river
-
ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా
-
2 కి.మీ. నిడివి రూ. 332 కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై 2.4 కిలోమీటర్ల పొడవుతో భారీ రైలువంతెన నిర్మించనున్నారు. ఇందుకు రూ.332 కోట్లు ఖర్చు కానుంది. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్ద వంతెనలున్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. విజయవాడ రైలు వంతెన తరహాలో..కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన తరహాలో ఇనుప గర్డర్లతో దీన్ని రూపొందించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై పెద్దగా ప్రభావం చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో ఈ డిజైన్కు మొగ్గు చూపారు. భారీ వరద పోటెత్తినా ఇబ్బంది కానిరీతిలో..మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నదిని దాటాలి. సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడకు చేరుకునే మార్గానికి కేవలం 10 కి.మీ. దూరంలో మిడ్ మానేరు జలాశయం ఉంది. దీంతో అక్కడ బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో నీటి నిల్వ పెరిగి నది మరింత వెడల్పుతో ప్రవహిస్తుంది.గతంలో గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకంటే ఎక్కువ నీళ్లు చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కాని రీతిలో వంతెనకు డిజైన్ చేశారు. దీంతో 2.4 కి.మీ. నిడివితో నిర్మించాలని నిర్ణయించారు. నదీతీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై.. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామపరిధిలో ల్యాండ్ అవుతుంది. 120 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించేలా..సాధారణంగా వంతెనలపై రైళ్ల వేగాన్ని కనిష్ట స్థాయికి కుదిస్తారు. ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కి.మీ.వేగంతో దూసుకుపోయినా ఇబ్బందికాని విధంగా ఈ వంతెన నిర్మించనున్నారు. అయితే సరుకు రవాణా రైళ్ల గరిష్ట వేగాన్ని 65 కి.మీ.కు అనుమతిస్తారు. ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో..ఈ వంతెన ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో మలుపుతో ఉంటుంది. వంతెన నిర్మించే ప్రాంతంలో కొంతభాగం అటవీ ప్రాంతం అలైన్మెంట్లోకి చొచ్చుకొచ్చింది. మరోవైపు గుట్టలున్నాయి. దీంతో వాటిని తప్పిస్తూ ఎస్ ఆకృతిలో డిజైన్ చేశారు. వెంటనే పనులు..వంతెన పనులను వెంటనే ప్రారంభించేలా దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్ మధ్యలో భూ పరిహార మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిపాజిట్ చేయలేదు. దీంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల ఆ మొ త్తం చెల్లించటంతో పనులు జరుగుతున్నాయి. ఇక మానేరు నది అవతల సిరిసిల్ల నుంచి కరీంనగర్ (కొత్తపల్లి) వరకు భూసేకరణ ప్రక్రియ నిలిచిపో యింది. పరిహారం మొత్తం రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయలేదు. దీంతో భూమి రైల్వే ఆధీనంలోకి రాలేదు. ఫలితంగా అక్కడ టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ప్రాజెక్టు అనుకున్న సమ యంలో పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో మిగ తా పనులతో ప్రమేయం లేకుండా వంతెన భా గాన్ని వేగంగా నిర్మించి, ప్రాజెక్టులో అపరిమిత జాప్యాన్ని నివారించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సిరిసిల్ల వైపు లైన్ నిర్మాణం పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తోంది. 18 నుంచి 20 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు పేర్కొంటోంది. -
అందాలు ‘ఏరు’కొందామా..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకో టూరిజం.. ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో పాపికొండలు, అరకు వంటి ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలే మనకు గుర్తొస్తాయి. అందుకే ఆయా ప్రాంతాలకే ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతుంటారు. కానీ పర్యాటకులకు ప్రకృతి పర్యాటకానికి అసలైన నిర్వచనం ఇచ్చేందుకు.. అచ్చమైన తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త థీమ్తో ముందుకొచి్చంది. ఎకో–టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా భద్రాచలం, పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏరు–2025 ది రివర్ ఫెస్టివల్ పేరిట వేడుకలు నిర్వహించనుంది. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేలా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రివర్ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టింది. భద్రాచలంతోపాటు పర్ణశాల, బొజ్జుగుప్ప, కిన్నెరసాని, కనకగిరి (చండ్రుగొండ) గుట్టలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తోంది.ఏమిటీ రివర్ ఫెస్టివల్ ప్రత్యేకత.. గోదావరి గలగలల చెంతన (కరకట్ట వెంబడి) ప్రత్యేక గుడారాలతో కూడిన క్యాంపింగ్ సైట్.. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా పూర్తిగా వెదురు, గడ్డితో గుడిసెలు, మంచెల ఏర్పాటు.. బోటింగ్ సదుపాయం.. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరించనున్నాయి. అలాగే కొండలు, గుట్టల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. మరింతగా పల్లె వాతావరణం కోరుకొనే వారి కోసం భద్రాచలానికి 17 కి.మీ. దూరాన ఉన్న బొజ్జుగుప్ప అనే గిరిజన గ్రామంలో మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. అక్కడకు చేరుకొనే అతిథులకు గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగ తం పలికేలా గ్రామస్తులకు శిక్షణ సైతం ఇచ్చారు. అలాగే తాటి మొద్దులతో సిద్ధం చేసిన డయా స్పై కొమ్ము, కోయ నృత్యాలతో పర్యాటకులను వారు అలరించనున్నారు. ఈ వేదికకు సమీపాన తామర పూలతో నిండిన చెరువులో బోటింగ్, ఫిషింగ్కు ఏర్పాట్లు చేశారు.ఆకులు, దుంపలతో వంటకాలు..ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో వంటకాలు.. గిరిజన తెగలకు చెందిన ఆచార వ్యవహారాలు, పనిముట్లు, అలంకరణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఐటీడీఏ క్యాంపస్లోని గిరిజన మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్థానిక గిరిజనులు సేకరించిన తేనె, కరక్కాయ, ఇప్పపూలు తదితర అటవీ ఉత్పత్తులు అమ్మనున్నారు. అడవుల్లో దొరికే, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో గిరిజనులు చేసిన వంటలను ప్రత్యేకంగా పర్యాటకులకు వడ్డించనున్నారు. -
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్యార్డ్లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఒక శిబిరం.. ఎన్నో కన్నీళ్లు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్లీలా ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమ్మా ఎప్పుడొస్తావ్! ‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్ఫోన్లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. అలా తినాలంటే ఎలా? తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.నా ఖమ్మం కోసం నేను!వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్లు.. కలెక్టర్ వినూత్న ఆలోచనఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు. -
ఐదు రోజులైనా అదే యాతన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద వచ్చి ఐదు రోజులైనా ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. బురద, దుర్వాసన ఓవైపు.. తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు దొరకక మరోవైపు బాధితులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఆర్థిక సాయం సర్వేలో.. తమ పేర్లు నమోదు చేయ లేదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగింపు, పారిశుధ్య పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని వాపోతున్నారు. తొలగని బురద.. అందని నీరు సుమారు 50 కాలనీల్లో బురద నిండిపోయి ఉంది. వాహనాలతో తొలగిస్తూనే ఉన్నా.. ఇంకా భారీగా పేరుకుపోయే కనిపిస్తోంది. ఇళ్లలో బాత్రూంలను వాడుకునే పరిస్థితి లేదు. ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుందామనుకునే వారికి తగినన్ని నీళ్ల అందడం లేదు. కొన్ని కాలనీలకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భోజనాల వేళ దాతలు ఇచ్చే తాగునీటి ప్యాకెట్లే తప్ప రక్షిత నీరు అందడం లేదని వాపోతున్నారు. తమను సర్వే చేయడం లేదంటూ.. వరద సమయంలో ఆస్పత్రులు, శుభకార్యాలు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు.. ఇళ్లకు తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు రెండు వేలకుపైగా ఇళ్లు పూర్తిగా నీటమునగడంతో విద్యుత్ మీటర్లు పాడయ్యాయి. విద్యుత్ శాఖ వాళ్లు వాటి స్థానంలో కొత్తవి బిగించే పనులు చేస్తున్నా.. గోడలు తడిసే ఉండటంతో షాక్ వస్తుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ఖమ్మంరూరల్ మండలం కేబీఆర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఎల్రక్టీషియన్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. దీంతో పగలంతా ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్న బాధితులు.. రాత్రికి తిరిగి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. భర్త ఆపరేషన్ కోసం వెళ్లి.. ఖమ్మం వెంకటేశ్వర నగర్కు చెందిన ఐతరాజు జ్యోతి, వెంకన్న కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వెంకన్నకు గొంతు ఆపరేషన్ కోసం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లారు. వరద విషయం తెలిసి ఆందోళనలో పడ్డారు. స్థానికంగా లేకపోతే సర్వేలో పేరు రాయరని, ఆర్థిక సాయం అందదేమోనని భావించిన చెందిన జ్యోతి బుధవారం రాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో నిత్యావసరాలు సహా సామగ్రి అంతా తడిసి పాడైపోయి ఉండటాన్ని చూసి కన్నీళ్లులో మునిగిపోయారు. కిరాణం, వాటర్ ప్లాంట్ కొట్టుకుపోయి.. ఇక్కడి వెంకటేశ్వర నగర్లో కాటం వెంకటేశ్వర్లు కిరాణం, వాటర్ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ఈ రెండూ మునిగి, సామగ్రి కొట్టుకుపోయి.. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. ముంపు సర్వే కోసం ఇంకా ఎవరూ రాలేదని, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పదివేల సాయం ఏ మూలకు..? కాల్వొడ్డు ప్రాంతంలో నివసించే రామిశెట్టి నాగమ ణి భర్త గతంలోనే చనిపోయారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవించే నాగమణికి.. వరదల వల్ల కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల పరిహారం దేనికీ సరిపోదని ఆమె వాపోతున్నారు. శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి.. వెంకటేశ్వరనగర్లో నర్రి సుగుణ, యాదయ్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఓ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని వరద ముంచెత్తింది. ఇంట్లోని నాలు గు క్వింటాళ్ల బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిసి పాడైపోయాయి. తనను పరామర్శించేందుకు వచ్చిన పెద్దకుమార్తెని చూసి కట్టుబట్టలతో మిగిలామంటూ సుగుణ కన్నీరుపెట్టారు.కోలుకోని ముంపు గ్రామాలు! సాక్షి, మహబూబాబాద్/అనంతగిరి (కోదాడ): సూర్యాపేట, మానుకోట జిల్లాల్లోని ముంపు గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వరద కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లో 45 చెరువులు తెగిపోయాయి, మరో 35 చెరువులు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారమే.. చెరువులు, కుంటల కింద 27,639 ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు నిండిపోయాయి.మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ఖమ్మం వెళ్లేందుకు సీరోలు మండలం ముల్కలపల్లి వద్ద నిర్మించిన బ్రిడ్జి భారీ వరదకు కూలిపోయింది. దానితో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వరద బీభత్సంతో చిన్నగూడూరు, ఎల్లంపేట, పురుషోత్తమాయగూడెం, తానంచెర్ల, ఉల్లెపల్లి తదితర చోట్ల పైపులైన్లు తెగిపోవడం, పగిలిపోవడం వంటి జరగడంతో.. గత ఐదు రోజులుగా 45 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురం, గోండ్రియాలలో ముంపు బాధితులు తమకు నిత్యావసరాలు, తాగునీరు అందడం లేదని వాపోతున్నారు. -
నీట మునిగిన షాజహాన్పూర్.. తొమ్మిదిమంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ నీట మునిగింది. నగరంలోని 20కి పైగా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సమీప గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల మంది వరద బారిన పడ్డారు. బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డిఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద నీటిలో కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. లఖింపూర్ ఖేరీలో ఐదుగురు, బరేలీలో ఇద్దరు, పిలిభిత్లో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. బదౌన్లో మోపెడ్తో సహా ఒక యువకుడు నీటి మునిగాడు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆహారం లేక అలమటిస్తున్నారు.ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న గర్రా, ఖన్నాత్ నదులలోని నీరు షాజహాన్పూర్లోకి ప్రవేశించింది. ఈ నగరం ఈ రెండు నదుల మధ్య ఉంది. స్థానిక మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు.. రెండు వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా రానున్న మూడు, నాలుగు రోజుల పాటు యూపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం లఖింపూర్ ఖేరీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బరేలీ, పిలిభిత్, షాజహాన్పూర్లలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సమాచారం. -
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కు చెందిన హవల్దార్ సుభాన్ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్పోర్ట్లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్ఖాన్కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్కు చేరుకుంది. సుభాన్ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్ఖాన్కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్గా మారింది. -
ఏప్రిల్లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని రామానుజ్గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్గంజ్వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్లైన్స్ నడుపుతోంది. -
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
-
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
-
వైరల్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు వారు ఈ మాట ఊరికనే చెప్పలేదని అనిపిస్తుంది. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల మనసును దోచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఏముందంటే.. నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారి.. బాల్ను నీళ్లలో పడవేసుకుంటారు. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేస్తుంది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసం అయింది కాబట్టే చాలా మంది తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. కొంత మంది మాత్రం కుక్కను కూడా తమలో ఒక్కరిగా చూస్తారు. -
విహార యాత్రలో విషాదం..
సాక్షి, రాజమండ్రి : ఆహ్లాదకరమైన చల్లని వాతావారణంలో సేదతీరడానికి ఏజెన్సీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఇద్దరు స్నేహితులను మృత్యువు కాటేసింది. ఆ యువకుల కుటుంబంలో పెనువిషాదాన్ని మిగిల్చింది. మారేడుమల్లి మండలం పాములేరు గ్రామం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకవరం మండలానికి చెందిన ముగ్గురు స్నేహితులు ద్విచక్ర వాహనంపై పాములేరు గ్రామానికి వచ్చారు. అప్పటి వరకు ప్రకృతిలో అనందంగా గడిపిన వారు మధ్యాహ్నం భోజనాలు చేసి ముగ్గురు యువకుల్లో జుత్తుక నరేష్(24), గేదెల సీతారామ్(22) అనే ఇద్దరు యువకులు వాగులోకి స్నానానికి దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఆ సమయంలో ఒడ్డుపైన ఉన్న మరో యువకుడు బంటిమిల్లి నాగబాబు తన స్నేహితులు ఇంకా వాగులోంచి పైకి రాకపోవడంతో ప్రమాదాన్ని గమనించి మారేడుమిల్లి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాజు, గొర్లె సతీష్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తుల సహాయంతో వాగులో మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులకు సమాచారం అందించారు. మృతులు జుత్తుక నరేష్ది గోకవరం గ్రామం. ఇతడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గేదెల సీతారామ్ది గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం ఇతడు ఇంటర్ పూర్తిచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం ఏఎప్పీ రాహుల్ దేవ్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో వాగులో మునిగి పలువురు మృతి పాములేరు వాగులో స్నానానికి దిగి అనేక మంది మృతి చెందారు. చాలా వరకు ఇక్కడి వచ్చే వారిలో ఎక్కవగా మద్యం సేవించేవారే. అక్కడ ఉండే గ్రామస్తులు, సిబ్బంది వాగులో స్నానాలకు దిగవద్దని చెప్పినా మద్యం మత్తులో లెక్క చేయకుండా వాగులోకి దిగి ప్రాణలు కోల్పోయే వారే అధికం. మరోవైపు అటవీశాఖ అధికారులు వాగులో స్నానాలు చేయడం, దిగడం నిషేధమని ప్రమాదాల ఫొటోలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
బహూదా నదిలో స్నానికి వెళ్లి నలుగురు మహిళలు మృతి
-
రన్వే నుంచి నదిలోకి..
