PUBG
-
పట్టాలపై పబ్జీ..రైలు ఢీకొని యువకులు మృతి
పాట్నా:సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం.. కానీ బీహార్లో ఏకంగా రైలు పట్టాలపైనే కూర్చొని ముగ్గురు యువకులు పబ్జీ ఆడారు. చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని మరీ గేమ్ ఆడారు. ఇంకేముంది పట్టాలపై దూసుకువస్తున్న రైలు శబ్దాన్ని ఆ యువకులు వినలేకపోయారు.వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్-ముజఫర్పుర్ రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై నుంచి వెళ్లింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మృతులను ఫర్కాన్ ఆలం,సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను పోస్ట్మార్టంనకు తరలించామని దర్యాప్తు కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి భీకర ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.ఇదీ చదవండి: స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసింది -
ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి..
సాక్షి, ఆదిలాబాద్: పబ్జీ గేమ్కు బానిసై ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయిన ఓ యువకుడు సెల్ టవర్ పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన దుర్వ జగదీశ్–మోహన్బాయి దంపతుల కుమారుడు వికాస్(19) ఇంటర్ మధ్యలోనే మానేశాడు. పబ్జీ గేమ్కు అలవాటు పడి ఇంట్లోనే ఉంటూ ఏడాది క్రితం మానసిక స్థితి కోల్పోయాడు. శనివారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. రాత్రి దేవాపూర్ నుంచి ముత్నూర్ గ్రామానికి చేరుకొని గ్రామ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి కింద పడి మృతిచెందాడు. గ్రామస్తులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేక సెల్టవర్ ఎక్కి పైనుంచి పడిపోవడంతోనే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి మోహన్బాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
పబ్జీ లవ్స్టోరీ: పాకిస్థాన్లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?
గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్చల్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది. Anger issues comedy: "Lappu sa Sachin" & "Jhingur sa ladka" 😂😂pic.twitter.com/2DI4dliGls — Marathi Walter 🇮🇳 𝕏 (@dotnagpur) July 19, 2023 ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి? వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. Her kids learning alphabet: J for Jhingoor K for Keeda L for Lappu pic.twitter.com/TEmqGyp75A — Sagar (@sagarcasm) August 2, 2023 ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. Haha haha. “Kya hai Sachin mey” has been immortalised 😂#SeemaHaider pic.twitter.com/8GFpat6V17 — Smita Prakash (@smitaprakash) August 4, 2023 ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ -
రాజకీయాల్లోకి పాక్ మహిళ సీమా హైదర్.. ఆమెకు టికెట్ ఇస్తాం.. కానీ
సీమా గులామ్ హైదర్.. ఇటీవల ఈ మహిళ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చిన ఈమె.. భారత్లో అడుగుపెట్టినప్పటి నుంచి నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఓ బాలీవుడ్ చిత్రంలో అవకాశం రాగా, ఆశ్చర్యకరంగా రాజకీయాల్లో కూడా ఆమెకు ఆహ్వానం దక్కింది. దీంతో నెటిజన్లు సైతం షాక్లో ఉన్నారు. తాజాగా దీనిపై ఆ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. టికెట్ అక్కడికి ఇస్తాం పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ఆర్పీఐలో చేరడంపై ఆయన మాట్లాడుతూ.. సీమాతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పాక్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ను తమ పార్టీలో ఎలా చేర్చుకుంటామన్నారు. మాసూమ్ కిషోర్ తనను సంప్రదించకుండానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆమెకు టికెట్ ఇవ్వాల్సి వస్తే భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లేందుకు టికెట్ ఇస్తామని, ఎన్నికల్లో పోటీ కోసం కాదని తేల్చి చెప్పారు. కాగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) నేత మాసూమ్ కిషోర్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమా హైదర్ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేస్తామని చెప్పారు. అలాగే సీమా హైదర్ హిందీ, ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుండటంతో పార్టీ అధికార ప్రతినిధి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. అంతేగాక తమ పార్టీ తరుఫున ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీమా హైదర్ గురించి దర్యాప్తు జరుగుతుండటంతో సంబంధిత సంస్థల నుంచి క్లీన్చిట్ కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ..సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. -
సినిమాల్లోకి సీమా హైదర్.. 'రా' ఏజెంట్గా పబ్జీ లవర్!
ఫోన్లో గేమ్స్ అనేవి కాలక్షేపానికి. కానీ ఇక్కడ వీళ్లిద్దరు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. పబ్జీ ఆటలో పరిచయమైన ఓ యువకుడి కోసం ఓ వివాహిత తన భర్తనే వదిలేసింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు తన నలుగురు పిల్లలను వెంటేసుకుని మరీ వచ్చింది. అతడి పేరు సచిన్, ఆమె పేరు సీమా గులామ్ హైదర్. వీరి లవ్ స్టోరీ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. భర్తకు గుడ్బై.. నా భార్యను పంపించండి మహాప్రభో అని అటు భర్త లబోదిబోమని మొత్తుకుంటుంటే ఇటు సీమ మాత్రం పాక్కు తిరిగి వెళ్లేదే లేదని భీష్మించుకుని కూర్చుంది. మే 13న ఆమె ఇండియాలోకి ప్రవేశించగా జూలై 4న పోలీసులకు ఈ విషయం తెలిసింది. అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి సీమాను ఆమెకు నివాసం ఇచ్చిన సచిన్ను, అతడి తండ్రిని అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు వచ్చారు. సీమా హైదర్ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె సోదరుడు అసిఫ్, మామ గులాం అక్బర్ కూడా పాక్ సైన్యంలో పని చేస్తుండటంతో సీమాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు కూడా ఆమెను పలుమార్లు విచారించారు. ఆడిషన్స్ కూడా! ఇంత సీన్ చేసిన సీమా త్వరలో సినిమాల్లోకి రానుందట! ఎ టైలర్ మర్డర్ స్టోరీ అనే చిత్రం కోసం ఆమె ఆడిషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన రాజస్థాన్ ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జానీ ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ గ్రేటర్ నోయిడాలో సీమాకు ఆడిషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో డైరెక్టర్స్ జయంత్ సిన్హా, భరత్ సింగ్ను ఆమె కలిసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఐఎస్ఐ ఏజెంటా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తను ఏకంగా రా ఆఫీసర్గా నటించేందుకు సిద్ధమవుతోందట! చదవండి: ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య.. అప్పుల బాధ తట్టుకోలేకే.. -
పబ్జీ ప్రేమకథ: వాడెలా నచ్చాడు తల్లీ.. వాడిలో ఏముంది?
గ్రేటర్ నోయిడా: పబ్జీలో పరిచయమైన వ్యక్తిని కలుసుకోవాలన్న ఆలోచనలో ముందు వెనుక చూడకుండా నలుగురు పిల్లలతో సహా ఇండియాలో ల్యాండ్ అయిపొయింది పాకిస్తాన్ వీర ప్రేమికురాలు సీమా గులామ్ హైదర్. అన్ని అడ్డంకులను జయించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసే పనిలో పడింది. ఇదే క్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ తనకు భారత పౌరసత్వం ఇప్పించమని కోరిన విషయం తెలిసిందే. మరోపక్క ఆమెకు తీవ్రవాద ముఠాలతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు యూపీ యాంటీ టెర్రరిస్టు పోలీసులు. ఇదిలా ఉండగా గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనా ఇంటిలో కొత్త కాపురాన్ని మొదలు పెట్టిన సీమా హైదర్ పై చుట్టుపక్కల వారు చిరుబుర్రుమంటున్నారు. ఓ మీడియా సంస్థ వీరిద్దరినీ పలకరించేందుకు వెళ్లి అక్కడ గుమికూడిన స్థానికులను కూడా కొన్ని ప్రశ్నలు అడగ్గా... అందులోని ఒకామె.. పాకిస్తాన్ మహిళను వెంటనే ఆమె దేశం పంపించాలి.. లేదంటే ఇటువంటి వారి వలన ఇక్కడివారి మనసుల్లో కొత్త ఆలోచనలు పుడతాయి. పాకిస్తాన్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాలన్న కోరిక పుట్టినా పుడుతుందని అంది. అసలు నీకు వాడేలా నచ్చాడు తల్లీ.. వాడొక బద్ధకస్తుడు.. చూడటానికి కూడా చాలా సన్నగా పుల్లల ఉంటాడని ఎద్దేవా చేసింది. ఆ మహిళ వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. Seema haider ke Indian padosi 🤣 pic.twitter.com/0mFyZm54aW — SwatKat💃 (@swatic12) July 19, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి.. -
ఒకరు వచ్చారు.. ఇంకొకరు వెళ్లారు.. భారత్-పాకిస్తాన్ ప్రేమకథలు..
ఇస్లామాబాద్: మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరమంటూ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులను చెరిపేసి ప్రయత్నంలో ఉన్నారు ఇరుదేశాల ప్రేమికులు. పాకిస్తాన్ నుంచి ఒక మహిళ పబ్జీ పరిచయంతో తాను ప్రేమించిన యువకుడి కోసం భారతదేశం వచ్చినట్టే భారత దేశం నుండి కూడా ఒక మహిళ లెక్క సరిచేస్తూ ప్రేమించిన యువకుడి కోసం ఇటు నుండి పాకిస్తాన్కు ప్రయాణమైంది. కాకపొతే పాకిస్తానీ మహిళ సీమా హైదర్ లా కాకుండా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా సిద్ధం చేసుకుని ప్రణాళిక ప్రకారం వెళ్ళింది భారత మహిళ. ఒక పధ్ధతి.. ఒక ప్లానింగ్.. యూపీలోని కైలార్ గ్రామంలో పుట్టి పెరిగి రాజస్థాన్లోని ఆళ్వార్ జిల్లాలో నివాసముంటున్న అంజు(34)కు పాకిస్తాన్ యువకుడు నస్రుల్లా(29)తో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులకి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఎలాగైనా ప్రియుడిని కలవాలనుకుంది. అనుకుందే తడవు సాహసం చేసి సరిహద్దు దాటేసి డిర్ జిల్లాలోని పక్తుంక్వా చేరుకుని నస్రుల్లాను కలుసుకుంది. విషయం తెలుసుకున్న డిర్ పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని సీనియర్ పోలీసు అధికారి ముస్తాక్ ఖాబ్ ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంట్లను పరిశీలించారు. అంతా సక్రమంగా ఉందని తెలిసిన తర్వాతే వారిని విడిచిపెట్టారు. జైపూర్ వెళ్తున్నట్లు చెప్పి.. రాజస్థాన్ పోలీసులకు ఈ సమాచారమందడంతో వారు భివాడిలోని అంజు ఇంటికి వెళ్ళి ఆరా తీశారు. విచారణ సమయంలో అంజు భర్త అరవింద్ మాట్లాడుతూ.. మాకు 2007లో పెళ్లి జరగగా 15 ఏళ్ల పాప, 6 ఏళ్ల బాబు ఉన్నారని తెలిపారు. నా భార్యకు సోషల్ మీడియాలో పరిచయాలున్నాయని నాకు తెలియదు. గురువారం తాను స్నేహితురాలిని కలిసేందుకు జైపూర్ వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిందని తర్వాత తన చెల్లెలికి ఫోన్ చేసి మాట్లాడుతుండగా లాహోర్ వెళ్లిన విషయం తెలిసిందన్నారు. ఎలాగైనా నా భార్యకు నచ్చజెప్పి తనను తిరిగి తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అరవింద్. అంతా సేమ్ టు సేమ్.. ఇటీవల పబ్జీలో పరిచయాన్ని ప్రేమగా మలచుకుని భారత్ వచ్చిన మహిళ సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకి అంజు-నస్రుల్లా ప్రేమకి కొన్ని సారూప్యతలున్నాయి. ఇద్దరూ పెళ్ళై పిల్లలున్నవారే.. ఇద్దరి ప్రేమలకూ సోషల్ మీడియానే వేదిక.. పొందికగా పొరుగు దేశాల వారినే ప్రేమించారు. కాకపొతే సీమా హైదర్ చట్టవిరుద్ధంగా భారత దేశంలో అడుగుపెట్టగా అంజు మాత్రం పూర్తి చట్టబద్ధంగా పాకిస్తాన్ వెళ్ళింది. అదొక్కటే వ్యత్యాసం. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
ప్రేమికురాలు కాదా..పాకిస్థాన్ గూఢాచారా..?
-
పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు..
ఇస్లామాబాద్: పబ్జీ కారణంగా పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుండి తన నలుగురు పిల్లలతో సహా వలసవచ్చిన మహిళ సీమా గులాం హైదర్ తిరిగి పాకిస్తాన్ వస్తే ఊరుకునేది లేదన్నారు ఆమె బంధువులు. హిందువైన యువకుడి కోసం వెళ్ళిపోయిన ఆమె ఇకపై ముస్లిం కాదని పిల్లల్ని మాత్రం వెంటనే పాకిస్తాన్ తిరిగి పంపించేయాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రేమ.. కరోనా సమయంలో యావత్ప్రపంచమంతా బిక్కు బిక్కుమంటూ గడువుతోంటే పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మీనా మాత్రం హాయిగా ప్రేమలో మునిగి తేలారు. పబ్జీ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. అప్పటికే ఆ మహిళకు పెళ్ళై నలుగురు పిల్లలున్నా కూడా ప్రియుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చే సాహసం చేసింది. వెళ్ళను గాక వెళ్ళను.. జులై 4న గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనాను చేరుకున్న సీమా హైదర్ పై అక్రమ చొరబాటు కేసు నమోదైన విషయం, ఆ కేసులో ఆమెకు బెయిల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి కథ సుఖాంతమవడంతో సీమా ఇకపై నేను హిందువునని, తిరిగి పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పేసింది. మాక్కూడా నువ్వొద్దు.. తాజాగా ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ఎప్పుడైతే హిందువుని వెతుక్కుంటూ వెళిపోయిందో అప్పుడే ఆమెతో సంబంధం తెగిపోయిందని, తను ఇప్పుడు ముస్లిం కాదని చెప్పారు. కానీ నలుగురు పిల్లలను వంటనే వెనక్కు పంపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్లో ఆమె నివాసమున్న ఇంటి యజమాని కుమారుడు నూర్ మహమ్మద్ మాట్లాడుతూ.. గులాం హైదర్ అనే వ్యక్తితో సీమాకు పదేళ్ల క్రితం పెళ్లయిందని, ఆయన సౌదీలో పనిచేస్తుంటాడని ఆమె మాత్రం మూడేళ్ళుగా ఇక్కడ పిల్లలతో ఒంటరిగా ఉండేదన్నారు. వాళ్ళ మామయ్యగారు ఇక్కడికి చాలా దూరంగా ఉంటారని తెలిపారు. ఇది కూడా చదవండి: అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి? -
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్
ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్లో అల్వార్కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
బాలీవుడ్ సినిమాను తలపిస్తోన్న పబ్జీ ప్రేమకథ..
గ్రేటర్ నోయిడా: పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను వెనక్కు పంపించమని వేడుకుంటూ మోదీ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకున్నాడు. ఇదిలా ఉండగా బెయిలుపై బయటకు వచ్చిన ఆ పాకిస్తానీ మహిళ తానెక్కడికీ వెళ్ళబోయేది లేదని.. ఇప్పుడు నాది భారత దేశమని తెగేసి చెప్పింది. ఫస్ట్ హాఫ్.. భారతీయ యువకుడితో పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కు పబ్జీ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి సీమా అడ్డంకులన్నిటినీ జయించి తన నలుగురి పిల్లలతో కలిసి భారత్ కు ఉడాయించింది. దీనికోసం పాకిస్తాన్ లో తన ప్లాటును 12 లక్షలకు అమ్మేసి పిల్లలకూ తనకూ ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మొదట దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్, ఢిల్లీ మీదుగా నోయిడా చేరుకుంది. ఇంటర్వెల్.. భారత్ చేరి తన ప్రియుడు సచిన్ మీనాను కలిసింది కానీ అక్రమంగా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమెపైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైనా కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు నోయిడా పోలీసులు. వారిని జెవార్ న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి వారిద్దరికి బెయిల్ మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పకుండా రావాలని సూచించారు. ప్రీ క్లైమాక్స్.. ఇదిలా ఉండగా సౌదీలో ఉంటోన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ తన భార్యను ఎలాగైనా తిరిగి పాకిస్తాన్ పంపించలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో సందేశం పంపాడు. క్లైమాక్స్.. బెయిలుపై వచ్చిన సీమా దీనిపై స్పందిస్తూ.. నా భర్త హిందువు కాబట్టి నేను కూడా హిందువునే.. ఇప్పుడు నేను భారతీయురాలిని. నాకు నా భర్తను కలవాలని లేదు. పాకిస్తాన్ కు వెళ్తే నా ప్రాణానికే ప్రమాదమని చెప్పింది. నేను నా పిల్లలతో ఇక్కడే ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకోబోతున్నట్లు కూడా తెలిపింది సీమా హైదర్. ఇది కూడా చదవండి: 3000 మీ ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కార్.. తర్వాత ఏమైందంటే.. -
మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’
గ్రేటర్ నోయిడా: పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత యువకుడిని కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అక్రమంగా భారత్లో చొరబడినందుకు ఆ మహిళ పైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు ఆ యువకుడి పైనా కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది. మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది. దీంతో తన భార్యను పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు. పబ్జీ గేమ్ చాలామందికి ఒక వ్యసనం. అందులో పడ్డారంటే చాలు గంటలపాటు పరిసరాలను మరచి పరధ్యానంగా గడుపుతుంటారు. తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కొంపను కొల్లేరు చేసింది. యూపీలోని నొయిడాకు చెందిన 25 ఏళ్ల సచిన్ మీనాకు పాకిస్తాన్ కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది. నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటుతూ సీమా హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ చేరుకొని పబ్జీ ప్రియుడిని కలుసుకుంది. ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు, అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. జెవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది. ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ కు ఈ విషయం చేరింది. దీంతో వెంటనే స్పందిస్తూ.. మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతఙ్ఞతలు.. నా భార్యకు కల్లబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి భారత్ రప్పించారు. దయచేసి నా భార్యను, పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించండి.. అంటూ భారత ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించాడు. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్లో పబ్జీ వంటి గేమ్లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్కు పాకిస్థాన్కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
ఆన్లైన్ గేమ్లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్ఫోన్లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
బీజీఎంఐ లవర్స్కి అదిరిపోయే న్యూస్.. త్వరలోనే
10 నెలల సస్పెన్షన్ తర్వాత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఈ నెల 29న భారత్లో పునఃప్రారంభం కానుంది. గేమర్స్ ఆడేందుకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్లో లభ్యం కానుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ మార్పులు చేసిన తర్వాత గేమ్కు మూడు నెలల ట్రయల్కు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. ఈ సందర్భంగా బీజీఎంఐ ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. వినియోగదారులకు గేమ్ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని’ అని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ సోహ్న్ తెలిపారు. -
యూట్యూబ్, గూగుల్కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్లు ఎలా వస్తున్నాయ్!
నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ తదితర గేమ్లు మళ్లీ ఆన్లైన్లోకి ఎలా వస్తున్నాయ్.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్లైన్ గేమింగ్పై దాఖలైన పిటిషన్ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. -
వీఎల్సీ మీడియా ప్లేయర్పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్
ముంబై: పబ్జీ మొబైల్, టిక్టాక్, కామ్స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్ను కూడా బ్యాన్ చేసింది. ఇండియాలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్సైట్ను ఓపెన్ చేయగానే ఐటీ చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్ఫారమ్ను యాక్సెస్ చేయలేరన్నమాట. ఇటీవల బీజీఎంఐ అనే పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్కు చెక్ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు) అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్లలో ఒకరు వీఎల్సీ వెబ్సైట్ స్క్రీన్షాట్ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) Anyone know why @NICMeity has banned VLC Downloads in India? @internetfreedom pic.twitter.com/lQubbyK0Yi — Gagandeep Sapra (@TheBigGeek) August 12, 2022 #blocked Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo — sflc.in (@SFLCin) June 2, 2022 -
మళ్లీ భారత్లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్టాక్ సరికొత్త వ్యూహం!
టిక్టాక్ యూజర్లకు శుభవార్త. దేశ భద్రత దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం జున్ 2020లో టిక్టాక్పై బ్యాన్ విధించింది. ఇప్పుడా ఆ యాప్ తిరిగి భారత్లో తన కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టిక్టాక్ పరిచయం అక్కర్లేని పేరు. చైనాకి చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ తయారు చేసిన ఈ యాప్ ప్రపంచ దేశాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దీంతో భారత్లో చైనా వస్తువులు,యాప్స్పై నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేంద్రం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో టిక్టాక్ యాప్ కూడా ఉంది. అయితే భారత్లో టిక్ టాక్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు బైట్ డ్యాన్స్ సంస్థ దేశీయ సంస్థలతో పలు మార్లు చర్చులు జరిపింది. ఆ ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. ఈ తరుణంలో బైట్ డ్యాన్స్ సంస్థ భారత్లో టిక్టాక్ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ స్కైస్పోర్ట్స్తో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరా నందిని గ్రూప్కు చెందిన పేరెంట్ సంస్థ యోటా ఇన్ ఫ్రాస్టక్చర్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో బైట్డ్యాన్స్ సంప్రదింపులు జరుపుతుందన్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయని..త్వరలో టిక్టాక్ను వినియోగంలోకి తెస్తామని స్కై స్పోర్ట్స్ సీఈవో శివ నంది తెలిపారు. దీంతో పాటు బీజీఎంఐ సైతం గేమింగ్ ప్రియులు వినియోగించే అవకాశం త్వరలో రానుందని ఇన్స్ట్రాగ్రామ్ స్టోరీస్లో వెల్లడించారు. భారత్లో బీజీఎంఐపై బ్యాన్ విధించడంపై శివ నంది స్పందించారు. బీజీఎంఐను నిషేధించాలని కేంద్రం అనుకోకుండా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం సుమారు 5నెలల సమయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంపై బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్టన్కు నోటీసులు అందించినట్లు చెప్పారు. టిక్టాక్తో పాటు బీజీఎంఐని వినియోగించే అవకాశం త్వరలో రానుంది. కేంద్రం బీజీఎంపై శాశ్వతంగా బ్యాన్ చేయలేదని.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
భారత్ టార్గెట్గా చైనా మరో కుట్ర, బీజీఎంఐ ముసుగులో
భారత్ టార్గెట్గా చైనా చేస్తున్న కుట్రల్ని కేంద్రం తిప్పికొట్టింది. బీజీఎంఐ ముసుగులో..భారత్ యూజర్ల డేటాను తస్కరించి, ఆ డేటాతో సైబర్ దాడులు జరిపేందుకు ప్రయత్నించిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. పబ్జీకి ప్రత్యామ్నాయంగా విడుదలైన బీజీఎంఐ గేమ్తో చైనా గూఢా చార్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్లో ప్లే అవుతున్న బీజీఎంఐ గేమ్కు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టే అండర్ సెక్షన్ 69ఏ ఐటీ యాక్ట్ కింద యాప్ స్టోర్ల నుంచి ఆ గేమ్ను బ్లాక్ చేసినట్లు పేర్కొంది. భారత్ టార్గెట్గా చైనా మరో కుట్ర భారత్ బ్యాన్ విధించిన బీజీఎంఐ యాప్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యాప్లో ప్రమాదకరమైన కోడ్లు ఉన్నాయి. వాటి సాయంతో చైనాలో ఉన్న సర్వర్లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆ కోడ్ సాయంతో కెమెరా/మైక్రోఫోన్, లొకేషన్ ట్రాకింగ్, హానికరమైన నెట్వర్క్ల నుంచి యూజర్లపై నిఘూ, వారి డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న అన్నీ మార్గాల్లో ఈజీగా యాక్సిస్ అయ్యేలా అనుమతి పొందినట్లు తమ విశ్లేషణలో తేలినట్లు దేశ భద్రత దృష్ట్యా పేరు చెప్పిందేకు ఇష్ట పడని ఓ ఏజెన్సీ తెలిపింది. బీజీఎంఐపై నిషేధం తొలగిస్తాం గేమ్ నిషేధంపై క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ స్నోన్ (Sean Hyunil Sohn) స్పందించారు. మేం భారతీయ నియమ, నిబంధనల్ని, చట్టాల్ని గౌరవిస్తాం. యూజర్ల డేటా భద్రత విషయంలో చట్టాల్ని ఫాలో అవుతున్నాం. వాటికి కట్టుబడి ఉన్నాం. గేమ్పై విధించిన నిషేధాన్ని తొలగించుకోవడం . కష్టమే అయినా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి,సమస్యని పరిష్కరిస్తామని క్రాఫ్టన్ ఇండియా సీఈవో ధీమా వ్యక్తం చేశారు. మేం ఏం తప్పు చేశాం ప్లే స్టోర్లలో తమ గేమ్ను బ్యాన్ విధించేంత తప్పు తాము ఏం చేశామో గూగుల్ ,యాపిల్ సంస్థల్ని అడుగుతామని క్రాఫ్టన్ వెల్లడించింది. నిషేదంపై గత కారణాల్ని ఆ రెండు సంస్థల నుంచి సేకరిస్తామని స్పష్టం చేశారు. -
ఆ గేమ్ కూడా పాయే.. బ్యాన్ చేసిన గూగుల్, ఆపిల్ సంస్థలు!
దేశంలో యువతను ఎంతగానో ఆకర్షించి తన వైపుకు తిప్పుకుంది పబ్జీ గేమ్(PUBG Game). అయితే ఎంత ఆదరణ పొందిందో అంతే స్థాయిలోనే విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గేమ్కు బానిసలా మారి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ పబ్జీ గేమ్ను బ్యాన్ చేసింది. ఆ తరువాత ఈ గేమ్ తన పేరు మార్చుకొని బీజీఎంఐ(BGMI)గా మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. అయితే యాప్ నిర్వాహకులకు తాజాగా మరో సారి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. అసలేం జరిగింది.. క్రాఫ్టాన్ కంపెనీ బ్యాన్ అయిన పబ్జీని బీజీఎంఐ (BGMI) గేమ్గా మార్పు చేసి జూన్ 2021 రీలాంచ్ చేసింది. అతి తక్కువ కాలంలో ఈ గేమ్ పాపులర్ కావడంతో పాటు గూగూల్ ప్లేస్టోర్లో టాప్ 10 గేమింగ్ యాప్స్లో ఒకటిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో ఈ గేమ్ 100 మిలియన్ రిజిష్టర్డ్ యూజర్లను పొందినట్లు బీజీఎంఐ ప్రతినిధులు కూడా వెల్లడించారు. అంతలో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్ని కూడా బ్యాన్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. గూగుల్, ఆపిల్ సంస్థలు బీజీఎంఐ గేమ్ని తమ సంబంధిత యాప్ స్టోర్ల నుంచి తొలగించాయి. ఈ వ్యవహారంపై గూగుల్ స్పందిస్తూ వివరణ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బ్యాన్కి గల కారణాన్ని ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. చదవండి: Swiggy: స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
ప్రాణం తీసిన పబ్జీ!
మచిలీపట్నం క్రైమ్: పబ్జీ గేమ్లో ఓడిపోయినందుకు అక్కలు ఆటపట్టించడంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం న్యూహౌసింగ్బోర్డుకాలనీకి చెందిన ఊటుకూరి శాంతిరాజ్కు భార్య లక్ష్మీనరసమ్మతో మనస్పర్థలు రావడంతో 15 ఏళ్ల కిందట విడిపోయారు. వీరికి హైనీ, జెన్నీఫర్, పృధ్వీరాజ్, ప్రభు (16) పిల్లలు ఉన్నారు. శాంతిరాజ్ 2008లో శ్రీరాధికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. మొదటి భార్య తన పెద్ద కుమారుడు పృధ్వీరాజ్తో కలిసి విజయవాడలో ఉంటుండగా మిగిలిన ముగ్గురు పిల్లలు శాంతిరాజ్తో ఉంటున్నారు. శనివారం రాత్రి పెద్ద పిల్లలు ముగ్గురూ ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు. ఆటలో ప్రభు ఓడిపోయాడు, దీంతో అక్కలిద్దరూ ఆట పట్టించారు. దీన్ని అవమానంగా భావించిన ప్రభు పక్క గదిలో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం పొద్దెక్కినా ప్రభు గదిలో నుంచి బయటికి రాకపోవటంతో శాంతిరాజ్ గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తండ్రి శాంతిరాజ్ పోలీసులకు సమాచారం అందించారు. నా బిడ్డది హత్యే.. ప్రభు ఆత్మహత్య విషయం తెలుసుకుని మచిలీపట్నం చేరుకున్న తల్లి లక్ష్మీనరసమ్మ తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ విలపించింది. తనకు అన్యాయం చేసినట్లే తన బిడ్డకు శాంతిరాజ్, శ్రీరాధిక అన్యాయం చేశారంటూ ఆరోపించింది. ఉరి వేసుకున్న ప్రభు మర్మావయవాల నుంచి రక్తస్రావం కావటంతో తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
-
మచిలీపట్నంలో విషాదం.. పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్లో పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతల్లి కొనఊపిరితోనే ఉన్నా.. దిగ్భ్రాంతికర విషయాలు
పబ్జీ కోసం కన్నతల్లిని తుపాకీతో కాల్చి చంపిన తనయుడి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని చంపిన తర్వాత స్నేహితులను ఇంటికి పిలిపించుకుని.. వాళ్లతో హ్యాపీగా దావత్ చేసుకున్నాడు మైనర్. అయితే తాజాగా విచారణలో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. పబ్జీ విషయంలో కన్నతల్లిపై కోపం పెంచుకుని తుపాకీతో కాల్చి చంపాడు కొడుకు. ఈ కేసులో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిని తుపాకీతో కాల్చేసిన తర్వాత ఆమెను ఓ గదిలోకి లాక్కెళ్లి తాళం వేశాడు. అయితే అప్పటికే ఆమె ప్రాణం పోలేదు. అప్పుడే కాదు.. ఆ మరుసటి రోజు ఉదయం వరకూ కూడా ఆమె కొన ఊపిరితోనే ఉంది. ఘటన జరిగిన రాత్రి సమయం నుంచి ఉదయం వరకూ మధ్యమధ్యలో గది తాళం తీసి ఆమె పరిస్థితిని చూస్తూ ఉండిపోయాడు ఆ కొడుకు. ఈ మధ్యలోనే స్నేహితులను ఇంటికి పిలిచి ఆన్లైన్లో ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ పెట్టి మరో గదిలో హ్యాపీగా పార్టీ చేసుకున్నాడు. ఒకవేళ తల్లికి ఇలా జరిగిందనే విషయం ఎవరికైనా చెప్పి ఉంటే.. కనీసం ఆమె బతికి ఉండేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అంతేకాదు.. ఇంటికి వచ్చిన స్నేహిడిని తల్లి శవం మాయం చేసేందుకు సాయం పట్టాలని తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు ప్రతిగా ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఉత్తర ప్రదేశ్లో లక్నోలో ఉంటున్న ఓ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారి.. తన సర్వీస్ రివాల్వర్ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు. కొడుకు పదే పదే పబ్జీ ఆడుతుండడంతో మందలించింది తల్లి సాధన(40). ఆ కోపంలో తుపాకీతో తల్లిని కాల్చేసి.. ఆమెను ఓ గదిలో, చెల్లిని(10) మరో గదిలో ఉంచాడు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంబంధిత వార్త: తల్లి శవం ఓ గదిలో.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్ -
గదిలో తల్లి శవం.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్
సమాజంలో మైనర్ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. తాజాగా ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు సదరు టీనేజర్. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్లో పబ్జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్లైన్లో ఎగ్కర్రీ, ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు. అలా రెండు రోజులు గడిచింది. మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్ఫ్రెష్నర్ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన. చదవండి: గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. -
పబ్జీ గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని
లక్నో: పిల్లలకి ఆటలంటే చాలా ఇష్టం. అయితే ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ ఆటలను పిల్లలు ఆడటమే కాదు వాటికి బానిసలా మారుతున్నారు. ఎంతలా అంటే వీటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల కొన్ని నెలలుగా ఓ మైనర్ బాలుడు ఆన్లైన్ గేమ్ పబ్జీని ఆడటం ప్రారంభించాడు. అయితే రాను రాను అన్ని పనులను, చదువుని పక్కన పెట్టి ఈ గేమ్ను ఆడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి అతడిని పబ్జీ ఆడవద్దని సూచించేది. అయితే బాలుడు ఆడుతున్న ప్రతి సారి తన తల్లి గేమ్ వద్దని వారించడంతో కోపంతో ఊగిపోయాడు. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టల్ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: హైదరాబాద్ టెకీ పాడుపని.. ఇన్స్టాలో యువతులకు వీడియో కాల్ చేసి.. -
బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ని నిషేధించండి.. తెలంగాణ హైకోర్టులో పిల్
యూత్లో ఎంతో క్రేజ్ ఉన్న వివాస్పద గేమ్ బ్యాటిల్ గ్రౌండ్ని నిషేధించాలంటూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. మొబైల్, కంప్యూటర్ వెర్షన్లలో ఈ గేమ్ని నిషేధించడంతో పాటు ఆన్లైన్ గేమ్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఈ పిటిషన్లో కోరారు. అదేవిధంగా గేమ్లకు నియమ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గతంలో పబ్జీ పేరుతో యూత్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత డేటా ప్రైవసీ లేదంటూ కేంద్రం ఈ గేమ్ను నిషేధించింది. ఆ తర్వాత కాలంలో పలు నియమ నిబంధనలు విధించి 2021 జులైలో ఈ గేమ్ను అనుమతించగా .. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బాంబే హైకోర్టులో కూడా ఈ గేమ్పై కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గుడువు ఇవ్వాలంటూ కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. ఇంతలో తెలంగాణ హైకోర్టులో మరో వాజ్యం దాఖలైంది. 2022 మార్చి 14న తెలంగాణ హైకోర్టు ఈ వాజ్యంపై విచారణ చేపట్టనుంది. ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో కూడా ఈగేమ్ని నిషేధించాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. -
పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!
