Shekhar Gupta
-
మైనారిటీలు మారారు.. గుర్తించారా?
కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఢిల్లీలోని ధార్యాగంజ్లో కారు తగులబడుతోంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో లాగా భారతీయ ముస్లింలలో కలుగుతున్న గణనీయ మార్పును ప్రతిబింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లింలు పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఢిల్లీలోని జామా మసీదులో గుమికూడిన ముస్లింలు తాము మొదట భారతీయులం అని ప్రకటించడం ద్వారా, మెజారిటీ వర్గంలో ఉన్నందున మన రిపబ్లిక్ పునాదిని మార్చివేయగలమని అనుకుంటున్న వారి భావనను పూర్తిగా తోసిపుచ్చేశారు. అదేసమయంలో భారత రిపబ్లిక్ తన సెలబ్రిటీ రచయిత–కార్యకర్త అయిన అరుంధతీరాయ్కు ఎంతగానో రుణపడి ఉంది. ఆమె ఒంటిచేత్తోనే భారతదేశాన్ని మావోయిస్టు సాయుధ తిరుగుబాటుదారుల నుంచి కాపాడారు. మన మావోయిస్టులు ‘తుపాకులు ధరించిన గాంధేయవాదులు’ (‘గాంధియన్స్ విత్ గన్స్’) అని వర్ణించడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె చేసింది సర్వకాలాల్లోనూ అతి గొప్పగా కోట్ చేయదగిన ఉల్లేఖన. అణిచివేతకు గురవుతున్నవారిగా మావోయిస్టుల మీద అంతవరకు ఉన్న కాస్తంత సానుభూతిని కూడా రాయ్ వ్యాఖ్య సమాధి చేసేసింది. ఏకకాలంలో మీరు గాంధేయవాదిగా, మావోయిస్టుగా ఉండలేరు. బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద కూర్చుని నేను ఈ వ్యాసం రాస్తూ, జామా మసీదుకు చెందిన 17వ శతాబ్ది నాటి మెట్లమీదుగా వేలాది ముస్లింలు నడుచుకుంటూ పోయిన ఘటనను ఆమె ఎలా వర్ణించి ఉంటారు అని నేను ఆశ్చర్యపోయాను. వీళ్లు ముస్లింలు. ముస్లింలలాగా దుస్తులు ధరించినవారు. ప్రజలు ధరించే దుస్తులు వారి ఉద్దేశాలను తెలుపుతాయని ప్రధానమంత్రి ఇప్పుడే సూచిం చినందున దీన్ని మనం నొక్కి చెబుతున్నాం. ఈ ముస్లింలు మువ్వన్నెల జెండా, రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్తరువులను ధరించి వచ్చారు. కొంతమంది గాంధీ బొమ్మలను పట్టుకున్నారు. వీటితోపాటు జనగణమన, హిందూస్తాన్ జిందాబాద్లను వల్లిస్తూ పోయారు. భారత రిపబ్లిక్కి చెందిన అతి పెద్ద మైనారిటీ (ప్రతి ఏడుమంది భారతీయులలో ఒకరు) తమ పవిత్ర మసీదు మెట్లు దిగుతూ తాము ముందుగా భారతీయులమని, భారత రాజ్యాంగంపై, జెండాపై, జాతీయ గీతంపై తమకు విశ్వాసముందని, జనాభా పరమైన మెజారిటీ కారణంగా రిపబ్లిక్ పునాదినే మార్చివేయవచ్చనే భావనను వ్యతిరేకిస్తున్నామని ప్రకటిస్తే ఏం జరుగుతుంది? భారతీయ దేశభక్తికి తామే వారసులమంటూ దేశంలోని మెజారిటీ జనాభా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన ప్రకటనను ముస్లింలు తొలిసారిగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దేశంలో నివసించడానికే ఇక్కడున్నాం అంటూ వారు నినదించారు. వీళ్లతో ఇక ఎవరూ పోరాడలేరు. ఎలాంటి సమర్థనా లేకుండా వీరిపై ఎవరూ ఇక తుపాకులు గురిపెట్టి కాల్చలేరు. మన దేశం మారింది. లేక ‘మన దేశం ఇప్పుడు మారిపోతోంది మిత్రులారా’ అనే వాక్యాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అలాగే పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌర పట్టికకు మధ్య పౌరులకు శరణార్థులకు మధ్య ఉన్న సూక్ష్మభేదాన్ని వివరించడం ద్వారా మీరు వారికి ఇక నచ్చచెప్పలేరు. ఇప్పటికే 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశారు. రెండు లక్ష్యాలను సాధించడానికి మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఒకటి, జాతీయ పౌర పట్టికలో దొరికిపోయే బెంగాలీ హిందువులను పునస్సమీక్షించి కాపాడటం, అదే సమయంలో బెంగాలీ ముస్లింలను బహిష్కరించడం. రెండు, రాష్ట్రంలోనూ దీన్నే పునరావృతం చేస్తామని హామీ ఇచ్చి పశ్చిమబెంగాల్ లోని బెంగాలీ హిందువులను ఆకట్టుకోవడం. అస్సాంలో మంటలు రేకెత్తించడానికి, పశ్చిమబెంగాల్లో మంటలు చల్లార్చడానికి చేసిన ప్రయత్నంలో మీరు ఇప్పుడు ఢిల్లీలో మంటలు రేపారు. టోపీలు, బుర్ఖాలు, హిజబ్, ఆకుపచ్చ రంగు అనేవి ముస్లింలను గుర్తు చేసే అత్యంత స్పష్టమైన మూస గుర్తులు. అలాగే వారి మతపరమైన ప్రార్థనలు కూడా. ఒక స్నేహితుడికి పోలీసు లాఠీలకు మధ్యలో దూరి అతగాడిని కాపాడి దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టి నాకర్షించిన ఇద్దరు యువతుల ఫోటోను ఫేస్ బుక్లో చూసినప్పుడు, ఆ యువతులు జాతీయవాదం లేక లౌకికవాదం పట్ల ఎలాంటి నిబద్ధత లేని, సంప్రదాయ ఇస్లాం మతంతో మాత్రమే ప్రభావితమయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఏకే 47లు, ఆర్డీఎక్స్లు ధరించిన ముజాహిదీన్, లష్కర్, అల్ ఖాయిదా, ఐసిస్ వంటి సంస్థలకు ప్రాతినిధ్యం వహిం చిన అనేకమంది ఆగ్రహోదగ్రులైన ముస్లింలకు చెందిన బలమైన సంకేతాలను కూడా మనం చూడవచ్చు. ఈ తరహా ముస్లింలతో సులభంగా పోరాడి ఓడించవచ్చు. కానీ భారతీయ ముస్లింలు నిజంగా నిరాశా నిస్పృహలకు గురై ఉగ్రవాదాన్ని చేపట్టి ఉంటే ఏమయ్యేది? సిమీ నుంచి ఇండియన్ ముజాహిదీన్ల వరకు అతి చిన్న ఉగ్ర బృందాలు దీన్ని నిర్ధారించాయి కూడా. అత్యంత ఉదారవాదిగా పేరొందిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సైతం 2009 ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టులతో నిండిన సభలో మాట్లాడుతూ, ఇదేవిషయాన్ని నొక్కి చెప్పారు. ముస్లింలకు ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపించే వారెవరైనా సరే, భారతీయ ముస్లింలలో ఒక శాతం (ఇప్పుడు వారి సంఖ్య 20 కోట్లు) మందైనా భారత్లో తమకు ఇక భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని ఉంటే దేశాన్ని పాలించడం ఎవరికైనా కష్టమయ్యేదని సింగ్ ఆ సభలో చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఏలిన దశాబ్దంలో ఇదీ పరిస్థితి. భారతీయ ముస్లింలు అపమార్గం పట్టకుండా దేశం వారిపట్ల ఔదార్యాన్ని ప్రదర్శించింది. కొంతమంది యువ ముస్లింలు ఉగ్రవాద బాట పట్టారు. కానీ నేడు ఎన్డీఏ ప్రభుత్వం లాగే నాడు యూపీఏ ప్రభుత్వం కూడా వారిపట్ల కఠినంగానే వ్యవహరించింది. ఈ వాస్తవాలపై అనేక భాష్యాలు ఉండవచ్చు. కానీ అంతిమ నిర్ధారణ మాత్రం ఒకటే. ఒక పక్షం మాత్రం ముస్లింలకు క్షమాపణ చెబుతూనే వారు జాతి వ్యతిరేకులుగా మారకుండా వారికి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుకునేది. మరో పక్షం మాత్రం ఇప్పుడు కంటికి కన్ను సమాధానం అంటూ రెచ్చిపోతోంది. అలాగే మెజారిటీ వర్గం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రతరం చేయాలని కోరుకుంటోంది. అటు రాజకీయపక్షం ఇటు మెజారిటీ వర్గం ఇద్దరూ ముస్లింలను అనుమాన దృష్టితో చూడటంపై ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఇక భారతీయ ముస్లింల గురించిన ప్రతికూల దృక్పథం ఏదంటే వారి మతాధిపతులే. జామా మసీదు బుఖారీలు, మదానీలు, కమాండో కామిక్ చానల్స్లో కనబడుతూ ఫత్వాలు జారీ చేస్తూ బవిరిగడ్డాలతో కనిపించే ముస్లిం మతగురువులను మెజారిటీ వర్గ ప్రజలు ప్రతికూల భావంతో చూస్తున్నారు. ముస్లింల పట్ల ఈ ప్రతికూల భావనలలో చాలావాటిని నేడు సవాలు చేస్తున్నారు. జనగణమన, జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీ బొమ్మలు, హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు.. ఇలా ముస్లింలను పట్టిచ్చే సంప్రదాయ సంకేతాలు మారుతున్నాయి కానీ దుస్తులు మాత్రమే మారలేదు. నాగరికతల మధ్య ఘర్షణ సూత్రం వెలుగులో భారతీయ ముస్లింలను అంచనా వేసేవారు ఘోరతప్పిదం చేస్తున్నట్లే లెక్క. 1947లో భారత్లోని మెజారిటీ ముస్లింలు జిన్నాతోపాటు నడిచి తమ కొత్త దేశం పాక్ వెళ్లిపోయారు. కానీ జిన్నా తర్వాత గత 72 ఏళ్లలో వారు తమ దేశాధినేతగా ముస్లింను ఎన్నటికీ విశ్వసించలేదు. వారు ఎల్లవేళలా ముస్లిమేతర నేతనే విశ్వసిస్తూ వచ్చారు. దీనర్థమేమిటి? కల్లోలం పుట్టుకొచ్చిన ప్రతిసారీ దేశం తగులబడుతూనే ఉంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో హింసాత్మక శక్తులను చూస్తున్నాం. పశ్చిమబెంగాల్లో ఒక నిప్పురవ్వ దావానలమై మంటలు రేపుతోంది. కానీ వీటిలో ఏ ఒక్కటీ ఢిల్లీలో సంకేతాలు వెలువరించినట్లుగా భారతీయ ముస్లిం లలో గణనీయ మార్పును ప్రతి బింబించలేకపోయాయి. ఢిల్లీలో ఒక నూతన భారతీయ ముస్లిం పెరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముస్లింను చూసి ఇక భయపడనవసరం లేదు. వారి జాతీయతను ప్రశంసించడానికి ఇక సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకను, జాతీయ గీతాన్ని ఎత్తిపడుతూ.. అంబేడ్కర్, గాంధీలను గౌరవిస్తూ, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్న నూతన తరహా ముస్లింలు వీరు. ఇప్పుడు మనం సుప్రసిద్ధ ఉర్దూ కవి రహత్ ఇందోరి రాసిన అమర వాక్యాలను ఈ భయానకమైన కాలంలో తరచుగా ఉల్లేఖిస్తున్నాం. ఆ కవితా పాదాల అర్థం ఏమిటి? ‘‘ఈ నేలపై ప్రతి ఒక్కరూ తమవంతు రక్తం ధారపోశారు. భారత్పై ఓ ఒక్కరూ తమ ప్రత్యేక హక్కును ప్రకటించలేరు’’. జాతిలో కలుగుతున్న ఈ మార్పును చూసి రహత్ ఇందూరి తప్పకుండా చిరునవ్వులు చిందిస్తుంటారు మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కమలం ఓడినా.. హిందుత్వదే గెలుపు
ఇందిరతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రాభవం లోక్సభ ఎన్నికలకే పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అనేక రాష్టాల్లో గత రెండేళ్లలో బీజేపీ ప్రభావం 71 నుంచి 41 శాతానికి పడిపోయింది. అయినా సరే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ప్రాతిపదికన బీజేపీ దేశవ్యాప్తంగా తన ప్రభావం చూపుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో సమాఖ్యతత్వం నిజమైన అర్థంలో అమలువుతున్నట్లు ప్రస్తుతం కనిపిస్తున్నా హిందుత్వకు జాతీయ స్థాయిలో సమర్థన లభిస్తోంది. ఆరెస్సెస్/బీజేపీల గుత్త హక్కుగా కనిపించిన ఆర్టికల్ 370, రామాలయ వివాదం, ఉమ్మడి పౌరస్మృతి వంటివాటిపట్ల దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం సాధ్యమవుతోంది. ఇది భావజాలపరంగా ఆరెస్సెస్ విజయమే. అందుకే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పుట్టి మునుగుతున్నా, హిందుత్వ మాత్రం నేటికీ గెలుస్తూనే ఉంది. అటు నిరాశావాదం.. ఇటు ఆశావాదం.. అనే పాత సామెత ప్రకారం, 2017 నుంచి ఇప్పటిదాకా భారత రాజకీయ పటంలో కాషాయ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోందని గ్రాఫిక్స్ ఆధారిత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి ప్రకారం గత రెండేళ్లలో భారతీయ రాష్ట్రాలలో బీజేపీ పాలన 71 నుంచి 40 శాతానికి పడిపోయింది. కాషాయపార్టీ ప్రజాదరణ శిఖరస్థాయికి చేరిందని, నరేంద్రమోదీ ఆధిపత్యం తిరుగులేనిదని అందరూ భావిస్తున్న సమయంలోనే బీజేపీ పరిస్థితి ఇలా దిగజారిపోవడం గమనార్హం. అయితే ఇది నిరాశావాదం దృక్పథానికి సంబంధించింది. ఆశావాద దృక్పథంతో చూసినట్లయితే ఈ సంవత్సరం మే నెలలో లోక్సభ ఎన్నికల తర్వాత చూస్తే బీజేపీ ఒక బలమైన రాజకీయ వాస్తవంగా కనిపిస్తుంది. తూర్పున హిందీ ప్రాబల్య ప్రాంతం నుంచీ ఈశాన్య భారత్లోని చాలా ప్రాంతాల్లో, పశ్చిమ తీర ప్రాంతాల్లో బీజేపీ పాలన అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికిప్పుడు తాజాగా ఎన్నికలు జరిగినా 2019 మేలో వెల్లడయిన ఫలితాలకు భిన్నంగా రాకపోవచ్చు. మరి మోదీ విమర్శకులు ఇప్పుడెందుకు పండుగ చేసుకుంటున్నట్లో? అయితే, రాజకీయ వాస్తవం సంక్లిష్టమైంది. కాషాయ పార్టీకి చెందిన అనేక ఛాయలను ఇది ప్రతిబింబిస్తుంది. వీటిలో కొన్నింటిని చూద్దాం. నరేంద్రమోదీ ఎంత మహామూర్తిమత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఇందిరాగాంధీ కాదు. ఇందిర శకం నుంచి భారతీయ వోటర్ పరిణితి చెందుతూ వచ్చాడు. లోక్సభ, విధాన సభకు మధ్య వోటింగ్ ఎంపికల గురించి ఆమె స్పష్టమైన వ్యత్యాసాన్ని ప్రదర్శించేవారు. ఇందిరాగాంధీకిలాగే మోదీ కూడా లోక్సభ ఎన్నికల సందర్భంలో అనామకుడికి సీటు ఇచ్చినా గెలిపించుకునే స్థితిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. కానీ ఇందిరాగాంధీకి మల్లే రాష్ట్లాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు మోదీ ఈ మ్యాజిక్ను పునరావృతం చేయలేరు. దీనికి స్పష్టమైన ఉదాహరణగా మహారాష్ట్రను చూపవచ్చు. అలాగే హరియాణా కూడా. లోక్సభ ఎన్నికలు ముగి సిన అయిదు నెలలలోపే ఈ రాష్ట్రంలో బీజేపీ ఓటు దాదాపు 22 శాతం పాయింట్లను పోగొట్టుకుంది. అంటే 58 నుంచి 36 శాతానికి పడిపోయింది. హరియాణాలో విజయదుందుభిని మోగిస్తామని పార్టీ పూర్తిగా అంచనా వేసుకున్న చోట మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయింది. ఆర్టికల్ 370ని రద్దుచేసిన 11 వారాల్లోపు బీజేపీకి హరియాణాలో ఇంత గట్టిదెబ్బ తగిలింది. 2014లో ఘనవిజయం సాధించిన తర్వాత కూడా మోదీ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో గెలుపు సాధించలేదు. 