prince
-
40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!
ఇటీవల అమ్మమ్మలు, అమ్మలు ధరించిన పెళ్లినాటి చీరలను సరికొత్తగా డిజైన్ చేయించుకుని ధరించడం ట్రెండ్గా మారింది. సరిగ్గా చెప్పాలంటే రెట్రో ఫ్యాషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు దీన్నే ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ల పెళ్లి నాటి చీరలు, ఒకప్పుడు ధరించిన ఫ్యాషన్ వేర్లను కాస్త మార్పులు చేసి.. సరికొత్తగా కనిపించేలా ధరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవలోకి ప్రిన్సెస్ అన్నే కూడా చేరిపోయారు. రాజ కుటుంబానికి చెందిన అన్నే ఈ ఫ్యాషన్కి మద్దతివ్వడం అందరిని విస్మయపరిచింది. ఇటీవల బకింగ్హామ్ ప్యాలెస్లో ఖతారీ రాజకుటుంబానికి ఇచ్చిన ఆతిథ్యంలో తన తన అన్న ప్రిన్స్ చార్లెస్ IIIతో కలిసి అన్నే కూడా భాగమయ్యారు. ఆ ఆతిథ్యంలో అన్నే 40 ఏళ్ల నాటి క్రీమ్ గౌనుతో ఆకట్టుకుంది. ఆమె ధరించి డిజైనర్వేర్ చూస్తే ఇటీవలే డిజైన్ చేసినట్లుగా చూడముచ్చటగా కనిపిస్తుంది. కానీ ఇది నలభైఏళ్ల నాటిది. ఈ గౌనులో 1985 నాటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తొలిసారిగా కనిపించారు. అప్పుడు ఆమె వయసు 35 ఏళ్లు. మళ్లీ ఇన్నేళ్లకు ధరించినా.. ఆమె ఒంటికి చక్కగా సరిపోవడమే గాక అలనాటి అందాల అన్నేని జ్ఞప్తికి తెచ్చింది. ఆ డిజైనర్వేర్కి తగ్గట్టుగా డైమండ్తో పొదగిన ఆక్వామెరైన్ పైన్ఫ్లవర్ కిరీటం రాయల్టీని తెలియజేస్తుంది. ఈ కిరీటాని అన్నేకి దివగంత అమ్మమ్మ బహుమతిగా ఇచ్చారు. దుస్తులు కూడా వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్న తరుణంలో అందరిని ఆకర్షించే విధంగా..ఓ ఉద్యమంలా తీసుకొచ్చిన ఈ రెట్రో ఫ్యాషన్లో రాజకుటుంబికులు కూడా తమ వంతుగా భాగస్వామ్యం కావడం విశేషం. ఓ సామాన్యురాలి వలే ఏళ్ల నాటి డిజైనర్ గౌనుతో కనిపించి.. రాజదర్పానికి అసలైన అర్థం ఇచ్చి.. అందరిచేత ప్రశంసలందుకుంది.(చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
ఉదయపూర్ యువరాజు వాహన ప్రపంచం - తప్పకుండా చూడాల్సిందే (ఫోటోలు)
-
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్లో ఈ క్రూయిజర్ మోటార్బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు
ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ డాన్సెస్ ఆఫ్ ఇండియా సెయింట్ లూయిస్. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి పాత్రను ’డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే... ‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.నాడు–నేడు‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్ చేశారు. (చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!) -
Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కలి'. ట్రైలర్తోనే కాస్త అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథ, కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)కథేంటి?శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయిని ఇతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లుని ఎదురించి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్.. కష్టాల పాలవుతాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అడిగిన ఫోన్ కొనివ్వలేదనో, లవర్ బ్రేకప్ చెప్పిందనో ప్రతి చిన్న విషయానికి చాలామంది తమ ప్రాణాల్ని చిన్న వయసులోనే తీసేసుకుంటున్నారు. అలా భార్య వదిలేసిందని, అందరూ మోసం చేశారని అనుకునే వ్యక్తి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇస్తే.. తర్వాత ఏం జరిగిందనేదే 'కలి' థీమ్.ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.దేవుడు మనం ఎన్నాళ్లు బతకాలనేది నిర్ణయిస్తాడు. కానీ మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే పాయింట్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో చెప్పడం బాగుంది. నిడివి కూడు కేవలం గంటన్నరే. ఇలా ప్లస్సలు ఉన్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. సినిమా అంతా కూడా శివరామ్, కలి పాత్రల మధ్య తిరుగుతుంది. యుగాలు, చనిపోవాలనుకున్న వాడితో గేమ్ ఆడటం బాగున్నప్పటికీ పదే పదే ఒకే సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ ఎమోషన్స్ బాగానే పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్ అగస్త్య సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా ఓకే. టెక్నికల్ విషయానికొస్తే స్టోరీ మంచి ఐడియా. కమర్షియల్ అంశాలు అని కాకుండా దర్శకుడు శివ శేషు.. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్గా చెప్పాడు. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి గానీ ఉన్నంతలో బాగా తీశారు. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.- రేటింగ్: 2.75/5-చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ) -
‘కలి’లో మంచి కంటెంట్ ఉంది : వరుణ్ తేజ్
మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్తో వస్తున్న ‘కలి’ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించాలని కోరుతున్నాను’అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్, ప్రియదర్శి, ఆకాశ్ జగన్నాథ్తో చిత్రబృందం పాల్గొంది. కథ కొత్తగా అనిపించింది: కె. రాఘవేంద్ర రెడ్డి‘‘కరోనా ప్యాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఎక్కవగానే ఉన్నాయంటున్నారు. అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తిని ఎవరైనా అడ్డుకుని, వారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఈ పాయింట్తో ‘కలి’ కథను శివ శేషు రాసుకున్నాడు. కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించాను’’ అని అన్నారు కె. రాఘవేంద్ర రెడ్డి. ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కలి’. శివ శేషు దర్శకత్వంలో కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘జీవితంలోని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న శివరాజ్ జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి రావడం వల్ల ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ. దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. కలి అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం నేను రెండు కథలు రాస్తున్నాను’’ అని అన్నారు. -
‘కాళీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విడుదలకు రెడీ అవుతున్న 'కలి' సినిమా
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా 'కలి'. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో 'రుద్ర క్రియేషన్స్' సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రచనతో పాటు దర్శకత్వం కూడా శివ శేషు వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలకు రెడీ అవుతోంది.'కలి' పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతుంది. ఈ చిత్రంలో ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు నటిస్తున్నారు. -
ఇదేం పెర్ఫ్యూమ్ రా బాబు..! కొనుగోలు చేస్తారా ఎవరైనా ..?
పెర్ఫ్యూమ్ అంటే మంచి సువాసనభరితంగా చుట్టు ఉన్నవారిని తనవైపుకు ఆకర్షించేలా అటెన్ష్ తీసుకొస్తుంది. ఆ ఘుమాళింపు ముక్కుపుటలను తాకగానే అబ్బా అని మైమరచిపోయేలా ఉండే లగ్జరియస్ పెర్ఫ్యూమ్లను ప్రముఖ బ్రాండ్లు విడుదల చేస్తాయి. ఆ పేరుకి తగ్గ రేంజ్లోనే ఆ ఫెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫెర్ఫ్యూమ్ పేరు వినగానే కళ్లెర్రజేయడం ఖాయం. ఛీ ఇదేం ఫెర్ఫ్యూమ్ ఆ పేరేంటి అని చిరాకు పడిపోతారు. చెప్పాలంటే ఇలాంటి ఫెర్ఫ్యూమ్ని ఎవ్వరైనా కొనే సాహసం చేస్తారా అనే సందేహం రాకుండా ఉండదు కూడా. ఏంటా ఫెర్ఫ్యూమ్ కథా కమామిషు అంటే..దుబాయ్ రాజు కుమార్తె షేఖా మహ్రా అల్ మక్తూమ్ కొత్త పెర్ఫ్యూమ్ని టీచర్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెర్ఫ్యూమ్ని తన బ్రాండ్ మహ్రా ఎం పేరుతో విడుదల చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపి వివాదానికి దారితీసింది. ఆ టీజర్లో పెర్ఫ్యూమ్ పేరు "విడాకులు" అనే పదం చెక్కబడిన నల్లని సీసాపై ఉంది. విరిగిన గాజు, నల్లని చిరుతపులితో ఉండిన వీడియో వృత్తం 'డివోర్స్' ఇతి వృత్తాన్ని చెబుతున్నట్లుగా ఉంది. ఆ పెర్ఫ్యూమ్ లైన్ చూసి ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు. ఒకరేమో మహ్రా చాలా తెలివిగా, గౌరవప్రదంగా వ్యాపారం ప్రారంభించిందని ప్రశంసించగా, చాలామంది మాత్రం భర్త నుంచి విడిపోయాననే బాధతో మరీ ఇలా చేస్తుందా..?, ఆమె చాలా క్రియేటివ్ అంటూ వెటకారంగా పోస్టులు పెట్టారు. అయితే ఆమె ఇస్లామిక్ పద్ధతిలో ఇన్స్టాలో తన భర్తకు బహిరంగంగా ట్రిపుల్ తలాక అని విడాకులు ఇచ్చిన కొన్నివారాల తర్వాత ఇలా యువరాణి మహ్రా వివాదాస్పదమైన విధంగా టీచర్ని విడుదల చేయడంతో ఇంతలా ఊహగానాలకు తెరలేపింది. దీంతో నెటిజన్లు విడాకుల గురించే సోషల్ మీడియాలో ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యక్షంగా ఇలాంటి టీచర్ విడుదల చేసిందంటూ ఫైర్ అయ్యారు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని అయిన దుబాయ్ పాలకుడి కుమార్తె మహ్రా యూఏఈలో మహిళ సాధికారత, స్థానిక డిజైనర్ల తరుఫు న్యాయవాది. View this post on Instagram A post shared by @mahraxm1 (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా'.. ఆసక్తిగా టీజర్!
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని శివ సాషు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన కలి టీజర్ చూస్తే ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'అడిగేవాడు లేకపోయినా ఆఖరి కోరిక చెబుతున్నా.. నెక్ట్స్ లైఫ్ ఉంటుందో లేదో తెలియదు.. ఉంటే మాత్రం మనిషిగా పుట్టకూడదు.. మంచితనంతో అస్సలు పుట్టకూడదు.' అనే డైలాగ్లో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో ట్విస్ట్లు, సన్నివేశాలు ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో నేహా కృష్ణన్, గౌతన్ రాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, సివిఎల్ నరసింహారావు, మణిచందన, మధు మణి, త్రినాధ కీలక పాత్రల్లో నటించారు. -
‘కలి’ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది: నాగ్ అశ్విన్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.ఇక టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
బిగ్బాస్ బ్యూటీ ప్రేమ పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన భామ!
బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా- యువికా చౌదరి త్వరలో పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు. బిగ్బాస్ -9 సీజన్లో పరిచయమైన ఈ జంట ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్బాస్ హౌస్లో ఉండగానే ప్రిన్స్.. ఆమెకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమకు ముగ్దురాలైన యువిక వెంటనే ఓకే చెప్పింది. అనంతరం ఈ ప్రేమజంట 2018 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.తాజాగా యువికా చౌదరి గర్భం ధరించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'మా జీవితాల్లోకి త్వరలోనే బేబీ రాబోతోంది' అంటూ ఇన్స్టా వేదికగా రాసుకొచ్చారు. తన భార్య నుంచి అందుకునే ఉత్తమ బహుమతి ఇదే అంటూ ఆమెకు ప్రిన్స్ నరులా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. 2019లో నాచ్ బలియే అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారు. ప్రిన్స్ నరౌలా రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించేవాడు. 2015లో వచ్చిన రోడీస్- 2 సీజన్లో విజేతగా నిలిచాడు. మరోవైపు అతను స్ప్లిట్స్ విల్లా 8వ సీజన్ ట్రోఫీ గెలుచుకున్నాడు. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ టైటిల్ అందుకున్నాడు. నటి యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, వీరే కీ వెడ్డింగ్, ఎస్పీ చౌహాన్, ద పవర్ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by PRINCE YUVIKA NARULA ❤️❤️❤️ (@princenarula) -
చేపలు పట్టేందుకు రూ.581 కోట్లు.. సౌదీ ప్రిన్స్ విలాసం
సౌదీ యువరాజు తుర్కీ బిన్ ముక్రిన్ అల్ సౌద్ ఇటీవల తన సరికొత్త టాయ్ టెస్లా సైబర్ ట్రక్తో కలిసి దిగిన ఫోటో వైరల్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. అయితే ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైన స్పోర్ట్ ఫిషింగ్ యాచ్ (క్రూయిజ్) కొనుగోలు చేశారు.సముద్ర పరీక్షలను పరిచయం చేసేటప్పుడు, దానిని తయారు చేసిన సంస్థ రాయల్ హుయిస్మాన్ ఈ పడవను "ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన వ్యక్తిగత స్పోర్ట్ ఫిష్ పడవ"గా వర్ణించింది. 52 మీటర్ల పొడవు, ఆరు డెక్ల ఎత్తుతో దీన్ని రూపొందించారు. ఇది ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ కంటే రెండు మీటర్లు అధికంగా పొడవు ఉంటుంది.ఈ విలాసవంతమైన నౌకలో పొడవైన విల్లు, ఎత్తైన రక్షణ కవచాలు, వెనుక భాగంలో లో ఫిషింగ్ కాక్పిట్ ఉన్నాయి. డచ్ సంస్థ రాయల్ హుయిస్మాన్ ప్రకారం.. ఈ పడవ యూఎస్ నేవీకి చెందిన జుమ్వాల్ట్-క్లాస్ డిస్ట్రాయర్ను అధిగమించి, 35 నాట్ల అద్భుతమైన వేగాన్ని చేరుకుంటుంది. పరిమాణం, వేగం అద్భుతమైన కలయికతో, ప్రస్తుతం సముద్ర ప్రయోగాలలో ఉన్న ‘స్పెషల్ వన్’ గణనీయమైన దృష్టిని, డిమాండ్ను పొందింది. లైసెన్స్డ్ హెలికాప్టర్, ఫిక్స్డ్-వింగ్ పైలట్ అయిన ప్రిన్స్ తుర్కీ ఈ ప్రత్యేక పడవను 70 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. -
టెస్లా సైబర్ట్రక్ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్
సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్ట్రక్ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్ట్రక్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్ట్రక్ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.Cool https://t.co/oS0gzawPCg— Elon Musk (@elonmusk) May 18, 2024 -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హాట్ ప్రిన్స్ పెళ్లి, పిక్స్ వైరల్
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 1788 గదులున్న ప్యాలెస్లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ నేపధ్యంలో తొమ్మిదేళ్ల క్రితం హర్యానాలో జరిగిన ప్రిన్స్ రెస్క్యూ ఆపరేషన్ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోగల హల్దేహరి గ్రామంలో తొమ్మిది ఏళ్ల క్రితం బోరుబావి ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ 60 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో పడిపోయాడు. మూడు రోజులపాటు అదే బావిలో మగ్గిపోయాడు. అయితే సైన్యం బోరుబావి దగ్గర సొరంగం నిర్మించి ఆ బాలుడిని రక్షించింది. అది జూలై 21, 2006.. హల్దేహరి గ్రామానికి చెందిన ప్రిన్స్ తన స్నేహితులతో ఆడుకుంటూ, తెరిచివున్న బోరుబావిలో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని ప్రిన్స్ కుటుంబసభ్యులకు తెలిపారు. కొడుకు బోరు బావిలో పడిపోయాడని తెలియగానే వారంతా నిస్తేజంగా మారిపోయారు. కొద్దిసేపటికే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ప్రిన్స్ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు సైన్యం సహాయాన్ని కోరారు. వెంటనే భారత సైన్యం ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు మొదలుపెట్టింది. చీకట్లో ప్రిన్స్ భయపడకుండా ఉందేందుకు సైన్యం మొదట బోర్వెల్లో లైట్లు ఏర్పాటు చేసింది. అనంతరం అతనికి తాడు సహాయంతో బిస్కెట్లు, నీళ్లు, జ్యూస్ అందించారు. దాదాపు 50 గంటల పాటు శ్రమించిన అనంతరం సైన్యం ప్రిన్స్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ప్రిన్స్ను బోర్వెల్లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఆ బోర్వెల్ దగ్గర సొరంగం నిర్మించింది. ఈ మార్గం గుండా సైన్యం ప్రిన్స్ దగ్గరకు చేరుకుంది. ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఆ సమయంలో దేశ ప్రజలంతా ప్రిన్స్ క్షేమం కోరుతూ ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రస్తుతం ప్రిన్స్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం ప్రిన్స్ ఉంటున్న గ్రామాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రిన్స్ పేరుతో వచ్చిన పరిహారంతో ఆ బాలుని కుటుంబం ఇల్లు నిర్మించుకుంది. ఇది కూడా చదవండి: కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు -
అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్?
దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీర్లను కలుస్తారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కలవడం వెనుక తన ఇమేజ్ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్ ఇస్లామాబాద్కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. పాక్ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ గైర్హాజరు! -
అతనో రాజవంశస్తుడు..కానీ 'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..
తల్లిదండ్రులు సమాజంలో ఎంతటి గొప్ప స్థితిలో ఉన్న వారికి పుట్టే పిల్లలు బాగుండాలని రూల్ లేదు. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. సామరస్య పూర్వకంగా వాస్తవాన్ని అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అంగీకరించేందుకు సిద్ధపడకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇది వాళ్లకు తెలియకుండానే వారి వాళ్లేనే శత్రువులా చేసి..వారిలోని దుర్మార్గం అనే కోణాన్ని పరిచయం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్కి చెందిన ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ్పిప్లా మహారాజుల వారసుడు. అతను స్వలింగ సంపర్కుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొడుకుకి బ్రెయిన్ శస్త్ర చికిత్స చేయించి.. మాములు వ్యక్తి మాదిరిగా మార్చాలనుకున్నారు. అందుకోసం వైద్యులను సంప్రదించి ఎలక్ట్రిక్ షాక్ థెరపీని ఇప్పించే యత్నం చేశారు. ఇది మన్వేంద్ర సింగ్ మనసుని మెలితిప్పినట్లు అనిపించింది. అయితే అతన తల్లిదండ్రలు తన పట్ల ప్రవర్తించే తీరుని తప్పుపట్ట లేదు. వైద్యులు కూడా ఇది మాసికి రుగ్మత కాదని ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పడంతో వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. బహుశా ఇదే అతనికి స్వలింగ సంపర్కుల కోసం కృషి చేయాలనేందుకు నాంది పలికిందేమో!. ప్రస్తుతం మన్వేంద్ర సింగ్ ఈ విషయమై సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. తనలా చాలామంది స్వలింగ సంపర్కులు బాధపడుతున్నారని, సమాజానికి భయపడి వారికి ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇది అమానుషం, చట్టం విరుద్ధం అని మన్వేంద్ర సింగ్ వాదన. అలాగే ఈ విషయమై తమ పిల్లలను హింసించే హక్కు తల్లిదండ్రలకు లేదంటూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. భారత న్యాయవ్యవస్థ చాలా ఉదాసీనతగా ఉందని, కాబట్టి తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంలో నా తల్లిదండ్రులనే కాదు ఇతర వ్యక్తులను కూడా ద్వేషించను. ఎందుకంటే ప్రజకు దీనిపై అవగాహన లేకపోవడమే అందుకు ప్రదాన కారణమని చెబుతున్నాడు. వారికి వాస్తవాలను వివరించి, అవగాహన కల్పించడమే తన ధ్యేయం అని అంటున్నాడు. 2006లో ఈ యువరాజు మన్వేంద్ర సింగ్ కథ గుజరాత్ న్యూస్ ఛానల్స్ హాట్ టాపిక్గా నిలిచింది. అంతేగాదు అతను 2007లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓప్రా విన్ఫ్రే షోకి గెస్ట్గా రావడం విశేషం. అతను గుజరాత్లో స్వలింగసంపర్కుల ఛారిటీ 'లకీషా'వ్యవస్థాపకుడు కూడా. రాజవంశస్తుడైన తన స్థితిని చూసి భయపడక స్థైర్యంగా బహిరంగంగా చెప్పడమే గాక తనలాంటి వాళ్ల కోసం పాటుపడటం గ్రేట్. 'రాజు' అంటే ఏంటో చూపించాడు మన్వేంద్ర సింగ్ గోపాల్. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
లండన్లో బర్గర్లు పంచిన ప్రిన్స్ విలియం.. దీనికి భారత్తో సంబంధం ఇదే..
బ్రిటన్లోని కొందరికి మొన్నటి ఆదివారం మరపురానిదిగా మిగిలిపోతుంది. ప్రిన్స్ విలియం లండన్లో ఒక ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణానికి హాని చేయని బర్గర్లను కొందరికి పంచిపెట్టారు. ఇది చూపరులను ఎంతగానో ఆశ్ఛర్యపరిచింది. వార్షిక ఎర్త్షాట్ పురస్కారాల పంపిణీలో భాగంగా గత ఏడాది విజేతలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘ఎర్త్షాట్ బర్గర్ల’ను అందించారు. ఈ పురస్కారాలను పర్యావరణానికి విశేషమైన సేవలు అందించిన ఐదుగురికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ చానల్ సార్టెడ్ ఫుడ్లో షేర్ చేశారు. ఈ చానల్లో పర్యావరణ అనుకూలమైన వంటగది పరికరాలు, రకరకాల వంటకాల తయారీ విధానాలు కనిపిస్తాయి. వీడియో ప్రారంభంలో ప్రిన్స్ విలియం సార్టెడ్ ఫుడ్కు సంబంధించిన స్టూడియోకి చేరుకుంటారు. గత ఏడాది ఎర్త్షాట్ పురస్కార విజేతలు రూపొందించిన వాటిని ఒక వ్యక్తి పట్టుకుని ఉంటాడు. తరువాత బర్గర్ తయారు చేస్తుంటారు. ప్రిన్ ఆ డిష్ తీసుకుని జనం మధ్యలోకి చేరుకుంటారు. వీడియోలో ఫుడ్ ట్రక్ దగ్గర ప్రిన్స్ విలియం నిలుచుని, మీరు తినబోయే కంటైనర్ను నోట్ప్లా అనే కంపెనీ తయారు చేసిందని, దీనిలో ఎలాంటి ప్లాస్టిక్ను ఉపయోగించలేనది వినియోగదారులకు ఆయన చెప్పడాన్ని వినవచ్చు. ఈ కంటైనర్లకు సముద్రపు పాచితో తయారు చేస్తారు. బర్గర్లోని పదార్థాలను భారతదేశంలోని ఖేతీ అనే సంస్థ గ్రీన్హౌస్లలో ఉత్పత్తి చేసిందని ప్రిన్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. ముకూరు క్లీన్ స్టవ్పై బర్గర్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కెన్యాకు చెందిన ఓ మహిళ ఈ స్టవ్ను డిజైన్ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఉత్పాదన లక్ష్యం. ఇది కూడా చదవండి: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం -
ఉదయ్పూర్ యువరాజు మనసు దోచిన వెహికల్ ఇదే! నెట్టింట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్లు చేరాయి. ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్లు, ఇండియూజువల్ AC వెంట్లు , ఛార్జింగ్ పోర్ట్లు వంటి ఫీచర్లున్నాయి. ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు. -
రామ్ పోతినేని సినిమాలో విలన్గా ప్రిన్స్.. !!!
తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో ప్రిన్స్. బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను సినిమాలో విలన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రిన్స్ విలన్ రోల్లో నటిస్తున్నాడు. పవర్ ఫుల్ విలనిజాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. రామ్, బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. -
ప్రిన్స్ నష్టాలు.. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులిచ్చి ఆదుకున్న హీరో
శివకార్తికేయన్ నటించిన ద్విభాషా చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, డి.సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. తెలుగు, తమిళంలో అక్టోబర్ 21న రిలీజైన ఈ మూవీ వసూళ్లు రాబట్టడంలో ఫెయిలైంది. ఫలితంగా అంచనాలు తప్పి రెండు చోట్లా ఫ్లాప్గా నిలిచింది. దీంతో రూ.12 కోట్ల మేర నష్టాలు వచ్చాయట! అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు హీరో శివకార్తికేయన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు వారు నష్టపోయిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేశాడట. అంటే దాదాపు ఆరు కోట్ల మేర వారికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఉక్రెయిన్ నటి మారియా ర్యాబోషప్క హీరోయిన్గా నటించగా తమన్ సంగీతం అందించాడు. చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారిసు ట్రైలర్ ముంబైలో డూప్లెక్స్ ఇల్లు అమ్మేసిన హీరోయిన్ -
‘ఎస్ 5: నో ఎగ్జిట్’ రివ్యూ
టైటిల్: ఎస్ 5: నో ఎగ్జిట్ నటీనటులు: తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ తదితరులు నిర్మాతలు: అదూరి ప్రతాప్రెడ్డి, దేవు శ్యాముల్, షైక్ రహీమ్, గాదె మిల్కిరెడ్డి, గౌతమ్ కొండెపూడి దర్శకత్వం: భరత్ కోమలపాటి సంగీతం: మణిశర్మ విడుదల తేది: డిసెంబర్ 30, 2022 కథేంటంటే.. సుబ్బు(తారకరత్న).. ముఖ్యమంత్రి సుబ్రహ్మణ్యం నాయుడు(సాయి కుమార్) కొడుకు. తండ్రికి రాజకీయంగా అండగా ఉంటాడు. తనను ప్రాణంగా ఇష్టపడే కొడుకు బర్త్డే వేడుకలను కాస్త వెరైటీగా చేద్దామని ట్రైన్లో ప్లాన్ చేస్తాడు సీఎం. బర్త్డే పార్టీ కోసమని సుబ్బు, స్నేహితుల కోసం విశాఖ పట్నం వెళ్లే ట్రైన్లో స్పెషల్ బోగీని ఏర్పాటే చేస్తాడు. ఆ బోగిలోకి అనుకోకుండా సన్నీ(ప్రిన్స్)కి సంబంధించిన బృందం ఎక్కుతుంది. సుబ్బు, సన్నీ టీమ్ మధ్య గొడవ జరుగుతుంది. దీంతో సన్నీ టీమ్ మధ్యలోనే ట్రైన్ దిగేందుకు సిద్దమవుతుంది. కానీ డోర్స్ ఓపెన్ కావు. అంతేకాదు బోగీలో ఉన్నవాళ్లు ఒక్కొక్కరుగా మాయవుతుంటారు. ఇంతలోనే ఆ బోగీ అగ్ని ప్రమాదానికి గురవుతుంది? అసలు ఆ బోగీ డోర్స్ ఎందుకు ఓపెన్ కాలేదు? అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? కొడుకు బర్త్డే వేడుకలను ట్రైన్లోనే జరపాలని ముఖ్యమంత్రి ఎందుకు ప్లాన్ చేశాడు? బోగీలో దాగి ఉన్న సీక్రెట్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. అధికారం కోసం కొంతమంది ఎంతటి క్రూరమైన నిర్ణయాలైన తీసుకుంటారనేది ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో తడబడ్డాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథను మొదలెట్టాడు. ట్రైన్లో జరిగే సన్నివేషాలను అలీ ‘బిగ్బాస్’షోతో పోల్చడం నవ్వులు పూయిస్తుంది. దెయ్యం ఒక్కొక్కరిని మాయం చేయడం.. అసలు ఏం జరుగుతుందో తెలియక బోగీలో వాళ్లు టెన్షన్ పడడం ఆసక్తికరంగా అనిపించనప్పటికీ.. కొన్ని లాజిక్ లేని సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. సెకండాఫ్లో వచ్చే ట్విస్టులు కాస్త ఆకట్టుకుంటాయి. ఇక నటీనటుల విషయానికొస్తే.. తారకరత్న గెటప్ బాగుంటుంది. కానీ అతని నటన అంతగా ఆకట్టుకోలేకపోయింది. దొంగల ముఠా సభ్యునిగా ప్రిన్స్ నటన పర్వాలేదు. సీఎం పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయాడు. టీసీగా అలీ, యూట్యూబర్గా సునీల్ కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. రఘు, మెహబూబ్ దిల్సే తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. మణిశర్మ నేపథ్య సంగీతం బాగుంది. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి. -
థాయ్ ప్రిన్స్కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్లాండ్లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
ఓటీటీలో ప్రిన్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
హీరోహీరోయిన్లు శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ప్రిన్స్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 25 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథేంటంటే.. శివకార్తికేయన్ ఓ స్కూలు టీచర్. అదే స్కూల్లోని ఇంగ్లీష్ టీచర్ మరియాను ప్రేమిస్తాడు. ఇతడు ఇండియన్ అబ్బాయి, అక్కడ ఆమె బ్రిటీష్ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు రెడ్ సిగ్నల్ పడుతుంది. దీంతో ఇది ప్రేమ పోరాటంలా కాకుండా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి ఆనంద్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ. ‘All Indians are my brothers and sisters’#PrinceOnHotstar from November 25, Only on @DisneyPlusHSTel. Here's the trailer ▶️ https://t.co/uGjmaidbTq@Siva_Kartikeyan @anudeepfilm @maria_ryab @SureshProdns @SVCLLP @ShanthiTalkies @manojdft @Cinemainmygenes #Sathyaraj pic.twitter.com/VuFtGeWLLz — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 15, 2022 చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఇటీవల ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ప్రిన్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
‘జాతిరత్నాలు’ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జాతి రత్నాలు మాదిరే ఈ చిత్రంలో కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నవంబర్ 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిస్తున్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకొని ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ‘ప్రిన్స్’ కథేంటంటే.. ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్లో పడతాడు. ఇంగ్లండ్కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! -
మేం ఊహించిన దానికంటే ఎక్కువే రెస్పాన్స్ వస్తుంది : అనుదీప్
‘‘ప్రిన్స్’ చిత్రానికి తెలుగుతో పాటు తమిళ్లో కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. అన్నివర్గాల ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని దర్శకుడు అనుదీప్ కేవీ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా అనుదీప్ కేవీ మాట్లాడుతూ–‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచనే ‘ప్రిన్స్’ కథకు స్ఫూర్తి. ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేయమని సురేష్ బాబు, సునీల్, రామ్మోహన్గార్లు స్వేచ్ఛ ఇచ్చారు. నేను కామెడీ సినిమాలు చేసేందుకు చార్లీ చాప్లీన్, జంధ్యాల, రాజ్ కుమార్ సంతోషి వంటి వారు స్ఫూర్తి. బాలచందర్గారి సినిమాలు అంటే ఇష్టం.. ఆయన తరహాలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేయాలని ఉంది. హారిక హాసినీ, మైత్రీ మూవీ మేకర్స్లో నా తర్వాతి సినిమాలు ఉంటాయి. హీరో రామ్గారికి ఓ కథ చెప్పాలి’’అన్నారు. -
ప్రిన్స్ రివ్యూ: జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా?
టైటిల్: ప్రిన్స్ తారాగణం: శివకార్తికేయన్, మరియా, సత్యరాజ్, ప్రేమ్జీ తదితరులు దర్శకుడు: అనుదీప్ కేవి సంగీతం: తమన్ సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస నిర్మాతలు: సునీల్ నారంగ్, సురేశ్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022 ఒక సినిమా విజయం సాధించిందంటే ఆ డైరెక్టర్ బాధ్యత రెట్టింపు అవుతుంది. తర్వాతి సినిమా అంతకు మించి విజయాన్ని సాధించేలా తీయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా నెక్స్ట్ ఎలాంటి మూవీ తీస్తారోనని ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితే ఎదురైంది దర్శకుడు కేవీ అనుదీప్కి. గతేడాది జాతిరత్నాలు మూవీతో ఊహించనంత సక్సెస్ను ఖాతాలో వేసుకున్న అనుదీప్ ఈసారి ప్రిన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. మరి అనుదీప్ మరోసారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? ప్రిన్స్ మూవీ ఎలా ఉంది? ఓసారి చూసేద్దాం.. కథ: ఓ స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వారసుడు ఆనంద్(శివకార్తికేయన్). ఇతడో స్కూలు టీచర్. హీరో తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) కులమతాలకు వ్యతిరేకి, అందరూ కలిసి ఉండాలనుకునే వ్యక్తి. ఇక హీరో తన స్కూల్లోనే మరో టీచర్(బ్రిటీష్ అమ్మాయి) అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)తో లవ్లో పడతాడు. ఇంగ్లండ్కు చెందిన జెస్సిక తండ్రికి ఇండియన్స్ అంటేనే గిట్టదు. దీంతో వారి ప్రేమకు అతడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు. రానురానూ ఇద్దరి మధ్య లవ్స్టోరీ కాస్తా రెండు దేశాల మధ్య వార్లా మారుతుంది. మరి ఆనంద్ ప్రేమ సక్సెస్ అయిందా? అతడిని ఊరి నుంచి ఎందుకు గెంటేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: ప్రిన్స్ సినిమాలో మూడు కోణాలు ఉన్నాయి. కామెడీ, లవ్ స్టోరీ, మానవత్వం అనే అంశాలను టచ్ చేశాడు డైరెక్టర్. అనుదీప్ అంటేనే కామెడీ కాబట్టి ఎక్కువగా కామెడీనే నమ్ముకున్నాడు. కానీ అక్కడక్కడా కామెడీ పండించే సీన్లను సాగదీయడం కొంత చిర్రెత్తిస్తుంది. ముఖ్యంగా బాటిల్ గార్డ్ ఎపిసోడ్ చూసిన జనాలకు అరె ఏంట్రా ఇది అనిపిస్తుంది. లవ్ సీన్స్ కొన్నిచోట్ల అమాయకత్వం ఉట్టిపడుతూ బాగుంటాయి. అనుదీప్ టేకింగ్, శివకార్తికేయన్ నటన రెండూ కరెక్ట్గా సరిపోయాయి. కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు మాత్రం రొటీన్ ఫార్మాట్లోనే వెళ్లినట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్ అక్కడక్కడ బాగుంటుంది. కానీ సెకండాఫ్ మాత్రం తన ట్రేడ్ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు అనుదీప్. డైలాగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్లో హీరో దేశభక్తి కంటే హ్యుమానిటీనే గొప్పదని చెప్పే స్పీచ్ బాగుంటుంది. అనుదీప్ ఎంచుకున్న కాన్సెప్ట్ సీరియస్గా కనిపించినా దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ పద్ధతిలోనే డీల్ చేశాడు. ఏం చేసినా ఏం రాసినా అంతా నవ్వించడం కోసమే అన్నట్లు ఉంటుందీ చిత్రం. మరీ జాతిరత్నాలు రేంజ్లో కాకపోయినా కామెడీ ఇష్టపడేవారికి ప్రిన్స్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే? శివ కార్తికేయన్ అదిరిపోయే కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్. ప్రేమ్ జీ పంచులతో ఎంటర్టైన్ చేశాడు. హీరోయిన్ మరియా లుక్, నటన ఫ్రెష్గా ఉంది. అనుదీప్ కామెడీ చేస్తూనే మనుషులంతా ఒక్కటేనని సింపుల్గా చెప్పాడు. ప్రధాన పాత్రల మాటలు ఫన్ క్రియేట్ చేస్తూనే ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి. తమన్ అందించిన సంగీతం కొంతవరకు ఆకట్టుకుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్లు సాగదీయకుండా కట్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా ప్రిన్స్.. నో లాజిక్.. ఓన్లీ కామెడీ మ్యాజిక్! చదవండి: సర్దార్ మూవీ రివ్యూ సౌత్ సినిమాలు చేయాలనుంది -
ప్రిన్స్ ఓ చాలెంజ్
