసిన కశ్యప్... శిక్షణకు అవకాశం ఇవ్వకపోతే తాను ఒలింపిక్స్కు ఎలా అర్హత సాధించగలనని అతను తన ఆవేదనను ప్రకటించాడు. -
గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రీడల భవిష్యత్ గందరగోళంగా మారిందని భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు ఇప్పట్లో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు. ‘వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రపంచంలో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనాతో అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రతీది అనుమానంగానే అనిపిస్తోంది. వీటితో పాటు ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అన్ని క్రీడా సమాఖ్యలు తలపట్టుకుంటున్నాయి. కరోనాను ఎలా నివారించాలో స్పష్టంగా తెలిశాకే ఈ అనిశ్చితి దూరమవుతుంది’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ వ్యాఖ్యానించాడు. -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
ఐఓసీ... జోక్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అకాడమీలు అన్ని మూసేసిన ఈ పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. ‘ప్రాకీŠట్స్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ ఎలా? ఎక్కడ? ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు. ‘ఇంకా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
‘మంచి భార్య రావాలని కోరుకోలేదు’
‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన భార్య, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై ప్రేమ చాటుకున్నాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో సైనా- కశ్యప్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. కాగా దాదాపు పదేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా- కశ్యప్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని సైనా నివాసం ఓరియన్ విల్లాలో ఈ రాకెట్ స్టార్స్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం సినీ, క్రీడా ప్రముఖుల కోసం ఈ జంట నోవాటెల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక భారత బ్యాడ్మింటన్లో స్టార్గా ఎదిగిన సైనా.. ఈ విభాగంలో భారత్కు ఒలింపిక్ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్మాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నంబర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా సైనాగా అలరించనున్నారు. కాగా పారుపల్లి కశ్యప్ సైతం కీలక మ్యాచుల్లో విజయం సాధించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఇక వీరిద్దరు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి క్రీడా ప్రస్థానం మొదలుపెట్టారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram You are simply the most amazing woman in the world. I couldn’t ask for a better wife. Thanks for making the first year together so wonderful. I love you so much. Happy anniversary!! 😘😘❤️ A post shared by Kashyap Parupalli (@parupallikashyap) on Dec 16, 2019 at 11:09am PST -
సాయిప్రణీత్ శుభారంభం
ఫుజౌ (చైనా): ఆరంభంలో తడబడ్డా... వెంటనే తేరుకున్న భారత స్టార్ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 15–21, 21–12, 21–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ టామీ సుగియార్తోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. సుగియార్తోపై సాయిప్రణీత్కిది వరుసగా మూడో విజయం. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాయిప్రణీత్ తొలి గేమ్ను చేజార్చుకున్నా... తదుపరి రెండు గేముల్లో పూర్తి ఆధిపత్యం చలాయించాడు. నిర్ణాయక మూడో గేమ్లో సాయిప్రణీత్ ఆరంభంలో 0–3తో వెనుకంజలో నిలిచాక... ఒక్కసారిగా విజృంభించి వరుసగా 10 పాయింట్లు స్కోరు చేసి 10–3తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 1–1తో సమంగా ఉన్నారు. సాయిప్రణీత్తోపాటు హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 44 నిమిషాల్లో 21–14, 21–13తో ప్రపంచ 21వ ర్యాంకర్ సిథికోమ్ థమాసిన్ (థాయ్లాండ్)పై గెలిచాడు. ఈ విజయంతో ఇటీవల డెన్మార్క్ ఓపెన్లో థమాసిన్ చేతిలో ఎదురైన ఓటమికి కశ్యప్ బదులు తీర్చుకున్నాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ సమీర్ వర్మ 18–21, 18–21తో ప్రపంచ 28వ ర్యాంకర్ లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కశ్యప్ ఆడతాడు. 23 నిమిషాల్లోనే... మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. మంగళవారం ప్రపంచ చాంపియన్ పీవీ సింధు తొలి రౌండ్లో ఇంటిముఖం పట్టగా... సింధు సరసన సైనా నెహ్వాల్ కూడా చేరింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా కేవలం 23 నిమిషాల్లో 9–21, 12–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ కాయ్ యాన్ యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. గత నెలన్నర కాలంలో సైనా ఐదు టోర్నీలు ఆడగా... ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగతా నాలుగు టోరీ్నల్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 14–21తో వాంగ్ చి లిన్–చెంగ్ చి యా (చైనీస్ తైపీ) చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) 21–23, 19–21తో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
శ్రీకాంత్కు నిరాశ
పారిస్: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో రెండో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో... కశ్యప్ 11–21, 9–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 84 నిమిషాల్లో 22–20, 18–21, 18–21తో నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయారు. సైనా శుభారంభం... మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహా్వల్ 23–21, 21–17తో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 13–21, 18–21తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ (ఇంగ్లండ్) చేతిలో... అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–చే యుజుంగ్ (కొరియా) చేతిలో పరాయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 21–14తో జెలీ మాస్–రాబిన్ తబెలింగ్ (నెదర్లాండ్స్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 19–21, 22–20, 15–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–16, 13–21, 17–21తో లీ సో హీ–షిన్ సెయుంగ్ చాన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
ప్చ్... కశ్యప్
