Rocket
-
సునీతా రాక అప్పుడే !
-
స్పేస్ఎక్స్ స్టార్షిప్ రాకెట్... ప్రయోగం విఫలం
టెక్సాస్: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చేదు అనుభవం ఎదురైంది. స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ పునరి్వనియోగ రాకెట్ ‘స్టార్షిప్’ ప్రయోగం విఫలమైంది. 123 మీటర్ల (400 అడుగులు) పొడవైన ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయింది. శకలాలు కరీబియన్ సముద్రంలో పడిపోయాయి. రాకెట్ బూస్టర్ మాత్రం క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. టెక్సాస్లోని లాంచ్ప్యాడ్ హస్తాలు బూస్టర్ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. టెక్సాస్లో మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 నిమిషాలకు స్టార్షిప్ రాకెట్ను ప్రయోగించారు. ఇది 10 డమ్మీ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. 8 నిమిషాల తర్వాత రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. స్పేస్క్రాఫ్ట్లోని ఆరు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం ఆగిపోయింది. రాకెట్ భూమిపైకి తిరిగివస్తూ గాల్లోనే పేలిపోయింది. శకలాలు నిప్పుల వర్షాన్ని తలపించాయి. కేవలం ప్రయోగాత్మకంగానే స్టార్షిప్ను ప్రయోగించినట్లు స్పేస్ఎక్స్ అధికార ప్రతినిధి డాన్ హౌట్ చెప్పారు. బూస్టర్ క్షేమంగా తిరిగిరావడం సంతోషకరమే అయినప్పటికీ రాకెట్ పేలిపోవడం బాధాకరమని అన్నారు. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్షిప్ విశ్వసనీయతను మరింత పెంచిందని తెలిపారు. ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తవహిస్తామని పేర్కొన్నారు. డమ్మీ శాటిలైట్లను అంతరిక్షంలో ఎలా వదిలిపెట్టాలన్న దానిపై సాధనకోసం స్టార్షిప్ను ప్రయోగించామని వివరించారు. మరోవైపు రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతున్న దృశ్యాలను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.SpaceX Starship breaking up and re-entering over Turks and Caicos this afternoon. pic.twitter.com/LbpJWewoYB— Molly Ploofkins™ (@Mollyploofkins) January 16, 2025 విజయం సంగతి ఏమోగానీ వినోదం మాత్రం లభించిందని చమత్కరించారు. ఇంధనం లీకేజీ వల్లే రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తివంతమైనది అయిన స్టార్షిప్ రాకెట్కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం కావడం విశేషం. ఈ రాకెట్ సాయంతోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టాలని ఎలాన్ మస్క్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రెండు స్టార్షిప్ రాకెట్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది.🚨#BREAKING: Debris was seen over the Caribbean after SpaceX's Starship broke apart during a test flight, creating a spectacular show in the sky.📌#Caicos | #IslandsWatch as multiple footage shows debris lights up the skies as SpaceX successfully launched Starship Flight 7… pic.twitter.com/ZWIUr22USV— R A W S A L E R T S (@rawsalerts) January 16, 2025 -
సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం
బీజింగ్: చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షాండోంగ్ ప్రావిన్స్లోని హయియాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియెలాంగ్–3 రాకెట్ను ప్రయోగించింది. ఈ ఘన ఇంధన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. సముద్రంలోని వేదికల పైనుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ పాడ్గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. డ్రోన్ యుద్ధ తంత్రం కోసం కొత్త యుద్ధ నౌక యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్ క్యారియర్లా పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైనా, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్కు కౌంట్డౌన్
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8.58 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్లో ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీలు వంపులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు సమాంతర కక్ష్యలోకి వెళ్లిన తరువాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలను అందిస్తాయి. అయితే ఉపగ్రహం బరువు మొత్తం 400కేజీలు అయినప్పటికీ ఇందులో రెండు ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే. మిగిలిన 180 కిలోలు ఉపగ్రహాల్లో ఇంధనం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాకెట్కు అన్ని దశలను పూర్తిచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తరువాత ఎంఆర్ఆర్ సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
దూసుకెళ్లే రేసుగుర్రం.. రాకెట్ వన్ బైక్ (ఫోటోలు)
-
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కలిసి రూమీ–1 రాకెట్ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ను తయారు చేసినట్లు స్పేస్జోన్ కంపెనీ వెల్లడించింది. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిన చైనా రాకెట్
లాంచ్ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకొంది. అయితే పర్వత ప్రాంతంలో ఈ రాకెట్ పడిపోవడంతో నష్టం తప్పింది. Chinas kommerzielle Trägerrakete Tianlong-3 ist bei einem Teststart abgestürzt.#China #XiJinping #Rocket #Space #SecretStory #Taiwan #Breaking #news #Explosion #USA pic.twitter.com/uIqaCFZHVG— Brennende Frage (@brennende_frage) July 1, 2024బీజింగ్ తియాన్లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్లాంగ్3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందని, గాంగ్యీ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో పడిపోయిందని వెల్లడించింది. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.పేలుడు తర్వాత అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. తియాన్లాంగ్3 రాకెట్ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది.ఇదిలా ఉంటే.. జూన్ 22న చైనా సిచువాన్ ప్రావిన్స్లో ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్మార్చ్2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. -
ఇస్రో హ్యాట్రిక్.. ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం
బెంగళూరు: దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రీ-యూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్-03) రాకెట్ పుష్పక్ను ఆదివారం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఎయిరో నాటికల్ టెస్టింగ్ రేంజ్లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.RLV-LEX3 Video pic.twitter.com/MkYLP4asYY— ISRO (@isro) June 23, 2024 ‘ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్ రాకెట్ ప్రయోగంతో ఇస్రో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇస్రో మూడో, చివరి ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్ రాకెట్ ప్రయోగం జూన్ 23న విజయవంతం అయింది. ‘పుష్పక్’ రాకెట్ సమాంతరంగా ల్యాండింగ్ను విజయవంతంగా అమలు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్థాన్ని ప్రదర్శించింది. పుష్పక్ రాకెట్ ఇస్రో ఆర్బిటాల్ పునర్వినియోగ వాహనంలోకి చేరుకుంది’ అని ఇస్రో తెలిపింది. ఇక.. పునర్వినియోగ ల్యాండింగ్ వెహికల్ (RLV) LEX-01, LEX-02 పుష్పక్ రాకెట్ ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే.Hat-trick for ISRO in RLV LEX! 🚀🇮🇳ISRO achieved its third and final consecutive success in the Reusable Launch Vehicle (RLV) Landing EXperiment (LEX) on June 23, 2024."Pushpak" executed a precise horizontal landing, showcasing advanced autonomous capabilities under… pic.twitter.com/cGMrw6mmyH— ISRO (@isro) June 23, 2024 ఈ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ‘ ఈ ప్రయోగం విజయవంతం కావటంతో.. పుష్పక్ అర్బిటాల్ టెస్ట్కు వేదికగా నిలిచింది. అంతరిక్షంలోకి ఈ రాకెట్ను ప్రయోగిస్తే.. తిరిగి భూమికి సేఫ్గా ల్యాండ్ కానుంది. దీంతో అంతరిక్ష ఖర్చును తగ్గించటంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ టెక్నాలజీగా నిలుస్తుంది’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. -
అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం
-
చంద్రునిపై చైనా ల్యాండర్
బీజింగ్: చైనాకు చెందిన లూనార్ల్యాండర్ చాంగే-6 చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం ఆదివారం(జూన్2) ఉదయం అయిట్కిన్ బేసిన్ అనే పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు తెలిపింది. చాంగే-6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమికి బయల్దేరనుండటం విశేషం. మే3వ తేదీన చాంగే-6 భూమి నుంచి బయలుదేరి 53 రోజులు ప్రయాణించి చంద్రున్ని చేరింది. రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపుల్స్ తీసుకోనుంది. తర్వాత లూనార్ ల్యాండర్లోని అసెండర్ మాడ్యూల్ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్తో అనుసంధానమవతుంది. ఆర్బిటర్ మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్లోని రీఎంట్రీ మాడ్యూల్ శాంపుల్స్ తీసుకుని భూమిపైన దిగుతుంది. చంద్రుడి అవతలివైపు మొత్తం గోతులతో నిండి ఉండటం వల్ల అటువైపు ల్యాండ్ అయి వ్యోమనౌకలు తిరిగి రావడం అంత సులువు కాదు. అయితే చైనా ఈ ఫీట్ను సాధిస్తే 2030లో చంద్రునిపై వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం అయినట్లే. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్ను నిందించింది. ఇజ్రాయెల్పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
నేడు నింగిలోకి అగ్నిబాన్ రాకెట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రయివేట్ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే చిన్న తరహా రాకెట్ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్స్పేస్ సంస్థ ఆహ్వానం మేరకు షార్లోని సౌండింగ్ రాకెట్ లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్ (ఉపగ్రహం)ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్ సంస్థ చూసుకుంటుండగా, షార్ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు. అయితే షార్ వేదికగా ప్రయివేట్ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్ సంస్థకు షార్కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు. అగ్నిబాన్ రాకెట్ వివరాలివి పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజన్లతో ఈ రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్ను ప్రయోగిస్తారు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ గతేడాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా, రెండోసారి శనివారం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. -
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్లో మూడో లాంచ్ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
స్టాలిన్ బర్త్డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్కు చైనా స్టిక్కర్ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. -
ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ
టోక్యో: అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. BIG BREAKING NEWS - Japan tests Rocket Engine powered by Cow Dung 🔥🔥 Japanese engineers have successfully test-fired a space rocket engine which runs on Cow Dung ⚡ This is REVOLUTIONARY because it will combat pollution, reduce emissions and also address energy needs in… pic.twitter.com/3qzJ6TGyQz — Times Algebra (@TimesAlgebraIND) December 19, 2023 జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్పోర్ట్ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. / Breaking news from the test stand🔥 \ Here's a short footage of IST's first static fire test using Liquid Biomethane🚀 pic.twitter.com/695ld0kGmo — Interstellar Technologies (@istellartech_en) December 7, 2023 -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్లైన్ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్లో ఈ స్పేస్లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1 సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ, హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన ఏడంతస్తుల పొడవైన, బహుళ దశల లో–ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్–1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ రాకెట్ను ఆవిష్కరించారు. అలాగే 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ సంస్థ నూతన కేంద్ర కార్యాలయం ‘మ్యాక్స్–క్యూ’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్రసింగ్ మాట్లాడుతూ స్కైరూట్ ఏరోస్పేస్ను దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ చందన తదితరులు పాల్గొన్నారు. 2024 తొలినాళ్లలో ప్రయోగం విక్రమ్–1 పూర్తిగా కార్బన్–ఫైబర్తో తయారైన రాకెట్. ఇందులో 3డీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచగలదు. 2024 తొలినాళ్లలోనే విక్రమ్–1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్–ఎస్ రాకెట్ని విజయవంతంగా ప్రయోగించింది. -
మరో రాకెట్ను ప్రయోగించనున్న స్కైరూట్.. తేదీ ఎప్పుడంటే..
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. అంతర్జాతీయంగా స్పేస్ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు రాకెట్లును పంపుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. తొలిసారిగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ గతేడాది విక్రమ్-ఎస్ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంతో విక్రమ్-1ను లాంచ్చేసేందుకు సిద్ధమవుతుంది. స్కైరూట్ సంస్థ రూపొందించిన ‘విక్రమ్-1’ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధానకార్యాలయం(మ్యాక్స్-క్యూ)ను మంత్రి సందర్శించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న స్పేస్, బయోటెక్, అగ్రికల్చర్ రంగాల్లో యువతకు అపారఅవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో స్టార్టప్ సంస్థల సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ప్రధాని మోదీ కాంక్షిస్తున్నారని చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన మాట్లాడుతూ అసాధారణమైన వాటిని సాధించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. సంస్థ సీఓఓ భరత్ డాకా మాట్లాడుతూ విక్రమ్-1 డిజైన్ దేశీయంగా తయారుచేసినట్లు చెప్పారు. విక్రమ్-1 దాదాపు 300కిలోల పేలోడ్ను భూదిగువ కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్. ఈ ప్రయోగం వివిధ దశల్లో జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. విక్రమ్-1ను 2024లో ప్రయోగించనున్నారు. స్కైరూట్ క్యార్యాలయం అయిన మ్యాక్స్-క్యూలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 300 మంది పనిచేసేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. -
గగన్యాన్కు ముందు నింగిలోకి టీవీ–డీ1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్యాన్ ప్రాజెక్టుకు ముందు ఈనెల 21న మానవ రహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్టీలో టీవీ–డీ1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు. టీవీ–డీ1 ప్రయోగమిలా.. ♦ టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది. ♦ ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోతుంది. ♦ 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. ♦ ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది. ♦ 96.2 సెకన్లకు అపెక్స్ కవర్ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.1 సెకన్ల తరువాత డ్రోగ్ పారాచూట్ విడిపోతుంది. ♦ 296.3 సెకన్లకు పైలట్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.5 సెకన్లకు మెయిన్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపునకు తీసుకొస్తుంది. ♦ 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది. -
మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు
తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్శాట్–బీడబ్ల్యూశాట్ను స్పెయిన్ దేశంలో అక్కడి బీ2 స్పేస్ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంంలో పీహెచ్డీ స్కాలర్ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్ను ఇక్కడి తన సొంత ‘ఎన్–స్పేస్టెక్’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు. ఇదీ నేపథ్యం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్లో ఎంటెక్ చేశారు. తన థీసిస్లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్–స్పేస్టెక్’ అనే సొంత కంపెనీని ఆరంభించారు. అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్ పేరుతో క్యూబ్శాట్ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది. ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగంలో భాగస్వామి తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్–ఎస్ రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సబ్ ఆర్బిట్లోకి ప్రయోగించారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్–2 పేలోడ్ ఒకటి కావటం గమనించాల్సిన అంశం. స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్ ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్, ఉత్తేజ్తో కలిసి బీడబ్ల్యూశాట్ను తయారుచేశారు. మయన్మార్ దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు శాటిలైట్ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్ను మయన్మార్ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అనంతరం బీ2 స్పేస్ కంపెనీ సహకారంతో స్పెయిన్లో ప్రయోగించారు. తాజా పేలోడ్తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్ ప్రెషర్, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్లో ప్రయోగించే ఐయూ క్యూబ్శాట్ పేలోడ్ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్, అత్తమామలు కొత్తమాసు కుమార్, చంపకవల్లి, తండ్రి కేఎన్ ప్రసాద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్లోని బ్రహ్మప్రకాష్హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్ప్యాడ్పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం. ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది. దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉన్న రోజున తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! -
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్ను మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)కు తీసుకువచ్చారు. అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్ శిఖరభాగాన అమర్చి.. హీట్షీల్డ్ క్లోజ్ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. -
సీమాను పాక్ పంపాలంటూ హిందూ దేవాలయంపై దాడి
పాకిస్తాన్లోని దక్షిణ ప్రావిన్స్కు చెందిన సింధ్లోని ఒక హిందూ దేవాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. సింధ్లోని కాష్మోర్ జిల్లాలో స్థానిక హిందూ సంఘాలు నిర్మించిన ఒక దేవాలయంపై దాడి చేయడానికి దుండగులు రాకెట్ లాంచర్ను ఉపయోగించారు. అలాగే మైనారిటీ హిందూ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై వారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న కాష్మోర్-కంద్కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ఇర్ఫాన్ సమ్మో నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. రాకెట్ లాంచర్తో దాడి పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బగ్రీ కమ్యూనిటీ వార్షిక మతపరమైన సేవల కోసం తెరిచిన ఆలయంపై దుండగులు రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది. కాగా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకునేంతలో దాడికి పాల్పడినవారు అప్పటికే పారిపోయారు. ఈ దాడిలో 8-9 మంది సాయుధ దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. బగ్రీ వర్గానికి చెందిన డాక్టర్ సురేష్ మాట్లాడుతూ దుండగులు ప్రయోగించిన రాకెట్ వల్ల ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులు భయంతో కాలం గడుపుతున్నారు. సీమా హైదర్ను తిరిగి పాకిస్తాన్ పంపించకపోతే ఇలానే హిందూ దేవాలయాలపై దాడులు చేస్తామని ఆ దుండగులు బెదిరించారు. 2019లో పాక్కు చెందిన సీమా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ, హిందూ వ్యక్తిని ప్రేమించానంటూ, తన నలుగురు పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది. వీసా లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు సీమాను గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆమె ప్రేమికుడు సచిన్ ఆ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్ను కూడా అరెస్టు చేశారు. అయితే అతను ఇటీవలే విడుదలయ్యాడు. హిందూ సభ్యుల కిడ్నాప్ కాష్మోర్, ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణించడంపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ సమాజానికి చెందిన 30 మంది సభ్యులను వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలు కిడ్నాప్ చేశాయని హెచ్ఆర్సీపీ పేర్కొంది. ఈ ముఠాలు అధునాతన ఆయుధాలను ఉపయోగించి హిందూ ప్రార్థనా స్థలాలపై దాడి చేస్తామని బెదిరించినట్లు తమకు సమాచారం అందిందని వివరించింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది. కరాచీ అనేక పురాతన హిందూ దేవాలయాలకు నిలయంగా ఉంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ కమ్యూనిటీ సభ్యులు అధికంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో చైనా ‘పెంగ్’.. భారత్లోకి చొరబడుతూ.. -
ఆస్ట్రేలియా బీచ్లో కలకలం.. ఈ మిస్టరీ వస్తువు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిందేనా?
ఆస్ట్రేలియా బీచ్లో ఒక మిస్టరీ వస్తువు దర్శనమిస్తోంది. అకస్మాత్తుగా సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఆ శకలాలు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. కాగా దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎవరూ స్పందించలేదు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువులా ఒకటి దర్శనమిస్తోంది. ఆ వస్తువు ఏమయ్యి ఉండొచ్చని ఆ ప్రాంత అధికారులు విచారణను ప్రారంభించారు. ఇదిలా ఉండగా భారత్ చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియన్ గగనతలంలో కనిపించడం గమనార్హం. దీంతో ఇది చంద్రయాన్కు సంబంధించినది వస్తువు అయ్యిండచ్చనే ఊహాగానాలతో ట్విటర్లో కామెంట్లతో నిండిపోతోంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. భారతీయ అంతరిక్ష సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్లో ఉన్న వస్తువుకు సంబంధించి తాము విచారణ చేస్తున్నామని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ వరుస ట్వీట్లలో తెలిపింది. "మేము ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్లో ఉన్న ఈ వస్తువుకు సంబంధించిన విచారణలు చేస్తున్నాము. ఆ వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం నుండి వచ్చి ఉండవచ్చుని భావిస్తున్నాం. మేము మరింత సమాచారాన్ని అందించగల వారితో సంభాషిస్తున్నాం" అని ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ట్వీట్ చేసింది. Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3. And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE — Debapratim (@debapratim_) July 17, 2023 -
పరీక్ష చేస్తుండగా.. పేలిపోయిన జపాన్ రాకెట్ ఇంజిన్
టెక్నాలజీ పరంగా జపాన్ ఎంతో అభివృద్ది చెందింది. అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ అగ్రదేశాలకు పోటీనిస్తూ వస్తోంది ఈ దేశం. అంతటి పేరు ప్రఖ్యాతులున్న జపాన్కు అంతరిక్ష ప్రయోగాల పరంగా మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్కు చెందిన అంతరిక్ష సంస్థ అభివృద్ది చేస్తున్న ఒక రాకెట్ ఇంజిన్ పరీక్ష సమయంలో పేలిపోయింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండో దశ ఇంజిన్కు సంబంధించిన గ్రౌండ్ టెస్ట్ ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. ఖ్యుషు దీవిలో యుచినోరా స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.50 నిమిషాలకుఎప్సిలాన్-6 రాకెట్ రాకెట్ ఇంజిన్ను పరీక్షిస్తుండగా పేలిపోయింది. ఈ పేలుడు గురించి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఉదయం 9.57 గంటలకు అధికారికంగా ప్రకటించింది. అకిటా ప్రిఫెక్చర్లోని నోషిరో టెస్టింగ్ సెంటర్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రకారం, పెరుగుతున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రస్తుత ఎప్సిలాన్ సిరీస్కు వారసుడిగా ఎప్సిలాన్ S ను అభివృద్ధి చేస్తోంది. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. చదవండి గూగుల్ మ్యాప్ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? -
Chandrayaan 3: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా' రీతు కరిధాల్..