‘‘ప్రిన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇందులోని డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్గా ఉంటాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ మా సినిమా నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్ అన్నారు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పంచుకున్న విశేషాలు... ► నటుడిగా అన్ని భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకులని అలరించాలని ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి. నాకు కామెడీ సినిమాలు చేయడం అన్నా, చూడటం అన్నా చాలా ఇష్టం. నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా ఎగై్జట్ చేయడంతో ‘ప్రిన్స్’ కి ఓకే చెప్పాను. ► ‘ప్రిన్స్ నా తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ఒక సవాల్తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో కథ రాశారు. తెలుగు స్క్రిప్ట్ని తమిళ్లో చేయడం ఒక సవాల్గా తీసుకొని పని చేశాం. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. నా పాత్రకి తెలుగులో నేను డబ్బింగ్ చెప్పలేదు. ► ఒక ఇండియన్ అబ్బాయి బ్రిటీష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరి మనుషుల్లో ప్రేమ, పెళ్లి విషయాల్లో మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. వారి ఆలోచనలను బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎగై్జట్ చేసింది. ► నేను కథని ఎంపిక చేసుకునేటప్పుడు గత చిత్రం రిజల్ట్ గురించి ఆలోచించను. ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ కథలో కొత్తదనం ఏంటి? విమర్శకులు దీన్ని ఎలా చూస్తారు? అని ఆలోచిస్తాను. నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. పైగా ప్రిన్స్ అన్ని భాషలకు సరిపోయే టైటిల్.. అందుకే ఆ పేరు పెట్టాం. ► నేను, హీరో నానిగారు ఒకేలా కనిపిస్తామని ప్రేక్షకులు చెబుతుంటారు. నానిగారు కూడా యాంకర్గా, సహాయ దర్శకుడిగా పనిచేసి, హీరోగా ఎదిగారు. నేను కూడా టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. నా పదేళ్ల నట ప్రయాణంలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. ► సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, రామ్మోహన్ రావు కాంబినేషన్లోని ‘ప్రిన్స్’ లో భాగం కావడం హ్యాపీ. తెలుగులో రాజమౌళిగారితో మూవీ చేయాలని ఉంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్గార్ల సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నా. భవిష్యత్లోనూ ద్విభాష(తెలుగు, తమిళ)చిత్రాలు చేయాలనే ఆలోచన నాకు ఉంది. ప్రస్తుతం విజయ్ హీరోగా వంశీ పైడిపల్లిగారు ఓ సినిమా చేస్తున్నారు. అలాగే హీరో రామ్ చరణ్– శంకర్గారు కలసి పని చేస్తున్నారు. తెలుగు–తమిళ పరిశ్రమల వాళ్లు కలిసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. ‘‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్, కాంతార’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. దక్షిణాది పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉండటం సంతోషం. -
ఆ ఐడియా నన్ను ఎక్సయిట్ చేసింది..అందుకే ‘ప్రిన్స్’ చేశా: హీరో
శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక గా నిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న 'ప్రిన్స్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో శివకార్తికేయన్ మీడియాతో ముచ్చుటించారు. ఆ విశేషాలు.. తెలుగులో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశారా ? ప్రిన్స్ ఎలా మొదలైయింది ? ఒక ఆర్టిస్ట్ గా అన్ని చోట్ల సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించాలని, ప్రశంసలు అందుకోవాలని ఉంటుంది. ప్రిన్స్ విషయానికి వస్తే.. ఫన్ సినిమాలు తగ్గిపోతున్నాయి. నా వరకూ కామెడీ సినిమాలు చేయడం చూడటం చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్ ని కలిశాను. ఆయన చెప్పిన లైన్ చాలా నచ్చింది. తర్వాత అది 'ప్రిన్స్' గా మారింది. ప్రిన్స్ యూనివర్షల్ సబ్జెక్ట్. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటాయి. అనుదీప్ కథ చెప్పినపుడు ఏ పాయింట్ మిమ్మల్ని ఎక్సయిట్ చేసింది ? అనుదీప్ జాతిరత్నాలు చూశాను. అనుదీప్ రాసుకునే పాత్రల్లో స్వచ్చమైన అమాయకత్వం ఉంటుంది. పాత్రలు ఊహించని విధంగా రియాక్ట్ అవుతాయి. ప్రిన్స్ స్టొరీ ఐడియా చాలా ఎక్సయిట్ చేసింది. ఒక ఇండియన్ బ్రటిష్ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరిలో మనుషులు మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేమ,పెళ్లి విషయాల్లో వారిది ఒక ఖచ్చితమైన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేసే ఆలోచన చాలా ఎక్సయిట్ చేసింది. ఇందులో సత్యరాజ్ గారి పాత్ర కూడా నన్ను ఎక్సయిట్ చేసింది. సత్యరాజ్ పాత్ర తన కొడుకుతో 'మన కులం, మతం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు' అని చెబుతుంది. చాలా యూనిక్ క్యారెక్టర్ ఇది. డబ్బింగ్ మీరే చెప్పారా ? లేదండీ. తెలుగు భాషపై పూర్తిగా పట్టురానిదే డబ్బింగ్ చెప్పకూడదని నా అభిప్రాయం. డైలాగ్ మాడ్యులేషన్ చాలా ముఖ్యం. అది భాషపై పట్టుసాధిస్తేనే వస్తుంది. అనుదీప్ తో కొంచెం తెలుగు మాట్లాడుతుంటాను. అయితే సొంతగా డబ్బింగ్ చెప్పే అంతా తెలుగు ఇంకా రాలేదు. వరుణ్ డాక్టర్ లో మీ బాడీ లాంగ్వేజ్ చాలా సెటిల్ద్ గా ఉంటుంది. ప్రిన్స్ లో ఎలాంటి బాడీ లాంజ్వేజ్ ఉంటుంది? వరుణ్ డాక్టర్ డార్క్ కామెడీ. నిజ జీవితానికి పోలిక లేని సినిమా. నా పాత్రలో చిన్న స్మైల్, ఎమోషన్ కూడా ఉండదు. కానీ దాని నుంచే హ్యుమర్ పుడుతుంది. రియల్ లైఫ్ లో అలా నవ్వకుండా ఒక్క అరగంట కూడా ఉండలేను(నవ్వుతూ). ప్రిన్స్ క్యారెక్టర్ తో రిలేట్ చేసుకోగలను. అనుదీప్ తనదైన బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. ప్రతి సీన్ ని అనుదీప్ తెలుగులో నటించి చూపించిన తర్వాతే యాక్ట్ చేసేవాడిని. తొలి సారి తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ? ప్రిన్స్ ప్రాజెక్ట్ ఒక సవాల్ తో కూడుకున్నది. అనుదీప్ తెలుగులో రాశారు. తెలుగు స్క్రిప్ట్ ని తమిళ్ చేయడం ఒక సవాల్ గా తీసుకొని వర్క్ చేశాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భవిష్యత్ లో కూడా ద్విభాష చిత్రాలు చేయాలనే ఆలోచన ఉంది. విజయ్, వంశీ పైడిపల్లి గారితో సినిమా చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ - శంకర్ గారు కలసి పని చేస్తున్నారు. రెండు పరిశ్రమలో కలసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. కేజీఎఫ్,ఆర్ఆర్ఆర్, విక్రమ్, కాంతార చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సౌత్ పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది ? ఒక కథ ఎంపిక చేసినప్పుడు గత చిత్రం గురించి అలోచించను. గత చిత్రంలో కామెడీ వర్క్ అవుట్ అయ్యిందని మళ్ళీ అవే ఎలిమెంట్స్ ఉండే కథ ఎంపిక చేయాలని అనుకోను. కథలో సెల్లింగ్ పాయింట్ చూస్తాను. ప్రేక్షకులు ఈ కథని ఎందుకు చూడాలి, ఇందులో కొత్తదనం ఏమిటి, విమర్శకులు దిన్ని ఎలా చూస్తారు ? ఇలా చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటాను పదేళ్ళ జర్నీ అలా జరిగింది ? టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ సోలో హీరోగా ఎదిగాను. ప్రతి అనుభవం నా కెరీర్ కి ఉపయోగపడింది. ఈ పదేళ్ళలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను. మీ జర్నీని తెలుగులో నాని గారితో పోల్చుతారు కదా ? అవును. నాని గారు కూడా యాంకర్ గా సహాయ దర్శకుడిగా పని చేశారు. నేను కూడా పని చేశాను. ప్రేక్షకులు కూడా మేము సిమిలర్ గా కనిపిస్తామని చెబుతుంటారు. నాని గారిది కూడా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రిన్స్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ? ప్రిన్స్ కథలో బ్రిటిష్ కనెక్షన్ ఉంది. ఒక కింగ్ డమ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. అలా ఈ చిత్రానికి 'ప్రిన్స్' అని పేరు పెట్టాం. ప్రిన్స్ నిర్మాతలు గురించి ? సురేష్ ప్రొడక్షన్ లెజెండ్రీ ప్రొడక్షన్ హౌస్. తమిళ్ లో కూడా గొప్ప గొప్ప సినిమాలు చేసిన చరిత్ర వారిది. సురేష్ ప్రొడక్షన్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కారణం సునీల్ గారు. బీగినింగ్ నుంచి చాలా ప్రోత్సహించారు. శాంతి టాకీస్ అరుణ్ చాలా సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ ని చేశాను. తెలుగులో ఏ దర్శకులతో కలసి పని చేయాలని అనుకుంటున్నారు ? రాజమౌళి గారు. ఆయనతో కలసి పని చేయాలని అందరికీ ఉంటుంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? మడోన్నే అశ్విన్ 'మహావీరుడు' చేస్తున్నా. -
శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆ రోజు నాకు చాలా బాధేసింది: విజయ్ దేవరకొండ
‘‘మాకు సినిమాయే జీవితం.. ఎంత ప్రేమించి చేస్తామో మాకు తెలుసు. అలాంటిది ఓ రోజు ఓ సినిమా వేదికపై శివ కార్తికేయన్గారు ఏడుస్తూ మాట్లాడటంతో నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి ఆయన నాకు ఓ బ్రదర్ అనే ఫీలింగ్ కలిగింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శివ కార్తికేయన్ అన్నని ఈ రోజే తొలిసారి కలిశాను. ఆయన ప్రయాణం నాకు నచ్చింది. ఎప్పుడైనా ఆయనకి నేను తోడుంటే బాగుంటుందనిపించింది.. ఆ అవకాశం ఇంత త్వరగా ‘ప్రిన్స్’ రూపంలో వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ (పెళ్లి చూపులు), ఏషియన్ సినిమాస్ (అర్జున్ రెడ్డి) నా కెరీర్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ‘ప్రిన్స్’ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అందర్నీ నవ్వించే అనుదీప్కి ఈ సినిమా బిగ్ బ్లాక్బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘మధ్యతరగతి జీవితాలను అనుదీప్ క్షుణ్ణంగా చదివాడని ‘జాతిరత్నాలు’ చూసిన తర్వాత నాకు అనిపించింది. ముళ్లపూడి వెంకటరమణ, జంధ్యాల, బాపుగార్లు.. మిడిల్ క్లాస్ లైఫ్లను బాగా అర్థం చేసుకుని వినోదాన్ని పండించారు. అనుదీప్ కూడా సీరియస్గా ఉంటూ నవ్వులు పంచుతాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ కథ శివ కార్తికేయన్గారి కోసమే రాశా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు అనుదీప్. కెమెరామేన్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
Sivakarthikeyan: ‘హూ యామ్ ఐ..’
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క హీరోయిన్. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హూ యామ్ ఐ..’ (నేనెవరు) అనే పాటని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని డింకర్ కల్వల పాడారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలి నారంగ్, కెమెరా: మనోజ్ పరమహంస, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
అందుకే ఆ అమ్మాయిని లవ్ చేశా.. ఆసక్తికరంగా ‘ప్రిన్స్’ ట్రైలర్
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. శివ కార్తికేయన్, మరియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు ట్రైలర్ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించారు. 'రేయ్ కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరిదీ ఒకే రక్తం రా' అన్న సత్యరాజ్ చెప్పే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. జెస్సికా అనే బ్రిటీష్ అమ్మాయిని శివ కార్తికేయన్ ప్రేమించే ఆసక్తికర కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో అతను తన ప్రేమ గెలిచాడా? అతను పడ్డ ఇబ్బందులు ఎంటీ? కథ ఎలాంటి ఆసక్తికర మలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. ట్రైలర్ చూస్తే కామెడీ ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 21న దిపావళీకి థియేటర్లలో కనువిందు చేయనుంది. -
దీపావళికి థియేటర్లో ‘ప్రిన్స్’ సందడి
డాక్టర్, డాన్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు శివకార్తికేయన్. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ప్రిన్స్. ఈ చిత్రంతో ఈయన దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్నారు. విశేషం ఏమిటి ఇంతకుముందు తన అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శివకార్తికేయన్ ఈ చిత్రంతో నేరుగా వారి ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అవును తమిళం, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని జాతి రత్నాలు చిత్రం ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్నారు. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ ఈ చిత్రం ద్వారా ఉక్రెయిన్ దేశానికి చెందిన మరియా అనే నటి కథానాయకిగా పరిచయం అవుతోంది. నటుడు సత్యరాజ్, ప్రేమ్జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పిపిలికా పిలాయ్ అనే పాటలు ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు ఆదివారం అధికారికపూర్వకంగా ప్రకటించారు. దీంతో పాటు చిత్ర పోస్టర్ను విడుదల చేస్తూ అక్టోబర్ 21,20200 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రంలో టూరిస్ట్ గైడ్గా నటిస్తున్నట్లు సమాచారం. -
వినాయక చవితికి కాదు దీపావళికి ‘ప్రిన్స్’ వస్తున్నాడు
