sarkar
-
కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి
నిజామాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్ రాథోడ్, గరికపాటి మోహన్రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్రెడ్డి గురించి సంజయ్ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీలో జోష్ మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్మిల్లర్లు బియ్యం ఆక్షన్లో కొనలేరన్నారు. రైస్మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
బహ్మరెడ్డి... ఓ ‘సర్కార్’!
సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్ది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఫోన్కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్సైట్లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది. తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ఓటింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. (చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు) -
‘సర్కార్’ చిత్రం తరహాలో చాలెంజ్ ఓట్లు
పెరంబూరు: సర్కార్ చిత్రం తరహాలో లోక్సభ ఎన్నికల్లో చాలెంజ్ ఓట్లు పోలవ్వడం విశేషం. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన చిత్రం సర్కార్. గత ఏడాది తెరపైకి వచ్చిన ఈ చిత్రం విజయం సాధించినా, పెద్ద వివాదానికి తెరలేపింది. అందులో నటుడు విజయ్ విదేశం నుంచి ఓటు హక్కును వినియోగించుకోవడానికి చెన్నైకి వస్తారు. అయితే ఆయన ఓటును ఎవరో వేస్తారు. దీంతో విజయ్ తన ఓటు కోసం పోరాడి 49పీ చట్టం ప్రకారం ఓటు వేస్తారు. అదే తరహాలో గురువారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కొందరి ఓట్లును వేరొకరు వేయడంతో వారు పోరాడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా స్థానిక చెన్నై, తాంబరం సమీపంలోని ముడిచూర్కు చెందిన ఒక ప్రైవేట్ కళాశాల అసిస్టెంట్ ఫ్రొపెసర్ గోపీనాధ్ ముడిచూర్ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వెళ్లారు. అప్పటికే ఆయన ఓటును వేరెవరో వేశారు. దీంతో ఆయన ఎన్నికల నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సర్కార్ చిత్రంలో మాదిరిగా 49పీ చట్టం ప్రకారం 17పీ ఫారం ద్వారా ఓటు వేశారు. అదే విధంగా అదే ప్రాంతానికి చెందిన రాజాజీ, కడలూరు జిల్లా, చిదంబరం ప్రాంతానికి చెందిన పరువ తరాజ్ అనే వ్యక్తి, కుమరి జిల్లా, పద్మనాభపురానికి చెందిన అజిన్, షాజీరాజేశ్ అనే వ్యక్తులు చాలెంజ్ ఓట్లను వేశారు. నెల్లై జిల్లాలోని నెల్లై పేట, కేఓపీ వీధికి చెందిన జాబర్సాధిక్, ఆయన భార్య ఆయిషా సిద్ధిక 49పీ చట్టం ప్రకారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మరి కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు నకిలీ ఓట్లకు గురైన వారికి చాలెంజ్ ఓట్లకు అవకాశం కల్పించారు. ఇలా విజయ్ నటించిన సర్కార్ చిత్రం వారికి స్ఫూర్తిగా నిలిచిందన్నమాట. -
విజయ రహస్యాన్ని బయటపెట్టి కీర్తీ సురేష్
ఎవరికైనా కెరీర్లో కొన్ని చిత్రాలు మైలురాయిగా నిలిచిపోతాయి. అలా కీర్తీసురేశ్ ఎన్ని కమర్శియల్ చిత్రాల్లో నటించినా మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) ఆమె సినీ జీవితంలో మరపురాని మధురమైన చిత్రంగా నిలిచిపోతుంది. కీర్తీ నటన గురించి ఎవరు మాట్లాడినా మహానటి చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ చిత్రం తరువాత కొన్ని కమర్శియల్ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే నడుస్తోంది. మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం మాత్రమే చేస్తోంది. ఇక తమిళంలో సర్కార్ చిత్రం తరువాత మరో చిత్రం ఈ బ్యూటీ చేతిలో లేదు. ఇదే విషయాన్ని కీర్తీసురేశ్ ముందుంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఇది సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతీ చిత్రానికి ఎదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. షూటింగ్ సెట్లో 100 మందిని మనం గురువులుగా చూడవచ్చునని అంది. వారు చేసే పనిలో నైపుణ్యం, లైట్మెన్ నుంచి దర్శకుడి వరకూ వృత్తిపై చూపే శ్రద్ధ, అంకితభావం తనను చాలా ఆకట్టుకుంటుందని చెప్పింది. ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికం అవుతుందని అంది. నడిగైయార్ (మహానటి) చిత్రం తరువాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తానిప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని అంది. అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథలో ఎంపికలో తొందర పడదలుచుకోలేదని తెలిపింది. తన విజయ రహస్యం ఇదేనని కీర్తీసురేశ్ చెప్పుకొచ్చింది. -
సూపర్ స్టార్ మరో సినిమాకు ఓకె చెప్పాడా..?
2.ఓ సినిమాతో సంచనాలు నమోదు చేస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట్ట షూటింగ్ పూర్తి చేసిన రజనీ, మరో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ 166వ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ హీరోగా సర్కార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీ, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ప్లస్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. -
విజయ్కు జోడిగా నయన్!
సర్కార్ సినిమాతో బాక్సాఫీస్పై దండెత్తిన ఇళయ దళపతి విజయ్.. తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెర్సెల్, సర్కార్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తరువాత విజయ్ చేయబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికీ సర్కార్ హవా కొనసాగుతూనే ఉంది. వివాదాల మధ్య ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ.. మెర్సెస్ రికార్డులను బద్దలుకొట్టింది. విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సెల్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు, సినిమా టైటిల్ తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. A heroine needs to be Strong, Smart and add Strength to the Story AGS is super happy to announce that our very own #Nayan has come on board #Thalapathy63 Like all fans I am super excited to see our #Thalapathy #Nayan combo on screen after a longtime @Atlee_dir #Ags pic.twitter.com/krrla9cBuU — Archana Kalpathi (@archanakalpathi) 25 November 2018 -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్లోనే హైయ్యస్ట్ గ్రాసర్గా రికార్డ్ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
అలాంటి చిత్రాల్లో నటించడం చాలా అవసరం
తమిళసినిమా: అలాంటి చిత్రాల్లో నటించడం హీరోయిన్లకు చాలా అవసరం అంటోంది నటి కీర్తీసురేశ్. తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నటి ఈ బ్యూటీ. నాన్న మలయాళం, అమ్మ తమిళం కావడంతో తాను ఆడా ఉంటా.. ఈడా ఉంటానంటూ మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో నటిస్తున్న కీర్తీసురేశ్ను కోలీవుడ్ ఎక్కువగా ఓన్ చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తీకేయన్, విక్రమ్ప్రభు అంటూ వరుసగా స్టార్ హీరోలతో నటించేసింది. విశేషం ఏమిటంటే విక్రమ్, విశాల్లతో సీక్వెల్ చిత్రాల్లో కీర్తీ నటించడం. ఇక విజయ్తో నటించిన సర్కార్ ఇటీవల పలు వివాదాల మధ్య తెరపైకి వచ్చి వసూళ్ల పరంగా కుమ్మేస్తోంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్తో చిన్న భేటీ. ప్ర: సర్కార్, సండైకోళి చిత్రాల్లో నటి వరలక్ష్మీతో కలిసి నటించడం గురించి? జ: ఆ రెండు చిత్రాల్లో వరలక్ష్మి, నేను నటించినా, ఏ చిత్రంలోనూ మేమిద్దరం కలిసి నటించే సన్నివేశాలు లేవు. అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి ఈగో సమస్యలు లేవు. మంచి స్నేహమే ఉంది. ప్ర: మహానటి చిత్రం మాదిరి మరో బయోపిక్లో నటించే అవకాశం ఉందా? జ: లేదు లేదు. సావిత్రి జీవిత చరిత్ర చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని, పరిపక్వతను, సంతోషాన్ని కలిగించింది. మరోసారి అలా నేను నటించగలనా? అన్నది సందేహమే. అంతగా ఆ చిత్రం వచ్చింది. అది ఒక మ్యాజిక్. అదే విధంగా తరచూ అలాంటి పాత్రల్లో నటించడం కూడా సరి కాదు. భారీ కమర్షియల్ చిత్రాల్లోనూ నటించడం హీరోయిన్లకు చాలా అవసరం. ప్ర: జయలలిత పాత్రలో నటించే అవకాశం వస్తే నటిస్తారా? జ: ప్రస్తుతానికి ఎవరి బయోపిక్లోనూ నటించాలనుకోవడం లేదు. సావిత్రి పాత్రలో నటించడమే చాలా సంతృప్తి కలిగించింది. ప్ర: నటనకు గ్యాప్ ఇస్తున్నారటగా? జ: అవును. నటిగా పరిచయం అయినప్పటి నుంచే తీరిక లేకుండా చాలా బిజీగా నటిస్తున్నాను. అందుకే కొన్ని నెలలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 20కి పైగా కథలు విన్నాను. త్వరలోనే నూతనోత్తేజంతో నటించడానికి సిద్ధం అవుతా. ప్ర: మహానటి చిత్రం తరువాత పారితోషికం పెంచినట్లు జరుగుతున్న ప్రచారం గురించి? జ: అసలు కొత్తగా చిత్రాలే అంగీకరించలేదు. పారితోషికం పెంచానన్న ప్రచారంలో అర్ధం లేదు. ప్ర: ఏ నటుడితో నటించాలని కోరుకుంటున్నారు? జ: కోలీవుడ్లో విజయ్, సూర్య, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో నటించాను. నటుడు అజిత్తో నటించాలని ఆశగా ఉంది. ప్ర: తొడరి లాంటి చిత్రాల అపజయం బాధించిందా? జ: లేదు. నిజం చెప్పాలంటే జయాపజయాలను నేను ఒకేలా చూస్తాను. అన్నీ నచ్చి చేసిన చిత్రాలే. అలాంటి చిత్రాల నుంచి చాలా నేర్చుకుంటాను. -
కోమలవళ్లి అంటేనే కోపం వస్తుంది
కోమలవళ్లి పేరు ఎవరు చెప్పినా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సర్కార్ చిత్రం రచ్చకు ప్రధాన కారణం ఈ పేరే. విజయ్ నటించిన చిత్రం సర్కార్ చిత్రంతో ఎంత వివాదం జరిగిందో తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ నేతల ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలకు సర్కార్ చిత్ర యానిట్ తలొగ్గి చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాలను కట్ చేసింది. ముఖ్యంగా చిత్రంలో ప్రతినాయకి పాత్రకు కోమలవళ్లి అనే పేరు పెట్టడం సమస్యకు ప్రధాన కారణం. కారణం ఆ పేరు దివంగత ముఖ్యమంత్రి అసలుపేరు కావడమే.ఎట్టకేలకు సర్కార్ చిత్ర సమస్య సమసినా, రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. కోమలవళ్లి పేరు ఇప్పుడు సినిమా రంగంలో రచ్చకు కారణమైంది కానీ, చాలా కాలం క్రితమే రాజకీయపరంగా ఆగ్రహా జ్వాలలు పుట్టించింది. ఆ కథేంటే ఒక్క సారి చూద్దాం. 2002లో కాంగ్రెస్, తమిళ కాంగ్రెస్ పార్టీల కూటమి మదురైలో సమావే«శాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రసంగిస్తూ జయలలిత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటుగా ఆరోపిస్తూ, ఇకపై ఎప్పుడూ అన్నాడీఎంకేతో పొత్తు ఉండదని వెల్లడించారు. సోనియా వ్యాఖ్యలు జయలలితకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో ఆమెకు సవాల్ విసిరేలా వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ సీనియర్ నేత వాజ్పేయిని కలిశారు. అనంతరం ప్రతికా సమావేశంలో ప్రధానమంత్రి కావాలని ఆరాట పడుతున్నారు అడ్వేగే అంథోనియ మయినో అంటూ సోనియాగాంధీ అసలు పేరుతో దుయ్యబట్టారు. దీంతో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్లో అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జయలలిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అప్పుడాయన కోమలవల్లి, అమ్ము, జయలలిత అంటూ జయలలిత పేర్లను ప్రస్తవిస్తూ విమర్శించారు. అలా విమర్శల దాడిలో ఆ రాజకీయ నాయకుల అసలు పేరు బయట పడి చాలా మందికి తెలిసేలా చేసినా, మరో పక్క రాజకీయ ప్రకంపనలు పుట్టించాయనే చెప్పాలి. 16 ఏళ్ల అయిన తరువాత మళ్లీ ఇప్పుడు సర్కార్ చిత్రంతో కోమలవళ్లి పేరు ఆగ్రహజ్వాలలకు కారణమైంది. దినకరన్ కూడా అమ్మకు అలాంటి పేరు లేదని అంటున్నారు. అదే నిజమైతే కోమలవళ్లి పేరు ఎందకింత కలకలానికి దారి తీస్తోందన్నదే అంతు చిక్కని ప్రశ్న. -
సినిమా కష్టాలు!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
-
‘సర్కార్’లో విజయ్ చెప్పినట్టే చేస్తున్నాం..!!
సాక్షి, చెన్నై : ఇళయ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళనాడు దిగవంత సీఎం జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. అలాగే, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. (‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!) అయితే, తమ అభిమాన హీరో సినిమాపట్ల అన్నాడీఎంకే నేతలు వ్యవహరించిన తీరుపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో విజయ్ చెప్పింది నిజమేనంటూ ‘సర్కార్’ సినిమాలో చూపిన విధంగా.. జయలలిత హయాంలో ఇచ్చిన ఉచిత కంప్యూటర్లు, గ్రైండర్లు, మిక్సీలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర వస్తులవులను మంటల్లో వేసి బూడిద చేశారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘మహానటి’ ఫేం కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. (వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!) (చదవండి : ప్రభుత్వం అంత బలహీనమా?) (చదవండి : హై డ్రామా) -
ప్రభుత్వం అంత బలహీనమా?