2017లో ఉత్తరప్రదేశ్, హరి యాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం వంటి కొన్ని చిన్న రాష్ట్రాలు దీనికి మినహాయింపు. ఇక్కడ కూడా 2015లో ఢిల్లీలో ఘోర పరాజయం చవిచూశారు. తర్వాత పంజాబ్లోను అదే జరి గింది. ఇక 2017లో ఘనవిజయం తప్పదని భావించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీస విజయం వద్దే ఆగిపోయారు. దానికి సైతం మోదీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, బళ్లారి బ్రదర్స్తో అసాధారణ స్థాయిలో రాజీలు కుదుర్చుకున్నప్పటికీ బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించలేకపోయింది. తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్ర్లాల్లో ఏకంగా ఓటమినే చవిచూసింది. ఇప్పుడు ఈ సంఖ్యలను కాస్త తిరగేయండి. పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపి అధికారం కోల్పోయింది లేక నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైంది. అయితే ఇదే రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఇక ఢిల్లీలో, రాజస్తాన్లో, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో ఆప్, కాంగ్రస్ చేతుల్లో ఓడిపోయింది. ఈ ఫలితాలను మదింపు చేస్తే, ఒకేపార్టీ ఆధిపత్యం రాజ్యమేలిన ఇందిరాగాంధీ శకంలోలాగా కాకుండా, నేడు భారత్ మరింత ఎక్కువగా సమాఖ్య దేశంగా పరిణమించింది. లోక్సభ, శాసససభల ఎన్నికల్లో ఓటరు పూర్తి వ్యత్యాసం ప్రదర్శించినట్లయితే, బీజేపీ పట్ల శత్రుభావం కలిగి ఉండని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమ పట్టు సాధించుకున్నాయి. నవీన్ పట్నాయక్, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బహుశా డీఎంకే కూడా ఈ కోవకు చెందుతారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి ప్రత్యర్థులకు సంతోషం కలిగించింది. లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ఘర్షణ పడిన మమతా ఆరునెలల్లోపే ఈవారంలో జరిగిన మూడు ఉపఎన్నికల్లో విజయ కేతనం ఎగరేశారు. మరీ రెండు స్థానాల్లో అఖండ విజయం సాధించారు. ఇక్కడ కూడా ఓటర్ ప్రదర్శించిన వ్యత్యాసం కనబడుతుంది. ఇక నవ్వులు చిందిస్తున్న మూడో రకం ప్రాంతీయ నేత నితీశ్ కుమార్. ఈయన స్వయానా బీజేపీ భాగస్వామి. బిహార్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక అసోంలో జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకత తెలుపుతున్న ప్రపుల్ల కుమార్ మహంతా తన స్థానాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ చేతిలో 17 రాష్ట్రాలు ఉంటున్నప్పటికీ దీన్ని అర్ధసత్యంగానే చెప్పాలి. వీటిలో బిహార్, హరియాణాల్లో కాషాయపార్టీకి పూర్తి భిన్నమైన సైద్ధాంతిక దృక్పథం ఉన్న మిత్రపక్షాలతో బీజేపీ భాగస్వామ్యం పంచుకుంది. ఇక మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు ఎల్లప్పుడూ రాజకీయ బేరసారాలకు లోనై స్థానాలు మార్చుకుంటుంటాయి. సిక్కిం, మిజోరంలు ఎన్డీయేలో ఉంటున్నాయి తప్పితే అవి బీజేపీ పాలనలో లేవు. మరోవైపున బీజేపి ఇంతవరకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక అనే మూడు ప్రధాన రాష్ట్రాల్లోను మాత్రమే తన చేతిలో పెట్టుకుని ఉంది. చివరిదైన కర్ణాటకలో అస్థిరత్వమే కొనసాగుతోంది. మోదీ–షా వైభవం ప్రభవిస్తున్నందున, బీజేపీ ఒకే ఒక సులభమైన ఫార్ములాను అనుసరించింది. హిందూ ప్రాబల్య ప్రాంతాన్ని, రెండు పశ్చిమ భారత రాష్ట్రాలను చుట్టేయడం. వీటిలో కీలక విజయం ద్వారా మాత్రమే బీజేపీ ఇతరప్రాంతాల్లో చిన్నా చితకా విజ యాలు సాధిస్తూ భారతదేశాన్ని ఏలుతోంది. రాష్ట్రాల్లో ఇది ప్రతిఫలించకపోతే మీరు తప్పకుండా సమానత్వానికి కట్టుబడి ఉండవచ్చు. దీనర్థం ఏమిటంటే, రాష్ట్రాల సీఎంలతో బీజేపీ చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మమతా వంటి ముఖ్యమంత్రులయితే మీరు ప్రవేశపెట్టే ఆయుష్మాన్ భారత్ వంటి మంచి, భారీ ప్రణాళికలను ముందుకు తీసుకుపోవడానికి కూడా తిరస్కరించవచ్చు. ఇలాంటివారు మీ ఆదేశాలకు ఇకపై తలొగ్గరు. మీరు వారిపట్ల గౌరవం ప్రదర్శించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వారిని సమానులుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాని పదే పదే చెబుతున్న సహకారాత్మక సమాఖ్య తత్వం అనేది ఇక మాటలలో కాక చేతల్లో చూపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రను తీసుకోండి. ఎన్సీపీ, కాంగ్రెస్లు శివసేనతో ఎందుకు కలిశాయి. తొలి రెండు పార్టీలు అక్కడ ఉనికి, అధికారాలకోసం పోట్లాడుతున్నాయి. కానీ శివసేన ఎందుకు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు? సైద్ధాంతికంగా తమకు పట్టున్న చోట బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. ఏకైక పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా శివసేన నేరుగా ప్రదర్శించిన స్వీయరక్షణా ప్రతిస్పందనగానే దీన్ని చూడాలి. భావసారూప్యం కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇక కేంద్ర–రాష్ట్రాల సమీకరణాలు 1989–2014కి సంబంధించి 25 సంవత్సరాల చరిత్రకు మళ్లీ దగ్గరవుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో వస్తున్న సవ్వడి ప్రత్యేకమైనది. ప్రధాని మానస పుత్రిక అయిన బుల్లెట్ రైలును వీరు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఆర్టికల్ 370, అయోధ్య ఆలయ సమస్యవంటివి భారత రాజకీయాలనే విడదీస్తూ బీజేపీ/ఆరెస్సెస్కు అనుకూలతను సృష్టిం చేవి. కానీ ఇప్పుడు కశ్మీర్, రామాలయం, ఉమ్మడి పౌరస్మృతి వంటివి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం కూడా శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయలేకపోతోంది. రాహుల్ గాంధీ తరచుగా ఆలయాలను సందర్శిస్తూ, తన బ్రాహ్మణ గోత్రాన్ని చెప్పుకోవలసి వస్తోంది. భారత రాజకీయ చిత్రపటంపై ఎలాంటి రాజకీయ క్రీనీడలు కనిపిస్తున్నప్పటికీ, ఆరెస్సెస్/బీజేపీ భావాలకు సంబంధించినంతవరకు అది కాషాయ రంగును పులుముకుంది. ఆరెస్సెస్ కానీ, బీజేపీ కానీ ఇప్పుడు సులభంగా విజయాన్ని ప్రకటించవచ్చు. హెగ్డేవార్, గోల్వాల్కర్, సావర్కార్ వంటివారు దీనికి అంగీకరిస్తారు కూడా. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
లౌకిక కూటమి ‘శివ’సాయుజ్యం
సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని గతంలో అడ్వాణీ ఆరోపించారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. స్వాతంత్య్రానంతర చరిత్రలో.. శివసేన వంటి పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుగా భావించిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా కలవడానికి ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు? రాజకీయాల్లో కానీ, యుద్ధంలో కానీ అతి ప్రాచీన సూత్రం ఏమిటంటే, శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే. అందులోనూ కనీసం పోరాడేందుకు కూడా వీల్లేని స్థితిలో మిమ్మల్ని చరిత్ర పక్కకు తోసేసినప్పుడు ఇక మీరేం చేస్తారు? అలాంటప్పుడు సాంప్రదాయిక సూత్రాలు ఎంతమాత్రం సరిపోవు. ఒకసారి మీరు నిస్పృహలో కూరుకుపోయాక ఆ సూత్రాలను వెనక్కు తిప్పడానికి కూడా మీరు ప్రయత్నిస్తారు. శత్రువుకు మిత్రుడు మీకు మాత్రం మిత్రుడు కాదా? వారి సంబంధంలో కాస్తంత చీలిక కనిపిస్తున్నా సరే.. దాన్ని అతి చిన్న పదునైన గొడ్డలితో ఎందుకు చీల్చివేయకూడదు? మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే గేమ్ను ఆడుతున్నాయి. ఈ కథనం రాసే సమయానికి వారి మధ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. కానీ భారత రాజకీయాల్లో ఎంత మార్పు చోటు చేసుకుంటోందో గ్రహించడానికి శివసేనతో కలిసి తాము అధికారం పంచుకోవడానికి సుముఖంగా ఉన్నామని వారు ప్రకటించిన వాస్తవం చాలు.. దశాబ్దాలుగా లౌకిక కూటమికి కట్టుబడి ఉన్న ఈ రెండు పార్టీలూ మితవాద హిందుత్వ, మతతత్వ పార్టీగా ఇంతకాలం తాము ఖండిస్తూ వచ్చిన పార్టీతో సంప్రదింపులకు సిద్ధమవుతున్నాయి. ఇది తన భావజాలపరమైన లక్ష్మణరేఖను దాటుతున్న భారత ప్రధాన లౌకిక సమ్మేళనంకి స్పష్టమైన సంకేతం మరి. శరద్ పవార్ ఇన్నేళ్లుగా బీజేపీ, శివసేనలతో పోరాడుతూనే వచ్చారు. ఈ రెండు పార్టీలు ఆయన్ను దొంగ అనీ వక్రరాజకీయవేత్త అని నిత్యం పిలుస్తూ వచ్చేవి. పైగా ఈ దఫా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్ ఒక కుంభకోణంలో శరద్ పవార్ పేరును ఇరికించింది కూడా. అయితే ఇదే మోదీ ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇది భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అవార్డు. పవార్, థాక్రేలు కూడా కొన్ని సార్లు వాస్తవదృష్టితో కూడిన రాజకీయ సంబంధ బాంధవ్యాలను నెరుపుతూ వచ్చారు. మరోవైపున కాంగ్రెస్ ఆ మార్గంలో ఎన్నడూ నడవలేదు. కాంగ్రెస్ పట్ల బద్ధ విమర్శకులు దీంతో విభేదించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీతోనూ సంప్రదింపులు జరిపింది. అలాంటి ఒప్పందాల్ని స్థానిక పరిమితులతో, స్వల్ప స్థాయిలో, మరీ ముఖ్యంగా మైనారిటీ రాజకీయాలపై స్వారీ చేస్తున్న చిన్న బృందాలతో మాత్రమే కుదుర్చుకునేది. అయితే స్వాతంత్య్రానంతర చరి త్రలో.. పక్కా హిందుత్వ పార్టీని కాంగ్రెస్ కౌగలించుకోవడం ఇదే మొట్టమొదటిసారి. కాంగ్రెస్ రాజకీయాల సారాంశాన్ని ప్రత్యేకించి సోనియాగాంధీ నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన దాని రాజకీయాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే హిందుత్వ పార్టీలను అది తన ప్రధాన సైద్ధాంతిక శత్రువులుగా చూస్తూ వచ్చేది. తన రాజకీయాలను మొత్తంగా హిందుత్వ పార్టీలకు వ్యతిరేకంగానే నడుపుతూ వచ్చేది. 2003లో ఎన్డీటీవీ వాక్ ది టాక్ షోలో నాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో అడ్వాణీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సోనియా గాంధీ బీజేపీని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువులాగా పరిగణిస్తున్నారని అడ్వాణీ ఆరోపిం చారు. తన రాజకీయాలను ఇలా నిర్వచించుకున్న అదే పార్టీ, బీజేపీతో దాని పొత్తుదార్లతో పోరాడటం అనే లక్ష్యంలో భాగంగా ఎవరితోనైనా సరే పొత్తు పెట్టుకోవడానికి సుముఖత చూపుతోంది. శిరోమణి అకాలీ దళ్, శివసేన ఇంతవరకు బీజేపీ మిత్రపక్షాలు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సోనియా నేతృత్వంలో, కాంగ్రెస్ వామపక్షాలతో అనేకసార్లు పొత్తు కుదుర్చుకుంది. మతతత్వ శక్తులను అధికారం నుంచి దూరంగా పెట్టడానికి హెచ్.డి. దేవేగౌడ, ఐకే గుజ్రాల్ల యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వాలకు బయటినుంచి మద్దతివ్వడంతో ప్రారంభించి 2004 సార్వత్రిక ఎన్నికల ఫలితం తర్వాత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ)కు నాయకత్వం వహించి తన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. సంకీర్ణ యుగంలో, కాంగ్రెస్ పార్టీ ఒకటీ, రెండూ సందర్భాల్లో గతంలో బీజేపీతో పొత్తు కూడిన పార్టీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్న బీజేపీ మిత్రుల్లో మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు, నితీశ్ కుమార్ ఉన్నారు. అంతే కానీ హిందుత్వ పార్టీతో లేక అకాలీలతో కాంగ్రెస్ ఎన్నడూ పొత్తుకు సిద్ధం కాలేదు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం లేక పొటాను రద్దు చేయడానికి అంగీకరించడం ద్వారా మైనార్టీవాదాన్ని కూడా కౌంగ్రెస్ దగ్గరకుతీసుకుంది. తర్వాత ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిని పరిశీలించడానికి సచార్ కమిటీని కూడా కాంగ్రెస్ ఏర్పర్చింది. కాబట్టి ఇంత పెద్ద సైద్దాంతిక పెనుగంతు వేయడానికి ముందు కాంగ్రెస్ పార్టీ అనేక అంతర్మథనాలను సాగించింది. పైగా పార్టీలో వాస్తవికవాదంతో నడిచే పాతతరం రాజకీయనేతలకు వామపక్ష సైద్ధాంతిక భావాలు కలిగి ఉండి రాహుల్ గాంధీ చుట్టూ చేరిన యువ నాయకత్వానికి మధ్య జరిగిన వాదనలను కూడా మీరు చూడవచ్చు. మొదటగా కాంగ్రెస్ లోని వృద్ధ నాయకత్వం నేరుగా చెప్పడానికి సాహసించనప్పటికీ, రాహుల్ అనేకసార్లు విఫలమయ్యారని, తమ రాజకీయ కెరీర్లు ముగిసేలోపు తిరిగి కోలుకుంటామని కానీ, అధికారంలోకి వస్తామని కానీ ఏమాత్రం ఆశలేదని వారు భావిస్తున్నారు. రెండు, ఏదో ఒక సమయంలో సీబీఐ లేక ఈడీ కస్టడీలో తమ జీవితాలు కడతేరతాయని వారు భయపడుతున్నారు కూడా. మూడు, సాపేక్షికంగా జేఎన్యూ నుంచి దిగుమతవుతున్న రాడికల్ నాయకత్వంతో కూడిన కొత్త తరంలా కాకుండా పాతతరానికి తమ రాజకీయ చరిత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నేతృత్వంలో భారత రాజకీయాలు ఏకధ్రువంగా మారిపోవడంతో జనసంఘ్, సోషలిస్టు విమర్శకులు కూడా చాలాసార్లు ఒకటై కలిసిపోయారు. పైగా తమకు పూర్తిగా భిన్నమైన భావజాలం కలిగిన వామపక్షంతో ఉమ్మడి లక్ష్యంకోసం వీరు ఐక్యమయ్యారు. వీపీ సింగ్ హయాంలో బీజేపీ, వామపక్షాలు చేతులు కలపడాన్ని మన జీవితకాలాల్లోనే చూశాం. తర్వాత 2008లో, 2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక సమ్మేళనమైన యూపీఏ ప్రభుత్వాలను రెండు సార్లు ఓడించడానికి కూడా వీరు ప్రయత్నిం చారు. ప్రత్యేకించి భారత–అమెరికన్ అణు ఒప్పందం, మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఎఫ్డీఐలను అనుమతించిన సందర్భంలో ఇలాంటి ఐక్యత కొట్టొచ్చినట్లు కనబడింది. రెండు పరస్పర భిన్నమైన తీవ్ర భావజాలాలు కలిగిన బీజేపీ, వామపక్షం తమ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా కలవడానికి గతంలో ఏమాత్రం సందేహించనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని ఎందుకు చేయకూడదు? ఒకప్పుడు కాంగ్రెస్ భారత రాజకీయాలను ఏకధ్రువంగా మార్చింది. ఇప్పుడు బీజేపీ ఆ పని చేస్తోంది. మరి కాంగ్రెస్కు ఆ వెసలుబాటు ఎందుకు ఉండకూడదు? కాంగ్రెస్లోని వాస్తవికవాదులు అడుగుతున్నది దీన్నే మరి. కొన్నిసార్లు బోఫోర్స్ తరహా అవినీతిపై యుద్ధం చేయడానికి వామపక్షం, బీజేపీ కలిసి పోరాడాయి. లేక వారసత్వ రాజకీయాలను సాగనంపడానికి కలిసి పోరాడాయి. కొన్ని సందర్భాల్లో అమెరికా భూతాన్ని (అణు ఒప్పందం), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బంగాళాఖాతంలో కలిపివేయడానికి ఈ రెండు విరుద్ధ శక్తులు పొత్తు కలిపాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ దాన్నే ఎందుకు కొనసాగించకూడదు? ప్రత్యేకించి మహారాష్ట్రలో మోదీ, షాల బీజేపీని అధికారానికి దూరం పెట్టే అవకాశం పొంచి ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఎలా? లోక్సభలో 52 స్థానాలను, మహారాష్ట్రలో 44 అసెంబ్లీ స్థానాలను మాత్రమే చేజిక్కించుకున్న కాంగ్రెస్కు పోయేదేముంది. మహారాష్ట్రలో అతి తక్కువ కాలం పాటు తాను అధికారంలో ఉండి తర్వాత బీజేపీ గద్దెకెక్కినా సరే అదేమంత పెద్ద విషయం కాదు. ఏదోలా బీజేపీని తరిమేయాలి. పవార్ ఇలాంటి గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ ముందు పెట్టి ఉండకపోతే కాంగ్రెస్–శివసేనల మధ్య పొత్తు గురించి ఇంత హైరానా పడాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గడ్డిపోచ సాయం దొరికినా గట్టిగా పట్టుకోవలసిందే మరి. ఆ గడ్డిపోచ ముదురు కాషాయరంగు పార్టీ అయినా సరే దాన్ని కరుచుకోక తప్పదు మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ దూకుడే వర్తమాన వాస్తవమా?