వినాయక చవితికి రావాల్సిన ప్రిన్స్ దీపావళికి వస్తున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు కేవీ అనుదీప్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ప్రిన్స్’. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో డి. సురేశ్బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా ‘ప్రిన్స్’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహనిర్మాత: అరుణ్ విశ్వ. -
పెళ్లికూతురు పార్టీ.. ఇది అమ్మాయిల కథ
Prince Pellikuturu Party Movie Release Date Announced: ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయి కీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా నటిచిన చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. అపర్ణ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అపర్ణ మాట్లాడుతూ– ‘‘ఇది అమ్మాయిల కథ. ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ చెప్పాను’’అని తెలిపారు. ‘‘మా సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని నటీనటులందరూ బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను’’ అని ప్రిన్స్ పేర్కొన్నాడు. ‘‘ఈ మూవీలో హెలీకాఫ్టర్ పైలెట్గా చేశా. అన్ని ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ డ్రామా చిత్రమిది’’ అన్నారు అర్జున్ కల్యాణ్. ‘‘పీవీఆర్ సినిమాస్తో పాటు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్స్ వారు మా సినిమాకి మంచి సపోర్ట్ చేస్తున్నారు’’ అని నిర్మాత స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సీత తదితరులు పాల్గొన్నారు. చదవండి:👇 లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ -
నేను ప్రెగ్నెంట్ కాదు: బిగ్బాస్ ఫేం
నవంబర్ 4న కర్వా చౌత్ వేడుకల సందర్భంగా బయటకు వచ్చిన బిగ్బాస్ ఫేం ప్రిన్స్ నరులా, యువికా చౌదరి ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. యువికా కారు నుంచి దిగి వస్తుండగా భర్త ప్రిన్స్ ఆమెను చేయి పట్టుకొని ప్రేమగా తీసుకొచ్చాడు.ఈ వీడియోలో యువికా పింక్ కలర్ దుప్పట కలిగిన అనార్కలి దుస్తులను ధరించారు. ఈ డ్రెస్ ఆమెకు కాస్తా వదులుగా ఉండటం, కారు నుంచి దిగగానే దుప్పటతో కవర్ చేయడంతో యువికా ప్రస్తుతం గర్భవతి అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో తాజాగా నటి స్పందించారు. తను గర్భవతినని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇటీవల ఆమె కరోనా బారినపడి కోలుకున్నట్లు పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఆసుపత్రికి వెళ్లగా తనకు కోవిడ్ సోకినట్లు తేలిందన్నారు. అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పుడు వార్తలను సృష్టించవద్దని కోరారు. చదవండి: టాక్ షో హోస్ట్గా సమంత! తన డ్రెస్సింగ్పై మాట్లాడుతూ.. ‘నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ నాకు డిజైన్ కలిగిన దుపట్టా ఇష్టం. అందుకే దాన్ని ధరించాను. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటాం. అది జరగాల్సిన సమయంలో తప్పక జరుగుతంది’ అని పేర్కొన్నారు. కాగా యువికా చౌదరి, ప్రిన్స్ నరులా 2015లో వచ్చిన హిందీ బిగ్బాస్ సీజన్ 9 లో తొలిసారిగా కలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక నిశ్చితార్థం చేసుకొని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ రెండేళ్లలో తన జీవితం ఆనందంగా, సంతోషంగా గడిచిపోయిందని యువికా ఓ పోస్టు రూపంలో పేర్కొన్నారు. కాగా యువికా షారుక్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి View this post on Instagram #princenarula #yuvikachaudhary for #karvachauth ❤ #paptalk A post shared by Viral Bhayani (@viralbhayani) on Nov 4, 2020 at 4:00am PST -
‘క్వారంటైన్ ఉల్లంఘించాను.. క్షమించండి’
బ్రస్సెల్స్: ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి ఓ సామాజిక కార్యక్రమానికి హాజరయ్యాను. క్షమించండి’ అంటూ బెల్జియన్ యువరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. బెల్జియం రాజు ఫిలిప్పి మేనల్లుడు ప్రిన్స్ జోచిమ్ (28) ఒక స్పానిష్ స్నేహితురాలి కుటుంబంలో జరిగిన సామాజిక కార్యక్రమానికి హాజరయినట్లు అధికారుల ప్రకటించారు. యువరాజు మే 24న బెల్జియం నుంచి స్పెయిన్ వెళ్లారు. మే 26న 12-27 మంది అతిథులు హాజరైన ఓసామాజిక సమావేశానికి వెళ్లినట్లు బెల్జియన్ ప్యాలెస్ ప్రెస్ ఆఫీస్ తెలిపింది. రెండు రోజుల తరువాత యువరాజుకు.. కరోనా పాజిటివ్గా తేలింది. ఈ సందర్భంగా జోచిమ్ ‘క్వారంటైన్ నియమాలు ఉల్లంఘించి వేరే ప్రాంతానికి ప్రయాణం చేశాను. ఈ క్లిష్ట సమయాల్లో నేను ఎవరినీ కించపరచాలని, అగౌరవపరచాలని అనుకోలేదు. నా చర్యల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. పర్యవసానాలను అంగీకరిస్తాను’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం స్పెయిన్లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. అయితే కొన్ని మినహాయింపులతో దేశానికి వచ్చే ప్రయాణికులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సభలు సమావేశాలు వంటి వాటికి 15 మందికి పైగా హాజరుకాకుడదు. అయితే జోచిమ్ వెళ్లిన సామాజిక కార్యక్రమానికి 15 మందికి పైగా వచ్చినట్లు స్పానిష్ ప్రభుత్వ ప్రతినిధి రాఫేలా వాలెన్జులా సోమవారం మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో 27 మంది వరకు ఉండవచ్చునని ప్రాంతీయ ఆరోగ్య అధికారులు స్పానిష్ ప్రభుత్వానికి తెలియజేశారన్నారు. (కరోనా: క్వారెంటైన్లోకి మరో ప్రధాని) అయితే స్పెయిన్ అధికారుల వ్యాఖ్యలను ప్రిన్స్ లా ఆఫీస్ ప్రతినిధి ఖండించారు. ప్రిన్స్ ఒక స్నేహితురాలి కుటుంబంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి 15 మంది కంటే ఎక్కువ హాజరు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం యువరాజు తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. -
డ్రంకన్ డ్రైవ్లో సినీనటుడికి జరిమానా
సాక్షి, హైదరాబాద్ : మద్యం తాగి కారు నడుపుతూ ఓ సినీనటుడు కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల కౌన్సిలింగ్ అనంతరం కోర్టుకు తరలించగా జడ్జి సదరు నటుడికి రూ.5వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి కూకట్పల్లి ట్రాఫిక్ సీఐ బోసుకిరణ్, ఎస్ఐ రామక్రిష్ణ ఆధ్వర్యంలో బాచుపల్లి చౌరస్తా వద్ద డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఆ మార్గంలో కారు నడుపుతూ వచ్చిన సినీ నటుడు ప్రిన్స్ సుశాంత్ను ట్రాఫిక్ పోలీసులు ఆపి శ్వాస పరీక్ష చేయగా 42 ఎంజీ మద్యం తాగినట్టు నిర్థారణయింది. దాంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని కౌన్సిలింగ్ అనంతరం ప్రిన్స్ను మంగళవారం కూకట్పల్లిలోని 4వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. -
ప్రధాని మోదీకి ‘జాయెద్ మెడల్’
దుబాయ్: ప్రధాని మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం అత్యున్నత జాయెద్ పురస్కారాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా జాయెద్ అల్ నహ్యాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారత్తో మాకున్న చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మా ప్రియ స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారు. ఆయన కృషికి గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు జాయెద్ పురస్కారాన్ని ప్రకటించారు’ అని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘రెండు దేశాల మధ్య ఎంతోకాలంగా ఉన్న మైత్రిని, ఉమ్మడి వ్యూహాత్మక సహకారాన్ని ఉన్నతస్థాయికి చేర్చడంలో ప్రధాని మోదీ పాత్రకు ఈ పురస్కారమే గుర్తింపు’ అని ఖలీజ్ టైమ్స్ పత్రిక పేర్కొంది. -
మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను మోదీకి ప్రకటించింది. భారత్- యూఏఈ దేశాల మధ్య సంబంధాల్ని మెరుగుపరచినందుకు ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ గతంలో ఈ పురస్కారం అందుకున్నారు. అబుదాబీ యువరాజు, యూఏఈ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఈ అవార్డును నరేంద్ర మోదీకి బహూకరించనున్నారు. ‘‘భారత్తో చరిత్రాత్మక, సమగ్ర, వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడటంలో నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. మోదీ కృషి ఫలితంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాటుపడిన మోదీకి జాయేద్ అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామ’’ని యువరాజు షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. -
మరో రొమాంటిక్ థ్రిల్లర్లో కుమారి
‘అలా ఎలా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న హెబ్బా తరువాత వరుసగా బబ్లీ రోల్స్లో అలరించింది. అయితే వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరీర్ను కష్టాల్లో పడేశాయి. తాజాగా హెబ్బా మరో బోల్డ్ క్యారెక్టర్కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ కిడ్నాప్ ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాడికల్. ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో హెబ్బా హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. -
ప్రేమ ప్రిన్సీ
‘సంప్రదాయ కుటుంబ నేపథ్యంతో కూడిన పాత్రల్లో నటించడమంటే ఇష్టం’ అని చెప్పారు చిన్నితెర నటి ప్రిన్సీ. ‘కుంకుమ పువ్వు’ సీరియల్లో ‘అమృత’ పాత్రధారిగా టీవీ ప్రేక్షకులకు చిరపరిచితమైన ప్రిన్సీ గత కొంత కాలంగా తెలుగు సీరియళ్లలో రాణిస్తున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఫిక్షన్ సీరియల్ ‘ప్రేమ’లోని పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రిన్సీ ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవీ.. అమ్మ దిద్దించిన అభినయం మేం జన్మతః మలయాళీలం అయినా కర్ణాటకలో సెటిలయ్యాం. మా అమ్మకు నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో రకరకాల కేరక్టర్లను అనుకరిస్తూ అభినయిస్తుంటే చూస్తూ, రకరకాల డ్రెస్సులవీ వేసి ర్యాంప్వాక్ చేయిస్తూ మురిసిపోయేది. అలా అలా నేనూ యాక్టింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఓ రకంగా మా అమ్మగారు నటన వైపు నన్ను ఫోర్స్ చేశారనే చెప్పాలి. సరదాగా ఓకే చెప్పా! యాక్టింగ్ అభిరుచిగా ఉన్నా... చదువులో కూడా మంచి మార్కులే తెచ్చుకునేదాన్ని. నిజానికి ఐఎఎస్ ఆఫీసర్ కావాలనేది నా లక్ష్యం. అయితే టీనేజ్లోనే ఓ సీరియల్ నిర్మాతలు సంప్రదించడంతో చిన్నప్పటి అభిరుచి తీర్చుకుందామని సరదాగా ఓకే చెప్పాను. అనుకోకుండా ఆ సీరియల్ ద్వారా నాకు మంచి పేరు రావడం, తర్వాత తర్వాత సీరియల్స్లో బిజీ కావడంతో చదువుకు స్వస్తి చెప్పక తçప్పలేదు. అలాగే తెలుగు టీవీకి కూడా పరిచయం అయ్యాను. ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తుండడంతో ప్రస్తుతం కర్ణాటకలోని షిమోగ నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నాను. షూట్స్ ఉన్న సమయంలో వచ్చి వెళ్తుంటాను. చిన్నితెరే సురక్షితం అమ్మాయిలకు వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. అయితే సినీ నటీ నటులకు ఆదరణ ఎక్కువ కావడంతో సహజంగానే వారిపై కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దీంతో వారికి సంబంధించిన విషయాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తుంటాయి. మిగతా వాటితో పోల్చితే చిన్నితెర అమ్మాయిలకు మరింత సురక్షితమైనదని నా అభిప్రాయం. చాలావరకూ అవుట్ డోర్ షూటింగ్స్ ఉండవు. సినిమాల్లో నటించకూడదని ఏమీ అనుకోవడం లేదు, అలాగే చేసి తీరాలనే లక్ష్యాలు కూడా ఏమీ లేవు. ఒకవేళ మంచి అవకాశాలు వచ్చి అవీ ట్రెడిషనల్ పాత్రలైతే తప్పక చేస్తాను. అలాగే అవుదామనుకుని కాలేకపోయిన ఐఎఎస్ ఆఫీసర్ పాత్ర వస్తే మాత్రం వదులుకోను. తెలుగొచ్చేసింది సీరియల్స్లో మాటలు దానికి తగ్గ హావభావాలు, బరువైన సన్నివేశాలు సహజం. దీంతో భాష రాకపోవడం వల్ల మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాకు తమిళ్ బాగా వచ్చు. దీనివల్ల తమిళం వచ్చినవారు నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు. అలా అలా ఇప్పుడు తెలుగు కూడా బాగానే వచ్చేసింది. కన్నడ, మలయాళం, తమిల్, ఇంగ్లిష్, తెలుగు భాషలు వచ్చు. రెండు అవార్డులు తెలుగులోనే వచ్చాయి. దాంతో అక్కడ సాధించలేనిది ఇక్కడ సాధించానని హ్యాపీగా ఉంది. – నిర్మలారెడ్డి -
అరటి పువ్వులా ఉండ కూడదు!