చెన్నై, సినిమా: రాష్ట్ర ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటూ నటి వరలక్ష్మీశరత్కుమార్ వెటకారం చేశారు. సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించే ఈ సంచలన నటి ప్రస్తుతం సర్కార్ వర్సెస్ సర్కార్ (సర్కార్ చిత్రం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం) మధ్య జరుగుతున్న రచ్చపై తీవ్రంగానే స్పందించారు. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం సర్కార్. కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఇందులో నటి వరలక్ష్మీశరత్కుమార్ ప్రతికథానాయకి పాత్రలో రాజకీయనాయకురాలిగా నటించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు. ఇంతకు ముందే ఈ చిత్ర కథ వివాదంలో నటి వరలక్ష్మీశరత్కుమార్ స్పందిస్తూ దర్శకుడు ఏఆర్.మురుగదాస్కు మద్దతుగా నిలిచారు. ఆ వివాదంలో ఏఆర్.మురుగదాస్ తగిన మూల్యం చెల్లించారనే ప్రచారం జరిగింది. తాజాగా తెరపైకి వచ్చిన సర్కార్ చిత్రంపై అన్నాడీఎంకే నేతలు ఒక్క సారిగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలా విషయాలు జరిగిపోయాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు సర్కార్ చిత్ర ప్రదర్శన థియేటర్లపై దాడి చేయడం, పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి సంఘటనలతో పాటు, కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు రద్దు చేయడం, సర్కార్ చిత్ర వర్గాలు దిగిరావడం, చిత్రంలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించడానికి అంగీకరించడం, హుటాహుటిన ఆ పని కూడా జరిగిపోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. అంతేకాదు ముఖ్యమంత్రిని నటుడు విజయ్ శుక్రవారం కలవడానికి అపాయింట్మెంట్ కోరినట్లు కూడా సమాచారం. మొత్తానికి సర్కార్ గొడవ సద్దుమణిగినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో నటి వరలక్ష్మీ శరత్కుమార్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఒక చిత్రాన్ని చూసి భయపడేంతగా ప్రభుత్వం బలహీనంగా ఉందా మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు. ఇలాంటి తెలివి తక్కువ చేష్టలు చేయడం మానుకోండి. క్రియేటివిటీ స్వేచ్ఛను హరించకండి అని నటి వరలక్ష్మీశరత్కుమార్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. మరి ఈ అమ్మడి వ్యాఖ్యలకు అన్నాడీఎంకే నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇందులో వరలక్ష్మీశరత్కుమార్ పాత్ర పేరు కోమళవళ్లి (ఇది జయలలిత అసలు పేరు అన్నది గమనార్హం). అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉచిత పథకాల సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించారు. ఇలా అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం చెప్పిన సన్నివేశాలను తొలగించి సర్కార్ చిత్రాన్ని రీ సెన్సార్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. సర్కార్ చిత్రంలో కట్ చేసిన సన్నివేశాలను విజయ్ అభిమానులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ తమ వీరాభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. -
హై డ్రామా
గురువారం రాత్రి చెన్నైలో దర్శకుడు మురుగదాస్ ఇంటి వద్ద చిన్నపాటి డ్రామా నడిచింది. తన లేటెస్ట్ చిత్రం ‘సర్కార్’తో తమిళనాడులో పొలిటికల్ పార్టీల ఆగ్రహానికి గురయ్యారని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని సమాచారం. ఈ విషయాన్ని ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ‘మురగదాస్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటివద్దకు వెళ్లారు’ అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘‘మా ఇంటికి పోలీసులు వచ్చారు. నేను లేనని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు’ అని మురుగదాస్ ట్వీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో మురుగదాస్ ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 27 వరకూ ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెన్నై కోర్ట్ ఆదేశించింది. ఈ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ చేసి, మూడు సన్నివేశాల్లో చిన్న కట్స్ చేయమని ఆదేశించారు. -
‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!
పుస్తకాలు మొదలుకొని చలనచిత్రాలు, ఛాయాచిత్రాల వరకూ సృజనాత్మక రంగంలోని సకల పార్శా్వల్లోనికీ జొరబడి తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే ధోరణి ఉన్నకొద్దీ పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పినా ఈ విషయంలో ఏ మార్పూ రావడం లేదు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ ఆ మాదిరి వివాదమే రాజుకుంది. అందులోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని థియేటర్లపై పడ్డారు. ఆ చిత్రం బ్యానర్లు, పోస్టర్లు చించి కటౌట్లు ధ్వంసం చేశారు. మంత్రులు ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్లకు వ్యతిరేకంగా ప్రకటనలి చ్చారు. ఒక మంత్రి ‘దేశద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అన్నాడీఎంకే నేతల అభియోగం. మురుగ దాస్పై ఫిర్యాదు రావడం తరవాయిగా ఆయన ఇంటిపై రాత్రికి రాత్రే పోలీసులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సాధారణ పౌరుడెవరైనా తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంత వేగంగా కదులుతారా? మురుగదాస్ తెల్లారి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అన్నా డీఎంకే కార్యకర్తలకు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాల తొలగింపునకు, కొన్ని పదాలు వినబడకుండా చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీ కరించాల్సి వచ్చింది. తమ అధినేతను అవమానించినవారిని సాష్టాంగపడేలా చేయగలిగామన్న సంతృప్తి అన్నా డీఎంకే నేతలకు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు ఇదెలాంటి సందేశాన్ని పంపు తుంది? బలప్రయోగంతో దేన్నయినా సాధించుకోగలమన్న అభిప్రాయం కలిగించదా? ప్రభుత్వా నికి సారథ్యం వహించే పార్టీకి ఇది మంచి చేస్తుందా? రేపెవరైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని అనుసరిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఏం చేస్తారు? ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధి కారం కట్టబెట్టేది తమ సమస్యలు పరిష్కరించడానికి. అంతేతప్ప తమకు శిరోభారం కలిగించమని కాదు. కానీ అది పుస్తకం కావొచ్చు, అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం కావొచ్చు... దేన్లోనైనా వివాదం రెచ్చగొట్టి లబ్ధిపొందుదామని చూసే ధోరణి రాజ కీయ నాయకుల్లో పెరుగుతోంది. ఏదైనా కళారూపంపై అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. దాన్ని మెచ్చేవారున్నట్టే, అదంటే నచ్చనివారు కూడా ఉంటారు. రచయితలైనా, కళాకారులైనా సమాజంలో జరిగేవాటిని విమర్శ నాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప దేన్నీ గాల్లోంచి సృష్టించలేరు. మనకు రోజూ తారసపడేదే అయినా, అది మన అనుభవంలోకి పదే పదే వస్తున్నా మనం చూడని భిన్న కోణాన్ని వారు అందులో స్పృశించి ఉండొచ్చు. అది సరైంది కాదనుకునేవారు దాన్ని నిశితంగా విమర్శించవచ్చు. నిరసన వ్యక్తం చేయొచ్చు. అదెలా తప్పో నిరూపించవచ్చు. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించ వచ్చు. కానీ ఈ మార్గాలను వదిలిపెట్టి ఆవేశంతో రోడ్లెక్కి వ్యక్తులపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. కానీ చిత్రమేమంటే ఆవేశంతో చెలరేగే గుంపులు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే నేతలు సైతం ఇలాంటి పనులు చేయడానికి వెరవడం లేదు. జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని ఒకప్పుడు పార్టీలు తహతహలాడేవి. ఇప్పుడు రోజులు మారాయి. తామను కునే అభిప్రాయాన్ని వారిపై రుద్ది, దాన్ని జనాభిప్రాయంగా చలామణి చేసి ఆ వంకన ‘బ్లాక్మెయి లింగ్’కు దిగే ధోరణి పెరిగిపోయింది. ‘పద్మావత్’ చిత్రం పడిన కష్టాలు ఇందుకు ఉదాహరణ. షూటింగ్ జరుపుకునే దశ నుంచి దానిపై కర్ణి సేన దాడులు చేస్తూ వచ్చింది. ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలు తీసుకొచ్చినవారికి రూ. 5 కోట్లిస్తామనే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆ చిత్రంలో తామనుకున్నట్టు ఎలాంటి అభ్యంతరకర సన్నివే శాలూ లేవని తెలిసినా ఈ గుంపు విధ్వంస పోకడల్ని విడనాడలేదు. తమిళనాడు థియేటర్ యజ మానుల సంఘం నాయకుడు సుబ్రమణియమ్ ఆవేదన గమనించదగ్గది. రాజకీయ పార్టీలకూ, నటులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా తమ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, వ్యాపారం దెబ్బతింటున్నదని ఆయన చెప్పారు. నిజమే... ప్రముఖ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కాలా’పై ఆర్నెల్లక్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అనేక కారణాలు చెప్పి ‘కాలా’కు అడ్డంకులు సృష్టిం చేందుకు అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో అనేక సంఘాలు ప్రయత్నించాయి. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఇప్పుడు ‘సర్కార్’కు కూడా అవరోధాలు తప్పలేదు. మన కున్న కళారూపాల్లో సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఏవో సాకులు చెప్పి అడ్డుకోవాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడం మాత్రమే కాదు... దానిపై ఆధారపడి ఉన్న వందల కుటుంబాల జీవికను దెబ్బతీయడం. తమిళనాడు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. చలనచిత్రాలను చూసి, అవి ప్రదర్శనయోగ్యంగా లేవనుకుంటే కత్తిరించడానికి లేదా మొత్తంగా అనుమతి నిరా కరించడానికి ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వంటివి ఉన్నాయి. వాటిపై ఆఖరి మాట చెప్పడానికి న్యాయస్థానాలున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ సెన్సారింగ్ విధానమే సరికాదని వాద నలొస్తున్న తరుణంలో...రాజకీయ పార్టీలు, కులసంఘాలు సెన్సారింగ్ బాధ్యతను తమ భుజాలకెత్తుకుని అధికారం అండతో గొడవలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం దారుణం. రాజ్యాంగంపై, చట్టాలపై విశ్వాసమున్నదని చెబుతున్నవారు ఇలాంటి పోకడలకు పోవడం సరికాదు. -
మురుగదాస్కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: సర్కార్ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మురుగదాస్ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ ట్వీట్ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సర్కార్ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్, కమల్హాసన్ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు.విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. -
సర్కార్ ఎఫెక్ట్: పీక్స్లో 49-పీ
స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా అభ్యంతరకరమైన దృశ్యాలంటూ తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉండటం ఒక ఎత్తయితే.. ఈ మూవీ ఒక కీలక అంశంపై చర్చకు తెరతీయడం మరోఎత్తు. అదే సెక్షన్ 49-పీ. ఓటు హక్కుపై అవగాహనపెంచడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కొంత ప్రయత్నం చేసిన ఈ మూవీ 49-పీ అంశాన్ని చర్చకు తెచ్చిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. ఈ మూవీలో 49పీ’ అనే ప్రస్తావన హీరో విజయ్ ద్వారా తేవడంతో ఒక్కసారిగా 49-పీపై జనానికి ఆసక్తి పెరిగింది. సర్కార్ మూవీని దర్శించిన ప్రేక్షకజనం గూగుల్లో 49పీ’ కోసం భారీగా సెర్చ్ చేసేశారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ అనలిటిక్స్లో టాప్లో నిలిచింది. సినిమా విడుదలైన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో సర్కార్ మూవీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. చర్చకు నేపథ్యం సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటుగా, తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ కథలో ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సీఈవో పని చేస్తుంటారు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇండియాకు వస్తాడు. ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. ఈ క్రమంలో ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. దీంతో ‘సెక్షన్ 49పి’ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ తోపాటు, తమఅభిమాన హీరో విజయ్కు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు ఫ్యాన్స్. 49-పీ అంటే ఏమిటి? తన ఓటును మరొకరు వేసి దుర్వినియోగపర్చినప్పుడు, ఒక పౌరుడు తన ఓటును కాపాడుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు సదరు ఓటురు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ బూత్కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరే అవకాశాన్ని ఈ సెక్షన్ పౌరుడికి కల్పిస్తుంది. ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961’లోని సెక్షన్ 49పీ చెబుతున్న అంశం ఇదే! ఈ విషయాన్నే ‘సర్కార్’ మూవీలో హీరో విజయ్ చేత చెప్పించారు డైరెక్టర్ మురుగదాస్. మరోవైపు తమిళనాడు సర్కార్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించేందుకు ఈ మూవీ మేకర్స్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఓటర్లకు మిక్సర్ గ్రైండ్లను అభ్యర్థులు పంపిణీ చేసే సీన్ తో సహా..ఇంకా పలు వివాదాస్పద డైలాగులను ఎడిట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. Google search trends peak for #49P after the release of #Sarkar. https://t.co/677MFHqDia@ARMurugadoss #BlockBusterSarkar #Thalapathykingofboxoffice pic.twitter.com/szBBPY1vIH — Sun Pictures (@sunpictures) November 7, 2018 -
‘సర్కార్’ వివాదంపై కుదిరిన సయోధ్య
చెన్నై: తమిళ హీరో విజయ్, కీర్తి సురేశ్ జంటగా ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు దిగవంత సీఎం జయలలిత, ఆమె ప్రవేశపెట్టిన ఉచిత పథకాలపై విమర్శనాత్మకంగా ఉన్న కొన్ని సీన్లను తొలగించాలని తమిళనాడు మంత్రులతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ సీన్లను తొలగించకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సినిమాలోని అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాతలు అంగీకరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి సదరు సీన్లను తొలగించిన సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. -
‘సూపర్ స్టార్ అంటే స్టార్డమ్ మాత్రమే కాదు’
ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో కార్తికేయ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. దీపావళి కానుకగా విడుదలైన విజయ్, మురుగదాస్ల సర్కార్ సినిమాపై మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సర్కార్ బాగుందంటూ మహేష్ చేసిన ట్వీట్కు మురుగదాస్ రిప్లై కూడా ఇచ్చాడు. తాజాగా ఈ ట్వీట్ పై స్పందించిన కార్తికేయ ‘సూపర్స్టార్ గా ఉండటం అంటే స్టార్డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్ లాంటి వారు చూపించే యాటిట్యూడ్ అది. స్పైడర్ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా.. మురుగదాస్ గారి పట్ల మహేష్ గారి గౌరవం అలాగే ఉంది. ఒక స్టార్ మరో స్టార్ హీరో సినిమాను ప్రమోట్ చేయటం చాలా గొప్ప విషయం’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ. Being a superstar is not just about stardom,its the attitude they carry that makes one like our @urstrulyMahesh sir. .Though spyder didnot reach the expectations his respect for @ARMurugadoss sir is the same and best part is promoting #sarkar made with another star. https://t.co/aM8QSmCQoe — Kartikeya (@ActorKartikeya) 7 November 2018 -
వంద కోట్లు కొల్లగొట్టిన ‘సర్కార్’!