జాక్సన్విల్లే: అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. క్యూబా దేశం నుంచి అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాకు 143 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఓ చార్టర్ విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయి వేగంతో దూసుకెళ్తూ రన్వే నుంచి అదుపుతప్పి ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్యూబాలోని గ్వాంటనమో బే నావల్ స్టేషన్ నుంచి బయల్దేరిన బోయింగ్–737 విమానం అమెరికాలోని జాక్సన్విల్లే నావల్ స్టేషన్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినపుడు విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్వల్పగాయాలైన 21 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ విమానంపై మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ లోగో ఉన్న ఫొటోను అధికారులు పోస్ట్ చేశారు. అయితే దీనిపై మియామీ స్పందించలేదు. ‘ఇది నిజంగా ఒక అద్భుతం. నదిలో నుంచి విమానాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని ఎన్ఏఎస్ జాక్సన్విల్లే కమాండింగ్ అధికారి కెప్టెన్ మేఖేల్ కాన్నర్ అన్నారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. -
విసిరేసిన రాళ్లు
చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు. ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది. -
ప్రయాణికురాలికి, డ్రైవర్కి మధ్య గొడవ..15 మంది మృతి
-
వివాదం సృష్టించిన ప్రమాదం.. 15 మంది మృతి
బీజింగ్ : డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. అధికారులు తెలిపిన దాని ప్రకారం పరధ్యానంగా ఉన్న డ్రైవర్ని ఓ మహిళ తన ఫోన్తో అతని తలపై కొట్టింది. దాంతో డ్రైవర్ స్టీరింగ్ మీద నుంచి చెయ్యి తీసి సదరు మహిళతో గొడవ పడటం ప్రారంభించాడు. దాంతో కంట్రోల్ తప్పిన బస్సు ముందుగా కారును ఢీ కొని.. ఆపై బ్రిడ్జ్ రెయిలింగ్కు గుద్దుకుని దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. -
ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు
-
ఆ పిల్లల ప్రాణాలు అరచేతుల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలోని విశ్వనాథ్ జిల్లా, సూటియా అనే కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు. మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు అందుకు కారణం కాదు. వారంతా బడికి వెళ్లాలంటే ఎప్పుడూ ప్రవహించే ఓ నదిని దాటాలి. దానిపై వంతెనా లేదు. ప్రయాణికులను దాటించే పడవులూ లేవు. అందుకని పిల్లలంతా పెద్ద రాతెండి జబ్బ తట్టలను ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో కూర్చొని నీటి వాలున చేతులతో వాటిని నడిపిస్తూ ఆవలి ఒడ్డుకు వెళుతున్నారు. వస్తున్నారు. పుట్టీలు మునిగినట్లు ఆ రాతెండి తట్టలు పల్టీకొడితే పిల్లల ప్రాణాలు నీటిలో కలసిపోయే ప్రమాదం ఉంది. ఇదివరకు పిల్లలు అరటి బోదెలతోని చిన్న పడవల్లా చేసుకొని వచ్చేవారని, అవి త్వరగా పాడవడం, విరివిగా దొరక్కపోవడం వల్ల ఇప్పుడు వెడల్పుగా ఉండే జబ్బ తట్టలను ఉపయోగిస్తున్నారని అదే పాఠశాలలో పనిచేస్తున్న జే. దాస్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల పిల్లలు నది దాటటంలో పడుతున్న పాట్లను ఏఎన్ఐ అనే వార్తా సంస్థ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పడది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ప్రమోద్ బోర్తాకుర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం పీడబ్ల్యూ రోడ్డు కూడా లేకుండా దీవిలా ఉన్న చోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎందుకు నిర్మించారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను వెంటన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతానని, విద్యార్థుల కోసం పడవ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. -
జల కవచం
ముసలావిడ పేరు వాంగ్. రాజకీయాలు ఆమెకు అర్థం కావు గానీ అక్కడెక్కడో యుద్ధం జరుగుతున్నదని మాత్రం తెలిసింది. జపాన్ వాళ్లొచ్చి తమ దేశం వాళ్లని చంపుతున్నారట. ఎంతమంది చైనీస్లనిలా చంపుతారు వాళ్లు? తనదాకా రాలేదు. తన కళ్ల ముందర ఎవరూ ఎవర్నీ చంపలేదు. ఎల్లో రివర్ ఒడ్డున వున్నదా వూరు. వాంగ్ పూర్వీకులంతా అక్కడే పుట్టి పెరిగారు. జపాన్ వాళ్లెలా ఉంటారో అక్కడి వాళ్లకు తెలియదు. వర్షాకాలం. పొద్దు గుంకుతున్నది. నది పొంగి ఊరిని ముంచెయ్యకుండా ఉండటానికి నిర్మించిన కట్ట ఎక్కి నీటి పొంగు ఎలా ఉందో పరిశీలించింది వాంగ్. జపాన్ వాళ్ల సంగతేమో గానీ నది పొంగితే మాత్రం అపాయం తప్పదు. వందల వేల పాములు మెలికలు తిరుగుతున్నట్టుగా నీళ్లలో మెరుస్తున్న అలలు. ‘‘నీటిమట్టం బాగా పెరిగిందిరో’’ అంటూ హెచ్చరించింది. ‘‘పాడు నది. ఈ ఊరికి పట్టిన దయ్యం ఇది’’ అన్నాడు ఆమె మనవడు. వాడి పేరు లిటిల్పిగ్. ‘‘జాగ్రత్త. జలదేవత వింటుంది.’’ కట్టమీద కూర్చున్నవాళ్లంతా జపాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘‘వాళ్లెలా ఉంటారసలూ? చూస్తే ఎలా గుర్తు పట్టడం?’’ ‘‘పరదేశం వాళ్లను పోల్చుకోవడం కష్టం కాదులే. బాగా పొడుగ్గా ఉంటారు. ఒంటి రంగు కూడా తేడా ఉంటుంది. పైగా వాళ్లవి చేపకళ్లు. మన మాదిరిగా లేనివాళ్లంతా జపానువాళ్లే’’. ఆ ఊళ్లో అందరికన్నా ముసల్ది ఆవిడే. అందువల్ల ఆమె మాటకు తిరుగులేదు. ‘‘వాళ్లు విమానాల్లో దాక్కుంటారు తాతమ్మా. మనకు కనిపించరు.’’ అన్నాడు మనవడు. ‘‘జపనీస్ అనేవాళ్లు అసలు వుండరురా’’ అంటూ తీర్మానించింది వాంగ్. అందరూ గొల్లున నవ్వారు. అది చిన్న ఊరు. ముప్ఫై యిళ్లకు మించి ఉండవు. ఇంతదూరం ఎందుకు వస్తారు జపాన్వాళ్లు? ఎంతచెడ్డా, వాళ్లూ మనుషులే. ఆమె జీవితంలోని ఎన్నో ముఖ్య సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిందీ డైక్. పదిహేనేళ్లప్పుడు నవవధువుగా ఉన్నప్పుడు భర్త పిలిస్తే ఇక్కడికి వచ్చింది. కొన్నాళ్లకే అతడు ప్రమాదవశాత్తూ ఈ నీళ్లలో పడి మరణించాడు. బుద్ధిస్ట్ నరకం నుండి భర్తను రక్షించడానికి ఎన్ని సంవత్సరాలపాటు పూజలు చేయించిందో! ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. ఇంకా పిల్లాణ్ని పెంచాలి. భూమి సాగు చెయ్యాలి. ఖర్చులు పెరిగిపోయాయి. ‘‘మరో పది వెండి బిళ్లలు కావాలి!’’ అంటూ డిమాండ్ చేశాడు పూజారి. ‘‘ఇంకెన్నాళ్లీ పూజలు?’’ ‘‘నీ భర్త కుడిచెయ్యి యింకా నరకంలోనే చిక్కుకుని ఉన్నది’’ అన్నాడు. ‘‘చెయ్యే గదా! లాక్కోగలడులే. నాకాయన సంగతి బాగా తెలుసు’’ అంది వాంగ్. ఇన్నేళ్లు గడిచినా ఇంకా అనుమానం తీరలేదు. నిజంగా లాక్కున్నాడో లేదో. మనవడి పెళ్లాం నీళ్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాతైనా డబ్బులు జమచేసి ఆయన్ను విడిపించాలి. నదిని చూస్తే చాలు.. వాంగ్కు ఆలోచనలు పొంగి పొర్లుతాయి. తన భర్తను కబళించిన రాక్షసి! ఆ రోజు కట్టకు గండి పడ్డది. అతడు మరమ్మతు చెయ్యటానికెళ్లాడు. తను వారిస్తూనే ఉంది. అంతలోనే నీటి మట్టం పెరిగింది. కాలు జారింది. కళ్లముందరే కొట్టుకుపోయాడు. తమకు జీవన్మరణాల మధ్య సరిహద్దు రేఖ ఈ కట్ట. ఆ ఊరివాళ్లు తరతరాలుగా నదిని తిట్టుకుంటూ, అడ్డుగోడకు మరమ్మతులు చేస్తూ గడుపుతారే తప్ప, తమ నివాసాల్ని ప్రమాదస్థలానికి మరికాస్త దూరంలో కట్టుకోవాలని మాత్రం తట్టలేదు. అది వాళ్ల అమాయకత్వానికి పరాకాష్ట. నీటి అలల మీద వెన్నెల పరుచుకుంది. ‘‘తాతమ్మా! విమానాలు వస్తాయిలాంటప్పుడు’’ అన్నాడు మనవడు. ‘‘అశుభం పలక్కు. ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు!’’ అంటూ కట్ట దిగింది వాంగ్. ఆమె వెంట ఊరి జనమూ బయల్దేరారు. రాత్రి పక్కలో వాలిందన్న మాటేగానీ ఆలోచనలన్నీ జపాన్ వాళ్ల గురించే. వాళ్లెలా ఉంటారు? ఎందుకొచ్చారట? ఏం చేస్తారు? తమ గ్రామం గురించి వాళ్లకు తెలుసా? రాక్షసుల్లాంటి వికృతాకారాలను కొన్ని వూహించుకుని బహుశా ఇలాగే ఉంటారు కాబోలు అనుకుంది. అర్ధరాత్రి దాటింది. ‘‘వచ్చారు.. వచ్చారు..’’ అంటూ కేకేసింది మనవడి పెళ్లాం. ‘‘ఎక్కడ?’’ ‘‘అదిగో, ఆకాశంలో!’’ నిజమే. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కాని పక్షులు. ‘‘ఏమిటవి?’’ జవాబుగా, అల్లంత దూరాన, పొలంలో వెండి గుడ్డులాంటిది జారిపడింది. మట్టి ఆకాశమంతెత్తు ఎగిసింది. అందరూ ఈ వింత చూడటానికి పరిగెత్తారు. ముప్ఫై అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. అంతలోనే మరొకటీ, మరొకటీ. జనమంతా చెల్లాచెదురుగా పరిగెత్తారు. ‘అంతా’ అంటే వాంగ్ తప్ప మిగతా వాళ్లందరూ అని అర్థం. మనవడూ, మనవరాలూ చెయ్యి పట్టుకుని లాగారు. కానీ విడిపించుకుని కట్ట పక్కనే కూలబడిపోయింది ఆవిడ. ‘‘నేను పరిగెత్తలేనురా. డెబ్భై ఏళ్లుగా పరిగెత్తలేదు. మా పాదాలను కట్టేశారు గదా. ఈ కాళ్లతో పరిగెత్తలేను. మీరిద్దరూ వెళ్లండి. చిన్నపిల్ల జాగ్రత్త. ఒట్టి మనిషి కూడా కాదు’’ అంటూ వెనక్కు వాలింది వాంగ్. ‘‘తాతమ్మా! నువ్వు రాకపోతే నేనూ వెళ్లను’’ అంటూ మొండికేసింది పిల్ల. ‘‘పోవే మూర్ఖురాలా. నీ మొగుడు చస్తే, వంశాంకురం ఉండటానికన్నా, నీ ప్రసవం క్షేమంగా జరగాలి. వెళ్లు’’ అంటూ చేతికర్రతో తోసింది వాంగ్. పైన విమానాల రొద పెరిగింది. అందరూ ఏదో అరుస్తున్నారు గానీ ఒకరి మాటలొకరికి వినిపించడం లేదు. మరికొన్ని విమానాలు వచ్చి మొదట వచ్చిన వాటిని ఎదిరించాయి. ఆకాశంలో యుద్ధం! పెంకుటిళ్లు, పూరిపాకలు ఒక్కొక్కటే నేల మట్టమవుతున్నాయి. ఎటు చూసినా మొండి గోడలు తప్ప మరేమీ కనిపించడం లేదు. తన ఇల్లేమైంది? పొగ వ్యాపించింది. మంటలు. యుద్ధమంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను, చెమటోడ్చి పండించిన పంటలను ఎవరైనా ఎందుకు నాశనం చెయ్యాలి? మరికాసేపట్లో, నిన్నగాక మొన్న మనవడు దుక్కి దున్నిన సోయాబీన్ పొలంలో రెక్క తెగిన పక్షిలా ఏదో కూలింది. మొదట భయమేసింది. కానీ, ఈ వయసులో తను దేనికి భయపడాలి? ఏం జరిగినా ఫరవాలేదు. కర్ర సాయంతో నెమ్మదిగా నడిచింది.విమానం చుట్టూ చేరి మొరుగుతున్నాయి కుక్కలు. ఇదికాక, ఇంజిన్ రొద కొంత. ‘ఉస్స్!’ అంటూ అదిలించింది కర్రతో. తెల్లగా మెరుస్తున్న రెక్కలు. ‘ఇదంతా వెండి కాబోలు’ అనుకుంది వాంగ్. విమానం లోపల కుర్రాడెవరో కూర్చున్నాడు. అంతెత్తునుంచి పడటంతో సీటులో ముందుకు వాలి పడిపోయాడు. ‘‘లే.. లే..’’ అంటూ పలకరించింది. బతికాడో, చచ్చాడో! చైనా వాడిలా లేడు. చర్మం అదో రంగులో ఉంది. ‘దక్షిణ దేశం వాడైవుంటాడు’. ‘‘బైటికిరా కట్టు కడతాను’’ అంది. వాడేదో గొణిగాడు గానీ అర్థం కాలేదు. తనే, అతి ప్రయత్నం మీద బయటికి లాగింది. నేలమీద పడబోయి, నిలదొక్కుకున్నాడు ఆ యువకుడు. ‘‘మా ఇంటిదాకా నడిస్తే, అక్కడేమైనా చికిత్స చేస్తాను’’ అంది. కుక్కలు మొరుగుతూ మీదికి లంఘించాయి. వాడు భయపడి ఆమెను వాటేసుకున్నాడు. కర్రతో కుక్కల్ని విదిలించింది వాంగ్ – ‘‘ష్! పొండే. కుర్రాణ్ని చంపుతారా ఏంటి?’’ నడవలేని మనిషిని, వీపున వేసుకుని ఈడ్చుకుంటూ, కూలిన, ఇళ్ల శిథిలాల గుండా నడిచింది. ఇంటికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం. కానీ ఇల్లు మిగల్లేదు. కట్ట గేటుకి ఎదురుగా ఉంటుంది తన ఇల్లు. మళ్లీ కట్టుకోవాల్సిందే. గోడకు వాలి కూర్చున్నాడు కుర్రాడు. నీళ్లు కావాలని సైగ చేశాడు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఒక్క మాటా అర్థం కాలేదు. పగిలిన కుండ పెంకులో నది నీళ్లు పట్టించింది వాంగ్. గాయాలు కడిగి తన గౌను చింపి కట్టుకట్టింది. కుర్రాడికి బాధతో కళ్లు మూసుకుపోతున్నట్టున్నాయి. ‘‘ఆకలిగా ఉందా! ఏదన్నా ఉందేమో చూస్తాను’’ నాలుగిళ్లావల, రొట్టెలు చేసే బేకరీ ఒకటి ఉంది. ఇప్పుడక్కడ బేకరీ మిగల్లేదు గానీ దుమ్ము కొట్టుకుపోయిన రొట్టె ముక్కయినా దొరక్కపోతుందా! చాలాసేపు వెతికింది. చివరికి, కూలిన గోడల మధ్య ఇంకా వేడి వేడిగా ఉన్న బ్రెడ్ రోల్ చేతికి తగిలింది. ఆహారం కనిపించగానే ఆకలి జ్ఞాపకం వచ్చింది. ముందర, తను కాసింత తిని, కుర్రాడికికూడా పెట్టొచ్చనుకుంది. అంతలో, అరుపులు వినిపించాయి. ‘‘జపనీస్!’’ అంటూ పరిగెత్తుకొచ్చారు సైనికులు. ‘‘జపనీస్ ఎవరు?’’ ‘‘వీడే’’ ‘‘వీడు జపనీసా? మన పోలికలూ ఉన్నాయే’’ ‘‘వీడు జపనీస్’’ అన్నాడొక సైనికుడు కోపంగా. ‘‘సర్లే. ఆకాశం నుండి ఊడిపడ్డాడు. నన్నేం చెయ్యమంటావు?’’ అంది వాంగ్. ‘‘ఆ బ్రెడ్డిటివ్వు’’ ‘‘మీరు తినండి. వాడికీ ఓ ముక్క ఇవ్వండి’’ ‘‘జపనీస్కు మన రొట్టె ఇవ్వాలా?’’ ‘‘ఏం? వాడికి మాత్రం ఆకలి ఉండదా?’’ తనవాళ్లే అయినా, చైనీస్ సైనికులు ఇలా ఉంటారని అనుకోలేదు వాంగ్. కానీ, ఎవర్నెందుకు తప్పుపట్టడం! సైనికులంతా ఒకటే. ‘‘మాది ప్రశాంత జీవితం. నా ఎరుకలో, ఈ ఊరికి సైనికులు రాలేదు. మీరూ రావొద్దు. వెళ్లిపోండి’’ ‘‘నిజమే. చాలా ప్రశాంతంగా ఉందిప్పుడూ. సమాధిలాగ. ఈ వూరినలా చేసిందెవరో తెలుసా మామ్మా? ఈ జపనీస్గాళ్లే!’’ ‘‘కానీ, ఎందుకు వాళ్లిలా చేస్తున్నారు?’’ ‘‘మన దేశం, మన భూమి వాళ్లక్కావాలట!’’ ‘‘మన భూమి వాళ్లకెందుకిస్తాం?’’‘‘ఎప్పటికీ ఇవ్వం!’’ అంటూ అరిచాడొక సైనికుడు. ఏదో గొడవ జరుగుతూనే ఉందిగానీ, అందరూ తూర్పు వైపు పరిశీలనగా చూస్తున్నారు. ‘‘అటుకేసి ఎందుకు చూస్తున్నారు?’’ ‘‘జపాన్గాళ్లు అటునుండే వస్తున్నారు’’ ‘‘మరేం చెయ్యాలి? మీరు పారిపోతారా?’’ ‘‘మేం కొద్దిమందిమే ఉన్నాం. సావోఆన్ గ్రామం రక్షణ బాధ్యత మాకప్పగించారు’’ ‘‘ఆ ఊరు నాకు బాగా తెలుసు. టీ కొట్టు యజమాని పావో ఎలా ఉన్నాడు? వాడు నా తమ్ముడు’’ ‘‘ఎవరూ మిగల్లేదా వూళ్లో. అందర్నీ చంపేశారు జపనీస్. విదేశీ ట్యాంకులు, విదేశీ తుపాకులతో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’’ హతాశురాలైంది వాంగ్. తన వంశంలో ఇంకెవరూ మిగల్లేదన్నమాట. జపనీస్ మరోసారి దాడికి పాల్పడవచ్చని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ‘‘ఇంతకూ, వీడు బతికున్నాడా, చచ్చాడా?’’ అంటూ ఒక సైనికుడు కత్తి తీసి గాయపడిన పైలట్ను రెండు మూడు సార్లు పొడిచాడు. వ్యూహంలో భాగంగా, సైనికులంతా వెళ్లి దూరంగా ఎక్కడో నక్కారు. ‘‘వీడు జపాన్వాడా? ఎంత ఆశ్చర్యం!’’ అనుకొని విస్తుపోయింది వాంగ్. పైలట్ శవం నేలకొరిగింది. వంశం కొనసాగాలంటే మనవడూ, వాడి పెళ్లాం క్షేమంగా వుండాలి. ఇద్దరూ ఎటువైపు పారిపోయారో! కనిపిస్తారేమోనని కట్ట ఎక్కి చూసింది. గంట సేపట్లో నీటి మట్టం బాగా పెరిగినట్టుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరు మునిగిపోతుంది. ‘పాపిష్టి దయ్యం’ అంటూ తిట్టుకుంది. ‘నది విననీ. ఇంకేం జరిగినా బాధ లేదు. జపాన్ వాళ్లు నాశనం చేసిన ఊరును నది తన కడుపున దాచుకుంటుందా!’