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే ఆనంద తరంగాలలో వీరు...’ అన్నది చంద్రయాన్–3 ఆ ఆనంద తరంగాలలో తేలియాడిన అసంఖ్యాక భారతీయులలో ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్న రీతు కరిధాల్ ఒకరు. మూడు దశలు పూర్తి చేసుకొని చంద్రయాన్–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. ‘చంద్రయాన్–3’లో ‘నేను సైతం’ అంట మిషన్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు స్వీకరించింది రీతు కరిధాల్. చిన్నప్పటి కలలు కలలుగానే ఉండిపోవు. కష్టపడితే ఆ కలలు నిజమవుతాయి. పదిమంది మన గురించి గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి... అని చెప్పడానికి రీతు కరిధాల్ నిలువెత్తు నిదర్శనం. ‘ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలకు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కుదురుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?’ అనే ప్రశ్నకు రీతు కరిధాల్ మాటల్లో సమాధానం దొరుకుతుంది... ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతు కరిధాల్కు చిన్నప్పడు ఆకాశం వైపు చూడడం అంటే ఇష్టం. రాత్రులలో గంటల తరబడి ఆకాశంకేసి చూసేది. నక్షత్రాల గురిం ఆలోచించేది. ‘చంద్రుడు ఒకసారి పెద్దగా, ఒకసారి చిన్నగా ఎందుకు కనిపిస్తాడు?’... లాంటి సందేహాలెన్నో ఆమెకు వచ్చేవి. అంతరిక్షంపై రీతు ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ పోయింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి అంతరిక్షం, ఇస్రో, నాసాకు సంబంధించి పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలను కట్ చేసి ఫైల్ చేసుకునేది. ‘యూనివర్శిటీ ఆఫ్ లక్నో’లో ఎం.ఎస్సీ., బెంగళరులోని ఇండియన్ ఇన్స్టిట్యట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసింది. 1997లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘మిషన్ ఎనాలసిస్ డివిజన్’ లో తొలి ఉద్యోగం. తొలి టాస్క్ తన ముందుకు వచ్చినప్పుడు... ‘చాలా కష్టం’ అనుకుంది. ఆ సమయంలో ఆ కష్టాన్ని పక్కకు తోసి టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడానికి తాను చదువుకున్న ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ కంటే తనమీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఎక్కువగా ఉపయోగపడింది. ఆ తరువాత కూడా ప్రాజెక్ట్ల రపంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ‘టైమ్ అండ్ ది టార్గెట్’ను దృష్టిలో పెట్టుకొని కాలంతో పరుగు తీసింది. ‘అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. పొద్దుటి నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయితే అదేమీ నాకు భారంగా, కష్టంగా అనిపించేది కాదు. చేస్తున్న పని ఇష్టమైనది కావడమే దీనికి కారణం. అప్పట్లో ఎక్కువమంది మహిళలు ఇస్రోలో లేరు. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్కు, ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కు ఒంటరిగానే వెళ్లేదాన్ని. ఎప్పుడ భయం అనిపించేది కాదు’ అంటుంది రీతు. ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘ఇస్రో’ చేపట్టిన ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు చేపట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళాయాన్ మిషన్’లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా, చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్గా పనిచేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు కోచింగ్ సెంటర్లకు వెళ్లేంత స్థోమత ఉండేది కాదు. చదువుపై తన ఆసక్తే తన శక్తిగా మారింది. బీఎస్సీ పూర్తికాగానే ‘ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు కదా’ అనే మాటలు చుట్టాలు పక్కాల నుంచి వినిపించేవి. ‘ఇస్రోలో పనిచేయాలనేది నా కల’ అని వారికి స్పష్టంగా చెప్పేది రీతు. తన పుస్తకం ‘దోజ్ మాగ్నిఫిసెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ కోసం మిన్నీ వేద్ రీతు కరిధాల్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్యలో తన అనుభవాలను ఇలా పంచుకుంది రీతు... ‘ఇస్రోలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. లింగవివక్షతకు తావు లేదు. ప్రతిభ మాత్రమే ముఖ్యం అవుతుంది. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఫీల్డ్లో సీనియర్ ఉమెన్ సైంటిస్ట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్లు కావడం దీనికి నిదర్శనం. నా తొలి ప్రాజెక్ట్ చేయడానికి ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది’ ‘టైమ్ మేనేజ్మెంట్’కు అధిక ప్రా«ధాన్యత ఇచ్చే రీతు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా పిల్లల దగ్గర కూర్చొని వారితో హోంవర్క్ చేయించడం మరిచేది కాదు. ‘మంగళాయాన్ మిషన్’లో భాగమైనప్పుడు రీతు కువరుడి వయసు తొమ్మిది, కూతురు వయసు నాలుగు సంవత్సరాలు. క్షణం తీరిక లేని పనుల్లో కూడా ఏదో రకంగా తీరిక చేసుకొని పిల్లలతో తగిన సమయం గడిపేది. వారు నిద్రపోయిన తరువాత ఆఫీసు పని మొదలుపెట్టేది. అలా పనిచేస్తూ కుర్చీలోనే నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి! ‘ఒకసారి మా అమ్మాయికి జ్వరం వచ్చింది. హాస్పిటల్కు తీసుకువెళ్లే టైమ్ లేకపోవడంతో నా భర్త తీసుకువెళ్లాడు. ఆఫీసులో ఉన్న మాటేగానీ నా మనసంతా పాపపైనే ఉంది. పాపకు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అడుగుతుండేదాన్ని. అపరాధ భావనతో బాధ అనిపించేది. కొన్నిసార్లు స్కూల్ ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. అయితే కుటుంబం నాకు ఎప్పుడ అండగానే నిలబడింది. అదే నా బలం. ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడానికి కొన్ని కుటుంబాల్లో ఒప్పుకోరు. మగవాళ్ల విషయంలో అయితే పట్టింపులు ఉండవు. మంగళాయాన్ మిషన్ కోసం పనిచేసే రోజుల్లో ఇంటికి ఆలస్యంగా వచ్చేదాన్ని. అయితే నాపై ఉండే పనిఒత్తిడి గురించి తెలిసిన కుటుంబసభ్యులు నన్ను అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది నేను చేసే పనిపై ప్రభావం చపేది. అందుకే ఎలాంటి సమస్యలు రాకుండా, మనసు ప్రశాంతగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటుంది రీతు కరిధాల్. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్
చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్ మిషన్కు చంద్రయాన్-3ని చేరువ చేసేందుకుద్దేశించిన బాహుబలి రాకెట్ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత, శాస్త్రవేత్తలపై అభినందలు ప్రకటించారు. (తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? ) ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి,చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే ఆసక్తి, వీటన్నింటికీ సవాల్ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది. చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై ఉన్న మక్కువ నవంబర్ 1997లో ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో యావద్దేశం గర్వపడేలా చేశారు. సంబరాల్లో కుటుంబం: చంద్రయాన్ 2 ప్రాజెక్టు సఫలం కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు. (DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు) #WATCH | Lucknow: Chandrayaan-3 mission director Ritu Karidhal's family celebrates, and distributes sweets as ISRO's LVM3 M4 vehicle successfully launched it into orbit. Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. pic.twitter.com/qcalBIjjN7 — ANI (@ANI) July 14, 2023 #WATCH |ISRO chief S Somanath and the team behind #Chandrayaan3 share their delight after the LVM3 M4 vehicle successfully launched it into orbit. "Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal," says ISRO. pic.twitter.com/cRlegcsgHI — ANI (@ANI) July 14, 2023 రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్ శ్రీవాస్తవ, ఇంట్రస్టింగ్ సంగతులు ⇒ చంద్రయాన్ 3 మిషన్కు ఇస్రో శాస్త్రవేత్త , లక్నోకుచెందిన రీతూ కరిధాల్ శ్రీవాస్తవ నాయకత్వం వహించారు. ⇒ చిన్నప్పటినుంచి అంతరిక్షం అంటే ఆసక్తి, పలు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆమె 20కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు. ⇒ ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియాగాపాపులర్ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ ⇒ రీతూ 1997 నుండి ISROలో పని చేస్తున్నారు. ⇒ చంద్రయాన్- 2 ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ కూడా ⇒ మంగళ్ యాన్’ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా సేవలు. ⇒ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు ⇒ మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ ⇒ 2017లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారం ⇒ కరిధాల్కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
చంద్రయాన్-3 దేశ అంతరిక్ష చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది: ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: చందమామను ఇక్కడి నుంచి చూస్తూ మనకు తెలిసిన ఎన్నో కథలను చెప్పుకున్నాం. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని తపన మానవవాళిలో మొదలైంది. ఈ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. చంద్రుని పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్ కాస్త ఆలస్యంగా ప్రారంభించినా అద్భతాలను చేయాలని ప్రయత్నిస్తోంది. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్–3 మిషన్ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు. 14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES — Narendra Modi (@narendramodi) July 14, 2023 చదవండి: Himachal Pradesh Floods: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3
దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం.. –సాక్షి, నేషనల్ డెస్క్ మూడు కీలక దశలు ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్ వెహికల్స్లో అత్యంత శక్తివంతమైనది ఎల్వీఎం–3. నిజానికి ఇదొక బాహుబలి రాకెట్. భారీ పరిమాణంలో పేలోడ్ను అంతరిక్షంలోకి సులభంగా మోసుకెళ్లగలదు. ఇందులో రెండు ఘన ఇంధన బూస్టర్లు, ఒక ద్రవ ఇంధన కోర్ స్టేజ్తో కూడిన మూడు దశలు ఉన్నాయి. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి ప్రాథమిక దశలో ఘన ఇంధన బూస్టర్లు దోహదపడతాయి. రాకెట్ చంద్రుడి కక్ష్యలోకి చేరడానికి ఇక ద్రవ ఇంధన కోర్ స్టేజ్ సాయపడుతుంది. ఎలా పనిచేస్తుంది? దశల వారీగా ఇంధనాన్ని మండించడం ద్వారా రాకెట్ను నింగిలోకి పంపిస్తారు. ఘన, ధ్రవ ఇంధన ఇంజిన్లు, స్ట్రాప్–ఆన్ బూస్టర్లు నిర్దేశిత సమయాల్లో పనిచేస్తాయి. ఎల్వీఎం–3లో విద్యుత్ సరఫరా కోసం రెండు వికాస్ ఇంజిన్లు ఉన్నాయి. ప్రాథమిక దశలో రెండు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్లు అదనపు శక్తిని అందజేస్తాయి. పేలోడ్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకోవడానికి అవసరమైన శక్తిని దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ సీఈ–20 సమకూరుస్తుంది. మొదట రెండు బూస్టర్లను ఒకేసారి మండిస్తారు. దాంతో రాకెట్ టేకాఫ్ అవుతుంది. తర్వాత లిక్విడ్ కోర్ స్టేజ్ను 113 సెకండ్లపాటు, రెండు ఎస్200 బూస్టర్లను 134 సెకండ్లపాటు మండిస్తారు. టేకాఫ్ తర్వాత 217 సెకండ్లకు భూమికి 115 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్తో కూడిన పేలోడ్ రాకెట్ నుంచి విడిపోతుంది. ♦ ఎల్వీఎం–3 రాకెట్ బరువు 640 టన్నులు, పొడవు 43.5 మీటర్లు. 4,000 కిలోలపేలోడ్ను జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లోకి మోసుకెళ్లగలదు. ♦ రాకెట్కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు సాలిడ్ స్ట్రాప్–ఆన్ మోటార్లు(ఎస్200), ఒక లిక్విడ్ కోర్ స్టేజ్(ఎల్110), 28 టన్నుల బరువైన ప్రొపలెంట్ లోడింగ్తో కూడిన ఒక హై–థ్రస్ట్ క్రయోజనిక్ అప్పర్ స్టేజ్(సీ25) ఉన్నాయి. ♦ ఈ రాకెట్ను మొదట ‘జీఎస్ఎల్వీ–ఎంకే3’గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి ఎల్వీఎం–3గా నామకరణం చేసింది. దీనిద్వారా ఇప్పటివరకూ 3 ప్రయోగాలు విజయవంతమ య్యాయి. చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కానుంది. ♦ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఎల్వీఎం–3 వాహక నౌకను గతంలో ఉపయోగించారు. జీశాట్–19 కమ్యూనికేషన్ శాటిలైట్, అస్ట్రోశాట్ అ్రస్టానమీ శాటిలైట్, చంద్రయాన్–2 లూనార్ మిషన్ను ఇదే రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారతదేశంలో తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగమైన గగన్యాన్ మిషన్లో ఎల్వీఎం–3 వాహక నౌక తన సేవలను అందించనుంది. ♦ భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ల ప్రయోగాల్లో ఎల్వీఎం–3 ద్వారా మనం స్వయం సమృద్ధి సాధించినట్లేనని ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. -
జీఎస్ఎల్వీ -ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
కీలక ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో
-
24న ‘నావిక్–01’ ఉపగ్రహ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే 24వ తేదీన జీఎస్ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా నావిక్–01 (ఐఆర్ఎన్ఎస్ఎస్–1జే) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీనిని నిర్వహించేందుకు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ను అనుసంధానం చేసే పనులు ప్రారంభించారు. షార్లో లాంచింగ్ వసతులు పెరిగిన తర్వాత నెలకు ఒక ప్రయోగం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 22న పీఎస్ఎల్వీ సీ55ని ప్రయోగించారు. ఆ ప్రయోగం పూర్తయిన వెంటనే మే 24న జీఎస్ఎల్వీ ఎఫ్12 ద్వారా నావిక్–01 ఉపగ్రహ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)ను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. -
నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C55 రాకెట్
-
22న పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్పర్మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్లో ఆర్బిటల్ ఎక్స్పర్మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్పర్మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు. -
చాక్లెట్లు కాదు.. రాకెట్లు
కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : రండి బాబూ రండి.. కోరుకున్న డిజైన్లో రాకెట్ తయారు చేయబడును! వినటానికి ఇది వింతగానే అనిపించినా నిజమే మరి! స్పేస్ స్టార్టప్స్లో అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. స్కాట్లాండ్కు చెందిన స్కైరోరా సంస్థ కావాల్సిన రీతిలో రాకెట్లు తయారు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు స మాచారాన్ని పొందేందుకు శ్రమ పడాల్సిన అవసరం లే కుండా తాము చేసి పెడతామని చెబుతోంది. వన్స్టాప్ సొల్యూషన్ తరహాలో సేవలందిస్తామని భరోసా ఇస్తోంది. రాకెట్లండీ.. రాకెట్లు! ప్రైవేట్ కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, పర్యవేక్షణల సామర్థ్యాలు పెంచుకునేందుకు సొంతంగా రాకెట్లను అంతరిక్ష కక్ష్యలోకి పంపిస్తున్నాయి. గతంలో కేవలం ప్రభుత్వ రంగంలోనే అనుమతించిన మనదేశం ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళుతోంది. స్పేస్ ఎక్స్తో ప్రైవేట్ రాకెట్ల రేసును ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఆయనకు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్వర్క్ 42 వేల శాటిలైట్స్తో, జెఫ్ బెజోస్కు చెందిన కూపర్ నెట్వర్క్ 3,200 శాటిలైట్స్తో, యూకే ప్రభుత్వానికి చెందిన వన్వెబ్ నెట్వర్క్ 650 శాటిలైట్స్తో ఏర్పాటు చేసేలా పనులు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్తోపాటు ఐరోపా అంతరిక్ష అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నా టికి గ్లోబల్ స్పేస్ మార్కెట్లో 10 శాతం వాటాను సొంతం చేసుకునేలా బ్రిటన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూకే మార్కెట్ విలువ 483 బిలియన్ డాలర్లుగా అంచ నా వేస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త వోలోడిమిర్ లెవికిన్ 2017లో స్కైరోరాని ప్రారంభించా రు. లానార్క్షైర్ కంబర్నాల్డ్లోని ఫ్యాక్టరీలో స్కైరో రా తన రాకెట్లని డిజైన్ చేస్తోంది. ఎడిన్బర్గ్ శివార్లలోని టెస్ట్బ్లాస్ట్ ఏరియాలో వాటిని ఉంచుతోంది. ప్యాసింజర్ రాకె ట్స్ కాకుండా పేలోడ్ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ. స్కైరోరా ఫ్లాగ్షిప్ రాకెట్ తొమ్మిది ఇంజన్లు, 50 వేల లీటర్ల ఇంధన సామర్థ్యం, 7 మెట్రిక్ టన్నుల్ని మోసుకెళ్లే సత్తాతో సెకనుకు 8 కి.మీ. వేగంతో దూసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్ని స్కైరోరా సిద్ధం చేసింది. స్కైరోరా ఎక్స్ఎల్ పేరుతో 315 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్ని ఈ ఏడాది షెట్ల్యాండ్ దీవుల నుంచి ప్రయోగించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ పరిశ్రమలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, బీమా సంస్థలు.. ఇలా భిన్న రంగాలకు సంబంధించి అంతరిక్షం నుంచి ఆప్టికల్, టెంపరేచర్ సెన్సార్స్ లాంటి వాటితో సమాచారం సేకరించి రియల్టైమ్లో డేటా రూపొందించేందుకు రాకెట్లను తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసింది. 22.7 మీటర్ల పొడవైన రాకెట్ మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. స్పేస్ ఎక్స్కు భిన్నంగా స్కైరోరా.. రాకెట్ల తయారీలో ఎలన్మస్్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు, స్కైరోరాకు గట్టి పోటీ నడుస్తోంది. స్పేస్ఎక్స్ అనేది బస్సు ప్రయాణంలాంటిదని, ఇతర ప్రయాణికులతో కలసి నిర్దేశించిన ప్రాంతం నుంచే వినియోగించుకునే అవకాశం ఉందని స్కైరోరా సీఈవో లెవికిన్ చెబుతున్నారు. స్కైరో రా మాత్రం ట్యాక్సీ ప్రయాణం లాంటిదని, ప్ర యాణికులు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయలుదేరేలా రూపొందించా మని తెలిపారు. స్పేస్ఎక్స్లో రాకెట్ కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి ఉండగా స్కైరోరాలో మా త్రం ఆర్నెల్లు చాలని స్పష్టం చేస్తున్నారు. యూకే అంతరిక్ష పరిశ్రమలో స్కైరోరా సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో భారత్, చైనా సొంత రాకెట్లను తయారు చేసే స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. -
నేడు ఎల్వీఎం3–ఎం3 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ స్పేస్ సంస్థలు కలిసి వాణిజ్యపరంగా స్థానిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎం3–ఎం3 రాకెట్ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధంచేశారు. ఇందుకు సంబంధించి శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. 24.30గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్ను ప్రయోగిస్తారు. ఈ మేరకు షార్లో శుక్రవారం నిర్వహించిన ఎంఆర్ఆర్ కమిటీ, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాల్లో నిర్ణయించారు. అంతకుముందే మూడు దశల రాకెట్ను అనుసంధానం చేశారు. దానిని ప్రయోగ వేదికపై అమర్చి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు వారికి అప్పగించారు. ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ వారు సంయుక్తంగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (సర్క్యులర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. -
ఏడాదిలోగా గగనతలంలోకి మానవసహిత రాకెట్
పటాన్చెరు: ఆస్ట్రోనాట్స్తో కూడిన రాకెట్ను ఏడాదిలోగా గగనతలంలోకి పంపనున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గగన్యాన్ మిషన్ తుదిదశకు చేరుకుందని, మానవసహిత రాకెట్ ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని మంజీర మిషన్ బిల్డర్స్ రూపొందించిన సిమ్యూలేటెడ్ క్రూ మాడ్యూల్(ఎస్సీఎం) ఫ్యాబ్రికేషన్ సెల్ను శుక్రవారం ఆయన వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో గగన్యాన్ ప్రాజెక్టు పూర్తి కానుందని, ఇది సఫలం అయితే అంతర్జాతీయంగా అగ్రదేశాల సరసన భారత్ నిలబడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ సారాబాయి స్పేస్ స్టేషన్ డైరక్టర్ ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరికల్లా మానవసహిత రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమైందన్నారు. మంజీరాలో తయారు చేసిన ఆ పరికరం దేశంలోనే మొదటిదన్నారు. రాకెట్ ప్రయోగంలో కీలకమైన రెండున్నర టన్నుల బరువు ఉండే సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్కు 3 ప్యారాషూట్లు అనుసంధానిస్తారని తెలిపారు. ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా సముద్రంలో దిగేలా రూపొందించామని, ఐదు ఎస్సీఎం స్ట్రక్చర్ షెల్ విడిభాగాలను తయారు చేయాలని మంజీర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. 2024 కల్లా రాకెట్లో ఆస్ట్రోనాట్స్ వెళ్లగలిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో హ్యూమన్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ వర్చువల్గా పాల్గొన్నారు. కాగా, మంజీర పరిశ్రమ ఎండీ సాయికుమార్ తమ పరిశ్రమలో తయారు చేసిన ఎస్సీఎంను ఉన్నికృష్ణన్కు అందించారు. -
PSLV C-54 ప్రయోగం సక్సెస్
-
అంతరిక్షమే హద్దుగా..