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటేనే బాక్సాఫీస్లు బయపడుతుంటాయి. సినిమా టాక్తో సంబంధం లేకుండా రికార్డులను వేటాడేస్తుంది. ఇంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ మంగళవారం ‘సర్కార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఇప్పటికే రెండు బ్లాక్బస్టర్ హిట్లను తన అభిమానులకు అందించిన విజయ్.. ఈ సారి సర్కార్తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా మొదటిరోజే కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఒక్క మొదటిరోజే తమిళనాడులో దాదాపు ముప్పై కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 2.32కోట్లు, కేరళలో దాదాపు 6కోట్లను కలెక్ట్ చేసి.. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను దాదాపు 3400 స్ర్కీన్స్పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం మెర్సెల్ రికార్డులను అధిగమించేట్టుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. #Sarkar100CrIn2Days According to Team #Sarkar , the movie has crossed 100 Crs gross WW in 2 Days.. pic.twitter.com/HlrRPftudJ — Ramesh Bala (@rameshlaus) November 8, 2018 -
గూగుల్ సర్చ్లో ఇప్పుడు అదే టాప్!
మనకు ఏ విషయం గురించి తెలియకపోయినా.. వెంటనే చేసే పని గూగుల్లో వెతకడం. గూగుల్లో ఎప్పుడు ఏదీ ఎలా ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. రోజుకు కొన్ని కోట్ల మంది గూగుల్లో ఏదో ఒక విషయం గురించి సర్చ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇలా ఎక్కువమంది టాపిక్ ఏంటో తెలుసా?. విజయ్ నటించిన సర్కార్ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో దొంగ ఓట్ల నేపథ్యంలో తెరకెక్కించగా.. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే ఈ సినిమాలో సెక్షన్ 49పి అనే టాపిక్ హైలెట్గా మారింది. కథ అంతా ఈ సెక్షన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటరు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమనీ, మళ్లీ తన ఓటు తాను వేసుకునే వీలు కల్పించమని అడిగే హక్కు ఓటరుకు ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందని తెలియని నెటిజన్లు దీని గురించి గూగుల్లో తెగ వెతికేస్తున్నారట. -
‘సర్కార్’పై వివాదం.. సన్నివేశాలు తొలగించాలని డిమాండ్!
తమిళనాట విజయ్ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. అయితే ఆయన సినిమాలను వివాదాల్లోకి లాగడానికి కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. ఈయన చిత్రాలు వివాదాలు సృష్టించడం కొత్తేంకాదు. ఈయన గత చిత్రం మెర్సెల్లో జీఎస్టీ, భారత ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాల్సిందిగా కొంతమంది నానారచ్చ చేశారు. చివరగా వాటికి సంబంధించిన సన్నివేశాల్లో మాటలను కట్ చేశారు. వివాదాలతోనే ఈయన సినిమాలు మరింత దూసుకెళ్తున్నాయి. మెర్సెల్ అంతగా విజయం సాధించడానికి అది కూడా ఒక కారణమే. అయితే రీసెంట్గా విడుదలైన సర్కార్... కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా కూడా రాజకీయ వ్యవస్థపైనే చిత్రీకరించారు. ఇందులో జయలలితను తప్పుగా చూపించారంటూ అన్నాడీఎంకే మంత్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇంతకి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. -
మహేష్కు నచ్చడం చాలా సంతోషం!
ఏఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ రికార్డులను బ్రేక్ చేస్తోంది. విజయ్ సినిమాలు అంటేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంటాయి. విజయ్ గత చిత్రం మెర్సల్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తే.. తాజా చిత్రం ‘సర్కార్’ వాటిని బ్రేక్ చేసేట్టుందని ట్రేడ్వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సర్కార్పై కొంత నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రంపై సూపర్స్టార్ మహేష్ బాబు స్పందించాడు. ‘ఇది ఏఆర్ మురుగుదాస్ ట్రేడ్మార్క్ చిత్రం. ఈ పొలిటికల్ డ్రామాను ఎంజాయ్ చేశాను. చిత్రయూనిట్కు కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ.. ‘ సర్ థ్యాంక్యూ.. సో మచ్. మీకు ఈ చిత్రం నచ్చినందుకు సంతోషం. ఇది నాకు చాలా పెద్ద విషయం’ అంటూ బదులిచ్చాడు. Sirrrrr..... thank you so much 😊 I’m glad you liked it 🙏 it means a lot 🤗🤗 https://t.co/yrAQdGtxPq — A.R.Murugadoss (@ARMurugadoss) November 7, 2018 -
బాక్సాఫీస్పై ‘సర్కార్’ దాడి
ఇళయ దళపతి విజయ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ సినిమా రిలీజ్ అవుతుంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. మెర్సల్ (తెలుగులో ‘అదిరింది’) చిత్రంతో బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేసిన విజయ్.. తాజాగా సర్కార్తో మరోసారి తన హవాను చూపిస్తున్నాడు. మంగళవారం రిలీజ్ అయిన సర్కార్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. చెన్నైలో దాదాపు 70 స్ర్కీన్లో విడుదల చేయగా, 2.41కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సిస్లో సైతం సర్కార్ సునామిని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటిరోజు 2.32కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. కేవలం చెన్నైలోనే కాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. కొంత నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. అవేవి ఈ సినిమాపై ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. -
‘సర్కార్’ మూవీ రివ్యూ
టైటిల్ : సర్కార్ జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, యోగిబాబు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్ నిర్మాత : కళానిధి మారన్ కోలీవుడ్లో టాప్ స్టార్గా ఓ వెలుగు వెలుగుతున్న విజయ్ తెలుగులో మాత్రం ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. సూర్య, విశాల్, కార్తీ లాంటి హీరోలు తెలుగునాట కూడా మంచి మార్కెట్ సాధించినా విజయ్ మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు టాలీవుడ్లో పరవాలేదనిపించినా విజయ్ స్థాయి సక్సెస్లు మాత్రం సాధించలేకపోయాయి. తాజాగా మరోసారి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సర్కార్ అందుకుందా..? ఈ సినిమాతో అయినా విజయ్ తెలుగు మార్కెట్లో జెండా పాతాడా..? స్పైడర్ సినిమాతో టాలీవుడ్కు షాక్ ఇచ్చిన దర్శకుడు మురుగదాస్, సర్కార్తో ఆకట్టుకున్నాడా..? కథ ; సుందర్ రామస్వామి (విజయ్) సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బిజినెస్మేన్. తను ఏ దేశంలో అడుగుపెట్టిన అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్ క్రిమినల్. అలాంటి సుందర్ భారత్కు వస్తుండన్నా సమాచారంతో ఇక్కడి కార్పోరేట్ కంపెనీలన్ని ఉలిక్కి పడతాయి. కానీ ఇండియా వచ్చిన సుందర్ కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోవడానికే వచ్చానని చెప్పటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఓటు వేయడానికి వెళ్లిన సుందర్కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎలక్షన్లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్ స్వయంగా ఎలక్షన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్గా పేరు తెచ్చుకున్న సుందర్ ఇక్కడి కరుడు గట్టిన రాజకీయనాయకులతోఎలా పోరాడాడు? పోటికి దిగిన సుందర్కు ఎదురైన సమస్యలేంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు ; కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సూపర్బ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్ లో కనిపించిన విజయ్, అభిమానులు తన నుంచి ఆశించే అని అంశాలను తెరపై చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో విజయ్ పర్ఫామెన్స్ సూపర్బ్. మహానటిగా పేరు తెచ్చుకుంటున్న కీర్తి సురేష్కు ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించదు. మరో నటి వరలక్ష్మీ శరత్కుమార్ది కూడా చిన్న పాత్రే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పుణ్యమూర్తిగా కనిపించిన కరుప్పయ్య కూడా ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. విశ్లేషణ ; కత్తి, తుపాకి లాంటి బ్లాక్బస్టర్స్ అందించిన కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్, విజయ్లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. విజయ్ మార్క్ స్టైల్స్, మాస్ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్ గత చిత్రాల్లో కనిపించి వేగం ఈ సినిమాలో లోపించినట్టుగా అనిపిస్తుంది. ఓ కార్పోరేట్ క్రిమినల్, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అన్న ఇంట్రస్టింగ్ పాయింట్ను తీసుకున్న దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఫస్ట్హాఫ్ యాక్షన్ సీన్స్, పొలిటికల్ పంచ్ డైలాగ్లతో ఇంట్రస్టింగ్గా నడిపించిన మురుగదాస్.. సెకండ్ హాఫ్ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమాలో ఏ మాత్రం థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా కథనం సాధాసీదాగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు మరీ లాజిక్ లేకుండా సిల్లీగా అనిపిస్తాయి. అయితే విజయ్ అభిమానులను మాత్రం మురుగదాస్ పూర్తి స్థాయిలో అలరించాడనే చెప్పాలి. హీరో బిల్డప్, యాక్షన్ సీన్స్లో విజయ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తేశాడు. కానీ తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ కావటం మాత్రం కష్టమే. భారీ బడ్జెట్ సినిమా కావటంతో క్వాలిటీ పరంగా వంక పెట్టడానికి లేదు. ఆర్ట్, సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చాలా సీన్స్ నెమ్మదిగా సాగుతూ ఇబ్బంది పెడతాయి. ఏఆర్ రెహహాన్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా పాటల్లో సాహిత్యం అర్థంకాకపోగా అసలే నెమ్మదిగా సాగుతున్న కథనంలో స్పీడు బ్రేకర్లల మారాయి. పాటలు నిరాశపరిచినా నేపథ్యం సంగీతం మాత్రం అలరిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ నటన యాక్షన్ సీన్స్ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ ; లాజిక్ లేని సీన్స్ స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
దొంగ కథతో బోగస్ ఓట్ల గురించి చిత్రమా?