దేవదత్తుడు ఒక యువరాజు. చిన్ననాటినుంచి బుద్ధుని పట్ల దేవదత్తుడు శత్రుభావంతో ఉండేవాడు. చిన్నప్పుడు బాణాలతో దేవదత్తుడు హంసను కొడితే, దాన్ని బుద్ధుడు సంరక్షించి, ప్రాణం కాపాడాడు. ఆ హంస నాదంటే నాదని దేవదత్తుడు సిద్ధార్థునితో వాగ్వివాదానికి దిగాడు. ‘ప్రాణం తీసిన వానిది కాదు. ప్రాణం పోసిన వానిదే హంస’ అని, ఆ హంసను తీసుకుని, గాయాలు మానేలా చేసి, తిరిగి ఆకాశంలోనికి వదిలి పెట్టాడు సిద్ధార్థుడు. వారు పెరిగి పెద్దవారయ్యాక, బుద్ధుడు బౌద్ధసంఘాన్ని స్థాపించి విశేష గౌరవ సత్కారాలు పొందడం చూసి తానూ బౌద్ధసంఘంలో చేరాడు దేవదత్తుడు. కొన్నాళ్లకి బౌద్ధసంఘంలో తనకే అగ్రస్థానం లభించాలని, తానో నాయకుణ్ణి కావాలని పట్టుబట్టాడు దేవదత్తుడు. సంఘం అంగీకరించక పోవడంతో మగధ యువరాజు అజాత శతృపంచన చేరి ‘నీవు నీ తండ్రిని చంపి రాజువుకా. నేను బుద్ధుణ్ణి చంపి బౌద్ధసంఘం నాయకుణ్ణవుతాను’ అని నూరిపోస్తాడు. అజాతశతృ దేవదత్తుని మాటలు నమ్మి, అతణ్ణి ఆదరిస్తాడు. ఈ విషయం శిష్యులు బుద్ధునితో చెబుతారు. అప్పుడు బుద్ధుడు –‘భిక్షువులారా! దుష్టునికి దక్కే గౌరవ సత్కారాలు అరటిచెట్టు పువ్వు లాంటివి. వెదురుచెట్టు పుష్పం లాంటివి. ఎండ్రకాయ గర్భం లాంటివి. ఒక్కపువ్వుతోనే అరటిచెట్టు అంతరిస్తోంది. తన నాశనాన్ని తాను తెచ్చుకుంటుంది. పీతకి గర్భమే దాని చావుని ప్రసాదిస్తుంది’ అని చెప్పాడు. ‘‘నిజమే, మామిడిచెట్టు పుష్పించి, ఫలాలనిస్తుంది కానీ అంతరించదు. మరలా చిగురించి, మరలా ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ గౌరవ సత్కారాలు పొందుతూనే ఉంటుంది. కానీ అరటిచెట్టు పుష్పించి, గెలవేసి అంతరిస్తుంది. ఒక్కకాపుతోనే దాన్ని నరికేస్తారు. దుశ్శలుడు పొందే గౌరవ సత్కారాలు ఇలాటివే కదా!’’ అనుకున్నారు అతిథులు. బుద్ధుడు చెప్పినట్టే, ఆ తర్వాత అజాత శతృవుకి దూరమై, ఒంటరిగా మిగిలి దైన్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు దేవదత్తుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఒక హీరో.. ఐదుగురు హీరోయిన్లు
‘బస్ స్టాప్’ ఫేమ్ ప్రిన్స్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. స్వీయదర్శకత్వంలో ‘సూపర్స్టార్ కిడ్నాప్’ చిత్రాన్ని రూపొందించిన ఎ. సుశాంత్ రెడ్డి ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శక–నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న చిత్రమిది. తెలుగులో ‘బిగ్ బాస్ 1’లో పాల్గొన్న ప్రిన్స్ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం సంపాదించుకున్నాడు. మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న తనకు ఈ కథ గ్రాండ్ రీ–లాంచింగ్గా ఉండబోతోంది. ఈ చిత్రం కోసం మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనున్నారు. ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లఢక్, గోవా, హైదరాబాద్తో పాటు వారణాసి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వి. కృష్ణారావు కొల్లూరి, బ్యానర్: సోరింగ్ ఎలిఫెంట్, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్ కుమార్, నేతి పద్మాకర్. -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
సిక్స్ ప్యాక్ లుక్లో యంగ్ హీరో
హీరోగా ఎంట్రీ తరువాత క్యారెక్టర్ రోల్స్ లోకు టర్న్ అయిన యువ నటుడు ఇప్పుడు సిక్స్ ప్యాక్ లుక్లో అదరగొడుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ప్రిన్స్. తరువాత బస్స్టాప్, రొమాన్స్ విజయవంతమైన చిత్రాల్లో నటించినా.. హీరోగా ప్రిన్స్ కు కలిసి రాలేదు. దీంతో మల్టీ స్టారర్ సినిమాలతో పాటు క్యారెక్టర్ రోల్స్లోనూ కనిపించాడు. నేను శైలజ, మిస్టర్ సినిమాల్లో ప్రిన్స్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్గా కూడా ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే బిగ్ బాస్ షో తరువాత తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన ప్రిన్స్ ఇప్పుడు న్యూ లుక్ లో షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ ల కనిపించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ గా సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకుంటున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా.. త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసమే ప్రిన్స్ ఇలా న్యూ లుక్ లోకి మారిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. -
బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్తో రాహుల్ భేటీ
మనామ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విదేశాల్లో పర్యటిస్తోన్న రాహుల్ గాంధీ సోమవారం బహ్రైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ చర్చించారు. ప్రభుత్వ అతిథిగా ఆ దేశంలో పర్యటిస్తోన్న రాహుల్.. రాజు హమాస్ బిన్ అల్ ఖలీఫాను కూడా కలవనున్నారు. క్రౌన్ ప్రిన్స్తో భేటీ అనంతరం రాహుల్ ట్వీట్ చేస్తూ.. ‘భారత్, బహ్రైన్లకు సంబంధించి పరస్పర ఆసక్తులపై ఇద్దరం చర్చించాం’ అని పేర్కొన్నారు. ’గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్’ (గోపియో) నిర్వహించిన ప్రవాసీ సమ్మేళన్లోనూ పాల్గొన్నారు. గల్ఫ్లో 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ పీసీసీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై నివేదికను అందజేశారు. ఎన్ఆర్ఐలతో రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను కూడా తప్పులు చేశా.. అయితే నేనూ మానవ మాత్రుడినే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనుభవం, యువతరం మధ్య మంచి సమన్వయం ఉంది. కొత్త కాంగ్రెస్ పార్టీని మీకు అందిస్తాం’ అని పేర్కొన్నారు. -
భూటాన్ యువరాజుకు చెన్నపట్టణ బొమ్మలు
సాక్షి, బెంగళూరు: మొదటి సారిగా భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజ దంపతుల కుమారునికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకకు చెందిన ప్రముఖ హస్తకళాకృతుల్లో ఒకటైన చెన్నపట్టణ బొమ్మలను అందజేశారు. భూటాన్ రాజు జిగ్మే నామ్గల్ వాంగ్చుక్ తన భార్యా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడితో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాజ దంపతులతో సమావేశమైన నిర్మలా సీతారామన్ యువరాజుకు ఒక కుందేలు బొమ్మతో పాటు కొన్ని చెన్నపట్టణ బొమ్మలను బహుమతిగా అందజేశారు. యువరాజుకు అందజేసిన బొమ్మలు రాజదంపతులను ఆకట్టుకున్నాయంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. చెన్నపట్టణ బొమ్మలతో ఆడుకుంటున్న బుల్లి యువరాజు -
నాడీ మార్చింది
పెద్దా చిన్నా తేడా లేకుండా అందర్ని ఒకే వయసు వారిగా చేసేస్తుంది పండగ. పేరున్నోళ్లా, సామాన్యులా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ మమేకం చేస్తుంది. అంబరాన్ని తాకే సంబరాలను మోసుకొచ్చే దివాళీ వేళ.. ఆకాశంలో తారలైనా అల్లరి పిల్లలైపోరూ... నింగిలోని జాబిలైనా నేలమీదికొచ్చి జాతర చేసేయదూ. మనతో ప్రముఖులు పంచుకున్న దీపావళి ముచ్చట్లు... పండగను ఆనందించమంటున్నాయి. అలాగే పర్యావరణ‘హితవూ’ చెబుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో స్పెషల్.. ఫెస్టివల్ దీపావళి పండగ నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేట్ చేసుకునేదాన్ని. అయితే ఇప్పుడు అంత బాగా కాల్చాలనిపించడం లేదు. గల్లీగల్లీకి అపార్ట్మెంట్స్ వచ్చేశాయి. ఓపెన్ స్పేస్ తగ్గిపోయింది. ఇక గ్రీన్ దీవాళీ, పొల్యూషన్ ఫ్రీ ప్రచారం బాగా పెరిగింది. దీంతో క్రాకర్స్ కాల్చడం తగ్గించేశాను. తక్కువ టపాసులు, చాలా దీపాలు పెట్టడం, మిత్రులు, బంధువులతో టైమ్పాస్ చేయడం.. ఇదే ఇప్పుడు దీపావళి. నిజానికి ఇది నాకు స్పెషల్ ఫెస్టివల్. బిగ్ బాస్తో ప్రేక్షకులకు బాగా దగ్గరవడం, ఇటీవల నేను రూపొందించిన ‘ఐయామ్ ఇన్ దిస్వే’ షార్ట్ఫిల్మ్ బాగా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ. అందరూ సేఫ్ దివాళీ జరుపుకోండి. – అర్చన, సినీనటి ఫ్యామిలీతో ప్రత్యేకం క్రాకర్స్ కాల్చడంతో కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే నేను క్రాకర్స్ను కాల్చడం ఎప్పుడో మానేశాను. ప్రతి దీపావళి మా ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. అందరం ఒకేచోట చేరి పూజలో పాల్గొని, పండగను ఆస్వాదిస్తాం. క్రాకర్స్ కాల్చొద్దు.. వాటికి పెట్టే డబ్బులతో పేదవారికి చేయూతనివ్వండి. – తమన్నా, సినీనటి బెంగళూర్లో ఫ్రెండ్స్తో.. నేను బెంగళూర్లో ఉన్నాను. ఇక్కడే ఫ్రెండ్స్తో దీపావళి జరుపుకుంటాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే అమ్మతో కలిసి పూజలో పాల్గొనేదాన్ని. క్రికెట్ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి, లిమిట్గా క్రాకర్స్ కాల్చి ఎంజాయ్ చేసేవాళ్లం. క్రాకర్స్తో తీవ్ర కాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటోంది. అందుకే అందరూ చాలా తక్కువగా టపాసులు కాల్చండి. – మిథాలీరాజ్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కొవ్వొత్తి కాంతుల్లో.. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తుండడంతో ఫ్యామిలీతో సరిగ్గా టైమ్ స్పెండ్ చేయడమే కుదరట్లేదు. ఈ ఏడాది ఇంట్లో తక్కువ రోజులు ఉన్నాను. అందుకే ఈ పండగకు ఇంటికి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాను. అందులోనూ ‘రాజుగారి గది–2’ సూపర్ సక్సెస్ దివాళీని స్పెషల్గా మార్చింది. ఉదయమంతా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. రాత్రికి కుటుంబసభ్యులతో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ దివాళీకి వెల్కమ్ చెప్తాను. – సీరత్కపూర్, సినీనటి కాకర పువ్వొత్తులు కాలుస్తా.. ఇంట్లో శాస్త్రీయబద్ధంగా పండగ జరుపుతారు. చాలా వెరైటీ స్వీట్స్ తయారు చేస్తాం. చిన్నప్పటి నుంచి బాణసంచా కాల్చడం తక్కువే. అయితే కాకర పువ్వులు మాత్రం బాగా కాలుస్తాను. ఈ దీపావళి కుటంబంతో జరుపుకోవడం కష్టమే... రాహుల్తోనే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాను. – చిన్మయి శ్రీపాద,సింగర్ నాడీ మార్చింది దివాళీకి ఒకప్పుడు టపాసులు బాగా కాల్చేవాడిని. మా ఇంటికి నాడీ (పెంపుడు శునకం) వచ్చాక.. జరుపుకున్న తొలి దీపావళి రోజున ఆ శబ్దాలు, పొగకు అది ఉక్కిరిబిక్కిరైంది. దీంతో నాలో మార్పు వచ్చింది. మనం టపాసులకు వెచ్చించే డబ్బులతో ఒక కుటుంబం ఏడాదంతా కడుపు నింపుకోగలదు అనిపించింది. అప్పటి నుంచి టపాసులు కాల్చడం మానేశాను. దీపాలతో ఇళ్లంతా డెకరేట్ చేయడం.. స్వీట్స్ తయారీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గరికి వెళ్లడం.. ఇదే ఇప్పుడు మా దీపావళి. టపాసులు కాల్చకండి.. ఆ డబ్బును నిరుపేదలకు ఇవ్వండి.. వారి కళ్లల్లో వెలుగులే నిజమైన దీపావళి. – ప్రిన్స్, సినీనటుడు అనాథ పిల్లలతో ఆనంద దివాళీ ‘రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కనబెట్టి అనాథలు, పేదలతో వీలైనన్ని రోజులు గడపాలనేదే నా ఆశ’ అని చెప్పింది సినీ నటి పూనమ్కౌర్. సికింద్రాబాద్లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి బుధవారం దీపావళి వేడుకలు జరుపుకుంది. టపాసులు తీసుకొచ్చి పిల్లలతో కలిసి కాల్చి, ఆనందంగా గడిపింది. మిస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. -
బిగ్బాస్ షో: ఆదర్శ్ వల్లే ప్రిన్స్ ఔట్..!