ఇస్లామాబాద్: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే. పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నహిద్ ముబారక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, 14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్ను ఎక్కడ పారేశాడో తెలియలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్ పత్రిక డాన్ ప్రకారం.. ఆన్లైన్ పబ్జీ గేమ్ సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్వో ఇప్పటికే గేమింగ్ డిజార్డర్ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
బిజీఎమ్ఐ మొనగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన క్రాఫ్టన్..!
1,42,000 మంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(బిజీఎమ్ఐ) యూజర్లకు క్రాఫ్టన్ భారీ షాక్ ఇచ్చింది. వారం కంటే తక్కువ సమయంలోనే 142,000 మంది యూజర్ల ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. ఈ విషయం గురుంచి క్రాఫ్టన్ సంస్థ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 - డిసెంబర్ 12 మధ్య కాలంలో అనుమానం గల ఖాతాలను తనికి చేసి శాశ్వతంగా నీషేదించినట్లు తెలిపింది. యాప్ డెవలపర్ ఈ నిషేధిత ఖాతాల జాబితాను పేర్లతో సహ ప్రచురించింది. అనుమతి లేకున్నా హ్యాకింగ్ చేసి ఇతర లెవెల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆడటంతో ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. గత నెలలో, నవంబర్ 17 నుంచి నవంబర్ 23 మధ్య కాలంలో 157,000కు పైగా ఖాతాలను బిజీఎమ్ఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అనధికారిక ఛానల్స్ నుంచి గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడం, చట్టవిరుద్ధమైన సహాయక కార్యక్రమాన్ని ఇన్ స్టాల్ చేయడం వంటి ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటీసు పంపుతుంది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. (చదవండి: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!) -
పబ్ జీ గేమ్కి బానిసగా మారి.. తల్లిదండ్రులనే మరచిపోయాడు!
సాక్షి, అనంతపురం: ఆన్లైన్ గేమ్ పబ్జీ అంటే యువతతో సహా పిల్లలకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆ గేమ్కి బానిసగా మారి ప్రాణలు మీదకు తెచ్చుకుట్టుంటే మరి కొందరు ప్రాణాలే పోగుట్టుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ ఆడుతూ ఓ బాలుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బారాయుడు 8 వతరగతి విద్యార్థి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను ఈ ఆటను ఆడటం ప్రారంభించాడు. అయితే మూడు నెలలుగా పబ్ జీ ఆట వ్యసనంగా మారి అదే పనిగా ఆడటంతో బాలుడు తల్లిదండ్రులను గుర్తించ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం బాలుడి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఏఎస్ఐని మాట్లాడుతున్న అర్జెంటుగా రూ.10వేలు పంపు.. -
పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతాయ్..!
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనదేశంలో దేశ భద్రత కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆ గేమ్ను బ్యాన్ చేసింది. దీంతో ఆ గేమ్ మాతృసంస్థ దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ 'బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) గేమ్ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్లో 40 రోజుల వ్యవధిలో 25 లక్షల అకౌంట్లను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నిషేధించినట్లు బీజీఎంఐ క్రాఫ్టన్ తెలిపింది. లక్షల్లో అకౌంట్లు బ్లాక్ వరల్డ్ వైడ్ పబ్జీ గేమ్ క్రేజ్ కొనసాగుతుంది. రెవెన్యూ పరంగా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 197 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న గేమ్లో మోసాలు పెరిగిపోతున్నాయి. అందుకే క్రాఫ్టన్ సంస్థ సెప్టెంబర్లో 1,40,000, అక్టోబర్లో 88వేల అకౌంట్లను బ్లాక్ చేసింది. అక్టోబర్ 1నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో ఖచ్చితంగా 25,19,262 గేమ్ అకౌంట్లను శాస్వతంగా, 7,06,319 అకౌంట్లను తాత్కాలికంగా నిషేదం విధించినట్లు క్రాఫ్టన్ సంస్థ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాన్ పై సందిగ్ధత గేమ్ పేరుతో చీటింగ్ చేసే అకౌంట్లను బ్యాన్ చేసే అంశంపై సందిగ్ధత నెలకొందని గేమ్ డెవలపర్ ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు. కానీ మోసాలు పెరిగిపోవడంతో అకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోస్ట్లో పేర్కొన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించారు. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్! -
నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్!
ఒక్కప్పుడు డబ్బు సంపాదించాలంటే తక్కువ మార్గాలు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు అందిపుచ్చుకోవాలే గానే బోలెడన్ని అవకాశాలు మన ముందు ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి వస్తుంది. యూట్యూబ్ అంటే ఒకప్పుడు ఇది ఎవరికి తెలియని పేరు కానీ, స్మార్ట్ ఫోన్ పుణ్యమా దీని వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యూట్యూబ్ ఇప్పుడు కేవలం వినోదాన్ని అందించే ఒక యాప్ మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే ఒక బంగారు గని. మీకు క్రియేటివిటీ తెలిసి ఉండాలే గాని.. ఇందులో బోలెడంత సంపాదించుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. కేవలం మన దగ్గర మంచి పనితీరు గల గేమింగ్ కంప్యూటరు, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంట్లో నుంచే లక్షలు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నాడు మన దేశానికి చెందిన గేమర్. అతని పేరు ఆదిత్య సావంత్. కానాలెడ్జ్.కామ్ ప్రకారం.. సావంత్ తన యూట్యూబ్ గేమింగ్ చానెల్ డైనమో గేమింగ్ ద్వారా నెలకు రూ.25 లక్షలు పైగా సంపడిస్తున్నాడు. డైనమో గేమింగ్ నెట్ వర్త్ వచ్చేసి 3 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు). (చదవండి: మరో రికార్డును బిట్కాయిన్ నెలకొల్పనుందా...!) ఆదిత్య సావంత్ 1996 ఏప్రిల్ 18న ముంబైలో దీపక్ సావంత్, వైశాలి సావంత్ లకు జన్మించాడు. డైనమో గేమింగ్ అనేది అతని పేరు, దీనిని అతను తరచుగా ఆటలలో లేదా యూట్యూబ్ స్ట్రీమింగ్ లో ఉపయోగిస్తాడు. అతను భారతదేశం, ప్రపంచంలోని అతిపెద్ద గేమర్లలో ఒకడు. అతను పబ్జీ మొబైల్(PUBG)లో స్నైపర్ గా ప్రసిద్ధి చెందాడు. డైనమో అనేకసార్లు అంతర్జాతీయ వేదికపై మనదేశం తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఆన్లైన్ గేమింగ్ ఆడే చాలా మందికి అతని పేరు తెలియకుండా ఉండదు. -
పబ్–జీ ఖర్చు 10 లక్షలు
ముంబై: పబ్–జీ గేమ్కు బానిసైన ఓ 16 ఏళ్ల బాలుడు తన తల్లి బ్యాంక్ ఖాతాలోని రూ. 10 లక్షలను ఆట కోసం ఖర్చు చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల రోజులుగా బాలుడు పబ్–జీకి బానిసయ్యాడని, తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 10 లక్షలను వర్చువల్ కరెన్సీగా మార్చి ఖర్చు చేశాడని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి మందలించడంతో ఓ లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు బాలున్ని పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. -
చదువుకుంటారని ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్!
తిరువనంతపురం: ఆన్లైన్ గేమ్స్కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు శారీరక, మానసిక వ్యాధులతో ఆస్పత్రులపాలైతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రుల కళ్లుగప్పి డబ్బులను లూటీ చేస్తున్నారు. ఆటల మోజులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు మూతపడి కేవలం ఆన్లైన్ విద్యా బోధన జరుగుతుండటంతో ఈ వైపరీత్యం మరింత ఎక్కువైంది. తాజాగా కేరళలోని ఓ ఘటన ఆన్లైన్ గేమ్స్ వల్ల తలెత్తే అనర్థాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కోజికోడ్లోని ఇద్దరు పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్ఫోన్ను తీసుకునేవారు. అయితే ఆన్లైన్ క్లాసులు సాకుతో పబ్జీకి గేమ్ అడిక్ట్ అయ్యారు. ఎంతలా అంటే.. తమ తల్లికి తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి పబ్జీ మొబైల్ అకౌంట్ అప్గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా రూ.లక్ష ఖర్చు చేశారు. అయితే ఈ విషయం తెలియని తల్లి తన ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని.. కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇంటిదొంగల పని బయటపడింది. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు కనుగొన్నారు. అసలు విషయం తెలిసి ఆ మహిళ ఖంగుతిన్నది. -
పబ్జీ ఆడి కోటి గెలుచుకోండి, టెస్లా కార్లలో తిరగండి
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమింగ్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ -2021 పేరుతో గేమ్ సిరీస్ ను నిర్వహించనుంది. ఈ గేమ్లో గెలిచిన గేమర్స్కు రూ.కోటి పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్లా నడిపే ఆఫర్ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సంస్థ క్రాఫ్టన్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో సంప్రదింపులు జరిపింది. ఇక మూడు నెలల పాటు జరిగే ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్కు సంబంధించి జులై 19 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు క్రాఫ్టన్ ఇండియా తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు గేమ్ క్వాలిఫైర్ , ఆన్ లైన్ క్వాలిఫైర్, క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , గ్రాండ్ ఫైనల్స్ ఇలా ఐదు రౌండ్లు కంప్లీట్ చేయాలి. ఎన్ని రౌండ్ల గేమ్ ఆడాలి తొలి రౌండ్ గేమ్ క్వాలిఫైర్ గేమ్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 8వరకు ఆన్ లైన్ క్వాలిఫైర్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 12 వరకు క్వార్టర్ ఫైనల్ సెప్టెంబర్ 16నుంచి సెప్టెంబర్ 26 వరకు గ్రాండ్ ఫైనల్స్ అక్టోబర్ 7నుంచి అక్టోబర్ 10 వరకు జరగనుంది. మొత్తం తొమ్మిది రౌండ్లలో జరిగే గేమ్కు ఒక్కో రౌండ్ కు ఫ్రైజ్ను అనౌన్స్ చేసింది. 1-ఫ్రైజ్ - రూ.50లక్షలు 2-ఫ్రైజ్- రూ. 25లక్షలు 3-ఫ్రైజ్- రూ. 10లక్షలు 4-ఫ్రైజ్ - రూ. 3లక్షలు 5-ప్రైజ్ - రూ. 2లక్షలు 6-ఫ్రైజ్ - రూ.1లక్షా యాబైవేలు 7-ఫ్రైజ్ -రూ.లక్ష రూపాయలు 8-ప్రైజ్ -రూ. 90వేలు 9-ప్రైజ్ రూ.80వేల మనీని సొంతం చేసుకోవచ్చని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రకటించింది. చదవండి: మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా? -
బీజీఎంఐ తొలి లాంచ్ పార్టీ.. విజేతలకు రూ.6 లక్షలు
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) అందరికీ అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. బీజీఎంఐను రూపొందించిన క్రాఫ్టన్ సంస్థ తొలిసారిగా లాంచ్ పార్టీని జరపనుంది. జూలై 8 నుంచి జూలై 9 వరకు లాంచ్ పార్టీ జరగనుంది. లాంచ్ పార్టీకి సంబంధించిన టీజర్ను క్రాఫ్టన్ యూట్యూబ్లో షేర్ చేసింది. రెండురోజులపాటు సాగే ఈ వెంట్లో 18 ప్రో టీమ్స్ ఆడనున్నాయి. ఈ వెంట్లో గెలిచిన విజేతలకు రూ. 6 లక్షల రూపాయల నగదు బహుమతిని అందిచనున్నారు. ఈ లాంచ్ పార్టీలో ప్రసిద్ది చెందిన డైనమో, మోర్టల్, కె 18, క్రోంటెన్, గాడ్నిక్సన్, ఘటక్, శ్రీమాన్ లెజెండ్, మాక్స్టర్న్, బండూక్బాజ్, క్లాష్ యూనివర్స్, పాల్గొననున్నారు. ఈ మ్యాచ్లను మొబైల్ ఇండియా అధికారిక ఫేస్బుక్, యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం చేయనున్నారు. -
PUBG: అందరికీ అందుబాటులో బీజీఎమ్ఐ
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తాజాగా బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా దేశీ గేమింగ్ ప్రియుల కోసం తయారు చేసిందని పేర్కొంది. ఈ ఏడాది మే 18న ప్రీ–రిజిస్ట్రేషన్స్ ప్రారంభించగా ఏకంగా 4 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయని తెలిపింది. జూన్ 17న గేమింగ్ ప్రియులకు ముందస్తుగా అందుబాటులోకి తెచ్చామని, సుమారు 2 కోట్ల మంది ప్లేయర్లు దీన్ని ఆడి, అభిప్రాయాలు తెలిపారని క్రాఫ్టన్ వివరించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీ–టు–ప్లే మల్టీప్లేయర్ గేమ్గా అందుబా టులో ఉంటుందని పేర్కొంది. క్రాఫ్టన్ అనుబం ధ సంస్థ పబ్జీ కార్పొరేషన్కి చెందిన పబ్జీ గేమ్ను, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం గతేడాది నిషేధించింది. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ సంస్థ పబ్జీని భారత్లో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ కంపెనీకి భారత్లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్జీ కార్పొరేషన్ అప్పట్లో తెలిపింది. తాజాగా దాని స్థానంలో క్రాఫ్టన్ కొత్త గేమ్ను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. -
PUBG గేమ్ కి బానిసై బాలుడు ఆత్మహత్య
-
కూకట్పల్లి: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్లో ఓ ఆన్లైన్ గేమ్కు బానిసై 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ క్లాసుల కోసం బాలుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. అయితే, క్లాసులు వినకుండా ఫోన్లో గేమ్లు ఆడేందుకు బాలుడు బానిసయ్యాడు. దీంతో అతను మరోసారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా, ఆట మధ్యలో తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు -
BGMI గేమ్ యూజర్ల డేటా భద్రతపై క్రాఫ్టన్ క్లారిటీ
కేంద్రం గత ఏడాది దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 256 యాప్స్పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్జీ చైనాది కాదు. సౌత్ కొరియాకు చెందిన యాప్. ఈ పేటెంట్ రైట్స్ ను చైనా టెన్సెంట్ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. గత ఏడాది నిషేదం తర్వాత కొద్ది రోజుల క్రితమే సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ పబ్జీ గేమ్ను కాస్తా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డేటాను ఈ చైనా సంస్థ ముంబై, సింగపూర్ సర్వర్లలో భద్రపరుస్తుంది. ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్ ల నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై క్రాఫ్టన్ స్పందించింది. ప్రస్తుత బీజీఎంఐ యూజర్ల డేటాను చైనా సర్వర్లలో నిల్వ చేస్తున్నట్లు క్రాఫ్టన్ ఒప్పుకుంది. అయితే, ఇతర మొబైల్ యాప్స్, గేమ్స్ మాదిరిగానే ఈ గేమ్కు యూనిక్ ఫీచర్ల కోసం థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని అందుకోసమే గేమ్కు సంబంధించిన డేటాను వారికి షేర్ చేయాల్సి వచ్చింది. అయితే కొత్తగా తీసుకొచ్చిన క్రాఫ్టన్ ప్రైవసీ పాలసీ పూర్తిగా యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్లేయర్ల డేటా నిర్వహణ, రక్షణకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ చైనీస్ సర్వర్లకు యూజర్ల డేటా బదిలీ కాకుండా నిరోధిస్తుందని క్రాఫ్టన్ పేర్కొంది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
Review: అదరగొట్టిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(పబ్జీ)
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పబ్జీ మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కారణాల రీత్యా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అయితే, పబ్జీ మరో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో అనేక ఆటంకాలు దాటుకొని జూన్ 18న విడుదల అయ్యింది. అయితే, దశల వారీగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మంది గేమింగ్ ప్రియులు చాలా కాలం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. దీంతో ఇప్పుడు వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ఎలా ఉంది? పబ్జీ మించి ఉంటుందా? లేక అప్పటి లాగే ఉంటుందా? అని ఆతృతతో ఉన్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సైజ్ వచ్చేసి 700 ఎంబీ, అదనపు డేటా 1.77జీబీ. కాబట్టి, మీ స్మార్ట్ ఫోన్ లో మీకు అంత స్థలం ఉంటేనే ఇన్స్టాల్ అవుతుంది. చిరాకు తెప్పిస్తున్న హెచ్చరికలు క్రాఫ్ట్టన్ సెటప్ ప్రక్రియను చాలా ఎక్కువగా ఉంది. ఇది వాస్తవానికి గేమర్ల గోప్యత గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది కానీ, వాస్తవానికి అదేమీ ఉండదు. ఉదా: మీరు 18 సంవత్సరాల కంటే పెద్దవారా లేదా అని మిమ్మల్ని అడుగుతుంది. అయితే, ఇందులో దానిని ధృవీకరించడానికి ఇన్ గేమ్ ప్రక్రియ అంటూ ఏమి లేదు. అదేవిధంగా, గేమ్ అడుతున్నప్పుడు రెగ్యులర్ ఆడియో హెచ్చరికలు వస్తున్నాయి. అది మీకు చాలా చిరాకు, కోపం తెప్పిస్తుంది. మీరు గేమ్ ఆడటం ప్రారంభించిన తర్వాత, అదే స్వరంతో ఎక్కువ గంటలు ఆడకూడదని మీకు గుర్తు చేస్తుంది. మీరు మ్యాచ్ ప్రారంభించిన ప్రతిసారీ ఇలానే జరుగుతుంది. ఆటగాళ్ళు ఒక నిర్దిష్ట సమయం ఆడిన తర్వాత ఈ హెచ్చరికలు వస్తే బాగుండేది. ప్లేయర్ డేటాను బదిలీ చేయవచ్చు ఇందులో మంచి విషయం ఏమిటంటే, మీరు పాత ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లే ఖాతా ద్వారా లాగిన్ అయితే డేటాను పబ్జీ నుంచి బదిలీ చేసుకోవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు అల్ట్రా హెచ్ డీ, యుహెచ్ డీతో సహా చాలా గ్రాఫిక్స్ ఆప్షన్ ని అందిస్తుంది. నేను రెండు సార్లు గేమ్ ఆడిన రెండు సందర్భాలలో వెయిటింగ్ రూమ్ 45 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. అదే సాధారణంగా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే మొబైల్ లో 70 నుంచి 90 సెకన్ల మధ్య ఉంటుంది. సుపరిచితమైన గేమ్ ప్లే గేమ్ ప్లే విషయానికి వస్తే, లొకేషన్ లు, గ్రాఫిక్స్ మొత్తం పబ్జీ మొబైల్ తరహాలోనే ఉంటుంది. మ్యాప్ కూడా పబ్జీ తరహాలోనే ఉంటుంది. దీనిలో భారతదేశంలోని నిర్ధిష్ట లొకేషన్ లు లేవు. ఇందులో మొదటి ప్రధాన మార్పు ఏమిటంటే గేమ్ లో ఎరుపుకు బదులుగా ఆకుపచ్చ రంగులో రక్తాన్ని చూపిస్తుంది. రంగులను మార్చుకోవచ్చు కానీ, ఎరుపు మాత్రం కాదు. అలాగే, ఆటగాళ్లు కాల్చినప్పుడు రక్తానికి బదులుగా ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది. అలాగే, మీరు ఒక ఆటగాడిని కోల్పోతే, 'కిల్'కు బదులుగా పూర్తయింది అని వస్తుంది. ఈ గేమ్ ఆట టెన్సెంట్ వెర్షన్ నుంచి క్రాఫ్ట్టన్ తనను తాను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంఐ 11 అల్ట్రాలో ఈ గేమ్ అడినప్పుడు ఎటువంటి అంతరాయం కలగలేదు. మొత్తానికి మాత్రం మనం పబ్జీ గేమ్ ఆడిన అనుభూతి మాత్రమే వస్తుంది. వేరే గేమ్ ఆడిన అనుభూతి రాదు. మీరు ఈ గేమ్ అడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ క్రింద కామెంట్ చేయండి. చదవండి: రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
అసభ్య వ్యాఖ్యలు.. ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
చెన్నై: పబ్జీ ఆన్లైన్ గేమ్తో కోట్ల రూపాయలు మోసగించిన యూట్యూబర్ టాక్సిక్ మదన్ను ధర్మపురిలో శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని చెన్నైకు తీసుకురానున్నారు. ఆన్లైన్ పబ్జీ గేమ్లో ప్రత్యర్థులపై అసభ్య వ్యాఖ్యల వ్యవహారం గురించి సెంట్రల్ క్రైంబ్రాంచి పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం దావానలంలా వ్యాపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా యూట్యూబర్ మదన్పై 160 ఫిర్యాదులు అందాయి. పోలీసులు తనను వెతుకుతున్నట్లు తెలుసుకున్న మదన్ వీపీఎన్ సర్వర్ ఉపయోగించి తానున్న స్థావరాన్ని ఎవరూ గుర్తించలేని విధంగా తప్పించుకున్నాడు. మదన్ ప్రారంభించిన మూడు యూట్యూ బ్ చానెళ్లకు భార్య కృత్తిక అడ్మిన్గా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను బిడ్డతో సహా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు మదన్ తండ్రి మాణిక్కం వద్ద పోలీసులు విచారణ జరిపారు. మదన్ స్నేహితులు, సన్నిహితుల గురించి ఆరా తీస్తున్నారు. ఇలావుండగా మదన్ ధర్మపురిలో దాగివున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో శుక్రవారం పోలీసులు అక్కడికి వెళ్లి మదన్ను అరెస్టు చేశారు. మదన్ పోలీసుల కాళ్లపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. ఇకపై పోలీసులు, ప్రముఖులను అసభ్యంగా మాట్లాడనని రోదించాడు. పోలీసులు అతన్ని చెన్నైకు తీసుకువస్తున్నారు. -
లైవ్లో బూతులు.. భార్యతో సహా పబ్జీ మదన్ అరెస్ట్
సాక్షి, చెన్నై: యూ ట్యూబ్ చానల్ గేమ్స్ పేరిట పబ్జీ మదన్ సాగించిన వ్యవహారం గురించి తెలిసిందే. నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు.. మహిళల పట్ల ఆసభ్య పదజాలంతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు మదన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడిని చెన్నై పోలీసులు శుక్రవారం ధర్మపురిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఛానల్కు అడ్మిన్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కృతికను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. వీరి చానల్కు 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారని, వారిలో మైనర్లే అధికంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక మదన్ చానల్ వేదికగా గేమ్స్ ఆడిన వారిలో సంపన్నుల పిల్లలే ఉన్నట్టు విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్ మణిక్కం అలియాస్ మదన్.. మదన్, టాక్సిక్ మదన్ 18+, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్ అనే యూట్యూబ్ చానల్ను నడుపుతున్నాడు. ఇందులో గేమింగ్ ట్రిక్స్కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసేవాడు. నిషేధిత పబ్జీ గేమ్ గురించి వీడియోలు చేశాడు. ఆ తర్వాత దానిని అశ్లీల పదజాలంతో కూడిన వీడియోలు చేయడానికి ఉపయోగించాడు. భారత్లో బ్యాన్ చేసిన పబ్జీ గేమ్ ఆడుతూ ఇటీవల బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం చేలరేగింది. దీంతో ఛానల్ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో చెన్నై వాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం మదన్ కోర్టును ఆశ్రయించాడు. జడ్జి దండపాణి మాట్లాడుతూ.. చానల్ వేదికగా మదన్ మహిళలను అసభ్యపద జాలంలో దూషించిన ఆడియోను విన్న తర్వాత బెయిల్ కోసం వాదించండి అంటూ మదన్ న్యాయవాదికి హితవు పలికారు. మదన్ వాయిస్ రికార్డులు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు షాక్కు గురయ్యింది. జూన్ 17న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు మదన్ అశ్లీల పదజాలంతో కూడిన గేమింగ్ వీడియోస్ ద్వారా అతను నెలకు రూ. 3 లక్షలకు పైగా సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. మదన్ వద్ద మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: లైవ్లో మదనుడి బూతులు, రాసలీలల స్క్రీన్ షాట్స్ -
పబ్జీ లవర్స్కు మరో షాక్, ఊపందుకున్న బ్యాన్ డిమాండ్
సాక్షి,వెబ్డెస్క్:పబ్జీ గేమింగ్ ప్రియులకు షాక్ తప్పదా? ఆ గేమ్కు అదిలోనే హంసపాదు ఎదురు కానుందా?పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో విడుదల కానున్న..ఈ గేమ్ అసలు విడుదలవుతుందా? విడుదలైన ఎంతవరకు మనుగడ సాధిస్తుందనేది తాజా పరిణామాలతో ప్రశ్నార్ధకంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాధ్కు లేఖ రాశారు. ఆ లేఖలో టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. తాజాగా సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కు వివిధ పార్టీల నేతలు కలిశారు. చైనా గేమ్పై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా "భారత సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, యువ తరాలకు హానికరం. గతేడాది నిషేదించిన పబ్జీ ఇప్పుడు భారత చట్టాల్ని అధిగమించి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తోందని ప్రవీణ్ ఖండేల్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ను బ్యాన్ చేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నుంచి తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పాటు పలు పార్టీల నేతలు బీజీఎంఐ గేమ్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత నిబంధనల రీత్యా ప్రభుత్వం క్రాఫ్టన్ గేమ్ బ్యాన్ అంశాన్ని పట్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే..? క్రాఫ్టన్కు చెందిన ఈ గేమ్పై నిషేధం విధిస్తారా? లేదా అనే అంశంపై పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ చట్టం కింద అడిగారు. అందుకు ప్రభుత్వం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ను ముందస్తుగా నిషేధించలేమని ధృవీకరించింది. అదే సమయంలో క్రాఫ్టన్ సంస్థ దక్షిణ కొరియాలోని సియోల్లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులతో గేమ్ ప్రారంభంపై చర్చించారు. ఒప్పందం ప్రకారం 100మిలియన్ల పెట్టుబడి పెట్టారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ గేమ్ తాజా పరిణాలతో విడుదలవుతుందా? నిషేదానికి గురవుతుందా? అనేది కాలమనే నిర్ణయించాలి. చదవండి: BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు -
PUBG: గేమ్ ఆడాలంటే ఓటీపీ తప్పనిసరి..!
గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పబ్జీ గేమ్ తిరిగి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత క్రాఫ్టన్ సూచనలు పాటిస్తేనే గేమ్ ఆడగాలరని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా తాజాగా పబ్జీ గేమ్లో లాగిన్లో కావాలంటే మొబైల్తో ఓటీపీ నిర్ధారణ తప్పనిసరని క్రాఫ్టన్ పేర్కొంది. ఓటీపీ నిర్ధారణ చేయకపోతే గేమ్లో లాగిన్ అవ్వలేరని తెలిపింది. ఈ ఓటీపీను కేవలం మూడుసార్లు లాగిన్ కోసం ఎంటర్ చేయవచ్చునని పేర్కొంది. తరువాత ఓటీపీ గడువు ముగుస్తుందని తెలుపగా, ఈ ఓటీపీకి కేవలం ఐదు నిమిషాలపాటు వ్యాలిడిటీ ఉండనుంది. వెరిఫికేషన్ కోడ్ కోసం 24 గంటల్లో పదిసార్లు మాత్రమే రిక్వెస్ట్ పెట్టాలి. తరువాత ఓటిపీ ఫోన్కు రాదు. ఒకే ఫోన్ నెంబర్ను ఉపయోగించి పది అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చును. క్రాఫ్టన్ ఓటీపీ నిర్ధారణ కోసం మొబైల్ నంబర్ను తీసుకొవడంతో డేటా చౌర్యం జరిగే అవకాశం ఉందని టెక్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు పబ్జీలో ఫేసుబుక్, గూగుల్ అకౌంట్నుపయోగించి యూజర్లు లాగిన్ అయ్యేవారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్ -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: పబ్జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్యులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు. As part of my research on predatory practise of Chinese companies in India and it's impact on National Security, had filed an RTI about the relaunch of PUBG Mobile in India by Krafton (in which the Chinese behemoth has the second largest stake). pic.twitter.com/WL5rkThdOb — Dr Gaurav Tyagi (@drtyagigaurav) June 13, 2021 చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్ -
పబ్జీ మొనగాడు.. బూతులతో బుక్కయ్యాడు
చెన్నై: పబ్జీ.. మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అలాంటి గేమ్లో మదన్ ఘనాపాటి. తమిళనాడుకు చెందిన మదన్ ఓపీ.. గేమర్, వ్లోగర్ కూడా. యూత్లో ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల్లో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. అంతెందుకు కొందరు సెలబ్రిటీలు కూడా ఇతని అభిమానులే. అలాంటి కుర్రాడిపై లైంగిక ఆరోపణల కింద కేసు బుక్ అయ్యింది. అసలు మదన్కి ఇంతలా పేరు రావడానికి ముఖ్య కారణం.. పబ్జీ గేమింగ్లో అతను ఉపయోగించే భాష. కో-ప్లేయర్స్ గనుక బాగా ఆడకపోతే బండబూతులు తిడతాడు. లైవ్లో ఉన్నాననే సంగతి మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. ఆ ఆటిట్యూడ్ అతనికి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాదు ఆటలో అతను ఇచ్చే టిప్స్.. ఇంటర్నేషనల్ వైడ్గా అతనికి గుర్తింపు ఇచ్చింది. అయితే రీసెంట్గా ఓ వీడియోలో అతను అమ్మాయిలను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలం వాడాడు. దీంతో ఇతగాడి వ్యవహారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. శృతి మించారు నిజానికి ఈ కుర్రాడు పబ్లిక్కి తెలిసేలా తప్పులన్నీ చేస్తుంటాడు. అతనికి ఉన్న అభిమానుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఎలాగోలా వాళ్ల అమ్మాయిల నెంబర్లు సంపాదించి.. వాళ్లతో మాటలు కలుపుతాడు. అసభ్యంగా మాట్లాడుతూ.. తేడాగా వ్యవహరిస్తాడు. ఇన్స్టాగ్రామ్ పేజీలలో న్యూడ్గా వీడియో ఛాట్ చేయాలని ఒత్తిడి చేస్తాడు. ఆ ఛాటింగ్లను, స్క్రీన్ షాట్లను పబ్లిక్గానే పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ వ్యవహారంలో బాధిత యువతులనూ ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను బహిరంగంగానే చేస్తున్నానని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు తన మీద కుట్రపన్నారని మదన్ చెప్తున్నాడు. చర్యలు తప్పవా? ఇక తాజాగా విమర్శల నేపథ్యంలో మదన్ దూకుడు తగ్గించాడు. తన సోషల్ మీడియా అకౌంట్లకు కామెంట్ సెక్షన్కు ప్రైవసీ పెట్టాడు. అతని యూట్యూబ్ పేజీలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లలో చాలామంది 18 ఏళ్లలోపు వాళ్లే. అందుకే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ గరం అయ్యింది. కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు చెన్నై పోలీసులు కేసు రిజిస్ట్రర్ చేయడంతో.. త్వరలోనే మదన్పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారంతా. ఇది #arrestmadanop పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ట్యాగ్ కథ. -
BGMI క్రాఫ్టన్కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ
పబ్జీ.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో క్రాఫ్టన్ సంస్థ భారత్లో విడుదల చేయడానికి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిస్థితులు చూస్తే ఇది విడుదల అవుతుందా? అనే సందేహం కలుగుతుంది. దీనికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. దేశీయ రాజకీయ నాయకులు దీనికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాస్తున్నారు. కొద్దీరోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే దీనిని దేశంలో విడుదల కాకుండా చూడాలని కోరుతూ ఒక లేఖను కేంద్రానికి రాశారు. అప్పుడు అది భాగ వైరల్ అయ్యింది. తాజాగా తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ విషయంలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే లాగా రద్దు చేయాలని కోరుతూ కాకుండా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపి డిమాండ్ చేశారు. క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ మొబైల్కు చెందిన రైట్స్ టెన్సెంట్ దగ్గర ఉన్నాయి. గత ఏడాది నిషేధం భారతదేశం కోసం క్రాఫ్టన్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది. కాబట్టి, సాంకేతికంగా ఎంపీ ధర్మపురి అరవింద్ కోరిన దర్యాప్తు పూర్తిగా నిరాధారమైనది కాదు. ఐటి మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో ఈ ఆటకు వ్యతిరేకంగా స్థానిక సామాజిక కార్యకర్త సాయి కుమార్ నుంచి తనకు అభ్యర్ధన వచ్చినట్లు చెప్పారు. ఈ లేఖ ప్రధానంగా సేవా నిబంధనలు, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గోప్యతా విధానం గురించి. ఈ గేమ్ వినియోగదారుల డేటా భారతదేశం, సింగపూర్ లో నిల్వ చేసినప్పటికీ అంతర్జాతీయ సర్వర్ల మధ్య డేటా బదిలీ జరిగే అవకాశం ఉందని కుమార్ పేర్కొన్నారు. క్రాఫ్టన్ దక్షిణ కొరియా దేశానికి చెందినది. ఈ లేఖలో ప్రధానంగా క్రాఫ్టన్, టెన్సెంట్ మధ్య ఉన్న సంబంధం గురుంచి దర్యాప్తు చేయాలని కోరారు. డిమాండ్ ప్రకారం అయితే, ఐటి మంత్రి క్రాఫ్టన్ పెట్టుబడులను చైనా దేశనికి చెందిన బెహెమోత్ టెన్సెంట్తో ఉన్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంటుంది. -
BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు
న్యూఢిల్లీ : గేమింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ గేమ్ జూన్ 18న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ గేమ్ ను ప్రిరిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే ప్రిరిజిస్ట్రేషన్ తర్వాత ఈ గేమ్ ఆడాలంటే తగు సూచనల్ని పాటించాలని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రతినిధులు చెబుతున్నారు. 18లోపు పిల్లలు బీజీఎంఐ గేమ్ గా విడుదలవుతున్న పబ్జీగేమ్ ఆడాలంటే తప్పని సరిగా తల్లిదండ్రులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రాఫ్టన్ తెలిపిన వివరాల ప్రకారం.. 18ఏళ్ల లోపు పిల్లలు ఈ గేమ్ ను మూడు గంటలకు మించి ఆడలేరు. ఎందుకంటే పిల్లల్లో ఈ గేమింగ్ వ్యసనాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మూడు గంటల దాటినా..ఈ గేమ్ ఆడాలంటే తప్పని సరిగ్గా తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. 18ఏళ్ల కంటే తక్కువగా ఉంటే తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు అనుమతితో గేమ్ కు బానిసవుతున్నాడని అనిపిస్తే.. తల్లిదండ్రులే ఆ గేమ్ ను బ్లాక్ చేసేలా గేమ్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపొచ్చు. వ్యక్తిగత బద్రత దృష్ట్యా మొబైల్ గేమర్ ల డేటాను ఇండియాతో పాటు సింగ్ పూర్ కు చెందిన సర్వర్ లో భద్రపరుస్తున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. చదవండి : BGMI టీజర్ విడుదల: గేమ్ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?! -
BGMI టీజర్ విడుదల: గేమ్ను 2060లో విడుదల చేస్తావా ఏంటి?!