1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా జరుపుకుంటున్నాం. మరొకచోట తమ జెండా కావాలంటున్న నాగాల డిమాండ్ను తోసిపుచ్చుతూనే వారి సాంస్కృతిక ఆకాంక్షలను జాతీయ పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. భారత్ నేడు ఆ స్థితికి చేరుకున్నదనే చెప్పాలి. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. భారత్ను ప్రపంచదేశాల దృష్టిలో బలోపేతం చేసిన ఈ అతిశయ జాతీయవాదాన్ని మరింతగా దృఢపరచాల్సిన అవసరం ఉంది. నెపోలియన్ బతికి ఉంటే సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నను సంధించి దాన్ని తిరిగి ఎలా వదిలేసి ఉంటాడు అనే అంశానికి సంబంధించి గూగుల్ మరింత వైవిధ్యపూరితమైన ఊహను నాకు చెబుతోంది. 1970ల నాటి ప్రామాణిక నాటకం వాటర్లూ లో నటించిన రాడ్ సై్టగర్ ఈ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఈ వారం నా మదిలో మెదులుతోంది. సింహాసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాడ్ చెప్పిన సింపుల్ సమాధానం ఇలా ఉంటుంది. అది ఫర్నిచర్కు చెల్లించిన అధికమొత్తం ధర మాత్రమే. 19వ శతాబ్దం మొదట్లో సింహాసనానికి ఇంకా ప్రాధాన్యత ఉండేది. అయితే ఆధునిక ప్రపంచంలో చాలాచోట్ల సింహాసనం ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు మన చైతన్యంలోంచి మరుగుపడిపోయిన జాతీయ రాజ్యం, సింహాసనాలు, కిరీటాలు, జాతీయ గీతాలు, జాతీయ పతాకాలు వంటి చిహ్నాలను నెపోలియన్ ఆలస్యంగానైనా సరే ఉపయోగించి అప్పట్లో జాతీయ స్ఫూర్తిని తిరిగి తీసుకొచ్చాడు. అయితే ఆ గత చరిత్రకు చెందిన చిహ్నాలు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదు. చాంపియన్షిప్ పోటీల సందర్భంగా మన క్రీడాకారులు జాతీయ చిహ్నాలకు చాలా ప్రాధాన్యమిస్తుం టారు. అయితే ఆధునిక జాతీయ రాజ్యం మరింత స్థిరంగా, సురక్షితంగా పాతుకుపోయింది కాబట్టి అలాంటి గత చిహ్నాలకున్న విలువ ఇప్పుడు ఒక పురాజ్ఞాపకంగా మాత్రమే కొనసాగుతోంది. కాలం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, చిహ్నాలు కూడా మారుతున్నాయి. జెండా అంటే ఏమిటి అనే అస్పష్టమైన ప్రశ్నకు ఇప్పటికీ మనం విలువ ఇస్తున్నందుకు కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చిరకాలం నుంచి కొనసాగుతున్న రక్తప్లావిత తీవ్రవాదం కొనసాగుతున్న నాగాలాండ్లో కొనసాగుతున్న శాంతి చర్చలు చివరికి ముగింపుకొస్తున్న తరుణంలో జెండా అంటే ఏమిటి అనే ప్రశ్నను తిరిగి వేసుకోవలసి వస్తోంది. తాము గతంలో భయంకరమైన తప్పులు చేశానని అటు భారత ప్రభుత్వం, ఇటు నాగాలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. హింస ఇంకా ఎంతోకాలం పనిచేయదని కూడా గ్రహించారు. అయితే నాగాలు తమ సొంత జెండాను ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ మోదీ ప్రభుత్వం దానికి ఇష్టపడటంలేదు. అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, సాంస్కృతిక, జాతిపరమైన సందర్భాల్లో మీరు మీ జెండాను పట్టుకోవచ్చని ప్రభుత్వం ఇప్పడు అంగీకరిస్తోంది. అలాగయితే తమ జెండాకు ఏ ఎన్జీవో అయినా పెట్టుకునే సాధారణ జెండా గుర్తింపు మాత్రమే ఉంటుందని నాగాలు వాదిస్తున్నారు. అత్యుత్తమ చర్చ ఏదంటే రెండు పక్షాలు అతి తక్కువ అసంతృప్తితో మాత్రమే చర్చల బల్లనుంచి వెళ్లిపోగలగడమే. చర్చల ఫలి తంలో తమకు ప్రాధాన్యత లేనప్పటికీ ఇరు పక్షాలూ తాము ఏదో ఒకటి సాధించామని చెప్పుకోవడం అని దీనర్థం. కానీ ముయ్వా నాగాలకు జెండాను గుర్తించకుండా సంధిపై సంతకం చేయడమంటే పెద్ద అవమానంగా కనిపిస్తోంది. ఇక మోదీ ప్రభుత్వం ముందు ఉన్న చాయిస్ కూడా కఠినంగానే ఉంది. ఈ అక్టోబర్ 31 గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ జెండాను దింపివేసి సర్దార్ పటేల్ జయంతి కూడా కలిసివస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ వేడుకలు జరుపుకుంది. భారతజాతీయ వాదం ఎన్నడూ లేనంత బలోపేతంగా మారిన నేపథ్యంలో కేవలం 30 లక్షల మంది ప్రజలను మాత్రమే కలిగి ఉన్న ఒక ఆదివాసీ రాజ్యం ముందు కేంద్రం ఎలా తలొగ్గి ఉంటుంది మరి? అయితే మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దివంగత ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంతో పోల్చడానికి కూడా వీల్లేదు. రాజ్యాంగ పరిధిలోనే చర్చలు కొనసాగాలని భారత్ పట్టుబడితే కశ్మీర్ వేర్పాటువాదులు ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించినప్పుడు వాజ్పేయి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చారు.. ‘మేం మానవత్వ పరామితులతో చర్చలు జరుపుకుంటాం’. కానీ మోదీ ప్రభుత్వం కాస్త కఠినవైఖరి వైపుకు మళ్లింది. పట్టువిడుపులు లేని దాని వైఖరికి మొరటు జాతీయవాదం కూడా కాస్త తోడైంది. అలాంటి జాతీయవాదం తన చిహ్నాల తొలగింపు పట్ల సుముఖత ప్రదర్శిం చదు. అందుకే ఒక రాష్ట్ర పతాకను దింపిపారవేసిన ఘటనకు గాను అది వేడుక చేసుకుంటోంది. సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ జాతీయ గీతాలాపనను నిలిపివేయడానికి దేశంలో ఏ సినిమా హాల్ కూడా ధైర్యం చేయడం లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్రదర్శించినప్పుడు లేచి నిలబడకుంటే అలాంటివారిని మూకుమ్మడిగా వేధిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే నూతన తరం భారతీయులు తాము ఒట్టి దేశభక్తులం మాత్రమే కామని జాతీయ వాదులం కూడా అని నిరూపించుకుంటున్నట్లుగా ఉంది. భారతదేశం మొత్తంగా ఒకే రాజ్యాంగం, ఒకే చిహ్నం, ఒకే నేత ఉండాలనే తన సైద్ధాంతిక వ్యవస్థాపకుల దార్శనికతకు బీజేపీ చాలా సమీపంగా వచ్చినట్లు కనిపిస్తోంది. మీరు కూడా నాలాగే 1960లలో పుట్టిన వారే అయితే, ఆ దశాబ్దంలోకి వెళ్లి చూసినట్లయితే భారత్ నేడు చేరుకున్న స్థితి అసాధ్యం అనే భావించేవారు. 1961–71 మధ్య పదేళ్లలో మనం నాలుగు పూర్తి యుద్ధాలను చవిచూశాం. గత అయిదు దశాబ్దాలలో దేశం అన్ని తీవ్రవాద ఉద్యమాలను, వేర్పాటు రాజకీయ ఉద్యమాలను అణిచిపెట్టగలిగే స్థితికి చేరుకోగలుగుతుందని మనం అప్పట్లో ఊహించి ఉండేవారమా? ఆ ప్రమాదకరమైన దశాబ్దంలో భారత్ నిలువునా చీలిపోగలదని అమెరికన్ స్కాలర్ సెలిజ్ హారిసన్ గతంలో అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి మేధావుల అభిప్రాయాలు తప్పని భారత్ నిరూపించింది. ఇవాళ చారిత్రకంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా, సైనికపరంగా, ఆర్థికపరంగా భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలబడింది. 2003 కాలానికి వెనక్కు వెళ్లి ఫోక్రాన్ అనంతరం భారత్ అనుసరించిన కఠిన దౌత్య పరిస్థితుల్లోకి వెళ్లి చూడండి. ఇక్కడే భారతీయ వ్యవస్థ మూలమలుపు తిరిగింది. తర్వాత 15 ఏళ్లలో భారత్ అత్యంత సురక్షిత స్థానంలో నిలిచేటట్టుగా పరిణతితో వ్యవహరించింది. ఈ క్రమాన్ని వెనక్కు తిప్పడం అంత సులభంకాదు. ఎవరినైనా పక్కకు నెట్టివేయగల శక్తి, ఏ భూభాగాన్నైనా ఆక్రమించుకునే బలం ఇప్పుడు భారత్కు ఉన్నాయి. ఈ భద్రతను భారతీయులమైన మనం అనుభవించడంతోపాటు, ఆ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాం. దీనికి భిన్నంగా మనం కొన్ని పాత అభద్రతా భావాలను లేవనెత్తుతున్నాం. మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ రాజకీయాల్లో మీకు కారణాలు కనిపిస్తాయి. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం, కొన్ని అనుకోని సంఘటనల ఆధారంగా విమర్శకులు ఈ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం. కానీ, దీన్ని ఎదుర్కోడానికి తగి నంత బలం భారత్కు ఉంది. ఆగస్టు 5న కశ్మీర్లో మౌలిక మార్పులు చేసి మూడు నెలలు గడుస్తున్నా, ఈ రోజు వరకూ ఎప్పుడూ విమర్శించే మూడు దేశాలు తప్ప ఏ ఇతర దేశం ఆ చర్యలను వెనక్కు తీసుకోమని భారత్ను కోరలేదు. అది భారతదేశపు అంతర్గత వ్యవహారంగా భావించే మిగిలిన దేశాలన్నీ మౌనం వహించాయి. అంతమాత్రాన, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగదు. కశ్మీర్లో చాలా త్వరగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి రాజకీయ నాయకులను, ప్రముఖులను ఎంతో కాలం నిర్బంధంలో ఉంచరు. సమాచార నిర్బంధం కూడా తొలగిపోతుంది. లేకపోతే స్నేహపూరిత ప్రభుత్వాలు కూడా మనవైపు నిలిచే పరిస్థితి ఉండదు. సాధారణ స్థితి నెలకొంటే కశ్మీర్ కూడా జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషిస్తుంది. నేడు కశ్మీర్ సమస్య అంటే పాక్ నుంచి ముప్పు, ఇస్లాం ఉగ్రవాదం, జిహాదీ తదితరాలు. ఇది జాతీయ భద్రతకు విచ్చిన్నపరిచే ప్రత్యక్ష ప్రమాదం. వీటిని దృఢంగా ఎదుర్కొంటున్న ఈ అతిశయిం చిన జాతీయవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ కోణం నుంచి చూస్తే మనం చాలా బలంగా ఉన్నాం అని చెప్పడానికి ఎన్నికల శాతాలు అవసరం లేదు. ఎందుకంటే, అప్పుడు ఇతరుల భయం లేకుండా నువ్వు రాజకీయాలను ఎలా నడుపుతావన్నదే ముఖ్యం. 1972 నుంచి 2014 మధ్య భారత జాతీయవాదం విస్తృతంగా వేళ్లూనుకుని, భద్రంగా సౌఖ్యమైన స్థితికి చేరుకుంది. చూడటానికి ఇదెంత అద్భుతంగా ఉందంటే ఏకకాలంలో మనం రెండు గేమ్స్ ఆడుతున్నాం. ఒకచోట ఒక ప్రాంతం జెండాను దించి దాన్ని జాతీయ వేడుకగా చేసుకుంటున్నాం. మరో చోట తమ జెండా కావాలనే వారి ఆకాంక్షలను పరిమితుల్లోనే గుర్తిస్తున్నాం. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆ రెండుచోట్లా ఎదురుగాలి!
జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నరేంద్రమోదీ స్థిరపడిన తర్వాత మహారాష్ట్ర, హరియాణాల్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలో రాజకీయ పవనాలు మారుతున్నాయన్నదానికి తొలి సంకేతాలను అందించాయి. మోదీ ప్రజాదరణను కోల్పోకున్నా ఆయన పార్టీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను చవిచూసింది. బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ పతనం, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ప్రతిపక్షం మేలుకోవలసిన సమయమిది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చి ఆలస్యంగా వెళ్లాయి. చివరకు వాయు చలనాలు కూడా రివర్స్ అయ్యాయి. దేశరాజధానిలో ఇవి ప్రస్తుతం పొడిపొడిగా మారాయి. పంజాబ్, హరియాణాల మీదుగా పశ్చిమం నుంచి వచ్చిన వాయుప్రవాహాలు ఆ రాష్ట్రాల్లోని రైతులు పొలాల్లో తగులబెట్టిన ఎండు దుబ్బు పొగను భారీగా వెంటబెట్టుకొచ్చాయి మరి. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నది ఆకురాలు కాలం. రుతుపవనాల మార్పు వంటి స్పష్టమైనది కాకున్నా రాజకీయ పవనాలు కూడా మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ స్తబ్ధతకు గురైనందున గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీ మతంతో కూడిన ఉద్రేకభరితమైన జాతీయవాద పవనాలను రేకెత్తించి దుమారం లేపుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు, ప్రత్యేకించి బాలాకోట్, అభినందన్ ఘటనలకు ముందు బీజేపీ ఈ తరహా జాతీయ వాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది. గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి భారత్ బాహ్య ప్రమాదాన్ని ఎదుర్కొనేదని, దీన్ని ఎవరూ పరిష్కరించలేని దశలో నరేంద్రమోదీ అంతిమంగా అడ్డుకున్నారని భారతీయ ఓటర్లు నమ్మేశారు. పైగా మోదీ పాక్ సమస్యను నిర్ణయాత్మకంగా, నిర్భయంగా సైనిక దండనతో పరిష్కరించేశారని, పాకిస్తాన్ని ఒంటరిని చేయడమే కాకుండా అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచివేశారని భారతీయ ఓటర్లు విశ్వసించారు. ఈ అభిప్రాయానికి వచ్చేశాక ఓటర్లు ఇతర పార్టీల పట్ల తమ విశ్వాసాలను విస్మరించేస్తారు కదా. ఓటరు అభిప్రాయాలు దానికనుగుణంగా మారిపోయాయి. అదేమిటంటే.. పాకిస్తాన్ ముస్లిం దేశం. అది జిహాద్ పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోంది. రక్త పిపాస కలిగిన జిహాదీలు యావత్ ప్రపంచానికే మహమ్మారిగా మారిపోయారు. ప్రపంచమంతటా ఇస్లామిక్ ప్రమాదం పొంచి ఉంది. భారతీయ ముస్లింలు కూడా దానికి మినహాయింపు కాదు. కాబట్టి హిందువులు తమకు తాముగా బలోపేతం కావలసి ఉంది. కానీ ఇలాంటి దురారోపణలు ఏవీ ఎన్నికల ప్రచారంలో పనిచేయలేదు. పేదలకు వంటగ్యాస్, మరుగుదొడ్లు, ఇళ్లు, ముద్రా రుణాలు వంటి పథకాలకోసం కేంద్రప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసిన దాదాపు రూ. 12 లక్షల కోట్ల నగదు పంపిణీనే ప్రచారంలో సమర్థ పలితాలను ఇచ్చింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వారాల పాటు నేను ఇదే విషయాన్ని రాస్తూ, మాట్లాడుతూ వచ్చాను. ఎన్నికల పరిభాషలో చెప్పాలంటే ఇది జాతీయవాదం, మతం, సంక్షేమం అనే మూడూ సృష్టించిన విధ్వంసం అనే చెప్పాలి. వీటి ముందు ప్రతిపక్షం రఫేల్ యుద్ధవిమానాల కుంభకోణం గురించి చేసిన ప్రచారం అపహాస్యం పాలయింది. పెద్ద నోట్లరద్దు తర్వాత మన ఆర్థిక వ్యవస్థ వృద్ది పతనం, చుక్కలంటుతున్న నిరుద్యోగితను కూడా జనం ఉపేక్షించేశారు. ఈ వారం జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పవనాలు మారుతున్నాయన్న దానికి తొలి సూచికను అందించాయి. అయితే ఈ ఎన్నికల్లో మోదీ తన ప్రజాదరణను కోల్పోయినట్లు చెప్పలేం. అదే జరిగి ఉంటే కనీసం హరియాణాలో అయినా బీజేపీ ఓటమి పాలయ్యేది. బీజేపీకి అనుకూలంగా తగిన సంఖ్యలో ఓటర్లను మోదీ సాధించారనడంలో సందేహమే లేదు. అయితే అయిదు నెలలక్రితం హరియాణాలో బీజేపీ ఓట్ల శాతం 58 శాతం మేరకు ఉండగా ఎన్నికల తర్వాత అది 28 శాతానికి గణనీయస్థాయిలో పడిపోయింది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అత్యంత విశ్వసనీయతను సాధించిన ఇండియా టుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకటించిన ముందస్తు ఫలితాలు రాజకీయ పవనాల మార్పుకు సంబంధించి కొన్ని సూచనలను వెలువరించాయి. గ్రామీణ యువత, నిరుద్యోగిత, రైతులు, వ్యవసాయ కార్మికులు వంటి పలు విభాగాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే 9 శాతం అదనపు పాయింట్లతో బీజేపీ ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆధిక్యతలో ఉంటున్నప్పటికీ పంజాబీ జనాభా గణనీయంగా ఉన్న హరియాణాలో దాని మధ్యతరగతి, అగ్రకులాలతో కూడిన గ్రామీణ ప్రజానీకం కాంగ్రెస్ను ఒకరకంగా ఆదుకోవడం బీజేపీకి తీవ్ర సంకటపరిస్థితిని కలిగించింది. మహారాష్ట్రలో కూడా కుంభకోణాల బారిన పడకుండా, ప్రజామోదం పొందిన బీజేపీ ముఖ్యమంత్రి సుపరిపాలనను అందించినప్పటికీ, ఈదఫా ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగు పడటానికి బదులుగా గణనీయంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంది. ఇది ముందుగానే ఊహించిందే. అదేసమయంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలకనేతలు నిఘా సంస్థల ఆగ్రహం బారిన పడతామేమోనన్న భీతితో బీజేపీలో చేరిపోయినందున ప్రతిపక్షం ర్యాంకు కూడా పడిపోయింది. పాలకపక్షానికి అనేక అనుకూలతలు ఉన్నప్పటికీ సాపేక్షికంగా ఇలాంటి ప్రతికూల విజయం దక్కిన నేపధ్యంలో బీజేపీని దెబ్బతీసింది ఎవరనే ప్రశ్న వస్తుంది. కాంగ్రెస్ కంటే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రత్యేకించి గ్రామీణ పశ్చిమ మహారాష్ట్ర్లలో బీజేపీని బాగా దెబ్బతీశారు. గుర్తుంచుకోండి.. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన 11 వారాల తర్వాత, హౌడీ మోదీ, అమెరికాలో ట్రంప్తో మోదీ చర్చలు జరిగిన అయిదు వారాల తర్వాత బీజేపీ ఇలాంటి ఫలితాలు సాధించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మామల్లపురంలో టీవీ మాధ్యమాల్లో మోదీ సంచలనం రేపిన కొద్ది కాలంలోనే ఇలా జరగడం గమనార్హం. పై అన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ ఓటర్లు చాలామంది బీజేపీ పట్ల తమ వైఖరిని అయిదు నెలలలోపే మార్చుకున్నారంటే, జాతీయవాద భావోద్వేగాలు, పాక్ వ్యతిరేక ప్రచారం, మనోభావాలను ప్రేరేపించిన మతపరమైన అత్యుత్సాహం వంటి అనుకూల పవనాలన్నీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించిన భయాందోళనల ముందు వెనకపట్టు పట్టాయన్న సూచనలను సంకేతిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో చాలామంది ఓటర్లు తమ ప్రాథమిక సమస్యల వైపు దృష్టి సారించినట్లే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ప్రయాణాల్లో పేదలు, ఉపాధి కోల్పోయిన ప్రజలను తరచుగా కలుసుకునేవాళ్లం. ఆర్థిక వ్యవస్థ వికాసం గురించి మోదీ, బీజేపీ చేసిన వాగ్దానాలు ఆచరణలో అమలు కాలేదని, తాము దెబ్బతిన్నామని వీరు మాకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తాము దేశ ప్రయోజనాల కోసం మాత్రమే మోదీకి ఓటేస్తామని వీరన్నారు. దేశాన్ని రక్షించడానికి మోదీ ఉన్నారు కాబట్టి దేశం సురక్షితంగా ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగిత జనాలను నిజంగానే బాధపెడుతోంది. ఇక రైతులు గిట్టుబాటు ధరల లేమితో విసిగిపోయారు. నా ఉద్దేశంలో మతంతో కూడిన జాతీయవాద పవనాలను ఆర్థిక వ్యవస్థ స్తబ్దత, నిరుద్యోగం, అశాంతి, సాధారణ వ్యాకులత వంటివి ఈ ఎన్నికల్లో వెనక్కు నెట్టేసినట్లున్నాయి. పాకిస్తాన్పై తాజా దాడులు, కశ్మీర్, ఉగ్రవాదంపై పాలక పార్టీ, ప్రభుత్వం గొంతు చించుకున్నా అది ఎన్నికల ఫలితాలను మార్చలేకపోయాయి. అయోధ్యపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వనుందన్న వార్తలు కూడా హిందీ ప్రాబల్య ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. వీటికి అతీతంగా చాలామంది ప్రజలు తీవ్ర బాధలకు గురవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలని వీరు కోరుకున్నారు. హరియాణాలో, మహారాష్ట్రలో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బలు త్వరలో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఒకటి మాత్రం నిజం. ప్రతిపక్షం ఎట్టకేలకు జూలు విదిలించాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విజయాలు ఒక నేతకే ఆపాదించే వ్యక్తి ఆరాధనా సంస్కృతిలో ఎదురుదెబ్బల నుంచి ఆ అధినేతను కాయడం కష్టమే అవుతుంది. ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులచే సంపూర్ణ ఓటమి చెందనప్పటికీ తక్కువ పాయింట్లతో విజయాన్ని నమోదు చేయడం పాలకపక్షానికి తీవ్ర ఆశాభంగాన్నే కలిగిస్తుంది. త్వరలోనే జార్ఖండ్లో, తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరగనుందున మోదీనే మళ్లీ ముందుపీటికి తీసుకురావాలా వద్దా అని బీజేపీ నిర్ణయించుకోవాలి మరి. మునిసిపల్ కార్పొరేషన్లపై, పోలీసులపై పూర్తి నియంత్రణ కేంద్రం చేతిలో ఉంటున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్ కంటే మెరుగ్గానే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. భారత్లో రాజకీయాలు మారడానికి సంవత్సరాల సమయం పడుతుంది కానీ రాజకీయ సీజన్లు మాత్రం శరవేగంగా మారతాయి. దేశరాజధానిలో ఇప్పుడున్న పొడి వాతావరణం, ఆకురాలు కాలం ప్రభావం ఏమిటో మీరు గ్రహించవచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఈ సంక్షోభానికి శస్త్రచికిత్సే మందు
ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. నిజమైన, సాహసోపేతమైన సంస్కరణతో మాత్రమే ఆర్థిక సంక్షోభాన్ని సరిచేయవచ్చు. నరేంద్రమోదీ ప్రభుత్వం దాన్ని చేయలేకపోతే, అది తన ప్రాభవాన్ని కోల్పోతోందన్న భయాలు రుజువైనట్లే లెక్క. ఇది మన రాజకీయ వర్గాలు తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ కాదు. కానీ భారతీయ పారిశ్రామిక వర్గం జంతు సహజాతాల బలీయమైన ప్రభావం గురించి ప్రతిచోటా మాట్లాడుకుంటూ ఉంటడం కద్దు. భారతీయ కార్పొరేట్ వర్గం నుంచి ఇలాంటి సహజాతాలకు సంబంధించినంతవరకు అభ్యర్థన చేసిన ఏౖకైక నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్, తర్వాత జస్వంత్ సింగ్ మాత్రమే. ఇక మోదీ ప్రభుత్వం ఆలస్యంగానైనా తన సొంత మాటల్లో ఆ పని చేయడానికి ప్రయత్నించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో, భారతీయ సంపద సృష్టికర్తలను ఆకర్షించడానికి కొంత ప్రయత్నం చేశారు. భారత సంపన్నులను తన ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పడమే కాక, జాతి నిర్మాణంలో వారు చక్కటి పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎర్రకోట నుంచి ఒక భారతీయ ప్రధాని ప్రైవేట్ పారిశ్రామిక వర్గాన్ని అత్యంత శక్తివంతంగా సొంతం చేసుకున్న ఘటనలలో ఇదీ ఒకటి. ఇది మరింత దిద్దుబాటు చర్యకు వీలు కల్పించింది. భారీగా కార్పొరేట్ పన్ను కోతలు, మూలధన లబ్ధిపై పన్నులో మార్పులు, కార్పొరేట్ లాభాలపై పన్ను తగ్గింపు వంటివి ప్రకటించారు. అదేవిధంగా విదేశీ పోర్ట్ఫోలియో మదుపుదారుల కార్పొరేట్ లాభాలపై పన్ను విధింపును వెనక్కు తీసుకోవడం కూడా జరిగిపోయింది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నటికీ వెనక్కు తీసుకోని, నష్టభయాన్ని తట్టుకునే ప్రభుత్వం, పారాచూట్ని తనిఖీ చేయకుండానే విమానం వెనుకనుంచి దుమికేయాలని నిర్ణయించుకున్నాక వెనక్కు తిరగని ప్రభుత్వం ఈవిధమైన తిరోగమనాలకు పాల్పడటమే ఒక కొత్త అనుభవం. అలా తిరోగమించడాన్ని ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అంగీకరించకపోవచ్చు, కానీ మొట్టమొదటిసారిగా అసాధారణ ప్రజాదరణ కలిగిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం కలిసి నియంత్రించలేని అంశమేమిటంటే మార్కెట్లే. న్యాయవ్యవస్థ, మీడియా, ఎన్నికల కమిషన్, చివరకు పాకిస్తా¯Œ తో అయినా సరే.. మోదీ అంత శక్తివంతంగా వ్యవహరించగలిగింది. కానీ పశుబలం కలిగిన రాజకీయ అధికారం కూడా మార్కెట్ విషయంలో ఏమీ చేయలేదు. గత కొద్ది వారాలుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వాణిజ్య ప్రముఖులను కలుసుకుంటూ వస్తున్నారు. ప్రెస్ కాన్ఫరె¯Œ్స తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో ఆమె తన బడ్జెట్లోని అత్యంత సమస్యాత్మక విభాగాలను గురించి చెబుతూ వచ్చారు. ఈ ’అప్రియ వార్తల’ బడ్జెట్ ముసాయిదా తయారీలో కీలక వ్యక్తి అయిన ఆర్థిక శాఖ కార్యదర్శి రంగంనుంచి తప్పుకుని ముందస్తు పదవీవిరమణ కోసం ప్రయత్నించారు. ఈదఫా కేంద్రబడ్జెట్ సమర్పించిన తర్వాత ఆర్బీఐ రెండు సత్వర రెపో రేట్స్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ మన కార్పొరేట్ వర్గం మానసిక స్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. చివరకు ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన ఇండియా ఎకనమిక్ సమ్మిట్లో కూడా మన కార్పొరేట్ వర్గంలో కళాకాంతులు లేవు. చిరునవ్వు కనిపించలేదు. మనం జంతు సహజాతాల గురించి మాట్లాడుతున్నామా? అవి కచ్చితంగా కంటికి కనబడతాయి. మీరు కోరుకుంటున్న రీతిలో జంతువు ఉండలేదు. పులి తోక పైకి లేపి మరీ పడుకుంటుంది. యజమాని వదిలేసిన కుక్క కూడా తన తోకను కాళ్లమధ్య దాచుకుంటూ ఉంటుంది. మీకు నేను వాడుతున్న పదబంధం ఇష్టం కానట్లయితే, కుక్కలతో పోల్చడం ఇష్టం లేకపోతే, నేను మరింత సాంప్రదాయికమైన పదం వెనుక దాక్కుంటాను. అది నైతిక ధృతి లేని సైన్యం. అత్యుత్తమ ఆయుధాలను మీరు ఇవ్వవచ్చు. కానీ సైనికాధికారులు తమ మనస్సులో ఇప్పటికే ఓడిపోవడం జరిగాక, యుద్ధంలో గెలవటం మాట అటుంచి తమ సైనిక బలగాలను కూడా ముందుకు నడిపించలేక పోవచ్చు. సెప్టెంబర్ 24న పన్ను కోతలు తగ్గించినప్పటినుంచి దేశీయ కార్పొరేట్ రంగం తన స్పూర్తిని ఎంతగా కోల్పోయిందంటే, బీఎస్ఈ సెన్సెక్లో నమోదైన కంపెనీలు తాజాగా రూ. 