. మొహం, కాళ్లూ, చేతులూ కడుక్కుంది. చుట్టూ చూసింది. సైనికులు పడుతూ, లేస్తూ పరిగెత్తుతున్నారు. నిర్మానుష్యంగా ఊరు, తన మనవడూ, మనవరాలూ ఎక్కడో తన కోసం నిరీక్షిస్తూనే ఉండి ఉంటారు. కట్ట దిగుదామనుకుంటున్నప్పుడు, తూర్పున, దూరంగా, ఏదో కదలిక కనిపించింది. మొదట ధూళి మేఘంలాగ. పరికించి చూస్తే ఏవో చుక్కలు. మెరుస్తున్న చుక్కలు. అర్థమైంది. పోల్చుకోగలిగింది. మనుషులు. ఒకరూ యిద్దరూ కాదు. పదాతిదళం కదలి వస్తున్నది. ‘‘జపనీస్’’ అనుకున్నది వాంగ్. వాళ్లకు రక్షణగా, పైన షీల్డ్ చేస్తూ యుద్ధ విమానాలు టార్గెట్ చూసుకుని బాంబులు విడుస్తాయి. ‘‘ఎవరు కావాలి మీకు? ఇంకా ఏం మిగిలిందని ఈ ఊళ్లో? నేను, నా మనవడూ, మనవరాలు తప్ప. మా తమ్ముణ్ని చంపేశారు!’’ మంచి టీ చేసే పావో మరణించాడు. అతడి భార్య, ఏడుగురు పిల్లలు జపాన్ సైనికుల తూటాలకు బలైపోయారు.’’ కట్ట ఎక్కి నిల్చున్నది. తను వాళ్లకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది. దిగుతున్నప్పుడు కట్ట గేటు జ్ఞాపకం వచ్చింది. ఈ నది తమకు శాపం. తమను ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో! గేట్ తెరవడం వచ్చు తనకు, అంటే పంట కాల్వల కోసం కాదు. ఒకేసారి, మొత్తం గేట్ ఎత్తేస్తే ఏమవుతుందో కూడా బాగానే తెలుసు. తెరచి తను కొట్టుకుపోకుండా తప్పించుకోవడం సాధ్యమా? ‘కాటికి కాలు జాచుకున్న ముసల్దాన్ని. ఎందుకింత భయం!’ అనుకుంది. మనవడికి పుట్టబోయే పిల్ల ఎలాగుంటుందో చూడలేదన్న బెంగ ఒక్కటే మిగిలింది. కానీ, జీవితంలో అనుకున్నవన్నీ ఎప్పుడూ జరగవు. ఇంతవరకూ చూసింది చాలు. మరొక్కసారి తూర్పుకు దృష్టి సారించింది. జపాన్ సైనికులు ముందుకు కదులుతున్నారు. వందలో, వేలో.. గేట్ తెరిస్తే వరద ఉప్పెనలాగా పొలాలను, శిథిలాలుగా మిగిలిన ఇళ్లను ముంచెత్తి ఆకలిగొన్న డ్రాగన్లాగా ముందుకురుకుతుంది. మనవడూ, మనవరాలూ ఊరు దాటి మరెక్కడో క్షేమంగా తలదాచుకునే ఉంటారు. శత్రు సైన్యంతో యుద్ధం చెయ్యడానికి అనేక పద్ధతులున్నాయి. కొందరు విమానాలు వాడతారు. కొందరు తుపాకులు, నది నా ఆయుధం. లాకులు తెరవడం కాస్త కష్టమే. అయితేనేం, ఈ ఒక్క పని చెయ్యగలిగితే చాలు. ఈ జీవితానికి పరిసమాప్తి. గేట్ లీవర్ పట్టి లాగింది. ‘‘చేసేది పాపమా? అయితేనేం, నరకానికే పోతాను. చెయ్యి చిక్కుకున్న నా మొగుడింకా అక్కడే ఉన్నాడు. అక్కడైనా కలిసి బతుకుతాం’’ మరుక్షణం... కనుచూపు మేర కప్పేసింది జలప్రళయం. కిందా, మీదా, నలువేపులా నీరు. వాంగ్ ఏదో అనబోయింది. ఊపిరి తీసుకోబోయింది. కానీ ఎంతసేపు? అంతా లిప్తపాటులో ముగిసింది. శత్రు సేనలకు అది జలసమాధి. ఆంగ్లమూలం : పెర్ల్ ఎస్. బక్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
స్నేహితుల మాట విని సాహసం
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు. దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
భారీ వర్షాలతో ఏపీలో పోంగుతున్న వాగులు, నదులు
-
ఏరు దాటిన పెండ్లికూతురు
చెన్నై / సేలం: ముంచుకొస్తున్న పెండ్లి ముహూర్తం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. కుటుంబీకులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి శుక్రవారం సాహసంతో పెండ్లికూతురిని ఏరు దాటించారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలో భవనీ సాగర్ పరిధిలోని అడవి ప్రాంతంలో డెంగుమరడ కొండ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి మాయారు (ఏరు) దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మాయారు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాయారును దాటవద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి. ఇతని భార్య సెల్వి. వీరి కుమార్తె రాసాత్తి (24). బీఏ డిగ్రీ పట్టభద్రురాలు. ఈమెకు కోవై జిల్లా ఆలంకొంబు ప్రాంతానికి చెందిన రంజిత్కుమార్తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఈ నెల 20వ తేదీ ఆలంకొంబులో జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి రెండు రోజులే ఉండడంతో మాయారును ఎలా దాటి వెళ్లాలా, పెండ్లి జరుగుతుందా అనే సందేహాలతో రాసాత్తి కుటుంబీకులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వారికి ధైర్యం చెప్పి, గ్రామస్తుల సాయంతో పెండ్లి కూతురు రాస్తాతితో పాటు 15 మంది కుటుంబ సభ్యులను శుక్రవారం బుట్ట పడవలో ఏరు దాటించారు. తర్వాత వారు భవానీసాగర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాసాత్తి మాట్లాడుతూ మాయారులో వరద ఉధృతి చూసి నా పెళ్లి ఆగిపోయినట్లే అనుకున్నాను. అధికారులు ధైర్యం చెప్పి సాహసంతో ఏరు దాటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో మాయారు దాటి వెళ్లడానికి వంతెన ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలని రాసాత్తి కోరింది. -
రూ.200 కోసం చెత్త ఆలోచన!
-
రూ.200 కోసం!
మన కారో.. బైకో నెలకోసారైనా వాటర్ సర్వీసింగ్కు ఇస్తుంటాం. అయితే ఆ డబ్బులు ఎందుకు వృథా చేయడం అనుకున్నవారు ఏం చేస్తారు. ఇంట్లోనే బకెట్లో నీరు తీసుకుని ఎంచక్కా పొద్దున్నే శుభ్రం చేసుకుంటారు. అయితే ఓ చైనీయుడు మాత్రం రూ.200ను ఆదా చేసుకునేందుకు ఓ చెత్త ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన ల్యాండ్రోవర్ ఎస్యూవీని కడుక్కోవాలనుకున్నాడు. అయితే అందుకు రూ.200 ఖర్చు అవుతుందని వెనుకడుగు వేశాడు. అంతేకాదు ఎంచక్కా తనే శుభ్రం చేయాలని భావించాడు. అదేదో తన ఇంటిలోనే కడిగితే ఇది వార్తే కాదు. ఇంతకీ అతడేం చేశాడంటే.. దగ్గర్లో ఉన్న నదిలో కారును శుభ్రం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవు అక్కడికి వెళ్లి ఒడ్డుకు దగ్గరగా తక్కువ ప్రవాహం ఉన్న ప్రాంతంలోకి కారును దింపి.. శుభ్రం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడే పక్కనే ఉన్న డ్యాం నుంచి గేట్లు తెరిచారు. దీంతో ఆ కారున్న చోటికి నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే మనోడు పక్కనే ఉన్న ఓ బండరాయిపైకి చేరుకున్నాడు. కానీ వెళ్లిపోతున్న కారును తీసుకురాలేకపోయాడు. వెంటనే అక్కడున్న జనం ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పాపం రూ.200ల కోసం చూసుకుంటే దాదాపు 50 లక్షల కారును పోగొట్టుకునే వాడు పాపం! -
వారధి.. వర్ష విధ్వంసం
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సోమవారం సాయంత్రం మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య ఫాల్గుని నదిపై కూలిపోయిన మాలూరుపట్న పాతవంతెన. అదృష్టవశాత్తు ప్రాణాపాయం జరగలేదని అధికారులు చెబుతున్నారు. సాక్షి, బెంగళూరు: దక్షిణ కన్నడ జిల్లాలోని మాలూరుపట్న వద్ద ఫాల్గుని నదిపై ఉన్న పాత వంతెన వర్షాలకు సోమవారం సాయంత్రం కూలిపోయింది. దీంతో మంగళూరు తాలూకా– బంట్వాళ మధ్య రాకపోకలు స్తంభించాయి. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వంతెన నిర్మించారు. గత కొన్ని వారాలుగా దక్షిణ కన్నడ జిల్లాతో పాటు కరావళి ప్రాంతాన్ని వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాల ధాటికి తడిసి ముద్దయిన వంతెనలో కొంతభాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు వంతెనకు ఇరువైపులా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆ వంతెనను మూసివేశారు. ఇసుక తవ్వకాలతో నష్టం మాలూరుపట్న ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకాల ఫలితంగా వంతెన పిల్లర్లు దెబ్బతిన్నాయి. కాగా ఇటీవల ఇసుక తవ్వకాలను నిషేధించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంతెన కూలడంతో కుప్పెడవు, కైకాంబ, ఇరువేల్, ఇడపడవు, గంజిమట్, సురత్కాల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
బవనాసి.. ప్రాణం తీసి!
ఆత్మకూరురూరల్: సప్తనదీ సంగమంలో కలిసే నదుల్లో ఒకటైన పరమపావన బవనాసి నది ఇద్దరు బాలుర ప్రాణాలు బలి తీసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రంజాన్ మాసం, వేసవి సెలవులు నేపథ్యంలో బండిఆత్మకూరు మండలం ఏ కోడూరుకు చెందిన ముర్తుజావలి తన కుమారుడు యూనిస్(13)ను శ్రీపతిరావుపేటలో ఉండే తన మామ వన్నూర్సాబ్ ఇంటికి పంపాడు. గ్రామంలో వన్నూర్సాబ్ ఇంటికి ఎదురుగా ఉండే ముర్తుజా కుమారుడు నబీరసూల్(14)తో యూనిస్కు స్నేహం కుదిరింది. దీంతో ఇద్దరూ కలిసి ఆడుకునేవారు. మంగళవారం ఉదయం నబీరసూల్ తాత దస్తగిరి పశువులకు మేత కోసం తన పొలం వైపు వెళుతుంటే స్నేహితులిద్దరూ వెళ్లారు. అక్కడ పొలంలో కాసేపు తాతతో కలిసి గడ్డి కోసిన వారు గడ్డి కోసం సమీపంలోని బవనాసి నది ఒడ్డుకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో దస్తగిరి చుట్టుపక్కల వారితో కలిసి పిల్లల కోసం వెతికారు. ఓ చోట వాగు గట్టున పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి వాగులో గాలించగా ఇద్దరి మృతదేహాలు బురదలో చిక్కుకుపోయినట్లు గుర్తించి బయటకు తీశారు. ఆత్మకూరు ఎస్ఐ రమేష్కుమార్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నబీరసూలు సోదరి వివాహ శుభలేఖల పంపిణీలో నిమగ్నమైన ముర్తుజా కుటుంబసభ్యులకు సమాచారం తెలియడంతో బోరున విలపించారు. అలాగే సెలవులకని వెళ్లిన కుమారుడు ఇక లేడని తెలుసుకున్న యూనిస్ తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
కన్నీరే మిగిలి‘నది’
అమ్మా లేమ్మా.. నాన్నా.. చెల్లిని, అమ్మను పైకి లేవమని చెప్పు.. తాతయ్యా.. చెల్లి నాతో ఆడుకోవడానికి రావడం లేదు.. నువ్వయినా పిలువు.. మామయ్య వాళ్ల ఇంటికి వెళదాం.. అంటూ ఆ చిట్టి తల్లి మారం చేస్తుంటే.. ప్రతి గుండె కన్నీటితో ద్రవించింది. చిన్నారి ఎదురుగా పడి ఉన్న తల్లి, చెల్లి.. ఇక రారని చెప్పడానికి గొంతు పెగలక కృష్ణమ్మ మౌనంగా కదిలిపోయింది. తననే నమ్ముకున్న జీవితాలు తన ఒడిలోనే తెల్లారిపోతుంటే.. గుండె పగిలేలా రోదించింది. శనివారం తుళ్లూరు మండలంలో బోరుపాలెం వద్ద పడవ ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడ్డారు. కృష్ణమ్మ ఒడిలో మృత్యుకేక వినిపించింది. నదినే నమ్ముకున్న వారి జీవితం నీటిలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం వేటకొచ్చి నదిలో వలవేస్తే మృత్యువు అందులోకి లాగేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య మాధవి(26), చిన్నకూతరు కావ్య(3)తో కలసి రాయపూడి ఇసుక రీచ్ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్ద వేటకు వచ్చాడు. చీకటి పడటంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న పడవ వేగంగా వచ్చి వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. భార్య, బిడ్డ నీటిలో మునిగిపోయారు. గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తుళ్ళూరు రూరల్ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. వేసవి సెలవులు కావడంతో పెద్ద కూతురు జ్యోతిని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద వదిలి పెట్టాడు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు బోరుపాలెం సమీపంలో రాయపూడి ఇసుక రీచ్ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్దకు వేటకని బయలుదేరాడు. చిన్న కూతురు కావ్యను పక్కింట్లో వదిలి వెళదామని భార్యాభర్తలు సైదారావు, మాధవి అనుకున్నారు. కావ్య తానూ వస్తానని మారం చేయడం, పిల్లలను పట్టుకెళుతున్నారనే వందతులు రావడంతో తమ వెంట తీసుకెళ్లారు. నదిలో వలవేసి పడవలోనే కాపలా కాస్తుండగా తెల్లవారుజాము కావడంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో రాయపూడి రేవు నుంచి ఇసుక నింపుకునేందుకు నదిలోకి పడవ అటుగా వచ్చింది. పడవ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. కావ్య(3), మా«ధవి(26) నీటిలో మునిగిపోయారు. సైదారావు నీటిలో భార్య, బిడ్డ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పడవలోని ఈతగాళ్లు సైదారావును ఒడ్డుకు చేర్చారు. పోలీసుల అదుపులోపడవ నిర్వాహకుడు పడవ నిర్వాహకుడు నాగమల్లేశ్వరరావును ఫిషర్మ్యాన్ రాయపూడి సొసైటీ వారు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకరరావు, ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి నాలుగు పడవల ద్వారా నదిలోకి వెళ్లారు. గజ ఈతగాళ్ల సాయంతో తొలుత కావ్య, కొద్దిసేపటికి మాధవి మృతదేహాలను గుర్తించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రెడ్డి రీచ్ను పరిశీలించారు. సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జ్యోతికి అండగా ఉంటాం చిన్నారి జ్యోతి పేరు మీద కొంత ఆర్థిక సాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని రాయపూడి సొసైటీ సభ్యులు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేత కత్తెర సురేష్కుమార్, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సీఐటీయూ రాజధాని ప్రాంత డివిజన్ కార్యదర్శి జొన్నకూటి నవీన్ప్రకాష్ డిమాండ్ చేశారు. రూ.11 లక్షల ఆర్థిక సహాయం విజయవాడ : కృష్ణా నదిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగి చనిపోయిన ఇబ్రహీంపట్నానికి చెందిన తళ్లీకూతుళ్లు మాధవి, కావ్యల కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన బోటు యాజమాన్యం రూ.6 లక్షలు అందజేస్తోందని, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు మృతురాలు మాధవి భర్త సైదురాజుకు ఇస్తామని వెల్లడించారు. -
నదిలోకి దూకిన ప్రేమజంట
సాక్షి, పాశర్లపూడి: పెద్దలు తమ పెళ్లికి నిరాకరించారన్న కారణంతో యువజంట తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామ పరిధిలోని వైనతేయ వారధి పైనుంచి గోదావరి నదిలో దూకి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. జంటలో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం మత్స్యకారుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరం గ్రామానికి చెందిన యెలిశెట్టి నాగశివదుర్గ (21) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. పెదపట్నం గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముత్యాల నాగ సుజిత తొమ్మిదో తరగతి చదువుతోంది. నగరంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన సుజిత పెదపట్నంలోని తన ఇంటి నుంచి సైకిల్పై బయటకొచ్చింది. మోటార్ సైకిల్పై వచ్చిన నాగశివదుర్గ తనను ఎక్కించుకుని పాశర్లపూడి వచ్చి వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. మోటార్ సైకిల్లో సెల్ఫోన్, కొంత నగదు, చాక్లెట్ ప్యాకెట్లు ఉన్నాయి. గమనించిన స్థానికులు మోటార్ సైకిల్లో ఉన్న సెల్ఫోన్ నుంచి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. యువతి తండ్రి నర్సింహమూర్తి, తల్లి కనకదుర్గ, యువకుడి తండ్రి రాము, తల్లి కుమారి, వారి కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని తీవ్రంగా విలపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని మృతదేహం లభ్యమైంది. యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
అమెరికాలో భారతీయ కుటుంబం మృతి!