పబ్జీ గేమ్.. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) పేరుతో భారత్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గేమ్ను డిజైన్ చేసిన క్రాఫ్టన్ సంస్థ ప్రీ-రిజిస్ట్రేషన్లు, అప్డేట్స్, దానికి సంబంధించిన ఓ టీజర్ విడుదల చేయడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గేమింగ్ లవర్స్ ఆసక్తికి అనుగుణంగా సదరు సంస్థ గేమ్ను విడుదల చేయడంతో విఫలమైందంటూ గేమింగ్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రానున్న పబ్జీ గేమ్ ను ఆడేందుకు ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే భారత్లో ఈ గేమ్ను విడుదల చేసేందుకు పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ సంస్థ ప్రతినిధులు గేమ్ను రీ డిజైన్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభింభించారు. దీంతో గేమ్ లవర్స్ భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో టీజర్ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ విడుదలతో గేమ్ను ఇన్స్టాల్ చేసుకొని ఆడేందుకు గేమింగ్ ప్రియులు ప్రయత్నించారు. కానీ ఆ గేమ్ ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రి రిజిస్ట్రేషన్లు భారీ స్థాయిలో చేసుకుంటున్నారని ప్రచారం చేసుకోవడం కాదు.. గేమ్ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ను కూడా క్రియేట్ చేయాలి’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు 2060 సంవత్సరం అయినా క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ప్రి రిజిస్ట్రర్ నౌ అని ప్రచారం చేసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రముఖ పబ్జీ గేమ్ మొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ ఠాకూర్ ఇటీవల పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీని ప్రకటించి విషయం తెలిసిందే. జూన్ 18న విడుదల కానుందని బైనరీ కోడ్ ద్వారా ఆయన వెల్లడించారు. -
Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్
పబ్జీ గేమ్ మనదేశంలో మళ్లీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. మే 18న ప్రారంభమైన ఈ గేమ్ ను రికార్డ్ స్థాయిలో ప్రి- రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకుంటున్నట్లు పబ్జీ గేమ్ సంస్థ క్రాప్టన్ తెలిపింది. దక్షిణ కొరియా చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ క్రాప్టన్ కు చెందిన పబ్జీ గేమ్ ను ఇప్పటి వరకు 20 మిలియన్ల మంది గేమింగ్ ప్రియులు ప్రీ- రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని కంపెనీ ప్రతనిధులు తెలిపారు. రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన తొలిరోజే సుమారు 7.6 మిలియన్ల మంది ప్రి-రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ గేమ్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా, భారత్ - చైనా సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో డ్రాగన్ కంట్రీకి చెందిన యాప్స్ పై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. మే 2020న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ భారత్ లో పబ్జీ గేమ్ ను నిలిపి వేయాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు. పబ్జీ గేమ్ భారత సంస్కృతిని పక్కదారి పట్టించేలా ఉందని , ప్రభుత్వాన్ని మరియు భారత పౌరులను మోసగించడానికి ఈ గేమ్ ను విడుదల చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టింది. చైనా యాప్స్ ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చదవండి : పబ్జీ గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త -
ఎమ్మెల్యేపై జాత్యహంకార వ్యాఖ్యలు: యూట్యూబర్ అరెస్ట్
అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినందుకు లూథియానాకు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పరస్ సింగ్ అలియాస్ బంటీపై కేసు నమోదు అయ్యింది. తన యూట్యూబ్ ఛానెల్ ''పరాస్ అఫీషియల్''లో ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ను భారతీయుడు కాదని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చైనాలో ఒక భాగం అని వ్యాఖ్యానించాడు. తర్వాత పోస్ట్ చేసిన మరో వీడియోలో, అతను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. పరాస్పై జాతి విద్వేషానికి సంబంధించి కేసు నమోదైందని, ఇటానగర్లోని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోందని డిజిపి ఆర్పి ఉపాధ్యాయ తెలిపారు. మరోవైపు సింగ్ అరెస్ట్ ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారిస్తూ నిందితుడిని తక్షణమే అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు అప్పగించాలని తాను లుథియానా పోలీస్ కమిషనర్ తో మాట్లాడానని వెల్లడించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అరుణాచల్ ప్రదేశ్ సీఎం హెచ్చరించారు. "అరుణాచల్ ప్రదేశ్ ప్రజల పట్ల దుష్ప్రచారం, ద్వేషాన్ని ప్రేరేపించడమే ఈ వీడియో లక్ష్యం" అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ యూట్యూబ్ పోస్ట్ చూడటానికి "చాలా భయపడ్డాను" అని నొక్కిచెప్పాడు. ఇది "అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే జాతీయతపై సందేహాన్ని కలిగించడమే గాక, భారతదేశంలో తమ రాష్ట్ర ఉనికిని కూడా ప్రశ్నిస్తుంది" అని అన్నాడు. అయితే, ఈ కేసు విషయంపై యూట్యూబర్ పరస్ సింగ్ తల్లి స్పదించింది. తన కొడుకు తరుపున తాను క్షమాపణ చెబుతున్నట్లు తెలిపింది. అలాగే, తన కొడుకుపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దు అని అధికారులను కోరింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఎరింగ్ రాసిన లేఖపై స్పందిస్తూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఈ లేఖలో పబ్జీ మొబైల్ను బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా తిరిగి లాంచ్ కాకుండా నిషేధించాలని కోరాడు. చదవండి: పబ్జీ గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త -
పబ్జీ గేమింగ్ ప్రియులకు మరో చేదువార్త
పబ్జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. పబ్జీ మొబైల్ ఇండియా కొత్త పేరుతో తిరిగి భారత్ లోకి రాబోతున్న విషయం మనకు తెలుసు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ పేరుతో ఇండియాలోకి రాబోతున్న పబ్జీని దేశంలోకి విడుదల చేయకుండా ఉండలని కోరుతూ అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ సభ్యుడు నినోంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన ఒక లేఖ రాశారు. ఈ కొత్త గేమ్ ను దేశంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న క్రాఫ్ట్టన్ భారతీయ చట్టాలను పక్కదారి పట్టించినట్లు ఆయన ఆరోపించారు. “కేవలం చిన్న చిన్న మార్పులు చేసి అదే గేమ్ ని తిరిగి తీసుకొనిరావడానికి, పిల్లలతో సహా లక్షలాది మంది దేశీయ పౌరుల డేటాను ఇతర విదేశీ కంపెనీలకు, చైనా ప్రభుత్వానికి బదిలీ చేయడానికి కంపెనీ మోసం చేస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పాసిఘాట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న” ఎరింగ్ తన లేఖలో తెలిపారు. దీనికి సంబందించిన మూడు పేజీల లేఖ కాపీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. Requested @PMOIndia @narendramodi ji to not allow Chinese deception #BattlegroundsMobileIndia. It is a big threat to security of India & privacy of our citizens and a way to circumvent & disregard our laws.@AmitShah #IndiaBanBattlegrounds #NationFirst #AatmaNirbharBharat @ANI pic.twitter.com/H8nzUJ4aRk — Ninong Ering (@ninong_erring) May 22, 2021 దక్షిణ కొరియా కంపెనీ ఇటీవల ఇండియాలోకి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ ను తిరిగి తీసుకురావడం కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ఎప్పుడు మనం దేశంలో విడుదల చేస్తారో అనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్ ఇండియా మరో రూపమే ఈ గేమ్. ఈ నిషేదం తర్వాత భారతదేశంలో తిరిగి తీసుకొనిరావడనికి చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి ప్రచురణ & పంపిణీ హక్కులను క్రాఫ్ట్టన్ తీసుకుంది. అందుకే ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాని దేశంలోకి మళ్లీ తీసుకొని రాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేల దీనికి ఆమోదం లభిస్తే, టిక్ టాక్ వంటి ఇతర చైనీయ యాప్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఫోన్లోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా! -
కొత్త పేరుతో త్వరలో పబ్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాపులర్ గేమ్ పబ్జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్కే పరిమితం కానుందని దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ వెల్లడించింది. చైనా యాప్స్కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్ అన్నోన్స్ బాటిల్గ్రౌండ్స్ (పబ్జీ) మొబైల్ను గతేడాది సెప్టెంబర్లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్ భారత్లో పబ్జీని ఆఫర్ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్ అధికారం టెన్సెట్ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. భారత్లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ కోసం ప్రత్యేక గేమ్ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్లో పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్లోడ్స్ దేశంలో 17.5 కోట్లకుపైమాటే. -
పబ్జీ గేమింగ్ ప్రియులకు శుభవార్త
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అంత క్రేజ్ ఉన్న పబ్జీ గేమ్ చైనాది కావడంతో గతేడాది సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. భారత్-చైనాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంతో కేంద్రం పబ్జీ తో పాటూ 118 మొబైల్ యాప్లు దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ వాటిని కూడా బ్లాక్ చేసింది. అప్పటి నుంచి పబ్జీ ప్రియులు ఆ గేమ్ భారత్ లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో పబ్జీ సంస్థ తన ఆడియన్స్ కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న అప్ డేట్లతో వాళ్లలో ఆశలు రేకెత్తించేలా చేసింది. తాజాగా పబ్జీ మాతృసంస్థ పబ్జీ పేరును బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గా మారుస్తు కొత్త పోస్టర్లను విడుదల చేసింది. అందుకు సంబంధించి పబ్జీ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టర్లను షేర్ చేసింది. దీంతో పబ్జీ గేమ్ త్వరలో ఇండియాలో విడుదల కాబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సంస్థ గత కొంత కాలంగా భారతదేశంలో తన గేమ్ను తిరిగే ప్రారంభించేందుకు ఉద్యోగుల నియామకాన్ని ప్రారంభించింది. క్రాఫ్టన్ సంస్థ ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డిన్ లో పోస్టింగ్ లను అప్ డేట్ చేస్తుంది. వారం రోజుల క్రితం గవర్నమెంట్ రిలేషన్ మేనేజర్ పోస్ట్ కు రిక్రూట్ మెంట్ నిర్వహించింది. దీంతో పాటు ప్రధాని మోడీ పీఎం కేర్స్ కు రూ.1.5కోట్లు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా క్రాఫ్టన్ సీఈఓ చాంగ్హాస్ కిమ్ మాట్లాడుతూ.." భారత్ కరోనాపై పోరాటం చేస్తుంది. మా వంతు సాయంగా భారత్ ను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు కరోనా కేసులు నివారణకు చేస్తున్న సహాయక చర్యల్లో అండగా నిలుస్తామని" అన్నారు. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్న్యూస్ -
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
పాడేరు: ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్తో పాటు ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు. మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జయకుమార్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి గ్రామానికి చేరుకొని.. కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది.. -
చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో పిల్లల చేతికి సెల్ఫోన్ ఇవ్వడంతో ఓ విషాద సంఘటన జరిగింది. పబ్జీ గేమ్ విషయంలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన గొడవ వల్ల 12 ఏళ్ల చిన్నారి ప్రాణం బలైపోయింది. స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన 10 గంటల తర్వాత ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. ఇండియాలో నిషేధించిన పబ్జీ వీడియో గేమ్ బాలుడు మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు 17 ఏళ్ల మైనర్ బాలుడైన నిందితుణ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చనిపోయిన మహ్మద్ అకీఫ్ లారీ డ్రైవర్ హనీఫ్ కుమారుడుగా గుర్తించారు. అకీఫ్ ఎప్పుడు కొంతమంది పరిచయస్తులతో పబ్జీ గేమ్ ఆడేవాడు. ఫలా స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలుడు శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. ఎంతసేపటికి బాలుడు తిరిగి రాకపోయేసరికి వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉల్లాల్ పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న స్కూల్ అరటి ఆకులు, కొబ్బరి ఫ్రాండ్లతో కప్పబడిన ఒక బాలుడి మృతదేహాన్ని పోలీసు బృందం గుర్తించింది. ఆ బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. అకీఫ్ అనే చిన్నారిని ఇంటి పక్కన ఉండే మరో బాలుడు తనతో పాటు పబ్జీ ఆడాల్సిందిగా కోరాడు. అయితే ఆట మధ్యలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అకీఫ్ తోటి బాలుడిపై రాళ్లు విసిరాడు. దానికి కోపోద్రిక్తుడైన ఆ బాలుడు ఓ పెద్ద రాయిని అకీఫ్పై వేశాడు. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడ్డ ఆ బాలుడు మృతదేహాన్ని అరిటాకులతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ స్పందిస్తూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చినప్పుడు పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య మయన్మార్లో ఆగని అరాచకం.. 550 మంది మృతి -
ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా?
భారతదేశంలో పబ్జీ నిషేధం తర్వాత గత ఏడాది నవంబర్లో పబ్జీ మొబైల్ ఇండియా తిరిగి తీసుకురానున్నట్లు పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. చైనా సంస్థ టెన్సెంట్ గేమ్స్ పబ్జీ నుంచి వైదొలిగిన తర్వాత పబ్జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గతంలో ప్రారంభించింది. అయితే, పబ్జీ ప్రియుల ఆశల మీద కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పబ్జీ మొబైల్ ఇండియా గేమ్ హింసను ప్రేరేపిస్తున్న ట్లు గతంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు . ప్రస్తుతం అయితే అధికారికంగా పబ్జీ గేమ్ ను స్మార్ట్ఫోన్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ, భారతదేశంలోని పబ్జీ లవర్స్ పబ్జీ గ్లోబల్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్జీ గ్లోబల్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవడం 'చట్టవిరుద్ధం' కాదని గతంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి, దేశీయ గేమర్స్ వెబ్ నుంచి పబ్జీ మొబైల్ ఏపీకేలను డౌన్లోడ్ చేసుకొని ఆడవచ్చు. కానీ, ఏపీకే విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ పబ్జీ మొబైల్ ఇండియా అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలలో 'త్వరలో రానున్నట్లు' ట్యాగ్ను చూపిస్తున్నాయి. పబ్జీ మొబైల్ ఇండియాకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి అధికారిక అప్డేట్ లేదు. కానీ చైనా, వియాత్నంలో పబ్జీ మొబైల్ గ్లోబల్ అప్డేట్ వెర్షన్ 1.3ని తీసుకొచ్చింది. దీనిలో హిందీ వెర్షన్ కి కూడా సపోర్ట్ చేసే సోర్స్ కోడ్ ఉంది. దీని బట్టి కొందరు ఇండియాలో మళ్లీ పబ్జీ మొబైల్ గేమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన గ్లోబల్ వెర్షన్ లో కాకారిన్ మ్యాప్, కొత్త స్నిపర్ రైఫిల్లు అందించారు. ఈ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా(భారతదేశం మినహా) వినియోగదారుల కోసం డౌన్లోడ్ కోసం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. మీరు కూడా పబ్జీ మొబైల్ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! -
కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం
-
పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు
సాక్షి, కృష్ణాజిల్లా: పబ్జీ ఆటలో చెలరేగిన వివాదం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. పరస్పర దాడులకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వివరాలు.. నూజివీడులో కళాశాల నుంచి బస్సులో వెళుతూ కొత్తూరు తండా, సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి బాహాబాహాకి దిగారు. ఈ గొడవ కాస్తా ముదిరి రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఇందులో పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో గ్రామస్తులు కర్రలు ,రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా చైనీస్ పబ్జీ గేమ్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. చదవండి: ‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’ -
రికార్డులు సృష్టిస్తున్న భారత పబ్జీ ‘ఫౌజీ’
చైనా యాప్ అని 'పబ్జీ’ని నిషేధించడంతో దానికి పోటీగా ‘ఫౌజీ’ (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) తీసుకొచ్చారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ గేమ్ రికార్డ్ సృష్టించింది. మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్గా భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ‘ఫౌజీ’ రూపొందించారు. భారత పబ్జీగా పిలువబడే ఫౌజీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26వ తేదీన అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు 24 గంటల్లో 3 లక్షల డౌన్లోడ్లు సాధించగా.. మూడు రోజుల్లోనే ఫౌజీ గేమ్ 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) గూగుల్ ప్లే స్టోర్లో అత్యంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్గా ఫౌజీ నిలవనుంది. అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయ్యింది. ఈ గేమ్ను సుమారు 500ఎంబీ సైజ్లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ని ఓపెన్ చేశాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ (క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్) కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. (చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా? ) ప్రస్తుతం పబ్జీ గేమ్లో మాదిరి మల్టీ ప్లేయర్కి సపోర్ట్ చేయకపోయినా తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ థీమ్తో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్కు వెళ్తుంది. -
రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?
సాధారణంగా ఏదైనా కొత్త గేమ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారంటే పెద్దగా పట్టించుకోరు. కానీ, ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రజాదరణ పొందిన 'పబ్జీ’కీ పోటీగా ఓ గేమ్ తీసుకొస్తున్నారంటూ ప్రచారం జరిగిన ఆ గేమ్ విడుదల పెద్ద విషయమనే చెప్పాలి. పబ్జీ గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించాక చాలా మంది గేమ్ లవర్స్ నిరుత్సాహ పడిపోయారు. సరైన మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సరిగ్గా అదే సమయంలో భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా ఓ గేమ్ను రూపొందిస్తున్నామని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) అదే ఇండియన్ పబ్జీగా పిలువబడే "ఫౌజీ" గేమ్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా నేడు అందరికి అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్ ఎలా ఉంది? పబ్జీకి పోటీ ఇచ్చే స్థాయిలో రూపొందించారో లేదో తెలుసుకుందామా... అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయింది. ఈ గేమ్ ను సుమారు 500ఎంబీ సైజ్లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ ని ఓపెన్ చేసాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్ అనే మూడు మోడ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం పబ్జీ గేమ్ లో లాగా మల్టీ ప్లేయర్ కి సపోర్ట్ చేయకపోయిన తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. చేతులే ఆయుధాలు అయితే ఈ గేమ్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అవి పట్టించుకునేంత కావు. ఉదా: మీరు ఒక గుడారంలో ఉంటే మీరు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఆటగాళ్లను కొట్టవచ్చు. అలాగే ప్రారంభ దశలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆటగాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని కొట్టడం లేదు. ఇందులో పబ్జీలో లాగా గన్స్ అందుబాటులో లేవు, కేవలం కత్తులు మాత్రమే ఉంటున్నాయి. ఇవి కూడా కొన్ని స్టేజిలు దాటాక మీకు లభిస్తాయి. అప్పటి వరకు మీ శతృవులను మీ చేతితో యుద్ధం చేయాల్సి ఉంటుంది.(చదవండి: గాల్వాన్ వీరుడికి పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!) ఇందులో ప్రధాన పాత్రలో ఒక సిక్కు సైన్య అధికారి ఉంటాడు. అయితే తను మిగతా తన తోటి సిబ్బందిని చైనా సైన్యం నుండి రక్షించుకోవాలి. గేమ్ లో ముందుకు వెళ్తున్నపుడు ఎనర్జీని పెంచుకోవడానికి పబ్జీలో లాగా డ్రింక్స్ ఏమి ఉండవు. కేవలం మనం భోగి మంటల దగ్గర కూర్చొని ఉంటే హెల్త్ పెరుగుతుంది. ఒక్కోసారి గేమ్ లో హెల్త్ అయిపోయిన దీని సహాయంతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం గేమ్ లో చేతితో పోరాడే ఆయుధాలు కత్తి లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఆశించినట్టు తుపాకులు లేవు. తర్వాత మోడ్ లో తీసుకొస్తారేమో చూడాలి. ఈ కత్తి లాంటి ఆయుధంతో శత్రువులను చంపడం చాలా తేలిక అవుతుంది. వాటిని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అవి రెండు హత్యలకు మాత్రమే పరిమితం చేయబడతాయి. సినిమాటిక్ లుక్స్ ఇందులో నాలుగు దశలు ఉంటాయి. ఏ దశలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్లో చూపిస్తుంటుంది. ఇందులో పాస్ ఆప్షన్ ఉండటం చేత రియల్ గేమ్ అనుభూతిని మనం మిస్ అవుతాం. అలాగే శత్రువులను కొట్టేటప్పుడు వారి చనిపోయేరో లేదో తెలిపే సూచికలు లేవు. అందువల్ల కొన్నిసార్లు మీరు వారు చనిపోయాక కొట్టాల్సి వస్తుంది. ప్రధానంగా గేమ్ ను సినిమాటిక్ లుక్స్ లో, ఇటీవలి గాల్వన్ సరిహద్దు సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో క్రమంగా చెక్పోస్టులను దాటేటప్పుడు మరింత కష్టమైంది అని చెప్పుకోవాలి. ఇందులో గేమర్స్ వారికీ ఇచ్చిన సమయంలో అన్ని దశలను పూర్తి చేయడం అంటే కష్ట్టమే అని చెప్పుకోవాలి. ఆట నిజంగా చాలా కష్టంగానే ఉంది. నేను, నా సహోద్యోగులు ఎవరూ కూడా ప్రస్తుతం అన్ని దశలను పూర్తీ చేయలేకపోయాము.(చదవండి: ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!) ఆట మీద నా అభిప్రాయం ఈ గేమ్ ని ప్రధానంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినట్లు మనకు భాగా తెలిసిపోతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్ ఉండవు. అందుకే గేమ్ ఎక్కువ శాతం ఆసక్తిగా అనిపించదు. పబ్జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి.. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్ మోడ్తో ఈ గేమ్ పబ్జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేదు. మిగిలిన రెండు మోడ్స్ లో పబ్జీలో లాగా మల్టి ప్లేయర్ సపోర్ట్ తీసుకొస్తే తప్ప ఏమైనా మార్పు ఉండొచ్చు. సాధారణ సమయాలలో చిన్న పిల్లలతో ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ‘గల్వాన్’ ఘటన గురించి, ఆ సందర్భంలో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. -
ఇండియన్ పబ్జీ(ఫౌజీ) విడుదల రేపే!
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వదేశీ ఆన్లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ "ఫౌజీ"ని 72వ గణతంత్రదినోత్సవ కానుకగా రేపు(జనవరి 26) విడుదల కాబోతోంది. ఈ స్వదేశీ గేమ్ ఇప్పటివరకు 4 మిలియన్లకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ ని అందరికంటే ముందే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫౌజీ మొబైల్ గేమ్ జనవరి 26న ప్రారంభించిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: డిజిటల్ ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!) ఈ గేమ్ ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఎన్కోర్ గేమ్స్ తెలపలేదు. ఈ గేమ్ మొదట ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐఫోన్లు, ఐప్యాడ్లకు అందుబాటులో రానున్నట్లు సమాచారం. పబ్జీపై నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత ఫౌజీ గేమ్ తీసుకొస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఆయనే ఈ గేమ్కి మెంటార్గా వ్యవహరిస్తున్నారు. అలానే ఫౌజీని బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ అనే గేమింగ్ సంస్థ రూపొందించింది. ఫౌజీ, పబ్జీ రెండు వేర్వేరు ఫౌజీ ఒక మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్. చాలా మంది భారతీయ గేమర్స్ దీనిని పబ్జీ మొబైల్ కి ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు, ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడిన పబ్జీ మొబైల్తో పోల్చినప్పుడు ఫౌజీ చాలా భిన్నమైన గేమ్ అని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ గేమ్ ప్రధానంగా ఒక కథాంశం ఆధారంగా కొనసాగుతుందని చెప్పారు. గత నాలుగు దశాబ్దాలలో చైనా, భారతదేశం మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో కూడా చాలా ఎపిసోడ్లు ఉంటాయి అని అన్నారు. -
పబ్జీ ఆడొద్దు అన్నందుకు ఎంతపని చేశాడు!
వెంకటేశ్వరకాలనీ (హైదరాబాద్): పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ప్రాణాలు తీసుకోబోయాడో విద్యార్థి.. ఏకంగా ఐదంతస్తుల భవనంపై నుంచి దూకగా అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.. పంజగుట్ట ప్రతాప్నగర్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది. ఆన్లైన్ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారమందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్ల కనెక్షన్లను పునరుద్ధరించారు. -
నాలుగు మిలియన్లతో సత్తా చాటిన ఫౌజీ
న్యూఢిల్లీ: గేమింగ్ ప్రియులకు గుడ్న్యూస్. పబ్జీకి దీటుగా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఫౌజీ(ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్)గేమ్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే నాలుగు మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో తన సత్తా చాటినట్లు ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పేర్కొన్నారు. ఈ గేమ్ మిడ్-రేంజ్, హై-ఎండ్ ఫోన్లకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఫౌజీ ఇంత తక్కువ సమయంలో ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రసుతం బడ్జెట్ ఫోన్లకు సపోర్ట్ చేయనప్పటికీ.. త్వరలో తక్కువ-స్థాయి ఫోన్ల కోసం ఈ గేమ్ లైట్ వెర్షన్ను విడుదల చేస్తామని ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది.(చదవండి: వన్ప్లస్ యూజర్లకు గుడ్న్యూస్) భారతదేశంలో 2020 డిసెంబరు నెలలో ఫౌజీ గేమ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా 24 గంటల్లో ఒక మిలియన్ రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. ఫౌజీ గేమ్ ని బెంగళూరుకి చెందిన స్టూడియో ఎన్కోర్ గేమ్స్ అనే సంస్థ రూపొందించింది. ఈ గేమ్ మొదట్లో భారత ప్రభుత్వం నిషేధించిన పబ్జీ మొబైల్కు ప్రత్యామ్నాయంగా వస్తుందని అందరు భావించారు. కానీ, ఇది పబ్జీకి ప్రత్యామ్నాయం కాదని విశాల్ గొండాల్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం పబ్జీ మొబైల్ ఇండియా విడుదల అయ్యేటట్లు కనబడటం లేదు. ఫౌజీ ఇండియా కొద్దీ రోజుల్లోనే లాంచ్ కానుంది. మల్టీప్లేయర్ బాటిల్ రాయల్ గేమ్ కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇక ప్రతిరోజూ పండగే. జాతీయ భద్రతా ఆందోళనల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం పబ్జీని నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. -
గుడ్ న్యూస్.. 'ఫౌజీ' గేమ్ ట్రైలర్ వచ్చేసింది!