-
నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-S
-
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-ఎస్
తిరుపతి: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం రాకెట్ ప్రయోగం జరిగింది. దేశీయంగా ప్రైవేట్ రంగంలో రూపొందిన మొదటి రాకెట్ విక్రమ్-ఎస్. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ఈ ప్రైవేట్రాకెట్ను రూపొందించింది. ‘మిషన్ ప్రారంభ్’ విజయవంతమైందని ప్రకటించారు సైంటిస్టులు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్రంగంలో రూపొందిన తొలి రాకెట్ విక్రమ్–ఎస్. రాకెట్కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్–ఎస్ అని నామకరణం చేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్–ఎస్ రాకెట్ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇదో కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
భూమిపైకి 23 టన్నుల రాకెట్ శకలాలు.. ఎక్కడ పడతాయో తెలియదు!
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్ స్పేష్ స్టేషన్ కోసం మూడో మోడ్యూల్ను పంపించేందుకు 23 టన్నుల లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ను అంతరిక్షంలోకి ఇటీవలే ప్రయోగంచింది చైనా. ఆ రాకెట్కు చెందిన 23 టన్నుల బరువుండే శకలాలు ఈ వారాంతంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడనున్నాయనే విషయం స్పష్టంగా తెలియదని హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది. సుమారు 10 అంతస్తుల పెద్ద భవన అంత పెద్దగా ఉండే ఈ రాకెట్ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మిగిలిన కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్ కార్పొరేషన్ చెబుతోంది. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్ -
ఇస్రో గ‘ఘన’ విజయం
-
నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎల్వీఎం3-ఎం2
-
జూబ్లీహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
-
బంగారం.. నీ ప్రేమ కోసం అంతరిక్షం నుంచి భూమ్మీదకు వస్తా!
టోక్యో: ప్రేమ పేరుతో జపాన్ మహిళను మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను రష్యా వ్యోమగామినని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్సీ)లో పని చేస్తున్నాని చెప్పి నమ్మించి బురిడీ కొట్టించాడు. మహిళను తాను ప్రాణంగా ప్రేమిస్తున్నాని చెప్పాడు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీని ఖర్చుల కోసం ఆమె వద్ద నుంచి 4.4 మిలియన్ యెన్(రూ.25లక్షలు) వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా పదే పదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఈ జపాన్ మహిళ వయసు 65 ఏళ్లు. ఈమెకు ఇన్స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఐఎస్సీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. జూన్లో ఇందుకు సంబంధించి ఫోటోలు పెట్టాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. ఇవి చూసి అతడు నిజంగా వ్యోమగామి అని మహిళ నమ్మింది. ఇద్దరూ తరచూ చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరి సంభాషణ ఇన్స్టాగ్రాం నుంచి జపాన్ సోషల్ మీడియా యాప్ 'లైన్'కు మారింది. ఇందులోనే మహిళను ప్రాణంగా ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండాలని ఉందని చెప్పాడు. దీంతో ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమ్మీదకు రావాలంటే ఖర్చవుతుందని రూ.25లక్షలు పంపాలని మహిళను అతను కోరాడు. అతడ్ని నమ్మిన ఆమె రూ.25లక్షలు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఐదు విడతల్లో పంపింది. అయినా అతను ఇంకా డబ్బు కావాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను వ్యోమగామి కాదని, మోసం చేశాడని తెలిసింది. పోలీసులు ఈ కేసును 'ఇంటర్నేషనల్ రోమాన్స్ స్కామ్'గా ట్రీట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్ -
ఇన్స్టంట్ లోన్ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ లోన్ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్ అపరేషన్ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యాప్కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. అంతేకాదు ఫేక్ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 500 కోట్ల ఇన్స్టంట్ లోన్ దోపిడి రాకెట్తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా దాదాపు వంద లోన్యాప్లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్లు, తొమ్మిది ల్యాప్టాప్లు, 19 డెబిట్ కార్డ్లు/క్రెడిట్ కార్డ్లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. -
SSLV - D1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
-
నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్
-
పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్లు!
సాక్షి,న్యూఢిల్లీ: హై స్పీడ్ స్టార్లింక్ శాటిలైట్లను ప్రవేశపెట్టిన బిలియనీర్,స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా రాకెట్ల లాంచింగ్, లాంచ్ ప్యాడ్పై ట్వీట్ చేశారు. రాకెట్ లాంచ్ప్యాడ్కు తరలింపు అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. అలాగే ఐ లవ్ దట్ స్మెల్ ఆఫ్ హైడ్రాలిక్ లిక్విడ్ అంటూ ట్వీట్ చేశారు. స్టార్లింక్ ప్రాజెక్ట్లో భాగంలో ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతోందన్న అంచనాలకు ఇంది మరింత బలాన్నిచ్చింది. (Kartikeya Jakhar: ఫోన్ బాధలు పడలేక: పన్నెండేళ్ల బుడతడి అరుదైన రికార్డు!) 2025, ఏప్రిల్లో స్పేస్ఎక్స్ స్పేస్ టెలిస్కోప్తో సోలార్ విండ్ మిషన్ను ప్రారంభించనుందని నాసా తాజాగా ప్రకటించింది. స్పేస్ఎక్స్, నాసా మిషన్లు కలిసి కక్ష్యలోకి ఈ రోడ్ట్రిప్ తీసుకుంటాయని ఏజెన్సీ ప్రకటించింది. దీని ప్రకారం స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఐదు అంతరిక్ష నౌకలు ఉంటాయి, ఒకటి ఖగోళ భౌతిక శాస్త్రానికి ,మిగిలిన నాలుగు సోలార్ సైన్స్కు సేవలను అందించనున్నాయి. (ఇదీ చదవండి: ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో) కాగా అంతరిక్షంలోకి పంపే రాకెట్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ లాంచ్ప్యాడ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించు కుంది. గత నెలలో స్పేస్ వెంచర్ స్పేస్ఎక్స్ 46 స్టార్లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా లో-ఎర్త్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ 2021లో ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఒకేసారి 52 స్టార్ లింక్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 2025 సంవత్సరం నాటికి స్టార్లింక్ శాటిలైట్ల ద్వారా స్పేస్ఎక్స్ కంపెనీ భారీ ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. Moving rocket to launch pad pic.twitter.com/nPVq1tyLoy — Elon Musk (@elonmusk) August 6, 2022 I love the smell of hydraulic fluid in the morning — Elon Musk (@elonmusk) August 6, 2022 -
మార్చి 4న చైనా రాకెట్ చంద్రుడిని ఢీకొట్టనుందా? డ్రాగన్ కంట్రీ ఏమంటోంది..
Rocket To Crash Into Moon: బీజింగ్ చంద్రుని పై జరిపిన పరోశోధనల్లో భాగంగా చంద్రుని పైకి చైనాకి సంబంధించిన ఒక అంతరిక్ష వ్యర్థం వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు మార్చి 4న చంద్రుడిని ఒక రాకెట్ ఢీకొట్టనుందని నిపుణులు వెల్లడించారు. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు అది స్పేస్ ఎక్స్ రాకెట్లోని భాగంగా భావించారు. కానీ అది ఏడేళ్ల క్రితం పేలిపోయిందని దాని మిషన్ పూర్తైయిన తర్వాత అంతరిక్షంలోకి వదిలివేయబడిందని నిర్ధారించారు. కానీ ఇప్పుడూ చైనీస్ స్పేస్ ఏజెన్సీ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2014లో Chang'e 5-T1 రాకెట్ని అంతరిక్షంలోకి పంపిందని కాబట్టి అది ఆ రాకెట్కి సంబంధించిన బూస్టర్ అని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆ రాకెట్ మార్చి 4న చంద్రుని వైపు కూలిపోతుందని భావిస్తున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వాదనను ఖండించింది. అంతేకాదు మీరు అనుమానిస్తున్న ఆ బూస్టర్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి కాలిపోయిందని పేర్కొంది. చైనా అంతరిక్ష సూపర్పవర్గా అవతరించడంపై దృష్టి సారించడమే కాక కొత్త అంతరిక్ష కేంద్రానికి సుదీర్ఘమైన సిబ్బందితో కూడిన మిషన్ను ప్రారంభించి ఒక ప్రభంజనం సృష్టించింది. అంతేగాక ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మిలిటరీ-రన్ స్పేస్ ప్రోగ్రామ్లో బిలియన్లను దున్నేసింది. చివరికి మానవులను చంద్రునిపైకి పంపాలని భావిస్తోంది కూడా. (చదవండి: పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!) -
నడిగడ్డ.. నకిలీ లిక్కర్ అడ్డా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్ రీసైక్లింగ్తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. ముఠా పట్టుబడిందిలా.. రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కహాల్) లోడ్తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు. నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్ డబ్బా, 50 ఇంపీరియల్ బ్లూ మద్యం సీసాల కాటన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. బాబుగౌడ్ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు. 8 మంది అరెస్టు.. నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్ ఉప కమిషనర్ దత్తురాజుగౌడ్ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కీలక ప్రజాప్రతినిధి అండతో..! నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి స్పిరిట్.. గుట్టుగా బెల్టుషాపులకు.. గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్ (100శాతం ప్యూర్ ఆల్కాహాల్) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్కు చెందిన శ్రీనివాస్గౌడ్ ఈ స్పిరిట్ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్గౌడ్, లోకేశ్ గౌడ్, నాగరాజుగౌడ్ తదితరులు ఆ స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది. మరోవైపు ఆలంపూర్ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్కు చెందిన నారాయణగౌడ్ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు. నకిలీ మద్యం తయారీ ఇలా.. కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్ లిక్కర్ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. -
పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
రాకెట్ ఇంధనం తణుకు నుంచే...
తణుకు: ప్రపంచ పటంలో తణుకు పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తణుకులోని ఆంధ్రాషుగర్స్ వల్ల ఆ గుర్తింపు లభించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే భారతీయ అంతరిక్ష పశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో ఆంధ్రాషుగర్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాషుగర్స్ విజయం సాధించింది. చదవండి: త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు ఇస్రో-ఆంధ్రాషుగర్స్ సహకారం 1984లో ప్రారంభం కాగా 1985 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రాషుగర్స్ మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. 1988 జులై 24న ప్లాంటును జాతికి అంకితం చేశారు. అతి కీలకమైన అంతరిక్ష పరిశోధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న జైత్రయాత్రలో ఇస్రో-ఆంధ్రాసుగర్స్ మధ్య ఏర్పడిన సహకారం ఫలప్రదమైన పాత్ర నిర్వహిస్తోంది. రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన చిత్రపటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించడంలో ఆంధ్రాషుగర్స్ ముఖ్య పాత్ర పోషించింది. తణుకు ప్లాంట్లో ఉత్పత్తి చేసిన ద్రవరూప ఇంధనం భారత మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞనంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV-D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకు పరిశ్రమలో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ రాకెట్ ఇంధన తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. చదవండి: Andhra Pradesh: ‘డిజిటల్ హెల్త్’కు నాంది -
ఔరా అనిపిస్తున్న గుండు సూదిపై రాకెట్..
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన శ్రీశైలపు చిన్నయాచారి గుండు సూదిపై జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ నమూనాను అమర్చి ఔరా అనిపించారు. శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన జీఎస్ఎల్వీ–ఎఫ్10 రాకెట్ను స్ఫూర్తిగా తీసుకొని మైక్రో ఆర్టుతో అద్భుత కళాఖండాన్ని తయారు చేశారు. గుండు సూది పైభాగంలో బంగారంతో 5 మిల్లీమీటర్ల ఎత్తు, 1.5 మిల్లీమీటర్ల వెడల్పుతో రూపొందించారు. రాకెట్ చివరి భాగంలో భారతదేశం జెండా ఏర్పాటు చేశారు. రాకెట్ను తయారుచేయడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నారు. అప్డేట్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ)-ఎఫ్10 వాహకనౌక ప్రయోగం విఫలమైంది. -
జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం
-
హిందూ మహా సముద్రలో పడిన చైనా రాకెట్ శకలాలు
-
తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు
న్యూఢిల్లీ: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్ పెట్టిన చైనా రాకెట్ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 29న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ మాత్రం.. ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలాలు పూర్తిగా బూడిద అయిపోతాయిని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతాయిని చెప్పాయి. కానీ చివరికి హిందూ మహా సముద్రంలో ఆ రాకెట్ శకలాలు పడిపోవటం గమనార్హం. ( చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా ) -
దూసుకొస్తున్న చైనా రాకెట్.. ‘లాంగ్’ క్రాష్ జరగనుందా?
చైనాలోని హైనన్ ద్వీపం నుంచి ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భారీ శకలం ఒకటి భూమిని ఢీకొట్టనుందా?. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధనశాల భాగాలు పంపేందుకు ఈ రాకెట్ను ప్రయోగించారు. తిరిగి భూమిపైకి వచ్చే సమయంలో ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలం పూర్తిగా బూడిద అయిపోతుందని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ అని ఎక్కువమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలం తుర్కిమెనిస్తాన్ లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతుందని అంటోంది. ఇలా జనావాసాలపై ఈ రాకెట్ పడితే.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. చైనా మాత్రం వాతావరణంలో వేడికి అది పూర్తిగా కరిగిపోతుందని.. ఒకవేళ పడినా చిన్న ముక్కలే మిగులుతాయని.. వీటి వల్ల పెద్దగా నష్టం కూడా జరగదు అని వాదిస్తోంది. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) -
చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం...
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కావోస్తుంది. దీన్నుంచి ఇంకా కోలుకోకమునుపే చైనా ప్రపంచం నెత్తిన మరో బాంబు వేసింది. డ్రాగన్ దేశం పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా పయనిస్తుందట. ఏ క్షణమైన అది భూమ్మీద పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాకెట్ కూలిపోయిన సముద్రంలో పడుతుంది. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మాత్ర భూమి దిశగా దూసుకువస్తుందట. అది ఎక్కడ పడనుందో తెలియక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రక్షణశాఖ ప్రస్తుతం 5బీ రాకెట్ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న అది భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పెంటగాన్ శాస్త్రవేత్తలు. కాకపోతే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూవాతవరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. గత వారం అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ కంట్రీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం చైనా లాంగ్మార్చ్ 5బీ రాకెట్ తియాన్హే స్పేస్ మ్యాడుల్ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. నియంత్రణ కోల్పోయిన ఈ రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకురానున్నాయి. చైనా 2022 నాటి కల్లా అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్లో భాగంగా 30 మీటర్ల పొడవైన తొలి మ్యాడుల్ ‘టియాన్హె’ను చైనా లాంగ్ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
మానవత్వం మిస్సింగ్.. అంతిమ సంస్కారానికి అంత్యక్రియలు!