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో గత వారం గల్లంతైన భారతీయ కుటుంబం మరణించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈల్ నదిలో గాలింపు చర్యలు జరుపుతున్న సహాయక బృందాలు.. కొన్ని వ్యక్తిగత వస్తువులను, వాహనం విడి భాగాలను గుర్తించారు. ఇవి భారతీయ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్నారు. భారత సంతతికి చెందిన సందీప్ తొట్టపల్లి(41) యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారిటా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సందీప్ భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్(12), సాచీ(9)తో కలసి తమ హోండా పైలట్ కారులో రోడ్ ట్రిప్కు బయలుదేరారు. పోర్ట్ లాండ్లోని ఒరేగాన్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్కు వెళుతుండగా ఈ నెల 5న వీరు కనిపించకుండా పోయారు. వీరి వాహనం ఏప్రిల్ 6 న ఉధృతంగా ప్రవహిస్తున్న ఈల్ నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు నదిలో విస్తృతంగా గాలించి హోండా వాహనానికి సంబంధించి కొన్ని విడి భాగాలను, అలాగే వ్యక్తిగత వస్తువులను గుర్తించగలిగామని కాలిఫోర్నియా హైవే పెట్రోల్ సిబ్బంది వెల్లడించారు. -
గుండంలో పడిన భక్తుడిని కాపాడిన కానిస్టేబుల్
యాలాల(తాండూరు): ప్రమాదవశాత్తు ఆలయ కోనేటిలో మునుగుతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ రక్షించిన ఘటన సోమవారం జరిగింది. మండలంలో జుంటుపల్లి సీతారామస్వామి ఆలయ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూరులోని సాయిపూర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు జుంటుపల్లి సీతారామ కల్యాణ ఉత్సవాలకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా కోనేటిలో స్నానమాచరించేందుకు వెళ్లిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు గుండంలో పడి మునిగిపోయాడు. అక్కడే కాపాలాగా ఉన్న తాండూరు పీఎస్కు చెందిన అనిల్ అనే కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై శ్రీకాంత్ను గుండంలోంచి బయటికి లాగాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుడిని రక్షించిన కానిస్టేబుల్ను స్థానికులు అభినందించారు. -
నిబంధనలకు తూట్లు
నిబంధనలకు తూడ్లు పొడిచి ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో గోదావరి నదీగర్భం ప్రమాదకరంగా మారుతోంది. ఈ లోతైన తవ్వకాల వల్ల నదీ ప్రవాహ దిశ మారిపలు గ్రామాల వద్ద లంకలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నదీగర్భంలో రాళ్లతో రోడ్డు నిర్మాణం చేయకూడదని నిబంధనలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.దీంతో గోదావరి ప్రవాహానికి ఆ రోడ్లు అడ్డంకిగా మారుతున్నాయి. పెరవలి: జిల్లాలో గోదావరి నదిలో పోలవరం నుంచి లంకలకోడేరు వరకు సుమారు 13 ఇసుకర్యాంపులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు కేవలం మట్టిని ఉపయోగించి రహదారి ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉన్నా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కాసులకు కక్కుర్తి పడటంతో ఇష్టారాజ్యంగా నదీగర్భంలో రోడ్లను వేస్తున్నారు. మట్టిరోడ్లైతే గోదావరికి వరద వచ్చినప్పుడు మట్టి కరిగిపోయి కొట్టుకుపోతుందని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని ప్రభుత్వం ఈ నిబం ధన పెట్టింది. అయినా నిర్వాహకులు రాళ్లతోనే రహదారులు నిర్మిస్తున్నారు. అలాగే రెండు మీటర్ల లోతు వరకే తవ్వవలసి ఉండగా 4 మీటర్లకు పైగా ఇసుక కోసం గోతులు తవ్వేస్తున్నారు. ఒక యూనిట్ వాహనాలను అనుమతించాల్సి ఉండగా భారీ లారీలు సైతం లోపలికి ప్రవేశిస్తున్నాయి. నిబంధనలు ఇవిగో.. ♦ గోదావరిలో ఇసుక తవ్వకాలకు మైనింగ్ డిపార్టుమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నా యి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాలి. గోదావరిలో ఇసుక మేటలను బట్టి తవ్వకాలు రెండు మీటర్ల నుంచి 3 మీటర్లు మాత్రమే తవ్వకాలు జరపాలి. ♦ ఇసుక మేటలు 6 మీటర్లు ఉంటే 2 మీటర్లు, 8 మీటర్లు ఉంటే 3 మీటర్లు తవ్వవచ్చు. ♦ మనుషులతో తప్ప మెషీన్లు ఉపయోగించకూడదు. ♦ గోదావరిలో నదీ ప్రవాహానికి అడ్డులేకుండా బాట వేసుకోవాలి. అదీ మట్టితోతప్ప రాళ్లతో వేయకూడదు. ♦ ఇసుకను సమాంతరంగా తీయాలి.కానీ గోతులు పెట్టకూడదు. ♦ నదీ గర్భంలోకి కేవలం ట్రాక్టర్లు,ఎడ్లబండ్లు మాత్రమే వెళ్లాలి. వీటి ద్వారా ఒక యూనిట్ మాత్రమే ఇసుకను బయటకు తీసుకురావాలి. ♦ నీరు ఊరిన చోట ఇసుక తవ్వకాలు జరపకూడదు. ♦ నీటి ప్రవాహానికి 20 మీటర్ల దూరంలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి
జార్ఖండ్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్ని ఢీకొట్టి చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సడార్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం డంకా జిల్లాలోని లాగ్లా గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన కారు రోజూ న్యూస్పేపర్లు తీసుకెళ్లే కారుగా గుర్తించారు. కారు బాగల్పూర్ నుంచి డంకా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
రక్తం రంగులోకి మారిన నది
ట్యుమెన్, సైబీరియా, రష్యా : రష్యాలోని ట్యుమెన్ నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలోని నీరు రక్తం రంగుకు మారింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మోల్చంక నది నీటితోనే ట్యుమెన్ వాసుల దాహార్తి తీరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. నది నీటిని పరిశోధించేందుకు వెళ్లిన నిపుణులు సైతం నీరు ఎందుకు రంగు మారిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. నీటి శాంపిల్స్పై నిర్వహించిన టెస్టుల ఫలితాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. రకరకాల రసాయన పదార్థాలు నీటిలో కలవడం వల్లే నది నీరు ఎరుపు రంగులోకి మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
‘హరిద్ర’..ఇక సర్వాంగ సుందరం
వర్గల్(గజ్వేల్) : సహజసిద్ధ కొండ గుహల్లో స్వయంభువుగా శ్రీలక్ష్మీ నారసింహుడు వెలసిన భవ్య క్షేత్రం..తూర్పు దిశలో స్వామి వారి పాదాలు తాకుతూ అర్ధ చంద్రాకృతిలో ఉత్తరం మీదుగా పడమర వైపు పరవళ్లు తొక్కుతూ సాగిపోయే పవిత్ర హరిద్రా నది ప్రవాహం..వెరసి రెండో యాదాద్రిగా భక్తజనాదరణ చూరగొంటున్న వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం. అయితే, ఒకప్పుడు గలగల పారిన హరిద్ర నేడు.. వానలు కరువై, బావులు అంతర్ధానమై, గొట్టపు బావులు వట్టిపోతున్న వేళ.. ఉనికి కోల్పోయే దుస్థితి దాపురించింది. నాచగిరికి కంఠహారం కావాల్సిన ఈ నది మురుగుకూపంగా మారింది. తాజాగా, సీఎం కేసీఆర్ హామీతో ‘హరిద్రా’ నదికి మోక్షం లభించింది. నిరంతర జలకళ, సుందరీకరణతో అలరారనున్నది. ఇందులో భాగంగా ఆదివారం సర్వే పనులు మొదలయ్యాయి. 800 మీటర్ల పొడవునా ‘హరిద్ర’ తీరం నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహ క్షేత్రం మీదుగా 800 మీటర్ల పొడవునా హరిద్రానది ప్రవహిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ప్రవాహం క్షేత్రం చుట్టూరా అర్ధచంద్రాకృతిలో తాకుతూ తూర్పు దిశ నుంచి ప్రారంభమై ఉత్తరం మీదుగా పడమటి వైపు సాగిపోతుంది. ఈశాన్యంలో జలకళ ఉండడం ప్రాశస్త్యంగా భావిస్తారు. çహరిద్రానది ప్రవహించే మార్గాన్ని పసుపులేరుగా, హల్దీవాగుగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటారు. నాచారం వద్ద ఎగువ భాగంలో గతంలో వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించారు. వాగు పొంగి పొరలితేనే దిగువకు నీళ్లు అనే పరిస్థితి.. దీంతో ఆలయం ముందు నుంచి ప్రవహించాల్సిన వాగులో నీటి నిల్వలు కరువై పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది. దుర్ఘంధం పంచే మురుగు కూపంగా మారింది. సీఎం కేసీఆర్ హామీతో మోక్షం.. ఈ నెల 17న తూప్రాన్ నుంచి గజ్వేల్ వైపు వెళుతున్న సీఎం కేసీఆర్ ఆలయ ఛైర్మన్, స్థానికుల అభ్యర్థన మేరకు నాచారం గుట్ట బ్రిడ్జివద్ద రెండు నిమిషాలు ఆగారు. నాచగిరి క్షేత్రానికి వన్నెలద్దేలా ‘హరిద్ర’ సుందరీకరించాలని, యేడాది పొడవునా నీరుండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. దీంతో భక్తజనులకు నదీ స్నానం చేసే అవకాశం చేరువకానున్నది. సర్వాంగ సుందరంగా హరిద్రను తీర్చిదిద్దే పనులకు తొలి అడుగుపడింది. ఇరిగేషన్ బృందం సర్వే ప్రారంభం రిటైర్డ్ ఎస్ఈ, ఉమ్మడి జిల్లా నీటిపారుదల విభాగం ప్రభుత్వ సలహాదారు మల్లయ్య నేతృత్వంలో మండల ఇరిగేషన్ ఏఈ విష్ణువర్ధన్రెడ్డి, టోటల్ స్టేషన్ ఆపరేటర్, మరో ముగ్గురు సహాయకులతో కూడిన బృందం నాచగిరి వద్ద హరిద్రా (హల్దీ వాగు) సర్వేకు ఆదివారం శ్రీకారం చుట్టింది. వాగు లోతు, వెడల్పు, కాంటూరు లెవెల్స్తో డిజిటల్ విధానంలో, ఆధునిక యంత్రాలతో కొలతల సేకరణలో బృందం నిమగ్నమైంది. ఎక్కడెక్కడ చెక్డ్యామ్లు నిర్మించాలి, నీటి నిల్వ సామర్థ్యం, గోడల నిర్మాణం పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టారు. మంగళవారంలోగా అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు నివేదిస్తారు. రెండో దశలో సుందరీకరణ కోసం సర్వే ఇరిగేషన్ బృందం హరిద్ర ప్రక్షాళన, నీటి నిల్వ లకు సర్వే ముగిసిన తరువాత రెండో దశలో హరిద్ర సుందరీకరణకు టూరిజం శాఖ రంగంలోకి దిగనుంది. మాస్టర్ప్లాన్లో అంతర్భాగమై న హరిద్రా నది సుందరీకరణకు వీలుగా పర్యాటక ఆదరణ చూరగొనేలా ల్యాండ్ స్కేపింగ్, చిన్న గార్డెన్, గ్రీనరీ, లైట్లు, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా, దేవతార్చనకు వీలుగా ప్రత్యేకంగా పూలతోట, పెడల్ బోట్లు, ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా దేవతా విగ్రహాల ప్రతిమలు, హరిద్రా అందాలను ఇనుమడింపజేయనున్నాయి. పుణ్యక్షేత్రం వద్ద నదీ సౌకర్యం సీఎం కేసీఆర్ నాచగిరి క్షేత్రం వద్ద ‘హరిద్ర’ నది యేడాది పొడవునా జీవకళ ఉట్టిపడేలా జలకళతో తీర్చిదిద్దనున్న నేపథ్యంలో సందర్శనకు వచ్చే భక్తులకు నదీ సౌకర్యం చేరువకానున్నది. మూడు చెక్డ్యామ్లు, మూడు స్నానపు ఘాట్లు, పురుషులకు, మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరు గదులు, ఇతర సౌకర్యాలు డ్యామ్ల వద్దనే కల్పించనున్నాం. మిషన్ కాకతీయ ద్వారా జూన్లోగా హరిద్రపై డ్యామ్ల నిర్మాణం, సుందరీకరణ పూర్తి చేయాలన్నదే మా సంకల్పం. ఇందుకోసం సర్వేకు శ్రీకారం చుట్టాం. జూన్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ ద్వారా ఇతర చెరువులు, వాగులతోపాటు, నాచగిరి హరిద్ర నదిని అనుసంధానం చేస్తాం. – గడా అధికారి హన్మంతరావు -
సిడ్నీ నదిలో కూలిన విమానం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో విమానం కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర సిడ్నీకి 50 కిలోమీటర్ల దూరంలోగల హక్సిబరీ నదిలో ఆదివారం విమానం కూలింది. సింగిల్ ఇంజిన్తో నడిచే ఎయిర్ క్రాఫ్ట్ 43 అడుగుల ఎత్తు నుంచి నదిలో కూలిపోయిందని యాక్టింగ్ సూపరింటెండెంట్ మైగోర్మెన్ వెల్లడించారు. మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు. విమానం ఎందుకు కూలిందనేది తెలియాల్సి ఉందన్నారు. -
ఒంటి చేత్తో ఐస్ బద్ధలు కొట్టి నదిలో సాహసం
-
ఒంటి చేత్తో ఐస్ బద్ధలు కొట్టి నదిలో సాహసం
బీజింగ్ : సాధారణంగా చలి అంటేనే బయటకు వెళ్లే సాహసం చేయలేము. ఒక వేళ బయటకు వచ్చినా ఆ పని ముగించుకొని వెంటనే వెళ్లిపోతుంటాం. అలాంటిది కటిక చలికంటే భయంకరంగా ఉండే మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో దిగి సాయం చేసే సాహసం సాధ్యమవుతుందా.. బహుషా అది అందరికీ సాధ్యం కాదేమో.. చైనాలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించాడు. ఉదయాన్ని బైక్పై వెళుతున్న షి లై (54) అనే వ్యక్తి మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో ఓ పెద్దావిడ పడిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే తన బైక్ ఆపేసి నదిలోకి పరుగులు తీశాడు. నదిలో నుంచి ఆమెను బయటకు లాగుతూ అడ్డుగా ఉన్న ఐస్ను తనఒంటి చేత్తో బలంగా మోది పగులగొట్టాడు. అతడి తెగింపును చూసి మరో వ్యక్తి తోడుగా వచ్చాడు. ఎట్టకేలకు ఆ ఇద్దరు కలిసి ఆ పెద్దావిడను సురక్షితంగా బయటపడేశారు. అనంతరం ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు తాను పెద్దగా ఆలోచించలేదని, తన పని తాను చేసి వెంటనే ఇంటికి వెళ్లి ఓ గిన్నెలో అల్లం నీరు తాగి ఆఫీసుకు వెళ్లిపోయానని వివరించాడు. కాగా, అతడి సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
అందరూ చూస్తుండగానే నదిలోకి దూకేశాడు
సమయం ఉదయం 11 గంటలు.. పాతపట్నంకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి సీది వైపు వెళ్లే ఆటో ఎక్కాడు. సీది సమీపంలో ఉన్న బ్రిడ్జి రాగానే ఆటో ఆపమని డ్రైవర్కు చెప్పాడు. అక్కడ ఆటో దిగి తన సెల్ఫోన్ను తోటి ప్రయాణికుల చేతిలో పెట్టాడు. కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి అందరూ చూస్తుండగానే నదిలోకి దూకేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు నదిలో గాలించినా విద్యార్థి ఆచూకీ లభించలేదు. పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ హరిజన వీధికి చెందిన ఇంటర్మీడియెట్ సెకెండియర్ విద్యార్థి కనుపూరు పవన్కుమార్ (17) శుక్రవారం సీది బ్రిడ్జిపై నుంచి మహేంద్ర తనయా నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఉదయం తొమ్మిది గంటలకు కళాశాలకు వెళ్తానని తల్లి, చెల్లికి చెప్పిన పవన్ కుమార్ ప్రభుత్వ కళాశాలకు చేరుకుని స్నేహితులను కలిశా డు. అక్కడి నుంచి తరగతి గదులకు వెళ్లకుండా నేరుగా సీది వైపు వెళుతున్న ఆటో ఎక్కి సీది సమీపంలో ఉన్న బ్రిడ్జి రాగానే ఆటో నుంచి దిగాడు. తన సెల్ఫోన్ను తోటి ప్రయాణికులకు ఇచ్చి నదిలోకి దూకేశాడు. వెంటనే ప్రయాణికులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెల్ఫోన్ ఆధారంగా విద్యార్థి వివరాలను గుర్తించి హరిజనవీధి లో ఉంటున్న స్థానికులకు సమాచారం అందించారు. పవన్కుమార్ తండ్రి జోగారావు కూలి పనికి వెళ్లగా, తల్లి పుష్ప తీమర గ్రామానికి వరిపంట కోతలకు వెళ్లారు. çసమాచారం తెలుసు కున్న స్నేహితులు నదిలో ఆరు గంటల వరకూ గాలించినా ఆచూకీ దొరకలేదు. మరోవైపు పోలీసులు హిరమండలంలో ని గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న ఇంజనీరింగ్ సిబ్బందికి ఫోన్లో విషయాన్ని తెలియజేశారు. విద్యార్థి అదృశ్యంపై ఎస్ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేశారు. -
అరుణాచల్ ‘నది’లో చైనా బురద!