న్యూఢిల్లీ: గేమింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది ఎన్కోర్ గేమ్స్. 'ఫౌజీ' గేమ్ ను రూపొందిస్తున్న దేశీయ ఎన్కోర్ గేమ్స్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ 'ఫౌజీ' గేమ్ ను జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ సైనికులు లడఖ్ లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దృశ్యాలతో థియేట్రికల్ ట్రైలర్ను నేడు లాంచ్ చేసింది. ఈ గేమ్ యొక్క మొదటి టీజర్ గత సంవత్సరం దసరా రోజున విడుదలైంది. టీజర్ లో కేవలం పోరాటానికి సంబందించిన సమాచారాన్ని మాత్రమే పంచుకుంది కానీ ఎటువంటి ఆయుధాలను తీసుకొస్తున్నారో వెల్లడించలేదు.(చదవండి: 'ఫౌజీ' ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభం) What will you do when they come? We will hold our ground & fight back, because we are Fearless. United. Unstoppable FAU:G! Witness the anthem 🦁 FAU:G! #FAUG #nCore_Games Pre-register now https://t.co/4TXd1F7g7J Launch 🎮 26/1@vishalgondal @akshaykumar @dayanidhimg pic.twitter.com/VGpBZ3HaOS — nCORE Games (@nCore_games) January 3, 2021 కానీ నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్లో 'ఫౌజీ' గేమ్ ఉద్దేశ్యాన్ని తెలియజేసింది ఎన్కోర్ గేమ్స్. ఈ ట్రైలర్లో భారత సైనికులు ఉపయోగించే టాల్ట్ రైఫిల్స్ను కూడా చూడవచ్చు. కొత్త ట్రైలర్లో టైటిల్ ట్రాక్ ‘'ఫౌజీ'’ పేరుతో బాగా రూపొందించారు. అలాగే, పంజాబీలో అదిరిపోయే కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు 2020 డిసెంబర్లో గేమ్ కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా చెప్పట్టారు. 'ఫౌజీ' గేమ్ కేవలం 24 గంటల్లో ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పబ్జి గేమ్ మాదిరిగా కాకుండా 'ఫౌజీ' గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాల అనుభూతిని కలిగిస్తుంది. పబ్జి గేమ్ ని సెప్టెంబర్ లో దేశ సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో నిషేదించింది భారత ప్రభుత్వం. ఈ నిషేధం తరువాత వెంటనే 'ఫౌజీ' గేమ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ఎన్కోర్ గేమ్స్. గత కొద్దీ నెలల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ లవర్స్ కోసం నేడు శుభవార్త తెలిపింది. ఈ గేమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ దీనిని పబ్జి గేమ్ తో పోల్చకూడదని పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కేవలం భారతీయ వినియోగదారుల కోసమే రూపొందించినట్లు పేర్కొన్నాడు. -
వారిపై ఎలాంటి జరిమానాలుండవు
న్యూఢిల్లీ: గత కొద్దీ నెలల క్రితం టిక్ టాక్, పబ్జి వంటి మరెన్నో పేరొందిన చైనీస్ యాప్ లను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ యాప్ అభిమానులు వాటిని యాక్సెస్ చేయడం కోసం ఇతర ఏపీకే లింకుల ద్వారా వాటిని మొబైల్ ఫోన్లలో ఇంస్టాల్ చేసుకొని వాడుతున్నారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వారిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ సమాచార హక్కు చట్టం కింద కొందరు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిషేధిత యాప్ల వినియోగానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం నిషేదించిన యాప్ లను వినియోగిస్తున్న వ్యక్తులపై ఎటువంటి జరిమానా, శిక్షలు విధించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఐటి చట్టం యొక్క సెక్షన్ 69ఎ కింద గుర్తించబడిన మధ్యవర్తులు(సంస్థల)పై మాత్రమే ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు గాను జరిమానా విధించనున్నట్లు కేంద్రం పేర్కొంది.(చదవండి: మరోసారి తన సత్తా చాటిన షియోమీ) -
పబ్జి గ్లోబల్ వెర్షన్ లో సరికొత్త ఫీచర్స్
న్యూఢిల్లీ: భారతదేశంలో లక్షల మంది పబ్జి అభిమానులు దేశంలో పబ్జి మొబైల్ గేమ్ తిరిగి ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పబ్జి అభిమానులకు శుభవార్త అందించింది గేమింగ్ కంపెనీ. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. బాగా జనాదరణ పొందిన పబ్జి మొబైల్ లైట్ యొక్క 0.20.0 గ్లోబల్ వెర్షన్ అప్డేట్ కొద్దీ వారాల క్రితం విడుదల అయినట్లు పేర్కొంది. ఈ అప్డేట్ లో భాగంగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను పరీక్షించడానికి ఆసక్తి చూపే గేమింగ్ లవర్స్ పబ్జి మొబైల్ లైట్ ఏపీకే లింక్ను డౌన్లోడ్ చేయడం ద్వారా పరీక్షించవచ్చు. ఏపీకే వెర్షన్ కోసం మాత్రం మీ మొబైల్ లో 575 ఎంబీ స్పేస్ మాత్రం ఉండాలి.(చదవండి: ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్) పబ్జి మొబైల్ లైట్ 0.20.0 లేటెస్ట్ వెర్షన్ లో యూనివర్సల్ మార్క్ ఫీచర్, వింటర్ కాజిల్ వంటి అనేక కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు మాత్రం మీ మొబైల్ లో ట్యాప్టాప్ స్టోర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్టాప్ స్టోర్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నాక పీయుబిజీఎమ్ లైట్ లేదా పబ్జి మొబైల్ లైట్ కోసం సెర్చ్ బార్ లో టైపు చేయండి. ఇప్పుడు మీరు పబ్జి మొబైల్ లైట్ 0.20.0 లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారతదేశంలో పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ నిషేదించారు కాబట్టి ఇండియన్ పబ్జి గేమింగ్ లవర్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. భారతీయ మార్కెట్లోకి పబ్జి గేమ్ ని తిరిగి తీసుకురావడం కోసం కంపెనీ అధికారులు భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుత పరిస్థితులలో పబ్జి గేమ్ ని తిరిగి తీసుకురావడం అంత సులభం అయ్యేలా కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తిరిగి రానున్నట్లు మాత్రం తెలుస్తుంది. మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్ పబ్జిని దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భద్రతా పరంగా మన దేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుండి తొలగించారు. -
పబ్జీ గేమ్ ఇండియా కంపెనీ మరింత స్ట్రాంగ్
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా లక్షల మంది గేమర్స్ను ఆకట్టుకున్న పబ్జీ(పీయూబీజీ) ఇండియా మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇంక్ తాజాగా బోర్డును పటిష్టం చేసుకుంది. పబ్జీ ప్రేమికులకు ఆసక్తిని రేకెత్తిస్తూ బోర్డులో కొత్తగా ఐదుగురు సభ్యులకు చోటిచ్చింది. వీరంతా టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్లో విధులు నిర్వహించినవారే కావడం గమనించదగ్గ అంశం. ప్రధానంగా గేమింగ్ పరిశ్రమలో 15ఏళ్ల అనుభవమున్న అనీష్ అరవింద్ను కంట్రీ మేనేజర్గా ఎంపిక చేసుకుంది. ఇంతక్రితం గేమింగ్ దిగ్గజాలు టెన్సెంట్, జింగా తదితర కంపెనీలకు అనీష్ సేవలు అందించారు. పబ్జీ మొబైల్ గ్లోబల్ వెర్షన్ హక్కులుగల టెన్సెంట్ నుంచి మరో నలుగురిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేసుకుంది. వీరిలో ఆకాష్ జుండే(విజువల్ కంటెంట్ డిజైనర్), పీయూష్ అగర్వాల్(ఫైనాన్స్ మేనేజర్), అర్పిత ప్రియదర్శిని(సీనియర్ కమ్యూనిటీ మేనేజర్), కరణ్ పథక్(సీనియర్ ఈస్పోర్ట్స్ మేనేజర్) ఉన్నారు. -
పబ్జి ప్రియులకు ఇది చేదు వార్తే..
భారత్ లో పబ్జి గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్నవివాదం నేపథ్యంలో దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనా యాప్లను నిషేదించింది. ఈ నిషేధిత జాబితాలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన పబ్జి గేమ్ కూడా ఉంది. అయితే, ఈ గేమ్ నిర్వాహకులు టెన్సెంట్ గేమ్స్తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని పబ్జి కార్పొరేషన్ సొంత సంస్థగా భారత్లో రిజిస్టర్ చేసుకుంది. దీనిలో భాగంగా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ తిరిగి మార్కెట్లోకి రావాలని భావిస్తుంది. గేమ్ను మళ్లీ భారత్లో లాంచ్ చేసేందుకు ఇంకా పబ్జి కార్పొరేషన్ కి కేంద్రం నుండి అనుమతులు లభించడంలేదు. పబ్జి ప్రీయులకు ఇది చేదువార్తే. (చదవండి: ఫేస్బుక్ లో మరో లోపం) అయితే, ఇదే విషయంపై ఇటీవల ఒకరు పబ్జి గేమ్ విడుదలపై ఆర్టీఐ ద్వారా సంబంధిత శాఖను సమాచారం కోరారు. ఈ ప్రశ్నకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందిస్తూ.. ''పబ్జి ప్రారంభించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు" అని ప్రకటించింది. ఈ ఆర్టీఐ ప్రశ్నను నవంబర్ 30న దాఖలు చేసినట్లు సమాచారం. ఆర్టీఐని సమాచారం కోరిన లేఖలో ఈ విదంగా ఉంది.. "ప్రియమైన సార్/ మేడమ్ 2020 సెప్టెంబర్ నెలలో మీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా భారత ప్రభుత్వం వివిధ చైనీస్ యాప్ లను నిషేధించింది. వాటిలో ఒకటి పబ్జి మొబైల్ గేమ్. ఇప్పుడు, దీని గురుంచి బయట చాల వార్తలు వస్తున్నాయి. భారతీయుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఈ గేమ్ "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతొ త్వరలో రానున్నట్లు చాలా పుకార్లు వస్తున్నాయి. మీరు భారత్ లో ప్రారంభించడానికి ఈ గేమ్ కి అనుమతి ఇచ్చారా లేదా అనే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను" అని ఆర్టీఐ దాఖలు చేసిన పిర్యాదులో ఉంది. పబ్జి గేమ్ డెవలపర్లు తెలిపిన ప్రకారం.. 'పబ్జి మొబైల్ ఇండియా గేమ్'లో స్థానిక సంస్కృతీ ప్రతిబింబించేలా ఆటలో మార్పుచేసినట్లు తెలిపారు. చిన్న పిల్లలు ఎక్కువ సేపు గేమ్ ఆడకుండా ఉండటానికి కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పబ్జి కార్పొరేషన్ పాత్రల దుస్తులు, గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్, ఆట సమయంపై పరిమితులు విధించినట్లు తెలిపారు. అలాగే కొత్తగా వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే, ఇప్పటికే కొన్ని పబ్జి గేమ్ ఏపీకే లింకులు బయట కనిపిస్తున్నాయి. అయితే, హ్యాకర్స్ ఈ ఏపీకే లింకులు ద్వారా మీ మొబైల్ ని హ్యాక్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. -
పబ్జి లవర్స్ జర జాగ్రత్త
మీరు పబ్జి ప్రియులా..? మీరు త్వరలో రాబోయే పబ్జి కోసం వేచిచూస్తున్నారా? అయితే జర జాగ్రత్త. గతంలో పబ్జి కార్పొరేషన్ పబ్జి మొబైల్ ఇండియా పేరుతో యాప్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి పబ్జి మొబైల్ ఇండియా పేరుతో అనేక ఏపీకే లింకులు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అయితే టెక్ నిపుణులు మాత్రం వీటి జోలికి వెళ్ళద్దు అని తెలుపుతున్నారు. ఈ ఏపీకే లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉందని తెలుపుతున్నారు. (చదవండి: 5వేలకే గెలాక్సీ ఎస్ 20 మొబైల్స్) పబ్జి కార్పొరేషన్ మాత్రం అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. అధికారికంగా ఆట విడుదలయ్యే వరకు వేచి ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో మాత్రం కొన్ని నివేదికలు పబ్జి మొబైల్ ఇండియాను డిసెంబర్ 25న విడుదల చేయవచ్చని సూచిస్తున్నాయి. అయినప్పటికీ, పబ్జి కార్పొరేషన్ ఇంకా దీనిని ధృవీకరించలేదు. పబ్జి లవర్స్ ని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు నకిలీ ఏపీకే లింకులతో వల విసురుతున్నారు. ఒకవేల ఎవరైనా పొరపాటున ఈ లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే వారు మీ డివైస్ ని హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఫేక్ ఫైల్స్ ద్వారా మీ డివైజ్లోకి మాల్వేర్ను పంపించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాద ముందని టెక్ నిపుణలు హెచ్చరిస్తున్నారు. అధికారికంగా విడుదల అయ్యే వరకు ఈ ఏపీకే లింకుల జోలికి మాత్రం వెళ్లకూడదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ప్రాణం తీసిన పబ్జీ..
సాక్షి, కుల్కచర్ల: పబ్జీ గేమ్ కారణంగా ఓ బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన అతడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెలికచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు ఓంకార్ (15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్ఫోన్ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్లైన్ తరగతుల పేరుతో పబ్జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. ఈ విషయం గమనించిన అనంతయ్య గురువారం కుమారుడిని మందలించాడు. ఎప్పుడూ ఫోన్తోనే ఉంటున్నావని.. కేవలం ఆన్లైన్ క్లాసులున్నప్పుడే వినాలని చెప్పాడు. ఫోన్ ఎక్కువగా వాడితే ఆరోగ్యం పాడవుతుందన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. -
వికారాబాద్ జిల్లాలో దారుణం..
సాక్షి, వికారాబాద్: పబ్జీ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్జీకి బానిసలైనవారిని ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. పబ్జీ ఆటపై మోజు ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది. తండ్రి.. ఫోన్లో పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ముక్తానంద్ (14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కులకచర్ల మండలం బండేలకచర్లలో ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో టిప్పర్ బీభత్సం) -
రికార్డు సృష్టించిన ఫౌజీ గేమ్
ఏంతో కాలంగా ఎదురుచూస్తున్నా 'ఫౌజీ' గేమ్ గూగుల్ ప్లే స్టోర్లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉందని నవంబర్ 30న ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ మొదటి 24 గంటల్లో భారతదేశంలోని ప్లే స్టోర్లో అత్యధిక సంఖ్యలో ప్రీ-రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్(ఎఫ్పిఎస్) గేమ్ కోసం 1.06 మిలియన్ల ప్రీ-రిజిస్ట్రేషన్లను చేసుకున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని డెవలపర్లు ట్వీట్లో తెలిపారు. 'ఫౌజీ' గేమ్ నవంబర్లో ప్రారంభించాల్సి ఉంది, కానీ ఇతర కారణాల రీత్యా ఆలస్యం అయింది. (చదవండి: 11వేలలో 5జీ ఫోన్) దసరా పండుగ సందర్బంగా ఈ గేమ్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది. ‘ఈ రోజు మనం చెడుపై మంచి గెలుపుున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు 'ఫౌజీ' గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి రోజు ఏముంటుంది. దసరా పర్వదినం రోజు 'ఫౌజీ' టీజర్ను ప్రజెంట్ చేస్తున్నాం.’ అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో గాల్వన్ వ్యాలీకి సంబందించిన సన్నివేశాలు ఉన్నాయి. సరిహద్దు భద్రతకు బాధ్యత వహిస్తున్న భారత సైనికులకు ఈ ఆట నివాళి అని ఎన్కోర్ గేమ్స్ తెలిపింది. పబ్జి గేమ్ ని భారత్ లో నిషేదించిన తర్వాత 'ఫౌజీ' గేమ్ ని తీసుకొచ్చారు. 'ఫౌజీ' గేమ్, పబ్జికి పోటీ కాదని ఎన్కోర్ గేమ్స్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ స్పష్టం చేశారు. -
పబ్జీ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: పబ్జీ అభిమానులకు చేదువార్త. పబ్జీ తిరిగి సేవలను భారత్ లో తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్జీ కార్పొరేషన్ కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. దీంతో పబ్జీ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. భారత్ దేశంలో పబ్జీ గేమ్ ని పూర్తీ స్థాయిలో తీసుకొచ్చేందుకు, అన్ని విధానాలను పూర్తీ చేసి ఈ నెల మొదటి వారంలో తీసుకురావాలని భావించింది. కానీ, దీనికి కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) నుంచి పూర్తీ స్థాయి అనుమతులు మాత్రం రాలేదు. గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒక వేళా తిరిగి రావడం అంత సులభం అయితే ఇదే భాటలో టిక్ టాక్ కూడా తిరిగి వచ్చేదని, ఇది దేశ భద్రతకు సంబందించిన విషయం అని తెలిపింది. దీంతో పబ్జీ గేమ్ కి భారత్ లోకి ప్రవేశించేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. -
గేమ్ లవర్స్ కి గుడ్ న్యూస్
ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నా గేమ్ అభిమానులకు ఎన్కోర్ గేమ్స్ శుభవార్త తెలిపింది. తాజాగా ఎన్కోర్ గేమ్స్ రూపొందిస్తున్న 'ఫౌజీ' మొబైల్ గేమ్ చివరకు గూగుల్ ప్లే స్టోర్లో కనిపించింది. గేమ్ ఇంకా లాంచ్ కాలేదు కానీ, మొత్తానికి దీన్ని గూగుల్ ప్లేస్టోర్లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆపిల్ యొక్క యాప్ స్టోర్లో ప్రీ-రిజిస్ట్రేషన్లు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. 'ఫౌజీ' మొబైల్ గేమ్ గతంలో తీసుకొచ్చిన టీజర్లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆ టీజర్ ఉంది. (చదవండి: 5జీ మొబైల్స్ సందడి షురూ) సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా సెప్టెంబరులో 117 ఇతర చైనా యాప్ లతో పాటు పబ్జి గేమ్ నిషేదించింది. పబ్జి గేమ్ పై నిషేధం విధించిన రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' గేమ్ ని రూపొందిస్తున్నట్లు ఎన్కోర్ గేమ్స్ ప్రకటించింది. గతంలో ఎన్కోర్ గేమ్స్ ఈ గేమ్ నవంబర్ తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్టుకి అందిస్తామని తెలిపింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నెలలో పబ్జి గేమ్ కూడా "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి రానున్నట్లు సమాచారం. చూడాలి మరీ ఈ రెండు గేమ్ లలో ఏది ముందు విడుదల అవుతుందో. -
ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్
పబ్జీ గేమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతకి మంచి కిక్ ఇచ్చే గేమ్ గా పాపులరైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పబ్జీని భారత ప్రభుత్వం సెప్టెంబరు 2న నిషేధించింది. అప్పటి నుంచి ఈ గేమ్ కోసం ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ను "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి లాంచ్ చేయనున్నారు. అయితే, గేమింగ్ యాప్ గురుంచి వస్తున్నా వార్తలు వారిలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పుడు, తాజాగా మరో వార్త బయటకి వచ్చింది. "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న యాప్ లో కొత్తగా 3 ఫీచర్లు తీసుకొస్తున్నారని సమాచారం. ఈ ఫీచర్లు భారతీయ పబ్జి గేమర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటాయి. (చదవండి: పబ్జీ లవర్స్కి గుడ్ న్యూస్) పబ్జిలో రాబోయే 3 ఫీచర్లు "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో వస్తున్న యాప్లో పాత్రలు ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండవు. గ్లోబల్ లేదా కొరియన్ వెర్షన్ వలె కాకుండా దీనిలో గ్రీన్ హీట్ ఎఫెక్టులు రానున్నాయి. యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి ఆట సమయంలో పరిమితిని ఉంచే సెట్టింగ్స్ సహా అనుకూలించే కంటెంట్ ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం, పబ్జీ మొబైల్ ఇండియా డిసెంబర్ మొదటి వారంలో అధికారికంగా విడుదల కానుంది. అయితే, పబ్జీ యొక్క ఇండియన్ వెర్షన్ భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత మాత్రమే విడుదల అవుతుంది. భారతదేశంలో మొబైల్ గేమ్ యొక్క అధికారిక నమోదుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం పబ్జి మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ. కొత్త సంస్థ చెల్లుబాటు కోసం కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్(సిఐఎన్)తో మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రిజిస్టర్డ్ చేసుకుంది. దీని యొక్క రిజిస్టర్డ్ కార్యాలయం బెంగళూరులో ఉంది. "పబ్జీ మొబైల్ ఇండియా" యాప్ ను ఐఫోన్ యూజర్లకంటే ముందుగానే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
పబ్జీ పోటీగా దేశీయ ఫౌ-జీ గేమ్
న్యూఢిల్లీ: ఫేమస్ మొబైల్ గేమ్ యాప్ పబ్జీ బ్యాన్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వస్తున్న ఫౌ-జీ అనే దేశీయ మొబైల్ గేమ్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. భారతీయ సైనిక బలగాల వీర్యపరాక్రమాలను తెలియజేసే విదంగా ఈ మొబైల్ యాప్ రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి సంబందించిన ఫౌ-జీ ఫస్ట్ లుక్ కూడా సినిమా రేంజ్లో టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా పబ్జీ కార్పొరేషన్ "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో త్వరలో భారత్ లో లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే పబ్జీకి గట్టిపోటీ ఇవ్వడానికి మన భారత ఫౌ-జీ గేమ్ యాప్ కూడా విడుదలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. (చదవండి: ఈ వాట్సాప్ మెస్సేజ్ తో జర జాగ్రత్త!) ఫౌ-జీ గేమ్ నవంబర్ తరువాత విడుదల చేయబడుతుందని కంపెనీ గతంలో ధృవీకరించినప్పటికీ, అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తున్నారో స్పష్టం చేయలేదు. గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫౌ-జీ గేమ్ అందుబాటులో ఉంటుందని ఎన్కోర్ గేమ్స్ పేర్కొంది. భారత గేమింగ్ కంపెనీ అయిన ఎన్కోర్ గేమ్స్ పబ్జీ పోటీగా గేమ్ ని అభివృద్ధి చేయడానికి అత్యంత నిపుణులైన టాప్ - 25 ప్రోగ్రామర్లు, డిజైనర్స్ , టెస్టర్స్, ఆర్టిస్ట్ బృందాన్ని ఎంపిక చేసినట్లు ఎన్కోర్ గతంలో తెలిపింది. 'ఫౌ-జీ: ఫియర్లెస్ మరియు యునైటెడ్ గార్డ్స్' అనే మల్టీ-ప్లేయర్ గేమ్ పబ్జీ మొబైల్కు భారతీయ ప్రత్యామ్నాయంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు కంపెనీలు కూడా అధికారికంగా గేమ్ ని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియజేయలేదు. -
పబ్జీ లవర్స్కి గుడ్ న్యూస్
చైనాతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం భద్రత కారణాల రీత్యా గతంలో 118 యాప్స్ ని నిషేదించింది. ఆ నిషేదించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరు పొందిన ‘పబ్ జి గేమ్’ కూడా ఉంది. పబ్ జి గేమ్ ని భారత్ లో నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగానే పడింది. నిషేధంతో ఒక్క సారిగా గేమ్ డౌన్ లోడ్ సంఖ్య తగ్గిపోయింది. అందుకే కంపెనీ తిరిగి భారత్ లోకి రావాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. కొద్దీ రోజుల క్రితం భారత వినియోగదారుల కోసం "పబ్ జి మొబైల్ ఇండియా" పేరుతొ కొత్త యాప్ ని కూడా తీసుకువచ్చింది. ఇప్పటికే దీనికి సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసింది. పబ్జీ మొబైల్ గేమ్ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. (చదవండి: పేటీఎం యూజర్లకు శుభవార్త) భారత్ లో పబ్ జీ గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్ జీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పబ్ జీ ప్రియుల సుదీర్ఘ నిరీక్షణ తొందరలోనే ముగియనుంది. భారతదేశంలో ఈ గేమ్ ని అధికారికంగా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. "పబ్ జి మొబైల్ ఇండియా" పేరుతో రిజిస్టర్ చేయబడిన పబ్ జి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో కంపెనీకి ఆటంకాలు అన్ని తొలిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం "పబ్ జి మొబైల్ ఇండియా"ను డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, చివరకు ఆటగాళ్లకు శుభవార్త లభించింది. -
పబ్జీ టోర్నీలో గెలిస్తే రూ. 6 కోట్లు!
దేశ భద్రతా కారణాల దృష్ట్యా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ని భారత్లో నిషేధించిన తరువాత తిరిగి "పబ్ జీ మొబైల్ ఇండియా" పేరుతో భారత మార్కెట్లోకి రావడానికి భారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న ఈ గేమ్ కోసం దేశంలో చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైనాకు చెందిన ఈ పబ్జీ గేమ్ ఇండియన్ కంపెనీకి పేటెంట్ రైట్స్ ఇచ్చింది. దీంతో పబ్జీ తిరిగి భారత్లో తన కార్యకలాపాల్ని కొనసాగించనుంది. పబ్జీ మొబైల్ గేమ్ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. (చదవండి: ఈ యాప్ తో వేలల్లో సంపాదించండి) తాజాగా భారత పబ్జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ట్విటర్లో ఒక ప్రకటన చేసారు. పబ్జీ నిర్వహించబోయే టోర్నీలో గెలిచే ప్లేయర్లకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందించనున్నారని తెలిపారు. ఇక పబ్జీ గేమ్ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్ను డెవలప్ చేస్తున్న టైర్–1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. ఇటీవల ఈ గేమ్కి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్లో రిలీజ్ చేసింది పబ్జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన 'పబ్జీ మొబైల్ ఇండియా'లో భారత మార్కెట్కు తగ్గట్టుగా ఈ గేమ్ను డిజైన్ చేస్తోంది. -
డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్
కోవిడ్ - 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దింతో అందరూ ఇంట్లోనే ఉండేసరికి స్మార్ట్ ఫోన్, పీసీ, పియస్4, ఏక్షబాక్స్ వన్, నింటెండో స్విచ్, గూగుల్ స్టేడియా వంటి గేమింగ్ ప్లాట్ఫారమ్ వినియోగం చాలా వరకు పెరిగింది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్లోడ్లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్లోడ్లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్లోడ్లకు చేరుకున్నాయి. ప్రపంచ వ్యాప్త గేమ్ డౌన్లోడ్ లలో 10శాతం ఇన్స్టాల్ లతో యుఎస్ రెండవ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో బ్రెజిల్ (8 శాతం) ఉంది. (చదవండి: కొత్త రికార్డు సృష్టించిన షియోమి) 2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్ గేమ్ లు నిలిచాయి. ఇండియాలో అక్టోబరులో పబ్జి నిషేధం తర్వాత తిరిగి "పబ్జి మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్లో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్లోడ్లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్స్టాల్లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి. -
పబ్జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది
న్యూఢిల్లీ: పబ్జీ ప్రియులకు శుభవార్త. పబ్జీ గేమ్ తిరిగి భారత్ లోకి "పబ్జీ మొబైల్ ఇండియా" రాబోతున్నట్లు పబ్జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన టీజర్ కూడా యూట్యూబ్లో రిలీజ్ చేసింది పబ్జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన పబ్జీ మొబైల్ ఇండియాలో భారత మార్కెట్కు తగ్గట్టుగా ఈ గేమ్ను డిజైన్ చేస్తోంది కంపెనీ. అంతే కాకుండా... భారత గేమింగ్ పరిశ్రమలో సుమారు రూ.700 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా యూట్యూబ్లో టీజర్ రిలీజ్ చేసింది పబ్జీ కార్పొరేషన్. పబ్జీ మొబైల్ ఇండియా టీజర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఈ టీజర్కే 39 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే పబ్జీ గేమ్కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించడంతో పాటు దేశం వెలుపల ఉన్న సర్వర్లకు చేరవస్తున్నాయనే కారణంతో చైనాకు చెందిన పబ్జీ, 117 ఇతర చైనా యాప్స్ ను భారత్ ప్రభుత్వం ఆగస్టులో నిషేధించింది. ఈసారి భారతదేశంలోని ఆటగాళ్ల గోప్యత, భద్రతను కాపాడటానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది పబ్జీ కార్పొరేషన్. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలోనే సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి పబ్జీ కార్పొరేషన్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. అయితే మొబైల్ వర్షన్ గేమ్ బాధ్యతల్ని గతంలో చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్కు అప్పగించింది. ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత పబ్జీ మొబైల్ బాధ్యతల నుంచి టెన్సెంట్ గేమ్స్ తప్పుకొంది. (పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..) -
పబ్జీ: ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో..
జైపూర్: రాజస్తాన్లో పబ్జీ ఆట ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపాడు. రాజ్సమంద్ జిల్లా జైత్పురకి చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని స్నేహితుడు హమీద్(17)కి పబ్జీ గేమ్ అంటే పిచ్చి. హమీద్ ఫోన్లో ఆ గేమ్ ఉండడంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈ నెల 9న హమీద్ పొలానికి వెళ్లి, తిరిగి రాలేదు. పబ్జీ ఆడడానికి ఫోన్ ఇవ్వలేదన్న కోపంతో బాలుడైన అతడి స్నేహితుడే బండరాయితో మోదడంతో హమీద్ ప్రాణం కోల్పోయాడని పోలీసు విచారణలో తేలింది. చదవండి: పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది! -
పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది!
కామారెడ్డి క్రైం: పబ్జీ ఆటపై మోజు ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజీద్ గల్లీకి చెందిన సాయికృష్ణ (20) కొంత కాలంగా పబ్జీ ఆటకు బానిస య్యాడు. అయితే, ఈ గేమ్పై కేంద్రం నిషేధం విధించడంతో థర్డ్పార్టీ యాప్ ద్వారా కొరియన్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాడు. సోమ వారం ఉదయం నుంచి బంగ్లాపై గదిలో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఆటపై ధ్యాసతో ఒత్తిడికి లోను కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సాయంత్రమైనా అతడు కిందకు దిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా పడిపోయి కనిపించాడు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. (చదవండి: సడన్గా లేచి.. కాల్చండని కేకలు) -
పబ్జీ ప్రియులకు శుభవార్త : కమింగ్ సూన్
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జీ యూజర్లకు శుభవార్త. భారతీయ వినియోగదారులకోసం కొత్త అవతారంలో ఈ గేమ్ తిరిగి అందుబాటులోకి రానుంది. ఇండియా యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్గా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్నామని పబ్జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్ప్లేను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. పబ్జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ ఇటీవల మైక్రోసాఫ్ట్తో జత కట్టింది. అజూర్ క్లౌడ్లో యూజర్ డేటా స్టోర్ చేసేలా గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ గత వారం ప్రకటించింది. అంతేకాదు గేమ్ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. ‘పబ్జీ మొబైల్ ఇండియా’ అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కాగా కరోనా వైరస్, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య పబ్జీ సహా చైనాకు చెందిన యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో (అక్టోబర్ 30,శుక్రవారం) నుంచి భారత్లో పబ్జీ గేమ్ను సర్వీసులు, యాక్సెస్ను నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ గేమ్ మళ్లీ భారతీయులకు అందుబాటులోకి రానుంది. -
పబ్జీ ప్రియులకు బిగ్ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ గేమ్ పబ్జీ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్. దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్జీ గేమ్ ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. పబ్జీ మొబైల్ తన సేవలన్నింటినీ నిలిపివేయనుంది. ఈ మేరకు పబ్జీ ఫేస్బుక్ పేజీలోఅధికారిక ప్రకటన చేసింది. నేటి (అక్టోబర్ 30,2020)నుంచి వినియోగదారులందరికీ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్ గతంలోనే తొలగించబడింది. అయినప్పటికీ తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసిన వారు ఇప్పటికీ ఈ పబ్జీని ఆడుకోవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. కాగా కరోనా వైరస్ విస్తరణ, సరిహద్దు వద్ద చైనా దుశ్చర్య నేపథ్యంలో గోప్యత, భద్రత కారణాల రీత్యా భారత ప్రభుత్వం పబ్జీ సహా118 చైనా యాప్స్ని నిషేధించిన సంగతి తెలిసిందే. -
పబ్జీ మళ్లీ వస్తుంది.. ఇదిగో ప్రూఫ్!
సాక్షి, న్యూఢిల్లీ: భద్రత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని భారత్లో చైనాకు సంబంధించిన అనేక యాప్స్ను నిషేధించిన వాటిలో అత్యంత ప్రాచూర్యం పొందిన టిక్టాక్, పబ్జీ మొబైల్ వెర్షన్ కూడా ఉన్నాయి. అయితే పబ్జీ ప్రియులకు త్వరలోనే శుభవార్త రాబోతున్నట్లు అనిపిస్తోంది. పబ్జీ మొబైల్ ఇండియాకు తిరిగిరాబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే పబ్జీ కార్పొరేషన్ యాజమాన్య సంస్థ అయిన దక్షిణ కొరియాకు చెందిన కాఫ్రన్ ఇండియాలో నియామకాలు చేపట్టింది. ఈ నెల 20వ తేదీన లింక్డ్ ఇన్ లో ఉద్యోగ నియామకాలను ప్రకటిస్తూ, పోస్ట్ పెట్టింది. కార్పొరేట్ డెవలప్ మెంట్ డివిజన్ మేనేజర్ స్థాయి పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో గేమింగ్ యాప్ తిరిగి ఇండియాలో మొదలవుతుందన్న వార్తలకు బలం చేకూరుతోంది. అయితే, ఈ యాడ్ చైనా సంస్థ టెన్సెంట్ పేరిట కాకుండా, క్రాఫన్ పేరిట కనిస్తోంది. అయితే, ప్రస్తుతం పబ్ జీపై భారత్లో నిషేధం అమలవుతున్నా,ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నవారితో పాటు కంప్యూటర్లలలో కూడా ఈ గేమ్ అందుబాటులోనే ఉంది. అయితే కొత్తగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. చదవండి: సడన్గా లేచి.. కాల్చండని కేకలు -
సడన్గా లేచి.. కాల్చండని కేకలు
ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఒక ప్రమాదకరమైన వ్యసనంలా మారాయి. ఆటల పేరుతో యువతను బానిసలుగా మార్చేసి, పిచ్చోళ్లను చేస్తూ కొన్ని కంపెనీలు రూ.కోట్లు దండుకుంటున్నాయి. ఆట మత్తులో హైస్కూల్ విద్యార్థుల నుంచి యువకుల వరకూ అంతా బానిసలై తల్లిదండ్రులకు తెలియకుండా రూ.వేలకు వేలు తగలేస్తున్నారు. అడిగిన వెంటనే సొమ్ములు ఇవ్వకుంటే తల్లిదండ్రులను బెదిరిస్తూ ఆత్మహత్యలకు సిద్ధమై, అలవోకగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్స్పై నిషేధం విధించినా యువత లెక్క చేయడం లేదు. సాక్షి, శృంగవరపుకోట: క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని అందించేవిగా ఉండాలి. ఆరోగ్యం కోసం ఆటలాడాలంటూ పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు క్రీడలు అంటే పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి మొన్న పోక్మాన్, నిన్న బ్లూవేల్స్, ఇప్పడు పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్స్ విద్యార్థులను, యువతను వెర్రెక్కించి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. విద్యార్థులు, యువకులు గంటల పాటు ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని గేమ్స్ను బ్యాన్ చేసినా, కొన్ని సర్వర్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుని వేలాది మంది డేంజర్గేమ్స్లో భాగస్వాములు కావడం గమనార్హం. ఏమిటీ గేమ్స్.. పబ్జీ దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయన్ గేమింగ్ యాప్. ఇదే తరహాలో మరో ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్. ఈ గేమ్స్ను ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని గేమ్లో ప్రవేశించాలి. గేమ్ను సింగిల్గా లేదా గ్రూప్గా ఆడొచ్చు. గేమ్లో 100 మంది వరకూ ఉంటారు. ఆడేవారు తప్ప మిగిలిన వారంతా శత్రువులు గానే లెక్క. గేమ్ని వార్ ఫీల్డ్లా భావించి ఎదురుపడ్డ పోటీదారులను చంపుకుంటూ పోవాలి. మిగిలిన వాడు విజేత. ఇందులో మనం ఎంచుకున్న ఆటగాడికి కావాల్సిన దుస్తులు, ఆయుధాలు, బాంబులు, బంకర్లు, మెడికల్ కిట్లు అన్నీ అమ్మకానికి ఉంటాయి. దీంతో తమ ఆటగాడికి కావాల్సిన సామగ్రి కొనాలంటే వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఇలా తమను ఊహించుకుంటూ ఓడిన (చనిపోయిన) ప్రతిసారీ గెలవాలన్న కసితో వేల రూపాయలు తగలేస్తున్నారు. పట్టించుకోని ఉన్మాదం.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు మూతపడటం, ఆన్లైన్ క్లాసుల కోసం అని ఇంచుమించుగా ప్రతి విద్యార్థికి ఆండ్రాయిడ్ మొబైల్ని తల్లిదండ్రులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఆన్లైన్ గేమ్స్లో బానిసలుగా మారిన విద్యార్థులు, యువకులు చదువుల్లో పూర్తిగా వెనుకబడుతున్నారు. నిద్రలేమి, కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, ఓటమిని భరించలేక పోవడం, సొమ్ము కోసం తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం వంటి నేర ప్రవృత్తికి లోనవుతున్నారని, డిప్రెషన్కు లోనై ఆత్మహత్యకు తెగిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులు.. ఎస్.కోటకు చెందిన విజయ్సాయి(పేరు మార్చాం) కొద్ది నెలల క్రితం పబ్జీ, ఫైర్ ఫ్రీ గేమ్స్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. క్రమంగా గేమ్స్లో మునిగితేలాడు. ఆటలో మదుపు పెట్టేందుకు తండ్రికి తెలియకుండా రూ.వేలల్లో ఖర్చు పెట్టాడు. డబ్బులు పోయి, డబ్బులు ఖర్చులకు లేక వింత పోకడతో వ్యవహరించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుణ్ని సంప్రదించారు. సైక్రియాటిస్ట్ అతడిని గేమ్స్కు దూరంగా ఉంచాలని, ప్రస్తుతం ఏ విషయంపై ఒత్తిడి చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మందులు ఇచ్చారు. ఎస్.కోటకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి అభిజ్ఞకుమార్ (పేరు మార్చాం) ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాత్రివేళ నిద్రలో సడన్గా లేచి పరుగెడుతున్నాడు.. ‘కాల్చండి.. కాల్చండి’ అంటూ కేకలు పెడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా పిల్లలను నియంత్రించాలి. వారి భవిష్యత్ దెబ్బతినే పరిస్థితి రాకుండా గమనించాలి. అవసరం లేకుండా ఫోన్లు కొని ఇ వ్వకూడదు. గంటలకొద్దీ ఫోన్లతో గడిపేటప్పు డు వారి మానసికి స్థితిని గమనించాలి. ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లలు, యువకుల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. ఆత్మహత్యలకు సిద్ధమౌతున్నారు. – బి.శ్రీనివాసరావు, ఎస్.కోట సర్కిల్, సీఐ మానసికంగా బలహీనులౌతారు మొబైల్ గేమ్స్ ఆడడంతో ఒత్తిడికి గురై మానసికంగా బలహీనం అవుతారు. దృష్టిలోపం, ఆత్మన్యూనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, భయం, ఆందోళనకు గురవడం, కోపానికి గురికావడం, స్వీయ నియంత్రణ కోల్పోవడం జరుగుతాయి. వీలైనంత త్వరగా వారిని ఆ వ్యససం నుంచి బయటకు రప్పించేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. – డాక్టర్ జి.మృదుల, హోమియో వైద్యాధికారి, ఎస్.కోట ఆన్లైన్ గేమ్స్తో సమస్యలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం గడపడం వల్ల కండరాల వృద్ధి ఆగిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. కోపం, ఉద్రేకం అధికమౌతాయి. శారీరక, మానసిక రుగ్మతలకు గురౌతారు. వాళ్లని గమనించి ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంచాలి. – డాక్టర్ ఎస్.వి.సత్యశేఖర్, జనరల్ సర్జన్ -
పబ్జీ కోసం తండ్రిపై కత్తితో దాడి!