విక్టర్ మావయ్య.. మా ఇంటి పెద్ద. ఓ రోజు ఆయన ఇంటికి తిరిగిరాకపోవడంతో చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాం. తర్వాత ఆయన అఫ్జల్ గంజ్ ఏరియాలో చనిపోయాడని తెలిసి.. అక్కడి పోలీస్స్టేషన్కు వెళ్లాం. మృతదేహం వివరాలేమీ ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎస్సై, సీఐ పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకూ వినతిపత్రాలు ఇచ్చాం. విక్టర్ మృతదేహాన్ని ఏం చేశారన్నది ఎవరూ చెప్పలేదు. అయితే అనాథ శవమని చెప్పి మెదక్లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి తరలించారని ఆ తర్వాత తెలిసి కుమిలిపోయాం. అందరం ఉన్నా అనాథలా మరణించడం, కడసారి చూపు కూడా దక్కకపోవడం ఘోరం. మా అత్తయ్య మానసిక స్థితి దిగజారి మంచం పట్టింది. ఇలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదు. – హైదరాబాద్లోని చిక్కడపల్లికి చెందిన లత ఆవేదన ఇది మా అన్న ఖాజా అంటే మాకెంతో ఇష్టం. ఉన్నట్టుండి ఓ రోజు ఆచూకీ లేకుండా పోయాడు. హైదరాబాద్లోని ప్రతి గల్లీ గాలించాం. చివరికి బేగంపేట పీఎస్లో ఫిర్యాదు చేశాం. మార్చురీల్లో వెతకాలని కొందరు చెప్పారు. ఆ ఆలోచనే మాకు మింగుడుపడలేదు. గుండె రాయి చేసుకుని మార్చురీల్లో వెతికాం. ఉస్మానియాలో కుప్పలా వేసిన శవాలను చూపించి వెతుక్కొమ్మన్నారు. అది చూడగానే భయపడ్డాం. అక్కడున్న ఓ ఫొటోగ్రాఫర్ దగ్గరున్న ఫొటోల్లో మా అన్నయ్యను చూసి కూలబడిపోయాం. ఖాజా అన్న మృతదేహం మంగళ్హాట్ పీఎస్ నుంచి వచ్చిందని చెప్పడంతో.. అక్కడికి వెళ్లి, ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్టులు తీసుకున్నాం. కానీ మరో పది శవాలతో కలిపి మా అన్న మృతదేహాన్ని దహనం చేశారని తెలిసి బాధపడ్డాం. వెళ్లి బూడిద తెచ్చుకో అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అనాథ శవమైతేనేం.. మా అన్న ముస్లిం అని తెలుసుకదా.. అంతిమ సంస్కారంలో మతాచారాలు పాటించరా? –హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన నజ్మా సూటి ప్రశ్న ఇది.. అనిల్ కుమార్ భాషబోయిన అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్.. ఏదో ఓ పనిమీద బయటికెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్నవారు.. గుర్తింపులో నిర్లక్ష్యంతో అనాథ శవాలుగా మారిపోతున్నారు. ఏ మనిషికైనా మరణానంతరం దక్కే ఆఖరి గౌరవమైన అంతిమ సంస్కారం లేకుండానే దహనమైపోతున్నారు. తమ వారంటూ ఎందరో ఉన్నవారు కూడా నాలుగైదు శవాలతో కలిసి ఒకే చితిపై కాలిపోతున్నారు. ఈ వ్యవహారంలో ఇదొక కోణమైతే.. మరో కోణం.. కొందరి మృతదేహాలు మెడికల్ కాలేజీల్లో ప్రాక్టికల్స్కు అక్రమంగా తరలిపోతున్నాయి. కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది మృతదేహానికి ఇంతని రేటు కట్టి అమ్ముకుంటున్నారు. అసలు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏమైందని తేల్చే పోస్టుమార్టం కూడా చెయ్యకుండా తరలించేస్తున్నారు. ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వారి కుటుంబాలు తమవారి ఆచూకీ తెలియక, చనిపోయాడని తెలిసినా మృతదేహాలైనా లభించక, కడసారి చూపునకూ నోచుకోక కుమిలిపోతున్నాయి. ఇది ఒక్క లత, నజ్మాల వ్యథ కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లతలు, నజ్మాలు ఎందరో.. రోజుకు 40 మంది మిస్సింగ్.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రిపోర్టు ప్రకారం.. మనదేశంలో సగటున ప్రతీ పది నిమిషాలకు ఒకరు తప్పిపోతున్నారు. మన రాష్ట్రం విషయానికొస్తే.. రోజుకు 40 దాకా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం.. మన రాష్ట్రంలో 2018లో జాడలేకుండా పోయినవారి సంఖ్య 5,992. 2019లో మొత్తం మిస్సింగ్ 17,150 మంది. ఇందులో 4,566 మంది పిల్లలు. 2019 చివరి నాటికి మొత్తంగా రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసులు 23,142. నిజానికి మన రాష్ట్రం ఇలాంటి కేసుల రికవరీ రేటులో దేశంలోనే టాప్–5లో ఉంది. మిస్సింగ్ కేసుల్లో తిరిగి దొరుకుతున్న వారు 83 శాతంపైనే. కానీ మిగతా 17 శాతం మందిలో ఎందరు ఇంకా దొరకలేదు, ఎందరు మరణించారన్న వివరాలు తెలిపేందుకు సరైన వెబ్సైట్ లేకపోవడం ఆందోళనకరం. ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఏం చేస్తున్నారు? ప్లాన్1 మార్చురీకి వచ్చిన అనాథ శవాల్లో బాగున్నవాటిని వైద్యులు, సిబ్బంది గుర్తిస్తారు. మృతదేహం పాడైపోకుండా రసాయనాలు (ఎంబామింగ్) పూస్తారు. వాటిని అనాథ శవాలను భద్రపరిచే గది (ఫఫ్ రూం)లో కాకుండా.. ప్రత్యేక ఫ్రీజర్ బాక్సుల్లో ఉంచుతారు. ఆ మృతదేహానికి సంబంధించి ఎవరైనా వచ్చారా, గుర్తుపట్టారా, అనాథ శవంగానే ఉందా అన్న వివరాలను పోలీస్స్టేషన్ నుంచి తీసుకుంటారు. తర్వాత అనాథ శవంగా కన్ఫర్మ్ చేసి, పోస్టుమార్టం చేసినట్టుగా రికార్డు చేస్తారు. సాధారణంగా వారం పదిరోజులకోసారి మార్చురీల్లో పోగైన అనాథ శవాలను జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించి, అంత్యక్రియలు చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే మెడికల్ కాలేజీ కోసం దాచిన మృతదేహాన్ని కూడా అప్పగిస్తారు. మార్గమధ్యలోనే జీహెచ్ఎంసీ సిబ్బందికి కొంత సొమ్ము ముట్టజెప్పి సదరు మృతదేహాన్ని దొంగతనంగా మరో అంబులెన్స్లో మెడికల్ కాలేజీకి తరలించేస్తారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మిగతా మృతదేహాలతోపాటు దీనిని దహనం చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసేస్తారు. సొమ్ము చేతులు మారుతుంది. ప్లాన్2 మార్చురీలో పెట్టిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపడితే మరోరకంగా గాలం వేస్తారు. ఏజెంట్లు, మార్చురీ సిబ్బంది సదరు కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తారు. వారు పేదలని తేలితే రంగంలోకి దిగుతారు. దహన సంస్కారాలు, క్రతువులకు వేల రూపాయలు ఖర్చవుతాయని.. కావాలంటే ఓ సలహా ఇస్తామని అంటారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తామని.. జీహెచ్ఎంసీతోగానీ, స్వచ్ఛంద సంస్థలతోగానీ అంత్యక్రియలు చేయిస్తామని ప్రలోభపెడతారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల వారు కాస్త ఆర్థిక సాయం చేస్తారంటూ గాలం వేస్తారు. ఫ్యామిలీ ఒప్పుకోగానే.. ఏదో శ్మశాన వాటికకు తరలించి, అంత్యక్రియలు చేయించినట్టు హడావుడి చేస్తారు. ఈ మేరకు తప్పుడు పత్రాలు సృష్టించి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. కానీ ఆ మృతదేహాన్ని అక్రమంగా ఏదో మెడికల్ కాలేజీకి అమ్మేస్తారు. బాడీ చితికిపోతే డెంటల్,కంటి వైద్య కాలేజీలకు.. రైలు, బస్సు లేదా ఇతర రోడ్డు ప్రమాదాల్లో కొన్ని డెడ్ బాడీలు బాగా చితికిపోతాయి. వాటిలో తల భాగం దెబ్బతినకుండా ఉంటే విడిగా ఉంచుతారు. పోస్టుమార్టం నిర్వహించామని చెప్పి దహనం చేసేస్తారు. అంతకుముందే ఆ శరీరం నుంచి తలను వేరు చేస్తారు. పాడైపోకుండా రసాయనాలు నింపిన ఓ ప్రత్యేక బాక్సులో పెట్టి.. డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలున్న మెడికల్ కాలేజీలకు చేరవేస్తారు. ప్రొఫెసర్లు ఆ తలలతో దంత వైద్యం, కంటి వైద్యం ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తారు. మహిళల మృతదేహాలకు డిమాండ్ సాధారణంగా ఆడవాళ్లు ఆస్పత్రులకు ఒంటరిగా రావడం, బయట ఒంటరిగా జీవించడం వంటివి చాలా తక్కువ. అనాథ స్థితిలో ఆడ మృతదేహాలు ఉండటం కూడా తక్కువే. అయితే మెడికల్ కాలేజీల్లో గైనకాలజీ విద్యార్థులకు మహిళల శరీరంపై అనాటమీ క్లాసులు నిర్వహించడం చాలా కీలకం. అందుకే మహిళల మృతదేహాల కోసం కాలేజీలు ఎక్కువ సొమ్ము చెల్లిస్తాయి.మగవారి మృతదేహానికి అయితే రూ.5 లక్షల వరకు, ఆడవాళ్ల మృతదేహానికి రూ.20 లక్షల దాకా చెల్లిస్తున్నారు. ఈ నిబంధనలు పాటించడం లేదు! 1. ఎవరూ క్లెయిమ్ చెయ్యని డెడ్బాడీల విషయంగా వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని నిబంధనలు ఉన్నాయి. పోలీసు, వైద్యాధికారులు పలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. సీఆర్పీసీ 174 సెక్షన్ ప్రకారం.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశాకే మార్చురీకి పంపాలి. 2. డెడ్ బాడీ ఫొటోలు, వేలిముద్రలు, డీఎన్ఏ, విస్రా తదితరాలు సేకరించి భద్రపరచాలి. 3. బంధువులు గుర్తించేందుకు వీలుగా మూడు రోజులపాటు మృతుల ఫొటో, గుర్తులు, ఇతర వివరాలు మీడియా సంస్థలకు పంపాలి. 4. అప్పటికీ ఎవరూ రాకపోతే పోస్టుమార్టం నిర్వహించాలి. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్కనే ఉండాలి. కానీ అనాథ శవాల విషయంలో ఇవేమీ జరగడం లేదు. డబ్బుకు కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యులు, పోలీసు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోస్టుమార్టం చేయకుండానే.. చేశామంటూ శవాలను గుట్టుగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్ముకుంటున్నారు. కాలేజీల అవసరాన్నిఅడ్డుపెట్టుకుని.. మన రాష్ట్రంలో దాదాపు 32 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి పది మంది విద్యార్థులకు అనాటమీ క్లాసులు చెప్పేందుకు ఒక మృతదేహం అవసరం. ఈ లెక్కన ప్రతి కాలేజీకి ఏటా 15 నుంచి 20 మృతదేహాలు కావాలి. ఈ లెక్కన వైద్యవిద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం ఏటా రాష్ట్రంలో 500కుపైనే శవాలు కావాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం.. కొన్నిచోట్ల వ్యాక్స్ బొమ్మలతో అనాటమీ క్లాసులు నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నా, దానివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి రాదన్న అభిప్రాయంతో మృతదేహాలపైనే ప్రాక్టీస్కు మొగ్గుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు.. మృతదేహాలు అమ్ముకునే దందాకు తెరలేపారు. కాలేజీల అవసరాన్ని బట్టి ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇంతఖర్చు పెట్టాల్సి రావడంతో కాలేజీలు ఈ భారాన్ని వైద్య విద్యార్థులపై వేస్తున్నట్టు సమాచారం. ఒక శవానికి రూ.5 లక్షలు ఖర్చయితే.. 100 మంది విద్యార్థులున్న కాలేజీలో ప్రతి విద్యార్థి నుంచి రూ.5,000 వరకు ప్రత్యేక అనాటమీ క్లాసు కింద తీసుకుంటున్నట్టు తెలిసింది. 2006లో శిల్పారామం వాచ్మెన్ కేసులో.. పి.పాల్ అనే వ్యక్తి శిల్పారామంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. 2011 మే 6న అదృశ్యమయ్యాడు. తర్వాత శంషాబాద్లోని రాళ్లగూడెం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. కొద్దిరోజుల తర్వాత సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ రికార్డుల సాయంతో పాల్ బంధువులు ఆ డెడ్బాడీ తమవారిదిగా గుర్తు పట్టారు. ఉస్మానియా మార్చురీకి వెళ్లి మృతదేహం కోసం ఆరా తీశారు. కానీ అక్కడి ఫోరెన్సిక్ సిబ్బంది పాల్ మృతదేహాన్ని జీహెచ్ఎంసీకి వాళ్లకు ఇచ్చామన్నారు. బంధువులు జీహెచ్ఎంసీని ఆశ్రయించగా.. బాడీని సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్కు పంపామన్నారు. అక్కడికెళితే తమ దగ్గరికి రాలేదని ఫౌండేషన్ తేల్చి చెప్పింది. దీంతో ఏదో జరిగిందని పాల్ బంధువులకు అర్థమైంది. ‘పాల్ మృతదేహం ఏది? అంత్యక్రియలు నిర్వహించకుండా ఎక్కడికి పోయింది, ఏదైనా మెడికల్ కాలేజీకి విక్రయించారా?’ అంటూ మానవ హక్కుల సంఘం, ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ఈ వ్యవహారానికి బాధ్యుడైన ఓ సీనియర్ డాక్టర్పై విచారణ జరిగింది. ఉస్మానియాలో ఇద్దరు ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ, బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే సదరు వైద్యులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. 2010లో వీఎస్టీ కాలనీకి చెందిన వై.జాన్ అనే వ్యక్తి తప్పిపోయాడు. అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు కాపీ తీసుకోలేదు. నాలుగేళ్లు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 2014 జనవరి 13న చిక్కడపల్లిలో మరోసారి ఫిర్యాదు చేశారు. కానీ జాన్ 2011 ఫిబ్రవరి 3వ తేదీనే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చనిపోయినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అంత్యక్రియలు, పోస్టుమార్టానికి సంబంధించిన డాక్యుమెంట్లు అడిగారు. కానీ ఇవ్వలేదు. దీంతో ఎవరో జాన్ శవాన్ని మాయం చేశారని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ మేరకు అఫ్జల్గంజ్ ఠాణాలో సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. అయితే వరదలు వచ్చి జాన్ ఫైల్ ఒక్కటి మాత్రమే కొట్టుకుపోయిందని పోలీసులు సమాధానం ఇవ్వడంతో కుటుంబం నోరెళ్లబెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఆ మృతదేహం దొంగతనంగా మెదక్లోని ఓ కాలేజీ అనాటమీ విభాగానికి చేరింది. ప్రవీణ్ ప్రకాశ్ కమిటీ నివేదిక ఎక్కడ? 2010–11లో రాష్ట్రంలో వందలకొద్దీ శవాలను అక్రమంగా మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ వైద్యులు, పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్లడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ నేతృత్వంలో విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ పలుమార్లు ఉస్మానియా, ఇతర ఆస్పత్రులను సందర్శించింది. కొందరు అధికారులు, సిబ్బందిని విచారించింది. కానీ కమిటీ నివేదికను ఇప్పటికీ బయటపెట్టలేదు. అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలి.. కార్పొరేట్ కాలేజీలు పెరుగుతున్న క్రమంలో మెడిసిన్ విద్యార్థుల అనాటమీ తరగతులకు శవాల అవసరాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, ప్రభుత్వాసుపత్రుల వైద్యులతో ములాఖత్ అవుతున్నారు. పోలీసులు చూసీచూడనట్లు ఉంటుండటంతో అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి. శవాలను అమ్ముకుని రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. దీని వెనుక మెడికల్ కార్పొరేట్ మాఫియా హస్తం ఉందన్నది సుస్పష్టం. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరపకపోవడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ వ్యవహారంపై గతంలోనే రాష్ట్రపతికి, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేశాం. ఈ మొత్తం వ్యవహారంపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. -
రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపిన చైనా
బీజింగ్ : ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం చైనా మంగళవారం రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. జిన్గున్ 2 01, జిన్గున్02 అనే రెండు ఉపగ్రహాలను .. కువజువా-1ఏ (కేజెడ్-1ఏ) రాకెట్ ద్వారా ప్రయోగించారు. వాయువ్య చైనాలోని జుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. విజయవంతంగా ఆ రెండు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జిన్గున్ శాటిలైట్ కంపెనీ.. ఆ రెండు ఉపగ్రహాలను డెవలప్ చేసింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలపై ఆ శాటిలైట్లు ప్రయోగాలు చేపడుతాయి. ఐఓటీ అప్లికేషన్స్పై పైలట్ పరిశోధన చేపట్టనున్నాయి. లో ఆర్బిట్ స్మాల్ శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు కేజెడ్-1ఏ రాకెట్ను వాడుతారు. -
బుల్లి ఉపగ్రహాల కోసం ప్రత్యేక రాకెట్
సూళ్లూరుపేట: వాణిజ్య పరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే చిన్న చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే దీన్ని ప్రయోగించనుంది. ఇందుకోసం తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సమీపంలోని కులశేఖరపట్నంలో ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకూ ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ఐదు రకాల రాకెట్లను రూపొందించిన ఇస్రో ఆరో రకం రాకెట్గా ఎస్ఎస్ఎల్వీని తయారుచేస్తోంది. చిన్న తరహా ఉపగ్రహాల ప్రయోగానికి వివిధ దేశాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో ఇస్రో దీనికోసమే ప్రత్యేకంగా ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను రూపొందిస్తోంది. అంతేకాకుండా దేశీయంగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రయోగాత్మకంగా చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారు తయారు చేస్తున్న బుల్లి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఎస్ఎస్ఎల్వీ వివరాలివీ.. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ 300 కిలోల నుంచి 500 కిలోల బరువు కలిగిన చిన్నతరహా ఉపగ్రహాలను ఎన్నింటినైనా సునాయాసంగా తీసుకెళుతుంది. 34 మీటర్ల పొడవు, 2.1 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు వుంటుంది. ఈ రాకెట్ను కూడా నాలుగు దశల్లోనే ప్రయోగించనున్నారు. ఇందులో మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతో, నాలుగో దశ మాత్రమే ద్రవ ఇంధనం సాయంతో ప్రయోగించేలా డిజైన్ చేశారు. 300 కేజీల నుంచి 500 కేజీల బరువు కలిగి బహుళ ఉపగ్రహాలను భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ప్రవేశపెట్టేలా దీన్ని రూపొందించారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ44