ఇంచువాన్ (దక్షిణకొరియా): కొరియా ఓపెన్లో భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ విజయ పరంపర సెమీఫైనల్తో ముగిసింది. టోర్నీలో సింధు, సైనా, సాయి ప్రణీత్ సహా మిగతా స్టార్ షట్లర్ల పోరాటం తొలి రౌండ్తోనే ముగిసినా... సెమీస్ వరకు వచ్చిన కశ్యప్కు ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్) అడ్డుకట్ట వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్లో ఈ హైదరాబాద్ ఆటగాడు 13–21, 15–21తో వరుస గేమ్ల్లో పరాజయం పాలయ్యాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ మొమోటా 40 నిమిషాల్లో కశ్యప్ను ఇంటిదారి పట్టించాడు. క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా ఒక్కో అడుగు వేస్తూ వచి్చన కశ్యప్ టాప్ సీడ్ ధాటికి సెమీస్లో నిలువలేకపోయాడు. తొలి గేమ్ ఆరంభమైన కాసేపటికే జపాన్ ఆటగాడు 9–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. మధ్యలో పాయింట్లు సంపాదించినా మొమోటా ముందు అవి సరిపోలేదు. రెండో గేమ్లో 7–2తో ఆధిపత్యం చాటిన టాప్సీడ్ కొన్ని అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయాడు. ఇదే అదనుగా కశ్యప్ 11–12 స్కోరుతో దీటుగా కదిలాడు. వెంటనే తేరుకున్న జపాన్ స్టార్ వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–13 స్కోరుకు చేరాడు. తర్వాత మ్యాచ్ గెలిచేందుకు అతడికి మరెంతోసేపు పట్టలేదు. కశ్యప్కు మొమోటా చేతిలో ఇది మూడో ఓటమి. -
సెమీస్లో కశ్యప్ ఓటమి
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ నుంచి భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ నిష్క్రమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో కశ్యప్ 13-21, 15-21 తేడాతో ప్రపంచ చాంపియన్ కెంటో మొమాటా(జపాన్) చేతిలో పరాజయం చెందాడు. తొలి గేమ్ను సునాయసంగా కోల్పోయిన కశ్యప్.. తిరిగి తేరుకోలేపోయాడు. దాంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు ఇరువురి మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా అందులో కూడా మొమాటాదే పైచేయిగా నిలిచింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేసి సెమీస్కు చేరినా.. మొమాటా ముందు తలవంచాడు. ఇటీవల నిలకడగా ట్రోఫీలు సాధిస్తున్న మొమోటాపై కశ్యప్ సంచలనం నమోదు చేస్తాడని ఎదురు చూసిన భారత బ్యాడ్మింటన్ అభిమానికి నిరాశే ఎదురైంది. మొమోటా తాజా గెలుపుతో ముఖాముఖి ఆధిక్యాన్ని 3-0కు పెంచుకున్నాడు. ఈ ఓటమితో కొరియా ఓపెన్లో భారత్ పోరాటం ముగిసింది. ఇక ఫైనల్లో తెయిన్ చెన్ చు(తైవాన్)తో మొమోటో తలపడతాడు. -
సెమీస్లో కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. సహచర భారత స్టార్ షట్లర్లు తొలి రౌండ్లోనే వెనుదిరిగినా... పతకం ఆశలను సజీవంగా ఉంచుతూ కశ్యప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేశాడు. నేటి సెమీస్ పోరులో కశ్యప్ ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమాటా (జపాన్)తో తలపడతాడు. -
క్వార్టర్స్లో కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం 56 నిమిషాల పాటు సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో కశ్యప్ 21–17, 11–21, 21–12తో డారెన్ ల్యూ (మలేసియా)పై విజయం సాధించాడు. తొలి గేమ్లో కశ్యప్ 15–10తో ఆధిక్యంలో నిలిచినా డారెన్ పోరాడటంతో స్కోరు 18–17కు చేరింది. అయితే వరుసగా మూడు పాయింట్లు సాధించి కశ్యప్ గేమ్ను గెలుచుకున్నాడు. రెండో గేమ్లో ఒక దశలో డారెన్ వరుసగా 12 పాయిం ట్లు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత నిర్ణాయక మూడో గేమ్లో కశ్యప్ మళ్లీ పుంజుకున్నాడు. 12–2తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాదీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మ్యాచ్ను గెలుచుకున్నాడు. -
క్వార్టర్స్లో పారుపల్లి కశ్యప్
ఇంచియోన్ (దక్షిణ కొరియా): బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్లో భాగంగా కొరియా ఓపెన్లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్లో కశ్యప్ 21-17, 11-21, 21-12 తేడాతో లూయీ డారెన్ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్కు చేరాడు. తొలి గేమ్లో పోరాడి గెలిచిన కశ్యప్.. రెండో గేమ్లో దారుణంగా ఓటమి పాలయ్యాడు. రెండో గేమ్లో డారెన్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్లతో ఆకట్టుకోవడంతో కశ్యప్ ఆ గేమ్ను చేజార్చుకున్నాడు. ఆపై తిరిగి పుంజుకున్న కశ్యప్.. డారెన్ను చిత్తు చేశాడు. ఎక్కడ కూడా ఒత్తిడికి లోనుకాకుండా గేమ్తో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకున్నాడు. 56 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్లో కశ్యప్ తన అత్యుత్తమ గేమ్ను బయటకు తీశాడు. ఫలితంగా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే పలువురు కొరియా ఓపెన్ నుంచి నిష్క్రమించడంతో కశ్యప్పైనే భారత్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. -
కెనడా ఓపెన్ ఫైనల్లో కశ్యప్
కాల్గరి : ఎట్టకేలకు ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ఫైనల్లోకి ప్రవేశించాడు. కెనడా ఓపెన్ సూపర్–100 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు తొమ్మిది టోర్నీల్లో ఆడిన కశ్యప్ ఏ ఒక్క టోర్నీలోనూ ఫైనల్ బెర్త్ దక్కించుకోలేకపోయాడు. కానీ కెనడా ఓపెన్లో మాత్రం ఆద్యంతం నిలకడగా రాణిస్తూ టైటిల్కు విజయం దూరంలో నిలిచాడు. 70 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కశ్యప్ 14–21, 21–17, 21–18తో నాలుగో సీడ్ వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఫైనల్లో చైనా షట్లర్, ప్రపంచ 126వ ర్యాంకర్ లీ షి ఫెంగ్తో కశ్యప్ తలపడతాడు. -
ప్రిక్వార్టర్స్లో కశ్యప్
కాల్గరీ: కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ కశ్యప్ 21–12, 21–17తో ల్యుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై ఘన విజయం సాధించగా... జాతీయ చాంపియన్ సౌరభ్ 21–14, 21–11 తేడాతో బీఆర్ సంకీర్త్ (కెనడా)ను చిత్తు చేశాడు. తర్వాతి మ్యాచ్లలో రెన్ పెంగ్ బో (చైనా)తో కశ్యప్, సున్ ఫీ జియాంగ్ (చైనా)తో సౌరభ్ తలపడతారు. టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ మాత్రం ఓటమితో నిష్క్రమించారు. జయరామ్ 19–21, 17–21 స్కోరుతో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. జపాన్కు చెందిన కోకి వతనబే 21–16, 21–10తో ప్రణయ్ను... వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) 21–7, 21–13తో లక్ష్య సేన్ను పరాజయం పాల్జేశారు. -
కశ్యప్, గురుసాయిదత్లకు చెరో రూ.55 లక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, ఆర్ఎంవీ గురుసాయిదత్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయాన్ని అందించింది. ఇద్దరికీ చెరో 55 లక్షల చొప్పున మొత్తం రూ. కోటీ 10 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శాట్స్ ఎండీ ఎ. దినకర్బాబు శనివారం తన కార్యాలయంలో కశ్యప్, గురుసాయిదత్లకు అందించారు. వీరిద్దరూ భవిష్యత్లో గొప్పగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడిన కశ్యప్, గురుసాయిదత్లకు మెరుగైన ట్రెయినర్లు, ఫిజియో థెరపిస్టులు, శిక్షణ కోసం ఈ సహాయాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించేందుకు, వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని వివరించారు. -