లక్నో: పబ్జీ గేమ్ను భారత్తో బ్యాన్ చేసిన దాని వల్ల జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గంటలు గంటలు పబ్జీ అడొద్దు అని చెప్పినందకు ఒక కొడుకు తన తండ్రిని కత్తితో గాయపరిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. అమర్ అనే వ్యక్తిని అతని తండ్రి ఇర్ఫాన్ పబ్జీ అడొద్దు అంటూ మందలించాడు. ప్రతిసారి అలా అడ్డుచెప్పడంతో విసుగుచెందిన అమర్ అతని తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి అతని గొంతు వద్ద అనేకసార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలతో వచ్చిన అతడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయాడు. గాయపడిన తండ్రి కొడుకులను ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అమర్కు డ్రగ్స్ అలవాటు ఉందని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. భారత్లో పబ్జీని ఆపేసినప్పటికి ఇప్పటికే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారు ఆడటానికి వీలు కల్పిస్తుండంటతో యువత పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. చదవండి: పబ్జీ ముసుగులో బాలికపై దారుణం -
పబ్జీ ముసుగులో బాలికపై దారుణం
భోపాల్: ఆన్లైన్ గేమ్ ముసుగులో మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయిని (12) మభ్యపెట్టి లైంగికంగా దాడి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి, పదేపదే అత్యాచారం చేసిన ఉదంతం కలకలం రేపింది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పబ్జీ గేమ్ పేరుతో బాలికతో ఆన్లైన్లో స్నేహం నటించారు. ఈ క్రమంలో గత నెలలో, నిందితులు బాలికను రంభ నగర్ కు ఆహ్వానించి ఆమెపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. అనంతరం ఎవరికైనా చెబితే ఈ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి మరీ ఆమెపై పలుమార్లు దురాగతానికి పాల్పడ్డారు. చివరకు తల్లిదండ్రుల సాయంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగు చూసింది. బాలిక కుటుంబం ఇచ్చిన పోలీసు ఫిర్యాదు మేరకు రంభ నగర్ ప్రాంతానికి చెందిన18 -19 సంవత్సరాల మధ్య వయస్సున్నముగ్గురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా డేంజర్ పబ్జీ గేమ్ ను కేంద్రం బ్యాన్ చేసినా, డౌన్ లోడ్ పై నిషేధం ఉన్నా ఇప్పటికే దీనికి యాక్సెస్ ఉన్న వారితోపాటు, కొత్తగా డౌన్ లోడ్ కూడా అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
యువతకు పిచ్చెక్కిస్తున్న పబ్జీ
సాక్షి, తిరుపతి : ఆన్లైన్ మొబైల్ గేమింగ్ వ్యసనంగా మారుతోంది. ఒకసారి గేమ్లోకి ప్రవేశిస్తే దానికి బానిసగా మార్చేసుకుంటోంది. ప్రత్యేకించి ‘పబ్జీ’ యువతను పిచ్చెక్కిస్తోంది. వారి జీవితాలతో ఆడుకుంటోంది. చివరకు ప్రాణాలను సైతం అలవోకగా తీసుకునేలా ప్రేరేపిస్తోంది. ఎందరో తల్లిదండ్రుల ఉసురుపోసుకుంటోంది. ప్రభుత్వం నిషేధించినా ఇంకా వెర్రితలలు వేస్తూనే ఉంది. పిల్లలు ఈ గేమ్ జోలికి వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక నవాబ్పేటలో నివాసం ఉంటున్న ఓ యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం లాక్డౌన్ సమయంలో పూట జరగడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లని పురమాయించారు. గేమ్కు దూరం కావాల్సి వస్తుందని ఆ యువకుడు ఇంటి గేటుకి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్జీ (ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్గ్రౌండ్) యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను వెర్రెక్కిస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్. మరీ గంటల తరబడి ఈ ఆటలో మునిగితేలుతున్నారు. ఈ గేమ్ను ప్రభుత్వం బ్యాన్ చేసినా, వివిధ సర్వర్ల ద్వారా పలువురు ఆడుతుండడం గమనార్హం. ఏమిటీ గేమ్...? పబ్జీ.. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని గేమ్లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ గేమ్లో గరిష్టంగా వంద మంది ఉంటారు. ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట. ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్లో ప్రవేశించాలనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్లు సుమారు 20కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. దీనికి అలవాటు పడిన వారు చదువులో పూర్తిగా వెనుకబడుతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. -
‘పబ్జీ’కి బానిసై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
తిరుపతి క్రైం: పబ్జీ గేమ్కు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి నగరం మంగళం బీటీఆర్ కాలనీలో నివాసముంటున్న టీటీడీ ఉద్యోగి భాస్కర్ కుమారుడు తేజేష్ (19) ఇంటర్ చదువుతున్నాడు. తేజేష్ కొంత కాలంగా పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. దీనిపై తల్లిదండ్రులు నిరంతరం మందలిస్తున్నా పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో తేజేష్ పబ్జీ గేమ్ కోసం ఆన్లైన్లో ఖర్చు పెట్టుకునేందుకు తండ్రిని రూ.3 వేలు అడిగాడు. తండ్రి నిరాకరించడంతోపాటు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి తన బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం లేచి చూసేసరికి తేజేష్ విగతజీవిగా ఉరితాడుకు వేలాడుతుండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కాగా, పబ్జీని కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ కొందరు యువత ఇతర మార్గాల్లో పబ్జీ గేమ్ను డౌన్లోడ్ చేసుకుని ఆడుతుండటం గమనార్హం. -
రిలయన్స్ జియో చేతికి పబ్జీ
సాక్షి, న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ మొబైల్ గేమ్ పబ్జీనిభారతీయ వినియోగదారులకు తిరిగిఅందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ టెలికాం విభాగం జియోతో పబ్జీ కార్పొరేషన్తో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయి. దీనికి సంబంధిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలపై దృష్టినట్టు సమాచారం. మొదటిది 50:50 వాటాలు, రెండవది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు ఆదాయాన్ని చెల్లించడం. రిలయన్స్ గేమింగ్ మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. పబ్జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. ఇండియాలో దీనిపై నిషేధం విధించడంతో చైనాకంపెనీనుంచి బ్లూహోల్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకుంది. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో పబ్జీపై ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు జియో రంగంలోకి దిగింది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీవల కరోనా వైరస్ సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ ప్రకారం పలు చైనా యాప్లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించిన సంగతి తెలిసిందే. -
పబ్జీ లాభాల్లో భారత్ వాటా 1.2 శాతమే...
ముంబై: దేశంలో పబ్జీ యాప్ నిషేధించినప్పటికీ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పబ్జీ మొబైల్ యాప్ 2018లో పారంభమైనప్పటి నుంచి యాప్ వినియోగదారులు 3.5 బిలియన్ డాలర్స్ ఖర్చు చేసినట్లు సెన్సార్ టవర్స్ అనే కంపెనీ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. కేవలం ఈ ఏడాదిలోనే 19.8 కోట్ల డౌన్లోడ్లు కాగా... 1.8 బి.డా(180కోట్లు) సంపాధించడం విశేషం. అంతే కాదు గత 72 రోజుల్లో 50 కోట్ల డాలర్లు పబ్జీ యాప్ ఆర్జించింది. ఈ గణాంకాలు ఇదిలా ఉండగా, భారత దేశంలో ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పబ్జీ యాప్ వినియోగదారుల్లో 24 శాతం మన దేశంలోనే ఉన్నారు. కానీ ఈ యాప్కు వచ్చే లాభాల్లో మన దేశం నుంచి కేవలం 1.2 శాతం మాత్రమే. రాయల్ పాస్, రకరకాల రంగులు, ఇంకా యాప్లోని కొన్ని పరికరాలు కొనేందుకు మన దేశంలో ఉన్న పబ్జీ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఆసక్తి చూపట్లేదు. ఈ నెల 2న చైనాకు చెందిన 118 యాప్స్తో పాటు పబ్జీ కూడా నిషేధించిన విషయం తెలిసిందే. దీన్ని ద్వారా ఈ యాప్ పబ్లిషర్ టెన్సెంట్ కంపెనీకి 34 బి.డా నష్టపోయింది. మన దేశంలో పబ్జీని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. ఇప్పుడు మన దేశంలో ఈ యాప్ను డౌన్లోడ్ లేదా అప్డేట్ చేయడం చట్ట విరుద్ధం. రెవెన్యూ పరంగా మన దేశంలో కొంత నిరాశగానే ఉన్నా, మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. ఈ వివాదాన్ని పరిశీలించి టెన్సెంట్ కంపెనీ నుంచి పూర్తి హక్కులు పొందినట్లు పేర్కొంది. భారత్లో మళ్లీ పబ్జీని ప్రారంభించేందుకు స్వదేశీ బ్రాండ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: భారత్లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్) -
అనంతపురం: బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
-
పబ్జీ బ్యాన్.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: బాటిల్ గ్రౌండ్ గేమ్ పబ్జీకి బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్లపై నిషేధం విధించింది. దాంతో ఎడతెరిపిలేకుండా గేమ్లోనే మునిపోయే కిరణ్కుమార్రెడ్డి (23) తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడు. అనంతపురం రెవెన్యూ కాలనీలోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భారత్లో పబ్జీ కథ ముగిసినట్లేనా?
(వెబ్ స్పెషల్): ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్తగా పరిచయం అక్కర్లేని ఆట పబ్జీ. ఈ గేమ్కు ఉన్నంత క్రేజ్ కొంతమంది సినీ నటులకు కూడా లేదని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొబైల్ గేమ్స్ ఆడే వారిపై ఈ గేమ్ ఎంతలా ప్రభావం చూపిందో చెప్పటానికి వందల సంఖ్యలో నమోదైన ఆత్మహత్యలు, హత్యలే ఓ ఉదాహరణ. భారత్-చైనాల మధ్య ఏర్పడ్డ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే పబ్జీ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జీ కార్పొరేషన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ గేమ్ ఫ్యాన్స్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. పబ్జీ ప్రస్థానం 'ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్'(పబ్జీ)ని దక్షిణ కొరియాకు చెందిన బ్రెండన్ గ్రీన్ అనే వ్యక్తి రూపొందించాడు. పబ్జీ కార్పొరేషన్ అనే గేమింగ్ సంస్థ 2017లో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 2017 మార్చిలో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లకు గేమ్ను అందుబాటులోకి తెచ్చింది. అనంతరం 2018 సంవత్సరంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు, 2020 సంవత్సరంలో ప్లేస్టేషన్ 4, స్టాడియా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే పబ్జీ మొబైల్ గేమ్గానే చాలా మందికి సుపరిచితం. అంతేకాదు మిగిలిన అన్ని ప్లాట్ఫాంల కన్నా మొబైల్ వర్సన్లోనే పబ్జీకి క్రేజ్ ఎక్కువ. దీన్ని ఇప్పటివరకు 600 మిలియన్ల మందికి పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ( భారత్లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్ ) ఇండియాలో పబ్జీ హవా ఇండియాలో 2018 నుంచి బాగా పాపులర్ అయిన ఈ గేమ్ రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పబ్జీ ప్లేయర్స్ కలిగిన దేశంగా మారింది. దీన్ని ఇప్పటి వరకు 116 మిలియన్ల మంది భారతీయులు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్లకు పైగా మంది పబ్జీ ప్లేయర్స్ ఉండగా మన దేశంలోనే 22% ఉన్నారు. మొబైల్లో గేమ్ ఆడుతున్నట్లు కాకుండా మనమే యుద్ధ రంగంలోకి దిగి గేమ్ ఆడుతున్న ఫీల్ ఉండటంతో జనం ఎక్కువగా దీనికి బానిసలయ్యారు. కొంతమంది గేమ్ ఆడకపోతే ఊపిరాడదు అన్నట్లుగా మారిపోయారు. పబ్జీ క్రైం రేటు కూడా ఇండియాలో బాగానే పెరిగిపోయింది. ఇండియాలో పబ్జీ బ్యాన్ భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు నెలల క్రితం 59, జూలై నెలాఖరున 47 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. తాజాగా గత బుధవారం చైనాకు చెందిన మరో 118 యాప్లను నిషేధించింది. వీటిలో దక్షిణ కొరియాకు చెందిన, చైనాతో భాగస్వామ్యం ఉన్న పబ్జీ కూడా ఉండటం గమనార్హం. సదరు యాప్స్ భారత పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ఇవి ముప్పు కలిగిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ( పబ్జీ బ్యాన్ : పబ్జీ కార్పొరేషన్ కీలక ప్రకటన ) పబ్జీ రాకపై కొత్త ఆశలు దేశంలో పబ్జీ బ్యాన్తో పెద్ద మార్కెట్ను కోల్పోయింది గేమ్ రూపకర్త దక్షిణ కొరియాకు చెందిన పబ్జీ కార్పొరేషన్. దీనిపై కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ గేమ్లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇకపై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. ఇండియాలో పబ్జీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చైనా స్టేక్ హోల్డర్స్కు బై చెప్పి ఓ ఇండియన్ గేమింగ్ దిగ్గజంతో చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తోంది. భారత్లో ఈ గేమ్ను నిషేధించటానికి ప్రధానం కారణం చైనాతో సంబంధాలే. ఒక వేళ పబ్జీ కార్పొరేషన్ చైనాకు దూరమై, భారత్కు దగ్గరైతే కనుక ఈ గేమ్ ఇండియాలోకి తిరిగొస్తుందన్నది నిర్వివాదాంశం. -
భారత్లో రీ ఎంట్రీకి పబ్జీ మాస్టర్ ప్లాన్
భారత్లో మరోసారి అడుగుపెట్టేందుకు పబ్జీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. పబ్జీకి అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో ఈ యాప్ను బ్యాన్ చేయడంతో పబ్జీ డెవలపర్ప్ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా స్టేక్ హోల్డర్స్కు బై చెప్పి ఇండియన్ గేమింగ్ దిగ్గజంతో చేతులు కలిపితే తమకు పూర్వ వైభవం ఖాయమన్నది వారి అంచనా. ఈ దిశగా చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తమ చర్చలు సఫలమైతే భారత్లో పబ్జీపై బ్యాన్ లిఫ్ట్ చేస్తారని ‘బ్లూహోల్’గట్టిగా నమ్ముతోంది. చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు యూజర్ల డేటా ప్రమాదంలో పడిందని, వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్ను భారత్లో బ్యాన్ చేశారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. మెజారిటీ షేర్ హోల్డర్ ఎవరంటే.. పబ్జీలో ప్రధాన వాటా దక్షిణ కొరియాకు చెందిన ‘బ్లూహోల్ గేమ్స్’ వద్ద ఉంది. చైనాకు చెందిన ‘టెన్సెంట్ గేమ్స్’తో పార్ట్నర్షిప్ టైఅప్ చేసుకున్న ‘బ్లూహోల్’.. ప్రపంచ వ్యాప్తంగా తమ గేమింగ్ యాప్ను లాంచ్ చేసింది. ‘దేశ ప్రయోజనాల’ను కాపాడడంలో భాగంగా దాదాపు వందకు పైగా చైనా యాప్ప్ను ఇటీవల భారత్ బ్యాన్ చేసింది. ఇందులో పబ్జీ ప్రధానమైంది. కోట్ల సంఖ్యలో ఇండియన్స్ ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2019లో భారత్ ద్వారా దాదాపు 100 మిలియన్ డాలర్లు ‘బ్లూహోల్’ ఖాతాలో పడినట్టు తెలుస్తోంది. పబ్జీ మేనేజ్మెంట్ ఆలోచన ఇదే.. చైనాకు చెందిన ‘టెన్సెంట్ గేమ్స్’కు కటీఫ్ చెబితే భారత్లో రీ ఎంట్రీ ఇవ్వొచ్చన్నది ‘బ్లూహోల్ గేమ్స్’ ఐడియా. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా భారత్కు చెందిన గేమింగ్ యాప్తో భాగస్వామ్యం కుదుర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కొన్ని గేమింగ్ యాప్ డెవలపర్లతో చర్చలు కూడా పూర్తయ్యాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ చర్చలు సఫలమైతే భారత్లో పబ్జీపై బ్యాన్ లిఫ్ట్ చేస్తారని ‘బ్లూహోల్’ గట్టిగా నమ్ముతోంది. భారత అధికారులేమంటున్నారంటే.. ‘బ్లూహోల్’ ప్రయత్నాలపై భారత అధికారుల వాదన మరోలా ఉంది. పబ్జీలో చైనా సంస్థలకు భాగస్వామ్యం ఉండడంతోపాటు ఇక్కడి యూజర్ల డేటా ప్రైవసీ ప్రమాదంలో పడిందన్నది వారి అనుమానం. వీటన్నింటితోపాటు మరికొన్ని కారణాల వల్ల ఈ యాప్ను భారత్లో బ్యాన్ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ను బ్యాన్ చేసిన వెంటనే.. డేటా ప్రైసీకి సంబంధించిన తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా పబ్జీ మేనేజ్మెంట్ను భారత్ ప్రభుత్వం కోరిందని.. ఇందుకు మూడు వారాలు గడువిచ్చిందని అధికారులు వివరిస్తున్నారు. ఆ సంస్థకే ఛాన్స్? పబ్జీ వంటి ‘భారీ’ యాప్ప్ను మేనేజ్ చేసే సత్తా భారత్లో అతికొన్ని సంస్థలకే ఉందని ఇక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పబ్జీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ‘గరేనా ఫ్రీఫైర్’తో ఇప్పటికే టైఅప్ అయిన‘పేటీఎం ఫస్ట్ గేమ్స్’ వంటి ఒకట్రెండు సంస్థలకే ఈ కెపాసిటీ ఉందని చెబుతున్నారు. భారత్లో పబ్జీ లైసెన్స్ను పొందేందుకు బిగ్ షాట్ రిలయన్స్ ఇప్పటికే రంగంలోకి దిగిందని వార్తలొచ్చినప్పటికీ ఆ సంస్థ వీటిపై నోరు మెదపలేదు. -
పబ్జీ బ్యాన్ : పబ్జీ కార్పొరేషన్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్ని నిషేధంతో ఆందళనలో పడిన పబ్జీ ఫాన్స్ కు భారీ ఊరట లభించనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్ పబ్జీ మొబైల్ మళ్లీ దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ గేమ్లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇకపై చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పింది. (ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!) ఇండియాలో పబ్జీ రద్దుపై ఈ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జి కార్పొరేషన్ తాజాగా స్పందించింది. పబ్జీ మొబైల్ వర్షన్ను ప్రమోట్ చేస్తున్న చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీతో సంబంధాలను తెగ తెంపులు చేసుకుంటోంది. నిషేధం తదనంతర పరిస్థితిని గమనిస్తున్నామని వెల్లడించింది. ఇకపై పబ్జీ మొబైల్కు, టెన్సెంట్ గేమ్స్కు ఎలాంటి సంబంధం లేదని, పూర్తి బాధ్యతలు తమ ఆధ్వర్యంలోనే ఉంటాయని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. భారతీయ చట్టాలు, నిబంధనలను, ప్రభుత్వం చర్యలను పూర్తిగా గౌరవిస్తున్నామనీ, ఈ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని ప్రకటించింది. తద్వారా యాప్పై నిషేధం తొలగిపోతుందని పబ్జీ కార్పొరేషన్ భావిస్తోంది. అయితే ఈ విషయంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా గత వారం భారతదేశంలో పబ్జీ నిషేధం తరువాత టెన్సెంట్ మార్కెట్ విలువ 34 బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు అంచనా. -
పబ్జీ కోసం తాత పెన్షన్ అకౌంట్ నుంచి
న్యూఢిల్లీ: పబ్జీ కోసం ఓ బాలుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి 2.35 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి డబ్బును బదిలీ చేశాడని.. ఆ మొత్తాన్ని నెలల తరబడి పబ్జీ కోసం వినియోగించాడని ఢిల్లీ సైబర్ పోలీస్ సెల్ విభాగం వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బాధితుడికి తన బ్యాంక్ అకౌంట్ నుంచి 2,500 డ్రా చేసినట్లు మెసేజ్ రావడమే కాక అవైలబుల్ బ్యాలెన్స్ 275 రూపాయలుగా చూపించింది. ఈ మెసేజ్ చూసి బాధితుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి తనకు వచ్చిన మెసేజ్ గురించి విచారించగా.. అతని పెన్షన్ ఖాతా నుంచి 2,34, 000 రూపాయలు బదిలీ అయినట్లు తెలిసింది. బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించి, తాను ఎటువంటి లావాదేవీలు చేయలేదని.. తన నంబర్కు వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) కూడా రాలేదని ఆరోపించాడు. (చదవండి: ఇకపై పోచింకిని సందర్శించలేరు..) గత రెండు నెలల వ్యవధిలో బాధితుడి ఖాతా నుంచి 2,34,497 రూపాయలు బదిలీ అయినట్లు సైబర్ సెల్ గుర్తించింది. పంకజ్ కుమార్ (23) పేరిట ఉన్న పేటీఎం ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సైబర్ సెల్ పంకజ్ కుమార్ను అదుపులోకి తీసుకుంది. విచారణలో తన స్నేహితులలో ఒకరు అతని ఐడీ, పేటిఎమ్ ఖాతా పాస్వర్డ్ అడిగినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి పబ్జీ కోసం గూగుల్ పే చెల్లింపులు చేయడానికి పంకజ్ ఖాతాను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తిని ఫిర్యాదుదారుడి మనవడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తన తాత ఖాతా నుంచి పబ్జీ ఆడటానికి నగదు బదిలీ చేసినట్లు నిందితిడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అవుతుందని చెప్పితన తాత మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్లను తొలగించేవాడనని టీనేజర్ పోలీసులకు తెలిపాడు. -
పబ్జీకి వినూత్నంగా అంతిమ వీడ్కోలు
-
వైరల్: పబ్జీకి అంతిమ వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఆన్లైన్ గేమ్స్లో పబ్జీ ముందు వరుసలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువతను బానిసలుగా చేసుకున్న ఈ గేమింగ్ యాప్పై భారత్ నిషేధం విధించిన విషయం విధితమే. దీంతో ఎంతో మంది తల్లిదండ్రులు పబ్జీ బ్యాన్పై ఆనందం వ్యక్తం చేస్తుంటే.. పబ్జీ ఆటగాళ్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పబ్జ్ బ్యాన్పై రకారకాల మిమ్స్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తమకు ఇష్టమైన పబ్జీకి కొంతమంది యువకులు వినూత్నంగా వీడ్కోలు పలికారు. సదరు యువకులు ఈ గేమ్ యాప్కు అంతియ సంస్కరణలు నిర్వహించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకులంతా తెల్లని వస్రాలు ధరించి.. పబ్జీ పోస్టర్ను పాడేపై ఉంచి దానికి పూలదండ వేశారు. అనంతరం వారంతా ‘విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్’ అంటూ నినాదాలు చేస్తూ ఇలా తమ అభిమాన యాప్కు వినూత్నంగా వీడ్కోలు పలికారు. (చదవండి: ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!) అయితే భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్పై నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ గేమ్తో పాటు 118 ఇతర యాప్లు కూడా ఉన్నాయి. భారత్లో ఈ పబ్జీ గేమ్ యాప్ను 50 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్ను మొదట దక్షిణ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్టాప్ వర్షన్లో ఆడొచ్చు. తరువాత సౌత్ కొరియా నుంచి లైసెన్స్ పొందిన చైనా కంపెనీ టెన్సెన్ట్ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్ను తీసుకువచ్చింది. ఇప్పుడు చైనా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీతో సంబంధం ఉన్న పబ్జీ మొబైల్ యాప్పై కేంద్రం నిషేధం విధించింది. (చదవండి: పబ్జీతో యువతలో పెరిగిన నేరప్రవృత్తి) -
ఇండియన్ పబ్జీ...ఫౌజీ వచ్చేస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ: పబ్జీ సహా 118 చైనీస్ మొబైల్ యాప్ లపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఇండియన్ పబ్జీ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ కొత్త యాక్షన్ గేమ్ను శుక్రవారం పరిచయం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మల్టీప్లేయర్ యాక్షన్-గేమ్ ఫౌ-జీని ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. వినోదంతో పాటు ఆటగాళ్ళు మన సైనికుల త్యాగాల గురించి కూడా తెలుసుకుంటారని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది. అక్షయ్ కుమార్ తోపాటు, పారిశ్రామికవేత్త, జీవోక్యూఐఐ ఫౌండర్, సీఈవో విశాల్ గోండల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దీని ఆదాయంలో 20 శాతం నిధులను భారత్ కే వీర్కు విరాళంగా ఇస్తామని తెలిపారు. అయితే అధికారికంగా ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ వివరించలేదు. అలాగే ఈ గేమ్ మొబైల్ పరికరాలకే పరిమితం అవుతుందా లేదా పీసీ వెర్షన్ కూడా వస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. కాగా1999 లో ఇండియా గేమ్స్ ను ప్రారంభించిన విశాల్ గోండల్ 2011లో దీన్ని డిస్నీకి విక్రయించారు. గత ఏడాది మార్చిలో ఎన్కోర్ గేమ్స్లో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. అలాగే స్టార్టప్కు వ్యూహాత్మక సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. Supporting PM @narendramodi’s AtmaNirbhar movement, proud to present an action game,Fearless And United-Guards FAU-G. Besides entertainment, players will also learn about the sacrifices of our soldiers. 20% of the net revenue generated will be donated to @BharatKeVeer Trust #FAUG pic.twitter.com/Q1HLFB5hPt — Akshay Kumar (@akshaykumar) September 4, 2020 In response to PM @narendramodi call of #AtmaNirbharApp, @nCore_games is proud to announce our action game Fearless And United: Guards FAU:G with mentorship from @akshaykumar 20% of net revenues donated to @BharatKeVeer trust for India's Bravehearts #JaiHind #FAUG #gaming pic.twitter.com/OZTKj2mdFl — Vishal Gondal (@vishalgondal) September 4, 2020 -
చైనాపై ‘నిషేధాస్త్రం’
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇంకా కవ్వింపు చర్యలు ఆపని చైనాపై మరోసారి మన దేశం నిషేధాస్త్రం ప్రయోగించింది. రెండు నెలలక్రితం 59 యాప్లు, జూలై నెలాఖరున 47 యాప్లు నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బుధవారం ఆ దేశానికే చెందిన మరో 118 యాప్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. గతంలోలాగే ఈసారి కూడా కేంద్రం అవి చైనాకు చెందినవన్న కారణంతో చర్య తీసుకున్నట్టు చెప్పలేదు. మన పౌరుల వ్యక్తిగత గోప్యతకూ, డేటా భద్రతకూ, దేశ సార్వభౌమత్వానికి ఇవి ముప్పు కలిగిస్తున్నాయని తెలిపింది. ఈమధ్య ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దేశీయ ఆట బొమ్మల తయారీతోపాటు వీడియో గేమ్ల ప్రస్తావన కూడా చేశారు. వర్తమానంలో డిజిటల్ మార్కెట్ వ్యవస్థ కీలకమైనది. యాప్ల రూపకల్పనలో ప్రపంచంలోనే అందరికన్నా ముందున్న చైనాకు అది మరింత ముఖ్యం. చైనాలో పౌరులు ఏది చూడొచ్చు...ఏది చూడకూడదన్న నియంత్రణలుంటాయి. మనకు ఆ సమస్య లేదు. జనాభా కూడా అధికం కనుక వినియోగదారుకు ప్రయోజనం కలిగించే...లేదా కావలసినంత కాలక్షేపాన్నిచ్చే యాప్ వచ్చిందంటే డౌన్లోడ్లు కట్టలు తెంచుకుంటాయి. ఆ సంఖ్య వందలు వేలుగా...వేలు లక్షలుగా...లక్షలు కోట్లుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. ఆ రకంగా యాప్ యాజమాన్యాలకు ఏటా వేల కోట్ల ఆదాయం వచ్చిపడుతుంటుంది. చైనా యాప్లలో చాలా భాగం ఇలాంటి ఆర్జనలో ఆరితేరాయి. మనతో యధావిధిగా వాణిజ్యం సాగిస్తూనే, మరోపక్క ఎల్ఏసీ వద్ద మనల్ని చికాకు పెట్టొచ్చని భావిస్తున్న చైనాకు ఈ యాప్ల నిషేధంతో కాస్తయినా షాక్ ఇవ్వొచ్చన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి వుంది. అలాగే డిజిటల్ రంగంలో సూపర్ పవర్గా ఎదగాలని బలంగా వాంఛిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి ఇది తోడ్పడుతుందని ఆ రంగంలోని నిపుణుల భావన. అలాగే వేరే దేశాలు సైతం ఇదే బాట పడితే తమ ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నామన్న అభిప్రాయం అక్కడి టెక్ కంపెనీల్లో, నిపుణుల్లో ఏర్పడుతుంది. ఇవన్నీ ఎల్ఏసీ వద్ద బుద్ధిగా మసులుకోవడానికి చైనాను ఎంతవరకూ పురిగొల్పుతాయో చెప్పలేం. మన దేశంలో సెల్ఫోన్లు, వాటిలో వినియోగించే డేటా చవగ్గా లభ్యం కావడం మొదలైన దగ్గరనుంచీ ఈ యాప్లపై అందరికీ మోజు పెరిగింది. కనుకనే నిషేధం విధిస్తారన్న కథనాలు వచ్చినప్పటినుంచి అందరూ కంగారుపడ్డారు. లోగడ నిషేధించిన యాప్లలో టిక్టాక్ వుండటమే చాలామందిని బాధించింది. ఎందుకంటే అది పల్లెలు, పట్టణాలన్న వ్యత్యాసం లేకుండా...అన్ని వయసులవారినీ ఆకట్టుకుంది. ఆడ మగ తేడా లేకుండా అందరికందరూ తమ తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడానికి దాన్నొక వేదికగా ఎంచుకున్నారు. ఎవరి ఆసరా లేకుండా, డబ్బుతో పనిలేకుండా జనంలో పాపులర్ అయ్యారు. మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యత అంతంతమాత్రంగావున్న అతి సాధారణ పౌరులు సైతం లక్షలాదిమంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు. పర్యవసానంగా వారి ఆదాయం ఊహకందని స్థాయికి చేరుకుంది. తాజా జాబితాలోవున్న పబ్జీ యాప్ అలాంటిదే. దానికున్న జనాదరణ చాలా ఎక్కువ. ఆ యాప్కు ప్రపంచవ్యాప్తంగావున్న వీరాభిమానుల్లో 24 శాతంమంది మనవాళ్లేనని, పెద్ద మార్కెట్వున్న దేశం కూడా మనదేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈ యాప్ను రూపొందించింది దక్షిణ కొరియాకు చెందినవారైనా...దీనికి సంబంధించిన మొబైల్ యాప్ను చైనా సంస్థ టెన్సెంట్ అభివృద్ధి చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో వుండే వందమంది వరకూ ఒక గేమ్లో భాగస్వాములుగా మారి ఆడేందుకు పబ్జీ అవకాశమిస్తుంది. నిజానికి ఇది చైనాకు చెందిందా, మరో దేశానికి చెందిందా అన్న మీమాంసతో సంబంధం లేకుండా వేలాదిమంది ఈ యాప్ను నిషేధించాలని చాన్నాళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కొందరైతే న్యాయస్ధానాలను ఆశ్రయించారు. ఎందుకంటే ఈ గేమ్లో పిల్లలు భాగస్వాములై సమయం వృథా చేసుకోవడమే కాదు...అందులో పూర్తిగా తలమునకలై ప్రాణాలు కోల్పోయారు. తెలిసీ తెలియక లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నవారు అనేకమంది. నిరుడు ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ పేరిట విద్యార్థులతో, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించినప్పుడు ఒక బాలుడి తల్లి పబ్జీ యాప్వల్ల చదువులు నాశనమవుతున్నాయని ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు పబ్జీ నిషేధించి కేంద్రం మంచిపని చేసింది. అయితే పిల్లలపై మానసికంగా దుష్ప్రభావం చూపే, వారి విలువైన సమయాన్ని వృధా చేసే యాప్లు దేశీయమైనవి అయినా అనుమతించకూడదు. ఆ విషయంలో కేంద్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ గేమింగ్ పరిశ్రమ చూస్తుండగానే భారీగా ఎదుగుతోంది. 2016లో ఇక్కడ ఆ పరిశ్రమ ఆదాయం రూ. 1,949 కోట్లయితే... అది ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. పబ్జీ మార్కెటింగ్లో టెన్సెంట్ కొత్త కొత్త పోకడలతో మిగిలిన గేమింగ్ యాప్లను స్వల్పకాలంలోనే అధిగమించింది. యాప్ల రూపకల్పనలో మన దేశానికి చెందిన ఔత్సాహికులు కూడా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మన పురాణాలు, ఇతిహాసాలు, జానపద గాథలు ఆధారంగా రక్తికట్టే గేమ్ల తయారీకి కృషి చేస్తున్నారు. అయితే ఔత్సాహికులకు మన దేశంలో ఎదురయ్యే సమస్యలు వీరికి కూడా అడుగడుగునా అవరోధాలుగా మారాయి. ఆదరణ ఎంతవరకూ వుంటుందో తెలియని యాప్పై పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. పబ్జీ కి పోటీగా ప్రస్తుతం నాలుగైదు యాప్లున్నాయి. ఇన్నాళ్లూ భారీగా వ్యయం చేయగల పబ్జీతో పోటీపడటం వాటికి కష్టమైంది. ఇప్పుడు వాటి పని సులభమవుతుంది. అయితే యాప్ల నిషేధం దానంతటదే చైనాలో మార్పు తీసుకురాలేదు. ఎల్ఏసీ వద్ద దురాక్రమణను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగినప్పుడే అది దారికొస్తుంది. అందులో మన సైన్యం తలమునకలైవుంది. ఆ ప్రయత్నం సఫలం కావాలి. -
ఇకపై పోచింకిని సందర్శించలేరు..