(సాక్షి నాలెడ్జ్ సెంటర్): అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి జీవనరేఖగా పేరుగాంచిన సియాంగ్ నదీ జలాలు గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో కలుషితమౌతున్నాయి. చైనాలో అంతర్భా గమైన టిబెట్లో ఈ నది పేరు యార్లుంగ్ త్సాంగ్పో. అక్కడ 1,600 కిలో మీటర్లు ప్రయాణించి ఇది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దిబాంగ్ పేరుతో 250 కిలోమీటర్లు ప్రవహించాక లోహిత్ అనే మరో నదితో కలసి పెద్ద నదిగా మారుతుంది. ఆ తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సియాంగ్ నుంచి నీటిని టిబెట్లోనే మళ్లించి షిన్జియాంగ్ ప్రావిన్స్ మీదుగా తక్లామకాన్ ఎడారికి తరలించేందుకు చైనా యత్నిస్తోంది. ఇందుకోసం వేయి కిలో మీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తోందని సమాచారం. టిబెట్లో సొరంగ నిర్మాణం కోసం చైనా రాళ్లు పగులగొట్టడం, సిమెంటు వాడకం కారణంగా సియాంగ్ జలాలు కలుషితమై రంగు మారిపోతున్నాయని నెలన్నర క్రితమే వార్తలొచ్చాయి. అయితే చైనా మాత్రం తాము సొరంగం నిర్మించ డమే లేదని వాదిస్తోంది. నదిలో మురికి నీరు ప్రవహించడానికి కారణమేంటో తమకు అంతుచిక్కడం లేదనీ, అరుణాచల్ ఉత్తర ప్రాంతానికి ప్రాణప్రదమైన సియాంగ్లో మళ్లీ నీరు సహజ రంగులో ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అరుణాచల్ తూర్పు లోక్సభ సభ్యుడు నినాంగ్ ఇరింగ్(కాంగ్రెస్) ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. తమ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ నదిలో కలుషిత నీరు ప్రవహించడం వల్ల ప్రజలకు, పర్యావర ణానికి తీవ్రనష్టం జరుగుతోందనీ, ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి ఓ అంతార్జాతీయ బృందాన్ని రప్పించాలని ఇరింగ్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా నీతి ఆయోగ్ గతంలో ప్రతిపాదించింది. దోషి చైనాయే: ఉప కమిషనర్ రెండు నెలలుగా సియాంగ్ నది నీరు బాగా కలుషితమైందనీ, కాలుష్యం స్థాయి సాధా రణం కన్నా వందల రెట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర జలసంఘం పరీక్షలో తేలిందని తూర్పు సియాంగ్ జిల్లా ఉప కమిషనర్ తామ్యో తాతక్ చెప్పారు. ‘ఈ వానాకాలంలో నదిలో నల్లని నీరు ప్రవహించింది. బురదతో నీటి రంగు మారిందనుకున్నాం. నవంబర్ృఫిబ్రవరి కాలంలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. నిండా నీళ్లున్నా నదీగర్భం కనిపించేది’ అని ఆయన వివరించారు. టిబెట్లో లోతైన బోరింగ్ పని జరుగుతున్న కారణంగానే నీటి రంగు మారిందనీ, అందుకే చైనాను అనుమానిం చాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. నది నీరు రంగు మారడానికి, తమకు సంబంధం లేదని వాదిస్తోంది. -
చైనా కుట్ర : రంగు మారిన నది
గువాహటి : అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి జీవనరేఖగా పేరొందిన సియాంగ్ నదీ జలాలు కలుషితమౌతున్నాయి. చైనా అంతర్భాగమైన టిబెట్ పీఠభూమిలో సియాంగ్ను యార్లుంగ్ త్సాంగ్పో అంటారు. సియాంగ్ నది నుంచి నీటిని చైనా షిన్జియాంగ్ ప్రావిన్స్కు అక్కడి నుంచి తక్లామకాన్ ఎడారికి తరలించడానికి వేయి కిలో మీటర్ల సొరంగం నిర్మిస్తోంది. సొరంగ నిర్మాణం కోసం రాళ్లు పగలగొట్టడంతోపాటు సిమెంటు వాడకం వల్ల సియాంగ్ జలాలు కలుషితమై రంగు మారిపోతున్నాయని నెలన్నర క్రితమే వార్తలొచ్చాయి. చైనా మాత్రం ఇలాంటి ప్రాజెక్టు ఏదీ లేదని, కొండలు పిండిచేసి సొరంగం నిర్మించడం లేదని తెలిపింది. ‘‘నదిలో మురికి నీరు ప్రవహించడానికి కారణాలు కనిపించడం లేదు. ఈ సొరంగ నిర్మాణానికి రిహార్సల్గా యునాన్ ప్రావిన్స్లో 600 కిలోమీటర్ల టనెల్ కట్టే పని ఇప్పటికే మొదలుబెట్టారు. అరుణాచల్ ఉత్తర ప్రాంతానికి ప్రాణప్రదమైన సియాంగ్లో మళ్లీ నీరు సహజ రంగులో ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరుతూ అరుణాచల్ తూర్పు లోకసభ సభ్యుడు నినాంగ్ ఇరింగ్(కాంగ్రెస్) ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని ఎగువ సియాంగ్ జిల్లాలో సియాంగ్ నదిపై బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనను నీతి ఆయోగ్ గతంలో ప్రతిపాదించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సమీప గ్రామాలు నీటమునుతాయంటూ స్థానికులు వ్యతిరేకించారు. ఫలితంగా సియాంగ్ లోయ ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకున్నారు. దోషి చైనాయే: డెప్యూటీ కమిషనర్ రెండు నెలలుగా సియాంగ్ నది నీరు బాగా కలుషితమైందని, సాధారణస్థాయికి అనేక వందల రెట్లు కాలుష్యాలు ఉన్నాయని కేంద్ర జలసంఘం పరీక్షలో తేలిందని తూర్పు సియాంగ్ జిల్లా డెప్యూటీ కమిషనర్ తామ్యో తాతక్ చెప్పారు. ‘‘ఈ వానాకాలంలో నదిలో నల్లనీరు ప్రవహించింది. బురదతో నీటి రంగు మారిందనుకున్నాం. నవంబర్-ఫిబ్రవరి కాలంలో నీరు స్వచ్ఛంగా ఉంటాయి. నిండా నీళ్లున్నా నదీగర్భం కనిపించేది. సియాంగ్లో మురికి నీరును మా తాత సైతం చూడలేదు’’ అని ఆయన వివరించారు. ఎగువ ప్రాంతంలో అంటే టిబెట్లో లోతైన బోరింగ్ పని జరుగుతున్న కారణంగానే నీటి రంగు మారిందనీ, అందుకే చైనాను అనుమానించాల్సివస్తోందని ఆయన అన్నారు. టిబెట్ నుంచి 1600 కిలోమీటర్లు దిగువకు ఈ నది ప్రవహిస్తుంది. అరుణాచల్ప్రదేశ్లొ దీన్ని దిబాంగ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో 250 కిలోమీటర్లు ప్రవహించాక లోహిత్ అనే నదితో కలిసి పెద్ద నదిగా మారుతుంది. అస్సాంలో బ్రహ్మపుత్రగా అవతరించి బంగ్లాదేశ్ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అరుణాచల్లో ప్రధానంగా ఎగువ భాగంలో ప్రవహిస్తున్న కారణంగా ఈ నది పేరుతో(తూర్పు, పశ్చిమ, ఎగువ) మూడు జిల్లాలున్నాయి. ఇంత కీలకమైన ప్రధాన నదిలో కలుషిత నీరు ప్రవహించడం వల్ల ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. సియాంగ్ బురద ప్రవాహానికి తాను కారణం కాదని చైనా వాదిస్తున్నా ఈ విషయం తేల్చడానికి ఓ అంతార్జాతీయ బృందాన్ని రప్పించాలని ఎంపీ ఇరింగ్ డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో సిమెంటు నిర్మాణ పని కారణంగానే నదీజలాలు ఇలా మారిపోయాయని పలువురు నమ్ముతున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
ఖాట్మండు: నేపాల్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజ్బిరాజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు ఘట్బేసీ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్నఅధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీసినట్లు ఓ అధికారి తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రాణాలు...నీటిపాలు..
-
డెహ్రాడూన్లో మిర్యాలగూడ విద్యార్థి మృతి
సాక్షి, మిర్యాలగూడ: తన మిత్రులతో కలిసి నరహరి అనే విద్యార్థి డెహాడూన్కు వెళ్లాడు. గంగోత్రి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. వివరాలివి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నరహరి స్వస్థలం. అతను డెహ్రాడూన్లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఈ క్రమంలో నిన్న స్నేహితులతో కలిసి గంగోత్రి నది వద్దకు వెళ్లారు. అందరూ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరహరి ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. కుమారుని మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఏ నది ఎక్కడ పుట్టింది?