సాక్షి, హైదదాబాద్: తెలుగు బిగ్బాస్ సీజన్ 1 చివరిదశకు చేరుకుంది. ఆదివారం ఎన్టీఆర్ కన్టెస్టెంట్స్తో వెరైటీ కబడ్డీ ఆడించారు. ప్రిన్స్, శివబాలాజీ, అర్చనలు ఒక టీం గా.. ఆదర్శ్, హరితేజ, నవదీప్లు మరో గ్రూప్గా ఉన్నారు. ఇక దీక్షా పంత్ను గేమ్కు ఆధ్వర్యం వహించమన్నారు. అయితే కూతకు వెళ్లే కన్టెస్టెంట్స్ కబడ్డీ.. కబడ్డీ అని కాకుండా హౌస్లో ఉన్న తమకు ఇష్టమైన పేరును కూతగా పెట్టాలంటూ కండిషన్ పెట్టారు. ఫన్నీ.. ఫన్నీగా సాగిన ఈగేమ్లో అర్చన టీం రెండు పాయింట్ల తేడాతో హరితేజ టీంపై గెలుపొందింది. ‘నిప్పు లాంటి నిజం’ టాస్క్లో ఇప్పటి వరకూ ఎక్కడా షేర్ చేసుకోని నిజాన్ని బిగ్బాస్ హౌస్లో బహిర్గతం చేయాలని అయితే కేవలం నిజం మాత్రమే చెప్పాలన్నారు. దీంతో ప్రిన్స్ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ను తన తండ్రికి తెలియకుండా దాచానని అదే నిప్పులాంటి నిజం అంటూ ఆటను ప్రారంభించాడు. ఈ తరువాత దీక్ష, హరితేజ, ఆదర్శ్,అర్చన తమ జీవితంలో దాచిన నిజాలను షేర్ చేసుకోగా.. శివబాలాజీ తనకు ఎలాంటి నిజాన్ని దాచే అలవాటు లేదని అందుకే సీక్రెట్స్ ఏం లేవన్నారు. ఒక యాక్సిడెంట్ విషయంలో తన ప్రమేయం లేకుండా ఒక కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయిందని వాళ్లని క్షమించమని కోరుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబాన్ని నవదీప్ తరపున క్షమించమని కోరారు. ఈవారం ఎలిమినేషన్లో ఉన్న నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్లలో నవదీప్, ఆదర్శ్ సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల ప్రిన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ను వీడుతున్నట్లు తెలిపారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రిన్స్.. బిగ్బాస్ సీజన్ 1 టైటిల్ను నవదీప్, హరితేజలలో ఎవరో ఒకరు గెలవొచ్చనన్నారు. ప్రిన్స్ బిగ్బాస్ హౌస్ వీడుతూ తన జీవితంలో ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఉద్వేగంగా మాట్లాడాడు. వెళ్తూ.. వెళ్తూ బిగ్బాంబ్ను దీక్షపై వదిలాడు. దీంతో దీక్ష వారం రోజులపాటు ఎక్కడకు వెళ్లినా పాకుతూనే వెళ్లాలి. -
వి‘భుజించి’... పాలించా
డైట్ వర్కవుట్ పాతికేళ్ళప్పుడు చేస్తే... ప్రిన్స్ది సరైన వయసు. వర్కవుట్ని ఇష్టపడ్డాడు కాబట్టి కష్టపడ్డాడు అనలేం. ఎవరైనా సరే ఇలా పాతికేళ్ల వయసులో వ్యాయామం అలవాటు చేస్తే ఆ తర్వాత వయసంతా శరీరాన్ని అధీనంలో ఉంచుకుని మన ఆదేశాలు పాటించేలా చేసుకోవచ్చు. ముందు వెయిట్లాస్, ఆ తర్వాత మజిల్ బిల్డింగ్, ఆ తర్వాత సిక్స్ప్యాక్... ఈ వరుస క్రమం తప్పకుండా వెళితే... ఎవరైనా గ్రీకు వీరుడు కావచ్చు. - ట్రైనర్ సిక్స్ప్యాక్ వెంకట్ వెయిట్ లాస్ అయినా హ్యాపీగా అనిపించలేదు... అందరూ బాడీ బాగా బిల్డ్ చేశానంటున్నారు. నాకు మాత్రం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశానని అనిపిస్తోంది. ఒకప్పుడు బాడీ ఫంక్షన్ కరెక్ట్గా లేక రాత్రి వేళల్లో సరిగా నిద్రపట్టకపోవడం, చిన్న పనికే అలసిపోవడం వంటివి ఉండేవి. అవన్నీ ఇప్పుడు హాంఫట్ అయిపోయాయి. గెట్...సెట్...గో... ఏడాది క్రితం దాదాపు 98 కిలోలు బరువుండేవాణ్ణి. తగ్గాలని జిమ్ స్టార్ట్ చేశా అయితే సీరియస్గా చేయకపోవడంతో రిజల్ట్ అంతగా రాలేదు. ఆ తర్వాత గట్టి నిర్ణయంతో వెయిట్లాస్ టార్గెట్ పెట్టుకుని కార్డియో, రన్నింగ్, సైక్లింగ్లు చేసి 72 కిలోలకు తగ్గాను. అందరూ శభాష్ అన్నారు కానీ... నాకెందుకో శారీరకంగా హుషారు లేకపోగా బాగా నీరసంగా అనిపించేది. అప్పుడే మా ట్రైనర్ సిక్స్ప్యాక్ వెంకట్తో పంచుకుంటే మజిల్ బిల్డింగ్ స్టార్ట్ చేయమన్నాడు దాంతో వెయిట్స్తో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బాగా చేశాను. వెయిట్ మళ్లీ 84 కిలోలకు పెరిగింది. అయితే అది మజిల్ వెయిట్ అంటే... అది బరువు పెరగడం కాదు పవర్ పెరగడం. ఆరుపలకల కోసం ఆరు భాగాలుగా ఆహారం... ఏదైనా ప్రారంభంలోనే కదా తడబాటు. ఒక దశ దాటాక ఇక ఆగమన్నా ఆగం. మా ట్రైనర్ కూడా ప్యాక్ మారో అన్నాడు. వెయిట్లాస్, మజిల్ బిల్డింగ్ తర్వాత 4 నెలల పాటు రోజుకు 4 గంటల చొప్పున రెండు పూటలా కఠినమైన వ్యాయామాలు చేశాను. కార్డియోతో పాటు క్రంచెస్ వంటివి బాగా చేయడంతో సిక్స్ప్యాక్ వచ్చేసింది. నా డైట్ ఏమిటంటే...రోజుకు 6 సార్లు హై ప్రోటీన్ డైట్.. ఉదయం 6 స్క్రాంబుల్డ్ ఎగ్స్ తర్వాత 30 నిమిషాల వ్యాయామం. వెంటనే వే ప్రోటీన్ షేక్ తాగడం.. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధి తీసుకుని బ్రేక్ఫాస్ట్లో 2 ఎగ్స్, 150గ్రాముల బాయిల్డ్ లేదా గ్రిల్డ్ చికెన్, కేరట్, కుకుంబర్ వంటి వెజ్ సలాడ్స్. మధ్యాహ్నం 12. నుంచి 1 గంట మధ్యలో లంచ్. సలాడ్ విత్ ఫిష్ లేదా చికెన్... అది కూడా స్పెషల్లీ ప్రిపేర్డ్. సాయ్రంతం 4 గంటల సమయంలో 2 నుంచి 3 గుడ్లు, 40 బాదంపప్పులు... దీని తర్వాత వర్కవుట్. అదై పోగానే డిన్నర్ 7.30గంటల కల్లా పూర్తి. అక్కడి నుంచి ఉదయం 6 గంటల దాకా కడుపు ఖాళీ. ఈ ఫుడ్ అంతా సాల్ట్ లేకుండానే. అవసరాన్ని బట్టి పెప్పర్ వేసుకుంటానంతే... సగం డైట్ ఇంట్లోనే వండుకుంటే, ఫ్రెండ్ రెస్టారెంట్లో కొన్ని స్పెషల్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నాడు. సాఫ్ట్ నుంచి యాక్షన్... నా ఆలోచనా ధోరణిలో కూడా ముందుకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ వల్ల మన మీద మనకు వచ్చే కాన్ఫిడెన్స్ అద్భుతం. ఒకప్పుడు రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టేది కాదు. కానీ, ఇప్పుడు యాంగ్జయిటీ, టెన్షన్ అన్నీ పోయాయి. కెరీర్లో యాక్షన్ మూవీస్ చేయాలని ఇష్టం ఉన్నా, నాకున్న సాఫ్ట్ లుక్ వల్ల ఇప్పటి వరకూ అన్నీ లవ్ స్టోరీస్ చేయాల్సి వచ్చింది. ఈ ఫిజికల్ ఫిట్నెస్తో... అది మారుతుందనుకుంటున్నా. - ప్రిన్స్, సినీ నటుడు -
సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష
-
సౌదీ ప్రిన్స్కు మరణశిక్ష
సౌదీ చరిత్రలోనే తొలిసారి ఓ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారు. టర్కీ బిన్ సౌద్ అల్ కబీర్ అనే సౌదీ యువరాజు తోటి సౌదీని అకారణంగా చంపినందుకు గాను అతనికి రియాద్లో మరణశిక్ష విధించారు. 2012లో తన మిత్రుడైన అదిల్ అల్-మహ్మద్తో ఘర్షణ జరిగిన అనంతరం యువరాజు ఆగ్రహంతో అతణ్ణి కాల్చిచంపాడని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని పేర్కొంది. అయితే ఆ యువరాజుకు మరణశిక్ష ఎలా విధించారో తెలియరాలేదు. కత్తితో శిరచ్ఛేదనం చేసి సౌదీ యువరాజుకు మరణశిక్ష అమలుచేశారని తెలుస్తోంది. రాజ కుటుంబసభ్యుడికి మరణశిక్ష అమలుచేయడం సౌదీ అరేబియాలోనే ఓ అరుదైన ఘటనగా నిల్చింది. ఇలాంటి ఓ ప్రముఖ కేసులలో ఫైసల్ బిన్ ముసైద్ అల్ సౌద్ కూడా తన అంకుల్ కింగ్ ఫైసల్ను 1975లో హత్య చేసిన ఘటన ఒకటి. కాగ, ఈ ఏడాదిలో ఇప్పటికే ఆ దేశంలో మరణశిక్షకు గురైనా వారి సంఖ్య వందల్లో ఉన్నట్టు సౌదీ అరేబియా చెబుతోంది. -
వరుణ్ సినిమాలో మరో హీరో
యంగ్ జనరేషన్ హీరోలు కొత్త సాంప్రదాయాలకు తెర తీస్తున్నారు. గతంలో ఒక హీరో సినిమాలో మరో హీరో అతిథి పాత్రలో నటించిన సందర్భాలు చాలా అరుదు. కానీ ఈ జనరేషన్ హీరోలు మాత్రం తరుచుగా గెస్ట్ అపియరెన్స్ లకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో నటించేందుకు మరో హీరో అంగీకరించాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాలో మరో యంగ్ హీరో ప్రిన్స్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాలో కూడా ప్రిన్స్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. బస్స్టాప్, రొమాన్స్ లాంటి సినిమాలతో సోలో హీరోగా మంచి విజయాలను అందుకున్న ప్రిన్స్ మరోసారి స్పెషల్ క్యారెక్టర్ కు అంగకీరించాడు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్ మిస్టర్ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
సూపర్స్టార్ తర్వాతి సినిమా వంశీతోనా?
-
స్టార్ స్టార్ సూపర్స్టార్ - మహేష్ బాబు
-
స్వచ్ఛమైన ప్రేమ
భిన్నమైన నేపథ్యాలు, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ప్రిన్ ్స, వ్యోమనంది, పూజా రామచంద్రన్ ప్రధానపాత్రల్లో వాణి యం. కొసరాజు దర్శకత్వంలో శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతోంది. దర్శకురాలు మాట్లాడుతూ- ‘‘ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ తరంలో అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని అంటున్నారు. అవసరమైతే ప్రేమ కోసం అమ్మాయిలు త్యాగాలు చేస్తారు. ఇదే విషయాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.సురేశ్బాబు, శ్రీనివాస్ వూడిగ. -
ఆ మందు మూలంగానే ప్రిన్స్ మరణం
లాస్ ఏంజెల్స్ : వరల్డ్ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సింగర్ ప్రిన్స్ (57)మరణం పై అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదవశాత్తు పెయిన్ కిల్లర్ మోతాదుకు మించి తీసుకోవడం వల్లనే చనిపోయాడని మిడ్ వెస్ట్ మెడికల్ ఎగ్జామ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. వీరు అందించిన టాక్సికాలజీ (విషపదార్ధాలు, మత్తు పదార్ధా లను గురించి తెలిపే శాస్త్రం) రిపోర్టును ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. ఓపియోడ్ ఫెంటానేల్ మందు మితిమీరిన కారణంగానే ప్రిన్స్ మరణం సంభవించిందని స్పష్టం చేసింది. క్యాన్సర్ చికిత్స వాడే ఫెంటానేల్ మత్తుమందు కంటే ఎక్కువ శక్తివంతమైందని వైద్యులం దించిన రిపోర్టులో వెల్లడించింది. అయితే గాయం ఎలా జరిగింది, అక్రమంగా తయారవుతున్న ఆ మందును ప్రిన్స్ ఎలా వాడాడు అనే వివరాలు నివేదికలో పేర్కొనలేదు. అక్రమంగా అధిక మోతాదులో లభ్యమవుతున్న ఫెంటానేల్ .. హెరాయిన్ కంటే 25 నుంచి 50 రెట్లు, మార్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన దేశంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. మల్టీ టాలెండెట్ ప్రిన్స్ ( ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ) 1978లో సింగర్ గా పరిచయమై ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రాక్ సంగీతప్రియులను ఆకట్టుకున్నారు. దాదాపు 30కి పైగా ఆల్బమ్ లతో ఉర్రూతలూగించి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతోపాటు ఆయన కొన్ని హాలివుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈ ఏప్రిల్ 21 రికార్డింగ్ స్టూడియో లోని ఒక ఎలివేటర్ లో మరణించడం పలు అనుమానాలు తావిచ్చింది. అతని మరణంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా..ప్రిన్స్ మరణాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మృతి మిషెల్లీతోపాటు తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఒబామా సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
విభిన్నమైన ప్రేమకథ
‘నీకు నాకు’ చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైన కథానాయకుడు ప్రిన్స్. ఆ తర్వాత ‘బస్టాప్’, ‘రొమాన్స్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన నటించిన ‘మరల తెలుపనా ప్రియా’ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా వాణి యం. కోసరాజు దర్శకురాలిగా, వ్యోమనంది హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీనివాస్ ఊడిగ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే విభిన్న ప్రేమకథా చిత్రమిది. హైదరాబాద్, హరిద్వార్, రుషికేష్, గోవా, లక్కవరం, రాజమండ్రి, శివపురి తదితర అందమైన లొకేషన్స్లో షూటింగ్ జరిపాం. శేఖర్ చంద్ర పాటలు ఈ చిత్రానికి హైలెట్. ఈ చిత్రం విడుదల తర్వాత వాణి.యం. కోసరాజు పెద్ద డెరైక్టర్ల జాబితాలో చేరుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. పూజారామచంద్రన్, సమీర్, రవివర్మ, సౌమ్య, కల్పలత, పావనీరెడ్డి తదితరులు నటించారు. -
మ్యూజియంగా మారనున్న 'ప్రిన్స్' హోమ్
లాస్ ఏంజెలెస్ః పాప్ గాత్రంతో అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ గాయకుడు ప్రిన్స్ ఎస్టేట్... త్వరలో మ్యూజియంగా మారబోతోంది. 1980 లో స్వంత ఆల్బమ్స్ తో మొదలైన ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ప్రస్థానం... ఆయన్ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చేసింది. 57 ఏళ్ళ వయసులో 21 ఏప్రిల్ 2016 న ప్రిన్స్ మినెసోట్టోలోని ఆయన స్వగృహంలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు ఆయన స్మారకార్థం సంగీత ప్రియులకు గుర్తుండిపోయేలా ఆయన నివసించిన పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చేందుకు నిర్ణయించారు. 'పర్పుల్ రైన్' హిట్ మేకర్ ప్రిన్స్... తన పాప్ గానంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. దీంతో ఆయన హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన గాయకుడు, మ్యూజిక్ లెజెండ్ ఫ్యాన్స్ మమనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు గుర్తుగా ప్రిన్స్ నివసించిన గృహం 'పైస్లే పార్క్ ఎస్టేట్' ను ఆయన స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయించినట్లుగా ఎటోన్ లైన్ డాట్ కామ్ నివేదించింది. ప్రిన్స్ సంగీతానికి జ్ఞాపక చిహ్నంగా పైస్లే పార్క్ ఎస్టేట్... ను మార్చనున్నట్లు ఆయన బంధువు ఫిలిప్స్ కూడ ఓ పత్రికకు తెలిపారు. అయితే తన నివాస గృహాన్ని మ్యూజియంగా మార్చాలన్న కోరిక ప్రిన్స్ కు ముందే ఉండేదని, అదే ఆలోచనతో ఆయన మరణించక ముందే ప్రిజర్వేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రిన్స్ సహాయకురాలు, మాజీ ప్రేమికురాలు షెయీలా ఓ పోస్ట్ లో వివరించారు. దాంతో పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చే పనులు కొనసాగించి ఆయన కోరికను తీర్చే ప్రయత్నం చేస్తామని ఆమె వివరించారు. ప్రిన్స్ సంగీతం ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఆలోచనలో ఉండేవారని అందుకే తన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు సిద్ధ పడ్డారని, ఈ నేపథ్యంలో ఆయన డ్రమ్స్, మోటార్ సైకిల్ వంటి కొన్ని వస్తువులను సైతం సేకరించి పెట్టారని షెయీలా తెలిపారు. వచ్చిన అవార్డులు, రివార్డులపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేకపోయినా, ఫ్యాన్స్ నుంచి తనకు అందిన అభిమానానికి గుర్తుగా, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికతో వాటన్నింటిని ప్రిన్స్ హాలులో భద్రంగా ప్రదర్శనకు పెట్టారని షెయీలా తెలిపారు. -
ప్రిన్స్ అంత్యక్రియలు ఎందుకు సీక్రెట్గా చేశారు?