చెన్నై, పెరంబూరు: దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రం చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్రాజన్ విమర్శించారు. విజయ్ నటించిన చిత్రం అంటేనే విమర్శల పర్వం మొదలవుతుంది. తాజా చిత్రం సర్కార్ కథ విషయం వివాదంగా మారినా దాన్ని సమరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. అయితే రాజకీ య పరమైన విమర్శలెక్కడా రావడంలేదే అనుకుంటున్న తరుణంలో బీజేపీ దాడి మొదలెట్టింది. ఇంతకు ముందు కూడా మెర్శల్ చిత్ర విషయంలో బీజేపీ రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. తాజగా అలాంటి రచ్చకే తెర లేసిందని చెప్పవచ్చు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్రాజన్ సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు సినిమాల్లో నటించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామని బయలుదేరారని విమర్శించారు. అలాంటి వాళ్లు సినిమాల్లో ముఖ్య మంత్రులు అవ్వవచ్చుగానీ.. ధరణిలో నరేంద్రమోదీనే ప్రధా ని అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని భుజం తట్టి చూపిస్తారో ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాజకీయ పరిస్థితి బాగానే ఉంది.. ఇక్కడ రాజకీయా పరిస్థితి బాగానే ఉందని, నటులెవరూ వచ్చి బాగు చేయాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మాత్రమే మార్పు తీసుకురాగలదని తమిళిసై ఉద్ఘాటించారు. బీజేపీ ఒక మంచి సర్కార్ అని, దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రాన్ని నిర్మిస్తారా? అం టూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు సర్కార్ చిత్రంలో నటించిన విజయ్ గురించేనా అన్న విలేకర్ల ప్రశ్నకు బదులిస్తూ, నటుడు విజయ్పై దాడి చేయాలన్నది ఉద్ధేశం కాదన్నారు. ఆ చిత్ర కథే తస్కరించబడ్డదని, అలాంటిది దొంగ ఓట్ల గురించి ఎందుకు చర్చించాలని తమిళిసై ప్రశ్నించారు. అభిమానులపై లాఠీఛార్జ్.. విజయ్ అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటన కలకలానికి దారి తీసింది. విజయ్ నటించిన సర్కార్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం తెరపైకి రానుంది. దీంతో గత కొద్ది రోజుల నుంచే ఆయన అభిమానుల హంగామా మొదలైంది. గుడవాంఛేరి ప్రాంతంలోని, చెన్నై– తిరుచ్చి రహదారిలో వెంకటేశ్వర థియేటర్ ఉంది. ఆ థియేటర్లో సర్కార్ చిత్రం విడుదల కానుం ది. దీంతో సోమవారం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. దీంతో విజయ్ అభిమానులు వేకువజాము నుంచే టిక్కెట్ కొనుగోలు కోసం ఆ థియేటర్ ముందు పోటెత్తారు. అభిమానుల మధ్య తోపులాట జరిగింది. అంతే ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిం ది. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలో అక్కడికి చేరుకుని అభిమానుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అభిమానులు అక్కడినుంచి పరుగులు తీశారు. కొందరైతే గోడలు దూకి పారిపోయారు. లాఠీఛార్జ్లో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. కొంతసేపు ఆ ప్రాంతంలో కలకలం రేగింది. -
వేలి చివర నలుపు రంగు.. మార్చునంటా బతుకురంగు
బంజారాహిల్స్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటా.. ఓటు వేసిన తరువాతే మిగతా కార్యక్రమాలు చూసుకుంటా.. అని వివరించారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. ప్రస్తుతం మణికొండలో ఉంటున్నానని ఈసారి కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటానని వెల్లడిస్తూ సర్కార్సినిమాలో తాను రాసిన పాటను పంచుకున్నారు. (సర్కార్ సినిమాలో ఓటర్లను చైతన్యపరిచే గీతాన్ని రాశారు చంద్రబోస్. ఇప్పుడు సోషల్మీడియాలో ఈ పాట సూపర్హిట్గా నిలిచిఓటర్లలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది.) పాట ఇదే... ఉరికితే ఉద్యమం– ఉరిమితే విప్లవం వేలి చివర నలుపు రంగు – మార్చునంటా బతుకురంగు మనకంఠం గంటలు మోగిస్తే అధికారపీఠం అదరాలే... సగటు మనిషి చేతి స్పర్శకే జగతి రాత మారాలే. బెదురుగా ఆగడం– కిందకే అణగడం ఎదురుగా నిలవడం– ఎత్తుకే ఎదగడం నోటుకు ఓటు అమ్మేశావే– మందే తాగి తొంగున్నావే మత్తే దిగి మేల్కోన్నావే ఉరిమితే ఉద్యమం–ఉరికితే విప్లవం మీ రంగుల బొమ్మల వెల మా రక్తం అయితే ఎలా ఈ రాజ్యం మారుట కల నిలదీసి అడుగుదాం మోసమే జరిగితే – కన్నులే మూసినం ద్రోహమే పెరిగితే– ఖర్మగా తలచినాం విందులే వద్దులే– తిండినే అడిగినాం మేడలే వద్దులే– నీడకై నలిగినాం నదులలో నీటినే– కళ్ళలో దాచినాం గుండెలో మండినాం–బూడిదై బతికినాం కమ్ముకున్న మత్తు వీడితే– కనబడునోయ్ కొత్త కాంతులే -
భారీ కటౌట్
అభిమాన హీరో సినిమా విడుదలవుతోందంటే ఫ్యాన్స్కి పండుగే. హీరో కటౌట్లు పెట్టి, ఫ్లెక్లీలు కట్టి బాణసంచా కాల్చుతూ సందడి చేస్తుంటారు. తమిళ హీరో విజయ్కి అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తమిళనాడులోనే కాదు.. కేరళలోనూ ఆయనకు అభిమానులున్నారు. తాజాగా విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేరళకు చెందిన కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్ను రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్– డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లు. కళానిధి మారన్ నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు(మంగళవారం) విడుదల కానున్న ఈ సినిమాపై తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలు సినిమాను ప్రదర్శించేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్లో ‘సర్కార్’ వరుసగా 8 షోలు ప్రదర్శించబోతుండటం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్. -
‘సర్కార్’కు షాక్
విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సర్కార్ సినిమాకు మరో చిక్కొచ్చిపడింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు తొలిరోజు భారీగా సంఖ్యలో షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలోని పలు థియేరట్లలో 48 గంటల పాటు కంటిన్యూస్గా షోస్ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కంటిన్యూస్ షోష్ కాదు.. కనీసం ఎర్లీ మార్నింగ్ షోస్కు కూడా అనుమతి ఇవ్వలేదట. దీపావళి పండుగ కావటంతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అదనపు షోలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ షోలతోనే విజయ్ తన మార్కెట్ స్టామినా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. కేవలం తమిళ రైట్సే 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్కుమార్, రాధారవి, ప్రేమ్కుమార్, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సర్కార్ కథ బయటకు చెప్పినందుకే’
విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా సర్కార్. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇటీవల పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సర్కార్ కథ తనదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి తమిళ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే విషయం అక్కడ పరిష్కారం కాకపోవటంతో కోర్డు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజా కీలకంగా వ్యవహరించారు. రెండు కథల మధ్య పోలికలు ఉన్నట్టుగా నిరూపించేందుకు భాగ్యరాజా సర్కార్ సినిమా కథను కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ భాగ్యరాజా రచయితల సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కారణమేదైన సినిమా కథను బయటపెట్టడం తప్పే అన్న భాగ్యరాజా ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ను క్షమాపణ కోరినట్టుగా తెలిపాడు. -
ఆయన అలానే సెట్లోకి వస్తారు : కీర్తి సురేష్
తమిళసినిమా : అతి చిన్న వయసు, అంతే కాదు అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో దూసుకుపోతున్న బహుభాషా నటి కీర్తీ. 2015 విక్రమ్ప్రభుకు జంటగా ‘ఇదు ఎన్న మాయం’ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ మూడేళ్లలోనే విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్ అంటూ స్టార్ హీరోలందరితోనూ నటించి క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. తాజాగా ఈ అమ్మడు విజయ్తో రొమాన్స్ చేసిన సర్కార్ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 6న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా కీర్తీసురేశ్తో చిన్న చిట్చాట్.. ప్ర: విజయ్ సహా పలువురు స్టార్ హీరోలతో జత కట్టారు. అజిత్తో నటించేదెప్పుడు? జ: త్వరలోనే అదీ జరుగుతుందని భావిస్తున్నాను. అజిత్తో నటించడం కోసం ఎదురుచూస్తున్నాను. ప్ర: మహానటి చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా నటిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? జ: మహానటి నా జీవితంలో గొప్ప చిత్రం. అలాంటి చిత్రం ఎప్పుడో ఒకసారి గానీ అమరదు. అలాంటి అవకాశం రావడం నిజంగా కష్టమే. ప్ర: నటి కావడంతో మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయానని అనుకుంటున్నారా? జ: ఈ విషయంలో పలుమార్లు బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రైవెసీ కోసం బయట ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాలంటే నటి అనే ఈ కీర్తీని పొందలేను. మనం అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో అర్థమే ఉండదు. ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాల్సి ఉంటుందన్నదాన్ని అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు దుప్పట ముఖానికి చుట్టుకుంటే బయట ప్రపంచానికి తెలియదు కదా. అలా నేనూ చాలా సార్లు షాపింగ్ చేశాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ప్ర: గాయని కీర్తీసురేశ్ గురించి చెప్పండి? జ: పాడడం, డాన్స్ కొద్దిగా నేర్చుకున్నాను.అయితే నేను పెద్ద గాయనిని కాదు.బాత్రూమ్ గాయనినే. ఇప్పుడు ఎవరైనా పాడవచ్చన్నట్టు మారిందిగా. ప్ర: సినిమాలో ఏం సాధించాలని కోరుకుంటున్నారు? జ: సాధించాలన్న ఆశ ఏమీ లేదు.అయితే నేను రాసిన కథను అక్క దర్శకత్వంలో నాన్న చిత్రం నిర్మించాలని, అందులో అమ్మ, అమ్మమ్మ, నేను కలిసి నటించాలన్న ఆశ మాత్రం ఉంది. మరో విషయం ఏమిటంటే నా కథకు కథనం, మాటలను అందిస్తానని దర్శకుడు లింగుస్వామి చెప్పారు. ప్ర: విశాల్తో నటించిన అనుభవం గురించి? జ: విశాల్ షూటింగ్ స్పాట్లో ఎప్పుడూ చేతిలో ఫోన్తోనే ఉంటారు. ఆయనకు మరో చెయ్యి ఉంటే దానిలోనూ ఫోనే ఉంటుందనిపిస్తుంది.ఆయన అలానే సెట్లోకి వస్తారు. విశాల్ చాలా ఫ్రెండ్లీ. ప్ర: విజయ్తో బైరవా చిత్రం తరువాత సర్కార్ చిత్రంలో నటించడం గురించి? జ: నటినవ్వక ముందు మీలాగే నేను ఆయన్ని తెరపై చూసి ఆనందించాను. అలాంటిది ఇప్పుడు ఆయనకు జంటగా రెండు చిత్రాల్లో నటించాను. విజయ్ను చూసి ఈలలు వేసి చప్పట్లు కొట్టిన నేనేనా ఆయనతో కలిసి నటించానన్నది ఒక్కోసారి నమ్మశక్యం కానంతగా ఆశ్యర్యపోతుంటాను. సర్కార్ చిత్రం డబుల్ ధమాకా అన్నది విజయ్ అభిమానులకే కాదు నాకు కూడా. -
సర్కార్ : 80 దేశాల్లో 3000 స్క్రీన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సర్కార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాదాల కారణంగా సినిమా రిలీజ్పై అనుమానాలు ఏర్పడ్డా అన్ని క్లియర్ చేసుకొని అన్నుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సర్కార్ టీం. ఈ సినిమాను విజయ్ కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేనంత భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 80 దేశాల్లో 3000లకు పైగా స్క్రీన్స్లో సర్కార్ సినిమా విడుదల కానుందని తమిళ సినిమా ఎనలిస్ట్ రమేష్ బాల వెల్లడించారు. తెలుగు నాట కూడా సర్కార్ 600 స్క్రీన్స్పై సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా.. విజయ్ కెరీర్ లోనే కాదు, తమిళ సినిమా చరిత్రలోనే బిగెస్ట్రిలీజ్ గా రికార్డ్ సృష్టించనుందన్న టాక్ వినిపిస్తోంది. #Sarkar will release in 3,000 screens world-wide.. 80 countries.. Widest release for a Tamil movie.. pic.twitter.com/G1SkFidXfk — Ramesh Bala (@rameshlaus) October 31, 2018 -
అందులో మార్పు లేదు
‘సర్కార్’ కథ కాపీ చేశారని దర్శకుడు మురుగదాస్ మీద పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపించిన రచయిత వరుణ్కి, ‘సర్కార్’ టీమ్కు సంధి కుదిరిందట. ఈ విషయం గురించి మురుగదాస్ తన ట్వీటర్లో ఖాతాలో పేర్కొన్నారు. ‘‘ఎప్పటిలానే బోలెడన్ని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఒకతను వేయాల్సిన ఓటును, దొంగతనంగా వేరే వాళ్లు వేసేస్తారు అనే కాన్సెప్ట్తో కూడుకున్న కథను పదేళ్ల క్రితమే ఓ వ్యక్తి రాసుకున్నారు అని దర్శకుడు భాగ్యరాజాగారు నాతో అన్నారు. ఆ పాయింట్ తప్ప మా కథకు వాళ్ల కథకూ ఎటువంటి సంబంధమూ లేదు. కానీ, మనకన్నా ముందు ఒక సహాయ దర్శకుడు ఈ కథను రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి అతడిని ఉత్సాహపరచడం కోసం టైటిల్స్లో అతని పేరు వేస్తే బాగుంటుందని భాగ్యరాజాగారు అన్నారు. దానికి సరే అని ఒప్పుకున్నాను. అంతే.. ‘సర్కార్’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్. ఇందులో ఎటువంటి మార్పు లేదు’’ అనే వీడియోను పోస్ట్ చేశారు. -
‘సర్కార్’కి అంత వస్తుందా..?
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అడ్డంకులన్ని తొలిగిపోయాయి. దీంతో నవంబర్ 6 సినిమా ప్రేక్షకుల ముందుకు రావటం ఖాయం అయ్యింది. తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో విజయ్కి పెద్దగా మార్కెట్ లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమా ఒక్కటి తప్ప వేరే ఏ సినిమా కూడా ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సర్కార్కి ఉన్న క్రేజ్ దృష్ట తెలుగు డబ్బింగ్ రైట్స్ను దాదాపు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్ సర్కార్తో అయినా తెలుగు మార్కెట్లో సత్తా చాటుతాడేమో చూడాలి. ఈ సినిమా తమిళ వర్షన్ రైట్స్ 80 కోట్లకు పైగా అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ ఇటీవల చేసిన సినిమాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో 80 కోట్లకు పైగా వసూళ్లు పెద్దగా కష్టమేమి కాదని భావిస్తున్నారు. విజయ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలోనటించారు. -
సర్కార్ కథ కాపీనే..!
సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ ల కాంబినేషన్లో సర్కార్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా తెరమీదకు వచ్చిన వివాదం సినిమా రిలీజ్పై అనుమానాలు కలిగేలా చేసింది. వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి సర్కార్ కథ నాదే అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంపై ముందుగా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పిన దర్శకుడు తరువాత మాట మార్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సర్కార్ కథ వరుణ్ రాజేంద్రన్దే అని అంగీకరించటంతో పాటు 30 లక్షల పారితోషికం, సినిమా టైటిల్స్లో వరుణ్కు క్రెడిట్ ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి : కోర్టులోనే తేల్చుకుంటానన్న మురుగదాస్! -
విజయ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
పాలించే తమిళుడి కోసం జనవరిలో ముహూర్తం జరుగుతోందన్నది తాజా సమాచారం. అంటే చాలా మందికి అర్థం అయిపోయి ఉంటుంది. అలాంటి టైటిల్స్కు ఇప్పుడు సరైన హీరో విజయ్నే అని చెప్పవచ్చు. ఈ స్టార్ హీరో తాజాగా నటించిన చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పలు వివాదాల మధ్య దీపావళికి సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ సినిమాలో సంచలన నటి వరలక్ష్మీశరత్కుమార్ రాజకీయనాయకురాలిగా ముఖ్యపాత్రలో నటించింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నారు. తదుపరి ఆయన్ని దర్శకత్వం చేసే అవకాశం ఎవరికి లభిస్తుంది. ఏ చిత్ర నిర్మాణ సంస్థకు కాల్షీట్స్ ఇవ్వనున్నారు అనే ఆసక్తి చిత్ర పరిశ్రమలో నెలకొంది. విజయ్ తదుపరి చిత్రం గురించి కొన్ని వివరాలు అనధికారికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది. వారిది హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు తేరి, మెర్సల్ చిత్రాలు వచ్చి సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా విజయ్, అట్లీల కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ చిత్ర ప్రారంభానికి వచ్చే ఏడాది జనవరిలో ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఇక అన్నింటికంటే ముఖ్యం దీనికి ఆళపోరాన్ తమిళన్ అనే టైటిల్ను అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ టైటిల్ను దర్శకుడు అట్లీ చాలా కాలం క్రితమే రిజిస్టర్ చేశారు. -
కోర్టులోనే తేల్చుకుంటానన్న మురుగదాస్!
తమిళ సెన్సేషన్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ అంటే తమిళనాట బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. ఇప్పటికే తుపాకి, కత్తి సినిమాలతో బ్లాక్బస్టర్ హిట్లు కొట్టిన ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యింది. తాజాగా కార్పోరేట్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఇంతలోనే ఈ సినిమా కథ తనదేనంటూ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కథను తాను రిజిస్టర్ చేశానంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి కేసు వేశాడు. అయితే దీనిపై మురుగదాస్ స్పందిస్తూ.. ఇది పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని, ఇంకా విడుదల కాకుండానే ఈ కథ ఆయనదేనని ఎలా అంటాడని, ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపాడు. అయితే వరుణ్ మాత్రం తనకు రూ.30లక్షల నగదు, టైటిల్స్లో స్టోరీ క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్, వరలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల చేయనున్నారు. -
దీపావళి.. టాలీవుడ్కు అన్సీజన్
సాధారణంగా పండుగ సెలవులను టాలీవుడ్ ఇండస్ట్రీ మిస్ చేసుకోదు. అందుకే ఏ పండుగ వచ్చినా సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తుంది. కానీ ఒక్క దీపావళికి మాత్రం టాలీవుడ్లో పెద్దగా సందడి కనిపించదు. స్టార్ హీరోలెవరు ఈ సీజన్కు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించరు. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా దీపావళి బరిలో కనిపించటం లేదు. విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా సర్కార్, బాలీవుడ్ ప్రస్టీజియస్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్లు తెలుగు లో రిలీజ్ అవుతున్న మన సినిమాలు లేకపోవటం వెలితే. నవంబర్ 2న రిలీజ్ అవుతున్న సవ్యసాచి ఒక్కటే ఈ ఏడాది దీపావళి సినిమా అనిపించుకోనుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్ ఒక్కటే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవటంతో పెద్దగా పోటి లేకపోవటంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో రాజా దిగ్రేట్ బాక్ల్ బస్టర్ సక్సెస్ సాదించింది. 2016లో దీపావళికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అంతకు ముందు ఏడాది అక్కినేని యువ కథానాయుడు హీరోగా పరిచయం అయిన అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా డిజాస్టర్ టాక్తో నిరాశపరిచింది. అప్పుడే దసరా సెలవులు ముగించుకోని అందురూ బిజీ అవుతారన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ ఈ సీజన్ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం దీపావళి సందడి గట్టిగానే కనిపిస్తుంది. టాప్ స్టార్స్, భారీ చిత్రాలు ఈ సీజన్లో పోటి పడుతుంటాయి. -
ఎదిరిస్తే అంతే
అతనొక కార్పొరేట్ దిగ్గజం. ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఓటు వేయడం కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పనిగట్టుకుని ఎన్నికల కోసం భారత్కి రావడానికి కారణమేంటి? ఇక్కడ ఏం చేశాడు? అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ కథానాయికలు. ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు.నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అశోక్ వల్లభనేని మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్హిట్ సినిమా తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ‘సర్కా ర్’. ‘కత్తి, తుపాకీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. రెహమాన్ చక్కని స్వరాలు అందించారు’’ అన్నారు. -
విజయ్ అభిమానులకు శుభవార్త!
సినిమా: ఇళయదళపతి విజయ్ అభిమానులకో శుభవార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఈ పేరులోనే రాజకీయాలు తొణికి చూస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకుడు కావడంతో సర్కార్ నిజంగానే శివమెత్తుతుందనిపిస్తోంది. ఇందులో సమకాలీన రాజకీయాల అంశాలు ఉంటాయని చిత్ర వర్గాలు ముందుగానే వెల్లడించి మరింత వేడిని పెంచేశారు. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించింది. ఇక సంచలన తార వరలక్ష్మీశరత్కుమార్ రాజకీయ నాయకురాలిగా కనిపించనుంది. ఆమెతో పాటు రాధారవి నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై దయానిధి మారన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, టీజర్ ఇప్పటికే విడుదలై విశేష ప్రేక్షకాదరణను చూరగొంటున్నాయి. ముఖ్యంగా టీజర్ సుమ్మ అదిరిందనే టాక్తో రికార్డులు బద్దలు కొడుతోంది. చిత్రంలో విదేశాల్లో పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్న విజయ్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమిళనాడుకు రాగా, ఆయన ఓటు వేరే వారు వేయడంతో దిగ్భ్రాంతికి ఆయన రాజకీయనాయకులతో ఢీకొనడమే సర్కార్ చిత్ర ప్రధానాంశం అన్న విషయం బయటకు పొక్కేసింది. దీంతో మరోసారి సర్కార్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ప్రతి పక్ష పార్టీకి చెందిన సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడంతో సర్కార్ చిత్రంపై అంచనాలతో పాటు ఒక విధమైన ఆసక్తి నెలకొంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సర్కార్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇంతకు ముందు ప్రకటించారు. అయితే తాజాగా ఆ తేదీకి నాలుగు రోజుల ముందే అంటే నవంబర్ 2న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి తాజాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. దీపావళి పండగ సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది విజయ్ అభిమానులకు నిజంగా శుభవార్తే అవుతుంది. -
‘సర్కార్’ హైదరాబాద్కు వస్తున్నాడా?
ఇళయ దళపతి విజయ్ హైదరాబాద్కు విచ్చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో సర్కార్ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన సర్కార్ టీజర్కు విశేష స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అక్టోబర్ 29న హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు , ఈ వేడుకకు విజయ్ హాజరుకానున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ విజయ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ అభిమానులకు సూచించింది. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. .. The news spreading in social media abt #ThalapathyVIJAY visit to hyd for #SarkarTelugu event is false .. kindly ignore this baseless news spreading @actorvijay @ARMurugadoss @KeerthyOfficial @sunpictures @varusarath @Jagadishbliss @BussyAnand https://t.co/GgTtp7FJEe — RIAZ K AHMED (@RIAZtheboss) 22 October 2018 -
సర్కార్ టీజర్.. సూపర్!
విజయ్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కార్’ తమిళ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ ఉంది. అభిమానులను అలరించే అన్ని అంశాలను ఇందులో మేళవించినట్టుగా కనబడుతోంది. విజయ్ తనదైన శైలిలో డైలాగులు, డాన్సులు, ఫైట్స్ తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్పొరేట్ క్రిమినల్ పాత్రలో విజయ్ కనిపించనున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్కుమార్, రాధా రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
దీపావళికి సర్కార్
‘తుపాకీ, కత్తి’ సినిమాల తర్వాత విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. కళానిధి మారన్ నిర్మించారు. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్హిట్ తర్వాత ‘సర్కార్’ లాంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమిళంలో విడుదలైన ఫస్ట్ లుక్కి, పాటలకు స్పందన అద్భుతంగా ఉంది. అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రీ రిలీజ్ నిర్వహించి, నవంబర్ 6న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. -
తోటమాలినౌతున్నా : కీర్తీ సురేష్
యువ నటి కీర్తీసురేశ్ సడన్గా సినిమాకు బ్రేక్ ఇచ్చి తోటమాలినవుతున్నానంటోంది. ఏమిటీ విపరీత నిర్ణయం అని షాక్ అవుతున్నారా? మీరు అవాక్కు అయినా, ఇంకేమయినా అయినా ఇది నిజం. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ కథానాయకి కీర్తి. ఒక్క మహానటి చిత్రంతోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ తరువాత కూడా స్టార్ నటులు విజయ్తో సర్కార్, విశాల్కు జంటగా సండైకోళి– 2 చిత్రాలు చేస్తూ కమర్శియల్ చిత్రాల హీరోయిన్గానూ రాణిస్తోంది. ఈ బ్యూటీకిప్పుడు వరుసగా మూడు విశేష సంఘటనలు వరుసగా వచ్చి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఈ నెల 17న ఈ అమ్మడు పుట్టిన రోజు జరుపుకోనుంది. మరో విశేషం ఈమె నటించిన సండైకోళి–2 చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఇక మూడోది విజయ్తో రొమాన్స్ చేస్తున్న సర్కార్ చిత్రం టీజర్ ఈ నెల 19న విడుదల కానుంది. ఇలా వరుస ఎగ్జైట్మెంట్స్తో కీర్తీసురేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సండైకోళి–2 చిత్రం తనకు బర్త్డే గిఫ్ట్ అని భావిస్తున్న ఈ బ్యూటీ ఈ సందర్భంగా తన అభిమానులకు ఊహించని షాక్ న్యూస్ ఒకటి వెల్లడించింది. అదేమిటంటే రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తుందట. ఇందుకు ఆ అమ్మడు చెప్పే రీజన్ మూడేళ్లగా రెస్ట్ లేకుండా నటిస్తున్నాననే. ఈ మూడేళ్లలో ఇన్ని చిత్రాలు చేశానా అని తనకే ఆశ్చర్యంగా ఉందంటున్న కీర్తీ విరామం లేకుండా, సరిగా నిద్రకూడా పోవడానికి సమయం లేనంతగా నటించానని చెప్పింది. అదే సమయంలో కొత్తగా మరో 20 కథలు విన్నానని, అయితే వాటిలో దేనికీ ఇంకా ఒప్పందం చేయలేదని చెప్పింది. ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగని విదేశాలకు వెళుతున్నానని భావించేరు సుమా! అలాంటి ఆలోచనలేమీ లేవు అని చెప్పింది. ఇంట్లోనే ఉంటానని, తోట పని చేస్తాను, కవితలు రాస్తాను, వంటలు చేస్తాను. వ్యవసాయం చేయడం కూడా నేర్చుకున్నాను, అది కూడా చేస్తాను అని అంటోంది. ఆ తరువాతనే మళ్లీ నటిస్తానని కీర్తీసురేశ్ పేర్కొంది. కారణాలేమైన తమిళంలో నటుడు శశికుమార్తో నటించే అవకాశాన్ని జారవిడుచుకుంది. ప్రస్తుతం చేతిలో ఒక్క మలయాళ చిత్రం మాత్రమే ఉంది. దాన్ని పూర్తి చేసి నటనకు చిన్న బ్రేక్ తీసుకోనుందట. -
గొంతు పోయింది!
ఇప్పటి హీరోయిన్లలో కొందరు తమ పాత్రకు తమ గొంతునే వినిపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే కొంచెం కష్టమైనా శ్రద్ధగా పరభాషను నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్లోకి వరలక్ష్మీ శరత్కుమార్ కూడా జాయిన్ అయ్యారు. అంతే కాదు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’, విశాల్ ‘పందెం కోడి 2’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు వరలక్ష్మీ. ఈ రెండు సినిమాలకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారామె. ‘‘డబ్బింగ్ చెప్పీ చెప్పీ గొంతు పోయింది. కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. ‘పందెం కోడి 2’ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. సూపర్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ‘సర్కార్’ నవంబర్లో రానుంది. -
దసరా కానుకగా ‘సర్కార్’ టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. షూటింగ్ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర టీజర్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టుగా ప్రటించారు యూనిట్. విజయదశమి కానుకగా అక్టోబర్ 19న విజయ్ సర్కార్ టీజర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. #SarkarTeaserOn19th@actorvijay @ARMurugadoss @arrahman @KeerthyOfficial @varusarath pic.twitter.com/je2qdA1g64 — Sun Pictures (@sunpictures) 10 October 2018 -
నేనే సీఎం అయితే..
నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను అని అన్నారు నటుడు విజయ్. ఈ స్టార్ నటుడికి రాజకీయాల్లోకి రావాలన్న ఆశ బలీయంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకుచాలా కాలం క్రితమే తన సైన్యాన్ని (అభిమానుల్ని) బరిలోకి దింపారు. సామాజిక సేవ పేరిట సమావేశాలను నిర్వహించారు. ఆ తరువాత తన చిత్రాల విడుదల సమయంలో ఏర్పడ్డ అడ్డంకులు ఆయన రాజకీయ ఆశలపై నీళ్లు చల్లాయనే చెబుతారు. సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి అవ్వాలన్న తన కోరికను నటుడు విజయ్ మంగళవారం మరోసారి చెప్పకనే చెప్పారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ ఆడియో ఆవిష్కరణ మంగళవారం చెన్నై, తాంబరంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించారు. ఆడియో ఆవిష్కరణ సందర్భంగా అందరి ప్రసంగం విజయ్ గురించి, రాజకీయాలపైనే సాగడం విశేషం. చివరకు విజయ్ కూడా రాజకీయాల గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈయన ఏమన్నారో చూద్దాం. ‘అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు. ఈ వేడుకకు నాయకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన సంగీతం అందించడం ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించినట్లే. నేను, దర్శకుడు మురుగదాస్ కలిసి చేస్తే అది హిట్ చిత్రం అవుతుంది. సర్కార్ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే మెర్శల్ చిత్రంలో కొంచెం రాజకీయం చోటుచేసుకుంది. ఇందులో రాజకీయం దుమ్మురేపుతుంది. సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ ఉత్తమ నటనను ప్రదర్శించారు. ఆమెకు అభినందనలు. నటి వరలక్ష్మి వద్దు అని ఎవరు అనలేని విధంగా ఈ చిత్రంలో ఆమె నటించారు. విజయం కోసం ఎంతగానైనా కష్టపడవచ్చు. అయితే మా చిత్రం విజయం సాధించకూడదని ఒక వర్గం త్రీవంగా శ్రమిస్తోంది. జీవితం అనే ఆటను చూసి ఆడండి. అసహ్యించుకునే వారిపై ఉమ్మేయండి. విసిగించేవారి వద్ద మౌనంగా ఉండండి. జీవితాన్ని జామ్జామ్గా గడిపేద్దాం అని అన్నది ఎవరో తెలియదు గానీ, ఆ వ్యాఖ్యలను నేను అనుసరిస్తున్నాను. మీరు అనుసరించండి. సర్కార్ను ఏర్పాటు చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయనున్నాం. నేను చిత్రం గురించి చెబుతున్నాను. నచ్చితే ఈ చిత్రానికి ఓటేయండి. సర్కార్ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించలేదు. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రిని అయితే నటించను’ అని నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లోనే రాజకీయాలపై ఉన్న ఆసక్తి తెలిసిపోతుంది కదూ! రాజకీయ ప్రకంపనలు సర్కార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొందరు నాయకులు స్వాగతిస్తున్నా, మరి కొందరు, ముఖ్యంగా అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ స్పందిస్తూ విజయ్, అజిత్ లాంటి ప్రముఖ నటులు రాజకీయాల్లోకి రావాలన్నారు. రాష్ట్ర మంత్రి ఉదయకుమార్ స్పందిస్తూ సర్కార్ సినిమాను సర్కస్తో పోల్చారు. విజయ్ చిత్రాలు చేసుకోవడమే మంచిదని, రాజకీయాల్లో ఆయన రాణించలేరని ఎద్దేవా చేశారు. -
అదే కొత్త సినిమా... అదే చివరి సినిమా?
ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అనే కన్ఫ్యూజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్కు స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఇది మొత్తం చదవాల్సిందే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వార్తలు బాగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట్టా’ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి కావొస్తుండటం, విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కార్’ సినిమా విడుదలకు రెడీ అవ్వడమే ఇందుకు కారణాలని ఊహించవచ్చు. అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్ అవుతుందని టాక్. ‘పేట్టా, సర్కార్’ చిత్రాల నిర్మాణ బాధ్యతలను స్వీకరించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుందట. అయితే మురుగదాస్ దర్శకత్వంలో నటించిన తర్వాత రజనీకాంత్ సినిమాలకు బై బై చెబుతారని, ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని కొందరి అంచనా. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే లెక్కల పరంగా రజనీ కెరీర్లో ఇది 166వ సినిమా. అభిమాన హీరో ఎప్పటికీ సినిమాలు చేస్తుండాలని అభిమానులు కోరుకుంటారు. అందుకే కొత్త సినిమా గురించి వార్త వస్తే ఆనందపడతారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓకే అయిందని ఆనందపడాలో, ఇదే రజనీకాంత్కి చివరి సినిమా అవుతుందనే వార్తలకు బాధపడాలో తెలియని అయోమయంలో పడిపోయారట ఫ్యాన్స్. ఇక కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజనీ తాజా చిత్రం ‘పేటా’్టలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, సిమ్రాన్, త్రిష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా రూపొందిన ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సీక్వెల్ 2.0 ఈ నవంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
‘సర్కార్’ వేడుకకు రజనీ
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కార్. గతంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన తుపాకి, కత్తి సినిమాలు ఘన విజయం సాధించటంతో సర్కార్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సన్ పిక్చర్స్ భారీ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను అక్టోబర్ 2న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారట. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే వేదికపైకి రానుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనాల వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడియో రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ చెపాక్ స్టేడియంకు పర్మిషన్ రాని పక్షంలో నెహ్రూ ఇండోర్ స్టేడియం లేదా వైఎమ్సీఏ స్టేడియాలలో ఒకదానిని ఫైనల్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. -
దీపావళి బరిలో ఇద్దరు టాప్ స్టార్లు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, టాప్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తుపాకి, కత్తి చిత్రాలు ఘనవిజయం సాధించటంతో సర్కార్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాతో పోటి పడేందుకు మరో స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే కూడా దీపావళికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావటంతో ఎన్జీకే వాయిదా పడింది. ఇప్పుడు అదే స్థానంలో ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్నయ్ నొక్కి పాయుమ్ తోట్ట’ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శశికుమార్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ జోడిగా మేగా ఆకాష్ నటిస్తున్నారు. ధనుష్, విజయ్లు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో అభిమానులు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బ్రిడ్జ్లో జయకేతనం
ఏషియాడ్లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడాంశం ‘బ్రిడ్జ్’లో భారత్ స్వర్ణం గెల్చుకుంది. శనివారం పురుషుల పెయిర్ ఈవెంట్ ఫైనల్లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి భారత్ జోడీ ప్రణబ్ బర్దన్, శివ్నాథ్ సర్కార్ 384 పాయింట్లు స్కోరు చేశారు. ప్రత్యర్థి చైనా జంట లిగ్జిన్ యాంగ్, గాంగ్ చెన్ 378 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. ఇండోనేసియా (374 పాయింట్లు), హాంకాంగ్ (373 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ విజయంతో 60 ఏళ్ల బర్దన్... అత్యంత పెద్ద వయసులో పతకం గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. అతడి సహచరుడు శివ్నాథ్ వయసు 56 ఏళ్లు కావడం విశేషం. మరోవైపు మిక్స్డ్ పెయిర్ ఫైనల్లో భారత్ జంట బాచిరాజు సత్యనారాయణ, కిరణ్ 333 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయింది. బ్రిడ్జ్లో మన దేశానికి ఒక స్వర్ణం (పురుషుల పెయిర్), రెండు కాంస్యాలు (పురుషుల టీమ్, మిక్స్డ్ టీమ్) లభించాయి. జూద క్రీడ కాదు... అందరూ భావించినట్లు బ్రిడ్జ్ జూద క్రీడ కాదని... నైపుణ్యం, అదృష్టం కలగలిసిన ఆట అని అంటున్నారు బర్దన్. చెస్లాగానే మేధో క్రీడ అని, దానికంటే మరింత చాలెంజింగ్ అని అభివర్ణిస్తున్నారు. అందరికీ మొదటి సెట్ కార్డులే వస్తాయి కాబట్టి, పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడినవారే విజేతగా నిలుస్తారని చెబుతున్నాడు. ఇది అన్ని వయసుల వారు ఆడే క్రీడ అని శివ్నాథ్ సర్కార్ వ్యాఖ్యానించారు. ఫైనల్ ముందు రాత్రి తాను నిద్ర పోలేదని, ఉదయం కేవలం పండ్లు మాత్రమే తీసుకుని బరిలో దిగానని సర్కార్ చెప్పడం విశేషం. -
‘సర్కార్’ టీజర్కు ముహూర్తం ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా లాస్ వేగాస్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో పరిచయ గీతంతో పాటు పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమైన రోజే రిలీజ్ డేట్ను ప్రకటించిన చిత్రయూనట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పక్కా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర టీజర్ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న విజయ్ సర్కార్ టీజర్ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. -
లీకైన స్టార్ హీరో సాంగ్ క్లిప్
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. గీత గోవిందం సినిమా వార్తలు మరువక ముందే మరో భారీ చిత్రానికి సంబంధించిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సర్కార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఇంట్రో సాంగ్కు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా లాస్ వేగాస్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీగా వేగాస్ వీదుల్లో విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్న ఈ పాటలో విజయ్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ క్లిప్ వైరల్ అయ్యింది. సన్ పిక్చర్స్ సంస్థభారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా దీపాకళికి రిలీజ్ కానుంది. చదవండి : సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్ ‘గీత గోవిందం’ సినిమా లీక్పై విజయ్ స్పందన! తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్ -
విజయ్తో రొమాన్స్కు సై
తమిళసినిమా: విజయ్తో రొమాన్స్కు మహేశ్బాబు హీరోయిన్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సర్కార్. విజయ్ తన తాజా చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకు ముందు ఆయనకు తెరి, మెర్షల్ వంటి సంచలన విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీతో ముచ్చటగా మూడోసారి కలవనున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. సంగీత మాంత్రికుడు సంగీత బాణీలను కట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇతర తారాగణం ఎంపికపై దృష్టిసారించారు. ఇందులో కైరా అద్వాని రొమాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకు ముందు భారత క్రికెట్ క్రీడ కెప్టెన్ ఎంఎస్.ధోని బయోపిక్లో నటించింది. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను అందుకుంది. ఆ తరువాత తెలుగులో మహేశ్బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఇలా లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న కైరా అద్వాని తాజగా విజయ్కు జంటగా కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోందన్నమాట. -
పాట కోసం ఫ్లైట్ ఎక్కాడు!
పాట కోసం ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు హీరో విజయ్. అక్కడి బ్యూటీఫుల్ లొకేషన్స్లో ప్రేయసితో డ్యూయెట్ పాడుకుంటారట. ఈ సాంగ్ ‘సర్కార్’ చిత్రం కోసమే. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రీసెంట్గా చెన్నై షెడ్యూల్లో కోర్ట్ సీన్స్ను తెరకెక్కించిన ‘సర్కార్’ టీమ్ ఇప్పుడు సాంగ్ షూట్ కోసం లాస్ వేగాస్ వెళ్లారని కోలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్లో వరలక్ష్మీ శరత్కుమార్ కూడా పాల్గొంటారు. ఈ నెల 11వరకు ఈ షెడ్యూల్ను ప్లాన్ చేశారట. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ‘కత్తి, తుపాకి’ చిత్రాల తర్వాత విజయ్–మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. -
కాలేజీలో కోర్ట్
ఆదివారం విశ్రాంతి తీసుకోకుండా కాలేజీకి వెళ్లారు తమిళ హీరో విజయ్. కాలేజీకి వెళ్లిన తర్వాత బోన్లో నిలబడ్డారట. కాలేజీకి వెళ్తే బెంచ్లు ఉండాలి కానీ కోర్టులో ఉండే బోన్లు అక్కడ ఎందుకు ఉన్నాయి? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ‘కత్తి, తుపాకీ’ చిత్రాల తర్వాత హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘సర్కార్’. ఇందులో కథానాయికగా కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ కాలేజీలో కోర్ట్ సెట్ వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్ఆర్ఐ పాత్రలో విజయ్ కనిపిస్తారట. ‘సర్కార్’ చిత్రం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించబోతున్నారని, ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలవుతుందని కోలీవుడ్ టాక్. విజయ్–అట్లీ కాంబినేషన్లో ‘తేరీ, మెర్సెల్’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. -
మా ఉద్దేశం అది కాదు
సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ లేటెస్ట్ సినిమా ‘సర్కార్’ ఫస్ట్ లుక్ తమిళనాడులో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ పోస్టర్ తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ – ‘‘సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సినిమాలో పాత్రల కోసం యాక్టర్స్ ధూమపానం చేస్తారు తప్పితే కావాలని కాదు. యువతను తప్పు దోవ పట్టించాలని ఉద్దేశం కూడా కాదు. మా నాన్నకి సిగరెట్ అలవాటు ఉండేది. ఆయన్ను చూసి నేను అలవాటు చేసుకోలేదే? చెడుని తీసుకోవాలా? వద్దా? అనే విషయం మన మీద ఆధారపడి ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసం సినిమాల్లో పోస్టర్స్ గురించి మాట్లాడటం తప్పు. ఈ ప్రాబ్లమ్ని నిజంగా సాల్వ్ చేయాలనుకునేవాళ్లు సిగరెట్ తయారు చేసేవాళ్లను తప్పుపట్టండి’’ అన్నారు. -
తారలను అనుసరించే ప్రమాదం..