సెల్ఫ్చెక్ నదులను సంప్రదాయబద్ధంగా నదీమతల్లిగా కొలుస్తాం, ఆధునిక టెక్నాలజీతో డ్యామ్లు కట్టి నీటిని వాడుకుంటాం. మరి... వీటిలో ఏ నది ఎక్కడ పుట్టింది? 1. నర్మదానది మధ్యప్రదేశ్లో అమర్కంటక్ కొండల్లో నర్మదాకుండ్ అనే తటాకంలో పుట్టింది. ఎ. అవును బి. కాదు 2. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాక్షి జిల్లాలో యమునోత్రి హిమనీనదం మెల్లగా కరుగుతూ బందేర్పూచ్ శిఖరం దగ్గర ప్రవాహంగా మారిన నది పేరే యమున. ఎ. అవును బి. కాదు 3. గంగోత్రి హిమనదం నుంచి గంగానది పుట్టిందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 4. కావేరి నది కర్నాటక రాష్ట్రం కొడగు (కూర్గ్) జిల్లాలో తలకావేరి అనే కుండం నుంచి పుట్టింది. ఎ. అవును బి. కాదు 5. గోదావరి పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర నాసిక్ జిల్లా త్రయంబకం దగ్గర పుట్టింది. ఎ. అవును బి. కాదు 6. కృష్ణానది పుట్టిన ప్రదేశం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్. ఎ. అవును బి. కాదు 7. కర్నాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ జిల్లాలోని నందికొండల్లో పెన్నానది పుట్టింది. ఎ. అవును బి. కాదు 8. తపతి నది మధ్యప్రదేశ్లో సాత్పూర పర్వతశ్రేణుల్లో పుట్టింది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు అవసరమైన వాటితోపాటు అనేక సాధారణ విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు... అనుకోవాలి. ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహించే కొన్ని ప్రధాన నదులతోపాటు సాధారణ నదుల పుట్టింటిని కూడా గుర్తు చేసుకుందాం. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గోదా’వర్రీ’
నదిలో భారీగా తగ్గిపోయిన ప్రవాహ జలాలు సీలేరుపైనే భారం రోజు 4,500 క్యూసెక్కులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిండు గోదావరిలో నీళ్లులేక ఎండు గోదావరిలా మారింది. నదిలోకి వచ్చి చేరే ప్రవాహ జలాలు 2,500 క్యూసెక్కులకు పడిపోవడంతో వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒక్క పశ్చిమ డెల్టాకే రోజుకు 4,500 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు నీటి పారుదల యంత్రాంగం రంగంలోకి దిగింది. రబీ పంటకు సాగునీటి ఇబ్బంది లేకుండా నిత్యం 4,500 క్యూసెక్కుల నీరు కచ్చితంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఎస్ఈ రాంబాబును ఆదేశించారు. గోదావరిలో ఇన్ఫ్లో తగ్గడం వల్ల శివారు ప్రాంత భూములకు నీరందటం లేదని రైతులు చెబుతున్నారని, జిల్లాలో వేసిన ప్రతి ఎకరం పంటనూ కాపాడాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే సీలేరు నుంచి అదనపు జలాలను రప్పించి గోదావరిలో నీటిమట్టం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. పొలాలకు మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో నీరందించాల్సి ఉందన్నారు. ఎస్ఈ రాంబాబు స్పందిస్తూ గోదావరి ఇన్ఫ్లో 2,500 క్యూసెక్కులకు పడిపోవడంతో సీలేరు నుంచి 5400 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు కలిపి మొత్తం 7,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైతే సీలేరు నుంచి మరో వెయ్యి క్యూసెక్కుల నీరు రప్పించి పశ్చిమ డెల్టాకు 4500 క్యూసెక్కులకు తగ్గకుండా నిరంతరం నీరివ్వాలని కోరారు. నీరు తగ్గితే రైతులు చాలా నష్టపోతారని ఈ దశలో మరింత సమన్వయంతో పనిచేస్తూ గోదావరి నీటి మట్టం తగ్గకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. -
మళ్లీ మొదలైంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ఇసుక దోపిడీకి మళ్లీ తెరలేచింది. ప్రభుత్వ కార్యక్రమాలను సాకుగా చూపించి గోదావరి నదినుంచి ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అనుమతి ఇచ్చిన చోటే కాకుండా వేరే ప్రాంతాల్లోనూ తెగ తవ్వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో గోదావరి ఇసుకను రెండు రోజులుగా దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ర్యాంపు ఏర్పాటుకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలపై పోలవరం రైట్ మెయిన్ కెనాల్, 4 ప్యాకేజీ (పెదవేగి) అని రాసిన స్టిక్కర్లను అతికించారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో అధికార యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడలేదు. అనధికార అనుమతితో.. పోలవరం కుడి ప్రధాన కాలువ రెండవ ప్యాకేజీలో 14.92 కిలోమీటర్ల వద్ద, 4వ ప్యాకేజీలో పెదవేగి వద్ద కట్టడాలు, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో పనులకు సంబంధించి పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద మేట వేసిన ఇసుకను తవ్వుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారులు అనధికార అనుమతి ఇచ్చారు. దీంతో ఇక్కడ కొంతమేర ఇసుకను తవ్వి తరలించారు. అదే ముసుగులో పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తవ్వుకుపోతున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను అధికారులు గతంలోనే నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను చూసేం దుకు కేంద్ర బృందం వచ్చినప్పుడు ఇక్కడి తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ దిగువ భాగంలో తవ్వకాల వల్ల ప్రాజెక్ట్కు సమస్య వస్తుందని వారు అభ్యంతరం చెప్పడంతో జిల్లా కలెక్టర్ ఈ పనులను నిలిపివేయించారు. తిరిగి ఇప్పుడు తవ్వకాలు మొదలయ్యాయి. ఇదిలావుంటే పోలవరం మండలం గూటాల వద్ద మరో ఇసుక ర్యాంపు సిద్ధమవుతోంది. అభివృద్ధి పనులకు సంబంధించి తమకు అనుమతి వచ్చిందని చెబుతున్నారు. త్వరలో ఈ ర్యాంపులోనూ తవ్వకాలు మొదలు కానున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.ముక్కంటిని వివరణ కోరగా.. అక్కడ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. -
రివర్స్ లింకింగ్ ప్రకృతి విరుద్ధం
-
నీటియానం
ఆరోగ్యం, పర్యావరణం బాగుండాలంటే కార్లు, మోటర్బైక్లు వదిలేసి సైకిలెక్కడం మేలని చాలామంది చెబుతారు. కానీ... రయ్యి రయ్యి మని కార్లు దూసుకెళుతూంటే... వాటి మధ్యలో బిక్కుబిక్కుమంటూ సైకిలెలా తొక్కాలి? అనేదేనా మీ డౌట్! నో ప్రాబ్లెమ్ అంటోంది సెకెండ్ షోర్! షికాగో పట్టణంలో ఈ కంపెనీ కేవలం సైక్లిస్టుల కోసం ఓ నదిపై తేలియాడే బ్రిడ్జీని ఏర్పాటు చేసింది మరి. పక్క ఫొటోలో కనిస్తున్నది ఆ బ్రిడ్జీ డిజైనే. మంచు కురిసే షికాగో వాతావరణాన్ని తట్టుకునేందుకు ఈ బ్రిడ్జీపై సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో బ్రిడ్జీపైనున్న మంచును తొలగిస్తారన్నమాట. మూసీ నది వెంబడి.. లేదంటే కృష్ణా, గోదావరి తీరాల వెంబడి అక్కడక్కడా ఇలాంటివేస్తే పోలా? సేఫ్టీకి సేఫ్టీ... నాలుగు రూకలు ఆదా అవుతాయి కూడా! -
కృష్ణమ్మ సోయగం
నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం 535 అడుగులు ఉండడంతో కొండల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి శ్రీశైలంకు వెళ్లే రహదారి సమీపంలో వెల్దుర్తి మండలంలోని జెర్రి వాగు మలుపు వద్ద కృష్ణానది మలుపులు తిరుగుతూ ప్రవహిస్తున్న దృశ్యాలు వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. – మాచర్ల -
వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి
రేగోడ్(మెదక్ జిల్లా): రేగోడ్ మండలం గజ్వాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వాగులో ఓ మహిళ కొట్టుకుపోయి మృతిచెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన సాయమ్మ(35)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘మంజీర’ మురిసింది
బోధన్ రూరల్ : రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటి ప్రవాహంతో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది. -
కావేరి వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ కావేరీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర జలాల వివాదాల నదీ ప్రవాహం ఇలా కొనసాగుతూనే ఉంటుందంటూ ట్విట్టర్ లో తన ఫీలింగ్స్ ను షేర్ చేశారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. కావేరీ జలాల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ఆదిమానవుల కాలంనుంచి కొనసాగుతోందనీ, ఇది మన తరం తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. మానవుడు వానరాలుగా.. భాష నేర్వక సంచరిస్తున్న కాలంలో పుట్టిందనీ.. ఇక ముందు కూడా ఇది కొనసాగుతుందంటూ ట్వీట్ చేశారు. చరిత్ర అద్దంలో మన ముఖాలను ఇలా చూసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాగా సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చెలరేగిన వివాదం హింసాత్మకం రూపం దాల్చింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ వాహనాలను కన్నడిగులు తగులబెట్టారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. ఐటీ సహా, పలు వ్యాపార సంస్థలు మూతపడడంతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. ఈ సందర్భంగా జరిగిన పోలీసులు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
రివార్
-
నదిలో పడిన బస్సు.. 20 మంది మృతి
ఖాట్మండు: నేపాల్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని చండీబంజంగ్ ప్రాంతంలో బస్సు 100 మీటర్ల ఎత్తులో నుంచి త్రిశోలి నదిలో పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్ పర్వత ప్రాంతాల్లో అస్తవ్యస్తమైన రోడ్లతో పాటు, ప్రమాణాలు లోపించిన వాహనాలు తరచూ ప్రమాదాలకు కారణమౌతున్నాయి. ఇటీవల ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 36 మంది మృతి చెందగా.. 28 మంది గాయపడ్డారు. -
నది రుణాన్ని తీర్చుకోండి
ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ‘నది మనకు నీళ్లు, సంపద అన్నీ ఇస్తుంది. అలాంటి నదికి మనం రుణం తీర్చుకోవాలి’ అని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం ధ్యానబుద్ధ ఘాట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణమ్మ చెంతకు గోదావరిని చేర్చామన్నారు. ఇప్పుడు ఆ రెండు నదులు కలిసే పవిత్ర సంగమం వద్దనే హారతిని ఇస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మహా సంకల్పం చేస్తున్నామని, కృష్ణ నుంచి గోదావరి నీళ్లు పెన్నాలో కలిపి నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు. వర్షపునీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు చెరువుల్లో పూడిక తీతలు, ఫాంపాండ్స్ తవ్వి, వాటిని భూగర్భ జలాలుగా మారిస్తే కరువు ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర స్నానాల ప్రచారం చేయాలన్నారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పలుచోట్ల భోజనాలు పెడుతున్నారని, ఇది స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ పుష్కరస్నానం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు. -
అంత్య పుష్కరాలు ఆరంభం
జిల్లాలో ఆదివారం గోదావరి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం, మోర్తాడ్ మండలం తడపాకల్, బాల్కొండ మండలం సావెల్, నందిపేట మండలం ఉమ్మెడ ఘాట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. మొదటి రోజు భక్తులు స్వల్పంగానే కనిపించారు. నందిపేట : ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదిలో అంత్య పుష్కరాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ప్రారంభించారు. గోదావరికి హారతి ఇచ్చారు. సమీపంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం, ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంతో భక్తుల రద్దీ అంతంతగానే ఉంది. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, దేవదాయ శాఖ బోధన్ ఈవో వేణు, ఆలయ ఇన్చార్జి ఈవో సుదర్శన్, నాయకులు సాయరెడ్డి, సాగర్, రాజేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను ప్రారంభించారు. వేదపండితులు పుష్కరుడికి ఎస్సారెస్పీ కోదండ రామాలయం నుంచి ఆహ్వనం పలికారు. ఆది పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యతే గోదావరి అంత్య పుష్కరాలకు ఉంటుందని వేద పండితులు తెలిపారు. భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. పూజాదుల్లో సర్పంచ్ శ్రీవాణి రమేశ్, దేవాదాయ శాఖ ఈవో గంగాధర్, రామాలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సావెల్ పుష్కర ఘాట్ వద్ద.. సావెల్ పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను సర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తడపాకల్లో.. మోర్తాడ్ : తడపాకల్లో సర్పంచ్ లావణ్య అంత్య పుష్కరాలను ప్రారంభించారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి స్థానిక భక్తులతో పాటు కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్లలనుంచి భక్తులు తరలివచ్చారు. సర్కారు ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రెంజల్ : కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలు బోధన్ ఆర్డీవో సుధాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెంజల్ ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, గోదావరిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీఆర్వోలతో పాటు వీఆర్ఏలను అప్రమత్తం చేశామని, ఇద్దరు కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున భక్తులు ఘాట్లపైనే స్నానాలాచరించాలని సూచించారు. అంత్య పుష్కరాలకు అంతంతే.. ఆది పుష్కరాలకు ఘనమైన ఏర్పాట్లు చేసిన సర్కారు.. అంత్య పుష్కరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సరైన ప్రచారం చేయకపోవడంతోపాటు పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలూ కల్పించలేదు. దీంతో పుష్కర ఘాట్ల వద్ద రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం కావడంతో హైదరాబాద్, కామారెడ్డి, అదిలాబాద్లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. నిరాశ కలిగింది.. గతేడాది ఆది పుష్కరాలకు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి వెళ్లాం. త్రివేణి సంగమస్థలి, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం కావడంతో ఈసారి కందకుర్తికి వచ్చాం. కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో నిరాశ చెందాం. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. – సువర్ణ, హైదరాబాద్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది ఆది పుష్కరాల సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు పుష్కర స్నానం చేయలేకపోయాను. అంత్య పుష్కరాల్లో పాల్గొందామని కందకుర్తికి వచ్చాను. కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం గోదావరి నది అంత్య పుష్కరాలను చిన్నచూపు చూస్తోంది. ఇది సరికాదు. పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి. – శేర్ల రాములు, కామారెడ్డి వసతులు కల్పించాలి గోదావరి ఆది పుష్కరాలను ఘనంగా నిర్వహించారు. అంత్య పుష్కరాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరికాదు. అంత్య పుష్కరాలకూ సరైన ఏర్పాట్లు చేయాలి. పుష్కర స్నానాల నిమిత్తం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించాలి. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను తెరిపించాలి. – రమేశ్రెడ్డి, నిజామాబాద్ -
నిండని భద్రకాళి జలాశయం
వర్షకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఇటీవల కుండపోతగా వర్షాలు కురిసినప్పటికీ వరంగల్ భద్రకాళి చెరువులో నీటిమట్టం పెరగలేదు. దీంతో పరిసర ప్రాంతాలకు చెం దిన ప్రజలు నీటికోసం ఆందోళనకు గురవుతున్నారు. వరుణదేవుడు మరోసారి కరుణించి భారీ వర్షాలు కురిపించి భద్ర కాళి చెరువును నింపాలని వారు వేడుకుంటున్నారు. -
నదుల ప్రక్షాళన చేపట్టాలి
హనుమాన్ పీఠాధిపతి రాములు స్వామి ఏటూరునాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని కృష్ణ, గోదావరి నదుల ప్రక్షాళన చేపట్టాలని హనుమాన్ పీఠాధిపతి గాదెపాక రాములు స్వామి అన్నారు. తెలంగాణలోని గోదావరి పుష్కరఘాట్ల సందర్శనలో భాగంగా మంగళవారం మండలంలోని రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరి నదికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల్లో మలినాలను తొలగించి, మానవ మనగడకు ఆరోగ్య ప్రదాతలుగా బాధ్యత వహించాలన్నారు. చాలా మంది ఘాట్ల వద్ద మలినాలను వదిలేయడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. నదుల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించి 1465 కిలోమీటర్ల ప్రయాణంతో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, పర్ణశాల, భద్రాచలం, రాజమండ్రి, ధవళేశ్వరంలో ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తోందన్నారు. పర్ణశాల, భద్రాచలం, రామన్నగూడెం ఘాట్లను, బుధవారం నుంచి కాళ్లేశ్వరం, ధర్మపురి, బాసరను సందర్శిస్తానని వెల్లడించారు. దుగ్గొండి మండలం ముద్దునూరుకు చెందిన తాను పవిత్ర నదులను శుద్ధి చేసి అపవిత్రం కాకుండా ఉండేందుకు ఈనెల 20 నుంచి గోదావరి పరివాహక ప్రాంతాల్లో మౌనదీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. -
విద్యార్థులకు 'నది' కష్టాలు!
చెన్నైః ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళాలంటే అక్కడి విద్యార్థులకు నది కష్టాలు తప్పడంలేదు. ఎప్పుడూ మోకాల్లోతు దాటి ఉండే నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కోసారి నీటి ఉధృతి పెరిగితే నడుములు దాటి కూడా నీరు ప్రవహిస్తుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నీటిలో నడుస్తూ స్కూలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తమిళనాడు విద్యార్థులకు దినదినగండంగా మారుతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి నదికి ఆవలివైపున ఉన్న స్కూలును చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఏళ్ళతరబడి బ్రిడ్జి నిర్మాణంకోసం ఆ ప్రాంత వాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునేవారే కరువయ్యారు. తమిళనాడు క్రిషగిరి జిల్లా బోడూరు గ్రామ ప్రాంతంలోని విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జి లేక, మోకాల్లోతు నీటిలోనే నడుచుకుంటూ వెడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. బోడూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది విద్యార్థులు పెన్నార్ నదిని దాటి స్కూలుకు వెడుతుంటారు. ఆయా గ్రామాల్లోని విద్యార్థులే కాక గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం నిత్యావసరాలకోసం పక్క గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటక తప్పడం లేదు. కనీసం 3000 మంది ప్రయాణీకులు ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నదిపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్ కు చేర్చాలన్నా బ్రిడ్జిని చేరుకోవాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించాలన్నా నదిని దాటడం ఎంతో కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే క్రిషగిరి జిల్లాలో నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత రూ.1.5 కోట్ల నిధులు కేటాయించారని, నిర్మాణంకోసం అధికారులకు ఆదేశాలు కూడ జారీ చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి చెప్తున్నారు. నదిపై బ్రిడ్జిలేక, నీరు ఉధృతంగా ఉన్నసమయంలో సంవత్సరంలో సుమారు 100 రోజులపాటు పాఠశాలకు హాజరుకాలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరో రెండేళ్ళలో బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండగా... అధికారులు ఇచ్చే హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!
థానేః ఆరేళ్ళ ఆ చిన్నారి పట్ల తండ్రే కాసాయి వాడిలా ప్రవర్తించాడు. పసిప్రాణం అని చూడకండా నిర్దాక్షిణ్యంగా నదిలో విసిరేశాడు. అయితే తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించినా... నదీమతల్లి మాత్రం ఆమె గర్భంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పచ్చని చెట్లను ఆమె ప్రాణాలకు అడ్డువేసింది. దాంతో పదకొండు గంటలపాటు చెట్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకొన్న ఆమెను... అదృష్టవశాత్తూ అటుగా వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు రక్షించాడు. థానే, బద్లాపూర్ లోని వాలివ్లీ బ్రిడ్జి ప్రాంతంలో జరిగిన ఘటన కన్నతండ్రి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని చెట్లను పట్టుకొని ఏడుస్తున్నఆరేళ్ళ చిన్నారిని అక్కడి కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు చూసి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కొత్త బూట్లు కొనిస్తానని నమ్మించి, ఉత్సాహంగా తనతో వచ్చిన ఆరేళ్ళ కూతుర్ని ఆమె తండ్రితోపాటు, అతడి స్నేహితుడు బలవంతంగా అల్హాస్ నదిలోకి తోసేసిన ఘటన స్థానికులను విస్మయ పరచింది. స్థానిక మోహన్ గ్రూప్ కనస్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 35 ఏళ్ళ రమేష్ భైర్ సదరు చిన్నారి నదిలో ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించాడు. తాను నదివైపునుంచీ వెడుతుండగా ఎక్కడో పాప అరుపులు, ఏడుపు వినిపించాయని, కానీ నదిలోకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెప్పాడు. తర్వాత కాసేపు నిశితంగా బ్రిడ్జిమీద నిలబడి చూస్తే బ్రిడ్జి కందిభాగంలోని చెట్లను పట్టుకొని ఓ పాప కనిపించడంతో నిర్ఘాంతపోయిన తాను వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిపాడు. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పాపను రక్షించినట్లు రమేష్ వెల్లడించాడు. పాపను నదినుంచీ బయటకు తీసిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను బట్టి వర్తక్ నగర్ కు చెందిన ఏక్తా తులసిరామ్ సియానిగా పాపను గుర్తించామని రమేష్ భైర్ తెలిపాడు. నదిలో ఎలా పడిపోయావ్ అని అడిగితే.. తన తండ్రి, అతడి స్నేహితుడు కలసి తనను నదిలోకి విసిరేసినట్లు తెలిపిందని చెప్పాడు. తనకు షూ కొనిస్తానని చెప్పి... బయటకు తీసుకెళ్ళి నిదిలో విసిరేశారని పాప చెప్పిన వివరాలను బట్టి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమకు ఫోన్ కాల్ రాగానే ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఓ తాడుకు ఎయిర్ ట్యూబ్ ను కట్టి నదిలోకి దిగి, పాపను ట్యూబ్ పై కూర్చోపెట్టుకొని 20 నిమిషాల్లోపలే ప్రాణాలతో రక్షించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే పాప తల్లి వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ లో అంతకు ముందురోజే మిస్సింగ్ కేసు నమోదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో కడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇనస్పెక్టర్ కెజి గవిట్ తెలిపారు. అనంతరం బద్లాపూర్ నది ప్రాంతంలో పాప దొరికి నట్లుగా సమాచారం అందడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, తమ సిబ్బంది తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. -
వేగంగా వెళ్లి.. నదిలో పడి..