ముంబై : యువతలో ఎక్కువగా ఆదరణ పొందిన ప్రమఖ గేమింగ్ యాప్ పబ్జీపై భారత్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. యువతను అత్యధికంగా ప్రభావితం చేసిన ఆన్లైన్ గేమ్ కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది, భారత్లో 12 కోట్ల మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. కాలక్రమంలో ఈ గేమ్ వ్యసనంలా మారడంతో దీనికి విద్యార్థులు, యువత బానిసలయ్యారు. ప్రస్తుతం ఇండియా పబ్జీని బ్యాన్ చేయడంతో ఎంతోమంది యువకుల తల్లదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పబ్జీ ఆటగాళ్లు మాత్రం సతమతమవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ గేమింగ్పై అనేక మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.(పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలో నాగ్పూర్ పోలీసులు పబ్జీ గేమ్ను ఉదాహరణగా తీసుకుంటూ కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ఓ ట్వీట్ చేశారు. ‘ఇకపై పోచింకిని సందర్శించలేరు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ అందరికి అర్థం కాకపోయినా పబ్జీ ఆడే ఆటగాళ్లకు మాత్రం తప్పకుండా అర్థం అవుతోంది. పోచింకి అనేది ఆటలో ఓ మ్యాప్. దీనిని అనుసరించే ఆడాల్సి ఉంటుంది. ఇక బుధవారం షేర్ చేసిన ఈ ట్వీట్ అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు 2 వేల లైకులు రాగా.. అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. పోలీసుల సృజనాత్మకతను నెటిజన్లు అభినందిస్తున్నారు. మరి కొందరు పబ్జీ బ్యాన్తో విచారం వ్యక్తం చేస్తున్నారు. (పబ్జీని బ్యాన్ చేసినా భారత్లో ఆడొచ్చు!) No more visiting Pochinki. Just Stay Home, Stay Safe.#NagpurPolice — Nagpur City Police (@NagpurPolice) September 2, 2020 -
పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పబ్జీ సహా 118 చైనా యాప్లను భారత్ నిషేధించడంపై డ్రాగన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్ యాప్లపై నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్ ఉల్లంఘించిందని ఆరోపించింది. చైనా మొబైల్ యాప్లను భారత్ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, భారత్ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్ అన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారడంతో పాటు డేటా గోప్యత ఆందోళనలపై పబ్జీ సహా 118 చైనా యాప్లను భారత్ బుధవారం నిషేధించిన సంగతి తెలిసిందే. నిషేధిత మొబైల్ యాప్ల జాబితాలో బైడు, బైడు ఎక్స్ప్రెస్ ఎడిషన్, అలీపే, టెన్సెంట్ వాచ్లిస్ట్, ఫేస్యూ, విచాట్ రీడింగ్, క్యామ్కార్డ్ సహా పలు యాప్లున్నాయి. తాజా నిషేధంతో భారత్ నిషేధించిన చైనా యాప్ల సంఖ్య 224కు పెరిగింది. భారత్-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్లపై భారత్ నిషేధించడం గమనార్హం. గతంలో జూన్ 29న టిక్టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. లడఖ్లో చైనా దళాలతో ఘర్షణ నేపథ్యంలో అప్పట్లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి : పబ్జీ ‘ఆట’కట్టు -
పబ్జీని బ్యాన్ చేసినా భారత్లో ఆడొచ్చు!
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చోటు చేసుకోవడంతో కేంద్రప్రభుత్వం మరిన్ని చైనా యాప్స్పై నిషేధం విధించింది. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ గేమ్తో పాటు 118 ఇతర యాప్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో 50 మిలియన్ మందికి పైగా పబ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. 35 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్ను మొదట దక్షిణ కొరియా తయారు చేసింది. దీనిని డెస్క్టాప్ వర్షన్లో ఆడొచ్చు. తరువాత సౌత్ కొరియా నుంచి లైసెన్స్ పొందిన చైనా కంపెనీ టెన్సెన్ట్ పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్ను తీసుకువచ్చింది. ఇప్పుడు చైనా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీతో సంబంధం ఉన్న పబ్జీ మొబైల్ యాప్ను కేంద్రం నిషేధించింది. అయితే భారత్లో డెస్క్టాప్లో ఈ ఆటను ఆడవచ్చు. డెస్క్టాప్ మోడ్ను సౌత్కొరియా రూపొందించి కాబట్టి దానిని ఇండియాలో బ్యాన్ చేసే అవకాశం లేదు. పబ్జీ యాప్ ఏమౌతుంది: టిక్టాక్ మాదిరిగానే పబ్జీయాప్ ఇంకా గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేంద్రం ఆదేశాలు అందగానే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్ను తొలగిస్తారు. అయితే అంతకుముందు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉన్నప్పటికి ఎయిర్టల్,జియో మిగత నెట్ వర్క్లు తమ సర్వర్ల నుంచి పబ్జీ ఐపీ అడ్రస్ను తొలగించడంతో గేమ్ ఓపెన్ అవదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గేమ్ ఆడటానికి వీలు లేదు అంటూ ఒక పాప్అప్ కనిపిస్తోంది. మళ్లీ భారత్లో పబ్జీ ఎప్పుడు వస్తుంది భారత్-చైనా మధ్య ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కొన్ని చైనా యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ వివాదాలు ముగిసిన తరువాత టిక్టాక్తో సహా పబ్జీ, హలో మిగిలిన యాప్స్ అన్నింటిని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా, లేదా అనేది వేచిచూడాలి. చదవండి: పబ్జీ గేమ్ను నిషేధించిన కేంద్రం -
పబ్జీ గేమ్ను నిషేధించిన కేంద్రం
-
పబ్జీ గేమ్ను నిషేధించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో ఈ యాప్ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్, యాపిల్ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్కార్డ్, విచాట్ రీడింగ్, టెన్సెంట్ వీన్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్ వంటి పలు యాప్లను ప్రభుత్వం నిషేధించింది పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా భద్రతా కారణాలతో టిక్టాక్ సహా 106 చైనా యాప్లను ఇటీవల భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. చదవండి : భారత్, చైనా సైనిక చర్చలు -
విషాదం: పబ్జీ గేమ్ ఆడిన యువకుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: పబ్జీ గేమ్కు బానిసైన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కొంత కాలంగా పబ్జీ (ఫ్రీ ఫైర్)గేమ్కు బానిసయ్యాడు. లాక్డౌన్ వల్ల ఇంటర్మీడియెట్ చదువుతున్న ఈ యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ, ఎక్కువ సమయం ఫోన్తోనే గడుపుతున్నాడు. నిద్రాహారాలు మానేసి రాత్రి, పగలు అనే తేడాలేకుండా పబ్జీ గేమ్ను ఆడేవాడు. నాలుగు రోజుల నుంచి అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం ఆ యువకుడ్ని ఏలూరుకు తీసుకెళ్లి, సంజీవని వాహనంలో కరోనా టెస్ట్ చేయించగా, నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దిండి రిసార్ట్స్ వద్ద తేలిన మృతదేహం పాలకొల్లు సెంట్రల్: ఆచంట మండలం భీమలాపురానికి చెందిన యర్రగొండ్ల పవన్కుమార్ శర్మ(24) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో సోమవారం సాయంత్రం 6గంటలకు దిండి రిసార్ట్స్ వద్ద అతని మృతదేహం దొరికినట్లు యలమంచిలి ఎస్సై గంగాధర్ తెలిపారు. శర్మ మృతదేహాన్నీ పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి తరలించనున్నట్లు తెలిపారు. పాలకొల్లు గాయత్రి స్మార్త పురోహిత సంఘం సెక్రటరీ ఈరంకి కాశీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం భీమలాపురానికి చెందిన పవన్కుమార్ శర్మ సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృతానికి విలువ లేకపోవడంతో ఉద్యోగం దొరకక పాలకొల్లు పట్టణంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి వృద్ధుడైన తండ్రి, మానసిక ఇబ్బందితో ఉన్న తల్లి, కదలలేని స్థితిలో బాబాయ్, 90 సంవత్సరాల నానమ్మ ఉన్నారు. వీరు ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వీరందరినీ శర్మ జీవనాధారంతోనే పోషించుకుంటూ వస్తున్నాడు. గత నాలుగు నెలలుగా కోవిడ్ 19 వల్ల ఆలయాలు మూసివేయడం పెళ్లిళ్లు పేరంటాలు, పూజలు, హోమాలు లేకపోవడంతో ఆదాయ మార్గాలు లేక ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులకు గురయ్యాడని తెలిపారు. ఈ బాధలు భరించలేక ఆదివారం తన ద్విచక్ర వాహనంపై చించినాడ గోదావరి వంతెన వద్దకు వెళ్లి గోదావరిలో దూకినట్లు అక్కడి స్థానికులు తెలిపారన్నారు. -
పబ్జీ: అరవొద్దన్నందుకు హత్య చేశారు..
జమ్మూ కశ్మీర్: పబ్జీ ఆటకు బానిసలై చాలామంది ఇంట్లో తెలియకుండా డబ్బులు పోగొట్టుకున్నారు. మరి కొందరు పబ్జీ కోసం ఫోన్ కొనివ్వలేదంటూ ప్రాణాలు తీసుకున్నారు. ఇంకొందరు పబ్జీ ఆట ఆడొద్దనందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పబ్జీ కోసం మరో ఘోరానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పబ్జీ ఆడుతూ ముగ్గురు వ్యక్తులు గోల చేస్తుండగా ఒక వ్యక్తి పెద్దగా మాట్లాడొద్దని హెచ్చరించాడు. దాంతో కోపం వచ్చిన ఆ ముగ్గురు అతడిని హత్య చేశారు. జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పుర తాలుఖాలోని బద్యాల్ ఖాజియన్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రాజ్ కుమార్, బిక్రమ్ జీత్, రోహిత్ కుమార్ ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతున్నారు. ఇంతలో దిలీప్ రాజ్ అనే వ్యక్తి వారిని పెద్ద శబ్ధాలు చెయ్యొద్దని కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు దిలీప్పై అక్కడే ఉన్న చెక్కతో దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దన్నందుకు.. -
గేమ్.. ఫినిష్!
ఆన్లైన్ గేమింగ్... మన దేశంలో పదేళ్లుగా ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 300 మిలియన్ ఆన్లైన్ గేమర్స్తో 6,200 కోట్ల మార్కెట్ వాల్యూ ఉన్న దేశం కావడమే దీనికి నిదర్శనం. అయితే ఈ మధ్య చైన్నాకు చెందిన ఆన్లైన్ తదితర పలు యాప్స్తో దేశ భద్రత, సమగ్రతలకు ముప్పు వాటిళ్ల వచ్చని కేంద్రం పసిగట్టింది. దాంతో నెల క్రితం చైనాకు చెందిన 59 యాప్స్ను బ్యాన్ చేయగా, ప్రస్తుతం మరో 47 గేమింగ్ తదితర యాప్స్పై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలో విశేష ఆదరణ పొందిన టిక్టాక్ గతంలో బ్యాన్ కాగా... ఇప్పుడు యూత్లో క్రేజీగా మారిన పబ్జీ బ్యాన్ కానుంది. దేశంలో కొద్ది కాలంగా ఆన్లైన్ గేమింగ్కు క్రేజ్ బాగా పెరిగింది. అంతర్జాల సేవలు అతి చౌకగా అందుబాటులోకి రావడంతో మొబైల్ గేమింగ్ మరింత విస్తృతమైంది. ఎంతగా అంటే సీఏజీఆర్ సూచికలో ఈ రంగం 22 శాతం అభివృద్ధి చెంది, ఆన్లైన్ గేమ్స్కు కల్పవృక్షంగా మారింది ఇండియా. 2010లో కేవలం 25 ఆన్లైన్ గేమ్ డెవలప్ కంపెనీలు ఉండగా.. ప్రస్తుతం 275 దాటింది. ఈ గేమింగ్ రంగం 2019 సంవత్సరానికి ఏకంగా 1 బిలియన్ ఆదాయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆన్లైన్ గేమ్స్ను ఆదరించే వారిలో ఎక్కువగా యువతే అయినా పిల్లలు, పెద్దలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సిటీలో అత్యంత ఆదరణ పొందిన పబ్జీ ప్రియులు బ్యాన్ కారణంగా కొద్దిపాటి నిరుత్సాహానికి గురకానున్నారు. క్రేజీ.. పబ్జీ... ప్రస్తుతం చాలామంది మెదల్లలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే... పబ్జీ బ్యాన్...? దేశంలో ఈ ఆన్లైన్ గేమ్కు ఉన్న ఆదరణ అసాధారణం. ఇండియాలో 2018 నుంచి బాగా పాపులర్ అయిన ఈ గేమ్ రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పబ్జీ ప్లేయర్స్ (116మిలియన్ డౌన్లోడ్స్) కలిగిన దేశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 555 మిలియన్ పబ్జీ ప్లేయర్స్ ఉండగా మన దేశంలోనే 22% ఉన్నారు. ‘‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్స్’’ అనేది దీని అనలు పేరు. ఇది ముందుగానే ప్రోగ్రామింగ్ చేయబడిన ఆట కాదు. కళ్ల ముందే జరుగుతుందా అనిపించే లా మనతో లైవ్ ప్రోగ్రామింగ్ చేయబడే నెట్టింటి ఆట. ఒకేసారి 100 మంది పాల్గొనవచ్చు ఈ గేమ్లో ఒకే సారి 100 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా దాగి ఉన్న శత్రువులను గుర్తించి, తమ వద్ద ఉన్న ఆయుధాలతో సంహరించాలి. ఇందులో కొద్దిమంది స్నేహితులు టీంగా ఏర్పడి శత్రువులపై దాడి చేయొచ్చు. ఆటగాడు చనిపోయేంత వరకు ఆడే అవకాశం ఉంటుంది. చివరి ఆటగాడు మిగిలేంత వరకు ఆట కొనసాగుతుంది. ఈ గేమ్లోని అడ్వెంచర్, సస్పెన్స్, థ్రిల్ యూత్ను బాగా ఆకట్టుకుంది. ఎంతలా అంటే... విపరీతంగా ఆడుతున్నాడని కట్టడి చేసినందుకు ఆత్మహత్య చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు, కన్నతండ్రినే కడతేర్చిన యువకులూ ఉన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం దేశ భద్రత దృష్ట్యా ప్రముఖ ఆన్లైన్ యాప్స్ లూడో వరల్డ్, రెస్సో, జిలీ, అలీఎక్స్ప్రెస్లతో పాటు ఆన్లైన్ గేమ్స్కు గుండెకాయలాంటి పబ్జీనీ బ్యాన్ చేయాలని అనుకుంటున్నారు. పబ్జీ విజేతలుగా నగర ప్లేయర్స్ దీంతో దేశీయంగా ఆన్లైన్ గేమ్ డెవలపర్స్కి ప్రాధాన్యత పెరిగింది. బెంగళూర్ (సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా), హైదరాబాద్ వంటి నగరాల్లో ఆన్లైన్ గేమ్స్ స్టార్టప్ కంపెనీలు రాణిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా పబ్జీ ప్లేయర్స్కు కొదవ లేదు. గతంలో నేషనల్ పబ్జీ చాంపియన్షిప్లో నగరానికి చెందిన ప్లేయర్స్ విజేతలుగా గెలిచారు. అంతే కాకుండా ఇండియన్ పబ్జీ మొబైల్ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్ను హైదరాబాద్ వేదికగా జరిపిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడి యువత దేశ సమగ్రత దృష్ట్యా బ్యాన్ను ఆహ్వానిస్తున్నప్పటికీ పబ్జీకి బానిస అయిన టీనేజర్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటకు ప్రత్యామ్నాయం... ప్రస్తుత బ్యాన్ దేశ రక్షణకు, అభివృద్ధికి భవిష్యత్కు మేలు చేసేది కాబట్టి ఈ నిర్ణయాన్ని అధిక శాతం ప్రజలు ఆమోదిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. అందులో భాగంగా అత్యధికులు ఫ్రీఫైర్ను ఎంచుకొంటున్నారు. దానితో పాటు మంచి షూటర్ ఫైర్ గేమ్గా నిలిచిన కాల్ ఆఫ్ డ్యూటీ, ఏఆర్కే సర్వైవల్ ఎవాల్వ్డ్ అడ్వెంచరస్ను, కాస్త పబ్జీని పోలిన ఫోర్ట్నైట్ను, యుద్ధరంగాన్ని ప్రతిబింబించే బాటిల్ ల్యాండ్స్ రాయల్, జెడ్1 బాటిల్ రాయల్ యాక్షన్ గేమ్స్వైపు మరలుతున్నార అడిక్ట్ కానంత వరకూ ప్రమాదం లేదు... రెండేళ్లుగా పబ్జీ ఆడుతున్న. ఇందులో ఉన్న యాక్షన్, సస్పెన్స్, థిల్లర్ నన్ను బాగా ఆకట్టుకొంది. నా ఫ్రెండ్స్తో ఆన్లైన్లో ఒక టీమ్గా ఈ గేమ్ ఆడతాం. ఈ ఆటతో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఏదైనా సరే అడిక్ట్ కానంత వరకూ ప్రమాదం లేదు. బ్యాన్ నిర్ణయం అసంతృప్తిని కలిగించినా దేశం కోసం ఈ గేమ్ని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా. –సంతోష్, కూకట్పల్లి. బ్యాన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా... నాకు ఆన్లైన్ గేమ్స్ అంటే ఎంతో ఇష్టం. అందులోనూ లూడో, పబ్జీ అంటే చాలా ఆసక్తి. అయితే దేశ అంతరంగిక భద్రత, వ్యక్తిగత సమాచార భద్రతకు ఆటంకం వాటిల్లుతోందని ఈ గేమ్స్ను బ్యాన్ చేయాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. స్కూల్ పిల్లలు, టీనేజర్స్ వీటి నుంచి బయటపడటానికి కొంచెం సమయం పడుతుంది. అడిక్ట్ అయిన పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. –ఉమ, యాప్రాల్ -
సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దన్నందుకు..
ఉప్పల్: సెల్ఫోన్లో ఆటలేంటని బాబాయి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ యియర్ చదుతున్న ఆశుతోష్ కుమార్(23) పది నెలల క్రితం ప్రాజెక్టు పనిపై ఉప్పల్ శ్రీనివాస్ హైట్స్లో ఉంటున్న తన బాబాయి సంతోష్ కుమార్ ఇంటికి వచ్చాడు. కాగా బుధవారం ఉదయం నుంచి అతను సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ భోజనం కూడా చేయలేదు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అతడి బాబాయి సంతోష్ కుమార్ స్నానం చేసి భోజనం చేయాలని పలు మార్లు చెప్పినా వినిపించుకోలేదు. పదే పదే చెప్పడంతో మనస్తాపానికిలోనైన ఆశుతోష్ భవనం 6వ అంతస్తుకు అక్కడి నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని ప్రైవేట్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘పబ్జీ బ్యాన్.. యువత పరిస్థితి ఏంటీ..?’
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం చైనా యాప్స్ బ్యాన్పై మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలో చైనాకు చెందిన మరో 47 యాప్స్ను కూడా బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా త్వరలో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీని కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. పబ్జీ బ్యాన్పై వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింగ్వీ కేంద్రంపై వ్యంగ్యాస్తాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ప్రముఖ ఆన్లైన్ వీడియో గేమ్ అయిన పబ్జీని నిషేధించాలని కేంద్రలోని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ఒకవేళ యువత ఆడటం మానేస్తే.. వారు దేశంలోని నిరుద్యోగ వంటి వాస్తవాల గురించి ప్రశ్నిస్తారు. ఇది మరింత తీవ్ర సమస్య అవుతోందని కేంద్రం గ్రహించింది’. అని అభిషేక్ మను సింగ్వీ పేర్కొన్నారు. (పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా... ) మరోవైపు కరోనా కారణంగా ఏర్పడిన సంకక్షోభంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితి ఎంటనీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా గతంలో బ్యాన్ చేసిన చైనాకు చెందిన 59 యాప్స్కు క్లోన్గా ఉన్నందున ఈ 47 మాప్స్ను బ్యాన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. వినియోగదారుల గోప్యత, జాతీయ భద్రత నియమాలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నయన్న నేపథ్యంలో వీటిని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం మరో 250కు పైగా యాప్స్ పై నిఘా పెట్టిందని, అయితే ఈ జాబితాలో పబ్జీ కూడా ఉన్నట్లు సమాచారం అందగా దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. (పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..) -
పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా...
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం టిక్టాక్తో సహా 59 యాప్లను ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరో కొన్ని చైనా యాప్స్ వల్ల ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం వాటిని కూడా బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో టిక్టాక్లాగా అత్యంత ప్రజాదరణ పొందిన పబ్జీ, లూడో గేమ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పబ్జీ ప్రియులకు గుబులు మొదలైంది. పబ్జీలేకపోతే అలాంటి గేమ్స్ ఏమున్నాయా అని వెతికే పనిలో పడ్డారు. పబ్జీలాగు ఉండే కొన్ని ఆన్లైన్ గేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫోర్ట్నైట్: పబ్జీకి, ఫోర్ట్నైట్కు మధ్య ప్రారంభం నుంచే పోటీ కొనసాగుతుంది. ఈ రెండు ఆటలు రాయల్యుద్ద శైలి మీద ఆధారపడి ఉంటాయి. ఇవి రెండూ కూడా శక్తిమంతమైన యూజర్ బేస్ను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్జీలా కాకుండా, ఫోర్ట్నైట్ గేమ్ గ్రాఫిక్స్ మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి. గేమ్ ఆడటానికి విభిన్న పాత్రలు ఉంటాయి. ఇందులో ఆటగాళ్ళు వుడ్స్, మెటల్ , మరిన్ని విభిన్న వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. వీటిని ఉపయోగించడం ద్వారా వివిధ నిర్మాణాలను కట్టవచ్చు. అదేవిధంగా శత్రువులు చేసే దాడి నుంచి కాపాడుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ: ఇది మరో ప్రసిద్ధ యుద్ధ-రాయల్ గేమ్ అదేవిధంగా పబ్జీ మొబైల్ గేమ్కు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో బాటిల్ రాయల్ మోడ్ ఉంటుంది. ఇక్కడ 100 మంది చివరి వరకు పోరాడవచ్చు. ఇందులో మీరు షీల్డ్లాంటి వస్తువులను ఉపయోగించవచ్చు. వినియోగదారులు మ్యాచ్ సమయంలో హెలికాప్టర్లు, మరెన్నో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్యాప్చర్ ది ఫ్లాగ్ - గోల్డ్ ఎడిషన్ కూడా ఈ గేమ్లో ఉంది. ఈ మోడ్లో, ఆటగాళ్ళు జెండాను పట్టుకోవాల్సిన అవసరం లేదు. మరొక మోడ్ కిల్ కన్ఫర్మ్డ్. ఇందులో 5 వర్సస్ 5 టీం డెత్మ్యాచ్ వుంటుంది. స్నిపర్ వర్సస్ స్నిపర్ బాటిల్ ఫీల్డ్ కూడా ఉంది. గరేనా ఫ్రీ ఫైర్: ఇది పబ్జీ మొబైల్కు దేశీ ప్రత్యామ్నాయం. ఈ ఆటలో ఉండే ఉత్తమమైన విషయం ఏంటంటే ఇందులో గేమ్ ప్లే చిన్నది, అంతేకాకుండా క్రిస్ప్గా వుంటుంది. ఇందులో ప్రతి మ్యాచ్లో, 50 మంది ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా మ్యాచ్ 10 నిమిషాల్లోనే ముగుస్తుంది. ఇది తొందరగా మ్యాచ్లు ఆడాలనుకునే వారికి బాగుంటుంది. ఆటగాళ్ళు స్క్వాడ్లతో పాటు సోలోలో కూడా ఆడవచ్చు. బ్యాటిల్ లాండ్స్ రాయల్: ఇతర బాటిల్ఫీల్డ్ ఆటలతో పోలీస్తే ఈ ఆట చిన్నదిగా ఉంటుంది. బ్యాటిల్ ల్యాండ్స్ రాయల్ అనేది ప్రతి ఒక్కరూ ఆస్వాదించడానికి వీలుగా ఉండే ఒక సాధారణమైన తుపాకీ ఆట. కొన్నిసార్లు పబ్జీ కన్నా దూకుడుగా అనిపిస్తుంది. 32 మంది ఆటగాళ్ళు, 3-5 నిమిషాల యుద్ధాలతో, ఇది గేమ్లో నాన్-స్టాప్ మారణహోమాన్ని సృష్టిస్తుంది. చదవండి: పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే.. -
పబ్జీ, లూడో గేమ్స్కూ చెక్!
న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు, సార్వభౌమాధికారానికీ, సమగ్రతకు నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించిన కేంద్ర ప్రభుత్వం మరో 47 చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. జూన్ 29న కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్లను నిషేధించింది. దీంతో ఇప్పటి వరకు నిషేధం విధించిన మొబైల్ యాప్ల సంఖ్య 106 కి చేరింది. ఈ 47 యాప్లు సైతం, యిప్పటికే నిషేధించిన యాప్లకు సంబంధించినవే. శుక్రవారం ఈ యాప్లను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ మొబైల్, ఈ–కామర్స్ విభాగానికి చెందిన ఆలీఎక్స్ప్రెస్, మరో ప్రముఖ గేమింగ్ ‘లూడో వరల్డ్’, జిలీ, మ్యూజిక్ యాప్ రెస్సో యాప్స్లనూ నిషేధించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇవన్నీ చైనాలోని షావోమీ, టెన్సెంట్, అలీబాబా, బైట్డాన్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు చెందిన యాప్లు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మొత్తం 275 చైనా యాప్లపై కేంద్రం నిఘాపెట్టింది. చైనా నుంచి పనిచేసే అన్ని టెక్ కంపెనీలనూ, చైనా యాజమాన్యంలోని కంపెనీలనూ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ లా ఆఫ్ 2017’నియంత్రిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఈ యాప్లు సేకరించే సమాచారం మొత్తం చైనా ప్రభుత్వానికి చేరుతుంది. ఇది అన్ని ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. -
పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..
ఢిల్లీ : టిక్టాక్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న పబ్జీపై భారత ప్రభుత్వం త్వరలోనే నిషేధం విధించనుంది. దీనితో పాటే అలీ ఎక్స్ప్రెస్, లూడో సహా చైనాకు చెందిన 275 యాప్లపై భారత్ నిషేదం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గాల్వన్ లోయల్ భారత్-చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నప్పటి నుంచి చైనాకు చెందిన యాప్లపై ప్రత్యేక దృష్టి సారించిన నిఘా వర్గాలు ఇప్పటికే టిక్టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 యాప్లను నిషేదించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ భద్రతకు ముప్పు కలిగేంచాలా మరో 275 చైనా యాప్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. (సూపర్ లోకల్ మొబైల్ యాప్స్.. అదుర్స్! ) నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. చైనాకు చెందిన అన్నిటెక్ కంపెనీలు.. ప్రభుత్వం ఏ సమాచారాన్ని కోరానా ఇవ్వాల్సిందిగా 2017 నాటి చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణ ఉండే ఆస్కారం ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే దీనిపై భారత్ను అనుసరించి చైనా యాప్లను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ముదిరిన దౌత్య యుద్ధం: కీలక పరిణామం) -
టిక్టాక్కు పాక్ ఫైనల్ వార్నింగ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జూలై 1న పబ్జీ గేమ్ను నిషేధించింది. ఇది ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉండటంతోపాటు చిన్నారులకు, యువతకు హాని కలిగిస్తుండటమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే ప్రముఖ యాప్ టిక్టాక్ కూడా ఇంచుమించు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో టిక్టాక్కు పాక్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. టిక్టాక్లో అసభ్యత, అశ్లీలత హెచ్చు మీరకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ను ఆదేశించింది. ఈమేరకు పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) స్పందిస్తూ.. "సోషల్ మీడియా యాప్స్లో అసభ్య కంటెంట్ ఉంటోందంటూ మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అధికంగా టిక్టాక్, బిగో నుంచే ఉన్నాయి. ముఖ్యంగా యువతను చెడుదారి పట్టించే కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే దీనిగురించి ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశాం. కానీ వారి స్పందన అంత సంతృప్తికరంగా లేదు. దీంతో ఇప్పటికే బిగోను నిషేధించాం. టిక్టాక్కు ఆఖరి హెచ్చరిక జారీ చేశాం. ఇందులో మితిమీరుతున్న అశ్లీలతను, అసభ్యతను, అనైతిక వీడియోలను నియంత్రించేందుకు సమగ్రమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించా"మని పేర్కొంది. కాగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందన్న కారణంతో భారత్ కూడా టిక్టాక్ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీనితోపాటు మరో 58 యాప్లను నిషేధించింది. (పబ్జీ ఆట.. యాంటీ ఇస్లాం అట..!!) -
పబ్జీ ఆట.. యాంటీ ఇస్లాం అట..!!