శ్రమించి సెమీస్లోకి...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, పీవీ సింధు మెరిశారు. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సెమీఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి గట్టెక్కారు. మరోవైపు మహిళల డబుల్స్లో భారత జోడీల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 21–23, 21–11, 21–19తో భారత్కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్పై చెమటోడ్చి గెలిచాడు. తాను ఆడిన గత తొమ్మిది టోర్నమెంట్లలో శ్రీకాంత్ ఎనిమిదిసార్లు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయాడు. పదో టోర్నీలో అతను సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. సాయిప్రణీత్తో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయిన శ్రీకాంత్ రెండో గేమ్లో తేరుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. కానీ కీలకదశలో సాయిప్రణీత్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–16, 21–11తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. నాలుగేళ్ల తర్వాత కశ్యప్ వరల్డ్ టూర్ టోర్నీలో సెమీస్ చేరడం ఇదే ప్రథమం. నేడు జరిగే సెమీఫైనల్స్లో హువాంగ్ యుజియాంగ్ (చైనా)తో శ్రీకాంత్; విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో కశ్యప్ తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో అక్సెల్సన్ 21–10, 21–16తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21–19, 22–20తో మియా బ్లిచ్ఫెట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్లో హి బింగ్జియావో (చైనా)తో సింధు ఆడుతుంది. ‘క్వార్టర్ ఫైనల్లో నేను చాలా పొరపాట్లు చేశాను. బింగ్జియావోతో జరిగే మ్యాచ్లో సంయమనంతో ఆడాల్సి ఉంటుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 10–21, 18–21తో టాప్ సీడ్ గ్రేసియా–అప్రియాని (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 21–10, 21–12తో ప్రణవ్ చోప్రా–శివమ్ శర్మ (భారత్) జోడీని ఓడించి సెమీఫైనల్కు చేరింది. -
సెమీస్కు చేరిన శ్రీకాంత్, కశ్యప్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్లు సెమీస్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-23, 21-11, 21-19 తేడాతో సాయి ప్రణీత్పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాడు.తొలి గేమ్ను సాయి ప్రణీత్ గెలిచినప్పటికీ, మిగతా రెండు గేమ్ల్లో శ్రీకాంత్ విజయం సాధించాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును అందుకున్నాడు. మరొకక్వార్టర్ ఫైనల్ పోరులో కశ్యప్21-16, 21-11 తేడాతో వాంగ్ జు వుయ్(చైనీస్ తైపీ)పై గెలిచి సెమీస్కు చేరుకున్నాడు. తొలి గేమ్ను కష్టపడి గెలిచిన కశ్యప్.. రెండో గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. కాగా, ఒక సూపర్ సిరీస్లో కశ్యప్ సెమీస్కు చేరుకోవడం దాదాపు నాలుగేళ్లలో ఇదే తొలిసారి. -
భార్యను మందలించిన కశ్యప్
బర్మింగ్హమ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్స్ పోరాటం ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా 13వ ఏడాది ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నెహ్వాల్కు సైతం మళ్లీ ఓటమి తప్పలేదు. చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సైనా వరుసగా 13వసారి ఓటమి చవిచూసింది. భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా అవేమీ సైనా ఆటతీరు, తుది ఫలితంపై ప్రభావం చూపలేకపోయాయి. అనవసర తప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకుంటున్న సైనాను చూసి కశ్యప్ ఒకింత ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ బ్రేక్ టైంలో ‘ఓయ్.. నువ్వు చెత్త షాట్స్ ఆడుతున్నావ్.. మ్యాచ్ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి గేమ్ అనంతరం మరోసారి కశ్యప్ సైనాకు సలహాలిచ్చాడు. ‘ఆచితూచి షాట్స్ ఆడు. అనవసర షాట్స్ ఆడుతూ పదేపదే తప్పు చేస్తున్నావ్. కోర్టును వదిలేస్తున్నావ్. ఆమె మాత్రం ఛాలెంజింగ్గా తీసుకుని పరిస్థితులకు తగ్గట్లు ఆడుతోంది. అది గమనించు. ఆమె ఆడుతున్న తీరును చూడు’ అంటూ సలహా ఇచ్చాడు. రెండో గేమ్లో సైనా 8–3తో... 10–6తో... 13–10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19–19 వద్ద తప్పిదాలు చేసి తై జు యింగ్కు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సైనా 15–21, 19–21తో ఓటమి చవిచూసింది. ఇక బ్యాడ్మింటన్ ప్రేమ జంట కశ్యప్, సైనా గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. -
సెమీస్కు చేరిన సైనా, కశ్యప్
గువాహటి: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21-10, 21-10 తేడాతో భారత మాజీ నంబర్ వన్ నేహా పండిట్పై విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో సైనా ఆద్యంతం దూకుడుగా ఆడారు. సెమీ ఫైనల్లో వైష్ణవితో సైనా తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్లో సైనా భర్త పారుపల్లి కశ్యప్ సెమీస్లోకి అడుగుపెట్టాడు. కశ్యప్ 21-18, 21-16 తేడాతో బొద్దిహిత్ జోషిపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. సౌరవ్ వర్మ సైతం సెమీస్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో సౌరవ్ 21-11, 21-23, 21-18తో సాయి ప్రణీత్పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. -
రెండో రౌండ్లో సైనా, శ్రీకాంత్
కౌలాలంపూర్ (మలేసియా): కొత్త ఏడాదిలో తొలి టైటిల్ సాధించడమే లక్ష్యంగా... మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–11తో లాంగ్ ఆంగస్ (హాంకాంత్)పై 30 నిమిషాల్లోనే విజయం సాధించాడు. మరో మ్యాచ్లో క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్ (భారత్) 19–21, 21–19, 21–10తో రస్మస్ జెమ్కీ (డెన్మార్క్)పై నెగ్గి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్ 14–21, 21–18, 21–18తో డెంగ్ జాయ్ యువాన్ (హాంకాంగ్)పై కష్టపడి గెలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–16, 22–20తో ఎన్ సు యు– యెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండోరౌండ్కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనే భారత్కు వ్యతిరేక ఫలితం ఎదురైంది. తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా– సిక్కిరెడ్డి (భారత్) జంట 19–21, 17–21తో రాబిన్ తాబులింగ్– సెలీనా పియెక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేటి రెండో రౌండ్ మ్యాచ్ల్లో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, ఆరోసీడ్ అంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్, యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)తో సైనా ఆడతారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో కెటుట్ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జోడీతో అశ్విని– సిక్కి జంట ఆడుతుంది. -
బ్యాడ్మింటన్ స్టార్స్
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సందడి చేసింది. కొండాపూర్లోనిఓ మాల్లో ఆమె భర్త కశ్యప్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది.సెల్ఫీలు దిగుతూ అభిమానులను అలరించింది. గచ్చిబౌలి: కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన కైరా స్టోర్ను బ్యాడ్మింటన్ స్టార్స్, దంపతులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్తో కలిసి న్యూ కలెక్షన్స్ను ప్రదర్శించారు. త్వరలో మలేసియాలో జరగనున్న నేషనల్ టోర్నమెంట్ సిద్ధమవుతున్నానని సైనా చెప్పారు. దేశవ్యాప్తంగా 111 స్టోర్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కైరా డైరెక్టర్లు దినేశ్ మంగ్లాని, కరిష్మా మంగ్లానిపాల్గొన్నారు. -
మోడల్స్తో బ్యాడ్మింటన్ దంపతులు