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ-సీ44 రాకెట్ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ44 కక్ష్యలోకి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్తో పాటు మైక్రోశాట్ ఉపగ్రహాలను కూడా నిగింలోకి పంపారు. మైక్రోశాట్ ఉపగ్రహాలు దేశ రక్షణ రంగానికి సమాచారాన్ని అందించనుంది. డీఆర్డీవో రక్షణ విభాగంలో మైక్రోశాట్ ఉపగ్రహాల సేవలను వినిమోగించనున్నారు. కాగా పీఎస్ఎల్వీ సీరిస్లో ఇది 46వ ప్రయోగం తెలిసిందే. నూతన సంవత్సరంలో (2019) ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. దీనికి కృషిచేసిన విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు. -
రష్యా రాకెట్ అత్యవసర ల్యాండింగ్
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి రష్యా ప్రయోగించిన సూయిజ్ రాకెట్కు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. గురువారం కజకిస్తాన్లోని బైకనూర్ కేంద్రం నుంచి బయల్దేరిన కాసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రాకెట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వ్యోమగాములు నిక్ హేగ్(అమెరికా), అలెస్కీ ఒవ్చినిన్(రష్యా)లు క్షేమంగా ఉన్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. ‘ప్రయోగంలో తొలి దశ పూర్తయ్యాక బూస్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. క్షణాల్లో స్పందించిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం చాకచక్యంగా వ్యవహరించి రాకెట్ను సురక్షితంగా నేలకు దించారు’ అని తెలిపింది. జెజ్కాజ్గన్ పట్టణంలో రాకెట్ అత్యవసరంగా ల్యాండ్ అయిందని, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కంట్రోల్ రూంలోని రెస్క్యూ బృందంతో వారు మాట్లాడుతున్నారని నాసా అధికారి ఒకరు తెలిపారు. శిక్షణలోనూ వారు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారని, రాకెట్ అసాధారణ వేగంతో నేలకు దిగుతున్నప్పుడు అధిక గురుత్వాకర్షణ శక్తికి లోనైనా తట్టుకున్నారని వెల్లడించారు. ప్రయోగం ప్రారంభమైన 2 నిమిషాల్లోనే సమస్య తలెత్తిందని, అప్పటికి తామింకా సీటు బెల్టును పూర్తిగా పెట్టుకోలేదని వ్యోమగామి ఒవ్చినిన్ అన్నట్లు ఓ వీడియో బహిర్గతమైంది. -
రాకెట్ తేజ్బలి
అలీబాగ్లో ఎర్రటి సంధ్యాసమయపు సుదీర్ఘమైన సముద్రతీరంలో దూరంగా ఒక్కడే నడుస్తున్న రాకెట్ తేజ్బలి కాస్త ఎక్కువ ఎర్రగా మెరుస్తున్నాడు. చప్పున చూస్తే అతను ఇటువైపు వస్తున్నాడో లేదా అటువైపు వెళుతున్నాడో తెలియటం లేదు. ఒకింత భేల్పురి, ఐస్క్రీం స్టాళ్ళున్న ఈ రద్దీస్థలం నుంచి అతను చాలా దూరంలోనే ఉన్నాడు. ఊరిజనానికి ఈ సముద్రం, సూర్యాస్తమయం ఏవీ కొత్త కాదు. అందువల్ల ఇక్కడ అంతగా జనసంచారం ఉండలేదు. అయినా నగరంలోని గులాభా నుంచి తాత్కాలికంగా తప్పించుకునే భ్రమలో వంద కిలో మీటర్ల దూరంలోని ముంబయి నుంచి వచ్చిన కొన్ని పిక్నిక్ బృందాలు సాయంత్రపు ఎరట్రి నీటిలో ఈతకొడుతున్నాయి. కోలాహలం వల్ల ఊపిరి కట్టివేసే ముంబై సముద్రతీరాలనే చూసినవారికి ఈ నిరాటంకమైన పొడవైన తీరం, భయం పుట్టించేంత నిర్జనంగా అనిపిస్తోంది. ఈ అరుదైన వ్యక్తులకు కూడా కావలసినంత దూరంలో వున్న తేజ్బలి నడుస్తున్నాడు. లేదా నుంచున్నాడు. అప్పుడప్పుడు సముద్రం నుంచి వేగంగా వీస్తున్న గాలికి నిప్పులా ధగధగ మెరుస్తున్నాడు. అలీబాగ్ బీచ్ సమీపంలోనే క్యాంప్ వేసిన ‘మిలన్ డెత్ వెల్’లోని ప్రధాన మోటర్ సైకిల్ నడిపే తేజ్బలికి, రాకెట్ తేజ్బలి అనే విశేషణం ఏనాటినుంచి ప్రాప్తమైందో అతనికీ గుర్తులేదు. ఇప్పుడతనికి యాభై సమీపిస్తోంది. బహుశా పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం డైమండ్ సర్కస్ నుంచి వేరుపడినపుడే అతను రాకెట్ తేజ్బలి అయివుండాలి. అప్పుడు ‘మృత్యుగోళపు’ శరవేగపు మోటర్బైక్ వీరుడయ్యాడు. అక్కడి నుంచి బయటపడ్డ తరువాత విశాలమైన బావిలాంటి మృత్యుకూపాల వివిధ కంపెనీలను మార్చుతూ ఇప్పుడు గత ఐదారేళ్ళ నుంచి ఈ ‘మిలన్ డెత్ వెల్’లో చూపరుల ఒళ్ళు జలదరించేలా మోటర్బైక్ నడుపుతున్నాడు. చెవిపక్కన సైడ్లాక్లు నెరిసిన తేజ్బలి, కూపంపైనున్న వేదికమీద సకలజనుల దృష్టిని ఆకర్షించాలనే పెట్టినటువంటి మడ్గార్డ్లేని, విచిత్రమైన మూపులాంటి ఎర్రటిఎరుపు పెట్రోలు ట్యాంకు కలిగిన పాత మోటర్సైకిల్ మీద కూర్చోని యాక్సిలరేటర్ తిప్పి దిక్కులు పిక్కటిల్లే చప్పుడు రేపేటప్పుడు, పాత వెస్టర్న్ ఇంగ్లిషు చిత్రాల నాయకుడిలా కనిపిస్తాడు. ఇక ఆకాశంలో విస్ఫోటించే రాకెట్లా ఏకాగ్రచిత్తంతో ఒంటరిగా నిశ్చలంగా ఉంటాడు. ఇవాళ అలీబాగ్ క్యాంప్లో చిట్టచివరి రోజు. రాత్రి పదిగంటల ఆటే చివరిది. గత పదిహేను రోజుల ఈ క్యాంపులో ఒక్కరోజూ తప్పించకుండా, తేజ్బలి సూర్యాస్తమయ సమయంలో ఈ తీరానికి వచ్చేవాడు. పది సెకండ్లయినా సరే, నల్లతేలులా ఉన్నటువంటి పాత యెజ్డీ బైక్లో ఫట్ఫట్మని చిమ్ముకొచ్చి తీరంలో పల్లంవుంటే, తడిసినప్పటికీ గట్టిగా ఉన్న రేవు పొడవునా పరుగెత్తించి తిరిగొస్తాడు. అతడి వెనుక పిల్లలు పరుగెత్తుకు వస్తే– కేకలు వేసి, వేగంగా బైక్ నడిపి, చీకటి కమ్ముకోసాగిన వాడిన పొదలగుంపు వెనుక కనుమరుగైపోతాడు. చాలాసేపటి వరకు సైలెన్సర్ లేని ఆ నల్లతేలు ఫట్ఫట్మంటూ సద్దు చేస్తూ తీరంలోని గాలిలో నిలిచిపోతుంది. రేపటి నుంచి ఈ సాయంత్రపు సూర్యాస్తమయంలోని ఈ క్షణం మళ్ళీ ఇక్కడ ఉండదనే ఆలోచన అతను ఊహించిన దానికన్నా అధికంగా అతడిని ఆవరించుకుందా అన్నట్టు, ఇవాళ అతను తన నల్లతేలును కొబ్బరిబోండాలవాడి పక్కన నిలిపి, మౌనంగా రేవు తీరంలో నడిచిపోయాడు. ప్రవాహం తగ్గటంవల్ల సముద్రం వెనక్కి జరిగింది. తడి తీరంలో సాయంత్రపు ఎరుపు ప్రతిఫలిస్తూ ప్రత్యేకమైన ఓ మెరుపు అంచుమీద తేజ్బలి అడుగులు మృదువుగా ఏర్పడ్డాయి. కళ్ళనిండా నీళ్ళు వచ్చినట్టు, ఈ అడుగులు ఏర్పరిచిన ఇసుక చెలమలలో నీరు ఉబికి వస్తోంది. ఎదురుగా ఉన్న సముద్రంలో నిలబడిన పాతకోట ఇటువైపు నుంచి నీడను తొడుక్కుంటూ నల్లబారుతోంది. ప్రతిరోజూ దాన్ని చూశాడు. ఇక్కడి నుంచే. అయినా అక్కడికి వెళ్ళాలనిపించలేదు. ప్రవాహం మరీ తక్కువగా ఉన్నప్పుడు కోటవరకూ ఇసుక తీరం ఏర్పడి ప్రజలు అక్కడికి నడుచుకుంటూనే వెళతారట. ఆటుపోట్లు ఉన్నప్పుడే ఏవేవో రేవుల నుంచి చిన్నపడవల్లో, లాంచీలలో వచ్చిన జనం ఈ కోట నడిగడ్డవైపు ఊగుతూ సాగుతారు. ఈ కోట ఎప్పుడో ఎక్కడో పడిన స్వప్నంలా ఉంది. దాని అస్పష్టమైన కిటికీలలో చీకటి కమ్ముకుంటోంది. దాని ప్రాంగణంలోని చెట్లనిండా నల్లటి పక్షులు కూర్చున్నట్లున్నాయి. విరిగిన కోట బురుజు చిరిగిన భూపటంలా నిలుచోనుంది. తేజ్బలి మళ్ళీ వస్తానని కేకవేశాడు. వేలాది ఊళ్ళలో ఉన్నాడు. అయితే ఎక్కడా ఏదీ ఇలా ఆకర్షించలేదు. డెత్ వెల్ అడుగున ఉన్న చిన్న తలుపు తోసి లోపలికి చేరి తలుపు మూసుకుని పైకి చూస్తాడుకదా, పైన బావిచుట్టూ వేదిక మీదికి వంగి నుంచున్న వందలాది కళ్ళ నేపథ్యంలో లోతైన ఆకాశం ఉంది. జనం కొట్టిన చప్పట్లు బావిలోకి రాలిపడతాయి. మెల్లగా ఎర్రటి మోటార్బైక్ కిక్ కొట్టినపుడు జనసమూహం ఉద్రిక్తతతో నిటారుగా నుంచుంటుంది. రాకెట్లా తేజ్బలి రివ్వురివ్వురివ్వుమని పైకెక్కి వస్తాడు. అంతే. మొత్తం డెత్ వెల్ కంపిస్తుంది, వీక్షకులు భయపడేలా. ఐటం ముగిసి కాస్త అడ్డదిడ్డంగా తిరిగి కిందికి దిగి మధ్యనున్న గరుడ స్తంభానికి వాహనాన్ని ఆనించి, బావి అడుగున ఉన్న చిన్న తలుపు తోసి కూపం బయటికి వెళతాడు. బయటకూడా అదే సమూహం. అన్ని ఊళ్ళల్లోనూ అదే సమూహం. ఏ కలలోనూ రానటువంటి సమూహం. ఎవరో మంత్రం వేసినట్టు రాత్రి పది అవగానే కరిగిపోయే సమూహం. ఈ సమూహాన్ని దాటి, దాని చేతులు, ఒళ్ళు నిమిరి, తేజ్బలి సముద్రతీరాన్ని చేరేవాడు. అంచులో నిలబడి కోటను చూసేవాడు. కోటను చుట్టుముట్టిన సముద్రం నెమ్మదిగా అతడి పాదాలను తడిపి, వేగంగా వెనక్కు జరుగుతూ పాదాలకింది ఇసుకనూ తోడేసేది. తేజ్బలి ‘మళ్ళీ వస్తాను’ అని కేక వేసేవాడు. ఒకవిధంగా చూస్తే అతడిని ఇవాళ ఇలా స్వేచ్ఛగా తీరానికి పంపే పెద్దమనస్సు చూపినవాడు యజమాని రామ్ప్యారే. చివరిరోజు కావటంవల్ల అన్ని షోలలోనూ నువ్వు ఉండాల్సిందే అని ఒత్తిడి పెట్టకుండా, ‘‘తేజ్బలి, నీపాటికి నువ్వు తిరిగిరా. ఈ రోజు ఛగున్, పట్టూలు ఐటం చేస్తారు. వారు సొంతంగా నిర్వహించడానికి తయారుకావాలి కదా! వెళ్ళు. మజా చెయ్. రేపు ఉదయం మనం ఊరు వదులుతాం. గుర్తుంచుకో’’ అని నల్లతేలు కీ ఇచ్చాడు రామ్ప్యారే. అప్పుడు అతను కాస్త కలవరంలో ఉన్నట్టు కనిపించాడు. రామ్ప్యారే కళ్ళల్లో తేజ్బలి గురించి ఎప్పుడూ గుప్తమైన ఆరాధన భావమొకటి ఉన్నట్టుండేది. తలుచుకుని వుంటే, అదృష్టం వరించివుంటే, మరెక్కడో వెలిగిపోగలిగే తేజ్బలి అంతఃసత్వాన్ని గాఢంగా గౌరవించేవాడిలా రామ్ప్యారే వ్యవహరించేవాడు. రోజురోజుకూ దివాలా తీస్తున్నప్పటికీ తేజ్బలి జీతాన్ని, అతడి బైకుల సర్వీసింగ్లను తప్పకుండా నిర్వహించేవాడు. ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికైనా ముందు తేజ్బలిని ఒక మాట అడగటం అతడికి అలవాటైంది. ‘‘నువ్వు గొప్ప కళాకారుడివి. అంతే గొప్ప వ్యక్తివి. ఏమిటో నీ అదృష్టానికి పక్షవాతం వచ్చింది. అందువల్లే ఈ సామాన్యమైన స్టంట్ కళల కంపెనీకి వచ్చావు. మాకేమో నీవల్ల మంచే జరిగింది. అయితే నీకు తగిన స్థలం, గౌరవం ఇచ్చే స్థితి మాదికాదు. ఉన్నదాంట్లోనే సర్దుకుందాం’’ అనే రీతిలోనే అతని తీరు ఉండేది. తేజ్బలి ఆకర్షణీయమైన దుస్తులను సమయానికి ఉతికి లాండ్రీ చేయించే ఏర్పాటు గత సంవత్సరం ఇచలకరంజి క్యాంపులో రద్దయింది. అప్పుడు ఆదాయమే లేని, ‘మిలన్ డెత్ వెల్’ బిక్కుబిక్కుమంటోంది. జనరేటర్, విద్యుత్ మండలి లంచం, వేదిక అద్దె, స్థలానికి డిపాజిట్ –అన్నీ సమకూర్చేలోపు దివాలా తీసిన రామ్ప్యారేతో లాండ్రీ విషయంలో గొడవ పడటం సమంజసం కాదనిపించి తేజ్బలి మౌనం వహించాడు. తన దుస్తుల ఖర్చు తానే చూసుకోసాగాడు. ఒక రాత్రి తాగిన మత్తులో రామ్ప్యారే, ‘‘నిన్ను బాగా చూసుకోలేకపోతున్నాను. క్షమించు’’ అని తేజ్బలి కాళ్ళమీద పడి ఏడవసాగాడు. ‘‘వద్దు సేఠ్, వద్దు’’ అని తేజ్బలి అనగానే, ‘‘సేఠ్ అని నన్ను పిలవకు’’ అని అరిచి తన చెంపలు తానే వాయించుకున్నాడు. అతుకులు వేసిన జీన్స్ ప్యాంటులో ఉన్న రామ్ప్యారే కన్నీళ్ళను తన షర్ట్ చేతులకు తుడుచుకున్న క్షణంలో తేజ్బలిలో ఏదో పొంగినట్టయ్యింది. జుట్టంతా నెరిసిపోయిన తలను తట్టి – ‘‘నీకు మంచి కాలం వస్తుంది. విచారించకు’’ అన్నాడు. దీన్ని నమ్మటానికి ఎదురుచూస్తున్నవాడిలా రామ్ప్యారే ‘‘నిజంగా, అవునా’’ అని కళ్ళు విప్పార్చి,‘‘నా టైమ్ బాగవ్వనీ తేజ్బలి, నిన్ను దేవుడిలా చూసుకుంటాను. నీకొక ఫుల్టైమ్ అసిస్టెంట్ కుర్రవాడిని ఇస్తాను’’ అని కొత్త ఆవేశంతో బయటికి నడిచాడు. ఒక విధమైన అబద్దపు వాగ్దానాన్ని పరస్పరం ఇచ్చుకున్నట్టున్న ఆ క్షణం తరువాత తేజ్బలికి తను మిలన్ డెత్ వెల్కు భారంగా మారాడనే భావన అతడి గుండెను బరువెక్కించసాగింది. వంట చేసే ఆట ఆడే పిల్లలు ఉత్తుత్తి భోజనం చేస్తున్నట్టు నటిస్తూ, చిన్నచిన్న గరిటెలతో వడ్డించినట్టు –తాము భవిష్యత్తు గురించి, జీవితం గురించి కలలను కంటున్నట్టు అనిపించింది. ఇది జరిగిన కొన్నిరోజుల తరువాత అర్నాళా క్యాంపులో ఒక చిన్న ఇబ్బంది కలిగింది. డెత్ వెల్ చుట్టూ వరుసగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బుల మాలికలో ఒక చోట తెగిన వైర్ను అకస్మాత్తుగా తాకిన ఓ చిన్న అమ్మాయి షాక్ తగిలి మూర్ఛపోయింది. అదృష్టవశాత్తు ఆమె తేరుకున్నప్పటికీ ఊరిజనం కోపానికి ‘మిలన్ డెత్ వెల్’ ముక్కలైంది. జనం వేదికను విరిచేశారు. పోస్టర్లకు తారుపూశారు. భయపడి అర్నాళ కొండల్లో దాగి కూర్చున్న రామ్ప్యారేను తరుముకుంటూపోయి వెదికి కొట్టారు. చాలా రోజులు ‘డెత్ వెల్’ స్పీకర్లు మౌనంగా ఉన్నాయి. తేరుకున్న అమ్మాయికోసం పరిహారం వసూలు చేయడానికి వచ్చిన స్థానిక యువనాయకులు, తన బైక్కు బ్రాస్ పూసి మెరిసేలా చేస్తున్న తేజ్బలితో– ‘‘ఎందుకు హీరో, పని లేదా? మా ఎలెక్షన్ ప్రచారానికి రా, భోజనం పెడతాం. కోడికూరతో భోజనం’’ అని వెక్కించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇది తనకొక దుర్భరమైన క్షణమనిపించింది. ఇలాంటి కఠిన సమయంలోనే మార్పు సాధ్యమని బలంగా అనిపించింది. రామ్ప్యారే భారాన్ని దించడానికి ఇది తగిన సమయం అనిపించి మెల్లిగా రామ్ప్యారే దగ్గరికి వెళ్ళి, ‘‘ప్యారేజీ, నీకు నీ భారమే ఎక్కువగా ఉంది. నా వల్ల ఎలాంటి సహాయం లేదు. నేను మీకు ఊరకూరకే భారమవకూడదు. నాకు పోయిన నెల జీతం వద్దు. నేను మరో ఉద్యోగం వెతుక్కుంటాను. ఎంత లేదన్నా పన్వెల్, కల్యాణ్లలో డ్రైవర్ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. గత రెండేళ్ళల్లో ముంబయి ఫ్యాక్టరీలన్నీ మూతపడి జనం వీఆర్ఎస్ అనే పిడుగుకు బలి అయ్యారట. వచ్చిన సొమ్ముతో పిచ్చివాళ్ళల్లా బిజినెస్ బిజినెస్ అని మాక్సీ క్యాబ్, టాటా సుమో, క్వాలిస్ అని అద్దెకు తిప్పటానికి వాహనాలు కొనుక్కుంటూ ఉన్నారట. అందువల్ల మంచి డ్రైవర్కు చాలా డిమాండు ఉందట. వెళతాను. కచ్చితంగా ఉపవాసం ఉండను ప్యారేజి. నమ్మండి. మీ పరిస్థితి కుదుటపడనివ్వండి. అప్పుడు కచ్చితంగా వచ్చి చేరుతాను’’ – అని చెయ్యి పట్టుకుని ఎవరి గొంతుతోనో మాట్లాడుతున్నవాడిలా అన్నాడు. రామ్ప్యారే కళ్ళల్లో ఒక క్షణం విముక్తి పొందిన మెరుపు కనిపించినప్పటికీ, ఆ మెరుపు తేజ్బలికి తెలిసిపోయిందనే సత్యాన్ని మరుగుపరుస్తున్నట్టు తన చేతిలో ఉన్న అతడి రెండు చేతులను తన ముఖానికి హత్తుకుని – ‘‘ఛీ! ఇలాంటి రోజు నాకు వచ్చేసిందా’’ అని నిట్టూర్పు విడిచాడు. ‘‘నువ్వు పులివి తేజ్బలి, పులి. పులి ఉపవాసం ఉంటుంది. కానీ కచ్చితంగా గడ్డి తినదు. నువ్వు గడ్డి తినకూడదు. నువ్వు వీరుడివి. నైపుణ్యం కలవాడివి. సమాజం నిన్ను తలమీద పెట్టుకోవాలి. సమాజపు ఇల్లు పాడైపోయింది. నేను? నేనూ నిన్ను చూడకపోతే? ఆ!’’ అని చెబుతూ వెంటనే విముక్తి పొందే క్షణాన్ని తనే చేతులారా పోగొట్టుకుంటున్నాడేమోననే భయంతో ఆగిపోయాడు. అతని రెండు కళ్ళూ డెత్ వెల్ ఖాళీ బావుల్లా కనిపిస్తున్నాయి.ఆ నిరాశ నిండిన చూపుల్లో తేజ్బలికి తన విముక్తిదారి కూడా కనిపించినట్లయ్యింది. మాట్లాడటం మొదలుపెడితే మళ్ళీ అంతా కలగాపులగం అవుతుందనిపించి మెల్లగా నడుస్తూ తన టెంట్కు వెళ్ళాడు. రాత్రి ఒక్క బల్బు వెలిగించుకుని అందరూ భోజనం చేస్తున్నప్పుడు మోటర్బైక్ గర్జించినట్టు రామ్ప్యారె అరవసాగాడు – ‘‘పోనీ, పెద్దవాళ్ళందరూ పోనీ, మేము బాగుండాలని వాళ్ళనంతా కట్టివేయడానికి సాధ్యమా? మాతోపాటు మీరు ఉపవాసం ఉండండని చెప్పటానికి నేనెవరిని? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో–అందరూ వెళ్ళిపోండి. అయితే ఎవరి సొమ్ము బాకీ ఉంచుకోలేను. తీర్చేశక్తి నాకు లేదు. జనరేటర్ అమ్మి తరువాత ఇస్తాను. ఒకనెల అయినా వ్యవధి కావాలి. నా మీద ఆ మాత్రం నమ్మకముంచి వెళ్ళండి’’. ఈ అరుపులు ఒక దశ తరువాత తేజ్బలితోపాటు స్వయంగా ప్యారేకూ పిల్లల ఆటల్లోని కేకల్లా అనిపించసాగాయి. మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే అంతా నాటకీయమయ్యేది. పైగా అది నాటకీయమైనకొద్దీ వాస్తవాన్ని గెలిచిన భ్రమ అయ్యేది. అబద్ధం అనిపించినట్టల్లా తేలికయ్యేది. చప్పున ఇద్దరికీ నవ్వొచ్చింది. అర్ధరాత్రివేళ చీకట్లో నిలబడ్డ చెట్లను భయపెట్టేలా పకపకా నవ్వసాగారు.తదుపరి క్యాంప్ నుంచి ప్రకటనల్లో రామ్ప్యారే – ‘‘మా అమితాబ్, మా సచిన్ టెండూల్కర్, మా రాకెట్ తేజబలి’’ – అని కేకలు పెట్టసాగాడు. అయితే ఈ ఆవేశంతోపాటు అంతరంగంలో ఎక్కడో – చేతులారా దగ్గరికి వచ్చిన ఒక మలుపును తన శక్తికి మించిన దుర్బలతవల్ల తానే పోగొట్టుకున్నవాడిలా కుంగిపోసాగాడు. కొత్త యువకులకు ఈ రాకెట్ తేజ్బలిలో అంత ఆకర్షణ కనబడలేదు. ఎంతగా మీసాలకు రంగువేసినా, ఎంత టైట్ జీన్స్ ప్యాంట్ తొడుక్కున్నా అతని మెడ దగ్గర వదులైన చర్మం, అతడి మోచేతుల మీద ఉబ్బిన నరాలు ఉదాసీనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ఛగున్, పట్టూలు జరిపే స్టంటులలో తేజ్బలి అనుభవం లేకపోయినా, ప్రేక్షకులకు కావలసిన తారుణ్యపు కాంతి ఉండేది. అది నిగూఢ నాడులను ఉద్దీపింపజేస్తున్నట్టుగా ఉంది. మైమరుపును సహజంగానే బదిలీ చేసేలా ఉండేది. అయితే తేజ్బలి ఏదో పాతవైభవపు అవశేషంలా కనిపించేవాడు. యువకుల నుదుటి చెమట పూలమీది మంచుబిందువులా కనిపిస్తే, తేజ్బలి చెమట అలసట ధారలా కనిపించేది. రామ్ప్యారేకూ ఇది తెలియని విషయంకాదు. అయితే రామ్ప్యారే తేజ్బలి ద్వారా తన తారుణ్యపు ఉత్కర్షను పొందడానికి తపించేవాడు. వయస్సులో దాదాపు తనంతే ఉన్నప్పటికీ తేజ్బలి ఆ డెత్ వెల్లో టర్ర్ర్ అని తిరిగి తిరిగి ప్రేక్షకులు విసిరిన కర్చీఫ్లను మెరుపులా పట్టుకుని చప్పట్లు కొట్టించుకునేటప్పుడు ‘పరవాలేదు ఇంకా ఉంది’, ‘ఇంకా ఏదో ఉంది’, ‘ఇంకా మిగిలి ఉంది’ అనే భావాన్ని రామ్ప్యారే అనుభవించేవాడు. అయితే ఐటం చూసిన తరువాత వీరయోధుల్లా సవారులంతా గుమ్మంలో నుంచున్నప్పడు – బయటకువెళ్ళే ప్రేక్షకుల బృందంలోని యువతీయువకులందరూ ఛగున్, పట్టూలను చూడటానికి, చేతులు కలపటానికి సహజంగానే ఆకర్షితులైనట్టుగా, తేజ్బలి చేత ఆకర్షింపబడేవారు కాదు. తేజ్బలి వయసు ప్రేక్షకులూ ఇంకేదో జగత్తులో అప్పటికే కాలుపెట్టేవాళ్ళు. అందువల్ల చివరికి ఈ తేజ్బలి రాకెట్ కావటం కేవలం తన మనోలోకంలో అని రామ్ప్యారేకు కచ్చితంగా అవగాహన కలిగినా ఈ లోకమే అతడి పరమసత్యం కావటం వల్ల అతను దాన్ని కించిత్తూ లోపం లేకుండా శ్రమ వహించి కాపాడుకునేవాడు. మిలిటరీ హోటల్నుంచి మటన్ తెప్పిస్తే, మంచి ముక్కలను వెదికి తేజ్బలికి పంపేవాడు. ఇలాంటి రామ్ప్యారే వ్యావహారిక జగత్తుకు తన వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు, ఇప్పటికీ తాను అక్కడి నుంచి బయటికి రాకపోతే అన్యాయమౌతుందనే అభిప్రాయాన్ని ఎందుకో గత వారంనుంచి ఈ అలిబాగ్ కడలితీరం దృఢపరుస్తోంది. ఎదురుగా కోట, విశాలమైన నిర్జనమైన ఇసుక మైదానం, ఎగరడానికి మరిచిన పక్షుల్లా ఒత్తుగా కూర్చున్న గాలిమరలు, అన్నీ ఒక విసర్జన ఘడియలోని కరువును అస్పష్టంగా తేజ్బలికి సూచిస్తున్నాయి.