ఇస్లామాబాద్: ప్లేయర్ అన్నౌన్ బ్యాటిల్గ్రౌండ్స్(పబ్జీ) వీడియో గేమ్ను ‘యాంటీ ఇస్లాం’గా పేర్కొంటూ పాకిస్తాన్ నిషేధం విధించింది. పబ్జీ వల్ల యువకుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని, ఎంతో విలువైన సమయమూ వృథా అవుతోందని ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీన్ని పాకిస్తానీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సింధ్–పంజాబ్ సరిహద్దు వద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ధర్నాలు చేయడానికి సిద్ధపడుతోంది. (వణికిన ట్విట్టర్) పబ్జీ నిషేధాన్ని సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. పబ్జీలో యాంటీ ఇస్లాం మెటీరియల్తో పాటు శృంగారపరమైన దృశ్యాలున్నాయని, అందుకే గేమ్ను బ్యాన్ చేశామని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) కోర్టుకు నివేదించింది. పబ్జీ బ్యాన్కు ముందు గేమ్ మిషన్లో ఫెయిలైనందుకు ఒత్తడిని తట్టుకోలేక కొందరు యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సైతం పీటీఏ ప్రస్తావించింది. (7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక) పాకిస్తాన్ వీడియో గేమ్స్ను నిషేధించడం ఇది నాలుగోసారి. గతంలో పాకిస్తాన్లో టెర్రరిస్టులు తలదాచుకున్నారని, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ వారికి మద్దతునిస్తోందని చూపించినందుకు కాల్ ఆఫ్ డ్యూటీ, మెడల్ ఆఫ్ హానర్ గేమ్స్ను బ్యాన్ చేసింది. 2017లో సెక్సువల్ కంటెంట్ ఉన్న వాల్కైరీ డ్రైవ్: భిక్కూని అనే గేమ్ను సైతం నిషేధించింది. బ్యాన్ వల్ల ఏం వస్తుంది? పబ్జీ బ్యాన్ వల్ల ఇప్పటికే దానికి బానిసలైన యువత తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంది. మెంటల్ హెల్త్కు సంబంధించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, డైరెక్టు బ్యాన్ వల్ల పాకిస్తాన్ మరింత నష్టపోతుంది. 2005లో కైట్ ఫెస్టివల్ను బ్యాన్ చేసిన సమయంలోనూ ఇలానే జరిగింది. గాలిపటాలను ఎగురేసే దారం వల్ల నష్టం కలుగుతోందని భావించిన పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఫెస్టివల్ను నిషేధించింది. దాంతో చాలా మంది ఉసురు తీసుకున్నారు. ఇప్పటికే పబ్జీపై నిషేధం ఎత్తేయాలంటూ యువత రోడ్లు ఎక్కింది. ప్లకార్డులతో నిరసన తెలుపుతోంది. పబ్జీకి కొందరు బానిసలైతే, ఇంకొందరికి అదో ఎంటర్టైన్మెంట్. గడచిన నాలుగు నెలల లాక్డౌన్లో చాలా మందికి ఇదే టైం పాస్. అందుకే ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పాకిస్తాన్ పబ్జీ ప్రియులు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్మీడియా వేదికల్లో చిన్నపాటి ఉద్యమాలు రన్ చేస్తున్నారు. పబ్జీ మొబైల్ వరల్డ్ 2020 టోర్నమెంటులో పాకిస్తాన్ టీమ్ ‘ఫ్రీ స్టైల్’పోటీ చేయాలని భావించింది. కానీ గేమ్ను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు దానికి శరాఘాతంగా మారాయి. మరి టిక్టాక్ సంగతేంటి? పబ్జీని యాంటీ ఇస్లాంగా చూస్తున్న పాకిస్తాన్కి టిక్టాక్ అలా కనిపించడం లేదు. దానిలో శృంగార సంబంధిత కంటెంట్ వస్తున్నా పట్టడం లేదు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో టిక్టాక్ను నిషేధించాలంటూ పిటిషన్ కూడా దాఖలైంది. -
ఆన్లైన్లో ఆటలొద్దు
పంజాబ్లో 17 ఏళ్ల బాలుడు ఇటీవల పబ్జీ గేమ్ ఆడుతూ రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. గేమ్లో తాను ఎంపిక చేసుకున్న పాత్ర(యానిమేషన్ బొమ్మ)కు కాస్మోటిక్ ఐటెమ్స్, గన్స్,టోర్నమెంట్ పాస్, రాయల్పాస్,రంగు రంగుల డ్రెస్ల కోసం తల్లితండ్రుల డెబిట్ కార్డులతో డబ్బులు చెల్లించాడు. విత్డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్లను తల్లిదండ్రులకు తెలియకుండా డిలీట్ చేశాడు. ఉద్యోగి అయిన తన తండ్రి వైద్య ఖర్చుల కోసం తెచ్చుకున్న ప్రావిడెంట్ ఫండ్ రూ.16 లక్షలను కొడుకు ఇలా సైబర్ నేరగాళ్ల పాలు చేశాడు. సాక్షి, అమరావతి: ఆన్లైన్ గేమ్స్ మనకు తెలియకుండానే జేబులు గుల్ల చేస్తూ బతుకు చిత్రాలను తల్లకిందులు చేస్తున్నాయి. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉండే గేమ్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆకట్టుకుని అందినంత కాజేస్తుండటంతో సరికొత్త సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. అసలే కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటున్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసీ తెలియక ఆన్లైన్ గేమ్లకు బానిసలై ఏ మాత్రం అవగాహన లేని లింక్లు క్లిక్ చేయడం, బ్యాంకు డీటైల్స్ ఇవ్వడం, ఓటీపీలు ఎంటర్ చేయడం వంటి అనేక స్వయం కృతాపరాధాలతో డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. వీడియో గేమ్స్ పేరుతో ఎర ► ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలు ఫ్రీఫైర్, పబ్జీ, ఫోర్ట్నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ గేమ్స్కు.. పెద్దలు ఆన్లైన్ రమ్మీ(పేకాట)కి ఆకర్షితులవుతున్నారు. ► ఈ వీడియో గేమ్స్లో ఒకేసారి వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్లో 50 మంది నుంచి 100 మంది వ్యక్తులు వారు ఎంపిక చేసుకున్న క్యారెక్టర్ల (యానిమేటెడ్ బొమ్మలు) రూపంలో అధునాతన ఆయుధాలతో కదులుతూ పోరాడుతారు. ► గేమ్ను బట్టి ఒక్కొక్కరు సుమారు రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఆన్లైన్లో ఎంట్రీ ఫీజుగా చెల్లిస్తారు. వీరందిరిలో వీడియోగేమ్ నిర్ధేశించిన క్యారెక్టర్లు ఒకరికొకరు గన్ ద్వారా కాల్చుకుంటారు. చివరలో మిగిలిన ముగ్గురు విజేతలకు బహుమతులు ఇస్తారు. పిల్లల బలహీనతలే వారి బలం ► ఆన్లైన్ గేమ్లను పిల్లలకు, యువతకు ఆసక్తికరంగా మలిచి ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్, ఈ మెయిల్ ఐడీ, ప్రత్యేక యాప్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ► పిల్లలు, యువతలోని బలహీనతను గమనించి వీడియో గేమ్లలో వారు ఎంపిక చేసుకున్న పాత్ర (యానిమేషన్) బొమ్మలకు ఆకర్షణీయమైన వస్త్రధారణ, అధునాతన ఆయుధాల కొనుగోలుకు డబ్బులు ఆన్లైన్లో చెల్లించేలా నిబంధన పెడతారు. ఈ పాత్రలను రాయల్పాస్ ఆటగాళ్లుగా పిలుస్తారు. ► చాలా మంది పెద్దలు ఆన్లైన్లో జంగల్ రమ్మీ, క్లాసిక్ రమ్మీ, ప్లే రమ్మీ, ఏసి ఈ టూ త్రీ డాట్ కామ్, పేటీఎం, ఫస్ట్ గేమ్స్ డాట్ కాం, డక్కన్ రమ్మీ డాట్ కాం వంటి వెబ్సైట్లలో పేకాట ఆడుతూ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. 20 రోజుల్లో రూ.5.40 లక్షలు హుష్ అమలాపురం టౌన్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 9వ తరగతి విద్యార్థి 20 రోజులపాటు సరదాగా తన తల్లి షేక్ రజియా బేగం స్మార్ట్ ఫోన్ ద్వారా ఆడిన ఆన్లైన్ గేమ్ రూ.5.40 లక్షలు దోపిడీకి గురయ్యేలా చేసింది. తండ్రి కువైట్లో ఉంటున్నాడు. తల్లికి పెద్దగా చదువురాదు. ఈ బాలుడు ‘ఫ్రీ ఫైర్’ అనే ఆన్లైన్ వీడియో గేమ్ యాప్ను ఓపెన్ చేశాడు. అందులో వెపన్స్ కొనాలంటే నిర్దేశించిన లింక్ ఓపెన్ చేసి తన తల్లి డెబిట్ కార్డుల వివరాలు ఇచ్చాడు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా సొమ్ము కాజేశారు. దిక్కుతోచని ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి సోమవారం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా వద్ద గోడు వెళ్లబోసుకుంది. కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న గుండ్ర రవితేజ ఆన్లైన్లో రమ్మీ(పేకాట), క్యాసినో ఆటలతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.1,56,56,587 డబ్బును కాజేశాడు. ఆ డబ్బునూ ఆటల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తుదకు ఇతనిపైనే కేసు నమోదైంది. ఆన్లైన్ గేమ్స్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ తరహా నేరగాళ్లను పట్టుకోవడం క్లిష్టంగా మారుతోంది. ఒకవేళ పట్టుకున్నా, చట్టపరంగా కఠిన శిక్షలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ గేమ్స్ నిషేధించేలా, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని ప్రతిపాదన చేశాం. పిల్లల ఆటల పట్ల పెద్దలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. – సునీల్కుమార్ నాయక్,డీఐజీ, సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం -
పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు
సాక్షి, చండీగఢ్ : పబ్జీ మాయలో పడి లక్షల రూపాయలను మాయం చేసిన ఘటన మరువకముందే పంజాబ్లో మరో సంఘటన వెలుగు చూసింది. తాజాగా మొహాలికీ చెందిన ఒక టీనేజర్ (15) పబ్జీ ఉచ్చులో చిక్కుకుని తన తాత ఖాతాలోంచి 2 లక్షల రూపాయలను కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) తాజా నివేదికల ప్రకారం మొహాలికి చెందిన బాలుడు పబ్జీ మొబైల్ గేమ్ వలలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ గేమ్ గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఇదే అదునుగా భావించిన అతని సీనియర్ ఒకడు ఆటలో మెలకువలు నేర్పుతానని మభ్యపెట్టాడు. దీంతో సీనియర్ నుంచి శిక్షణ పొందేందుడు మైనర్ బాలుడు తన తాతా ఖాతానుంచి భారీ ఎత్తున రహస్య చెల్లింపు చేసేవాడు. తాతా పెన్షన్ ఖాతాను ఇటీవల పేటీఎంకు లింక్ చేయడంతో ఈ టీనేజర్ పని మరింత సులువైంది. పైగా అతని ఖాతాలోని లావాదేవీలను ఇతర కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో అతనికి అడ్డే లేకుండా పోయింది. గత రెండు నెలల కాలంలో పేటీఎంద్వారా 30కి పైగా లావాదేవీలు చేశాడు. ఈ గేమ్కు అవసరమైన స్కిన్, క్రాట్స్ ఇతర ఫీచర్లను కొనుగోలు చేసుందుకు 55వేలు ఖర్చు పెట్టాడు. మొత్తంగా సుమారు 2 లక్షల రూపాయలను మాయం జేశాడు. చివరికి విషయం తెలిసిన కుటుంబ పెద్దలు గట్టిగా నిలదీయడంతో పబ్జీలోని రాయల్ ఆట కోసం 2 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు మైనర్ బాలుడు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఈ ఆటకోసం కొత్త సిమ్కార్డును కూడా కొనుగోలు చేసినట్టు తెలిపాడు. దీంతో బాలుడి కుటుంబం మొహాలీ ఎస్ఎస్పికి ఫిర్యాదు చేసింది. కాగా పంజాబ్లోని ఖరార్లోని ఒక యువకుడు తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుండి 16 లక్షల రూపాయల మాయం చేసిన ఘటన గతవారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కరోనా, లాక్డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో ఇంటికే పరిమితమవుతున్న చిన్నపిల్లలు, టీనేజర్లు, విద్యార్థులు పబ్జీ గేమ్కు బానిసలవుతున్నారు. దీంతో మే నెలలో రికార్డు స్థాయిలో 270 మిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని వసూలు చేసిందంటేనే ఈ గేమ్ డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. -
ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..
ఛండీగర్ : ఆన్లైన్ క్లాసులని మొబైల్ ఫోన్ ఇస్తే కేవలం నెల రోజుల్లోనే 16 లక్షల రూపాయలను స్వాహా చేశాడు ఓ టీనేజీ యువకుడు. పబ్జీ గేమ్ ఆడుతూ వివిధ టోర్నమెంట్లు, పాస్లు, సహా వివిధ మందుగుండు సామాగ్రిని కొనడానికి ఆ డబ్బాంతా ఖర్చుపెట్టాడు. అయితే పోనీ పాపం అని వదిలేయకుండా డబ్బు విలువ తెలిసేలా అతడ్ని ఓ స్కూటర్ రీపెయిర్ దుకాణంలో పనికి పెట్టాడు అతని తండ్రి. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. ఖాగర్ నగరానికి చెందిన 17 ఏళ్ల బాలుడు ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లను వాడేవాడు. అయితే పేరేంట్స్ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు తదితర వివరాలన్నీ మొబైల్ ఫోన్లేనే సేవ్ చేసి ఉండటంతో ఇదే అదనుగా భావించాడు. చదువు పేరిట ఎక్కువ సమయం ఫోన్లోనే గడుపుతూ పబ్జీ గేమ్లో వివిధ టోర్నమెంట్ల కోసం డబ్బు ఖర్చుపెట్టాడు. ఈ లావాదేవీలకు సంబంధించి మెసేజ్లు రాగానే వెంటనే డిలీట్ చేసేవాడు. దీంతో తల్లిదండ్రులకు కూడా ఏమాత్రం అనుమానం రాలేదు. ఇంకా తెలివిగా తల్లి ఖాతా నుంచి తండ్రికి, అతని నుంచి తల్లి ఖాతాలకు అనేక సందర్భాల్లో లావాదేవిలు జరిపాడు. దీంతో వారిద్దరి అకౌంట్లోంచి మొత్తం డబ్బులు స్వాహా చేశాడు. చివరికి తల్లి ప్రావిడెంట్ ఫండ్ డబ్బు మెత్తాన్ని ఖర్చుపెట్టాడు. (పంజాబ్ సీఎం కీలక నిర్ణయం ) కొన్ని రోజులకి బ్యాంకు వెళ్లిన తల్లిదండ్రులకి వాళ్ల అకౌంట్లోంచి 16 లక్షలు డ్రా చేశారని చెప్పడంతో ఖంగుతిన్నారు. మొదట సైబర్ నేరగాళ్ల పనేమో అని ఖంగారు పడి పోలీస్స్టేషన్కి వెళ్లారు. తీరా విచారణలో 17 ఏళ్ల కొడుకే ఇంటి దొంగ అని తేలడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్నో నెలలుగా కష్టపడి ఒక్కో రూపాయి కూడగట్టుకొని వైద్యం, కొడుకు చదువు కోసం దాచిపె్ట్టిన డబ్బంతా ఒక్కసారిగా ఆవిరయ్యింది. దీంతో కొడుక్కి డబ్బు విలువ తెలియజేసేలా అతన్ని ఓ స్కూటర్ రిపేయర్ దుకాణంలో పనికి పెట్టాడు. తద్వారా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది అని తండ్రి పేర్కొన్నారు . అన్ని గేమ్స్ కంటే మే, జూన్ నెలలో పబ్జీ అత్యధిక లాభాలను అర్జించినట్లు సెన్సార్ టవర్ వెల్లడించింది. అంతేకాకుండా పబ్జీకి అలవాడుపడి పలువురు టీనేజర్లు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా అనేకం. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని ఇటీవలె పాకిస్తాన్ పబ్జీ ఆటను నిషేదించింది. (వలస కార్మికులను ముందుగానే పంపి ఉంటే.. ) -
పబ్జీ గేమ్ చైనాదేనా?
న్యూఢిల్లీ: "చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి" అన్న నినాదం దేశవ్యాప్తంగా రాజుకుంది. భారత్-చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరవీరులవడంతో దేశమంతా చైనా వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో చైనా వస్తువులను నిషేధించడంతోపాటు చైనా యాప్లను వాడొద్దన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఇష్టపడే పబ్జీ గేమ్ చైనాదా? అన్న ప్రశ్న ఎంతోమందికి వచ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాల్సిందేనా అని ఎంతోమంది గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అసలే లాక్డౌన్లో ఫోన్లకు మరింత అతుక్కుపోయి పబ్జీని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ సమయంలో దాన్ని డిలీట్ చేయాలంటే మనసొప్పకపోవడంలో తప్పేమీ లేదు. (‘రిమూవ్ చైనా యాప్స్’కు) దీంతో అసలు పబ్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటూ అందరూ గూగుల్ను ఆశ్రయిస్తున్నారు. దీనికి సమాధామేంటంటే... సాంకేతికంగా అయితే పబ్జీ అసలు చైనాదే కాదు. దీన్ని ఐర్లాండ్కు చెందిన బ్రెదర్ గ్రీన్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు. ఈ గేమ్ను దక్షిణ కొరియాలోని బ్లూహోల్ డెస్క్టాప్స్పై అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వర్షన్లోకి తీసుకొచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనే కంపెనీ సాయం చేస్తూనే బ్లూ హోల్లో 10 శాతం వాటాను తీసుకుంది. అంతకుమించి పబ్జీకి చైనాతో ఎలాంటి సంబంధం లేదు. అంతదాకా ఎందుకు? ఈ గేమ్లో తీవ్ర హింస ఉందని చైనాలో పబ్జీని రిలీజ్ చేయకముందే బ్యాన్ చేశారు కూడా. కాబట్టి ఈ గేమ్కు చైనాకు సంబంధమే లేదు. (పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు) -
నగ్నంగా వీడియో కాల్ చేయాలంటూ..
అహ్మాదాబాద్ : పబ్జీ గేమ్ ఓ 22 ఏళ్ల యువతికి తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ఆన్లైన్ గేమ్ ద్వారా పరిచమైన యువకుడు.. తన ఫేస్బుక్, మెయిల్లను హ్యాక్ చేసి.. పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే నగ్నంగా వీడియో కాల్ చేయాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ సంఘటన గుజరాత్లో ఓగ్నాజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్కు చెందిన 22 ఏళ్ల యువతి గత కొంత కాలంగా తన స్నేహితురాలితో కలిసి పబ్జీ గేమ్ ఆడుతోంది. (చదవండి : ‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే..) ఈ క్రమంలో తన స్నేహితురాలి ద్వారా జితేంద్ర అనే యువకుడు బాధితురాలికి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడంతో ఫోన్ కాల్ ద్వారా తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత జితేంద్ర అసభ్యకర డిమాండ్ల చేయడం ప్రారంభించడంతో, యువతి అతని ఫోన్కాల్కు స్పందించడం ఆపేసింది. దీంతో కోపం పెంచుకున్న యువకుడు.. యువతి ఫేస్బుక్, మెయిల్ పాస్వర్డలను హ్యాక్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి.. తన పాస్వర్డ్లను రీసెట్ చేయాలని కోరగా.. రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. జూన్ 2వ తేదీన అమ్మాయికి ఫోన్ చేసి.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని జితేంద్ర బ్లాక్ మెయిల్కు దిగారు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన యువతి. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు
సాక్షి, విశాఖపట్నం: పబ్జీ గేమ్కు బానిసైన ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు.అరకులోయ మండలకేంద్రానికి చెందిన కౌశిక్ నిత్యం పబ్జీ గేమ్లో మునిగితేలేవాడు. అకస్మాత్తుగా బిగ్గరగా అరుస్తూ, పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక ఏరియా ఆస్పత్రికి తలించారు. వైద్యులు ప్రథమ చికిత్సచేసి, విశాఖ తరలించాలని సూచించారు. పబ్జీ గేమ్కు బానిస కావడంతోనే మతిస్థిమితం కోల్పోయాడని వారు చెప్పారు. చదవండి: పబ్జీ గేమ్కి బానిసై.. -
పబ్జీ గేమ్కి బానిసై..
జైపూర్ : పబ్జీ వ్యసనంతో 14 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటాలో జరిగింది. రైల్వే కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ హన్స్రాజ్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం తన తల్లి మొబైల్ ఫోన్ నుంచి గేమింగ్ ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేశాడు. అప్పటి నుంచి నిరంతరాయంగా పబ్జీ గేమ్ను ఆడుతున్నాడు. గత రాత్రి 3 గంటల సమయంలో నిద్ర పోవాలని.. చదువుకుంటున్న తన సోదరుడికి చెప్పి మరో గదిలోకి వెళ్లి వెంటిలేటర్ గ్రిల్కి ఉరివేసుకొని మరణించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా.. బాలుడు తన తల్లి, సోదరుడితో కలిసి కోటా గాంధీ కాలనీలో నివాసం ఉంటుండగా, అతడి తండ్రి ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: మహిళా సర్పంచ్కు కలెక్టర్ ప్రశంస -
పబ్జి ప్రియులకు శుభవార్త
ఈ కరోనా మహమ్మరి కారణంగా లాక్డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే వీరిలో ముఖ్యంగా యువతను ఇళ్లు కదలకుండా ఉంచుతుంది మాత్రం ఆన్లైన్ గేమ్స్. వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది పబ్జీ గేమ్ గురించి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త మోడ్స్ గేమ్కి అతుక్కుపోయేలా చేస్తోంది పబ్జీ. గతంలో 0.17.0 అప్డేట్ వచ్చింది. ఇప్పుడు అది కాకుండా మరో అప్డేట్తో పబ్జి మన ముందుకు రాబోతుంది. అయితే ఈ అప్డేట్ కోసం పబ్జి ప్రియులు ఎక్కువ కాలం వేచివుండాల్సిన పనిలేదు. జూన్ 1వ తేదీన ఈ అప్డేట్ రానుంది.ఇది కొత్త గేమ్ ఐటమ్స్తో పాటు మరో గేమ్ మోడ్ని పబ్జి ప్రియులకు అందించనుంది. ఈ అప్డేట్ షానాంక్ మ్యాప్ ఆధారితమైన జంగిల్ మోడ్ను తీసుకురానుంది. (‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్’) అయితే ఈ జంగిల్మోడ్లో ఏముంటి? ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ మోడ్లో ఏం అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని పబ్జి టీం ఇంతవరకు బయట పెట్టలేదు. అయితే పబ్జిటీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన టీజర్ ఆధారంగా చూస్తే ఇది ఒక ట్రజర్ హంట్ లాగా కనిపిస్తోంది. దీనిలో ప్లేయర్ మరో ఇద్దరితో టీంగా ఏర్పడి ఇచ్చే క్లూస్ ఆధారంగా నిధిని కనిపెట్టాల్సి ఉంటుందని టీజర్ బట్టి అర్ధం అవుతుంది. ఈ ట్రజర్ హంట్లో శత్రవులను అంతం చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ మోడ్ షానాంక్ ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి ఈ గేమ్లో గెలవాలంటే జంగిల్ గేమ్ యుద్ద మెలుకువలన్ని తెలిసివుండటం అవసరం. ఇంతక ముందు గేమ్లో పోటీని పెంచడానికి పబ్జీ టీం బ్లూ జోన్ మోడ్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ జంగీల్ మోడ్తో పబ్జి గేమ్ మరింత ఆసక్తిగా మారనుందని అంతా భావిస్తున్నారు. (వైరస్ భయం: ఫ్లైట్లో ‘ఆ నలుగురు’) -
‘ధోని గేమ్ మార్చాడు.. పట్టు కోల్పోయాడు’
చెన్నై: టీమిండియా సీనియర్ ఆటగాడు, చెన్నై సూపర్కింగ్స్ సారథి ఎంఎస్ ధోని గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దీపక్ చహర్ తెలిపాడు. క్రికెట్తో పాటు ఫుట్బాల్ ఆటపై ధోని అమితాసక్తి కనబరుస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మోస్ట్ పాపులర్ గేమ్ పబ్జీలో ధోని అత్యంత నిష్ణాతుడని సీఎస్కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఆటల్లో టేబుల్ టెన్నిస్ లేక పబ్జీలలో ఒకటి ఎంచుకోవాలంటే ఏది ఎంచుకుంటావని చహర్ను సీఎస్కే ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. ’ఏ మాత్రం ఆలోచించకుండా పబ్జీ అనే చెబుతాను. ఎందుకుంటే ఇప్పటికీ పబ్జీ ఆడతాను. ధోని కూడా చాలా బాగా ఆడేవాడు. నేను, ధోనితో పాటు మరికొంతమంది ఆన్లైన్లో ఈ గేమ్ ఆడేవాళ్లం. అయితే ధోని మరో గేమ్కు మారాడు. కాల్ ఆఫ్ డ్యూటీ(సీఓడీ)తో ప్రస్తుతం బిజీగా ఉంటున్నాడు. దీంతో అతడికి పబ్జీపై పట్టు కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు కాలుస్తున్నారో కనిపెట్టలేకపోతున్నాడు’ అంటూ దీపక్ చహర్ పేర్కొన్నాడు. ఇక డిసెంబర్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్ తర్వాత ఈ పేస్ బౌలర్ టీమిండియా తరుపున ఆడలేదు. అయితే ఐపీఎల్ను సద్వినియోగం చేసుకొని మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని ఆశించాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: ఎంతో మందిని చూశా.. కానీ ధోని అలా కాదు ‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ -
కరోనా భయానికి గుడ్బై చెప్పండి!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి చాప కింద నీరులా అన్ని దేశాలకు విస్తరించింది. దాని భయంతో గడప దాటాలాంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు సైతం గుంపులుగా వెళ్లకండి, సమూహాలుగా జత కట్టకండి అంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. మరి రోజంతా ఇంట్లో ఉండాలంటే అది అయ్యేపనేనా.. ఎన్నిరోజులని ఒంటరిగా స్వీయనిర్భందం చేసుకుంటాం. పోనీ అన్ని గంటలు ఒక్కరమే ఉండాలంటే మనకు తోడుగా ఓ వ్యాపకం ఉండాల్సిందే. దీనికి ఫోన్ను మించిన అవకాశం మరొకటి లేదు. కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ స్మార్ట్ఫోన్లో కింద చెప్పుకునే గేమ్స్ వేసుకోండి. పైగా వీటిని ఎలాంటి రుసుము లేకుండా ప్లేస్టోర్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకాలస్యం.. వెంటనే ఫోన్ అందుకో.. గేమ్ ఆడుకో.. ► ఎయిట్ బాల్ పూల్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్లో ఇది కూడా ఒకటి. ఇది తప్పకుండా మీకు మజా ఇస్తుంది. ప్రత్యర్థుకు పోటీనిస్తూ ఎక్కువ స్కోర్ సాధించుకునే అవకాశం ఉంది. ► సబ్వే సర్ఫర్స్: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మెచ్చే గేమ్ ఇది. ఓ పిల్లవాడు తన ఎదురుగా ఉండే కాయిన్స్ను అందుకుంటూ వెళ్లాలి. క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే రైళ్లను ఢీ కొట్టకుండా తప్పించుకు పరుగెత్తాలి. ఎన్నిసార్లు ఆడినా అస్సలు బోర్ కొట్టదు. ఆడిన ప్రతిసారీ ఇంతకుమించి హైస్కోర్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. (కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే) ► క్యాండీ క్రష్ సోడా సాగా: ఈ గేమ్ తెలియనివారు దాదాపుగా ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది పాత గేమే అయినప్పటికీ ఇప్పటికీ దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ టూర్లు గట్రా అంటూ తిరిగే వారికి ప్రయాణంలో దీన్ని మించిన తోడు ఉండదు. ► లూడో కింగ్: ఇది తప్పకుండా మీకందరికీ సుపరిచితమైన గేమ్. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ప్రత్యక్షంగా ఆడుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక దీన్ని కాస్త ఆధునీకరించి ఆన్లైన్లో పరోక్షంగా ఆడుతున్నారు. ఆఫ్లైన్లో కంప్యూటర్తో, ఇంటిసభ్యులతో ఆడుకునే సదుపాయం ఉండగా ఆన్లైన్లో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు. ► ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్గ్రౌండ్స్(పబ్జీ): చివరగా చెప్పుకునే ఈ గేమ్ ఈపాటికే చాలామంది మొబైల్స్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సాధారణ గేమ్స్ కన్నా ఇది కాస్త భిన్నం. అడ్వెంచర్స్ను ఇష్టపడేవాళ్లకు ఈ గేమ్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి పబ్జీ ఆడటానికి అలవాటుపడ్డారంటే.. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అది మీకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. అంతలా అందులో తలమునకలవుతారు. ఈ గేమ్లో ఒకరినొకరు కాల్చిచంపుకునే విధ్వంసం కూడా ఉంటుంది. కానీ అది గేమ్వరకే పరిమితం. ఈ గ్రాఫిక్ గేమ్ ప్రస్తుత యూత్కు మోస్ట్ ఫేవరెట్ గేమ్గా నిలిచిపోయింది. (పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!) ఇలాంటి మరెన్నో గేమ్స్ ప్లేస్టోర్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి వాటినీ ఓసారి ట్రై చేయండి. దీంతోపాటు టీవీలో కార్టూన్స్, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. కుదిరితే పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఈ విధంగా కరోనా భయాన్ని మీ దరి దాపుల్లోకి రాకుండా నిలువరించండి. కానీ, ఏదేమైనా వైద్యులు, ప్రభుత్వాల సూచనలు మాత్రం తూచ తప్పకుండా పాటించండి.. కరోనా భయానికి గుడ్బై చెప్పండి. -
పబ్ జీ ఓడిపోయాడని రూ. 3 లక్షల దొంగతనం!
గాంధీనగర్: గుజరాత్లో మరో పబ్జీ కేసు నమోదైంది. పబ్జీ ఆటలో ఓడిపోయినందుకు ఓ 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లో దొంగతనం చేసిన వింత ఘటన కచ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం విషయం వెలుగులోకి వచ్చింది. కిరాణ దుకాణం నడుతున్న బాలుడి తల్లిదండ్రులు తమ బిరువాలో డబ్బు దొంగతనానికి గురవుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ విషయంపై నిఘా పెట్టిన వారికి సోమవారం రాత్రి బాలుడు డబ్బులు దొంగతనం చేస్తూ తల్లిదండ్రులకు దొరికిపోయాడు. ఈ విషయంపై కొడుకుని పట్టుకుని ప్రశ్నించడంతో.. అతను తన స్నేహితులతో కలిసి పబ్ జీ ఆడుతూ ఓడిపోవడంతో ఇంట్లోని బిరువాలో ఉన్న రూ. 3 లక్షలను దొంగతనం చేశానని ఒప్పకున్నట్లు బాధిత తల్లిదండ్రలు పోలీసులకు తెలిపారు. కాగా.. కొంత మంది యువకులు తమ కొడుకుని ఖరీదైనా మొబైల్ ఫొన్లకు, గేమ్లకు ఆకర్షితుడు అయ్యేలా చేశారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కోణంలో బాలుడిని విచారించడంతో తాను దొంగలించిన డబ్బును వారికి ఇచ్చానని.. వారు ఆ డబ్బుతో ఖరిదైనా ఫోన్లు కొనుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. కాగా వారు కావాలనే తమ కొడుకుని దొంగతనం చేసేలా ప్రొత్సహించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు డబ్బు కోసమే బాలుడిని ట్రాప్ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇక వారంత మైనర్లు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!