-
బ్యాడ్మింటన్ ‘బంధం’
సాక్షి, సిటీబ్యూరో :భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ల వివాహ రిసెప్షన్ ఆదివారం హెచ్ఐసీసీలో వైభవంగాజరిగింది. పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ల రిసెప్షన్ఆదివారం హెచ్ఐసీసీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవిత, గుత్తాజ్వాల, హీరోయిన్లు రకుల్ప్రీత్ సింగ్, మంచు లక్ష్మితదితరులు హాజరయ్యారు. -
గ్రాండ్గా సైనా, కశ్యప్ల రిసెప్షన్ ఫోటోలు
-
గ్రాండ్గా సైనా, కశ్యప్ల రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ జంట ఆదివారం హైటెక్ సిటీలోని నోవాటెల్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ తారలతో పాటు, క్రీడా రంగ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అమల, చాముండేశ్వరీనాథ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్లు నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు. కాగా, నిరాడంబరంగా సాగిన సైనా, కశ్యప్ల వివాహ వేడుకకు ఇరువైపుల నుంచి అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. -
ఒక్కటైన సైనా, కశ్యప్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం 11.30 ప్రాంతంలో రాయదుర్గంలోని తమ నివాసం ఓరియన్ విల్లాలో రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు సైనా తండ్రి హర్వీర్ సింగ్ తెలిపారు. నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు 40 మంది హాజరయ్యారని, ఆదివారం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు కశ్యప్తో కలిసి ఉన్న ఫొటోను సైనా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దానికి ‘బెస్ట్ మ్యాచ్ ఆఫ్ మై లైఫ్’ అనే శీర్షికతో ‘జస్ట్ మ్యారీడ్’ అంటూ హ్యాష్ట్యాగ్ జత చేసింది. -
‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్’
సాక్షి, హైదరాబాద్ : పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు శుక్రవారం సాయంత్రం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య ఈ ‘రాకెట్ స్టార్స్’ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం ‘నా జీవితంలో ఇదే గొప్ప మ్యాచ్’ అంటూ సైనా ట్వీట్ చేశారు. పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దగ్గుబాటి సురేష్లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. (మిక్స్డ్ డబుల్స్) Best match of my life ❤️...#justmarried ☺️ pic.twitter.com/cCNJwqcjI5 — Saina Nehwal (@NSaina) 14 December 2018 -
నేడు ఒక్కటి కానున్న సైనా, కశ్యప్
పదేళ్లుగా ప్రేమించుకుంటున్న భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు జంటగా మారబోతున్నారు. నేడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’లో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత ఆప్తుల మధ్య శుక్రవారం వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, విమల దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. రిజిస్టర్మ్యారేజ్ చేసుకోనున్న సైనా, కశ్యప్లు రిసెప్షన్ను మాత్రం వైభవంగా జరుపుకోనున్నారు.ఈ నెల 16న హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్లో జరిగే వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్,దగ్గుబాటి సురేష్లతో పాటు ‘అగిలే గ్రూప్ హైదరాబాద్ హంటర్స్’ చీఫ్ ఎండీవీఆర్కే రావు, మంత్రి కేటీఆర్, చాముండేశ్వరీనాథ్, రాజకీయ ప్రముఖులకురిసెప్షన్ ఆహ్వాన పత్రికలను అందజేశారు. హిమాయత్నగర్: తెలుగువారి కీర్తి, ప్రతిష్టలను, క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటిన బ్యాడ్మింటన్ స్టార్లు జంటగా నేడు ఓ ఇంటివారు కానున్నారు. పదేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఇటీవల ప్రకటించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇందుకు రాయదుర్గంలోని సైనా నివాసం వేదిక కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా హాజరవుతున్న ఈ ‘రాకెట్ స్టార్స్’ వివాహ వేడుక సవ్యసాచి ఔట్ఫిట్లో.. నోవాటెల్లో జరిగే రిసెప్షన్కి సైనా, కశ్యప్ దంపతులు సవ్యసాచి ఔట్ఫిట్తో చేసిన దుస్తులు ధరించనున్నారు. సైనా ‘లెహంగా విత్ వెల్వెట్ దుప్పాట’ దుస్తులు, డైమండ్ జ్యువెలరీతో మెరవనుంది. కశ్యప్ షేర్వానీ విత్ పెన్ జ్యువెలరీలో కనిపించనున్నారు. వీరిస్టైలిష్ట్ని ప్రముఖ డిజైనర్ శ్రావ్యవర్మ చూస్తున్నారు. లెహంగా.. కుర్తీ.. సింప్లిసిటీ.. నేడు జరగనున్న పెళ్లికి మాత్రం సైనా, కశ్యప్ చాలా సింప్లిసిటీ వస్త్రధారణలో కనిపించనున్నారు. సైనా లెహంగాను, కశ్యప్ బేబీ పింక్ కుర్తా అండ్ షేర్వానీ ధరించనున్నారు. 15వ తేదీ రాత్రి 40మంది తోటి క్రీడాకారులకు ‘కాక్టైల్ పార్టీ’ ఇవ్వనున్నారు. ఈ పార్టీలో సైనా గౌన్లో, కశ్యప్ పౌడర్ బ్లూ సూట్లో కనిపించనున్నట్లు స్టైలిస్ట్ శ్రావ్యవర్మ తెలిపారు. కొత్తగా కనిపిస్తారు.. సైనా, కశ్యప్లిద్దరూ పదిహేను రోజులుగా సభ్యసాచి ఔట్ఫిట్ దుస్తులు ధరించనున్నారు. ఇంతకు మునుపెన్నడూ చూడని సైనా, కశ్యప్లను రిసెప్షన్లో చూపించనున్నాను. – శ్రావ్యవర్మ, స్టైలిస్ట్ రిసెప్షన్కు సెలబ్రిటీలు నోవాటెల్లో జరిగే రిసెప్షన్లో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. రణ్వీర్సింగ్, దీపిక, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ధోని, సమంత, రకూల్ప్రీత్ సింగ్, కీర్తిసురేష్, మిథాలీరాజ్, పీవీ సింధు, గోపీచంద్, అశ్విని పొన్నప్ప తదితరులు హాజరు కానున్నారు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
కౌలూన్ (హాంకాంగ్): కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో కశ్యప్ 21–7, 12–21, 21–18తో టాప్ సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) నుంచి కశ్యప్నకు వాకోవర్ లభించింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–16, 19–21, 21–14తో వాంగ్చి లిన్–లి చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)తో సమీర్ వర్మ; ఖోసిత్ ఫెత్రాదబ్ (థాయ్లాండ్)తో సాయిప్రణీత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో కిడాంబి శ్రీకాంత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్; ఆంథోని గిన్టింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)తో పీవీ సింధు ఆడతారు. -
‘నా పాస్పోర్ట్ పోయింది.. సాయం చేయరూ’
ఆమ్స్టర్డామ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన పాస్పోర్ట్ను పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్లో ఉన్న కశ్యప్.. తన పాస్పోర్ట్ పోయిన విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు తన పాస్పోర్ట్ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని విన్నవించాడు. ‘నా పాస్ట్పోర్ట్ పోయింది. గత రాత్రి ఆమెస్టర్డామ్లో నా పాస్పోర్ట్ను పోగుట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్లో పాల్గొనడానికి పయనం కావాల్సి ఉంది. డెన్మార్క్కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరతగతిన సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’అని కశ్యప్ ట్వీట్లో పేర్కొన్నాడు. తన ట్వీట్ను క్రీడాశాఖా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు, ప్రధాని నరేంద్ర మోదీలకు సైతం ట్యాగ్ చేశాడు. Good Morning Ma’am, I’ve lost my passport at Amsterdam last night . I have to travel to Denmark Open, French Open and Saarloux Open,Germany . My ticket for Denmark is on Sunday, 14th October .I request help in this matter . @SushmaSwaraj @Ra_THORe @himantabiswa @narendramodi — Parupalli Kashyap (@parupallik) 13 October 2018 -