2.53 లక్షల కోట్లను కోల్పోయాయి. గత నిర్ణయాలనుంచి వెనక్కు రావడం, వడ్డీ రేట్లలో కోతలు వంటి సంస్కరణలు నిండా ఆవరించిన నిరాశావాదంలోంచి బయటపడలేకపోయాయి. మార్కెట్లకు పికెట్టీ భరోసా ఇచ్చిన తర్వాత కూడా ప్రపంచ స్థాయిలో మార్కెట్ల పరిస్థితి బాగాలేదు. అయితే కార్పొరేట్ వర్గాలు ఎంత అసమర్థంగా ఉన్నప్పటికీ, క్రమరాహిత్యంతో ఉన్నప్పటికీ అధికారపీఠంలో కూర్చుని ఉన్నవారికి నిజం చెప్పడంలో ఇప్పుడు వెనుకాడటం లేదు. మీడియా, న్యాయవ్యవస్థ వంటి కనీసం ఊహించలేని చోట భారతీయ మార్కెట్లు నిర్బయంగా ఒక విషయాన్ని చెబుతున్నయి: మోదీ ప్రభుత్వం దృష్టికి చెడువార్తలను తీసుకుపోండి. గత త్రైమాసికంలో వృద్ధి రేటు 5శాతం వద్ద కనిపడి అందరికీ షాక్ కలిగించింది. అయితే అలా షాక్ తగిలింది అమాయకులకే అనుకోండి. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న ఎవరికైనా ఇది బోధపడుతుంది. ఏదైనా అసాధారణమైనది జరిగితే తప్ప ఈ పరిస్థితిని మెరుగుపర్చడం కష్టమే. ఆ మార్పు ఏంటన్నది ప్రస్తుతానికి ఎవరికీ తెలీదు. మన అదృష్టాన్ని నిర్ణయించే అలాంటి అసాధారణ పరిణామం ఎవరికైనా తెలిసి ఉంటే, ఆర్బీఐ ఈ సంవత్సరం వృద్ధి అంచనాను 6.9 నుంచి 6.1కి తగ్గించి ఉండదు. ఈరోజు లాభాలు, పన్ను కోతల బట్టి కాక, రేపటి ఆశావాదం బట్టే పారిశ్రామిక వర్గం ముందడుగు వేస్తుంది. ఆ ఆశావాదమే పతనమవుతోంది. మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో అన సొంత ఆర్థిక అభివృద్దిని విచ్చిన్న పర్చుకోవడం సాధ్యమైనప్పటినిుంచి మన ఆశావాదం తగ్గుపట్టనారంభించింది. వ్యాపార వర్గాలు సాధారణ ప్రజలు, కుటుంబాలనుంచి విభిన్నంగా ఉండవు. భవిష్యత్తు బాగా లేదని అర్థం కాగానే వారు తాజా ఆదాయాలు, సేవింగ్స్, ఇటీవలి పన్ను కోతలు వంటి ద్వారా వచ్చే బొనాంజాలను మొత్తంగా కుటుంబ ఆదాయాలుగా మార్చిస్తారు. పరిస్థితి మెరుగుపడిందని గ్రహించాకే వారు నష్టభయాలకు సిద్ధమై వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఈ సమాచారాన్ని మీరు ఎటునుంచి ఎటు తిరగేసినా విషయం మాత్రం అదే. ఎటువంటి మినహాయింపూ లేకుండా అన్ని ఆర్థిక సూచికలు గత కొద్దికాలంగా దిగజారుతూనే ఉన్నాయి. ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇందుకు మీరు ఏదో కారణం వెతకచ్చు. కానీ, అది చాలా చిన్న విషయం. సమస్య మూలాలు ఇక్కడ ఉన్నాయి. ముఖేష్ అంబానీలాంటివారితో సహా చాలామంది నగదు నిల్వలను వదులుకోవడం లేదు. లేదంటే అప్పులు తగ్గించుకోవడానికీ, ఇబ్బందులు లేకుండా చూసుంటూ, లోన్లను తిరిగి చెల్లిస్తూ కాలం వెళ్లబుచ్చుతూ–మిగిలినవారంతా పెట్టుబడులు పెట్టాలని చూడటం సరికాదు. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఎవరిని అడిగినా 1991 తర్వాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని గుసగుసగా చెబుతారు. పన్నుల అధికారులకు దాడులు చేయడానికి, అరెస్ట్ చేయడానికి అవసరమైన అధికారాలు కట్టబెట్టడం వల్ల మాత్రమే కాదు, మొండి బాకీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తింది. అన్ని వ్యాపారాల్లో రిస్క్ ఉంటుందని ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు నాతో చెప్పారు. 30 రోజుల్లో నేను తీసుకున్న అప్పు తీర్చకపోతే, బ్యాంకులు నన్ను ఎ¯Œ సీఎల్టీగా పేర్కొంటూ నా పేరును ఎగవేతదారుల జాబితాలో ప్రచురిస్తాయి. నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? ఒక మనిషి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి తీసుకువెళతారా, లేక స్మశానానికా? ఆర్బీఐ కొత్త దివాళా నిబంధనలు భారత పారిశ్రామికవిధానానికి ఎ¯Œ సీఎల్టీ అనే స్మశానాలు నిర్మిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, హామీలు ఇస్తే సర్దుకునే స్థాయిని దాటిపోయింది. వీటిలో కొన్ని పని చేయొచ్చు, కానీ స్టెరాయిడ్స్, ఇన్సులిన్ లాంటి మందు కావాలి. నిజమైన, ధైర్యంగా తీసుకునే చర్యలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు అవసరం. బహుశా, పీఎస్యూలను పెద్దఎత్తున ప్రైవేటీకరించడం ద్వారా అది సాధ్యం కావచ్చు.మోదీ ప్రభుత్వం ఆరో ఏడాది పాలనలో కూడా ఇటువంటి చర్యలు తీసుకోనట్టయితే, అది ఓ గెలుపు గుర్రమే కానీ, సంస్కరణలు తీసుకువచ్చే సత్తాను కోల్పోయిందని అభివృద్ధి అనేది వాంఛనీయమైనదే తప్ప అత్యవసరమైన అంశం కాదని నమ్మేవారి మాటలను నిజం చేసినట్లవుతుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మనం ఇంకా గెలువని కశ్మీర్
కమ్యూనికేషన్ నిబంధనలను ఎత్తివేయడంపై జాప్యం కొనసాగుతుండటం కశ్మీరీల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇది పరిస్థితులను అదుపు తప్పేలా చేస్తుంది. పైగా కశ్మీర్ స్థితిగతులను ప్రపంచం పరిశీలి స్తోంది కూడా. కానీ ప్రస్తుతం కశ్మీర్ గురించి ప్రపంచం పట్టించుకుంటోందా? కనీసం కశ్మీర్ గురించి ప్రపంచానికేమైనా తెలుసా? కశ్మీర్ ఉపఖండంలో భాగమని, దీనికోసమే భారత్, పాకిస్తాన్ లు అసంగతమైన స్థాయిలో పరస్పరం కలహించుకుంటున్నాయనీ. తరచుగా అణుయుద్ధ స్థాయికి కూడా దీన్ని తీసుకెళుతున్నాయని అర్థమైనప్పుడు మాత్రమే ప్రపంచం అట్లాస్లో కశ్మీర్ గురించి శోధిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కేటగిరీలో ఇమడక పోవచ్చు. ఉపఖండం గురించి అమెరికా అధికారులు తనకు వివరిస్తున్నప్పుడు బటన్, నిప్పిల్ అంటే ఏంటి (భూటాన్, నేపాల్ దేశాలు) అని ట్రంప్ ప్రశ్నించడం ఎవరూ ఇంకా మర్చిపోలేదు. చివరకు గత జూలైలో అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన ప్రెస్ కాన్ఫరెన్సులో ట్రంప్ కశ్మీర్ని ‘నిత్యం బాంబులు కురుస్తున్న ఆ సుందరమైన స్థలం’ అంటూ వర్ణించడం కూడా మన దృష్టి పథాన్ని దాటిపోలేదు. ఇది మనకు ఏం చెబుతోంది అంటే.. భారత అత్యుత్తమ వ్యూహా త్మక, రాజకీయ ప్రయోజనాల రీత్యా చూస్తే కశ్మీర్పై బయటినుంచి వచ్చే ఏ వార్త కూడా మంచి వార్త కాదన్నట్లే.. కశ్మీర్లో తీవ్రవాదం ప్రారంభమైన తర్వాత గత 30 ఏళ్లలో 1991–94 మధ్య కాలంలో మాత్రమే కశ్మీర్ సమస్య ప్రపంచం దృష్టికి వచ్చింది. కశ్మీర్లో ఎవరూ క్షమించలేనటువంటి తీవ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే కశ్మీర్ సమస్య ప్రపంచానికి తెలియవచ్చింది. ప్రతి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థా అక్కడి అణచివేతను తొలిసారిగా పట్టించుకుంది. మొట్టమొదటిసారిగా క్లింటన్ పాలనా యంత్రాంగం భారత్పై మండిపడింది కూడా. కానీ పీవీ నరసింహారావు ఈ సమస్యను అధిగమించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి కశ్మీర్లో అంతర్జాతీయ మీడియా ప్రవేశించడానికి అవకాశం కల్పించి ప్రపంచ అభిప్రాయాన్ని కాస్త చల్లబరిచారు. కానీ మానవ హక్కుల సంస్థలకు ప్రవేశం కల్పించలేదు. దానికి ప్రతిగా తన సొంత జాతీయ మానవ హక్కుల కమిషన్ ను 1993లో నెలకొల్పారు. ఆనాటి నుంచి కశ్మీర్ సమస్యను తెరవెనక్కి నెట్టడం పైనే పీవీ కేంద్రీకరించేవారు. 1994లో అమెరికా కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలో కూడా కశ్మీర్ విషయాన్ని ఎంతో చతురతతో ప్రస్తావించారు. అయితే దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి టెక్సాస్ని కలిపేసుకున్న విధంగా చారిత్రక పోలికను తీసుకొచ్చారు. మరోవైపున వ్యూహాత్మకంగా కశ్మీర్ను స్థాయిని పీవీ తగ్గించివేశారు. అప్పట్లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో కశ్మీర్ భవిష్యత్తును మీరెలా చూస్తున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు పీవీ సులువుగా తేల్చిపడేశారు. ‘భాయీ, వారు ఏదో ఒకటి చేస్తారు. మేము కూడా మరొకటి చేస్తాం. ఈ అటలోంచే దాని ఫలితం వస్తుంది’ అనేశారు. కశ్మీర్ను ఆయన ఆ స్థాయిలోనే చూశారు. సిమ్లా ఒప్పందం తర్వాత దశాబ్దాల పాటు ఏబీ వాజ్పేయితోసహా భారత ప్రధానులంతా కశ్మీర్ సమస్యను కుదించే వ్యూహాన్నే అవలంబించారు. కార్గిల్ వంటి దాదాపు యుద్ధం సంభవించిన స్థితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించే మాట్లాడసాగాం. అంతే తప్ప కశ్మీర్ను ఒక సమస్యగా చూపించడానికి భారత్ అనుమతించలేదు. చాలాకాలం ఇది చక్కగా పనిచేసింది. 2001లో అమెరికాపై దాడులు జరిగాక పాకిస్తాన్ ని పెంచి పోషించడానికి అమెరికా పూనుకున్నప్పుడు కూడా పాక్ సైన్యం కశ్మీర్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే కశ్మీర్ పరిస్థితిని ఇంకా దిగజార్చాలని అమెరికా భావించలేదు. అదే సమయంలో భారత్ ఈ నూతన పరిస్థితిని చాలావరకు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో మూడు పరిణామాలు ఆవిర్భవించాయి. మొదటిది, భారత్–పాక్లు వ్యూహాత్మక సమతుల్య స్థితికి చేరుకున్నాయనీ, సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎత్తుడల స్థాయిలోనే ఉంటున్నాయని ప్రపంచం విశ్వసించసాగింది. రెండు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో పాక్, వికాసదశలో సాగుతున్న భారత్ యధాతథస్థితిలోనే తమకు కొత్త ప్రయోజనాలు ఉన్నట్లు గ్రహించాయి. మూడు, రెండు దేశాల కొత్త తరాలు ఆధీనరేఖే తమ సరిహద్దుగా ఆమోదించే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం ప్రణాళికా రహితంగానే ఫలప్రదమయ్యే తన పూర్వ ప్రధానుల వైఖరినుంచి పక్కకు తప్పుకుని యధాతథ స్థితిని విచ్ఛిన్నపర్చే స్థాయికి చేరుకుంది. అయితే అలా పాత స్థితిని బ్రేక్ చేసిన మొదటి ప్రభుత్వం మోదీది కాదు. కశ్మీర్ సమస్య తన ప్రాధాన్యతను కోల్పోతోందని నిసృ్పహకు గురైన పాక్ తొలుత 2008లో, తర్వాత పఠాన్ కోఠ్లో, పులవామాలో యధాతథస్థితిని బద్దలు చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులకు పాల్పడింది స్థానికులే అని ఆరోపిస్తే సరిపోతుంది. కశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించడం, అణు ప్రమాదాన్ని రేకెత్తించడం, దీంతో ప్రపంచం భీతిల్లగానే ప్రధాన సమస్యవైపు దాని దృష్టిని మళ్లించడం అనేది ఇప్పుడు పాక్ వైఖరిగా మారింది. ఒకవేళ పాక్ వ్యూహం పని చేయకపోతే, అది మరింత అసహనానికి లోనై మళ్లీ అదే పని చేస్తుందేమో తెలీదు. ప్రస్తుతానికి పాక్ వ్యూహం పనిచేయనందునే, రెండోసారి మెజారిటీ సాధించిన మోదీ నాయకత్వంలోని భారతదేశం యథాతథ స్థితిని నిర్ణయాత్మకంగా మార్చే ప్రయత్నం చేసిందని మనం అర్థం చేసుకుంటాం. పాక్ ఇప్పుడు కూడా యుద్ధ బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం దాన్ని కూడా వదిలేసింది. తన సైనిక పరిమితులను అది గ్రహించింది. దానికి ప్రపంచంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు కూడా. న్యూయార్క్లో ఇమ్రాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో భారత్పై దాడి చేయలేనప్పుడు మనం ఇంకేం చేయగలమని ఆయన అడిగిన తీరును చూపిస్తున్న వీడియో క్లిప్ను దయచేసి పరిశీలించండి. ఇప్పటి వరకు బానేవుంది. ఇప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఒప్పకున్నా, ఒప్పకోకపోయినా అర్థశతాబ్దం తర్వాత ఇప్పుడు కశ్మీర్ సమస్య అంతర్జాతీయం అయ్యింది. ఇప్పుడు పాక్ కాదు, భారత్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాల్సి ఉంది. చైనా, టర్కీ తప్ప ఏ దేశమూ ఆగస్టు 5 తరువాత జరిగిన మార్పులు తన అంతర్గత అంశాలని చెబుతున్న భారత్ వైఖరిని ప్రశ్నించలేకపోవడం, అలాగే, ఆగస్టు 5కు ముందునాటి స్థితి కల్పించాలని డిమాండ్ చేయలేకపోవడం మనకు అనుకూలమే. అమెరికాతో సహా చాలా దేశాలు కశ్మీర్లో జరుగబోయే తదనంతర పరిణామాలపై ఆసక్తితో ఉన్నాయి. ఊచకోత సాగుతోందన్న ఇమ్రాన్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. అలాగని, శ్రీనగర్లో సాధారణ స్థితిని చూపుతున్న డ్రోన్ చిత్రాలపట్ల కూడా సంతృప్తిగా లేరు. కశ్మీర్లో అమానుషమైన నిర్బంధం కొనసాగుతోంది. వేలాదిమందిని ఎలాంటి ఆరోపణలు, విచారణ లేకుండా నిర్బంధించడంపట్ల ఆయా దేశాలు త్వరలోనే సహనాన్ని వీడొచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశాలు ముగిసినట్టే. పాకిస్తాన్ ను ఏకాకిని చేసి మనం సాధించిన దౌత్య విజయంపై సంబరాలు చేసుకోవచ్చు. మోదీ న్యూయార్క్ నుంచి ప్రతికూల అంశాల కంటే ఎక్కువగా అనుకూల అంశాలతోనే, తిరిగి వస్తున్నారు. కశ్మీర్ మా అంతర్గత అంశం అన్న భారత్ పాతపాటను ఎవరూ సవాల్ చేయలేదు. మోదీతో వైట్ హౌస్లో జరిపిన సమావేశంలో సైతం కశ్మీర్లో సాధారణ స్థితిని నెలకొల్పాలనీ, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ట్రంప్ కోరారు. అంతేగానీ, అగస్టు 5కు ముందునాటి స్థితిని పునరుద్ధరించమని కోరలేదు. అయితే, ఇదే స్థితిని భారత్ భవి ష్యత్లో కూడా కొనసాగిస్తే బాధితులమంటూ పాకిస్తాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం కశ్మీర్ ఇస్తుంది. న్యూయార్క్లో ఏడాది కోసారి తూతూమంత్రంగా సాగే భారత్, పాక్ సమావేశాల్లో కశ్మీర్ భారత అంతర్గత అంశంగా నిలబెట్టుకోవడం దౌత్య విజయం అనుకుంటే, కశ్మీర్ భవిష్యత్, భారత్ చెప్పుకునే జాతిహితం కూడా అందులో ఇమిడి ఉంటాయి. కశ్మీర్లో సమాచార నిషేధం విధించి మరో వారంలో రెండు నెలలు పూర్తవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ కశ్మీర్ల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. తగిన సమయంలో దాన్ని అదుపు చేయడం సవాల్గా మారుతుంది. సమయం దాటేకొద్దీ హింస, రక్తపాతం చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంది. కశ్మీర్ పట్ల ప్రపంచం వ్యతిరేకంగా స్పందించడం లేదు. కానీ, ఇప్పుడది సున్నిత సమస్యగా మారింది. ఆ విధంగా కశ్మీర్ అంశం అంతర్జాతీయం అయ్యింది. ఆగస్టు 5 నిర్బంధం తర్వాత పరిస్థితిని ఏంటని ఆలోచించడమే కొత్త యధాతథస్థితిగా ఉంటుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘ఆర్థికం’తోనే అసలు తంటా!