ప్రాణాంతక పబ్జీ గేమ్ను ఇష్టపడే వాళ్లకు దాని సృష్టికర్తలు శుభవార్త చెప్పారు. పబ్జీ మొబైల్ గేమ్ రెండేళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా మరో సరికొత్త అప్డేట్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపారు. తొలుత టైమ్పాస్ బాటిల్ గేమ్గా మొదలైన పబ్జీ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్డేటెడ్ వెర్షన్లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ ఆటలో.. తాజా పన్నెండో వెర్షన్లో మరిన్ని నూతన ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ గేమ్ అప్డేటెడ్ వెర్షన్ 0.17.0 గా రానుంది. (చదవండి : అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా) ఇక బాటిల్ గ్రౌండ్లో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో గేమర్ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 12 వ సీజన్లో కీలకమైన డెత్ రీప్లే అవకాశం కల్పిస్తున్నారు. శత్రువుల దాడిలో గేమర్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు డెత్ రీప్లే ఆప్షన్ తోడ్పడుతుంది. చేసిన పొరపాట్లేవో తెలుసుకుని, మరోసారి గేమర్ చనిపోకుండా కాపాడుకునేందుకు ఈ ఆప్షన్ సహకరిస్తుంది. ఇక పబ్జీ గేమ్తో మొబైల్స్కు అతుక్కుపోయే వారిని ఈ వెర్షన్ ఇంకెలా మారుస్తుందో మరి..! గంటల తరబడి పబ్జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, మానసిక రుగ్మతలు కొని తెచ్చుకున్న వారి గురించి తెలిసే ఉంటుంది..! (చదవండి : ప్రాణం తీసిన పబ్జీ.. యువకుడికి బ్రైయిన్ స్ట్రోక్) -
విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ?
ఘంటసాల (అవనిగడ్డ): పరీక్షలు దగ్గర పడుతున్నందున సెల్ఫోన్లో పబ్జీ గేమ్కు దూరంగా ఉండాలంటూ తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం గ్రామానికి చెందిన తమ్మనబోయిన భీమరాజు, విజయనాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్సాయి (15) శ్రీకాకుళం హైస్కూల్లో పదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు కళ్యాణ్ ఇదే హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో దీపక్సాయి చాలాబాగా చదువుతూ ఉండేవాడు. అయితే సెల్ఫోన్లో పబ్జీ గేమ్ను విపరీతంగా ఆడేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా అదే పనిలో ఉండేవాడు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో తల్లిదండ్రులు సెల్ఫోన్ వాడవద్దని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన దీపక్సాయి కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ట్యూషన్కు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు. భోజనం చేసి తిరిగి ట్యూషన్కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి హైస్కూల్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోని స్టేజీ పక్కనే ఉన్న భవనం రెండో అంతస్తు పిల్లర్కు చీరతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం హైస్కూల్ను శుభ్రం చేయడానికి వచ్చిన ఆయా.. విద్యార్థి మృతదేహాన్ని చూసి భయంతో హెచ్ఎంకు, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ బి.వెంకటేశ్వరరావు, చల్లపల్లి సీఐ ఎంవీ నారాయణ, సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
పబ్ జీ గేమ్కు బానిసై అర్ధనగ్నంగా గలాటా
కర్ణాటక యశవంతపుర : పబ్ జీ గేమ్కు బానిసైన యువకుడు మానసిక అస్వస్థతతో అర్ధనగ్నంగా తిరుగుతూ రాళ్లతో దాడి చేసిన ఘటన విజయపుర పట్టణంలో జరిగింది. పబ్జీ గేమ్కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్లపై దాడి చేశాడు. పబ్జీలో మాదిరిగా బాంబ్లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. దీంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన పబ్జీ.. యువకుడికి బ్రైయిన్ స్ట్రోక్
సాక్షి, పూణే : ఆన్లైన్గేమ్ పబ్జీకు వ్యవసపరుడిగా మారి.. ఓ యువకుడు ఏకంగా ప్రాణాల్ని తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని పూణేకు చెందిన హర్షల్ (27) గత రెండేళ్లుగా పబ్జీకి వ్యసనపరుడిగా మారాడు. ఏ పనీ లేకుండా 24 గంటలూ ఆదే ఆటలో మునిగితేలేవాడు. ఈ నేపథ్యంలోనే గత గురువారం తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచాడు. అయితే హర్ట్ ఎటాక్తో పాటు ఒకేసారి బ్రైయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతని మెదడులోని కణజాలం చిట్లి తీవ్ర రక్తస్రావం అయిందని, దీంతో హర్షల్ మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. కుమారుడు మృతిపై అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విపరీతంగా పబ్జీ ఆడటంమూలంగానే తమ కుమారుడు మృతిచెందాడని విలపించారు. -
పబ్జీ గేమ్తో బాలికకు వల
సాక్షి, హైదరాబాద్: పబ్జీ గేమ్లో ఏర్పడిన పరిచయంతో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి వాట్సాప్ ద్వారా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తెప్పించుకొని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మోహన్రావు కథనం ప్రకారం.. నాంపల్లిలో మెకానిక్గా పనిచేస్తున్న టోలిచౌకికి చెందిన సల్మాన్ (24)కు, పాతబస్తీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థినితో 6 నెలల క్రితం పబ్జీ గేమ్ ద్వారా ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారు వాట్సాప్లో రోజూ చాటింగ్ చేసుకునేవారు. కొన్ని రోజులు గడిచాక ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఇది నమ్మిన ఆ బాలిక అతడు అడిగినట్టుగా వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను వాట్సాప్లో పంపింది. అయితే గత మూడు నెలలుగా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెస్తానని, మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. తాను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలని, చెప్పినట్టు వినాలని, డబ్బులు తెచ్చివ్వాలని వేధింపులకు గురిచేసేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. సల్మాన్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చాలావరకు అమ్మాయిల ఫోన్ నంబర్లను గుర్తించారు. ఈ బాలికను వేధించినట్టుగానే ఇతర అమ్మాయిలను ఎవరినైనా వేధించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
'పబ్జీలో పరిచయం.. బాలిక ఫోటోలు సేకరించి'
హైదరాబాద్: పబ్జీ గేమ్తో మైనర్ బాలికకు వల వేసిన ఓ యువకుడి ఉదంతం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పబ్జీ గేమ్ ఆడుతూ.. ఓ మైనర్ బాలిక వాట్సాప్ నెంబర్ తీసుకొని ఓ యువకుడు వేధిస్తున్నాడు. నాంపల్లికి చెందిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు సదరు బాలికకు పబ్జీ గేమ్లో పరిచయమయ్యాడు. అతడు కాస్తా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకున్నప్పటి నుంచి అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడు.. అమ్మాయి పర్సనల్ ఫోటోలు సంపాదించాడు. చదవండి: 'మూఢనమ్మకానికి 12 మందికి జీవిత ఖైదు' ఆ ఫోటోలతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెడతానని వేదించడం మొదలు పెట్టాడు. తనతో శారీరకంగా గడపాలని లేదంటే ఫోటోలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. దీంతో, భయపడిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై సదరు యువకుడిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయిని వేధించిన యువకుడిని అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. అతని కాల్డేటా ఆధారంగా ఇలా ఎంత మంది అమ్మాయిలను వేధించాడో పోలీసులు కూపీ లాగుతున్నారు. చదవండి: పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు.. 4 నెలలు ఆగాలన్న పోలీసులు -
రూ.125 కోసం హత్య
సాక్షి, చెన్నై : కేవలం రూ.125 కోసం స్నేహితుడినే హతమార్చాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. అరుప్పుకోటకు చెందిన రాబర్ట్ (40) విల్లుపురానికి చెందిన శివకుమార్ కట్టడ కార్మికులు. వీరిద్దరూ చెన్నై కేకేనగర్ అన్నా మెయిన్ రోడ్డులోని ప్లాట్ ఫాంపై ఉంటూ పనికి వెళ్లేవారు. బుధవారం రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. శివకుమార్ వద్ద రాబర్ట్ కొద్ది రోజుల క్రితం రూ.250 అప్పు తీసుకున్నాడు. ఇందులో రూ.125 తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. తక్కిన రూ.125 తిరిగి ఇవ్వమని శివకుమార్ రాబర్ట్తో బుధవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో రాబర్ట్ శివకుమార్ కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆగ్రహించిన శివకుమార్ బీర్బాటిల్ను పగులగొట్టి అతని తలపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాబర్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న సహాయ కమిషనర్ రాధాకృష్ణన్, కేకే.నగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విచారణ చేసి శివకుమార్ను అరెస్టు చేశారు. పబ్జీగేమ్ ఆడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య అన్నానగర్: పబ్జీగేమ్ ఆడొద్దన్నందుకు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరువొత్తియూర్లో చర్చనీయాంశమైంది. తిరువొత్తియూరు కాలరింపేట చెట్టితోటమ్ ప్రాంతానికి చెందిన రఘుపతి వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇతని కుమార్తె విద్యాశ్రీ (18). తిరువొత్తియూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ తమిళ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాశ్రీ బుధవారం తన సెల్ఫోన్లో పబ్జీగేమ్ ఆడుతుండగా దాన్ని చూసి ఆమె తల్లి చదవకుండా గేమ్ ఆడుతున్నావేంటి..? అని మందలించింది. మనస్తాపానికి గురైన విద్యాశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్జీ ఎఫెక్ట్.. ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ డ్రామా
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్) : పబ్ జీ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పబ్జీ వద్దన్నందుకు నీ కొడుకును కిడ్నాప్ చేశారని తల్లికే ఓ ఇంటర్ విద్యార్థి ఫోన్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. పుప్పాలగూడలోని శ్రీరాంనగర్లో నివాసం ఉండే సమీర్ ఆర్మన్(16) నార్సింగిలోని జాహ్నవి జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో షేక్పేట్లోని ఆకాశ్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు చేస్తున్నాడు. తండ్రి అల్తఫ్ ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజర్గా పని చేస్తున్నారు. కొంత కాలంగా సమీర్ పబ్ జీ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేశాడు. గమనించిన తల్లి పబ్జీ ఆడవద్దని మందలించి సెల్ఫోన్ తీసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన సమీర్ మణికొండలోని స్నేహితుడు సిద్ధార్థ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. బ్యాంక్లో రెండు వేల నగదు తీసుకొని రాత్రి 9.30 ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి బస్సులో ముంబై బయటుదేరాడు. తెల్లవారు జామున 5.30 గంటలకు షోలాపూర్లో దిగి బాత్ రూమ్కు వెళ్లి వచ్చే లోపు బస్సు వెళ్లిపోయింది. ఏమి చేయాలో పాలుపోక అక్కడున్న వారి సెల్ ఫోన్ తీసుకొని ఉదయం 7 గంటలకు తల్లికి ఫోన్ చేశాడు. నీ కొడుకును కిడ్నాప్ చేశాం, నీ కొడుకు అంటే నీకు ప్రేమ లేదా అర్జంట్గా మూడు లక్షల రూపాయలు పంపాలని, ఈ ఫోన్ నంబర్కు మళ్లీ మళ్లీ పోన్ చేయవద్దని చెప్పాడు. ఆమె పెద్దగా స్పందించలేదు. శనివారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి బస్సులో మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్కు వచ్చాడు. సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్లైన్లో బస్సు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్కు మెసేజ్ రావడంతో తల్లి ఆశా చూసి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించింది. మాచెర్లకు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చున్న సమీర్ను రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. రాత్రి తల్లి ఆశకు సమీర్ను అప్పగించడంతో కథ సుఖాంతమైంది. -
మొదటి వారంలోనే 100 మిలియన్ల డౌన్లోడ్లు!
నేటి డిజిటల్ యుగంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ వీడియో గేమ్స్ ఆడుతూ హల్చల్ చేస్తున్నారు. బ్లూవేల్, పబ్ జీ వంటి డేంజరస్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా.. వాటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ పేరిట మరో సరికొత్త గేమ్ ప్లే స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన స్వల్ప కాలంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ సాధించిన తొలి గేమ్గా రికార్డుకెక్కింది. టిమీ స్టూడియోస్ డెవలప్ చేసిన ఈ గేమ్ హవా ఇలాగే కొనసాగితే.. ప్రత్యర్థి కంపెనీలు పతనం కావడం ఖాయమని విశ్లేషణా సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ మేరకు ఐఓఎస్లో 56.9 మిలియన్, ఆండ్రాయిడ్లో 45.3 మిలియన్ డౌన్లోడ్లు సాధించిన కాల్ ఆఫ్ డ్యూటీ ఆయా ప్లాట్ఫాంలలో వరుసగా 9.1 మిలియన్, 8.3 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టిందని తెలిపింది. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న చైనాలో లాంచ్ కాకముందే రికార్డు స్థాయిలో డౌన్లోడ్స్ సాధించిన ఈ గేమ్.. అక్కడ కూడా లాంచ్ అయితే గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేసింది. ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్గా రూపొందిన ఈ మొబైల్ గేమ్ అక్టోబరు 1న విడుదలైందన్న విషయం తెలిసిందే. -
పబ్జి ఓ డెత్ గేమ్..
-
విశాఖలో ప్రాణం తీసిన పబ్జీ
సాక్షి, పెదగంట్యాడ (విశాఖపట్నం): పబ్జీ ఆన్లైన్ గేమ్ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్థానిక చినకోరాడ ప్రాంతంలో నివాసముంటున్న బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బోయి లోహిత్ (14) స్థానికంగా ఓ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పబ్జీ గేమ్కు బానిసైన లోహిత్ చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు చీమలమందు నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన షీలానగర్లోని ఆస్పత్రి తరలించారు. మూడు రోజలు చికిత్స అనంతరం మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం నగరంలోని మరో ఆస్పత్రిలో చేర్పించారు. 14 రోజలు చికిత్స అనంతరం బాలుడు పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. దీంతో బాలుడి మేనమామ పులి సూరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో న్యూపోర్టు సీఐ పైడా అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏఎస్ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలుగా..
బెంగళూరు: స్మార్ట్ ఫోన్లో పబ్జీ గేమ్కు బానిసైన యువకుడు ఆ ఉన్మాదంతో కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి చంపాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్ కమ్మార (25). ఐటీఐ మెకానికల్ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్ మొబైల్లో గేమ్స్కి అలవాటు పడ్డాడు. శనివారం అర్థరాత్రి నుంచే రఘువీర్ ఇంట్లో, తమ వీధిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, అర్థరాత్రి బయటకు వచ్చి ఇతరుల ఇంటికి వెళ్ళి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని గట్టిగా అరుస్తూ గొడవలు చేస్తున్నాడని స్థానికులు పోలీసులకి తెలిపారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు. ఘోరం జరిగింది ఇలా.. ఆదివారం అర్థరాత్రి దాటుతున్నా కుమారుడు మొబైల్ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండడం, అతని చేతికి రక్తం వస్తుండడం చూసి తల్లి చేతికి కట్టు కట్టబోయింది. దీంతో రఘువీర్ గొడవకు దిగాడు. వెంటనే తండ్రి వెళ్లి గట్టిగా పట్టుకుని కట్టుకట్టబోగా ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. తల్లిని మరో గదిలోకి నెట్టి గడియపెట్టి తన చేతికి ఉన్న బ్యాండేజ్ మొత్తం విప్పి తండ్రి గొంతుకు చుట్టి హత్య చేయబోయాడు. రఘువీర్ కత్తిపీటను తీసుకొని తండ్రి పైన దాడి చేయడంతో అతడు ప్రాణాలు విడిచాడు. రఘువీర్ అంతటితో ఆగకుండా తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా నరికేశాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వచ్చే ప్రయత్నం చేయగా వారిపై కూడా కత్తిపీటతో దాడికి యత్నించాడు. సుమారు అరగంట పాటు అలా ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు ఒక బెడ్షీటు తీసి అతని పైన వేసి గట్టిగా పట్టుకొని బంధించి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
పబ్జీ.. డేంజర్జీ
-పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో చదువుకోకుండా సెల్ఫోన్లో పబ్జీ ఆడుతుండడంతో తల్లి మందలించినందుకు మనస్తాపంతో మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీకి చెందిన ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. - తాజాగా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి కాలు, చేయి పడిపోయాయి. అచేతన స్థితిలో ఉన్న ఆ యువకుడు నగరంలోని సన్షైన్ ఆస్పత్రిలో చేరాడు. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ పబ్జీ తాజాగా నగరంలోనూ విస్తరిస్తోంది. ప్రమాదకరమైన ఈ పబ్జీ ఆటకు బానిసై... అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు చేరుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వ్యక్తులు... ఇప్పుడు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు.. ఆడొద్దని చెబితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలూ చేస్తున్నారు. తొలుత ‘పోకేమాన్’ అంటూ రోడ్డున పడిన యువత... ఆ తర్వాత బ్లూవేల్కు బానిసై ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడదే కోవలో పబ్జీ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతున్నారని, ఇందులో సుమారు 4 కోట్ల మంది నిత్యం యాక్టివ్గా ఉంటున్నారని అంచనా. మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి కేశవర్ధన్(19) రాత్రి వేళల్లో పబ్జీ ఆటలో లీనమై నిద్రాహారాలు మానేయడంతో రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఫలితంగా కాళ్లు, చేతులు పడిపోయి అచేతనా స్థితిలో ఈ నెల 26న నగరంలోని సన్షైన్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో ‘పబ్జీ’ మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్పత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ సకాలంలో గుర్తించి వైద్యం చేయడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆటలో లీనమైతే అంతే... పబ్జీ అంటే ‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్’ అని అర్థం. దక్షిణ కొరియాలోని ఓ గేమింగ్ సంస్థ ఈ మల్టీ ప్లేయర్ గేమింగ్ యాప్ను రూపొందించింది. ఈ గేమ్ ఆడాలంటే ముందుగా పబ్జీ యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఐడీ లభిస్తుంది. అయితే, ఈ ఆటను సింగిల్గా కాకుండా జట్టుగా ఆడితేనే మజా ఉంటుంది. దీంతో కొంతమంది టీమ్లుగా ఏర్పడి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ ఆడే వ్యక్తులు సైనికులుగా మారిపోతారు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి శత్రువులతో పోరాడుతున్నామనే భావనలో ఉంటారు. ఒకసారి ఆట మొదలైందంటే యుద్ధంలో ఉన్నట్లే. అప్రమత్తంగా లేకపోతే శత్రువులు చంపేస్తారు. దీంతో ఈ ఆటలో లీనమైనవారు పక్కన ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అనే అంశాలనే కాదు చివరికి నిద్రాహారాలనే మరిచిపోతుంటారు. ఆటలో లీనమైతే మళ్లీ బయటకు రావడం కష్టమే. పైగా గ్రూప్తో కలిసి ఆడినప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆట ఆడేవారు తమని తాము సైనికులుగా భావిస్తారు. ఇది గ్రూప్ వాయిస్ గేమ్ కావడంతో యుద్ధం చేస్తుంది తామేననే భావన ఏర్పడి, తెలియకుండానే ఈ గేమ్కు బానిసలుగా మారి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. మానసిక సమస్యలు.. ఈ ఆటతో పిల్లల మానసిక, శారీరక స్థితి తీవ్రంగా దెబ్బతింటోందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆటాడే సమయంలో వీరు ఇతరులను పట్టించుకోరు. గేమ్ నుంచి దృష్టి మరల్చితే శత్రువుల చంపేస్తారనే భయంతో పరిసరాలను మరిచిపోతుంటారు. ఏకాగ్రత లోపించి చదువులో వెనకబడి పోతుంటారు. ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేసినా, పిలిచినా పట్టించుకోరు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొంతమంది కోపంతో ఊగిపోతారు. ఈ ఆటకు బానిసలైన యువత నిద్ర లేమి, కంటి చూపుతో బాధపడుతుంటారు. గంటల తరబడి ఒకేచోట కూర్చొని ఆడడంతో మానసిక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో న్యూట్రిషన్ లెవల్స్ పడిపోయి డీహైడ్రేషన్కు లోనవుతుంటారు. మెదడులో క్లాట్స్ ఏర్పడి, చివరకు కాళ్లు, చేతులు పడిపోతుంటాయి. – డాక్టర్ వినోద్కుమార్, న్యూరోఫిజిషియన్, సన్షైన్ ఆస్పత్రి గేమ్ను నిషేధించాలి.. యువత రోజుకు 8–10 గంటలు ఈ ఆట ఆడుతోంది. దీనికోసం అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్పై నిషేధం విధించాయి. ఇటీవల జమ్మూలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ పబ్జీకి బానిసై పిచ్చివాడయ్యాడు. దీంతో అక్కడి ప్రభుత్వం పబ్జీని నిషేధించింది. గుజరాత్ ప్రభుత్వం స్కూళ్లలో ఈ ఆటను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్లరాదని ఆదేశించింది. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం ఈ గేమ్పై నిషేధం విధించింది. మహారాష్ట్ర హైకోర్టు కూడా ఈ గేమ్ను నిషేధించింది. ఈ పబ్జీ గేమ్ను తెలంగాణలోనూ నిషేధించాలి. – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం -
పబ్ జీ.. యే క్యాజీ..!
పబ్ జీ, ఫ్రీ ఫైర్ గేమ్స్.. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో ఈ ఆటల గురించి తెలియని వారుండరు. ప్రధానంగా యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్లైన్ ఆటలివి. కొందరు చిన్నారులు, యువకులు నిద్రాహారాలు మానేసి ఈ ఆటలకు బానిసలవుతున్నారు. సరదాగా మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను తనకు బానిసను చేసుకుంటున్న క్రీడ. తమకు తెలియకుండానే పబ్జీ గేమ్కి అంకితమవుతున్న యువత మానసికంగా, శారీరకంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. ఆట వద్దని చెబితే విచక్షణ కోల్పోయి హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు. ఈ ఆట కారణంగా మానసిక వ్యాధులు, మరి కొందరి సంసారాల్లో విడాకులు, చాలా కుటుంబాల్లో పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ క్రీడను గేమింగ్ డిజార్డర్గా గుర్తించారు. ప్రస్తుతం భారత్లో మొబైల్ ఫోన్ వాడుతున్న యువతలో 60 శాతం మంది నిత్యం పబ్జీ గేమ్ ఆడుతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – బీచ్రోడ్డు (విశాఖ తూర్పు) పబ్ జీ అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్, పూర్తిగా ఆన్లైన్ వేదికగా సాగే ఆట ఇది. 2018లో ఈ గేమ్ మార్కెట్లోకి విడుదలైంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ సంస్థ దీనిని యాప్లా తయారు చేసింది. యాప్ను ఫోన్లో వేసుకొని ప్రారంభించగానే ఎంత మందితో ఆడాలో నిర్ణయించుకోవాలి. ఆన్లైన్లో స్నేహితులంతా జట్టుగా ఏర్పడతారు. ఆ సమయంలో స్నేహితులంతా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా 50 మంది ఆడవచ్చు. ఎంచుకున్న జట్టు తప్ప మిగతా వారంతా శత్రువుల కిందే లెక్క శత్రువులను తుపాకులతో, బాంబులతో చంపడమే లక్ష్మంగా ఆట సాగుతుంది. ప్రత్యేకమైన సైనికుల తరహాలో వేణధారణలలో కూడిన జట్టు పరస్పరం దాడులు చేసుకుంటూ యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. ఆటగాడు చనిపోతే ఆతడి గేమ్ ముగుస్తుంది. ఎలాగైనా అందరినీ చంపి గెలవాలనన తపనతో ప్రతి సారీ యువత మళ్లీ గేమ్లోకి ప్రవేశించి ప్రారంభిస్తారు. ఈ గేమ్లో ఒకే సారి మనకు తెలిసిన వారితో కలిపి ఆడే అవకాశం కూడా ఉంది. అలా ఆడటం వల్ల చివరి వరకు వారు మిగిలిన వాళ్లను చంపి గేమ్ తుది దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో నిద్రాహారాలు, మానేసి పబ్ జీ ఆటకు బానిసలుగా మారుతున్నారు. పెరుగుతున్న నేర ప్రవృత్తి పబ్ జీ ఆటలో ఉండేది మొత్తం నేరప్రవృత్తే. ఎదుటి వారిని తుపాకులతో కాల్చడం. బాంబులు వేసి చంపడమే లక్ష్యంగా సాగుతోంది. దీంతో పబ్జీలో ఉన్నట్లుగానే నేర ప్రవృత్తికి అలవాటు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్కు బానిసై చదువు చదవడం లేదని ఢిల్లీకు చెందిన సురాజ్ను అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో సురాజ్ వారి కుటుంబాన్ని మొత్తం హత్య చేసిన ఘటన దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ గేమ్ వల్ల ఎందరో చనిపోతున్నారు.. మరి కొందరు గొడవులు పడి దూరం అవుతున్నారు. పబ్జీ ఆడకపోతే నిమిషం నిలువ లేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. పబ్జీ ఆటకు బానిసలై వింతగా ప్రవర్తిస్తున్న ఎందరో యువకుల వీడియోలు సోషల్ మీడియోలొ చక్కర్లు కొడుతున్నాయి. విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఆటల మూలంగా విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, ఎప్పుడు చూసినా సెల్ఫోన్లోనే మునిగి తేలుతున్నారనే ఫిర్యాదులు పెరిగాయి. ఈ ప్రభావం పరీక్షలపై కూడా పడుతుంది. పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ఎంతో మంది విద్యార్ధులు ఫెయిల్ అవుతున్నారు. గేమ్లో మునిగిపోయి చదువుకోవడానికి సమయం కేటాయించకపోవడమే ఇందుకు కారణం. విలువైన సమయాన్ని యువత వృథా చేస్తుండటం వల్ల పరీక్ష ఫలితాలు తారుమారై తల్లిదండ్రులకు నిరుత్సాహం మిగుల్చుతున్నారు. పబ్ జీకి బానిసలుగా మారిన పిల్లలను మామూలు స్థితికి తెచ్చేందుకు మానసిక నిపుణులు సంప్రదిస్తున్న కేసులు పెరిగుతున్నాయి.. తల్లిదండ్రులు గమనించాలి మొబైల్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక స్థితిని గమనించాలి. యూత్ స్మార్ట్ఫోన్లలో రకరకాల వీడియో గేమ్స్, నిషేధిత వెబ్సైట్స్ చూసి ఆకర్షితులవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తెలిసీతెలియని వయస్సులో ఇలాంటి ఆటలకు ఆకర్షితులైతే వారిలో నేరప్రవృత్తి పెరుగుతుంది. శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుంటే కళ్లకు ప్రమాదం ముంచుకొస్తుంది. ఆలోచన, విచక్షణ శక్తిని కోల్పోతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దు. ఇచ్చిన వారు పక్కనే ఉండి ఫోన్లో ఏం చూస్తున్నారో, చేస్తున్నారో గమనించాలి. మొబైల్కు బానిసలైన కేసులు నెలకు మూడు నాలుగు వస్తుంటాయి. వారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి సాధారణ పరిస్థితికి తీసుకొని రావటం జరుగుతుంది. –డాక్టర్ సునీత, మానసిక నిపుణరాలు చాలా చోట్ల నిషేధం పబ్ జీతో ఎదురవుతున్న దుష్పరిణామాలను గుర్తించిన చైనా దేశం ఈ ఆటను పూర్తిగా నిషేధించింది. మన దేశంలోని గుజరాత్ ప్రభుత్వం సైతం పాఠశాలల్లో ఈ ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గేమ్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కేంద్రానికి గుజరాత్ ప్రభుత్వం ఇటీవల సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ ఆటను ఒక ఖాతాదారుడు కేవలం 6 గంటలు మాత్రమే ఆడేలా పరిమితి విధించారు. అయినా యువత ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను సృష్టించుకొని గంటల తరబడి ఆడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మాయదారి క్రీడను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది లేదంటే ఎందరో ఈ మృత్యుక్రీడ కారణంగా తమ విలువైన జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
‘ముస్లింల ఆగ్రహానికి పబ్జీ కారణమవుతోంది’
సాక్షి, చెన్నై: ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీపై నిషేధం విధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ (టీఎన్ఎంఎల్) డిమాండ్ చేసింది. ఈ గేమ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం టీఎన్ఎంఎల్ ఫిర్యాదు చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల ఆగ్రహానికి ఈ గేమ్ కారణమవుతోంది. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన ‘బ్లూ వేల్ చాలెంజ్’ గేమ్ మాదిరిగానే... ఇది కూడా పవిత్ర స్థలం ‘కాబా’ను పోలిన ఓ చిత్రాన్ని చెడుగా చూపిస్తూ ఆగ్రహానికి గురిచేస్తోంది...’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింలంతా ఈ గేమ్ను తమ మొబైల్లో డిలీట్ చేస్తూ ‘‘బాయ్కాట్ పబ్జీ’’ పేరుతో ప్రచారం చేపట్టాలని టీఎన్ఎంఎల్ పిలుపునిచ్చింది. -
పబ్జీతో ఆడాడు.. గుండె ఆగింది..!
భోపాల్ : ఆన్లైన్ వీడియోగేమ్ పబ్జీకి బానిసైన ఓ 16 ఏళ్ల యువకుడు ప్రాణాలు విడిచిన ఘటన నీమచ్లో గత మంగళవారం జరిగింది. ఫర్ఖాన్ ఖురేషీ అనే యువకుడు అదేపనిగా 6 గంటలపాటు పబ్జీ ఆడాడు. దీంతో తీవ్ర గుండెనొప్పితో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ‘లంచ్ చేసిన తర్వాత మా తమ్ముడు ఆట మొదలుపెట్టాడు. సహచర ఆటగాళ్లపై తీవ్రంగా కోప్పడ్డాడు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ.. అయిపోయింది. పేలిపోయింది. మీ వల్లే ఓడిపోయాను, ఇంకెప్పుడూ మీతో ఆడను అని ఇయర్ఫోన్స్ నేలకేసి కొట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు’ మృతుని సోదరి కన్నీరుమున్నీరైంది. తమ కుమారున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఫర్ఖాన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే తమ కుమారుడు మరణించినట్టు వైద్యులు చెప్పారని అన్నారు. ‘ఫర్ఖాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే అతని నాఢీ కొట్టుకోవడం ఆగిపోయింది. కరెంట్ షాక్తో అతన్ని బతికించే ప్రయత్న చేశాం. కానీ ఫలించలేదు’ అని డాక్టర్ అశోక్ జైన్ తెలిపారు. ఫర్ఖాన్ మంచి స్విమ్మర్ అని, అతనికి ఎలాంటి గుండె జబ్బులు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మాయదారి పబ్జీ తమ కుమారున్ని పొట్టనబెట్టుకుందని వాపోయారు. మృతుని సోదరుడు మహ్మద్ హషీమ్ కూడా పబ్జీకి బానిస. అతను రోజూ 18 గంటలు పబ్జీ ఆడతాడు. అయితే, సోదరుని మరణంతో ఉలిక్కిపడిన హషీమ్.. తన మొబైల్ నుంచి ఆ గేమ్ని డిలీట్ చేశాడు. ఇక విపరీతంగా వీడియో, ఆన్లైన్ గేమ్లు ఆడటం కూడా వ్యసనం లాంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
విడాకులు ఇప్పిస్తే.. హాయిగా ఆడుకుంటా!
అహ్మదాబాద్ : ప్రస్తుతం పబ్జీ ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా తేడాల్లేకుండా ఈ గేమ్ మాయలో పడి గంగవెర్రులెత్తుతున్నారు. ప్రాణాలు తీయడంతో పాటుగా పచ్చని సంసారాల్లోనూ పబ్జీ చిచ్చు పెడుతోంది. గుజరాత్లోని ఓ టీనేజీ తల్లి వ్యవహారశైలి ఇందుకు తార్కాణంగా నిలిచింది. వివరాలు...గుజరాత్కు చెందిన ఓ పద్దెమినిదేళ్ల యువతికి బిల్డింగ్ కాంట్రాక్టర్తో పెళ్తైంది. ప్రస్తుతం ఆమెకు నెలల వయస్సున్న కూతురు ఉంది. కాగా గత కొంతకాలంగా పబ్జీ గేమ్కు బానిసైన సదరు వివాహిత తనకు సహాయం కావాలంటూ ప్రభుత్వ సంస్థ అభయం హెల్ఫ్లైన్ నెంబర్కు ఫోన్ చేసింది. తాను పబ్జీ భాగస్వామితో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని, అప్పుడు ఇద్దరం కలిసి గేమ్ ఆడుకోగలమని పేర్కొంది. ఇందుకోసం తన భర్తతో విడాకులు ఇప్పించాల్సిందిగా కోరింది. దీంతో కంగుతిన్న కౌన్సిలర్ కొంతకాలం అహ్మదాబాద్లోని సహాయక శిబిరంలో ఉంటే పరిస్థితులు చక్కబడతాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఫోన్లు అనుమతించని కారణంగానే తాను సహాయక శిబిరానికి వెళ్లనని వివాహిత తేల్చిచెప్పింది. ఈ విషయం గురించి అభయం ప్రాజెక్టు హెడ్ మాట్లాడుతూ..‘మాకు రోజుకు సుమారు 550 కాల్స్ వస్తాయి. కానీ ఇంతకుముందెవరూ ఇలాంటి సహాయం కోరలేదు. నిజానికి తమ పిల్లలు పబ్జీకి బానిసలుగా మారారంటూ చాలా మంది తల్లులు గోడు వెళ్లబోసుకుంటారు. కానీ ఇక్కడ తల్లే పబ్జీకి బానిసైంది. ఆట కోసం తన భర్త, కూతురిని భారంగా భావిస్తోంది. ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని పేర్కొన్నారు. కాగా పబ్జీ ఆడొద్దన్న కారణంగా ఇటీవల యూఏఈ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.