పెళ్లిపై క్లారిటి ఇచ్చిన సైనా నేహ్వాల్
-
అవును... డిసెంబరు 16నే మాపెళ్లి: సైనా
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్... తన వివాహ తేదీపై స్పష్టతనిచ్చింది. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ను డిసెంబరు 16న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ ఒక్క తేదీనే తమకు అనుకూ లంగా ఉందని ఆమె పేర్కొంది. కశ్యప్తో ప్రేమ గురించి తాను చెప్పకున్నా తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని తెలిపింది. -
పెళ్లి డేట్ కన్ఫామ్ చేసిన సైనా
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా సైనా తొలిసారి తమ బంధం గురించి మాట్లాడారు. తాను, కశ్యప్ ప్రేమించుకుంటున్నట్లు చెప్పడమే కాకా ఏకంగా పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అదే రోజు పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా సైనా వివరించారు. దాంతో పాటు తమ ప్రేమ ప్రయాణం గురించి కూడా ఆసక్తికరం విషయాలను వెల్లడించారు. ఈ విషయం గురించి సైనా ‘2005 నుంచి మేం గోపిచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాం. కానీ మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది 2007 లోనే. అప్పటి నుంచే మేం ఇద్దరం టోర్నీల కోసం కలిసి ప్రయాణించడం ప్రారంభించాం. ఎన్నో టోర్నిల్లో కలిసి ఆడాము, కలిసి శిక్షణ తీసుకున్నాం.. అలా మెల్లగా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చారు సైనా నెహ్వాల్. అంతేకాక టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి తమకు అవకాశం దొరికేదని ఆమె తెలిపారు. అయితే ఇన్నాళ్లు తమకు పెళ్లి ఆలోచన రాకపోవడానికి కారణం తాము ఎంచుకున్న కెరీర్లే అంటూ సైనా వివరించారు. సైనా మాట్లాడుతూ.. ‘మా దృష్టిలో టోర్నీలు గెలవడం అన్నింటికన్నా చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి వేరే విషయాల మీదకు మరలకుండా జాగ్రత్తపడ్డాం. చిన్న పిల్లలకు ఎంత కేర్ అవసరమో ప్లేయర్స్కు కూడా అంతే కేర్ అవసరం. ఇన్నాళ్లూ మా ఇంట్లో వాళ్లే అవన్నీ చూసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ విషయం మారుతుంది. నాపై బాధ్యత పెరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దని అనుకున్నాం. ఇప్పుడు అందుకు సమయం వచ్చింది’ అని సైనా వివరించారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 16నే వివాహం చేసుకోవడం వెనక ఓ కారణం ఉందన్నారు.. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం అని సైనా వివరించారు. -
పెళ్లి పీటలెక్కబోతున్న సైనా నెహ్వాల్
-
పెళ్లి చేసుకోబోతున్న సైనా, కశ్యప్
సాక్షి, హైదరాబాద్: దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లే సమయం వచ్చింది! బ్యాడ్మింటన్ స్నేహాన్ని భార్యాభర్తలా బంధంగా మార్చుకున్న జోడీల జాబితాలో మరో జంట చేరనుంది. హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ త్వరలో వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం. వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం బ్యాడ్మింటన్ వర్గాల్లో చాలా కాలంగా అందరికీ తెలిసిన విషయమే. 2005లో పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరిన నాటినుంచి వీరి మధ్య బంధం కొనసాగుతోంది. గతంలో ప్రేమ, పెళ్లికి సంబంధించిన చర్చ ఎప్పుడూ వచ్చినా వీరిద్దరు దానిపై ఏనాడూ బయట పడలేదు. కేవలం స్నేహితులు, సహచర షట్లర్గానే వారు చెప్పుకున్నారు. అయితే తమ మధ్య ప్రేమ కొనసాగుతోందని అంగీకరించడం గానీ కొట్టి పారేయడం గానీ చేయలేదు. ఇప్పుడు మాత్రం మొదటిసారి పెళ్లికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా షట్లర్గా 28 ఏళ్ల సైనా గుర్తింపు పొందగా.... 32 ఏళ్ల కశ్యప్ 2014 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. డిసెంబర్ 16న హైదరాబాద్లోనే పెళ్లి జరగవచ్చని తెలిసింది. 21న సైనా–కశ్యప్ భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించాలని భావిస్తున్నారు. వరల్డ్ చాంపియన్షిప్లో పతకాలు, పెద్ద సంఖ్యలో సూపర్ సిరీస్ టోర్నీ విజయాలతో పాటు సైనా వరల్డ్ నంబర్వన్ స్థాయికి చేరగా, కశ్యప్ తన కెరీర్లో అత్యుత్తమంగా ఆరో ర్యాంక్ సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో సైనా ఇంకా చురుగ్గా ఉండగా... వరుస గాయాలతో కశ్యప్ కెరీర్ ఒడిదుడుకులకు లోనైంది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన సమయంలో సైనా తొలిసారి తన విజయాల్లో కశ్యప్ పాత్ర కూడా ఉం దని చెప్పింది. టోర్నీ ఆసాంతం తనను ప్రోత్సహించిన విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి సోషల్ మీడియాలో తాము కలిసి ఉన్న ఫొటోలను వీరిద్దరు ఎక్కువగా పోస్ట్ చేస్తూ వచ్చారు. గతంలో పలువురు భారత షట్లర్లు సహచర ప్లేయర్లని వివాహమాడారు. గతంలో పుల్లెల గోపీచంద్–పీవీవీ లక్ష్మి, సయ్యద్ మోడి–అమిత, మధుమిత బిస్త్–విక్రమ్ సింగ్; ప్రణవ్ చోప్రా–ప్రద్న్యా; అరుణ్ విష్ణు–అరుంధతి ఇలా పెళ్లి చేసుకున్నారు. -
క్వార్టర్స్లో కశ్యప్ ఓటమి
ఫ్రాన్స్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ఐదో సీడ్ కశ్యప్ 18–21, 14–21తో మూడో సీడ్ రస్మస్ గెమ్కే (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో కశ్యప్
ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–11, 21–14తో జోషువా మాగీ (ఐర్లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్కే చెందిన గురుసాయిదత్ 20–22, 21–17, 17–21తో జాన్ జార్గెన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 18–21తో ముగ్ధా అగ్రే (భారత్) చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్లో గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురుసాయిదత్ 21–12, 24–22తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్ 21–16, 21–7తో దుర్కిన్జాక్ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 23–25, 13–21తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. -
టాప్–30లో చోటే లక్ష్యం: కశ్యప్
న్యూఢిల్లీ: మూడేళ్ల అనంతరం అంతర్జాతీయ టైటిల్ సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రియా ఓపెన్ టోర్నీ చేజిక్కించుకున్న అతను మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత ట్రోఫీ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక కోచ్ గోపీచంద్, శిక్షణ సిబ్బంది కృషి ఎంతో ఉంది. ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తూ... టాప్–30లో చోటు సంపాదించడమే నా లక్ష్యం’ అని ఈ హైదరాబాద్ ప్లేయర్ తెలిపాడు. ప్రపంచ 44వ ర్యాంక్ లో ఉన్న కశ్యప్ ఏప్రిల్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించలేదు. దీనిపై అతను స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా శ్రీకాంత్, ప్రణయ్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు కామన్వెల్త్ గేమ్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. వారు పతకాలతో తిరిగొస్తారని భావిస్తున్నాను’ అని తెలిపాడు. -