అణ్వాయుధాలను ఒక దేశ శక్తి సంపన్నతకు కొలమానాలుగా భావించిన కాలం అంతరించింది. ఆర్థిక సుస్థిరతే ప్రపంచస్థాయిలో దేశాల పలుకుబడికి సంకేతంగా మారిన కాలం ఆవిర్భవించింది. ఈ కోణంలో చూస్తే భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదానికి ఆధీనరేఖ వద్ద పాక్ సైనిక బలగాల మోహరింపు, దాని క్షిపణి ప్రయోగాల బూచి, భారత్ భూభాగంపై చైనీయుల ఆక్రమణ కారణాలు కానేకావు. గత పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా అడుగంటిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ అస్థిరతే అసలు ప్రమాద హేతువుగా మారుతోంది. సరిహద్దుల అవతల నుంచి కాకుండా దేశంలోపల పెరుగుతున్న ఈ ప్రమాదం అంతర్జాతీయంగా మన స్థాయిని దెబ్బతీయబోతోంది. పాలకులు తగు గుణపాఠాలు తీసుకోకపోతే మనపట్ల ప్రపంచ సదభిప్రాయం కరిగిపోయే అవకాశం తప్పదు. భారతదేశం ప్రస్తుతం ఒక సరికొత్త వ్యూహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. ఇది భారత్–పాక్ దేశాల మధ్య ఆధీనరేఖ వద్దకు పాకిస్తాన్ మరొక సైనిక బ్రిగేడ్ తరలించడం కాదు. నాటకీయ ఫక్కీలో అది మరొక క్షిపణి ప్రయోగం చేయడం కాదు. భారత భూభాగంలో చైనీ యులు సరికొత్త ఆక్రమణ చేపట్టడం అంతకంటే కాదు. ఈ మూడు అంశాలు వ్యూహాత్మక ప్రమాదానికి కారణాలు కావు. మన సాంప్రదాయిక శత్రువుల నుంచి ఈ ప్రమాదం కలగలేదు. ఇది దేశం లోపలనుంచే పుట్టుకొస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గుడ్విల్ కలిగిన, ముంబైపై ఉగ్రవాద దాడుల తర్వాత ‘ఎదుగుతున్న మంచబ్బాయి’లా పేరు పొందుతున్న మన అతి గొప్ప సంపదను ఈ సరికొత్త ప్రమాదం ధ్వంసం చేయనుంది. అదేమిటో కాదు అడుగంటిపోతున్న మన ఆర్థిక శక్తి. దేశ సుస్థిరతకంటే, ప్రజాస్వామ్యం కంటే భారత్ను సమున్నతంగా నిలుపుతూ వచ్చిన ఆర్థిక సంపన్నత క్షీణతే మనం ఎదుర్కొనబోతున్న సరికొత్త వ్యూహాత్మక ప్రమాదం. సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా చూద్దాం. మీ ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేక ఆపై స్థాయిలో పెరుగుతున్నప్పుడు, ఏడు హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. అదే 7 శాతం వృద్ది జరుగుతున్నప్పుడు 5 హత్యలు చేసి కూడా మీరు తప్పించుకోవచ్చు. కానీ మీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయినప్పుడు మీరు ప్రమాదకరమైన జోన్లో ఉన్నట్లే లెక్క. ఆర్థిక సంస్కరణలు 1991 వేసవిలో ప్రారంభమైనది మొదలు గత పాతికేళ్లుగా పాశ్చాత్యదేశాలు, తూర్పు, మధ్యప్రాచ్యం తేడా లేకుండా యావత్ ప్రపంచానికీ ప్రీతిపాత్రమైన దేశంగా భారత్ ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోని పలుదేశాలు అనేక కారణాలతో సంఘర్షించుకుంటున్న తరుణంలో భారత్ తన విశిష్టమైన సామాజిక–రాజకీయ లక్షణాలతో వైవిధ్యపూరితమైన సంస్కృతితో, ప్రజాస్వామిక, వ్యూహాత్మక దన్నుతో ప్రపంచంలో తనదైన గుర్తింపును పెంచుకుంటూ వచ్చింది. కార్గిల్ యుద్ధం, పార్లమెంట్పై దాడి, ముంబైపై ఉగ్రవాద దాడి సందర్భంగా ప్రపంచ దేశాలనుంచి భారత్ పొందిన మద్దతులో ఈ గుర్తింపును చూడవచ్చు. వీటన్నింటికంటే భారత్కున్న అతి పెద్ద శక్తి ఆర్థికమే. యావత్ ప్రపంచం ఒక మోస్తరు వేగంతో పెరుగుతున్నప్పుడు, భారత్ అతివేగంగా ఎదుగుతున్న రెండో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతూ వచ్చింది. పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆవిష్కరణలు, విదేశీ పెట్టుబడుల పట్ల సానుకూలత, సుస్థిర మార్కెట్లు, సరళమైన పన్నుల వ్యవస్థ కారణంగా అది.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి సులువుగా బయటపడిన భారతపై యావత్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. ఈ కాలం పొడవునా సంక్షుభిత ప్రపంచంలో ఒక స్నేహపూర్వకమైన, సుస్ధిరమైన ఉపఖండంలాగా భారత్ ఎదుగుతూ వచ్చింది. అంతర్జాతీయ పోర్ట్ఫోలియోలు, ప్రత్యక్ష మదుపులను అది అయస్కాంతంలా ఆకర్షించింది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్ధిరత, భద్రతను చూసి చైనాతో సహా బడా ఆర్థిక శక్తులు, వాటి కార్పొరేషన్లు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడ్డాయి. భారత్ తన సైన్యంపై పెట్టే వ్యయం స్తంభించిపోయినప్పుడు, దాని ఆధునికీకరణ దశ తప్పినప్పుడు, ఆసక్తి కలిగించే దాని ఆర్థికవ్యవస్థే భారత్ని అతి గొప్ప వ్యూహాత్మక శక్తిగా మార్చింది. భారీ స్థాయి అణ్వాయుధాల కంటే పెరుగుతున్న జీడీపీనే ఇప్పుడు అత్యంత శక్తివంతమైనదిగా లెక్కిస్తున్నారు. ఏ ఇతర ఆర్థిక వ్యవస్థలోనూ లేనివిధంగా అసంఖ్యాక దిగుమతులను చేసుకునే భారత్ సామర్థ్యంపై చైనా ఆధారపడుతోందంటే అది భారత్కు వ్యూహాత్మక సంపదగా మారినట్లే. ప్రత్యేకించి కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదదాడి వంటి సందర్భాల్లో భారత్–పాక్ మధ్య యుద్ధ సంక్షోభం నెలకొన్నప్పుడు చైనా స్పందనలను గమనించండి. 2009లో దలైలామా తవాంగ్ సందర్శన సమయంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని బలహీన ప్రభుత్వం సైతం చైనాకు ఎదురొడ్డగలగడమే కాకుండా దాని అసంతృప్తిని సునాయాసంగా చల్చార్చింది కూడా. ఇక మోదీ తొలి దఫా పాలనకేసి చూస్తే, ఆర్థిక వృద్ధి కొనసాగడమే కాకుండా 2012–14 నాటి స్తబ్దతను అధిగమించింది. ఇది భారత్కు, మోదీకి కూడా ఉపకరించింది. ప్రపంచ నేతల్లో మోదీ ప్రతిష్ట, పలుకుబడి గొప్పగా పెరుగుతూ వచ్చింది. కానీ తన ఈ ప్రతిష్టను పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ స్వయంగా దెబ్బతీసుకున్నారు. నాటినుంచే మన ఆర్థికవృద్ధి పతనమవుతూ వచ్చింది. మోదీ హయాలో ఆర్థిక వ్యవస్థ గత నాలుగు త్రైమాసికాల్లోనే భారీ పతనం చవిచూసింది. ఈరోజు అది కోలుకునే ఆశలు కనిపిం చడం లేదు. ఇదే భారత్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దెబ్బతీస్తోంది. ఆర్టికల్ 370 రద్దుపై వస్తున్న అనేక స్పందనల్లో ఇది ప్రతి బింబిస్తోంది. 1971 నాటి యుద్ధం ప్రారంభం నాటి నుంచి భారత్ ఏ రూపంలోనైనా సరే పాక్కు వ్యతిరేకంగా చేపట్టిన రెచ్చగొట్టే చర్యల్లో ఇదే అతిపెద్దది. నిజానికి ఇది కశ్మీర్కు సంబంధించి పెద్ద మూలమలుపు. అయితే మన ఆర్థిక వ్యవస్థ వ్యూహాత్మక క్షీణతకు తొలి సూచన ఆర్టికల్ 370 రద్దుకు ముందే ట్రంప్ చేసిన ప్రకటనలో వ్యక్తమైంది. ఇమ్రాన్ సమక్షంలో.. భారత్–పాక్ సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ య«థాలాప ప్రకటన చేశారు. ఒక విషయం మాత్రం నిజం. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నపుడు ట్రంప్ ఇలాంటి చొరవ చేసి ఉండటం సాధ్యపడి ఉండేది కాదు. అమెరికన్ కంపెనీలు అమెరికాలో కాకుండా భారత్లో పెట్టుబడులు, పరి శ్రమలు పెట్టి లాభాలు దండుకుంటున్నాయన్నది ట్రంప్ తొలినుంచే చేస్తూ వస్తున్న ఆరోపణ. భారత్లో అమెరికన్ దిగుమతులపై అధిక పన్నులు విధిస్తున్నారనీ ట్రంప్ ఆరోపించేవారు. అలాంటిది.. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ చెప్పడం ఆషామాషీ ప్రకటనగా భావించలేం. చివరకు బలహీనమైన బ్రిటన్ టోరీ ప్రభుత్వం కూడా కశ్మీర్పై భారత్ వ్యవహారంపై విమర్శలు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత వ్యతిరేక ధోరణిని కూడా ప్రదర్శించింది. భారత ఆర్థిక వ్యవస్థ వికసిస్తున్నప్పుడు 2002–13 కాలంలో ఆరుగురు బ్రిటన్ ప్రధానులు భారత్ను సందర్శించారని మర్చిపోరాదు. భారతీయ కంపెనీ టాటా.. జాగ్వార్ లాండ్ రోవర్ అండ్ కోరస్ కంపెనీని 14.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటన్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే అతిపెద్ద కంపెనీగా అవతరించిన కాలంలో బ్రిటన్ రాజకీయనేతలు పార్టీలకతీతంగా భారత్ పట్ల సానుకూల దృష్టిని ప్రదర్శించేవారు. ఈ రోజు కశ్మీర్లో పరిస్థితి ఘోరంగా కనబడుతుండవచ్చు కానీ ఇంతకంటే ఘోరంగా మారిన పరిస్థితులను మనం గతంలోనే చూశాం. గూగుల్ ప్రపంచాన్ని ఆవరించకముందు నెలకొన్న మన గతాన్ని మర్చిపోవడానికి మనం అలవాటు పడ్డాం. 1991–94 కాలంలో కశ్మీర్లో ప్రజాగ్రహం, రాజ్య నిర్బంధం, అణచివేత, హింస అంత్యంత ఘోరమైన స్థితికి చేరుకుంది. చిత్రహింసల కేంద్రాలు పెరుగుతూపోయాయి. విదేశీ జర్నలిస్టులను నిషేధించారు. ఎన్ కౌంటర్ హత్యలు సాధారణ విషయం అయిపోయాయి. ప్రతిరోజూ కశ్మీర్లో హత్యలు జరుగుతుండటంతో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది కూడా. దీనికి అంతర్జాతీయ ప్రతిస్పందన కూడా తోడైంది. ప్రపంచ స్థాయిలో భారత్ స్నేహితులు దూరమైన స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. మన ఏకైక మిత్రదేశం సోవియట్ యూనియన్ ప్రపంచ చిత్రపటంలోంచి అదృశ్యమైంది. మానవ హక్కుల సంస్థలు, స్వచ్చంద సంస్థలచే ప్రభావితమైన బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం భారత్ను నిరంతరం లక్ష్యంగా చేసుకునేది. ప్రపంచంలో ఏ మిత్ర దేశం తనను ఆదుకునే పరిస్థితి లేని ఆ కాలంలో పీవీ నరసింహారావు స్వదేశంలో కాస్త నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించేవారు. తన తొలి దశపాలనలో బిల్ క్లింటన్ ప్రభుత్వ యంత్రాంగం కశ్మీర్ను భారత్లో విలీనం చేసుకున్న ప్రక్రియనే ప్రశ్నించిన దశను, ఉపఖండం మ్యాప్ను ఇక ఎంతమాత్రం రక్తతర్పణతో మార్చలేమని తన రెండో దఫా పాలనలో బిల్ క్లింటన్ చేసిన ప్రకటనను పోల్చి చూడండి. 1990లలో కూడా వేగంగా పెరుగుతూ వచ్చిన ఆర్థిక వ్యవస్థే నిర్ణయాత్మకమైన వ్యూహాత్మక సంపదగా ఉండేది. 2019లో క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతీయ పాలనాయంత్రాంగం జవాబుదారీతనం సమస్యను ఎదుర్కొంటూండటాన్ని మనం తప్పక ఆలోచించాల్సిందే. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆధునికీకరణే అసలైన రక్షణ
అతిశక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ఈ సారి రక్షణ రంగ కేటాయింపుల్లో నాటకీయ చర్యకు పూనుకుంటారని మన వ్యూహాత్మక నిపుణులు పెట్టుకున్న అంచనాలు ఘోరంగా తప్పాయి. మోదీ మిలటరీ దుస్తుల్లో ఫోజు ఇచ్చినంత మాత్రాన దేశాన్ని పాకిస్తాన్ లాగా దివాలా తీయించి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేలా భారత్ను మార్చే తరహా యుద్ధవాది కాలేరు. జీడీపీ వృద్ధికి అనుగుణంగానే రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నది విస్మరించకూడదు. గత యుద్ధాల్లో మాదిరిగా పాక్ని కఠినంగా శిక్షిద్దాం అనే తరహా దూకుడు ఆలోచనలు కట్టిపెట్టి రక్షణ రంగానికి కేటాయించిన తక్కువ మొత్తాన్ని మెరుగ్గా, ఉత్తమంగా ఎలా ఖర్చుపెట్టాలన్న అంశంపై ఆలోచించాలి. ఆధునికీకరణ, సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా సైనికబలగాలను మెరుగైన శక్తిగా మలచడం ఇప్పటి అవసరం. ఈ వారం ప్రధానంగా మూడు విషయాలు మనలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ సారి కూడా రక్షణరంగానికి బడ్జెట్లో పెద్దగా అదనపు కేటాయింపులు లేకపోవడం పట్ల మన వ్యూహాత్మక నిపుణుల బృందం పెదవి విరుస్తోంది. రెండు. ప్రముఖ అమెరికన్ వ్యూహాత్మక అంశాల నిపుణుడు క్రిస్టీన్ ఫెయిర్ ది ప్రింట్ మేగజైన్కు చెందిన సృజన్ శుక్లాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ప్రకటన. దాని ప్రకారం లష్కరే తోయిబా భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలలో ఒకటిగా మాత్రమే ఉండటం లేదు. అది పాకిస్తాన్ సైన్యానికి చెందిన తక్కువ వ్యయంతో ప్రత్యేక సైనిక చర్యలు కొనసాగించే యూనిట్. ఇది భారత్ ఏమాత్రం తూగలేని అత్యంత అసమాన యుద్ధతంత్రాన్ని నడుపుతోంది. ఇలాంటి స్వల్ప స్థాయి యుద్ధతంత్రంలో పాకిస్తాన్ని భారత్ అసలు ఓడించలేదు. మూడో అంశం. దివంగత ఎయిర్ కమోడోర్ జస్జిత్ సింగ్ రచించిన ఒక పుస్తకం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం భారతీయ వాయుసేన తన వద్ద ఉన్న పాత ఫ్రెంచ్ మిరేజ్ విమానాలను పరీక్షించడానికి ఇజ్రాయిల్ ఇంజనీర్లకు అనుమతించింది. వీరు అధునాతన రష్యన్ ఆర్–73 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను మోసుకెళ్లేలా మన పాత మిరేజ్ యుద్ధవిమానాలను ఆధునికీకరిస్తారు. అయితే వారి ఒరిజనల్ క్షిపణి, మాత్రా–530డి ఉపయోగానికి పనికిరాకుండా పోయిన తరుణంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. భారతీయ వాయుసేనకు సొంతమైన ఫ్రెంచ్ మిరేజ్లకు రష్యన్ క్షిపణులను ఇజ్రాయెల్ నిపుణులు అమర్చడం అనే అంశం రాజ్కపూర్ కళాఖండం శ్రీ 420 సినిమాలో పాటల రచయిత శైలేంద్ర రాసిన అద్భుతమైన పంక్తులను మరోసారి గుర్తుకు తెస్తోంది. మేరా జూతా హై జపానీ అనే ఆ పాట పల్లవికి అర్థం ఏమిటంటే.. ‘‘నా చెప్పులు జపాన్వి, ట్రౌజర్లు బ్రిటిష్ తయారీ, నా టోపీ రష్యాది కావచ్చు, కానీ నా హృదయం మాత్రం ఇప్పటికీ భారతీయతతో కూడినది’’. ఈ పంక్తులు 1955లో ఒక కొత్త రిపబ్లిక్కు ఉత్తేజం కలిగించేవే మరి. అయితే 65 సంవత్సరాల తర్వాత కూడా మన సాయుధ బలగాల పరిస్థితిని వర్ణించడానికి ఇప్పటికీ ఈ పాటే పాడుకోవలసిందేనా? మొదటగా బడ్జెట్ వర్సెస్ జీడీపీ సమస్యను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం రక్షణ రంగ బడ్జెట్ని పెన్షన్లతో కలిపి రూ. 4.31 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అంటే ఇది స్థూల దేశీయోత్పత్తిలో సరిగ్గా 2 శాతానికి సమానం. దీంట్లో సైనికుల పెన్షన్లను మినహాయిస్తే, రక్షణ బడ్జెట్ రూ. 3.18లక్షల కోట్లు లేదా మన జీడీపీలో 1.5 శాతం మాత్రమే. ఇప్పుడు రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. రక్షణకు ఇంత తక్కువ మొత్తం కేటాయింపుతో భారత్ తన్ను తాను కాపాడుకోగలదా? ఇంతకు మించి అధికంగా రక్షణ రంగానికి కేటాయించడానికి భారత్కు శక్తిలేదా? తక్షణ స్పందన ఏమిటంటే ఒకటో ప్రశ్నకు లేదు అనీ, రెండో ప్రశ్నకు అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది కాలం క్రితం వరకు నేను కూడా ఇలాగే భావించేవాడిని. కాని నా అభిప్రాయం తప్పు అనిపిస్తోంది. వ్యూహాత్మక అంశాలపై చర్చలో, జీడీపీకి, జాతీయ బడ్జెట్కు మధ్య వ్యత్యాసాన్ని ఎన్నడూ చర్చించరు. బడ్జెట్ మాత్రమే ప్రభుత్వానికి చెంది నదని, జీడీపీ ప్రభుత్వానిది కాదనిపించేలా చర్చలు సాగేవి. అందుకే జాతీయ బడ్జెట్లో కేటాయించే శాతానికి అనుగుణంగానే రక్షణ వ్యయాన్ని పరిశీలించేవారు. ఈరోజు రుణ చెల్లింపులకు కేటాయించే 23 శాతం తర్పాత, బడ్జెట్లో అతిపెద్ద భాగానికి 15.5 శాతం వెచ్చిస్తున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలు మొత్తంపై పెట్టే వ్యయం (15.1శాతం) కంటే ఇది ఎక్కువ. జీడీపీలో మరొక అర్థ శాతం మొత్తాన్ని లేక మొత్తం బడ్జెట్లో 3.5 శాతం మొత్తాన్ని పారామిలిటరీ బలగాలపై వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ఆర్థిక మంత్రి అయినా ఇంతకు మించి రక్షణ రంగానికి నిధులను మళ్లించగలరా? మా డేటా జర్నలిస్టు అభిషేక్ మిశ్రా 1986 నుంచి రక్షణ రంగ బడ్జెట్ ధోరణులను నాకు తెలియపర్చారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారీగా సైనిక విస్తరణ చేపట్టిన సంవత్సరాల్లో మాత్రమే మన రక్షణ బడ్జెట్ జీడీపీలో అత్యధికంగా 4 శాతానికి పెరిగింది. కాకతాళీయంగా ఫ్రెంచ్ మిరేజ్ యుద్ధవిమానాలు మనకు అందడం అప్పుడే మొదలయ్యాయి. అప్పటినుంచి బడ్జెట్లు జీడీపీలో సగటున 2.82 శాతం మేరకు నిలకడగా, స్థిరంగా పెరుగుతూ వచ్చాయి. 