చెన్నై: బైక్ పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు ఫుట్ పాత్ మీద పాదచారులను తప్పించబోయి గోడను ఢీ కొట్టి నదిలో పడ్డాడు. ఆఫీస్ అవసరాలకు కావసిన వస్తువులను తెచ్చేందుకు డీ ఇన్ఫాంటో(20) బైక్ మీద పూనమల్లే రోడ్డులో అతి వేగంతో వెళ్తున్నాడు. అంపా స్కైవే దగ్గరకు చేరుకోగానే అతడి బైకు అదుపు తప్పి.. అటువైపు వెళ్తున్న పాదాచారుల వైపు వెళ్లసాగింది. దాంతో వారికి ప్రమాదం జరగకుండా తప్పించాలన్న ప్రయత్నంలో ఇన్ఫాంటో నదిని అనుకుని ఉన్న గోడను ఢీ కొట్టి 25 మీటర్ల లోతుకు నీళ్లలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని రక్షించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతనికి ప్రథమ చికిత్స అందించి నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ సింగ్.. రియల్ హీరో
మత విశ్వాసాల కంటే ఓ ప్రాణిని రక్షించడమే మిన్న అని భావించాడు. అసాధారణ రీతిలో సాహసం చేసి పునర్జన్మ ఇచ్చాడు. పంజాబ్కు చెందిన శర్వాణ్ సింగ్ (28).. రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. శర్వాణ్ స్నేహితులతో కలసి కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన కొంతమంది నిల్చుని కాలువవైపు చూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని శర్వాణ్ కారు ఆపి జనం దగ్గరికి వెళ్లి చూశాడు. నదిలో పడిన ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. బయటకు రాలేక మృత్యువుకు దగ్గరవుతోంది. జనం ఆ దృశ్యాన్ని చూస్తున్నారు కానీ ఆ కుక్కను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. శర్వాణ్కు ఈత రాదు. అయినా కుక్కను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాడు. సిక్కు మతవిశ్వాసాలకు పవిత్రంగా భావించే తలపాగా తీశాడు. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. శర్వాణ్ అవేమీ పట్టించుకోలేదు. తలపాగాను తాడుగా చేసుకుని ఓ అంచును పట్టుకోమని స్నేహితులకు ఇచ్చి.. మరో అంచును పట్టుకుని వారి సాయంతో కాలువలోకి ఏటవాలుగా దిగాడు. అయితే నీళ్లల్లో నుంచి కుక్కును బయటకు తీసుకురావడానికి శ్రమించాల్సి వచ్చింది. మరో గుడ్డను తీసుకుని దాన్ని సాయంతో కుక్కను కాలువపైకి తీసుకువచ్చాడు. కుక్క బాగా నీరసించిపోయింది. సింగ్ తన దగ్గరున్న బిస్కెట్లు దానికి అందించాడు. కాసేపటి తర్వాత కోలుకున్న కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన శ్రమ ఫలించినందుకు సింగ్ సంతోషపడ్డాడు. సిక్కు మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో లేదా స్నానం చేసేటపుడు మాత్రమే తలపాగా తీయాలి. ఆ సమయంలో కుక్క ప్రాణాలను రక్షించడమే ప్రధానమని భావించానని శర్వాణ్ సింగ్ చెప్పాడు. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
మళ్లీ జల జగడం!
♦ చినుకు రాలకముందే తెలంగాణ, ఏపీల మధ్య ముదురుతున్న వివాదం ♦ పాలమూరు, డిండి, కల్వకుర్తిలపై మరోమారు కేంద్రానికి ఏపీ ఫిర్యాదు ♦ సాగర్, శ్రీశైలం డ్యామ్ల నిర్వహణ బోర్డు పరిధిలోకి తేవాలని పట్టు ♦ ఏపీ ఒత్తిడితో రంగంలోకి బోర్డు.. ♦ దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణకు ఆదేశం ♦ శ్రీశైలంలో ఏపీకి కేటాయింపుల తీరుపై తెలంగాణ కన్నెర్ర సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది. గతేడాది ప్రాజెక్టుల్లో నీటి పంపకాలపై మొదలైన వివాదాలు.. ఈసారి ఇంకా చినుకు కూడా కురవకముందే మరింతగా ముదురుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం, ట్రిబ్యునల్, బోర్డుల అనుమతి లేదంటూ ఏపీ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తడం, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం తాజా వివాదానికి ఊతమిచ్చింది. ఏపీ ఫిర్యాదులు, కేంద్రంపై తెస్తున్న ఒత్తిడితో కదిలిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఆయా ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాల ని తెలంగాణకు ఆదేశాలిచ్చింది. దీనికితోడు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలంలను నియంత్రణలోకి తెచ్చుకోవాలం టూ ఏపీ పట్టుబడుతుండడం.. దీనిపై వైఖరి చెప్పాలని తెలంగాణను బోర్డు కోరడం సైతం వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయి. వాదనంతా వాటాల చుట్టూనే? బచావత్ అవార్డు మేరకు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. దాంతోపాటు మరో 75 టీఎంసీల మిగులు జలాలను తమకు కేటాయించినట్లు తెలంగాణ చెబుతోంది. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టుల వారీ కేటాయింపులున్నా.. అవేవీ ప్రస్తుతం పూర్తికాకపోవడంతో, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటానని స్పష్టం చేస్తోంది. ఉన్న నీటి వాటాలోంచే పాలమూరు, డిండి ఎత్తిపోతలను చేపట్టామని చెబుతోంది. ఇక పట్టిసీమలో ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45టీఎంసీల్లో దక్కే వాటా నీటి తో ప్రాజెక్టులు చేపట్టామని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు తాజాగా మరోమారు పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. స్పందించిన బోర్డు... కల్వకుర్తి సామర్థ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచడంపై రెండు రోజుల కిందట... పాలమూరు, డిండిలపై బుధవారం వివరణ కోరింది. వాటి కి కేటాయించిన నీటిని ఎక్కడి నుంచి, ఎలా తీసుకుంటారో తెలపాలని ఆదేశించింది. వాటా వినియోగ ముసాయిదా ఎలా? కృష్ణా జల వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో గతేడాది జూన్లో రెండు రాష్ట్రాలు కేంద్రం సమక్షంలో చర్చలు జరిపి ఓ ముసాయిదాను రూపొందించుకున్నాయి. దాని ప్రకారం కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయనే అభిప్రాయనికి వచ్చి.. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి, విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఆదేశాలిస్తుందని, వాటిని ఇరు రాష్ట్రాలు పాటించాలని అందులో పొందుపరిచారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను గుండుగుత్త (ఎన్బ్లాక్)గా కేటాయించిందని.. అందులో విభజన అనంతర ం తెలంగాణకు ఇచ్చిన 299 టీఎంసీలు, ఏపీకి దక్కిన 512 టీఎంసీలను ఎన్బ్లాక్గానే చూడాలని తీర్మానించుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ముసాయిదా గడువు వచ్చే నెలతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అదే ముసాయిదాను కొనసాగించాలా, లేక కొత్తగా ఏవైనా అంశాలు చేర్చాలా? అన్నది తెలపాలని బోర్డు తెలంగాణను కోరింది. మరోవైపు నీటి మట్టాలు పూర్తిగా అడుగంటిన ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలంలో ఏపీకి 6 టీఎంసీల నీటిని కేటాయించడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాటా మేరకు నీటిని ఏపీ వాడుకున్నా, మళ్లీ 6 టీఎంసీలు ఎలా కేటాయించారో తెలపాలంటూ బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించింది. పెద్ద వివాదాన్ని లేవనెత్తిన బోర్డు! ఏపీ, తెలంగాణల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని.. ఏపీ ఫిర్యాదుతో కృష్ణా బోర్డు మళ్లీ కదిలించింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలంటూ గతంలో ఏపీ చేసిన ఫిర్యాదును బోర్డు తోసిపుచ్చింది. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకోలేమని స్పష్టం చేసింది. కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు దానిపై పెత్తనం చేస్తున్నారని... దాన్ని బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఏపీ ఇటీవల మరోమారు బోర్డును కోరినట్లు తెలుస్తోంది. అయితే నీటి వినియోగంపై గతంలో కేంద్రం సమక్షంలో స్పష్టమైన అవగాహన కుదిరినందున నియంత్రణ అవసరం లేదని తెలంగాణ వాదిస్తోంది. అయితే అవగాహన గడువు కేవలం ఏడాదేనని, ఆ గడువు వచ్చే నెలతో ముగుస్తున్నందున తాజాగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాసిన లేఖలో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశాలపై అభిప్రాయం చెప్పాలని బోర్డు తెలంగాణను కోరింది. -
ఎనిమిదో స్నేహపు వంతెన..
ఢాకా: బంగ్లాదేశ్, చైనాల మధ్య స్నేహబంధం మరింత బలపడనుంది. ఇప్పటికే చైనా, బంగ్లాల మధ్య ఏడు వంతెనల నిర్మాణం పూర్తవగా త్వరలో మరో కొత్త బ్రిడ్జిని నిర్మించుకోవడానికి శుక్రవారం బంగ్లా రాజధాని ఢాకాలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నందుకు బంగ్లాదేశ్కు, చైనా దాదాపు 340 కోట్ల రుపాయల ఆర్థికసాయం అందజేయనుంది. ఈ అంశంపై బంగ్లాదేశ్ ఆర్ధిక సహకార శాఖ కార్యదర్శి మెజ్బా ఉద్దీన్, చైనా అంబాసిడర్ మా మిన్యంగ్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. బంగ్లాదేశ్లోని కోచా నది మీద ఎనిమిదో వంతెనను నిర్మించనున్నట్లు దేశ ఈఆర్డీ తెలిపింది. రోడ్లు, నిర్మాణ శాఖ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వంతెన పొడవు 1400 మీటర్లని పేర్కొంది. ప్రస్తుతం ఒక గంట ప్రయాణంతో ఫెర్రీ ద్వారా నదిని దాటుతున్నట్లు తెలిపింది. ఈ బ్రిడ్జి ద్వారా బంగ్లాదేశ్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. 1986 నుంచి చైనా, బంగ్లాదేశ్కు బ్రిడ్జిలను నిర్మించి ఇస్తోంది. -
కేటాయించాల్సింది ట్రిబ్యునలే
- ‘విభజన’ సెక్షన్ 89పై కేంద్రం వైఖరి సరికాదు - కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్89 ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీని రెండు కొత్త రాష్ట్రాల మధ్యే చేపట్టాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. కృష్ణా నదీ జలాల వివాద పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ‘‘కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు, మా వాదనలు వినిపించేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. లేకుంటే ప్రస్తుతమున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనే అన్ని రాష్ట్రాల వాదనలు మళ్లీ విని నీటి కేటాయింపులు మళ్లీ జరిపేలా చూడాలన్నాం. అర్జీని పరిష్కరించేందుకు కేంద్రానికి ఏడాది గడువు ఉంది. ఆలోగా పరిష్కరించకుంటే ట్రిబ్యునల్కు నివేదించడమే కేంద్రం విధి. అయితే కేంద్రం ఏడాదిలోగా వివాదాన్ని పరిష్కరించకపోగా.. తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు ఇస్తూ సెక్షన్ 89 కేవలం రెండు నూతన రాష్ట్రాలకే అమలవుతుందని చెప్పింది. ఇది దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించింది. పూర్తిగా బుర్ర పెట్టకుండానే ఈ అభిప్రాయానికి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వానికి నీటి కేటాయింపులు జరిపే అధికారం లేదు. ఆ బాధ్యత నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్దే. అందువల్ల మా నీటి హక్కులను సెక్షన్ 89 ద్వారా లేదా ఇంకేదైనా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం కాలరాయజాలదు’ అని వాదించారు. వాదలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. విచారణకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు, న్యాయవాదులు రవీందర్రావు, విద్యాసాగర్రావు హాజరయ్యారు. -
నదులను కాలుష్యం చేసిన కంపెనీలకు జరిమానా
నదులను కలుషితం చేస్తున్న పరిశ్రమలకు తూర్పు చైనా కోర్టు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో సుమారు 26,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను పారేసినందుకు మూడు రసాయన పరిశ్రమలకు దాదాపు 12 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. చైనా డౌ జియండే సిటీ రెండో కెమికల్ ప్లాంట్, హాంగాన్ కార్గో సంస్థ, రోంగ్ షెంగ్ కెమికల్ కంపెనీలపై లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును పరిశీలించిన జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జూ ఇంటర్ మీడియట్ న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. డౌజియండే నగరంలోని రెండో కెమికల్ ప్లాంట్ ప్రధానంగా కిల్లర్ గ్లైఫోసేట్ను ఉత్పత్తి చేస్తుంది. 2012-2013 మొదలుకొని ఇది జైజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హ్యాంగ్జూ... ప్రొవిన్షియల్ క్జుహౌ నగరాలతోపాటు జియాంగ్జి, శాందొంగ్ లోని నదుల్లో వ్యర్థాలు పోసేందుకు హాంగాన్ కార్గో కంపెనీ, రాంగ్ షెంగ్ కెమికల్ కంపెనీల సహాయం తీసుకుంది. అయితే ఆయా కంపెనీలు ప్రమాదకర వ్యర్థాలను పారేసేందుకు లైసెన్స్ ను పొందాయి. కాగా వ్యర్థాలతో పాడైన నదులను శుభ్రపరిచేందుకు, రిపేర్లు చేసేందుకు సుమారు 12.3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జైజియాంగ్ పర్యావరణ రక్షణ పరిశోధన సంస్థ అంచనా వేయడంతో కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వ్యర్థాలను నింపేసిన మూడు కంపెనీల యాజమాన్యాలతో కలపి మొత్తం పదిమందికి తొమ్మిదేళ్ళనుంచి ఒక సంవత్సరం పది నెలల వరకూ జైలు శిక్షతో పాటు, 8.5 మిలియన్ యువాన్ల జరిమానా వేసినట్లు ప్రభుత్వ రంగ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
బడికైనా, గుడికైనా.. ఇలాగే వెళ్తారు!