క్వార్టర్స్లో కశ్యప్
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం వియన్నాలో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21–15, 22–20తో జియా వె తాన్ (మలేసియా)పై గెలుపొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్కే చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్ 17–21, 9–21తో విక్టర్ స్వెండ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి ఇరా శర్మ 16–21, 13–21తో జు వీ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరుగుతున్న స్విస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ 8–21, 15–21తో కాంతాపోన్ వాంగ్చరోయెన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. -
క్వాలిఫయింగ్లోనే కశ్యప్ అవుట్
బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో మొదటిరోజు భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. భారత అగ్రశ్రేణి ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కశ్యప్ 14–21, 17–21తో కాంతపోన్ వాంగ్చరోయిన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తొలి రౌండ్లో సిక్కి–ప్రణవ్ జోడీ 18–21, 17–21తో ఏడో సీడ్ లీ చున్ హె రెగినాల్డ్–చౌ హోయ్ వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
హాంగ్కాంగ్ సూపర్ సిరీస్ సెకండ్ రౌండ్లోకి సైనా
కౌలూన్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ హాంగ్కాంగ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో 44 వ ర్యాంకర్ డెన్మార్క్ ప్లేయర్ మెటే పౌల్సేన్పై 21-19, 23-21 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.11వ ర్యాంకరైన సైనా తదుపరి మ్యాచ్ బలమైన ప్రత్యర్థి ఎనిమిదో సీడెడ్ చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయ్ను ఢీ కొననున్నారు. గత ఆగష్టులో గ్లాస్గో టోర్నమెంట్లో కాంస్యం కోసం పోటీపడ్డ సైనాను చెన్ మట్టికరిపించారు. ఇక పురుషుల సింగిల్స్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మలు తొలి రౌండ్లోని ఓటమి చెంది ఇంటిదారి పట్టారు. కశ్యప్ కోరియా ప్లేయర్ లీడాంగ్ కీన్పై 21-15,19-21,20-22 తేడాతో ఓటమి చెందాడు. సౌరబ్ ఇండోనేషియా ప్లేయర్ టామ్మీ సుగియాట్రో చేతిలో ఓటమి పాలయ్యాడు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్, రుత్విక
సిడ్నీ: గాయం నుంచి తేరుకొని మళ్లీ రాకెట్ పట్టిన భారత మాజీ నంబర్వన్ పారుపల్లి కశ్యప్, యువతారలు సిరిల్ వర్మ, గద్దె రుత్విక శివాని... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో ఈ ముగ్గురూ అజేయంగా నిలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో కశ్యప్ 21–15, 21–18తో జావో జున్పెంగ్ (చైనా), రెండో రౌండ్లో 21–5, 21–16తో ఇండోనేసియా ఓపెన్ రన్నరప్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–9, 21–9తో ఫ్రిట్జ్ మైనకి (ఇండోనేసియా)పై, రెండో రౌండ్లో 21–16, 21–15తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై విజయం సాధించాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్లో రుత్విక 21–15, 21–15తో సిల్వినా కుర్నియావాన్ (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–7తో రువింది సెరెసింఘే (ఆస్ట్రేలియా)పై గెలిచింది. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ల్లో క్వాలిఫయర్ కాన్ చావో యు (చైనీస్ తైపీ)తో కిడాంబి శ్రీకాంత్; ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్; ప్రపంచ నంబర్వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; విటింగస్ (డెన్మార్క్)తో సిరిల్ వర్మ; యూరోపియన్ చాంపియన్ రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో ప్రణయ్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (కొరియా)తో సైనా నెహ్వాల్; ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు; చెన్ జియోజిన్ (చైనా)తో రుత్విక శివాని ఆడతారు. -
రెండో రౌండ్ లో కశ్యప్ ఓటమి
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో కశ్యప్13-21, 20-22 తేడాతో లిన్ యు సెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా కోల్పోయిన కశ్యప్ ... రెండో గేమ్లో పోరాడి ఓడాడు. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ పోరులో సైనా నెహ్వాల్ క్వార్టర్స్ కు చేరింది. ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్(ఇండోనేషియా)పై గెలిచింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంగా మను అత్రి-సుమీత్ రెడ్డి జోడి 20-22, 19-21 తేడాతో డానీ బావా క్రిస్నాంతా-హెంద్రా విజయా(సింగపూర్) జంట చేతిలో పరాజయం చెందింది. -
క్వాలియింగ్లో కశ్యప్ ఓటమి
ఒడెన్స: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలియింగ్ తొలి రౌండ్లో ప్రపంచ 92వ ర్యాంకర్ కశ్యప్ 13-21, 21-8, 20-22తో ప్రపంచ 47వ ర్యాంకర్ రౌల్ మస్ట్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కశ్యప్ నిర్ణాయక మూడో గేమ్లో మ్యాచ్ పాయింట్లును వృథా చేశాడు. ఒకదశలో 14-19తో వెనుకబడిన కశ్యప్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 20-19తో విజయానికి ఒక పాయింట్లు దూరంలో నిలిచాడు. అయితే రౌల్ మస్ట్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి కశ్యప్ ఓటమిని ఖాయం చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్ల్లో సింధు, సాయిప్రణీత్, జయరామ్, ప్రణయ్ బరిలోకి దిగనున్నారు. -
సైనాకే అవకాశాలెక్కువ!
* అండర్డాగ్స్గా సింధు, శ్రీకాంత్ * రియో ఒలింపిక్స్పై కశ్యప్ అభిప్రాయం న్యూఢిల్లీ: ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్స్ను బట్టి చూస్తే రియో ఒలింపిక్స్లో పతకం గెలిచే అవకాశాలు సైనా నెహ్వాల్కే ఎక్కువగా ఉన్నాయని కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. అయితే అండర్డాగ్స్గా బరిలోకి దిగే సింధు, శ్రీకాంత్ల నుంచి కూడా కొంతమేరకు ఆశించొచ్చన్నాడు. పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమీత్ రెడ్డిలు ఒలింపిక్స్కు అర్హత సాధించడంపై కశ్యప్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ‘రియో’లో పతకం సాధించడం చాలా కష్టంతో కూడుకున్నదే అయినప్పటికీ... భారత్ నుంచి అర్హత కావడం మాత్రం అద్భుతమైన విషయమన్నాడు. ‘మను-సుమీత్లు పతకానికి పోటీదారులు కారని నేను చెప్పను. కానీ ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అందులోనూ వీళ్లు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించారు. అయితే ఇక్కడ కూడా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని జంటకు కూడా పతకం గెలిచే అవకాశాలున్నాయి. పెద్ద టోర్నీల్లో ఈ ఇద్దరూ చాలా బాగా ఆడతారు’ అని ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. మార్చిలో జరిగిన జర్మన్ ఓపెన్లో మోకాలి గాయానికి గురైన కశ్యప్... రియో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. -
కశ్యప్ ఒలింపిక్ ఆశలు ఆవిరి!