తమిళసినిమా: నటుడు విజయ్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. విజయ్ నటించిన సర్కార్ చిత్ర పోస్టర్ ఆయన్ను సమస్యల్లో పడేస్తోంది. సర్కార్ ఫస్ట్లుక్ పోస్టర్లో విజయ్ సిగరెట్ కాలుస్తున్నట్లు ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పీఎంకే నేతలు రాందాస్, అన్భుమణి రాందాస్ తదితరులు విమర్శల దాడి చేశారు. తాజాగా స్థానిక కోడంబాక్కంకు చెందిన ఎస్.శిరిల్ సర్కార్ పోస్టర్ వ్యవహారంపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను తమిళనాడు పొగనిరోధక సంఘంలో సభ్యుడినని తెలిపారు. దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పొగతాగడానికి బానిసలవుతున్నారన్నారు. వారిలో ఏడాదికి లక్ష మంది వరకూ మృత్యవాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకు సంబంధించిన సిగరెట్లు వంటి ప్రకటనలను ప్రభుత్వం నిషేధిస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అదే విధంగా సినిమా, సీరియళ్లలో సిగరెట్లు తాగే సన్ని వేశాలు పొందుపరచరాదని నిబంధనలను విధించిందని గుర్తుచేశారు. ఇటీవల నటుడు విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్ర పోస్టర్లలో ఆయన సిగరెట్ తాగుతున్న దృశ్యం చోటుచేసుకుందన్నారు. ఆ పోస్టర్లను తమిళనాడులో అన్ని థియేటర్ల వద్ద ఏర్పాటు చేశారన్నారు. ఇవి పొగ నిషేధ ప్రకటనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు 1987లో ప్రవేశ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ పోస్టర్లు ధ్రువపత్రాన్ని పొందలేదన్నారు. తారలను అనుసరించే ప్రమాదం.. సినీ తారలను అభిమానులు అమితంగా ఆరాధిస్తారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకునే అభిమానులు విజయ్ లాంటి స్టార్ నటుడు సిగరెట్లు తాగుతున్నట్లు చూపిస్తే వారు దాన్ని అనుసరిస్తారన్నారు. సర్కార్ చిత్ర పోస్టర్ల వ్యవహారంలో ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతలపై తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ఆరోగ్యశాఖకు, పర్యవేక్షణ సమితికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేన్సర్ బాధితుల సంరక్షణ కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి నటుడు జోసఫ్ విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతల నుంచి తలా రూ.10 కోట్లు నష్ట పరిహారాన్ని వసూలు చేయాలన్నారు.ఆ నిధిని స్థానిక రాయపేటలోని ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన న్యాయమూర్తులు ఇందిరా బెనర్జి, పీటీ ఆషా పిటిషన్పై 2 వారాల్లోగా బదులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నటుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగుదాస్, నిర్మాణ సంస్ధలకు నోటీసులు జారీ చేశారు. -
ఇదీ న్యూసేనా?
విజయ్, మురుగదాస్ల లేటెస్ట్ మూవీ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో విజయ్ సిగార్ పట్టుకొని పొగ తాగుతున్న స్టిల్ హాట్ టాపిక్గా మారింది. మోరల్గా ఇది కరెక్టా? కాదా అని తమిళనాడులో చాలా డిబేట్స్ నడిచాయి. ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని నటుడు శరత్కుమార్ని అడగ్గా –‘‘హీరోలు స్మోక్ చేయడం తప్పా? కరెక్టా? అన్నది న్యూస్ అవ్వడం విశేషం. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. ఇటీవల జరిగిన సర్వేలో స్త్రీలకు రక్షణ లేని దేశాల్లో భారతదేశం తొలిస్థానంలో నిలిచింది. అది సీరియస్ విషయం. దాన్ని ఎలా తగ్గించాలి. ఎలాంటి అవగాహన తీసుకురావాలి అనేది న్యూస్ అవ్వాలి, దాని మీద డిబేట్లు జరగాలి కానీ సినిమా పోస్టర్ల మీద, ఇంకో ఇంకో విష యాల్లో కాదు’’ అని ఘాటుగా స్పందించారు. -
వెయిటింగ్లో దర్శక నిర్మాతలు..
తమిళ సినిమా: యువ నటి కీర్తీసురేశ్ గురించి ఇప్పుడు చర్చ చాలానే జరుగుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్ తిలగం చిత్రంలో కీర్తీసురేశ్ నటనను ప్రశంసించని వారుండరంటే అతిశయోక్తి కాదు. నడిగైయార్ తిలగం చిత్రం తరువాత కీర్తికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఆమె యమ బిజీ అయిపోతుంది లాంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వేరే రకంగా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే కీర్తీసురేశ్ కొత్త చిత్రాలను ఒప్పుకోవడం లేదు. పారితోషికం పెంచేసింది లాంటి వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి కీర్తీ ఎలా బదులిచ్చిందో చూద్దాం. నడిగైయార్ తిలగం చిత్రాన్ని ఒప్పుకోవడానికి ముందే నేను తమిళంలో విజయ్, విక్రమ్, విశాల్ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను. అయితే నడిగైయార్ తిలగం చిత్రంలో నేను టైటిల్ పాత్రలో నటించడంతో ఆ చిత్రానికి అధిక కాల్షీట్స్ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నాకోసం ఆ మూడు చిత్రాల వారు చాలా సహకరించారు. విజయ్తో నటిస్తున్న సర్కార్ చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించినా, నడిగైయార్ తిలగం చిత్రం పూర్తి చేయాల్సి ఉండటంతో సర్కార్ చిత్ర యూనిట్ నా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. దీంతో ఆ చిత్రం పూర్తయిన తరువాత సర్కార్ చిత్రం షూటింగ్కు సిద్ధం అయ్యాను. ఆ తరువాత విశాల్తో నటిస్తున్న సండైకోళి–2, విక్రమ్తో నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రాలు వరుసగా పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలను అంగీకరించాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం కథ చెప్పడానికి వస్తున్న దర్శక నిర్మాతలను వెయిటింగ్లో పెడుతున్నాను. చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలపై దృష్టి సారిస్తాను. ఇక పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోను. నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని నిర్మాతలే ఇస్తున్నారు అని బదులిచ్చారు కీర్తి. -
విజయ్ వేరే లెవల్
తమిళసినిమా: నటుడు విజయ్ వేరే లెవల్ అన్నదెవరో తెలుసా? సంచలన నటి వరలక్ష్మీ శరత్కుమార్. కోలీవుడ్లో బిజీగా ఉన్న నటి ఎవరంటే టక్కున వచ్చే బదులు ఈ బ్యూటీ పేరే. కథానాయకి, ప్రతి కథానాయకి, కీలక పాత్ర ఇలా ఏదైనా సరే పాత్రకు ప్రాధాన్యత ఉందంటే నటించడానికి రెడీ అంటున్న నటి వరలక్ష్మీశరత్కుమార్. ఈమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. సండైకోళీ–2 చిత్రంలో విశాల్తో కలిసి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈమె విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. నటుడు విజయ్ గురించి వరలరక్ష్మీ చెబుతూ ఆయన్ను చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పింది. విజయ్ను నేరుగా చూస్తే చాలా సాఫ్ట్గా కనిపిస్తారని అంది. ఇక కెమెరా ముందుకొచ్చే విజయ్ వేరే లెవల్ అని పేర్కొంది. మామూలుగా చాలా శాంతంగా ఉండే ఆయనలో అంతలోనే అంత ఆవేశం ఎక్కడి నుంచి వస్తుందని తానే విస్మయం చెందానని చెప్పింది. తాను విజయ్తో కలిసి నాలుగు రోజులే నటించానని, త్వరలో అమెరికాలో జరగనున్న షూటింగ్లో పాల్గొననున్నట్లు చెప్పింది. ఇంతకీ ఇందులో వరలక్ష్మీశరత్కుమార్ పాత్ర ఏమిటన్నది చిత్ర యూనిట్ సస్పెన్స్గా ఉంచారు. అయితే సర్కార్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం అని, ఇందులో విజయ్ సంపన్న కుటుంబానికి చెందిన పేదల కోసం పోరాడే యువకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక వరలక్ష్మీ శరత్కుమార్ అమెరికా రిటర్న్ ముఖ్యమంత్రి కూతురిగా నటిస్తోందన్నది తాజా సమాచారం. విజయ్కు కూడా అమెరికా రిటర్నేనట. సర్కార్ చిత్రంలో విజయ్, వరలక్ష్మీ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తాజా సమాచారం. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సర్కార్ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. -
సర్కార్ చిత్ర పోస్టర్పై రగడ
హీరో విజయ్ చిత్రంపై మొదట్లోనే రాజకీయ రగడ మొదలైంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ పోస్టర్లో విజయ్ సిగరెట్ కాలుస్తున్న దృశ్యం రచ్చకు దారి తీసింది. హీరో విజయ్పై కోర్టులో పిటిషన్ దాఖలుకు సిద్ధం అవుతున్నారు పొగాకు నిరోధక సంఘం. సినిమాల్లో మద్యం, పొగ తాగే సన్నివేశాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇతర చిత్రాల గురించి పట్టించుకోకపోయినా రజనీకాంత్, విజయ్ వంటి నటుల చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటే వాటిపై కేసులు, కోర్టులు అంటూ రచ్చ జరుగుతుంది. అయితే వారి ఇమేజ్ కారణంగా ఇలాంటి దురలవాట్ల ప్రభావం యువతలోకి వేగంగా చేరుతుందని సమాచారం. తాజాగా విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లో ఆయన సిగరెట్టు కాల్చుతున్న ఫొటో చోటుచేసుకోవడం దుమారానికి కారణమైంది.ఈ వ్యవహారంపై పొగాకు నియంత్రణ సంఘం నిర్వాహకుడు గ్రిల్ అలెగ్జాండర్ విజయ్పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దీని గురించి ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘హీరో విజయ్ తన ముందు చిత్రంలోనూ పొగతాగే సన్నివేశాల్లో కనిపించారు. తాజాగా నటిస్తున్న సర్కార్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లో ఆయన సిగరెట్ తాగుతున్నట్టు కనిపించారు. ఇది పొగాకు నియంత్రణ చట్ట ధిక్కార చర్యగా పేర్కొన్నారు. పొగ త్రాగడం అనారోగ్యకరం వంటి యువతలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే విజయ్ లాంటి నటులు పొగతాగడాన్ని పోత్సహించే విధంగా ఆరోగ్యానికి హాని కలిగించేలా చిత్రాల్లో నటిస్తున్నారు. కాబట్టి విజయ్పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా పొగాకు నిరోధక రాష్ట్ర పర్యవేక్షణ కమిటీకి, సెన్సార్బోర్డుకు లేఖ రాశారు. అదే విధంగా విజయ్పై న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నట్లు’ గ్రిల్ అలెగ్జాండర్ తెలిపారు. సర్కార్ పోస్టర్లో సిగరెట్ కాలుస్తున్నట్లు విజయ్ స్టిల్పై పీఎంకే నేత అన్భుమని రామదాస్ ఇప్పటికే సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్పై ఇంకా ముందు ముందు ఎలాంటి రచ్చ జరగనుందో వేచిచూడాల్సిందే! రజనీ అభిమానుల ఆగ్రహం.. రజనీకాంత్ అభిమానులు, విజయ్ అభిమానులపై మండిపడుతున్నారు. సర్కార్ చిత్రం వారి మధ్య చిచ్చు పెట్టింది. వివరాలోకి వెళ్లితే.. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం సర్కార్. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద హంగామా సృష్టించారు. చెన్నైలోని రోహిణి థియేటర్ వద్ధ సర్కార్ చిత్రానికి సంబంధించిన భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు విజయ్ అభిమానుల భేటీ అయ్యారు. దీనిపై ఇతర హీరోల అభిమానులకు ఆగ్రహాన్ని కలిగించింది. వారు నటుడు అజిత్ అభిమానులను, ఆయన కుటుంబాన్ని కించపరచే విధంగా మాట్లాడారు. అంతే కాకుండా రోహిణి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన రజనీకాంత్ చిత్ర పోస్టర్ను చించేశారు. దీంతో విజయ్ అభిమానులపై ఇతర నటుల అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. -
దీపావళికి సర్కార్
ఈ ఏడాది దీపావళికి థియేటర్స్లోకి కొత్త సర్కార్ రానుంది. హీరో విజయ్ ఈ సర్కార్కు లీడర్. ‘కత్తి, తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమాకు ‘సర్కార్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్కుమార్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ త్రీ లుక్స్లో కనిపించనున్నారట. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. విజయ్, వరలక్ష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి, తుపాకీ’ చిత్రాల కన్నా ‘సర్కార్’ ఇంకా సూపర్గా ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్ప గలను’’ అన్నారు మురుగదాస్. -
వివాదాస్పదంగా విజయ్ సర్కార్ ఫస్ట్లుక్..
-
విజయ్ ఫస్ట్లుక్.. వివాదాస్పదం
ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు(జూన్ 22) కానుకగా గురువారం సాయంత్రం కొత్త సినిమా టైటిల్ను, విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కళ్ల జోడుతో, సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ మాస్లుక్కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ప్రస్తుతం విజయ్ ఫొటోపై ‘తమిళనాడు ఫోరం ఫర్ టొబాకో కంట్రోల్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొగాకు నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారని ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ హీరో అయి ఉండి ఇటువంటి దురలవాట్లను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టొబాకో ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రముఖ హీరో విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ చూశాం. సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం(కోప్టా).. ధూమపానానికి సంబంధించిన ఫొటోలు పోస్టర్లలో, ప్రచార కార్యక్రమాల్లో ప్రచురించడం నిషేధం. గతంలో కూడా విజయ్ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఆ సమయంలో విజయ్, సంబంధిత మూవీ టీమ్ క్షమాపణలు చెప్పారు. కానీ మళ్లీ అదే తప్పును పునరావృతం చేశారు. ప్రస్తుతం విజయ్పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కు ఫిర్యాదు చేయబోతున్నాం. యువతను ప్రభావితం చేసే సినిమా వంటి మాధ్యమాల్లో ఇటువంటి దురలవాట్లను ప్రోత్సహించవద్దని తమిళ సినిమా పరిశ్రమను కోరాం. కానీ వారి నుంచి స్పందన కరువైందని’ ఆవేదన వ్యక్తం చేశారు. -
విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్!