న్యూయార్క్: అతడు హాలీవుడ్ గానాలోకానికి బాద్ షా లాంటివాడు. అతడు పాడేందుకు వేధికపైకి వస్తున్నాడని తెలియగానే ఇళ్లలో ఉన్నవారంతా టీవీలకు అతుక్కుపోతారు. తమ ముందే పాడుతున్నట్లుగా మైమరిచిపోతారు. మైఖెల్ జాక్సన్ అంతటి పేరున్న ఆ ఐకాన్ పర్సనాలిటి ప్రిన్స్. అవును ప్రిన్స్ రోజర్స్ నెల్సన్ గొప్ప పాప్ సింగర్.. బరాక్ ఒబామా దంపతులు సైతం ఆయనకు వీర అభిమానులు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాధించుకున్నాడు. అనూహ్యంగా ఈ గురువారం ఆయన కన్నుమూశారు. అయితే, లక్షలమంది అభిమానులు సొంతం చేసుకున్న ఆయనకు వరుసగా నేటి వరకు అశ్రునివాళులు అర్పిస్తున్నప్పటికీ అతడి కుటుంబ సభ్యులు మాత్రం అంత్యక్రియలు శరవేగంగా రహస్యంగా కానిచ్చేశారు. మిన్నే పొలిస్ లోని ఫస్ట్ మెమోరియల్ వెస్ట్రన్ చాపెల్ వద్ద కేవలం నాలుగు గంటల్లో అంత్యక్రియలు ముగించి వెంటనే ఆయన చితాభస్మాన్ని తీసుకొని తుది క్రతువుకు వెళ్లిపోయారు. ఈ విషయంపై వివరణ కోరగా తాను ఒక వేళ చనిపోతే ఎలాంటి హాడావుడి లేకుండా,ఇబ్బందుల్లో పడకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా తన అంత్యక్రియలు పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
'శ్రీమంతుడి' రాక కోసం
-
ఆ విషయంలో లౌక్యం ప్రదర్శిస్తున్న ప్రిన్స్
-
మహేష్ క్రేజ్ చూసి షాకైన బాద్ షా
-
ఇంటెక్స్ కొత్తఫోన్ని లాంచ్ చేసిన మహేష్
-
మహేష్కి అదే మైనస్ పాయింట్
-
ప్రిన్స్ విలియం, కేటే గారాల పట్టి నామకరణ మహోత్సవం
-
సుధీర్నటన సూపర్ అంటున్న మహేష్
-
విచిత్ర విఫల హత్యాయత్నం..
ఆస్ట్రియా-హంగెరీ యువరాజావారు, ఆస్ట్రో-హంగెరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ 1914 జూన్ 28న సరాజెవో నగరంలో సతీసమేతంగా వ్యాహ్యాళికి బయలుదేరిన వేళ దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. అప్పటికే సెర్బియాతో మనస్పర్థలు ఉన్న ఆస్ట్రియా-హంగెరీ రాజ్యం ఈ హత్య వెనుక సెర్బియా హస్తం ఉండొచ్చనే అనుమానంతో సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సంఘటనే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఈ చరిత్ర చాలామందికి తెలిసిందే. అయితే, ఫ్రాంజ్ ఫెర్డినాండ్పై అంతకు ముందే హత్యాయత్నం జరిగింది. విచిత్ర పరిస్థితుల్లో అది విఫలమైంది. ఫెర్డినాండ్ హత్యకు పూనుకున్న దుండగుడు ఆయన కారులో ప్రయాణిస్తుండగా బాంబు విసిరాడు. గురితప్పి అది వేరే కారుపై పడింది. పట్టుబడతాననే భయంతో ఆ దుండగుడు తనతో తెచ్చుకున్న సైనైడ్ బిళ్ల మింగేసి, ఎందుకైనా మంచిదని పరుగు పరుగున దగ్గర్లోనే ఉన్న నదిలోకి దూకేశాడు. సైనైడ్ బిళ్ల ప్రభావానికి అతడికి వాంతులు మాత్రమే అయ్యాయి. అతగాడు దూకిన నదిలో కేవలం 13 సెంటీమీటర్ల మేరకు మాత్రమే నీరు ఉండటంతో ఒళ్లంతా బురదమయమైంది. -
హీరోయిన్స్ని తెగపొగిడేస్తున్న మహేష్
-
రెయిన్బో హాస్పటల్స్ బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు
-
నేను తగ్గాను... విద్యాబాలన్ తగ్గాలి!
చాక్లెట్ బోయ్లా కనిపించే ప్రిన్స్కి నిజానికి చాక్లెట్స్ అంటే కాదు.. పిజ్జాలంటే బోల్డంత ఇష్టం. అందుకే అప్పుడప్పుడూ ఓ పట్టు పడుతుంటారు. ఇంతకీ ఇప్పుడు పిజ్జాల గురించి ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా? ఈ 26న విడుదల కానున్న ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ చిత్రంలో ప్రిన్స్ పిజ్జా డెలివరీ బాయ్గా నటించారు. శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. క్రిష్ణబద్రి, శ్రీధర్రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకూ తాను చేసిన చిత్రాలకు, ఈ చిత్రానికీ ఏమాత్రం పోలిక లేదనీ, పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందని ప్రిన్స్ చెబుతూ -‘‘నటుడిగా, లుక్ పరంగా ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. శ్రీనివాస్గారు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంతే అద్భుతంగా తీశారు. విద్యాబాలన్ కోసం సినిమాలో ఉన్న నటీనటులందరం వెతుకుంటాం. ఎవరా విద్యాబాలన్? అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇది క్రైమ్, కామెడీ మూవీ. నేను కూడా కామెడీ చేశా’’ అని చెప్పారు. విద్యాబాలన్ గురించి నాలుగు మాటలు చెబుతారా? అనడిగితే -‘‘విద్యాబాలన్ నాకిష్టమైన నటి. ‘డర్టీ పిక్చర్’, ‘కహానీ’.. ఇలా ఆమె నటించిన సినిమాలు చూశాను. అయితే, ఈ మధ్య ఆమె కొంచెం లావయ్యింది. తగ్గితే బాగుంటుందనుకుంటున్నా’’ అని ప్రిన్స్ అన్నారు. మీరు.. తగ్గినట్లున్నారు? అనడగితే -‘‘కొంచెం సన్నబడితే బాగుంటుందని కొంతమంది అన్నారు. అందుకని తగ్గాను’’ అని చెప్పారు. -
ఆమె ఎక్కడ?
విద్యాబాలన్ తప్పిపోయింది... అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇక్కడ చెబుతున్నది కథానాయిక విద్యాబాలన్ గురించి కాదు. ప్రిన్స్, జ్యోతీసేథ్ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్, వేణుగోపాల్రెడ్డి, పి.లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీనివాస్ దర్శకుడు. ఇందులో విద్యాబాలన్ అనే అమ్మాయి కోసం ఇతర పాత్రలు అన్వేషిస్తారు. అదన్నమాట అసలు సంగతి. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్లో జరిగింది. నిర్మాత కె.ఎల్ దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న ‘అల్లరి’ న రేశ్ మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్, కామెడీ మూవీ. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. చాలా ఎంటర్టైనింగ్గా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని ప్రిన్స్ చెప్పారు. చిత్రం ఘనవిజయం సాధించాలని హీరో నిఖిల్ ఆకాంక్షించారు. లక్ష్మీ నరసింహారెడ్డి, కమ్రాన్, జ్యోతీసేథ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. -
ఎక్కడ విద్యాబాలన్..?
ఈ హెడ్డింగ్ చదవగానే.. విద్యాబాలన్కి ఏమైంది? తనేమైనా కిడ్నాప్కి గురైందా? అని ఆమె అభిమానులు కంగారుపడటం ఖాయం. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. మరి.. విద్యాబాలన్ ఎక్కడ? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్, జ్యోతీ సేథ్ నాయకా నాయికలు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. క్రిష్ణబద్రి, శ్రీధర్రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ఈ సినిమాలో విద్యాబాలన్ కథ కమామీషు ఏంటి? ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఎవరు? ఎందుకు వెతుకుతారనేది ఆసక్తికరమైన అంశం. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శీను, బాలాజీ శీను, సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి. -
వారసుడొస్తున్నాడు..!
పాప్ రారాజు మైకేల్ జాక్సన్ వారసుడొస్తున్నాడు. పదిహేడేళ్ల మైకేల్ తనయుడు ప్రిన్స్... అతడి స్నేహితుడు, సింగర్ జస్టిన్ బైబర్తో కలసి ఓ సరికొత్త మ్యూజిక్ కాన్సెప్ట్ కోసం శ్రమిస్తున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్ జూనియర్ ఈ మెగా ప్రాజెక్ట్కు సహకారం అందిస్తున్నాడు. ప్రిన్స్, ఇరవై ఏళ్ల బైబర్లు ఈ ఆల్బమ్ కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారని... ప్రస్తుతానికి ఇంతకంటే వివరాలు బయటకు రాలేదని న్యూయార్క్ పోస్ట్ కథనం. ఈ ఇద్దరూ కాలిఫోర్నియాలోని ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారట. -
ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ
ప్రిన్స్ ఈసారి పిజ్జా డెలివరీ బాయ్గా కనిపించనున్నారు. ప్రిన్స్, జ్యోతీ సేథీ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతా కంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి. లక్ష్మీ నరసింహా రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్కి సరిగ్గా సరిపోయే కథ ఇదని, క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రతి సన్నివేశమూ ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘యూత్కి, మాస్కి నచ్చే కథ ఇది. గత నెలలో చిత్రీకరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ పరిసరాల్లో ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. ఈ వారంతో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఇందులో నాలుగు పాటలుంటాయి’’ అని తెలిపారు. రావు రమేశ్, జయప్రకాశ్రెడ్డి, ఆశిష్ విద్యార్థి, సంపూర్ణేశ్బాబు, సప్తగిరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాలాజీ శ్రీను, అక్కినేని శ్రీను, సహ నిర్మాతలు: హేమా వెంకట్, చిరంజీవి. -
క్యూట్ లవ్స్టోరీ
ప్రిన్స్, రేష్మీ జంటగా సూర్య చక్ర ఫిలింస్ పతాకంపై తాడి గనిరెడ్డి, కె. భువనేశ్వరి నిర్మిస్తున్న ‘నువ్వక్కడ నేనిక్కడ’ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘అందాల రాముడు’ చిత్రం ద్వారా దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పి. లక్ష్మీనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - ‘‘ఓ క్యూట్ లవ్స్టోరీతో ఈ చిత్రం ఉంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇందులో ఓ ముఖ్య పాత్రను బ్రహ్మానందంగారు చేస్తున్నారు. ఈ నెల 26న చిత్రీకరణ మొదలుపెడతాం.’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: జోషి, సంగీతం: చిన్ని చరణ్, ఎడిటింగ్: నందమూరి హరి.