గాయం కారణంగా మరో రెండు టోర్నీలకు దూరం న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. మోకాలి గాయం కారణంగా ఈ నెలలో జరగనున్న మలేసియా, సింగపూర్ ఓపెన్ టోర్నీల నుంచి కశ్యప్ వైదొలిగాడు. ‘ఈ నెలలో ఇతర టోర్నమెంట్లు లేవు. వాస్తవానికి గాయం చాలా తీవ్రమైంది. మొదటిసారి గాయాన్ని గుర్తించడంలోనే పొరపాటు జరిగింది. రెండు వారాల్లో కోలుకుంటానని చెప్పారు. నేను కూడా అలానే భావించా. కానీ అలా జరగలేదు. చాలా నిరాశగా, చిరాకుగా ఉంది’ అని కశ్యప్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ 17వ ర్యాంక్లో ఉన్న కశ్యప్... రియోకు అర్హత సాధించాలంటే టాప్-16లో చోటు సంపాదించాలి. అయితే మలేసియా, సింగపూర్ టోర్నీల నుంచి వైదొలగడంతో ర్యాంకింగ్కు అవసరమైన పాయింట్లను ఈ హైదరాబాదీ కోల్పోతున్నాడు. ప్రస్తుతం గాయం పరిస్థితిని బట్టి మరో మూడు వారాలు విశ్రాంతి తప్పదని చెప్పిన కశ్యప్... మే లేదా జూన్లో తిరిగి బరిలోకి దిగే అవకాశాలున్నాయన్నాడు. -
ప్రి క్వార్టర్స్లో కశ్యప్
ముల్హీమ్ అన్ డెర్ రుర్ (జర్మనీ ): జర్మన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ రెండో రౌండ్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో కశ్యప్ 21-12, 21-11తో జోషువా మజీ (ఐర్లాండ్)పై గెలిచాడు. అంతకుముందు తొలి రౌండ్లో కశ్యప్ 21-9, 21-9తో అర్తెమ్ పొచ్తరెవ్ (ఉక్రెయిన్)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 12-21, 21-18, 21-11తో టకుమా ఉయెదా (జపాన్)పై, సమీర్ వర్మ 21-9, 21-8తో దిమిత్రో జవద్స్కీ (ఉక్రెయిన్)పై గెలిచారు. మరోవైపు పీవీ సింధు 21-11, 21-13తో రోంగ్ ష్కాఫెర్ (అమెరికా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మిచెల్లి లీ (కెనడా)తో సింధు ఆడుతుంది. -
శ్రీకాంత్, కశ్యప్ ర్యాంకులు కిందకు..
కౌలాలంపూర్:ఇటీవల పేలవమైన ఫామ్ తో తంటాలు పడుతున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ లు తమ ర్యాంకుల్లో మరింత కిందకు పడిపోయారు. తాజాగా గురువారం విడుదల చేసిన వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ కశ్యప్ లు తమ స్థానాలను కోల్పోయారు. గతవారం దుబాయ్ లో జరిగిన వరల్డ్ సూపర్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్ లో లీగ్ దశను దాటలేకపోయిన శ్రీకాంత్ తొమ్మిదో స్థానానికి పడిపోగా, పారుపల్లి కశ్యప్ 14వ ర్యాంకు నుంచి 15 ర్యాంకు పడిపోయాడు. కాగా, హెచ్ఎస్ ప్రణయ్ తన 20వ ర్యాంకును కాపాడుకోగా, అజయ్ జయరామ్ 22వ స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉండగా చైనాకు చెందిన చెన్ లాంగ్ కు ప్రథమస్థానం దక్కించుకున్నాడు. మహిళల డబుల్స్ లో భారత జోడి జ్వాలా గుత్తా, అశ్విన్ పొన్నప్పలు 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. -
వెనుదిరిగిన కశ్యప్
జపాన్ ఓపెన్లో నిరాశపర్చిన భారత క్రీడాకారులు టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీగా ఆశలు పెట్టుకున్న పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్లోనే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 8వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 18-21తో ఆరోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత కుర్రాడు సత్తా మేరకు రాణించలేకపోయాడు. తొలి గేమ్లో స్కోరు 10-9 ఉన్న దశలో చెన్ వరుసగా ఓసారి నాలుగు, మరోసారి ఐదు పాయింట్లు సాధించాడు. కశ్యప్ రెండు, మూడు పాయింట్లకే పరిమితం కావడంతో గేమ్ చేజారింది. రెండో గేమ్లో హైదరాబాదీ పుంజుకునే ప్రయత్నం చేసినా.. చెన్ ర్యాలీల ముందు నిలవలేకపోయాడు. స్కోరు 2-4తో వెనుకబడి ఉన్న దశలో తైపీ ప్లేయర్ వరుసగా ఆరు, నాలుగు పాయింట్లు గెలిచి 12-5 ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత కశ్యప్ కాసేపు పోరాడాడు. 14-20 స్కోరు వద్ద హైదరాబాదీ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 18-20 తగ్గించాడు. కానీ చెన్ ఒకే షాట్తో గేమ్ను, మ్యాచ్ను చేజిక్కించుకున్నాడు. -
సైనా శుభారంభం
కశ్యప్, శ్రీకాంత్ కూడా.. సంధు, జ్వాలా జోడికి చుక్కెదురు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యా యి. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ముందంజ వేయగా, పి.వి.సింధు, జ్వాలా జోడికి చుక్కెదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ నంబర్వన్, రెండోసీడ్ సైనా 21-14, 22-20తో బుసానన్ ఒంగ్బుమరాంగ్పన్ (థాయ్లాండ్)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభంలో తడబడ్డ హైదరాబాదీ కీలక సమయంలో బాగా పుంజుకుంది. తొలి గేమ్లో 1-4తో వెనుకబడ్డ సైనా...4-4, 8-8, 10-10తో స్కోరు సమం చేసింది. తర్వాత స్కోరు 13-14 ఉన్న దశలో భారత అమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గగా, ప్రత్యర్థి ఒక పాయింట్తో సరిపెట్టుకుంది. చివర్లో సైనా మరో మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్ను కైవసం చేసుకుంది. రెండో గేమ్లో స్కోరు 4-4 ఉన్న దశలో సైనా వరుసగా ఐదు పాయింట్లు 9-4 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి సైనా ఒకటి, రెండు పాయింట్లు నెగ్గితే.. అవకాశం వచ్చినప్పుడల్లా బుసానన్ రెండు, మూడు పాయింట్లతో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు స్కోరు 19-19 ఉన్న దశలో థాయ్ ప్లేయర్ అద్భుతమైన డ్రాప్ షాట్తో 20-19 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ దశలో సైనా గేమ్ పాయింట్ను కాపాడుకోవడంతో పాటు మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను, మ్యాచ్ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్లో సింధు 13-21, 21-17, 11-21తో మినత్సు మితాని (జపాన్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో జ్వాల-అశ్విని 20-22, 21-18, 13-21తో 8వ సీడ్ జావో యునెలి-జాంగ్ క్వినాక్సిన్ (చైనా) చేతిలో; ప్రద్య్నా గాద్రె-సిక్కి రెడ్డి 6-21, 17-21తో టాప్సీడ్ మిసాకి మట్సుటోమో-అయకా తకహషి (జపాన్) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ స్కోరు 3-2 ఉన్న దశలో టకుమా ఉడే (జపాన్) మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. మరో మ్యాచ్లో మూడోసీడ్ శ్రీకాంత్ 21-18, 21-15తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)పై; హెచ్.ఎస్.ప్రణయ్ 23-21, 22-20తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. అజయ్ జయరామ్ 10-21, 10-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సిల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. సాయి ప్రణీత్ 21-23, 10-21తో లీ డాంగ్ కెన్ (జపాన్) చేతిలో ఓడాడు. రెండోరౌండ్లో కశ్యప్.. శ్రీకాంత్తో తలపడతాడు. -
సైనా శుభారంభం..!