ఇళయ దళపతిగా తమిళనాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్. సూపర్స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ మాస్ హీరోగా కెరీర్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. తుపాకీ, కత్తి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా వీరిద్దరు మరో సినిమాతో హ్యాట్రిక్ హిట్ను అందుకునేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ పుట్టినరోజు(జూన్ 22) కానుకగా గురువారం(జూన్ 21) సాయంత్రం ఈ సినిమా టైటిల్ను, విజయ్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. కళ్ల జోడుతో, సిగరెట్ తాగుతూ మాస్లుక్లో ఉన్న విజయ్.. తన అభిమానులకు అదిరిపోయే కానుకను ఇచ్చారు. ‘సర్కార్’ అని టైటిల్ పెట్టడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటోంది. విజయ్కు ఇది 62వ చిత్రం. స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇళయ దళపతి పుట్టిన రోజు కానుకగా! Here is the First Look of Thalapathy Vijay’s SARKAR.#Thalapathy62isSARKAR@actorvijay @ARMurugadoss @arrahman pic.twitter.com/7tBNQkhBz5 — Sun Pictures (@sunpictures) June 21, 2018 -
రామ్ గోపాల్ వర్మ ‘వైరస్’
ఆఫీసర్ సినిమాతో మరో షాక్ ఇచ్చిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను ప్రకటించాడు. గతంలో వర్మ దర్శకత్వంలో సర్కార్, ఎటాక్ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్ సంఘ్వీ కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు. వైరస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. నిర్మాతతో పాటు వర్మ కూడా ‘వైరస్’ సంబంధించిన ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లిన ఓ విద్యార్థి అరుదైన వైరస్ బారిన పడటం.. తరువాత ఆ విద్యార్ధి భారత్ తిరిగి వచ్చిన తరువాత భారీగా జరిగిన ప్రాణనష్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం టైటిల్, కాన్సెప్ట్ మాత్రమే రివీల్ చేసిన దర్శక నిర్మాతలు నటీనటుల వివరాలు సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. -
DGP నియామకంలో సర్కార్ తీరుపై విమర్శలు
-
నిరుద్యోగుల ఆశలపై సర్కార్ లంచం నీళ్ళు
-
నాణ్యమైన విద్యను అందించాలి
జేఎన్టీయూ వీసీ సర్కార్ అనంతపురం సప్తగిరి సర్కిల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కృషి చేయాలని జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ సూచించారు. స్థానిక జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్వాలిటీ ఎడ్యూకేషన్ డెవలప్మెంట్పై ట్రైనింగ్ ప్లేస్మెంట్ అందించాలన్నారు. దీనికి అన్ని కళాశాలల యాజమాన్యాలు సహకరించాలన్నారు. అనుబంధ కళాశాలల అధ్యక్షుడు శాంతరాముడు, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ డైరెక్టర్ ప్రశాంతి, అనుబంధ కళాశాలల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
మోదీ రియల్ సర్కార్ : వర్మ
సినిమా విశేషాలపైనే కాదు సమకాలీన రాజకీయాలపైన కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల వర్మ. ఇటీవల పెద్ద నోట్ల రద్దు విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయానికి మద్దుతు తెలిపిన రాం గోపాల్ వర్మ, తాజాగా మోదీ ఫోటోను ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోలో కూడా తన పైత్యం చూపించాడు ఈ గ్రేట్ డైరెక్టర్. తను రూపొందించిన సర్కార్ సినిమాలో అమితాబ్ గెటప్కు మోదీ తలను అతికించి ఆ ఫోటోను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు. ఫోటో కింద రీల్ వర్సెస్ రియల్ అన్న కామెంట్ను చూస్తే అమితాబ్ తెర మీద సర్కార్ అయితే, మోదీ నిజ జీవితంలో సర్కార్ అన్న అర్ధ వచ్చేలా ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ మోనార్క్ల వ్యవహరించే సర్కార్ పాత్రలో మోదీని చూపించటంలో వర్మ ఉద్దేశమేంటో ఆయన చెపితేనే గాని సామన్యులకు అర్ధమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఫోటోతోనే సరిపెట్టిన వర్మ, ఆ ఫోటోకు సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తాడేమో చూడాలి. -
బాలయ్యకు బిగ్బి నో చెప్పాడా..?
ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా పనుల్లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ, కొద్ది రోజుల క్రితం సర్కార్ 3 సెట్స్లో బిగ్బి అమితాబ్ బచ్చన్ను కలిసారు. ఆ సమయంలో బాలయ్యతో పాటు కృష్ణవంశీ కూడా ఉండటంతో ఈ భేటి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తన 100వ సినిమాలో నటిస్తున్న బాలయ్య, ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు అమితాబ్ను సంప్రదించారన్న టాక్ వినిపించింది. అంతేకాదు అమితాబ్ కూడా బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు అంగీకరించారని, త్వరలోనే అధికారంగా ఎనౌన్స్మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం బిగ్ బి బాలయ్య సినిమాకు నో చెప్పాడట. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు కమర్షియల్ యాడ్స్తో బిజీగా ఉన్న అమితాబ్ బాలయ్య సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో బాలయ్య సినిమాలో బిగ్బి కనిపించే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. -
త్వరలో పోస్టుల భర్తీ
జేఎన్టీయూ వీసీ ఆచార్య సర్కార్ డిసెంబర్లోగా కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జేఎన్టీయూ : జేఎన్టీయూ–అనంతపురం పరిధిలో వచ్చే నెల మొదటి వారంలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వీసీ ఆచార్య ఎం.ఎం.ఎం.సర్కార్ తెలిపారు. వైస్ చాన్స్లర్గా ఆయన బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సాక్షితో మాట్లాడుతూ... బోధన పోస్టుల కొరతను అధిగమించేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి నవంబర్ 2న జరిగే పాలక మండలి సమావేశంలో ఆమోదం పొందనున్నట్లు తెలిపారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్, మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిర్ధారిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.300 కోట్లతో కలికిరిలో భవనాల నిర్మాణం కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి రూ.300 కోట్ల వ్యయంతో ఆధునాతన భవనాలు పూర్తి అయినట్లు వీసీ సర్కార్ తెలిపారు. ఈ భవనాలను డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ అనంతపురంలో ఆడిటోరియం ఆధునీకరణకు రూ. 1.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డిసెంబర్లో నిర్వహించే స్నాతకోత్సవాలకు ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి చేస్తామన్నారు. తొలి విడతగా 200 కిలో వాట్ల సోలార్ విద్యుదుత్పతిక్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఆదాకు ఎల్ఈడీ బల్బులు వినియోగించనున్న నేపథ్యంలో వీటి సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామన్నారు. రూ.72 కోట్ల వ్యయంతో నాలుగు భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల మెరుగుకు కషి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపిక కావడానికి తగిన కషి చేస్తున్నామన్నారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలో 85 శాతం నుంచి 90 శాతం క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపికవుతున్నారన్నారు. అనుబంధ కళాశాలల్లో 20 శాతం నమోదవుతోందన్నారు. గతేడాది 170 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్డీ అవార్డులు ఇచ్చామన్నారు. పరీక్షల విభాగంలో ఆన్లైన్ ప్రక్రియ విధానం ప్రవేశపెట్టామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో నూతనంగా వీఎల్ఎస్ఐ, ఎంబీడెడ్ సిస్టమ్ , కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ , అడ్వాన్స్డ్ మ్యాన్ఫ్యాక్చురింగ్ సిస్టమ్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. -
అమితాబ్..అరడజను శత్రువులు
అమితాబ్ బచ్చన్ హీరోగా ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ తీసిన రామ్గోపాల్ వర్మ ఆ సినిమాలకు కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ‘సర్కార్ 3’. తనకెంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో ‘సర్కార్’ ఫ్రాంచైజీలో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు వర్మ. అమితాబ్ నటించిన సుభాష్ నాగరే పాత్రను శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే తరహాలో ప్రజెంట్ చేశారు. మూడో చిత్రంలోనూ ఆయన సుభాష్ నాగరేగా కనిపించనున్నారు. ఇక అమితాబ్ కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యా రాయ్లు ‘సర్కార్ 3’లో నటించడం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ముఖ్యమైన నటీనటుల ఫస్ట్ లుక్స్ను వర్మ విడుదల చేశారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో మెయిన్ విలన్గా నటిస్తున్నారు. చిత్రంలో ఆయన్ను అందరూ ‘సర్’ అని సంభోదిస్తారట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్, మహేశ్బాబులకు నానమ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ చిత్రంలో రక్కుబై దేవిగా విలనిజం చూపించనున్నారు. గోరక్ రాంపూర్గా రెండు పార్శ్వాలున్న పాత్రలో భరత్ దభోల్కర్... తన తండ్రి చావుకి కారణమైన సుభాష్ నాగరేపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూసే పాత్రలో హీరోయిన్ యామీ గౌతమ్.. సుభాష్ నాగరే అనుచరుడిగా రోనిత్ రాయ్ నటిస్తున్నారని వర్మ తెలిపారు. అత్యంత క్రూరుడైన శివాజీ అలియాస్ చీకు పాత్రలో యువ నటుడు అమిత్ సాద్ కనిపించనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరహా పాత్రను మనోజ్ బాజ్పాయ్ చేయనున్నారు. ‘‘కాకపోతే.. ఇది కాస్త వయొలెంట్ వెర్షన్’’ అన్నారు వర్మ. ‘‘మనోజ్ అద్భుతమైన నటుడే కానీ అరవింద్ కేజ్రీవాల్ కంటే నటనలో చాలా చిన్నోడు’’ అని వర్మ వ్యాఖ్యానించడం కొసమెరుపు. రోనిత్ రాయ్ మినహా వర్మ పరిచయం చేసిన మిగతా ఆరు పాత్రలూ ప్రతినాయక ఛాయలున్నవి కావడం గమనార్హం. సో.. ఇందులో అమితాబ్కు మొత్తం అరడజను మంది విలన్లు ఉంటారన్నమాట. -
'సర్కార్ 3' మూవీ స్టిల్స్
-
నగరవాసుల సమస్యలకు సర్కార్దే బాధ్యత
-
కాంట్రాక్టు నర్సుల ఆకలి కేకలు!
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు నర్సుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా ఆరు నెలల నుంచి జీతాల కోసం అర్రులు చాస్తున్నారు. సర్కారు కనికరించకపోవడంతో పూట గడవడానికి అప్పులు చేసుకుని విధి నిర్వహణ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగమే అయినా నెల నెలా జీతం వస్తుందన్న ఆశతో ఈ కొలువుల్లో చేరారు. అప్పట్నుంచి ప్రభుత్వం వీరితో సేవలు వినియోగించుకోవడమే తప్ప జీతాల ఊసెత్తడం లేదు. ఫలితంగా పిల్లా పాపలతో కొందరు, తల్లిదండ్రులతో మరికొందరు ఊరు గాని ఊరొచ్చి మహానగరంలో నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి పట్టదు! నెలనెలా వచ్చే జీతం నాలుగు రోజులు లేటయితేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది ఐదారు నెలలు రాకపోతే ఎలా బతుకుతారు? ఈ ఆలోచనే ప్రభుత్వానికి రావడం లేదు. గత మార్చిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి నర్సు ఖాళీలను భర్తీ చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల జీతంగా నిర్ణయించింది. ఇలా విశాఖలో 205 నర్సులు నియమితులయ్యారు. వీరిలో కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 160, విక్టోరియా గవర్నమెంట్ ఆస్పత్రి (ఘోషా), 25, ప్రభుత్వ మానసిక వైద్యశాల (మెంటల్ ఆస్పత్రి)లో 20 మంది వరకు విధులు నిర్వíß స్తున్నారు. తొలి నెల జీతం రాకపోవడంతో వచ్చే నెలలో వస్తుందని సరిపెట్టుకున్నారు. ఆ మరుసటి నెలలోనూ అలాగే సర్దుబాటు చేసుకున్నారు. ఇలా నెలలు గడుస్తున్నా జీతాలు రావడం లేదు. తమ పై అధికారులను అడుగుతున్నా వారి వద్దా సమాధానం లేదు. ఇప్పటిదాకా విశాఖలో కాంట్రాక్టు నర్సులకు రూ.2 కోట్ల వరకు జీతాల బకాయి రావలసి ఉంది. ఎన్ని అవస్థలో... విశాఖలాంటి మహానగరంలో అరకొర జీతాలతో బతుకులీడ్చడమంటే మాటలు కాదు. నర్సులు గా చేరిన వారిలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు అవివాహితులు, మరికొందరు వివాహితలు.. పెళ్లి కాని అమ్మాయిలకు రక్షణగా తల్లిదండ్రులో లేక ఆత్మీయ బంధువులో వెంట వచ్చి నగరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. పెళ్లయిన వారయితే భర్త, పిల్లలతో తరలి వచ్చి కాపురం ఉంటున్నారు. ఐదారు నెలలుగా వీరికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. పుట్టిన చోట వడ్డీకి అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. అసలే పిల్లల చదువులకు పెట్టుబడులు పెట్టే సమయం కావడంతో వీరి అవస్థలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే అసలు, వడ్డీలు తడిసి మోపెడయి కూర్చున్నాయి. అసలే కాంట్రాక్టు ఉద్యోగాలు.. జీతాల కోసం గట్టిగా గొంతెత్తితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయోనన్న భయం వీరిని వెంటాడుతోంది. ‘వీరి పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలపై ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాం. జీతాలు చెల్లింపుపై డీఎంఈకి మరోసారి లేఖ రాస్తాం.’ అని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపుతున్నారు. ఇలావుండగా సంబంధిత సూపరింటెండెంట్లు మార్చి, ఏప్రిల్ నెలల జీతాలైనా ఇచ్చేందుకు అనుమతించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ను కోరారు. అనంతరం వాటిని ట్రెజరీకి పంపారు. కొన్నాళ్లుగా అవి రకరకాల కొర్రీలతో మోక్షానికి నోచ లేదు. ప్రస్తుతానికి మార్చి, ఏప్రిల్ జీతాలు చెల్లిస్తే.. త్వరలో మొదటి, రెండో క్వార్టర్ల వేతనాలు చెల్లింపులకు మార్గం సుగమమవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద తమ జీతాల కోసం ఈ కాంట్రాక్టు నర్సులు రోజులు లెక్కపెడుతున్నారు.