దట్టంగా నల్లబారబోతున్న ఎరుపులో నడుస్తున్న అతడు మనస్సుల్లోనే తాలీము చేయసాగాడు – ‘రామ్ప్యారే, నాకు తెలుసు. నీకు బాధ కలుగుతుంది. నాకు తెలుసు నువ్వు భయపడతావు. నాకు తెలుసు మనమిద్దరమూ పరస్పరం ఒకరికొకరు కావాలి. కానీ కుదరదు. ఇక చాలు ! నేను మిలన్ డెత్ వెల్ని వదిలిపెడుతున్నాను. మన ఇద్దరివల్ల మన ఇద్దరికీ జరగవలసిందంతా జరిగింది. ప్యారేజీ, ఈ ఆయుష్షు ఉన్నంత వరకూ అది మన వెంట తోడుగా ఉంటుంది. నన్ను వదిలేయ్. నువ్వు మెత్తబడ్డావు. ఈ యువకులు నిన్ను చూసుకోవాలి. ఎక్కువగా తాగవద్దు. లివర్ పాడవుతే అంతా ముగిసిపోతుంది. ఈ నల్లతేలును నాకు ఇవ్వు, చాలు. అది నన్ను వేరెక్కడికో తీసుకెళ్ళగలదు. దాని ఋణం నాపై ఉండనీ. అది నీలో నన్ను శాశ్వతంగా కట్టివేయగలదు. చూడు ప్యారే... ఈ కోట అది వేరే ఎవరో చూసింది కాదు. అది ఇప్పుడు నాకు కనిపిస్తోంది. ఈ తీరంలో నన్ను వదిలెయ్. కేవలం అడుగులే ఉన్నటువంటి, దారులే లేనటువంటి ఈ మృదువైన తీరంలో ప్రశాంతంగా వెళ్ళిపోనువ్వు’. అర్ధరాత్రి దాటేవరకూ తేజ్బలి అలాగే కాళ్ళుచాపి ఇసుకలోనే కూర్చునివున్నాడు. ఈ తావు కేవలం అతని ఏకాంత సమయం కోసమే వికసించినట్టుంది. కడలి సద్దు, సొగుసు, అన్నీ వేరు వేరు అవతారాలను ధరించసాగాయి. కోట పల్చటి మేఘాలను లాగుతోంది. అక్కడ ఎవరో వెలిగించి పెట్టిన దీపాలు అవునో కాదో అన్నట్టు వెలుగుతున్నాయి. అది మరికాసేట్లో తీరాన్ని వదలబోతున్న ఓడలా కనిపించసాగింది. ఇక్కడ చివరి ఆట తరువాత లవలేశమూ మిగలనట్టు ‘మిలన్ డెత్ వెల్’ రెండు పెద్ద పెద్ద లారీలలో చేరుకుంది. ‘‘సేఠ్, రాకెట్ సార్ ఇంకా రాలేదు. రాకెట్ సార్ ఇంకా రాలేదు’’ అని పనివాళ్ళు, ఛగున్, పట్టూలు అందరూ భయమూ, అయోమయాలతో తొందరపెట్టినపుడు రామ్ప్యారే, ‘‘అతను వస్తాడు. నాకు తెలుసు. మీ పనులు చూసుకోండి. పదండి. వేకువ ట్రాఫిక్ పెరిగేలోపు మనంహైవే చేరాలి. బయలుదేరుదాం’’ అని గద్దించాడు. పట్టూ– ‘‘సేఠ్, మన తర్వాతి క్యాంపు ఎక్కడో ఆయనకు తెలుసా? ఆయనను పిల్చుకునే వస్తాను. సముద్ర తీరంలో ఉంటారు...’’ అని అనగానే, రామ్ప్యారే, ‘‘చుప్, అతడిని ఎవరూ పిల్చుకుని రావలసిన అవసరం లేదు. అతనికంతా తెలుసు. అతనికంతా తెలుసు’’ అని తారాస్థాయిలో అరిచాడు. అతనికంతా తెలిసినట్టుంది. పరస్పరం ముక్తులయ్యే అవకాశాన్ని ఈసారి మళ్ళీ పోగొట్టుకోకూడదనే ఎరుక అతని అంతరంగంలో కంపిస్తోంది. తెల్లవారుతున్నప్పుడు హైవేలో లోనావాలా వైపు తిరిగిన ట్రక్కులలో అందరూ నిద్రపోయారు. రామ్ప్యారే మాత్రం రెప్ప వాల్చకుండా మొత్తం లారీ తన దేహమన్నట్టు విగ్రహంలా కదులుతూ, ఎదుటి రోడ్డునే చూస్తున్నాడు. ఇసుక తీరంలో, ఒరిగిన చోటే నిరాటంకంగా నిద్రపోయిన తేజ్బలి చుట్టూ నిలబడిన కొందరు పిల్లలు పరస్పరం ‘‘రాకెట్ తేజ్బలి, రాకెట్ తేజ్బలి’’ అని గుసగుసగా అంటూ, నిమజ్జనం మరుసటిరోజున ఒడ్డుకు వచ్చి పడిన విలక్షణ విగ్రహాన్ని చూస్తున్నట్టు, గాలికి ఎగురుతున్న అతడి ముంగురులనే చూస్తున్నారు.రెండు విభిన్న లోకాల మధ్యలో నిగూఢమైన ముక్త తంతులా దూరంలో నిల్చున్న నల్లతేలు, కొత్త కిరణాలలో తళతళమని మెరుస్తూ మొదటి కిక్ కోసం ఎదురుచూస్తోంది. కన్నడ మూలం : జయంత కాయ్కిణి అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
రాకెట్ కబుర్లు తెస్తుంది..!
రవాణా వ్యవస్థ ప్రారంభమైనప్పుడే పోస్టల్ వ్యవస్థ చరిత్ర కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉత్తరాలను ఒక చోటు నుంచి మరో చోటుకు ఎలా చేరవేసేవారంటే.. ఆ ఏముంది.. రైలులోనో.. బస్సులోనో.. అంటారు కదా.. మరీ దూరమైతే విమానాల ద్వారా కూడా చేరవేసేవారు. ఇప్పుడైతే వాటి అవసరమే లేకుండా పోయిందనుకోండి. మన తాతల తరం వారికి ఏ చిన్న సమాచారం చేరవేయాలన్నా.. ఈ ఉత్తరాలే అన్నింటికీ ఆధారం. అప్పట్లో ఒక్క ఉత్తరం చేరాల్సిన చోటుకు చేరాలంటే వారాలకు వారాల సమయం పట్టేది.. అయితే త్వరగా పంపాలంటే ఎలా.. అందుకోసం రాకెట్లను వాడేవారట. రాకెట్ ద్వారా పోస్ట్ ఎలా పంపిస్తారని ఆశ్చర్యపోకండి.. నిజంగా రాకెట్ ద్వారానే ఉత్తరాలు పంపేవారట. 1810లోనే ఆలోచన.. రాకెట్ ద్వారా పోస్టు పంపాలన్న ఆలోచనకు 1810లోనే బీజం పడింది. అప్పట్లో హెన్రిచ్ వోన్ క్లీస్ట్ అనే రచయిత రాకెట్ ద్వారా ఉత్తరాలు పంపే ఆలోచనను వ్యాసం రూపంలో ఓ పత్రికలో రాశారు. జర్మనీలోని బెర్లిన్ నుంచి బ్రెస్లూ (180 మైళ్లు)కు సగం దినంలో పంపొచ్చని ఆయన అంచనా వేశారు. అంటే గుర్రం ద్వారా పట్టే సమయంలో పదో వంతన్న మాట. ఆయన సిద్ధాంతాన్ని టోంగాలోని పాలినేసియన్ అనే చిన్న ద్వీపంలో బ్రిటిష్ పరిశోధకుడు సర్ విలియమ్ కంగ్రీవ్ ఆచరణలో పెట్టారు. అయితే అది సక్సెస్ అవలేదు. మరో వందేళ్ల వరకు దీని గురించి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. 1927లో హెర్మన్ జులియస్ అనే జర్మన్ ఫిజిసిస్ట్ దీనిపై ప్రయోగాలు చేశారు. 1928లో యువ ఇంజనీరైన ఫ్రెడ్రిక్ స్క్మీడిల్ ఉత్తరాలను రాకెట్ ద్వారా పంపేందుకు ప్రయత్నించారు. చివరికి 1931లో చరిత్రలోనే తొలిసారిగా రాకెట్ ద్వారా 5 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి 102 ఉత్తరాలను ఒకేసారి పంపి చరిత్రలోకెక్కారు. కిందికి దింపేందుకు పారాచూట్లను వాడేవారు. భారత్లో తొలి రాకెట్ ఉత్తరం! ఆ తర్వాత వేరే దేశాల్లో కూడా ఈ ప్రయోగాలు జరిగాయి. 1934లో భారత్లో దీనిపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఎయిరోస్పేస్ ఇంజనీర్ స్టీఫెన్ స్మిత్ విజయవంతంగా ఈ రాకెట్ ద్వారా ఉత్తరాలను పంపారు. 1934 నుంచి 1944 మధ్య దాదాపు 270 సార్లు ప్రయోగించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు ఆహారం అందించేందుకు స్మిత్ ప్రపంచలోనే తొలిసారిగా రాకెట్ను ఉపయోగించారు. ఖర్చు చాలా ఎక్కువే.. అయితే రాకెట్ ద్వారా ఉత్తరాలు బట్వాడా చేయాలంటే అంత సులువేం కాదు.. ఇందుకోసం చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఈ ప్రయోగానికి అప్పట్లోనే 10 లక్షల డాలర్లు ఖర్చయ్యేదట. కానీ బట్వాడా చేయడం ద్వారా వచ్చే ఆదాయం కేవలం 240 డాలర్లు. -
నేడు జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ కౌంట్డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురు వారం సాయంత్రం 4.56కు ప్రయో గించనున్న జీఎస్ఎల్వీ ఎఫ్08 బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్డౌన్ ప్రారం భించేందుకు మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆ«ధ్వర్యంలో షార్లోని బ్రహ్మప్రకాశ్ హాల్లో మంగళవారం సమావేశం జరిగింది. 27 గంటల కౌంట్డౌన్ అనంతరం గురువారం సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించనున్నామని అధికారికంగా ప్రకటించారు. ఎంఆర్ఆర్ సమావేశం అనంతరం ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ పి.కున్హికృష్ణన్కు అప్పగించారు. బుధవారం మధ్యాహ్నం 1.56 గంటలకు కౌంట్డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
భారతీయ ఎంబసీపై పడిన రాకెట్
కాబుల్ : ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో గల భారతీయ ఎంబసీపై క్షిపణి పడింది. ఈ ఘటనలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంబసీలోని ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ఐటీబీపీ భద్రతా బలగాలు ఉండే మూడు బరాక్లకు చేరువలో రాకెట్ పడినట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. అయితే, భారతీయ ఎంబసీ టార్గెట్గానే రాకెట్ ప్రయోగం జరిగిందా? అన్న విషయంపై స్పష్టత ఇంకా రాలేదు. -
పీఎస్ఎల్వీ సీ40కి నేడు కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ40 నింగిలోకి దూసుకెళ్ల నుంది. ఈ విషయాన్ని బుధవారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో అధికారికంగా ప్రకటించారు. రాకెట్కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ వారు ప్రయోగ పనులను లాంచ్ ఆథరై జేషన్ బోర్డుకి అప్పగించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ పీ కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించి గురువారం తెల్లవారుజామున 5.29 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ ఎల్వీ సీ40 ద్వారా 1,323 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 710 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–2 సిరీస్లో ఐదో ఉపగ్రహంతో పాటు దేశీయంగా ఒక సూక్ష్మ ఉపగ్రహం, మరో బుల్లి ఉపగ్రహంతో పాటు ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ప్రయోగించనున్నారు. గతేడాది ఆగస్టు 31న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ39 విఫలమైనందున ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. -
అరగంటలో హైదరాబాద్–న్యూయార్క్
హైదరాబాద్లోని లక్డీకాపూల్ నుంచి కూకట్పల్లికి వెళ్లాలంటే ఎంత టైమ్ పడుతుంది.. ట్రాఫిక్ జామ్ వంటివి ఏవీ లేకుంటే కొంచెం అటుఇటుగా అరగంట. అంతేనా.. మరి ఇదే అరగంటలో మీరు హైదరాబాద్ నుంచి న్యూయార్క్కు వెళ్లిపోగలిగితే.. అబ్బో.. అద్భుతంగా ఉంటుందిగానీ ఎలా సాధ్యమని అనుకుంటున్నారా.. ఇంకొన్నేళ్లు ఆగితే దీన్ని సుసాధ్యం చేస్తానంటున్నారు ఎలాన్ మస్క్! ఎలాన్ మస్క్.. టెస్లా పేరుతో విద్యుత్ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టినా.. స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవోగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తాను తయారు చేసిన రాకెట్లతో ఇంధనాన్ని, వ్యోమగాములను రవాణా చేసినా.. హైపర్లూప్ పేరుతో గంటకు 1,300 కి.మీ. వేగంతో గొట్టాల్లో ప్రయాణించే సరికొత్త రవాణా వ్యవస్థకు ఆలోచన చేసినా.. అన్నీ ఈ 46 ఏళ్ల అమెరికన్కే చెల్లాయి. అలాంటి మస్క్ ఇంకో ఏడేళ్లలో రవాణాకు విమానాలకు బదులుగా రాకెట్లను వాడతానంటే ఆసక్తి పెరగడం సహజం. ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యలో మస్క్ తన భవిష్యత్తు ఆలోచనలను పంచుకున్నారు. గతంలో పేర్కొన్నట్లే 2024 కల్లా అంగారకుడిపైకి మనుషులను పంపి తీరతానని.. ఇందుకు బీఎఫ్ఆర్ అనే ఓ భారీ రాకెట్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో బీఎఫ్ఆర్ రాకెట్లో ఉండే 40 కేబిన్ల ద్వారా వంద మంది ప్రయాణించవచ్చనని మస్క్ తెలిపారు. ఫాల్కన్–9 మాదిరిగానే.. మస్క్.. నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాములను తన స్పేస్ ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ ద్వారా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. మళ్లీమళ్లీ వాడుకోగలగడం ఫాల్కన్–9 ప్రత్యేకత. ఫాల్కన్–9తోపాటు డ్రాగన్, ఫాల్కన్ హెవీ పేరుతో వేర్వేరు సామర్థ్యాలు గల రాకెట్లను మస్క్ తయారు చేస్తున్నారు. వీటి స్థానంలో ఓ బీఎఫ్ఆర్ రాకెట్ను వాడటం ద్వారా అంగారక ప్రయాణాన్ని చౌకగా పూర్తి చేయగలనని మస్క్ భావిస్తున్నారు. ఫాల్కన్–9 రెండు దశల రాకెట్. మొదటిది విడిపోయాక సరుకులున్న భాగం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకుని మళ్లీ భూమ్మీద ల్యాండ్ కాగలదు. విడిపోయిన మొదటి దశ భాగాన్ని వృథా చేయకుండా తర్వాతి ప్రయోగానికి వాడుకుంటారు. బీఎఫ్ఆర్లో ఇలాంటివి ఉండవు. ఇంధనం మండే ప్రాంతం.. ప్రయా ణికులు లేదా సరుకులు ఉండే చోటు అన్నీ ఒకే రాకెట్లో ఉంటాయన్నమాట. ఇంధన ఖర్చులు తక్కువగా ఉండి.. రాకెట్ను మళ్లీ వాడుకునే అవకాశం ఏర్పడితే.. ఉపగ్రహాల ప్రయోగం, అంగారకుడి యాత్ర ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని మస్క్ అంటున్నారు. అన్నీ సవ్యంగా సాగితే తొలి బీఎఫ్ఆర్ నిర్మాణం వచ్చే ఏడాది మొదలవుతుందని, ఐదేళ్లలో అందుబాటులోకి వస్తుందని మస్క్ చెప్పారు. 2024 నాటికల్లా నాలుగు బీఎఫ్ఆర్ రాకెట్లను అంగారకుడిపైకి ప్రయోగిస్తామని, వీటిల్లో 2 ప్రయాణికులతో కూడినవి ఉంటాయన్నారు. తొలి వ్యోమగాములు అంగారక ఉపరితలంపై కాలనీని ఏర్పాటు చేసి, తిరుగు ప్రయాణానికి ఇంధనాన్ని తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారన్నారు. భూమిపైనా వాడుకోవచ్చు బీఎఫ్ఆర్ రాకెట్లు భూమి మీద కూడా రవాణాకు వాడుకోవచ్చని మస్క్ పేర్కొన్నారు. భూమి మీద ఏ మూల నుంచైనా ఇంకో చోటికి వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. గంట సమయంలోనే ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చని చెప్పారు. నీటిపై ఏర్పాటు చేసే ప్లాట్ఫాంపైనా ల్యాండయ్యే సామ ర్థ్యం వీటికి ఉంటుందన్నారు. ఒక్కో రాకెట్ ప్రయాణానికి టికెట్ ఖర్చు ఎంతన్నది మస్క్ చెప్పలేదుగానీ.. అంగారక యాత్రకు దాదాపు రూ.కోటీ నలభై లక్షలు ఖర్చవుతుందన్నారు. భూమి మీద ప్రయాణానికి మరీ ఇంత ఖర్చు కాకపోవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లోని భారత రాయబారి నివాసంలో రాకెట్ పేలడం కలకలం రేపింది. కాబూల్లోని భారత ఎంబసీ కాంపౌండ్లోని అతిథి గృహంలో రాకెట్ లాంచర్ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత అతిథి గృహం కాంపౌండ్లో ఉన్న వాలీబాల్ మైదానంలో ఉదయం 11.45 గంటలకు రాకెట్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో భారత దౌత్యవేత్త మన్ప్రీత్ వోహ్రాతోపాటు ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది కూడా ఇంట్లోనే ఉన్నారు. గతవారం కాబూల్లోని దౌత్య ప్రాంతంలో భారీ ఉగ్రపేలుళ్లు చోటుచేసుకొని 150మందికిపైగా మృతిచెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారత దౌత్యవేత్త నివాసంలో రాకెట్ లాంచర్ పేలుడం ఆందోళన రేపుతోంది. -
వాడిన రాకెట్ను మళ్లీ వాడారు
కేప్ కానావెరల్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (స్పేస్ ఎక్స్) మొట్టమొదటి సారిగా పునర్వినియోగ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఫాల్కన్ 9 అనే రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. మొదటిసారి ఈ రాకెట్ను ఏడాది క్రితం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సముద్రం సురక్షితంగా ల్యాండ్ చేశారు. మళ్లీ అదే రాకెట్కు తొమ్మిది ఇంజన్లను ఏర్పాటు చేయడంతోపాటు స్పేస్ ఎక్స్ దీన్ని ఆధునికీకరించింది. లక్సెంబర్గ్లోని ఎస్ఈఎస్ కంపెనీకి చెందిన ఉపగ్రహాన్ని ఈ రాకెట్లో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ పంపించింది. తిరిగి ఈ రాకెట్ను విజయవంతంగా సముద్రంపై ల్యాండ్ చేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతంగా జరిపిన ఈ ప్రయోగం గొప్ప ముందడుగు అని స్పేస్ ఎక్స్ ముఖ్య సాంకేతిక అధికారి మార్టిన్ హాల్లివెల్ అన్నారు. -
ప్రయోగం విజయవంతం
ఉపగ్రహాలను భూమిపై స్థిరప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం చూశాం. అందుకు భిన్నమైన ప్రయోగమిది. కింద బిగించిన ఉపగ్రహాలున్న రాకెట్ను విమానం మోసుకెళ్తుంది. ఆకాశంలో వెళ్తున్నపుడు దాని నుంచి విడివడి రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. తుపాన్ల జాడ పసిగట్టి, వాటి సామర్థ్యాన్ని అంచనావేసి, హెచ్చరించే 8 ఉపగ్రహాలున్న నాసా ‘సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ను రాకెట్ విజయవంతంగా అట్లాంటిక్ సముద్రంపై 39వేల అడుగుల ఎత్తులో ప్రయోగించింది. యూఎస్లోని కేప్ కనావరెల్లో తీసిందీ ఫొటో. -
వర్దా తుఫాన్తో ఇస్రో అప్రమత్తం
-
నింగిలోకి ఇన్శాట్-3డీఆర్