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ లో ఇండియన్ టాప్ షట్లర్, ప్రపంచ నంబర్ వన్ సైనా నేహ్వాల్ శుభారంభం చేసింది. సైనాతో పాటు పారుపల్లి కశ్యప్, కిదాంబిశ్రీకాంత్, ప్రణయ్ లు తొలి రౌండ్ లో విజయం సాధించారు. అయితే పీవీ సింధు కు మాత్రం తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో రెండో సీడ్ సైనా 21-14, 21-20 తేడాతో.. థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై గెలిచింది. మరో మ్యాచ్లో సింధు 21-13, 17-21,21-11 స్కోర్ తో జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఓడిపోయింది. ఒకవేళ సింధు ఈ మ్యాచ్లో గెలిచిఉంటే ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా ఎదురయ్యేది. సింధు ఓటమితో ప్రిక్వార్టర్ ఫైనల్లో మితానీతో సైనా ఆడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల - అశ్వనిపొన్నప్ప జంట చైనా జంట ఎనిమిదో సీడ్ జుహో యున్ లీ- జాంగ్ జంట చేతిలో 22-20, 18-21, 21-13 స్కోర్ తేడాతో ఓడిపోయారు. -
జపాన్ ఓపెన్ లో సింధుకి షాక్
టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి షాక్ తగిలింది. తొలి రౌండ్ మ్యాచ్ లోనే ఇంటి దారి పట్టింది. జపాన్ క్రీడాకారిణి మినట్సూమితాని చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. మూడు రౌండ్ల పాటు జరిగిన మ్యాచ్ లో 21-13, 17-21,21-11 స్కోర్ తో ఓడిపోయింది. మరో వైపు.. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టాడు. జపనీస్ ప్రత్యర్థి టకుమ మ్యాచ్ నుంచి మధ్యలో వైదొలగటంతో కశ్యప్ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. మరో వైపు సింగిల్స్ ప్లేయర్ అజయ్ జయరాం తొలి రౌండ్ లోనే వెనుదిరిగాడు. మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వనిపొన్నప్ప జంట కూడా ఓటమితో నిరాశ పరిచారు. -
పూర్తి ఫిట్నెస్ సాధిస్తా: కశ్యప్
ముంబై : జకర్తాలో ఆగస్టులో జరగనున్న బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ చెప్పాడు. దీనికోసం ఏడు వారాల పాటు కఠినంగా శ్రమిస్తానని వెల్లడించాడు. సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఇండోనేసియా ఓపెన్ సెమీస్లో ఓటమిపాలయ్యానన్నాడు. ‘క్వార్టర్స్లో చెన్ లాంగ్పై గెలవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. టాప్-10 ఆటగాళ్లకు ఒక్కో రకమైన శైలి ఉంటుంది. వాళ్లతో తలపడేటప్పుడు ముందుకు ఎలా సాగాలనే దానిపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అందుకే రెండో గేమ్లో 10-6తో ఆధిక్యంలో ఉన్నా... అతనిపై ఒత్తిడి పెంచలేకపోయా. అలాంటప్పుడు మరింత ఫిట్నెస్ అవసరమని తెలుసుకున్నా’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
టాప్-10లో కశ్యప్
రెండో స్థానానికి సైనా న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ సంచలనం పారుపల్లి కశ్యప్ బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో తిరిగి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్లో ప్రపంచ నంబర్వన్ చెన్ లాంగ్ను మట్టికరిపించిన తను గురువారం విడుదల చేసిన జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరాడు. కె.శ్రీకాంత్ మూడో స్థానంలోనే కొనసాగుతుండగా మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకుని తిరిగి రెండో ర్యాంకుకు చేరింది. పీవీ సింధు 14వ ర్యాంకులోనే ఉంది. -
'టాప్ టెన్' లో కశ్యప్
న్యూఢిల్లీ: ఇండోనేసియా సూపర్ సిరీస్ లో సత్తా చాటిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ మరోసారి 'టాప్ టెన్' లోకి దూసుకొచ్చాడు. బీడబ్ల్యూ ఎఫ్ తాజాగా ప్రకటించిన పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకులో నిలిచాడు. మరో ఇండియన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ భారత్ తరపున అత్యుత్తమ ర్యాంకులో ఉన్నాడు. అతడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ రెండో ర్యాంకు దక్కించుకుంది. పీవీ సింధు 14వ ర్యాంకులో కొనసాగుతోంది. -
కశ్యప్... ఐదో‘సారీ’
♦ మళ్లీ సెమీస్లో ఓడిన భారత స్టార్ ♦ ఇండోనేసియా ఓపెన్ జకార్తా : అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నా... భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం ముగిసింది. తాజా ఫలితంతో 28 ఏళ్ల కశ్యప్ తన కెరీర్లో ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్ దశను దాటలేకపోయాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో 76 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-12, 17-21, 19-21తో పోరాడి ఓడిపోయాడు. సెమీస్లో ఓడిన కశ్యప్కు 11,600 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 7 లక్షల 43 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో కశ్యప్ సింగపూర్ ఓపెన్ (2012), ఇండోనేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ (2012), డెన్మార్క్ ఓపెన్ (2014)లలోనూ సెమీఫైనల్లో నిష్ర్కమించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ వాన్ సన్ హో (కొరియా)ను... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించిన కశ్యప్ సెమీఫైనల్లోనూ మరో సంచలనం సృష్టించేలా కనిపించాడు. అయితే కీలకదశలో అనవసర తప్పిదాలు చేయడం, ప్రత్యర్థి మొమోటా కూడా అద్భుతంగా ఆడటంతో కశ్యప్కు ఓటమి తప్పలేదు. తొలి గేమ్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచిన కశ్యప్ ఒకదశలో వరుసగా 8 పాయింట్లు నెగ్గి 17-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లోనూ కశ్యప్ నిలకడగా ఆడి 9-5తో ముందంజ వేశాడు. అయితే అప్పటికే కశ్యప్ ఆటతీరుపై అంచనాకు వచ్చిన మొమోటా నెమ్మదిగా గాడిలో పడ్డాడు. స్కోరును 17-17 వద్ద సమం చేశాడు. ఈ దశలో కశ్యప్ పొరపాట్లు చేయడంతో మొమోటా వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్ను సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్లో కశ్యప్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అటు మొమోటా కూడా వెనక్కు తగ్గలేదు. దాంతో ప్రతీ పాయింట్ ఫలితం సుదీర్ఘ ర్యాలీల ద్వారా వచ్చింది. ఒకదశలో కశ్యప్ కాస్తా పైచేయి సాధించి 19-16తో మూడు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించి విజయానికి చేరువగా వచ్చాడు. అయితే మొమోటా పట్టుదలతో పోరాడి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గడంతో చివరకు కశ్యప్ ఓటమితో సరిపెట్టుకున్నాడు. -
పోరాడి ఓడిన కశ్యప్
-
పోరాడి ఓడిన కశ్యప్
జకర్తా: ఇండోనేసియా ఓపెన్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీస్లో కశ్యప్ ఓటమి చెందాడు. క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ చెన్ లాంగ్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించిన కశ్యప్.. శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్లో 21-12, 17-21, 19-21 స్కోరుతో జపాన్ షట్లర్ కెంటో మొమోట చేతిలో పోరాడి ఓడాడు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్ పోరులో కశ్యప్ తొలి గేమ్ను సునాయాసంగా గెల్చుకున్నాడు. కాగా రెండో గేమ్లో కశ్యప్ వెనుకబడటంతో మ్యాచ్ 1-1తో సమమైంది. చివరి, నిర్ణాయక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. కశ్యప్ చివరి వరకు పోరాడినా కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకున్నాడు. -
ప్రపంచ నెం 1కు షాకిచ్చిన కశ్యప్