ఇటు జమ్ము-పూంచ్ హైవే.. అటు చాక్లీ, ఖర్దిను, అప్పర్ పోథా గ్రామాలు. మధ్యలో రాజౌరి ప్రధాన నది. ఈ మూడు గ్రామాల వాసులు బయట ప్రపంచానికి అనుసంధానం కావాలంటే ఈ రాజౌరీ నదిని దాటాలి. కానీ ఈ నదిపై అధికారులు ఎలాంటి వంతెన నిర్మించలేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి.. సొంతంగా తయారుచేసుకున్న పడవల్లో ఇలా నదిని దాటుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాలన్నా.. ఆపత్కాలంలో ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన పడవలే వారికి దిక్కు. అయినా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మించడానికి తలపెట్టింది. కానీ నత్తనడకన సాగుతోంది. అది ఎప్పుడూ పూర్తవుతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇలా సొంతంగా నిర్మించుకున్న పడవల్లో నదిని దాటి బయటి ప్రపంచానికి అనుసంధానం అవుతున్నామని చాక్లీ గ్రామ ప్రజలు చెప్తున్నారు. -
కృష్ణా పుష్కరాలకు 170 కొత్త ఘాట్లు
పెడన: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్తగా 170 ఘాట్లు నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పెడనలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన అపశ్రుతి పునరావృతం కాకుండా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కరాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. అతడి మృతికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను బాధ్యుల్ని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేసి విద్యార్థుల్ని రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు, ఉపాధ్యక్షులు కట్టా జోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మెక్సికోలో నదిలో పడిన బస్సు.. 20మంది మృతి
-
వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు
చిత్తూరు: వాగులో బస్సు కొట్టుకుపోయిన సంఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
'పంబలో దుస్తులు వేస్తే కఠిన చర్యలు'
కేరళ: శబరిమల యాత్రికులకులు పంబలో తమ వస్త్రాలను పడేయడం పట్ల కేరళ హై కోర్టు తీవ్రంగా స్పందించింది. నదీ జలాలను కలుషితం చేసే చర్యలను సమర్థించబోమని తెలిపింది. వస్త్రాలను, ఇతర వస్తువులను నదిలో పడేసినట్లయితే వారికి చట్ట ప్రకారం శిక్షల ఉంటాయని తెలిపింది. దీని ప్రకారం ఈ చర్యలకు పాల్పడిన వారికి గరిష్టంగా ఆరేళ్ల శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. హైకోర్టు తీర్పుపై శబరిమల స్పెషల్ కమీషనర్ బాబు మాట్లాడుతూ.. శబరిమల యాత్రికులు పుణ్యం కోసం లేదా మరే ఇతర కారణాల చేతనైనా తమకు సంబంధించిన తమ దుస్తులు, ఇతర వస్తువులను పంబ నదిలో వేసి నదిని కలుషితం చేసే చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయన్నారు. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
-
చిన్నారిని వదిలి..నదిలో దూకిన తల్లి
యలమంచిలి : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి సమీపంలోని చించినాడు వంతెనపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే... ఓ మహిళ తన ఆర్నెల్ల పాపతో కలిసి చించినాడు వంతెన వద్దకు వెళ్లి పాపతో పాటు తన బ్యాగ్, చెప్పులను అక్కడ వదిలి మహిళ నదిలోకి దూకింది. గమనించిన స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సంఘటన స్థలంలో చిన్నారి ఏడుస్తుండటం అందరినీ కలచి వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పాపను, ఆమె వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వదిలిన బ్యాగులో ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఏమీ లేవు. -
పైప్లైన్ పగిలి చెరువును తలపిస్తున్న రోడ్డు
-
నదిలో వ్యక్తి గల్లంతు
విశాఖ జిల్లా చోడవరం మండలం భోగాపురం వద్ద పేద్దేరు నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భోగాపురం గ్రామానికి చెందిన రాపేటి గణేశ్ (32) బుధవారం ఉదయం నదిలో స్నానానికి దిగి మునిగి పోయాడు. దీంతో స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది అతడి కోసం గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో నేవీ సిబ్బంది సహాయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. -
ఉప్పొంగుతున్న వేదావతి.. రాకపోకలు బంద్
దేవనకొండ: వేదావతి నది పొంగిపొర్లుతుండటంతో ఆంధ్రపద్రేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని గుండ్లకొండ సమీపంలోని వేదావతి నంది ఉప్పొంగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో రెండు వైపుల వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. -
192 ఫీట్ల ఎత్తైన శిఖరం నుంచి నదిలోకి జంప్
-
మధ్యప్రదేశ్లో నదిలో పడ్డ రెండు రైళ్లు
-
మధ్యప్రదేశ్లో నదిలో పడ్డ రెండు రైళ్లు
* బ్రిడ్జి దాటుతూ అర్ధరాత్రి మాచక్ నదిలో పడిపోయిన కామయాని, జనతా ఎక్స్ప్రెస్లు * రెండు ఇంజన్లతో పాటు దాదాపు 15 బోగీలు నదిలో పడ్డాయంటున్న రైల్వే అధికారులు * మృతులు భారీగా ఉండే అవకాశం.. * హుటాహుటిన ఘటనాస్థలికి సహాయ బృందాలు హర్దా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. రాజధాని భోపాల్కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి 11.45 ప్రాంతంలో పట్టాలు తప్పాయి. రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందారు. ‘‘ముందుగా ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. వెనక భాగంలోని దాదాపు 10 బోగీలదాకా నదిలోకి పడిపోయాయి. అదే సమయంలో జబల్పూర్ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. ఆ రైలు ఇంజన్తో పాటు 5 బోగీలు కూడా నదిలోకి పడిపోయాయి’’ అని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. అయితే, కామయానిలో ఎస్ 1 నుంచి ఎస్ 11 వరకు మొత్తం 11 బోగీలు, అలాగే జనతాలో ఎస్ 2 నుంచి ఎస్ 6 వరకు 5 బోగీలు కలిపి మొత్తం 16 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు నది పొంగిపొర్లుతుండటం, బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉండటం ప్రమాదాలకు కారణం కావచ్చంటున్నారు. కడపటి సమాచారం అందేవరకూ కూడా రెండు రైళ్ల తాలూకు ఇంజన్లు, బోగీలు ఇంకా నదిలోనే ఉన్నాయని సక్సేనా తెలిపారు. సహాయక చర్యలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 25 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని హుటాహుటిన ఘటనా స్థలికి పంపినట్టు ఆయన ట్వీటర్లో వెల్లడించారు. ఘటనా స్థలి వద్ద భారీ వర్షం పడుతుండటం, చిమ్మచీకటిగా ఉండటంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. బోగీలను వీలైనంత త్వరగా నదిలోంచి బయటికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. హర్దా కలెక్టర్ రజనీశ్ శ్రీవాస్తవ, జిల్లా ఎస్పీ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు సహాయక సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక రైల్లో ఘటనా స్థలికి వెళ్లారు. కాగా, నదిలో పడిపోయిన రెండు రైళ్లకు సంబంధించిన 15 బోగీలలో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులను రక్షించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, ఆ ప్రవాహంలో 50 నుంచి 60 మంది వరకు కొట్టుకపోయారంటూ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో రైళ్ల ప్రమాదాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి బయలుదేరే పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు రాజస్థాన్, కోట మీదుగా మళ్లించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. -
నదిలో పడి వ్యక్తి గల్లంతు
శ్రీకాకుళం: ప్రమాదవశాత్తు నదిలోపడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని మహేంద్రతనయ నది కాలి వంతెన పై నుంచి జారిపడ్డాడు. బాధితుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (పాతపట్నం) -
ఫోటో దిగుతూ నదిలో పడి యువకుడు గల్లంతు
తూర్పు గోదావరి(పి. గన్నవరం): నదిలో ఫోటోలకు ఫోజులిస్తూ ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కె. ముంజవరం గ్రామానికి చెందిన చంద్రస్వామి నాయుడు(19), గుంటూరులో సీఏ చదువుతున్నాడు. అయితే ఇటీవలే ఇంటికి వచ్చిన స్వామి నాయుడు స్నేహితులతో కలసి గోదావరి నది స్నానానికి వెళ్లాడు. నదిలో ఫోటోలు దిగుతుండగా చంద్రస్వామి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. -
అక్కాచెల్లెళ్లు చనిపోయారు
కరీంనగర్: పుణ్య స్నానానికి వెళ్లి అక్కాచెల్లెలు ప్రమాదవశాత్తు చనిపోయిన విషాద ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన కట్ల లత, రాజేందర్ దంపతుల కుమార్తెలు శ్రావణి, పవిత్రలు అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు గురువారం ధర్మపురికి వెళ్లారు. అక్కడి నుంచి గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లి అనుకోని విధంగా మృత్యువాత పడ్డారు. దీంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
నది నవ్వుతుంది చూడు!
లేలేత పొద్దుల్లో... దీపం, వల, పెద్దబుట్ట... మొదలైన సరంజామాతో జాలరులు చేపల వేటకు వెళ్లడం వెయ్యిసంవత్సరాల సంప్రదాయం. అయితే ఏది మరచినా తమ ఇంటి పెంపుడు పక్షిని మాత్రం మరువరు చైనా జాలరులు. నీటిపై మెరుపులా మెరిసి ఎగిరే చేపలను పట్టి యజమాని బుట్టలో వేయడంలో ఈ పక్షులు నేర్పరులు. సరే, వాటి నేర్పరితనానికేంగానీ, సూర్యకాంతి సోకని ఉదయవేళల్లో చేపల వేట ఎన్నో అద్భుతదృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ఇక ఫొటోగ్రాఫర్లకైతే పండగే! రష్యా నుంచి పనిగట్టుకొని చైనాలోని లి ఇన్ గులిన్ నది చెంతన వాలాడు ఫొటోగ్రాఫర్ రోగ్తెన్వ. చల్లని గాలుల మధ్య, కాపు కాసినట్లు కనబడుతున్న నల్లటి కొండల మధ్య చేపల వేటకు సంబంధించిన రకరకాల దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. చేపల సంగతి సరే, ఆ దృశ్యాల్లో మార్మికంగా వినిపించే నది నవ్వు.... మరో పెద్ద ఆకర్షణ! -
కోనేరులో పడి లాయర్ మృతి
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కోనేట్లో పడి ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే న్యాయవాది చెంచుముని (46) గురువారం ఉదయం వైష్ణవి కోనేరుకి ఎప్పటిలాగే స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఆయన కోనేట్లో పడి మృతి చెందారు. కాగా ఇప్పటివరకూ ఆ కోనేరులో పడి 16మంతి మృతి చెందారని, అయినా దేవస్థానం అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెంచుముని మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. (కాళహస్తి నుంచి: సాక్షి టీవీ రిపోర్టర్ శంకర్ రెడ్డి) -
ఈత సరదాతో ...మృత్యు ఒడికి
-
ఈత సరదాతో ...మృత్యు ఒడికి
తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక వద్ద చిన్న గోదావరిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు చిన్నారుల ఉదంతం విషాదంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం మైలు గణేష్(5), కాటాడి కాసులయ్య(6) అనే ఇద్దరు చిన్నారులు ఆడుకునేందుకు చిన గోదావరి వద్దకు వెళ్లారు. గట్టున దుస్తులు విప్పి స్నానానికి గోదావరిలోకి దిగారు. సాయంత్రం కావస్తున్నా పిల్లలు ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెదికారు. చివరకు వీరిద్దరూ విగతజీవులై కనిపించారు. దీంతో కనకాయలంక గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
నదీ స్నానానికి వెళ్లి బాలుడి మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో స్నానానికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి చంపావతి నదికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. వివరాలు..గజపతినగరానికి చెందిన సిద్ధు అనే బాలుడు శనివారం ఉదయం స్నేహితులతో కలసి చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లాడు. నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. -
గంగానదిలో డజన్ల కొద్ది మృత దేహాలు !
-
కృష్ణమ్మ పరవళ్లు
-
నదిలో పడిన బస్సు:2 రష్యన్లు మృతి
డెహ్రాడూన్: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది గల్లంతయిన విషాధకర సంఘటనను చూస్తుండగానే.. ఉత్తరాదిన మరో దుర్ఘటన సంభవించింది. హిమాచల్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో ఓ ప్రైవేట్ బస్సు నదిలోకి పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం గంగోత్రి వెళ్తున్న బస్సు బాగీరథి నదిలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు రష్యన్లు మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
జలసిరులెక్కడ?
-
మానవత్వమే మనిషి సహజగుణం
బౌద్ధవాణి నిరంజనా నది ఒడ్డున ఒక బౌద్ధ భిక్షువు స్నానం చేస్తున్నాడు. ఆయన స్నానం చేసే చోటుకు దగ్గరగా ఒక మేడి చెట్టు ఉంది. అది ఏటి గట్టున ఉండి నదిలోకి వాలి ఉంది. ఆ చెట్టు కొమ్మ మీద ఒక తేలు ఉంది. అది ఆ చెట్టు కొమ్మలను అల్లుకున్న సాలెగూడు కేసి పాకుతూ జారి తటాలున నీటిలో పడింది. తేలు నీటిలో జారి పడడం చూసిన భిక్షువు గబాలున పోయి రెండు చేతులను దోసిలిగా చేసి ఆ తేలును నీటిలో మునగకుండా పెకైత్తాడు. దాన్ని మెల్లగా మరలా కొమ్మ మీద పెట్టాడు. ఆ సమయంలో తేలు కసుక్కున కుట్టింది. అది అలా కుట్టగానే భిక్షువు బాధతో ‘‘అమ్మా’’అంటూ పెద్దగా అరిచాడు. అంతలోనే ఆ తేలు మరలా జారి పడింది. ఆ భిక్షువు మరలా రక్షించి, కొమ్మ మీద ఉంచాడు. అది మరలా కుట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. అది నీటిలో పడడం, భిక్షువు దానిని రక్షించడం, తిరిగి అది కుట్టడం, భిక్షువు బాధతో అరవడం... ఈ తతంగాన్నంతా ఒడ్డున గొర్రెలు మేపుకుంటున్న ఒక వ్యక్తి చూసి, పగలబడి నవ్వుతూ, ‘‘స్వామీ! తేలు కుడుతుందని తెలియదా! దాన్ని కాపాడడం ఎందుకు? కుట్టినప్పుడల్లా అమ్మా అబ్బా అని అరవడం ఎందుకు? మీకేమైనా పిచ్చా?’’ అన్నాడు. దానికి భిక్షువు నవ్వుతూ, ‘‘నాయనా, కుట్టడం దాని నైజం. రక్షించడం నా నైజం. కుట్టకపోతే అది దాని సహజగుణాన్ని మరచిపోయినట్లు. రక్షించకపోతే నేను నా సహజగుణాన్ని మరచినట్లు. మానవత్వం అంటే ఇదే! ఎదుటివారి కష్టసుఖాల్ని అర్థం చేసుకునే గుణం ఈ చరాచర సృష్టిలో మనిషి ఒక్కడికే ఉంది. దాన్ని కోల్పోతే మనం మానవత్వాన్ని కోల్పోయినట్లే’’ అన్నాడు. పశువుల కాపరి భిక్షువుకు నమస్కరించాడు. - బొర్రా గోవర్థన్ -
కన్నీరు మున్నీరు
అనకాపల్లి రూరల్, న్యూస్లైన్: చిన్ననాటి స్నేహితుడికి ఉపనయనమంటే అంతా సంతోషిం చారు. తాము మళ్లీ కలుసుకోవడానికి ఇదో మంచి సందర్భమని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ పన్నెండు మంది యువకులు తుమ్మపాలలో మిత్రుడి ఇంటికి వచ్చారు. ఛలోక్తులతో కాసేపు సందడి చేశారు. స్నేహితుడి వే డుక కొనసాగుతూ ఉండగా, అతడి తమ్ముడితో నదికి స్నానానికని బయల్దేరారు. తోడు వచ్చిన తమ్ముడితోపాటు ఇద్దరు యువకులు నదిలో పొంచి ఉన్న మృత్యువు కోరలకు చిక్కారు. స్నేహితులంతా చూస్తూ ఉండగానే జలసమాధి అయ్యారు. వారితోపాటు నదిలో దిగిన ఇద్దరు మాత్రం చేరువలో ఉన్నవారి చేయూతతో బతికి బయిటపడ్డారు. జరిగిన ఘోరాన్ని చూసి మిగి లిన మిత్రులు బావురుమన్నారు. అందివస్తారని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు ఈ ఘాతు కం గురించి తెలియడంతో గుండె పగిలి కూలబ డ్డారు. విషాదసాగరంలో మునిగిపోయారు. కంటిపాపల వంటి కుమారులు కన్నుమూశారని తెలియడంతో వారు గుండెలు పగిలేలా విలపించారు. చనిపోయిన ముగ్గురూ రెండు పదుల వయస్సు దాటనివారే కావడంతో తుమ్మపాలలో కన్నీరు పెట్టనివారు లేరు. ఉపనయనంలో విషాదం కందర్ప జగన్నాథరావు మనుమడు సంతోష్ ఉపనయనం కావడంతో అతని స్నేహితులు విశాఖ నగరంలో వేరువేరు ప్రాంతాల నుంచి తుమ్మపాల వచ్చారు. సంతోష్ తమ్ముడు మురళీకృష్ణతో కలసి వీరు శారదానదికి స్నానానికని ఉదయం పదిగంటల సమయంలో బయల్దేరారు. అమర్నాథ్, పృథ్వీరాజ్, మురళీకృష్ణ, బోయి చైతన్య, కె. అభిషేక్ ముందుగా స్నానానికి దిగారు. కానీ గట్టు వద్ద అధికంగా నాచు పేరుకపోవడంతో సమీపంలోని గొయ్యిలోకి దిగబడ్డారు. వారిని మిగిలిన స్నేహితులు, సమీపంలోని రజకులు రక్షించేందుకు ప్రయత్నించారు. చైతన్య, అభిషేక్లను గట్టెక్కించినా మిగిలిన ముగ్గురూ అందరి కళ్లెదుటే మృత్యువాతపడ్డారు. జరిగిన ఘోరం గురించి సమాచారమందుకున్న మురళీకృష్ణ తల్లితండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా విశాఖ నుంచి పరుగుపరుగున వెళ్లారు. నది ఒడ్డున పడి ఉన్న తమ పిల్లలలను చూసి అంతా గుండెలు బాదుకున్నారు.గ్రామస్తులు సంఘటన స్థలానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. చేతికందివచ్చిన యువకులు విగతజీవులు కావడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు అమర్నాథ్ తండ్రి ఆంజనేయులు ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు.పృథ్వీ తండ్రి ఎన్ఏడీలో ప్రైవేటుగా వెహికల్ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మురళీకృష్ణ తండ్రి వెంకటేశ్వరరావు గాజువాకలో ఉద్యోగం చేస్తున్నారు. -
నర్మద, క్షిప్ర రివర్ లింక్ ప్రారంభం
-
వాగు దాటుతూ నలుగురి మృతి
-
ఉగ్ర గోదారి