స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగంలో ఇస్రో హ్యాట్రిక్ విజయం శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ తొలి ప్రయోగంలోనే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం జీఎస్ఎల్వీ-ఎఫ్05 ఉపగ్రహ వాహకనౌక ద్వారా వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఆర్ను రోదసిలోని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక దశల ప్రయోగంలో వరుసగా మూడో విజయం సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో గల షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4:50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్05 రాకెట్.. 17 నిమిషాల తర్వాత ఇన్శాట్-3డీఆర్ను భూ సమాంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇన్శాట్-3డీఆర్ పనిచేయని ఇన్శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ప్రయోగం ఇలా జరిగింది...: జీఎస్ఎల్వీ ఎఫ్05 రాకెట్ ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11:10 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 29:40 గంటల పాటు కొనసాగింది. గురువారం సాయంత్రం 4:10 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. క్రయోజనిక్ దశలో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియలో ఒక సేఫ్టీవాల్వ్ క్లోజ్ కాకపోవడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 2.53 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ నిలిచిపివేసి.. లోపాన్ని సవరించారు. దీంతో ప్రయోగం 40 నిమిషాలు ఆలస్యమైంది. లోపం సవరించాక 4:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. స్వదేశీ క్రయోజనిక్లో ఇస్రో హ్యాట్రిక్ జీఎస్ఎల్వీ శ్రేణిలో ఇస్రో పది ప్రయోగాలు చేయగా.. తాజా ప్రయోగంతో ఏడో విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. దేశీయంగా అభివృద్ధి చేసిన సంక్లిష్ట క్రయోజనిక్ దశ ప్రయోగంలో విజయాల హాట్రిక్ సాధించింది. అయితే.. తాజా ప్రయోగంలో.. దేశీయంగా రూపొందించిన క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ను వినియోగించటంతో ఇది ఇస్రోకు చాలా ప్రధానమైన ప్రయోగంగా నిలిచింది. ఇంతకుముందు 2014 జనవరిలో జీశాట్-14 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపిన జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్లోను, 2015 ఆగస్టులో జిశాట్-6 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన జీఎస్ఎల్వీ-డి6 రాకెట్లోనూ దేశీయంగా రూపొందించిన సీయూఎస్ను ఉపయోగించారు. అయితే.. అవి రెండూ అభివృద్ధి దశలో ఉన్నాయని.. వాటిలో రష్యా ఇంజన్లను ఉపయోగించామని.. తాజా ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సీయూఎస్ను ఉపయోగించామని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ ఇంజన్కు సంబంధించి 2010లో జంట వైఫల్యాల అనంతరం 2014లో ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం ఈ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరింది. వాతావరణ విపత్తులపై నింగిలో నిఘా నేత్రం భూమి, సముద్రాలపై వస్తున్న విపత్తులను ముందుగా కనిపెట్టి హెచ్చరించేందుకు వాతావరణ అధ్యయనం కోసమే ఇన్శాట్-3డీఆర్ను ప్రయోగించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ వాతావరణ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్పాండర్స్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చి పంపారు. భూమిపై, సముద్రాలపై జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసేందుకు 6 చానల్ ఇమేజర్ను ఉపయోగిస్తారు. వాతావరణం మీద అధ్యయనం చేయడానికి కల్పన-1, ఇన్శాట్-3ఏ అనే ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. అయితే.. సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటంతో గత ఉపగ్రహాల కంటే ఇందులో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలను అమర్చారు. ‘సముద్రం అడుగు నుంచి విమాన సంకేతాలు అంతరిక్షానికి చేరవు’ బంగాళాఖాతంపై అదృశ్యమైన ఏఎన్-32 విమానం విషయంలో.. సముద్రం అడుగు నుంచి విమానం సంకేతాలు అంతరిక్షం వరకు చేరవని ఇస్రో చైర్మన్ కిరణ్ చెప్పారు. ‘విమానం సముద్రం లోపలికి వెళితే, దాని సంకేతాలు అంతరిక్షం వరకూ చేరవు. భూమిపై విపత్తు సంభవిస్తే విమానంలోని బీకన్లు సంకేతాలు పంపుతాయి. వాటిని ఈ ఉపగ్రహంలోని ట్రాన్స్పాండర్ అందుకుంటాయి.’ అన్నారు. ‘ఆదిత్య’కు సిద్ధం శ్రీహరికోట (సూళ్లూరుపేట): భవిష్యత్తులో సూర్యుడి మీద పరిశోధనలు చేయడానికి ఆదిత్య, చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి చంద్రయాన్-2, అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మంగళ్యాన్-2 ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోందని చైర్మన్ కిరణ్కుమార్ తెలిపారు. ప్రయోగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది మోదీ ఆలోచనలకు అనుగుణంగా ‘మేకిన్ ఇండియా’ ప్రయోగం. క్రయో దశతో వరుసగా 3ప్రయోగాలు చేసి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంపై ‘ఇస్రో’ శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రజ్ఞులు మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా చేయాలని ఆయన ఆకాంక్షించారు. -
గుట్టుగా.. గుట్కా రాకెట్
విచ్చలవిడిగా విక్రయాలు విజిలెన్స్ దాడితో ఉలికిపాటు పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు తుని రూరల్ : గుట్టుచప్పుడు కాకుండా తుని మండలం కేఓ మల్లవరంలో నిర్వహిస్తున్న గుట్కా త యారీ కేంద్రం వెలుగులోకి రావడం జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల నకిలీ గుట్కాలు మార్కెట్ను ముంచెత్తాయని తేలడంతో, గుట్కా కు బానిసలైన వారు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. శనివారం విజిలె¯Œæ్స డీఎస్సీ పీఆర్ రాజేంద్రకుమార్, సీఐ ఎన్వీ భాస్కరరావు ఆధ్వర్యంలో కేఓ మల్లవరంలో నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడి తమ్ముడు సుర్ల గంగాధర్ కనుసన్నల్లోనే ఇక్కడ గుట్కాలు తయారు చేస్తున్నట్టు వెలుగుచూసింది. రూ.రెండు లక్షల విలువైన యంత్రాలు, రూ.18 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలతో పాటు పట్టణంలో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తయారీ ఇలా.. కొందరు అక్రమార్కులు నకిలీ గుట్కాలను తయారు చేస్తుండగా, కమీషన్లకు కక్కుర్తిపడే వ్యాపారులు చిల్లరగా విక్రయిస్తున్నారు. స్థానికంగా లభించే మసాలా దినుసులను మిశ్రమంగా చేసి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసినట్టుగా వ్యాపారులను నమ్మిస్తున్నారు. ఒరియా భాషలో ముద్రించిన కవర్లలో గుట్కాను నిర్ణీత మోతాదులో ప్యాకింగ్ చేస్తున్నారు. యాలకులు, పుగాకు, సున్నం, సోంఫ్, పెప్పర్, వక్కలు, ఇతర రసాయనాలను తునిలోనే కొనుగోలు చేస్తున్నారు. కేఓ మల్లవరంలో పూర్వం జీడిపప్పు తయారీ కేంద్రంగా ఉన్న భవనాలు, ప్రాంగణాన్ని అక్రమ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ గుట్కాలు ఘాటుగా ఉంటాయని, అధిక మోతాదు పెప్పర్ ఉండడం వల్ల స్వల్పకాలంలోనే అస్వస్థతకు గురవుతారని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. వివిధ కంపెనీల పేర్లతో.. సఫారీ–2000, గోకుల్ డీలక్స్ మిక్స్, మిరాజ్ తదితర కంపెనీల పేర్లతో గుట్కాలను తయారు చేస్తున్నారు. ఇందుకు మూడు యంత్రాలు, రెండు మిక్సర్లు, ఒక బాయిలర్ను ఏర్పాటు చేశారు. గోడౌ¯Œæలో బాయిలర్, ముడి సరుకును నిల్వ ఉంచగా, మరో భవనంలో తయారీ, ప్యాకింగ్ యంత్రాలు, తయారైన ప్యాకెట్లు ఉన్నాయి. దాడుల్లో ఏఓ జి.శ్రీనివాస్, పుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, కానిస్టేబుల్ స్వామి పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్: 18 లక్షలు స్వాధీనం
శ్రీకాకుళం: నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళంలోని పుప్పాలవారి వీధిలో నివాసం ఉంటున్న టంకాల వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య రసవత్తర పోటీకి బెట్టింగ్ ను నిర్వహిస్తుండగా దాడి చేసి పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బుకీ టంకాల వెంకటరమణతో పాటు మరో 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం 22 లక్షలు విలువజేసే నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెట్టింగ్ రాకెట్ సంబంధించి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న కిరణ్, అతని తమ్ముడు రవి ప్రస్తుతం విశాఖపట్టణంలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. -
పునర్వినియోగ రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం!
చెన్నై: పునర్వినియోగ రాకెట్ నిర్మాణ దిశగా ఇస్రో తొలి అడుగు వేయనుంది. అందుకు సంబంధించిన వింగ్డ్ ప్రోటోటైప్ ను సోమవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్సేస్ రీసెర్చ్ సెంటర్(ఇస్రో)నుంచి పరీక్షించనుంది. కక్షలో ఉపగ్రహాన్ని వదిలిన తర్వాత భూమి మీదకు తిరిగివచ్చే రాకెట్ తయారీ లో భాగంగా శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఉపగ్రహాలను ప్రయోగించే వ్యయాన్ని 10 రెట్లు తగ్గించవచ్చు. ఇప్పటివరకు ఇస్రో ఉపయోగించిన పీఎస్ఎల్వీ రాకెట్ తో సంబంధం లేకుండా తయారుచేస్తున్న ఈ రాకెట్లో హైపర్ సోనిక్ టెక్నాలజీని ఉపయోగించారు. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత తిరిగి 180 డిగ్రీల కోణంలో వెనుకకు మళ్లీ బంగాళఖాతంలోని ల్యాండింగ్ బేస్ లో రాకెట్ దిగనుంది. మొత్తం పది నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ ను తయారు చేసేందుకు 10 ఏళ్ల వ్యవధి అవసరమవుతుందని ఇస్రో డైరెక్టర్ కే శివన్ తెలిపారు. సోమవారం నిర్వహించనున్న ప్రయోగం విఫలం చెందితే బంగాళాఖాతంలో పేలి పోయే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 1.7 టన్నుల బరువుతో ఉన్న ఈ రాకెట్ కేవలం డమ్మీ మాత్రమేనని వివరించారు. -
రాకెట్ల చరిత్ర తిరగరాతకు..!
రాకెట్ అంతరిక్ష ప్రయోగం కొత్త పుంతలు తొక్కనుందా?.. అవును! స్పేస్ ఎక్స్ తాజాగా చేసిన ప్రయోగం దీన్నే సూచిస్తోంది. రాకెట్ వేగంగా దూసుకుపోవడానికి ఉపయోగపడే బూస్టర్లను తిరిగి ఉపయోగించుకునే విధంగా చేసిన ప్రయోగం విజయవంతమైంది. శనివారం స్పేస్ ఎక్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన ఫాల్కన్ రాకెట్ విజయవంతమైంది. ఇందుకు ఉపయోగించిన బూస్టర్ తిరిగి విజయవంతంగా సముద్రంలో ఉన్న స్టేషన్ మీద ల్యాండ్ అయింది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని రాకెట్లో ఉపయోగించింది స్పేస్ ఎక్స్. ప్రధాన భాగాన్ని విడుదల చేసిన అనంతరం రాకెట్ నుంచి విడిపోయిన బూస్టర్ 50 మైళ్ల వేగం నుంచి ఇంజన్ల సాయంతో సముద్రంలో ఉంచిన స్టేషన్ మీద ఆగింది. గత ఏడాది డిసెంబర్లో కేప్ కానవేరల్లో బూస్టర్ను విజయవంతంగా నిలిపినా సాంకేతికలోపంతో పేలిపోయిన సంగతి తెలిసిందే. ప్రయోగ విజయానంతరం స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ విమానాల్లా తిరిగి ఉపయోగించగల రాకెట్ల తయారీయే కంపెనీ లక్ష్యమని తెలిపారు. ముందు ముందు ఇలాంటి విజయాలు ప్రజలకు సాధారణమైపోతాయని అన్నారు. గత కొద్ది నెలల కిందట జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్ను పశ్చిమ టెక్సాస్లో విజయవంతంగా ప్రయోగించినా అది ఫాల్కన్ అంత వేగంగా గమ్యాన్ని చేరుకోలేకపోయింది. స్పేస్ ఎక్స్ విజయంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. -
అఫ్గాన్ పార్లమెంటుపై రాకెట్ దాడి
కాబుల్: అఫ్గానిస్తాన్ పార్లమెంటుపై తాలిబన్ ఉగ్రవాదులు సోమవారం నాలుగు రాకెట్లతో దాడి చేశారు. ఒక రాకెట్ పార్లమెంటు భవనాన్ని తాకడంతో కొంతమేర నష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు రాకెట్లు భవనం పరిసర ప్రాంతాల్లో పడగా, మరొకటి దగ్గర్లోని ఆర్మీ బేస్లోకి దూసుకెళ్లింది. దేశ భద్రతపై పార్లమెంట్కు వివరించేందుకు హోం, రక్షణ శాఖ అధికారులతో పాటు జాతీయ భద్రతా విభాగం డెరైక్టర్లు భవనంలోకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదని, అందరూ సురక్షితంగా బయటపడ్డారని ఎంపీ ఒకరు తెలిపారు. దాడి జరిగినా పార్లమెంటు సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. భారత్ సహకారంతో నిర్మితమైన ఈ పార్లమెంట్ భవనం కోసం రూ.600 కోట్లు ఖర్చుపెట్టారు. -
అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి
కాబూల్: భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇందులో ఒకటి పార్లమెంటు ఆవరణలో పడగా మరో రెండు కాస్తంత దూరంలో పేలాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ బాంబు పేలుళ్ల సమయంలో దిగువ సభకు చెందిన సభ్యులు, వోలెసి జిర్గా సభ్యులు పార్లమెంటులో లోపల ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ముఖ్యమైన అధికారులు లోపలికి వెళుతున్న సమయంలోనే ఈ రాకెట్లను ప్రయోగించినట్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి దాడులు గతంలో తాలిబన్లు చేశారు. ఈ భవనాన్ని భారత్ కట్టించి ఇవ్వగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా మోదీ మాట్లాడారు. -
ఇక నేరగాళ్ళను త్వరగా పట్టెయ్యచ్చు..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్...ఇస్రో సహాయంతో ఢిల్లీ పోలీసులు మరో అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని నగరంలో హింసను అరికట్టేందుకు స్పేస్ టెక్నాలజీని వాడకంలోకి తెస్తున్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సూచనా విధానాన్ని అనుసరించి నేరాలను ప్రత్యక్షంగా కొనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశ రాజధాని నగరంలో నేరాల రేటు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో నివారణ చర్యలకు పోలీసులు రాకెట్ సైన్స్ ను వినియోగించనున్నారు. స్పేస్ టెక్నాలజీ ద్వారా లైవ్ క్రైమ్ మ్యాపింగ్ ను అమల్లోకి తెచ్చి... క్రిమినల్స్ ఆట కట్టించనున్నారు. క్రైమ్ మ్యాపింగ్ ఎనలిటిక్స్ అండ్ ప్రెడిక్టివ్ సిస్టమ్ (CMAPS) ద్వారా స్పేస్ టెక్నాలజీ ఆధారిత టూల్స్ ను వినియోగించి హింసను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇస్రో భాగస్వామ్యంతో తాము అంతర్గత భద్రత, భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారులు చెప్తున్నారు. అందుకు పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ డివైజ్ (PDA) ను వాడకంలోకి తెస్తున్నారు. సెంట్రల్ డేటాబేస్ సిస్టమ్ తో అనుసంధానం చేసిన ఈ వ్యవస్థ.. శాంతి భద్రతల నిర్వహణకు, ఎనలిటిక్స్ ద్వారా నేరాల నియంత్రణకు సహాయపడుతుంది. ప్రస్తుతం ప్రతి 15 రోజులకోసారి ఎలక్ట్రానిక్ డేటా సేకరించడం ద్వారా క్రైమ్ ను గుర్తిస్తున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టనున్న ఈ ప్రెడెక్టివ్ పోలీసింగ్ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశీలనలో ఉంది. కాగా భారతదేశంలో ఈ విధానాన్ని కీలక సమాచారాన్ని సరైన సమయంలో పోలీసులకు అందించేందుకు వినియోగించనున్నారు. దీని వాడకంతో సిబ్బంది నివేదికలు అందించేందుకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థలో జీపీఎస్ ద్వారా కాలర్ ఉన్న ప్రాంతాన్నిడిజిటల్ మెసేజ్ రూపంలో తెలియజేస్తుంది. దీంతో పోలీసులు సరైన సమయంలో ఆ వ్యక్తిని చేరుకోగల్గుతారు. అధిక నేర రేటు ఉన్న ప్రాంతాలను మానిటర్ చేసేందుకు ఈ వ్యవస్థను వినియోగించనున్నారు. దీంతో నేరాలను అరికట్టడం సులభమౌతుందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలోనూ 'కాల్ మనీ' దందా
-
జూలై 10న పీఎస్ఎల్వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 10న పీఎస్ఎల్వీ సీ28ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. షార్లోని మొదటి ప్రయోగవేదికపై రాకెట్ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. ఉపగ్రహాల అనుసంధానం మాత్రమే మిగిలివుంది. ఈ నెల 14న కెనడాకు చెందిన డీసీఎం-3 అనే మూడు ఉపగ్రహాలు షార్కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షార్లోని క్లీన్రూంలో ఉపగ్రహాలకు శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం ప్రయోగవేదిక వద్దకు చేరుస్తారు. బుధవారం ఉపగ్రహాలను రాకెట్కు అనుసంధానం చేసి హీట్షీల్డ్ క్లోజ్ చేసే పనులు చేపట్టనున్నారు. ఆ తరువాత మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. -
సూపర్ సానిక్ బస్సు
హాలెండ్: బస్సు ప్రయాణమనగానే అందరికీ గుర్తుకొచ్చేది గంటల తరబడి ప్రయాణం. మధ్యలో మొరాయించడం. అయితే అందుకు భిన్నంగా అత్యంత వేగంగా రాకెట్లా రహదారులపై పరుగులు తీసే బస్సు హాలెండ్ దేశంలో తయారైంది. దీని ప్రయాణ వేగం ఎంతో తెలుసా. గంటకు 250 కిలోమీటర్లు. నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఆ దేశానికి చెందిన ఏరోడైనమిక్ నిపుణుడు, మాజీ ఫార్ములా వన్ రేసర్ దీనిని తీర్చిదిద్దాడు. దీని తయారీకి ఏడు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇది దుబాయ్నుంచి బయల్దేరితే కేవలం 30 నిమిషాల్లో అబుధాభికి చేరుకోగలుగుతుంది. దీనిని అల్యూమినియం, కార్బన్ ఫైబర్, పాలికార్బనేట్లతో తయారుచేశారు. దీని పొడవు 15 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. ఐదు అడుగుల ఎత్తు. ఈ బస్సులో 23 మంది ప్రయాణించవచ్చు. -
విజయంతో ఘనంగా వీడ్కోలు
మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్డీవో చీఫ్గా అవినాశ్ చందర్కు ఘనంగా వీడ్కోలు లభించినట్లయింది. డీఆర్డీవో చీఫ్గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్కే మాథుర్కు అదనంగా కేంద్రం అప్పగించింది. -
అగ్ని-5 సక్సెస్..
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ఉదయం 8.06 గంటలకు ‘అగ్ని-5’ను ప్రయోగించినట్లు ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. ఎక్కడికైనా సులువుగా తరలించగలిగే మొబైల్ లాంచర్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. క్షిపణిని ప్రయోగానికి సిద్ధం చేయడానికి అతితక్కువ సమయం సరిపోతుందని, నిర్వహణ వ్యయం, శ్రమ తగ్గుతుందని చెప్పారు. బంగాళాఖాతం మధ్యలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని.. దానికి కొంత దూరంలో సిద్ధంగా ఉన్న నౌకల్లోని సిబ్బంది దీనిని ప్రత్యక్షంగా వీక్షించారని ఈ మిషన్ డెరైక్టర్ వి.జి.శేఖరన్ చెప్పారు. రాడార్లు, పరిశీలక వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణ మార్గాన్ని, దాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించామన్నారు. మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-5 క్షిపణి ప్రయోగం మన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా క్షిపణులను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారని.. దానిని సులువుగా గుర్తించడంతో పాటు శత్రువులు దాడి చేసేందుకు అవకాశముంటుందని అంటున్నారు. అదే మొబైల్ లాంచర్ వెర్షన్ను రహస్యంగా తరలించి, ప్రయోగించవచ్చంటున్నారు. అభినందనలు.. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న వారందరికీ దేశం రుణపడి ఉంటుందనిడీఆర్డీవో డీజీ అవినాశ్ చందర్కు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. అగ్ని-5 ప్రత్యేకతలు.. 5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణి ఇది. డీఆర్డీవో ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు. బరువు 50 టన్నులు... పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. 1000 కిలోలకుపైగా బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు.. అంటే దాదాపు గంటకు 30 వేల కిలోమీటర్ల వేగం) దూసుకెళుతుంది. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి దాదాపు 600 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి... ఆ తర్వాత లక్ష్యం దిశగా దూసుకెళుతుంది. క్షిపణిలో ఏర్పాటు చేసిన ఆన్బోర్డు కంప్యూటర్, లేజర్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ సహాయంతో ప్రయాణించి... లక్ష్యాన్ని ఢీకొడుతుంది. భూవాతావరణంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణిపై కవచం ఉష్ణోగ్రత దాదాపు 4,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ లోపల పరికరాలు, వ్యవస్థల ఉష్ణోగ్రత మాత్రం 50 సెంటీగ్రేడ్ల లోపే ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందే రెండు సార్లు సాధారణ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు కూడా. మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. విజయంతో ఘనంగా వీడ్కోలు మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్డీవో చీఫ్గా అవినాశ్ చందర్కు ఘనంగా వీడ్కోలు లభిం చినట్లయింది. డీఆర్డీవో చీఫ్గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్కే మాథుర్కు అదనంగా కేంద్రం అప్పగించింది. -
రాకెట్లాంటి బుల్లెట్!
లక్ష్యాన్ని బట్టి ప్రయాణం మధ్యలో దిశ మార్చుకునే పరిజ్ఞానం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న అమెరికా పరిశోధన సంస్థ డార్పా వాషింగ్టన్: ఓ హాలీవుడ్ సినిమాలో చూపినట్లు లక్ష్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రయాణ మార్గాన్ని మార్చుకునే బుల్లెట్లు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా రక్షణ శాఖకు చెందిన పరిశోధన సంస్థ ఇప్పటికే ఇలాంటి బుల్లెట్లను రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరేందుకు సైనికుల కోసం ప్రత్యేకంగా గెడైడ్ బుల్లెట్లను డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) రూపొందించింది. ఇది అభివృద్ధి పరిచిన 0.50 క్యాలిబర్ బుల్లెట్లు ఆప్టికల్ సైటింగ్ టెక్నాలజీ ఆధారంగా పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తాయి. వాస్తవిక నిర్దేశిత వ్యవస్థ ఆధారంగా బుల్లెట్ను పేల్చిన తర్వాత అవసరమైతే ప్రయాణం మధ్యలోనే దాని దిశను మార్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఆక్యురసీ ఆస్కుడ్ ఆర్డినెన్స్(ఎక్సాక్టో) ప్రోగ్రామ్ పేరుతో మిలటరీ అవసరాల కోసమే ఇలాంటి బుల్లెట్లను డార్పా తయారు చేసింది. లక్ష్యం కంటి ముందు లేనప్పటికీ, ప్రతికూల వాతావరణంలో కదులుతున్నప్పటికీ ఈ రకం బుల్లెట్లను విజయవంతంగా ప్రయోగించవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల సైనికులకు పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. గెడైడ్ బుల్లెట్ల వినియోగం వల్ల రక్షణ దళాలకు భద్రత కూడా పెరుగుతుందని, శత్రువులకు ఎదురుదాడి చేసే అవకాశమివ్వకుండా లక్ష్యాలను కచ్చితంగా ఛేదించవచ్చునని వివరించింది. -
నాసా రాకెట్ ప్రయోగం విఫలం
-
నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ-సి23
-
ప్రయోగానికి సర్వం సిద్ధం
-
ఉపగ్రహాన్ని పంపిన తొలి ప్రైవేటు రాకెట్
వాషింగ్టన్: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని టీవీ చానెళ్లకు సేవలందించేందుకు రూపొందించిన ‘సెస్-8’ ఉపగ్రహాన్ని అమెరికా ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ ప్రయోగించింది. 3.2 టన్నుల బరువున్న ఈ శాటిలైట్ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కేప్ కెనరవాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపారు. ప్రయోగం ప్రారంభమైన 185 సెకన్లలోనే రాకెట్ ‘సెస్-8’ను 295 ఁ 80,000 కిమీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, తాము మొట్టమొదటిసారిగా వాణిజ్య పరంగా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపామని.. మరో 50 ఉపగ్రహాలను పంపేందుకు ప్రణాళికలు ఉన్నాయని స్పేస్ఎక్స్ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు. -
ఢిల్లీని పాలించడం రాకెట్ సైన్సేమీ కాదు
న్యూఢిల్లీ: ప్రచారంలో దూసుకుపోతూ కాంగ్రెస్, బీజేపీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఇరు పార్టీలమీద తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ‘దలాల్’లుగా అభివర్ణించిన ఆయన ఢిల్లీని పాలించడం రాకెట్ సైన్సేమీ కాదన్నారు. న్యూఢిల్లీ నుంచి ఘజియాబాద్లోని తన నివాసానికి ప్రయాణమవుతూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే... ‘ ఏఏపీ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో నాలో అహంకారం పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి విమర్శలకు నేను సమాధానమివ్వలేను. కాంగ్రెస్, బీజేపీల ‘అవినీతి’ని ఏఏపీ ఏమాత్రం సహించదు కనుక మా వైఖరి వారికి అహంకారపూరితమైనదిగానే కనిపిస్తుంది. రెండేళ్ల కిందట జనాలకు కేజ్రీవాల్ ఎవరో తెలియదు. ఏఏపీ పార్టీ పెట్టిన తర్వాత నగరంలోని ప్రతి ఆటోపై కేజ్రీవాల్ బొమ్మతోపాటు పార్టీ గుర్తు ‘చీపురు’ చేస్తున్న హడావుడి వారికి నిద్రలేకుండా చేస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీల అవినీతి ముందు ఏఏపీ ప్రజాదరణ చాలా చిన్నది. పేరుకుపోయిన అవినీతిని ఊడ్చేందుకే ‘చీపురు’ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న రెండు పార్టీలదీ ఒకే మంచం, ఒకే కంచం. వారిద్దరు కలిసే అవినీతికి పాల్పడ్డారు. ఇంత తక్కువ సమయంలో ఏఏపీ ఓ శక్తిగా ఎలా ఎదిగిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. ఏఏపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు... అది ‘సామాన్యుడి స్వరం’. అందుకే దాదాపు ఎనభైశాతానికి పైగా ఉన్న సామాన్యులు మాకు ప్రాధాన్యతనిస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా నిజాయతీ వారికి నచ్చింది. మా ధైర్యాన్ని వారు మెచ్చుకున్నారు. ఇక పాతుకుపోయిన కాంగ్రెస్, బీజేపీలను ఓడించే ‘అనుభవం’ ఏఏపీకి లేదని చెబుతున్నారు. నిజమే ప్రజలను దోచుకోవడంలో వారికి ఉన్నంత అనుభవం మాకు లేదు. కానీ ఈ ఎన్నికల ద్వారా వారికి గుణపాఠం చెబుతాం. అందుకు అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తాం. మరో పదిరోజులు పోతే ఈ రెండు పార్టీలు మమ్మల్ని అనుసరించాల్సిందే. ప్రచారంలో మేం ఎక్కడా ఆర్భాటాలకు పోలేదు. కేవలం ఆటోరిక్షాలపై పోస్టర్లు అంటించడం ద్వారా మాత్రమే ప్రచారం చేశాం. ఎన్నికల గుర్తు ‘చీపురు’ కూడా అంత గ్లామరస్ గుర్తేమీ కాదు. ఇక పార్టీ కార్యకర్తలు ‘నేను సామాన్యుడిని’ అనే నినాదం రాసి ఉన్న టోపీ పెట్టుకొని ప్రచారానికి వెళ్తున్నారు. తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రచారమైనా ప్రజలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నిజాయతీ-అవినీతి రహిత సమాజం ధ్యేయంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకముంది. ప్రత్యర్థుల్లో కూడా ఈ భయం ఇప్పుడిప్పుడే మొదలైంది. అందుకే ఏఏపీపై ఇప్పటికే దాదాపు 100కుపైగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అయినప్పటికీ వాటికి భయపడేది లేదు. ఇక ఎన్నికల ప్రచారం నా ఆరోగ్యంపై కాస్త ప్రభావం చూపిన మాట నిజమే. గతంలో ఉదయం 4.30 గంటలకే నిద్ర లేచేవాడిని. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఇప్పుడు 6.30కు నిద్ర లేస్తున్నా. అందుకు కారణం ఇంటికి ఆలస్యంగా చేరుకోవడమే. ఇక విదేశాల నుంచి వస్తున్న విరాళాలపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామంటోంది. దానిని మేం కూడా ఆహ్వానిస్తున్నాం. రండి... మా ఖాతాలను నిరభ్యంతరంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న విరాళాలపై కూడా దర్యాప్తు జరపాలి. ఇక బహిరంగ చర్చకు రావాలంటూ నేను ఆహ్వానించినా షీలాదీక్షిత్ రాలేదు. వారికి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం, చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అంతకంటే దయనీయమైన స్థితిలో ఉంది. పలు వార్తా చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఖాయమని తేలింది. అయితే నాకు మాత్రం ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకముంద’న్నారు. -
రాకెట్లో సిల్లీబ్రాండ్
-
నచ్చినట్లు ఆడతా... నమ్మింది మాట్లాడతా! : గుత్తా జ్వాల.
విశ్లేషణం చేతిలో రాకెట్ పట్టిన ఆరడుగుల అందాలరాశి... నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధీరోదాత్త... తన ఆట బాగున్నంతకాలం ఎవరి మెప్పుకోసం ప్రయత్నించాల్సిన అవసరంలేదని నమ్మే క్రీడాకారిణి... సినిమాలంటే అమితాసక్తి ఉన్న తెలుగమ్మాయి... గుత్తా జ్వాల. సాధారణంగా క్రీడాకారులు, క్రీడాకారిణులు కైనస్థటిక్ పర్సనాలిటీకి చెందినవారై ఉంటారు. అంటే వారికి తమ శరీరంపైన కంట్రోల్ ఉంటుంది. ప్రతి దానినీ ఫీల్ అవుతారు. ఎమోషనల్గా ఉంటారు. తాము విశ్వసించినదానికోసం ఎంతకైనా నిలబడతారు. జ్వాలలో ఈ లక్షణాలు స్పష్టంగా కనబడతాయి. సూటిగా, స్పష్టంగా మాట్లాడటం జ్వాలలో కనిపించే ప్రత్యేక లక్షణం. ఆమె బ్యాట్నుంచి షటిల్ ఎంత వేగంగా వస్తుందో... అంతకంటే వేగంగా నోటినుంచి మాట వచ్చేస్తుంది. ఎవరిమీదనైనా, దేనిమీదనైనా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం తప్పుకాదని నమ్ముతుంది. అందుకే తన అభిప్రాయాన్ని తడుముకోకుండా చెప్పేస్తుంది. ఇతరులను విమర్శిస్తూ మాట్లాడే సమయంలో కూడా తన భావాలను స్పష్టంగా వ్యక్తంచేయాలనే ప్రయత్నమే తప్ప కోపం, ఆవేశం, ద్వేషంలాంటి భావోద్వేగాలు అస్సలు కనిపించవు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి మాట్లాడే సమయంలో కూడా అతని ఆటను గౌరవిస్తూనే, అతని ఆశ్రీత పక్షపాతాన్ని మాత్రమే తప్పుపట్టడం ఆమెలో ఉండే స్పష్టతకు నిదర్శనం. తాజాగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో లోపాలను ఎత్తి చూపుతూ మాట్లాడటం, వారి ఆధిపత్యంపై న్యాయస్థానానికి వెళ్లిమరీ పోరాడటం ఆమెలో ఉండే ధృఢచిత్తానికి అద్దం పడుతుంది. జ్వాల ఇంటర్వ్యూలను గమనిస్తే... ఆమెలో కదలికలు చాలా తక్కువగా కనిపిస్తాయి. స్థిరంగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటుంది. బాడీలాంగ్వేజ్ ప్రకారం అలా కూర్చోవడమంటే రిజర్వ్డ్గా ఉంటారని అర్థం. కానీ జ్వాల విషయంలో మాత్రం ఈ సూత్రం అబద్ధమవుతుంది. తానెవరితో మాట్లాడుతున్నా, ఏ విషయం మీద మాట్లాడుతున్నా కంఫర్ట్గా ఉంటుందనే విషయాన్ని ఈ పొజిషన్ చెబుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు జ్వాల తరచూ నవ్వడం మనకు కనిపిస్తుంది. జీవితాన్ని, అందులో ఎదురయ్యే ప్రశ్నలను, సంఘటనలను తానెంత స్పోర్టివ్గా తీసుకుంటుందో ఆ నవ్వు మనకు చెబుతుంది. అంతేకాదు తాను ఎవరితోనైనా సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంది. పక్కకి చూడటం చాలా తక్కువ. జ్వాల కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఆరడుగుల అందగత్తె కూడా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది కూడా. సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు... సినిమాలపై తనకు ప్రత్యేకమైన ఆసక్తి లేదని, మంచి అవకాశం వస్తే పరిశీలిస్తానని జ్వాల అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఆ మాటలు అబద్ధమని ఆమె బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అలా చెప్పే సమయంలో తాను కంటిని రుద్దుకోవడమో లేదా నోటికి అడ్డుగా చేయి పెట్టుకోవడమో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధమని, తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిసిపోతుంది. జ్వాల బలం తాను నమ్మిన విలువల్లో ఉంది. ఆమెలో బలమైన, దృఢమైన విలువలు కనిపిస్తాయి. ‘‘ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ యామ్’’, ‘‘నేను నా పేరెంట్స్కు, ఫ్రెండ్స్కు మాత్రమే సమాధానం చెప్పాలి, వేరెవ్వరికీ చెప్పాల్సిన అవసరంలేదు’’, ‘‘నేనేంటో నా ఆట చెప్తుంది, ఎవరినో ప్లీజ్ చేయాల్సిన అవసరంలేదు’’, ‘‘ఓటమంటే భయంలేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్’’ అనే జ్వాల మాటలు తన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. జ్వాలలో సెన్సెటివ్నెస్ ఎక్కువ. అందుకేనేమో అందరికీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్నట్లుగా ఫీలవుతుంటుంది. తన గురించి, తన ఆట గురించి మాత్రమే కాకుండా అందరి సమస్యల గురించి మాట్లాడుతుంది. కోరి సమస్యలను కొనితెచ్చుకుంటుంది. ఆ బలహీనతను అధిగమించి, మాటలకన్నా ఆటపై మాత్రమే శ్రద్ధ చూపిస్తే జ్వాల మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని చెప్పవచ్చు. విష్ హర్ ఆల్ ది బెస్ట్! -విశేష్, సైకాలజిస్ట్ -
రాకెట్ ప్రయోగాల్లో నిష్ణాతులుగా ఎదగండి
సూళ్లూరుపేట, న్యూస్లైన్ : దేశంలో సాంకేతిక అభివృద్ధి కోసం చేస్తున్న రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో నిష్ణాతులుగా ఎదగాలని షార్ సీనియర్ శాస్త్రవేత్త వీఆర్ కట్టి ఇంజనీర్లకు సూచించారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని వివిధ సెంటర్ల నుంచి ఎంపిక చేసిన 50 మంది ఇంజినీర్లకు షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్ కట్టి మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇస్రోలో పనిచేసి, తొలి ఉపగ్రహమైన ఆర్యభట్ట నుంచి మూడో తరం ఉపగ్రహాలైన ఇన్శాట్-3ఈ వరకూ వివిధ హోదాల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించానని చెప్పారు. గడిచిన 50 ఏళ్ల అంతరిక్ష యానంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వారికి వివరించారు. మన ఉపగ్రహాలను ఇతర దేశాలకు చెందిన అంతరిక్ష కేంద్రాల నుంచి ప్రయోగించే స్థాయి నుంచి మనమే ప్రయోగించే స్థాయికి ఎదిగామన్నారు. షార్లో రెండు ప్రయోగ వేదికలను నిర్మించుకుని వంద ప్రయోగాల మైలు రాళ్లను దాటామని చెప్పారు. సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు జీఎస్ఎల్వీ రాకెట్లలో క్రయోజనిక్ దశను రూపొందించి ప్రయోగాలు చేసే స్థాయి కి ఎదిగామని చెప్పారు. ఇస్రో ఇక నుంచి భవిష్యత్ అంతా భారీ ప్రయోగాల మీదే దృష్టి సారించిందని, దీనికి మీ వంతుగా మంచి ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా భావితరాల వారికి అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పీ విజయసారథి మాట్లాడుతూ ఈ బృహత్ కార్యనిర్వహణ సిద్ధాంత పరంగా 1950లోనే ప్రపచంలోని అన్ని దేశాల్లో ప్రారంభమైనప్పటికి 113 (ఏడీ) సంవత్సరంలోనే దీన్ని తెలియకుండా ఆచరిస్తున్నారని వివరించారు. 37 ఏళ్లు నాసాలో పని చేసిన జెర్రి మబ్డీన్, హెన్రీగాన్ట్ (1861-1919) మధ్యలో వీరు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలను మనం స్మరిస్తూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షార్లోని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు -
ప్రయోగానికి సిద్ధంగా జీఎస్ఎల్వీ-డీ5
రేపే కౌంట్డౌన్ ప్రారంభం సూళ్లూరుపేట, న్యూస్లైన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 19వ తేదీన జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించనున్నారు. 29 గంటలు కౌంట్డౌన్ కొనసాగిన అనంతరం 19న సాయంత్రం 4.50 గంటలకు జీశాట్-14 ఉపగ్రహంతో రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు లాంచ్ రిహార్సల్ నిర్వహించింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై నిర్ణీత సమయానికి కౌంట్డౌన్ ప్రారంభించేందుకు, ప్రయోగం నిర్వహించేందుకు అనుమతిచ్చింది. కౌంట్డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ షార్కు చేరుకోనున్నారు. ఇస్రో చైర్మన్ పదవీకాలం పొడిగింపు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. స్పేస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆయన పదవీ కాలాన్ని 2014 ఆగస్టు 31 వరకు పొడిగించారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగానికి 18న కౌంట్డౌన్
సూళ్లూరుపేట, న్యూస్లైన్: షార్ కేంద్రం నుంచి ఈనెల 19న సాయంత్రం 4.50 గంటలకు జరగనున్న జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియను 18వ తేదీ 11.50 గంటలకు ప్రారంభించనున్నట్లు షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు.18.30 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసేలా డిజైన్ చేశామన్నారు. శుక్రవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి లాంచ్ రిహార్సల్ పూర్తి చేస్తామన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోగల షార్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రయోగం ద్వారా 1985 కిలోల బరువున్న జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఇస్రో విశిష్ట పురస్కారం: షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్కు ఇస్రో విశిష్ట పురస్కారం లభించింది. ఇస్రోలో పనిచేస్తున్న వారిలో మూడో విశిష్ట వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ డెరైక్టర్ కె. కిరణ్కుమార్ విశిష్ట వ్యక్తులుగా గుర్తింపు సాధించారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్కు మూడో విశిష్టవ్యక్తిగా పురస్కారం లభించింది. -
పీఎస్ఎల్వీ సీ-22 రాకెట్ ప్రయోగం విజయవంతం