1991 ఆర్థిక సంస్కరణలతో జీడీపీ వృద్ధి కూడా ముందంజ వేసింది. గత 20 ఏళ్లలో అంటే కార్గిల్ యుద్దం నాటి నుంచి, బడ్జెట్ పెంపు సంవత్సరానికి సగటున 8.91శాతంగా నమోదవుతోంది. ఇప్పుడు మీరు గావుకేకలు వేయవచ్చు, నిందించవచ్చు కానీ నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా డబ్బును మరింతగా ముద్రించడం ద్వారా లేక పేదలకు అందిస్తున్న సబ్సిడీలలో (ఇవి బడ్జెట్లో 6.6 శాతం) లేక వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలపై పెడుతున్న వ్యయంపై కోత విధించడం ద్వారా రక్షణరంగానికి చేస్తున్న వ్యయాన్ని బాధ్యతారహితంగా లేక రాజకీయ మూర్ఖత్వంతో పెంచిన పాపాన పోలేదు. కానీ అత్యంత శక్తిమంతుడైన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ దఫా ఏదైనా నాటకీయ చర్యకు నడుం కడుతారని పెట్టుకున్న అంచనాలు తప్పాయి. మోదీ ఎవరి తరపునో మూర్ఖుడిగా తన్ను తాను ముద్రించుకునే తరహా వ్యక్తి కాదు. అలాగని ఎవరినీ లెక్కచేయని యుద్ధవాది అసలే కాదు. మిలటరీ దుస్తుల్లో వ్యూహాత్మక భంగిమ పెట్టినంతమాత్రాన మోదీ పాకిస్తాన్ లాగా దివాలా తీసి, అడుక్కోవడానికి ఐఎమ్ఎఫ్ వద్దకు పరుగుతీసేటటువంటి, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే దేశంగా మాత్రం భారత్ను మార్చలేరు. అందుచేత భారతీయ వ్యూహాత్మక చర్చాక్రమం నేటి నూతన వాస్తవికతా స్థాయికి తగినట్లుగా తన వైఖరిని మార్చుకోవలసి ఉంది. ఏది మనకు తగినది అనే దానిగురించే ఆలోచించాలి. వృద్ధి అనేది జీడీపీకి అనుగుణంగానే పెరుగుతుంది. కాబట్టి 2024లో మన జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లకు చేరుకున్నట్లయితే, మన రక్షణ రంగ వ్యయం కూడా 2 శాతంకి మాత్రమే పెరుగుతుంది. కాబట్టి ఈ 2 శాతం మొత్తంతో ఎలాంటి రక్షణను, ఏ రకమైన రక్షణను కొనుగోలు చేయగలం అనే అంశం గురించే ఇప్పుడు మనం చర్చించాల్సి ఉంది. ప్రస్తుత సైనికబలగాల స్థాయిని చూస్తే భారతదేశం దీర్ఘకాలిక యుద్ధంలో (అంటే రెండు వారాలకు మించి సాగే యుద్ధం) పాకిస్తాన్తో పోలిస్తే చాలా బలంగా ఉంటున్నట్లు కనిపించవచ్చు. కానీ ఈరోజు ఇది సరిపోదు. పాక్తో గతంలో మనం చేసిన రెండు యుద్ధాలు కేవలం 22 రోజులు (1965లో), 13 రోజుల (1971) లోపే ముగిసిపోయాయి. కానీ ఇంత స్వల్పకాలిక యుద్ధతంత్రంలో నేడు పాకిస్తాన్ను భారత్ ఓడించలేదని క్రిస్టీన్ ఫెయిర్ సరిగ్గానే చెప్పారు. కాబట్టి మనం వేయాల్సిన ప్రశ్న మరింత సంక్లిష్టమైనది. పుల్వామా వంటి ఘటనల ద్వారా నయవంచనకు దిగుతున్న పాకిస్తాన్ను కఠినంగా శిక్షించడానికి భారత్ కీలక ప్రాంతాల్లో ఆధిక్యతను ఇప్పుడు చలాయించగలదా? అందులోనూ భారతీయ సైనికుల ప్రాణాలకు తక్కువ నష్టం వాటిల్లేలా (బాలాకోట్లోలాగా కాకుండా) సమర్థ యుద్ధతంత్రాన్ని భారత్ సాగించగలదా? ఈ దశలో, మన సైనిక బలగాలు కానీ, వైమానిక బలగాలు కానీ, పాకిస్తాన్ని కఠినంగా శిక్షించేటంతటి శక్తిని కలిగిలేవు. మూడువారాల యుద్ధాన్ని మర్చిపోండి, కానీ సరిహద్దుల్లో ఆధీనరేఖ వద్ద సైతం పాకిస్తాన్ మనకంటే మెరుగైన ఆయుధాలను, సుశిక్షుతులైన సైనికులను, స్నైఫర్ రైఫిల్స్ని, దానికి తగిన మందుగుండు సామగ్రిని మోహరించి ఉంచింది. ప్రత్యేకించి యూపీఏ పదేళ్ల పాలనలో గుణాత్మకంగా పెరిగిన మన వైమానికి శక్తి స్థాయి ఏమిటో ఫిబ్రవరి 26–27 తేదీల్లో జరిగిన పరిణామాలు తేటతెల్లం చేసి మనకు ఆనందం కలిగించాయి. అయితే పాకిస్తాన్పై సంపూర్ణ ఆధిక్యత మన నావికా బలగానికే ఉంది. కానీ పాక్ని శిక్షించడానికి నావికా బలగాన్ని ఉపయోగించడం అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. పైగా మనం సాగించే జలయుద్ధం వల్ల తక్కిన ప్రపంచానికి రవాణా పరంగా తీవ్ర ఇబ్బందులు కలగవచ్చు. పైగా రూ. 4.31 లక్షల కోట్ల రక్షణ రంగ బడ్జెట్లో అధికభాగం పెన్షన్లకు (రూ. 1.12 లక్షల కోట్లు) పోగా త్రివిధ దళాల వేతనాలకు రూ. 1.08,468 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక ఫిక్సెడ్ ఖర్చులు, నిర్వహణ, వినియోగ వ్యయాలకు మరొక లక్ష కోట్లు ఖర్చవుతోంది. ఇక మిగిలిన కొన్ని వందల కోట్ల డబ్బుతో రక్షణ రంగంలో కొనుగోళ్లకు ఎంత ఖర్చు పెట్టగలరు? అందుకే మన సాయుధ బలగాలు ఆధునీకరణ మంత్రం జపిస్తూ ప్రాధేయపడుతున్నాయి. ఇక్కడ సైనిక స్థావరం కావాలి, ఇక్కడ క్షిపణి కేంద్రం ఏర్పర్చాలి. ఇక్కడ రాడార్ నెలకొల్పాలి. ఇవన్నీ అత్యవసరాలే. అయితే ఈ అన్ని యంత్రాల కంటే మనిషి అంటే సైనికులు చాలా ముఖ్యమైనవారు. అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న దేశం మరింత సమర్థవంతంగా ఉండాలి. ఎక్కువ డబ్బును అది వెచ్చించలేకపోతే, కనీసం ఉత్తమంగా అయినా ఖర్చుపెట్టాలి. మీ ఖర్చు మొత్తం వేతనాలు, పెన్షన్లకే ముగిసిపోరాదు. మీ సైనికులకు మరిన్ని ఆయుధాలు కావాలి. కానీ ప్రస్తుత తరుణంలో ఇన్ని లక్షల మంది సైనికులను మనం భరించగలమా? మన బలగాలను సంఖ్యాత్మకంగా కాకుండా గుణాత్మకంగా మెరుగైన శక్తిగా మలచాల్సిన అవసరం ఉంది. భారత్కి ఇప్పుడు సూత్రబద్ధమైన మార్పు కావాలి. అంతేతప్ప మన వ్యూహాత్మక బృందాలు గత యుద్ధాలను మళ్లీ చేయాలనే తత్వానికి వెంటనే అడ్డుకట్టలేయాలి. వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta శేఖర్ గుప్తా -
‘గుజరాత్ మోడల్’ మారేనా?
బీజేపీ వెలుపల ఉన్న ప్రతిభావంతులను కూడా ప్రభుత్వ శాఖల్లోకి ఆహ్వానించే సంస్కృతికి గతంలో వాజ్పేయి పాలన నిదర్శనం కాగా మోదీ, షా ద్వయం పార్టీ వెలుపలి రాజకీయ శక్తులకు కేంద్రంలో చోటు కల్పించలేదు. పైగా ప్రొఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. చక్కటి అకడమిక్ ప్రతిష్ట ఉన్న ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కానీ తొలిదఫా పాలన మూడేళ్లు పూర్తయ్యాక, ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉపఎన్నికల్లో వెనుకంజ వేయడంతో మోదీ పాలనలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. పార్టీతో సంబంధంలేని బ్యురోక్రాట్లు అత్యంత కీలక స్థానాల్లోకి రావడం దీంట్లో భాగమే. కానీ విశ్వాసం, విధేయత కలిగిన వారికి మాత్రమే చోటిచ్చే గుజరాత్ మోడల్ పాలన ప్రాథమికంగా మారబోవడం లేదు. మోదీ–షాల నేతృత్వంలోని బీజేపీ పాలనా వ్యవస్థ అనేకమందికి ఏహ్యభావాన్ని కలిగిస్తుండవచ్చు కానీ వారి విధానాలను విశ్వసించేవారు మాత్రం దాన్ని ‘గుజరాత్ మోడల్’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ విధానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం స్పష్టంగా తిలకించవచ్చు. మోదీ విమర్శకులు ఈ పరిణామాన్ని 2002 తదుపరి విభజన రాజకీయాలు అని ముద్రవేసేశారు. అయితే గుజరాత్ నమూనా గురించి కాస్త తక్కువ వివాదాస్పదమైన వ్యక్తీకరణను కూడా మనం చూడవచ్చు. అదేమిటంటే కేంద్రీకృత పాలన. కావాలంటే ప్రధానమంత్రి కార్యాలయంలో తాజా మార్పుల కేసి చూడండి. మోదీ ముఖ్య సహాయకులలో ముగ్గురికి ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ కల్పించడం మునుపెన్నడూ జరగని, చూడని వ్యవహారం. మోదీ గుజరాత్ పాలనకు ఇది సహజ క్రమాభివృద్ధి మాత్రమే. కానీ, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ పరిణామాన్ని మోదీ పాలన నమూనాగా చెప్పుకుందాం. ఇది 2001–02లో గుజరాత్లో ఆవిష్కృతమైంది. 2002 నుంచి 2014 వరకు ఈ నమూనా పరిణమిస్తూ వచ్చింది. ఈ నమూనాను 2014లో మోదీ ఢిల్లీకి వెంటబెట్టుకుని వచ్చారు. ప్రధానిగా రెండో దఫాలో అది మరింత ప్రబలంగా మారనుంది. మోదీ నమూనాకు సంబంధించినంత వరకు అయిదు ముఖ్యమైన మూలస్తంభాలు కనిపిస్తున్నాయి. 1. విశ్వసనీయమైన లెఫ్టినెంట్ల ద్వారా పార్టీని పూర్తిగా అజమాయిషీ చేయగల సుప్రీమో చీఫ్ ఎగ్జిక్యూటివ్. 2. ఎంపిక చేసుకున్న కొద్దిమంది ప్రభుత్వ అధికారుల ద్వారా పాలించడం, వీరికి రిటైర్మెంట్ అనేదే ఉండదు. 3. ఒక దఫా పాలనలో సాధ్యమయ్యే ఫలితాలను ఇవ్వగల కొన్ని ఆలోచనలతో నడిచే మెíషీన్–మోడ్ పాలన. దీన్ని కొద్ది మంది వ్యక్తులు మాత్రమే నడుపుతుంటారు. 4. సైద్ధాంతిక బహుళ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సడలనివ్వకపోవడం. 5. పార్టీ లోపల, వెలుపల ప్రతిపక్షాన్ని మొత్తంగా తటస్థం చేయడం, దీనికి సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తారు. ఈ నమూనా గుజరాత్లో అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే గుజరాత్ ఒక మధ్య స్థాయి, సాపేక్షికంగా తక్కువ వైవిధ్యతలతో కూడిన రాష్ట్రం. ఇలాంటి నమూనా భారతదేశ వ్యాప్తంగా పనిచేయగలుగుతుందా అని చాలా అనుమానాలున్నాయి. ఇప్పటికే కొన్ని సార్లు ఈ నమూనా హెచ్చరికలు పంపింది. పెద్దనోట్ల రద్దు, విదేశీ విధానంలో కొన్ని వెనుకంజలు (ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాల్లో ప్రారంభ విజయాల తర్వాత), వృద్ధి క్షీణత, ఉద్యోగాలు కోల్పోవడం, 2017 గుజరాత్ ఎన్నికల ఫలితం వంటివి వీటిలో కొన్ని. కానీ అంతిమంగా వచ్చిన ఫలితాలే ముఖ్యమైనవి. కేంద్రంలో బీజేపీ పార్టీ 303 స్థానాలతో కుదురుకుంది. అన్ని రాజధానీ నగరాలకు మల్లే, ఢిల్లీ మొట్టమొదటి లక్షణం బ్యురోక్రటిక్ తత్వం. అందుకే మోదీకి కూడా తన ముగ్గురు సహాయకులకు పదోన్నతి కల్పించక తప్పలేదు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్. జైశంకర్ను విదేశీ వ్యవహారాల మంత్రిగా ఎంచుకున్నాక, ర్యాంకుల పరమైన అవరోధాన్ని అధిగమించడానికి మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా ప్రమోట్ చేయక తప్పింది కాదు. ఆ విధంగా దోవల్ని ప్రమోట్ చేశాక, ఐఏఎస్ నుంచి నృపేంద్ర మిశ్రా, పీకే మిశ్రాలకు సమాన స్థాయిని ఇవ్వక తప్పలేదు. ప్రోటోకాల్కి సంబంధించిన ఈ అనివార్యతలను మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముంది. గతంలో కూడా మంత్రుల స్థాయి లేని వారికి కేబినెట్ ర్యాంకు కల్పించక పోలేదు. ప్రత్యేకించి ప్లానింగ్ కమిషన్, నీతి అయోగ్ అధిపతుల విషయంలో ఇలాగే జరిగింది. ఇక యూపీఏ–2 హయాం లోనూ నందన్ నీలేకనికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధిపతిగా స్థానం కల్పించారు. అయితే ఇలాంటి వివరణ మూడు అంశాలను తప్పించుకోలేదు. మొదటగా, మోదీ ప్రపంచంలో వివరణ అనే భావనే తార్కిక విరుద్ధమైనది. రెండోది, మోదీ అనివార్యతకు గురై ఈ మార్పులను చేయాల్సి వచ్చిందని ఇది సూచి స్తోంది. పైగా బ్యూరోక్రాటిక్ ప్రొటోకాల్ విషయంలో తప్పితే మోదీకి ఏ సందర్భంలోనూ బలవంతపు నిర్ణయాలను తీసుకున్న చరిత్ర లేదు. అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత ఇలాంటి మార్పులను ఆయన ఎందుకు చేపట్టారు? మూడు, జైశంకర్కి ప్రథమ స్థాయిని కల్పించడంలో మోదీ ఎలాంటి ఒత్తిడికి, అనివార్యతకులోను కాలేదు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మోదీ ఆ మార్పుకు సిద్ధమయ్యారు. దానికనుగుణంగానే మిగతా మార్పులు కూడా సంభవించాయి. ప్రధానిమంత్రి కార్యాలయం అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక కార్యాలయాన్ని తలపిస్తోంది. ఇక్కడినుంచే కీలకమైన కేబినెట్ అధికారులు (మంత్రులు) పనిచేస్తుంటారు. విదేశీ వ్యవహారాల నుంచి స్వచ్ఛభారత్ వరకు మోదీ కీలకంగా భావించిన మంత్రివర్గాలను ఆజమాయిషీ చేయడం ద్వారానే మోదీ తొలి దఫా పాలనలో పీఎంఓ ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు ఎదిగారు నేరుగా తమ బాస్కే జవాబుదారీగా ఉండే కేబినెట్ మంత్రుల స్థాయికి ఎదిగారు. కాబట్టే ప్రధాని సమానులలో ప్రథముడు అనే వెస్ట్ మినిస్టర్ శైలి కేబినెట్ వ్యవస్థ ఇక అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థాయి కలిగిన ఇద్దరు శక్తివంతమైన ఎన్ఎస్ఏలపై విశ్వాసముంచి విదేశీ, రక్షణ శాఖలను నిర్వహిస్తుండగా, మన ప్రధానికి ఇప్పుడు ఇద్దరు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తోడుగా ఉంటున్నారు. మోదీ రెండో పాలనలో కొన్ని వ్యత్యాసాలు ఉంటున్నాయి. మొదటగా, ఆయన పార్టీని నేరుగా కాకుండా అమిత్ షా ద్వారా నడిపిస్తున్నారు. రెండు ఇందిరాగాంధీలాగా కొనసాగింపును ఒక సైద్ధాంతిక విషయంగా మోదీ భావించరు. ఆయన మార్పును కోరుకునే మనిషి. ఇక మూడోది ఏమిటంటే మోదీకి కుటుంబం కానీ వారసత్వం కానీ లేవు. ఈ ప్రాతిపదికన కూడా మోదీని అమెరికన్ అధ్యక్షుడితో పోల్చవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ తర్వాత బీజేపీకి చెందిన మరొక నాయకుడు వెలుగులోకి వస్తాడు తప్ప మరికొందరు నరేంద్ర మోదీలు ఆవిర్భవించలేరు. మోదీ తొలి దఫా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తార్కిక విమర్శ ఏమంటే ప్రతిభ లోపించిందనే. నేనుకూడా ఈ విషయాన్నే చెబుతూ, స్వతంత్ర భారత్లోకెల్లా అత్యంత ప్రతిభా రాహిత్య ప్రభుత్వంగా చాలాసార్లు చెబుతూ వచ్చాను. మోదీకి చాలా సన్నిహితంగా ఉన్న వారు దీన్నే సవాలు చేస్తూ ప్రతిభ, అనుభవం లేకుంటే ఏం.. మేం క్రమంగా నేర్చుకుంటాం అని సమర్థించుకునేవారు. కానీ మేం అధికారం గెల్చుకుని దాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వబోమని వారు చెప్పేవారు. ఇది వాజ్పేయి తరహా టీమ్–బిల్డింగ్ను పరిత్యాగం చేయడమే అవుతుంది. వాజ్పేయి ప్రతిభను ప్రతి చోటనుంచి వెలికి తీసేవారు. ఉదా. జస్వంత్ సింగ్ ఆరెస్సెస్తో సంబంధం లేని వ్యక్తి. యశ్వంత్ సిన్హా, రంగరాజన్ కుమార మంగళం బీజీపీలోకి చాలా లేటుగా ప్రవేశించారు. ఇక జార్జి ఫెర్నాండజ్ మొదటి, చివరి బీజేపీయేతర, కాంగ్రెసేతర మంత్రిగా రక్షణ శాఖను నిర్వహించారు. అరుణ్ శౌరీ శక్తివంతమైన మార్పు ఏజెంటు. తన శాఖలోకి ఆయన వెలుపలినుంచి మేధస్సును, సమగ్రతను తీసుకొచ్చారు. వాజ్పేయితో పోలిస్తే మోదీ, షాలు తమ తొలి దఫా పాలనలో పూర్తి వ్యతిరేక దిశలో నడిచారు. పార్టీ వెలుపలి ఏ రాజకీయ శక్తులకూ ప్రభుత్వంలో వీరు చోటు కల్పించలేదు. పైగా ప్రోఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. అత్యున్నతమైన అకడమిక్ ప్రతిష్ట కలిగిన ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. మనలాంటి విమర్శకులను కాలం చెల్లిపోయినవారని మోదీ–షా ద్వయం తోసిపుచ్చేవారు. ఆంగ్లేయతత్వం కలిగిన ఢిల్లీ కులీనుల పాత్ర లేకున్నా కేంద్రప్రభుత్వం నడవగలదనే వాస్తవాన్ని మాలాంటి వారు అంగీకరించరని వారు విమర్శించేవారు. కానీ నాలుగో సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉప ఎన్నికల్లో వెనుకంజ వేయడం జరిగిన తర్వాత కేంద్రంలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. దీంట్లో భాగంగానే రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్కే సింగ్, హర్దీప్ పురి వంటివారు ప్రభుత్వ శాఖల్లో ప్రవేశించారు. వారు తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నారు కూడా. జైశంకర్ వంటివారిని అత్యున్నత పదవుల్లోకి తీసుకోవడం కూడా దీంట్లో భాగమే. ఇప్పుడు పీఎంఓలో ముగ్గురికి ప్రమోషన్ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ఉన్నతాధికారులను వెనక్కి రప్పించి కీలక పదవుల్లో నిలిపారు. మోదీ నమూనాను ఇప్పటికీ గుజరాత్ నమూనాగానే మనం చూస్తున్నాం. కానీ గుజరాత్ను పాలించడం కంటే భారతదేశాన్ని పాలించడం సవాలుతో కూడుకున్నదని గ్రహించాక, బీజేపీలో లభ్యం కాని ప్రతిభావంతులు కూడా ప్రభుత్వానికి అవసరం అవుతున్నారు. మోదీ ఇప్పుడు పార్టీ వెలుపలి ప్రతిభ కోసం చూస్తున్నారు కానీ తమ కెరీర్లో అత్యంత విశ్వసనీయత సాధించిన వారినే మోదీ ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ బ్యూరోక్రాట్లతో కూడిన ‘కేబినెట్’ ద్వారా పాలన సాగించనున్న ప్రధాని మోదీ రెండో దఫా పాలనపై ఈ దృష్టితోనే మనం నిశిత పరిశీలన చేయాల్సి ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
క్రికెట్లో ‘బలిదాన్’ ఎందుకు?
టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి సైన్యంలో పనిచేయడం ఎంత ఇష్టమో తెలీనిది కాదు. కానీ తాను ఆడుతున్న మైదానంలో పిచ్ మీదికి తన రెజిమెంట్ చిహ్నాన్ని తీసుకుపోకుండా ఉండాల్సింది. క్రీడాకారులు ఎవరైనా సరే తమ దేశ సైనిక బలగాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కాకుండా ఆటలో గెలవడం ద్వారా మాత్రమే తమ తమ దేశాలకు వైభవాన్ని తెచ్చిపెట్టాలి. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతిరేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబడాలి. ప్రత్యేకించి క్రికెట్ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు. రాజకీయాలు ప్రజలను విభజిస్తుంటే క్రీడలు ఐక్యపరుస్తాయన్న పాత నానుడిని మనం ప్రశ్నించలేం. అందులోనూ గతంలో రెండుసార్లు ప్రపంచకప్ గెల్చుకున్న భారతదేశం ప్రస్తుత ప్రపంచకప్ సీజన్కి ఇది మరింతగా వర్తిస్తుంది. క్రీడలు ఐక్యపరుస్తాయి కానీ స్వపక్షపాతంతో మాత్రమే అవి ఐక్యపరుస్తుంటాయి. భారతీయులుగా మనం మన దేశ జట్టుతో ఐక్యమవుతాం. అలాగే ఇతర దేశాల జట్లు కూడా. అందుకనే, మహేంద్రసింగ్ ధోనీ అత్యున్నత త్యాగానికి చిహ్నమైన బలిదాన్ డేగర్ సంకేతాన్ని తన వికెట్ కీపింగ్ గ్లోవ్స్లో ధరించిన ఘటన వివాదాస్పదమైంది. ఇది భారతీయ పారామిలిటరీ బలగాలకు సంబంధించిన చిహ్నం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ధోనీ చర్యను వ్యతిరేకించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెటర్లు తమ శరీరాలపై, దుస్తులపై మత సంకేతాలను, జాతీయ లేక వాణిజ్య చిహ్నాలను లేదా లోగోలను ధరించడంపై పరిమితులున్నాయి. ఉదా‘‘కు ఐసీసీ, ఆయాదేశాల క్రికెట్ పాలనా సంస్థల ఆమోదం ప్రకారమే, క్రికెట్ క్రీడను స్పాన్సర్ చేస్తున్న సంస్థలకు చెందిన లోగోలను క్రీడాకారులు ధరించవచ్చు. అనుమతించిన జాతీయ చిహ్నాలను వారు ధరించవచ్చు. ఇవి కాకుండా ఏ ఇతర సాంప్రదాయిక చిహ్నాలను వీరు ధరించరాదు. సైన్యానికి సంబంధించిన చిహ్నాలను అసలు ధరించరాదు. ఎందుకంటే అది క్రీడామైదానమే తప్ప సైనిక దాడి కాదు. ధోనీని సైనిక లోగో కలిగిన గ్లోవ్స్ని ధరించేందుకు అనుమతించాలంటూ బీసీసీఐ.. ఐసీసీని అభ్యర్థించింది. ధోనీ గ్లోవ్స్ పట్ల భారీ స్థాయిలో ప్రజానుకూలత ఉంది. ప్రపంచకప్లో టీమిండియా, ధోనీ ధీరత్వంతో కూడిన ప్రదర్శనలకు మల్లే మన ప్రత్యేక సైనిక బలగాలు ఉడీ ఉగ్రవాద ఘటన అనంతరం మెరుపుదాడులు చేసి ఎంతోకాలం కాలేదు. మన సైనికబలగాలు పాక్ భూభాగంపై నిర్వహించిన ఈ మెరుపుదాడులకు విక్కీ కౌశల్ నిర్మించిన చిత్రం శాశ్వత స్థాయిని కల్పించింది. ఈ నేపథ్యంలో నిరోధించ వీలులేని మన జాతీయ వాదపు ఆకర్షక శక్తికి చెందిన రెండో వైపున నిలబడి ఏ భారతీయుడు వాదించబోతాడు? అయితే ఎవరో ఒకరు దీనికి వ్యతిరేకంగా నిలబడాలి. ఐసీసీ ఇక్కడే సరిగా వ్యవహరించింది. ధోనీ తన గ్లోవ్స్పై ధరించిన సైనిక లోగోనూ తీసివేయాలని ఐసీసీ తేల్చిచెప్పింది. స్పర్థ మాత్రమే ఉండే ఒక క్రీడా మైదానంలో చంపటానికీ, చావడానికీ సిద్ధపడటాన్ని ప్రతీకగా చూపించే లోగోలకు తావు లేదు. అందుకే జనాభిప్రాయం అనే సముద్రానికి వ్యతి రేకంగా మనలోనూ కొందరం తప్పకుండా ఎదురు నిలబ డాలి. ప్రత్యేకించి క్రికెట్ను ఎంతగానో ప్రేమిస్తూ, భారత జట్టు గెలవాలని కోరుకుంటున్న మనలాంటి వాళ్లం మన వ్యతిరేకతను ప్రకటించాలి. దీంతో ఎవరైనా మన క్రీడాపరమైన జాతీయవాదాన్ని ప్రశ్నించినా సరే మనం వెనుకంజ వేయకూడదు. దీనికోసం జీసస్ క్రైస్ట్ నుంచి పదాలు అరువు తెచ్చుకుందాం: తండ్రీ వీరిని క్షమించు. ఎందుకంటే వీరికి (దేశభక్తి లేదని మనల్ని నిందిస్తున్నవారు) తామేం చేస్తున్నదీ నిజంగానే తెలీదు. మొదటగా మన ‘జాతీయవాదుల’ వాదనలను, మన కమాండో– కామిక్ టీవీ చానల్స్లోని వారి డబ్బారాయుళ్ల వాదనలను పరిశీలిద్దాం. వీళ్లు ఇప్పటికే ‘ధోనీ.. ఆ గ్లోవ్స్ను వాడటం కొనసాగించు’ అంటూ హ్యాష్ టాగ్స్ పెట్టి మరీ కామెంట్లు సంధిస్తున్నారు. వీరి వాదన ఏమిటంటే ముందుగా మన సాయుధ బలగాలను మనం తప్పక గౌరవిం చాలి. రెండు, పాకిస్తాన్ వల్ల భారత్ ఇప్పటికే రక్తమోడుతోంది కాబట్టి పాక్కు వ్యతిరేకంగా వీలైన ప్రతిచోటా ఇలాంటి ప్రకటనలు చేయాల్సిందే. మూడు, ఒక వ్యక్తి ఎంపికను మీరు తోసిపుచ్చలేరు. ప్రత్యేకించి ధోనీ భారత ప్రత్యేక బలగాల్లో గౌరవనీయ లెఫ్టినెంట్ కర్నల్. పైగా సైన్యంలో చేరేందుకు అర్హతా పరీక్షగా పారాచూట్ నుంచి దుమికి మరీ తన సైనిక చిహ్నాలను (డేగర్, వింగ్స్) సాధించుకున్నాడు. కాబట్టి తాను పనిచేసే రెజిమెంట్ లోగోను తను వాడటాన్ని మీరు తృణీకరించలేరు. ఈ మూడో ప్రశ్నకు మాత్రం సులభంగానే జవాబివ్వవచ్చు. ధోనీ రెజి మెంట్ భారత్ కోసం క్రికెట్ ఆడటం లేదు. పైగా రెజిమెంట్ దుష్టులతో పోరాడుతున్నప్పుడు బీసీసీఐ చిహ్నాన్ని, హాకీ లేక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చిహ్నాన్ని సైనిక బలగాలు ధరించదు. కాబట్టి సాయుధబలగాలు వారి త్యాగాలను మనం తప్పక గౌరవించాలనడం ఆమోదిం చాల్సిందే. కానీ, కశ్మీర్లో పాకిస్తానీయులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మన క్రికెటర్లు ఇంగ్లండ్లోని లార్డ్స్, ఓల్డ్ ట్రఫోర్డ్, ఓవల్ తదితర మైదానాల్లో ఇలాంటి నిరసన ప్రదర్శనలు చేయాలనటం అర్థరహితమైన విషయం. నిరసన ప్రదర్శనలు చేసేది రాజకీయనేతలు, దౌత్యవేత్తలు కాగా సైనికులు యుద్ధాలు చేస్తారు. ఆటల్లో గెలవడం ద్వారా క్రీడాకారులు తమ దేశాలకు పేరు తీసుకొస్తారు. అంతే తప్ప క్రీడా దుస్తులు ధరించిన సమయంలో తమ సైనిక బలగాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారడం ద్వారా కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆటను ఇరుపక్షాలూ ఆడగలవు. భారతీయులు తమ సైనిక దుస్తులు, లోగోలను ధరించగలిగినప్పుడు, పాకిస్తానీయులు కూడా అదే పని చేయగలరు. ఇలాంటి స్ఫూర్తి తక్షణం సాధారణ ప్రజల్లోకూడా చొరబడగలదు. భారత్, పాక్ దేశాల్లో ప్రధానంగా జరిగేది ఇదేమరి. దీనివల్ల ఆటల్లో శతృత్వం పెరుగుతుంది. చివరకు ఇది ఇరాక్, ఇరాన్ దేశాల మధ్య గతంలో జరిగిన భీకర యుద్ధంగా మారిపోతుంది. జార్జ్ ఆర్వెల్ తన 1945 నాటి ‘ది స్పోర్టింగ్ స్పిరిట్’ అనే వ్యాసంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలు నిజాయితీగానే యుద్ధతంత్రాన్ని అనుకరిస్తుంటాయని రాశాడు. వీటిలో ముఖ్యంగా చెప్పాల్సింది క్రీడాకారుల ప్రవర్తన గురించి కాదని, ప్రేక్షకుల వైఖరినే అని తేల్చిచెప్పాడు. మన క్రీడాకారులూ, క్రీడాకారిణులు పాకిస్తాన్తో తలపడుతూ గతంలో కంటే ఎక్కువగా విజయాలు సాధిస్తున్నారు. ఆటలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూనే ఎవరినీ బందీలుగా పట్టుకోవద్దనే పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూన్నారు. ఇరుదేశాల జట్లూ స్నేహపూర్వకరీతిలో, క్రీడాస్ఫూర్తితో ఆడుతున్నారు. తమ ప్రత్యర్థుల కుటుంబాలు, పిల్లలతో కూడా సరదాగా గడుపుతున్నారు. ఈ తరుణంలో, అదృష్టవశాత్తూ మూడునెలల క్రితం బాలాకోట్లో మన సైన్యం వాస్తవానికి యుద్ధం చేయలేదు. ఎవరికీ ప్రాణనష్టం జరగని చిన్నస్థాయి దాడి మాత్రమే చేశారు. 1971లో ఇరుదేశాలు పూర్తి స్థాయి యుద్ధంలో మునిగి ఉన్న తరుణంలో కూడా సునీల్ గవాస్కర్, జహీర్ అబ్బాస్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టులో సభ్యులుగా కలిసి ఆడారు. మన వాయుసేన కరాచీపై బాంబుదాడులు జరుపుతున్న సమయంలోనే వారు ఈ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు. 1999లో కూడా కార్గిల్లో తీవ్రస్థాయి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరుదేశాల జట్లూ ఇంగ్లండ్లో సాగుతున్న ప్రపంచ కప్లో భాగం పంచుకున్నాయి. చేతులు కలిపారు. ప్రత్యర్థి జట్టులో ఎవరి షూ లేస్ అయినా ఊడిపోతే తాము వెళ్లి వాటిని సరిచేసేటంత గొప్ప ఔదార్యం ప్రదర్శించారు. మిలటరీ చిహ్నాలు, దుస్తులు, మెడల్స్, బ్యాడ్జిలు, బ్యాండ్లూ, కవాతులూ, ఫోజు వంటివన్నీ సాహసప్రవృత్తికి సంకేతాలు. ఆటగాళ్లు కూడా యుద్ధంలో విజయం, పరాజయం లాగే ఆటలో గెలుపు, ఓటమి అనే బ్యాగేజీని మోసుకెళుతూ ఉంటారు. జూన్ 16న భారత్–పాక్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్లో ఒక జట్టు గెలవడం మరొకటి ఓడిపోవడం తప్పదు. ఈ ఓటమిని మన సైన్యం యుద్ధాన్ని కోల్పోయింది అనే స్థాయిలో చూడాలా? ఓల్డ్ ట్రఫోర్డ్లో ఇరుపక్షాలూ తమ సైన్యాలను (ప్రేక్షకులు) తీసుకొస్తే ఏం జరుగుతుంది? బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులను పురమాయించాల్సి వస్తుంది. ‘ఆటలు దేశాల మధ్య సద్భావనను సృష్టిస్తాయని, ఫుట్బాల్లో కానీ, క్రికెట్లో కానీ ప్రపంచంలోని సాధారణ ప్రజానీకం మాత్రమే హాజరైనట్లయితే, వారు యుద్ధరంగంలో తలపడాల్సిన అవసరం ఉండద’ని జార్జ్ ఆర్వెల్ చెప్పాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్ను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించాడు. మానవ నాగరి కత ప్రపంచయుద్ధాలు, ప్రచ్ఛన్నయుద్ధాల నుంచి చాలా ముందుకెళ్లింది. తరచుగా నెలకొనే క్రీడా సంబంధాలు పాత శత్రుత్వాలకు విరుగుడుగా పనిచేస్తాయి. ఇవి ఆటగాళ్లను, వారి అభిమానులను, వారి కుటుంబాలను, స్నేహితులను పరస్పరం నేర్చుకునేలా చేస్తాయి. ప్రజల మధ్య సంబంధాలను పెంచుతాయి. ఒక్కొక్కసారి ఆట మధ్యలో ఏర్పడే నిస్పృహనుంచి బయటపడేలా పరస్పరం సహకారాన్ని పంచిపెడతాయి కూడా. ఒలింపిక్స్ నుంచి పింగ్ పాంగ్ వరకు, బాస్కెట్ బాల్ నుంచి క్రికెట్ వరకు, సాకర్ నుంచి హాకీ వరకు నిర్దాక్షిణ్యంగా సాగే క్రీడా స్పర్థ... సైనికీకరణకు గురైన శత్రుత్వాలను తగ్గించడంలో, మన మనస్సులకు తగిలిన గాయాలను మాన్పడంలో కూడా సహకరిస్తోంది. మన సైన్యం పట్ల వ్యక్తిగతంగా ప్రదర్శించే అంకితభావాన్ని మనం తప్పకుండా అభినందించాలి. పైగా సైన్యంలో గౌరవ హోదాలో పనిచేసే వ్యక్తి తన బ్యాడ్జిని ప్రదర్శించుకుంటే దాన్ని మనం గౌరవించాలి. ధోని ఇందుకు ఉదాహరణ. పద్మ అవార్డును స్వీకరించడానికి ధోనీ ప్రత్యేక బలగాలకు చెందిన పూర్తి లాంఛనాలు ధరించి వెళ్లాడు. ఇది నిజంగానే మంచి సంకేతం కూడా. ఎందుకంటే రాష్ట్రపతి సాయుధ బలగాల సర్వ సైన్యాధ్యక్షుడు మరి. అలాగని ధోనీ తన రెజిమెంట్ మొత్తాన్ని తీసుకుని మైదానంలోకి వెళ్లలేదు. పైగా వికెట్ల వెనుక ధోనీ ఏనాడూ శత్రువును సంహరించే సహజాతంతో ప్రవర్తించలేదు. క్రీజు దాటి ముందుకెళ్లిన బ్యాట్స్మన్ను స్టంపౌట్ చేసిన ప్రతిసారీ తన గ్లోవ్స్లో ధరించిన డేగర్ స్ఫూర్తిని పొందుతూనే ఉంటాడు. అంతే తప్ప ప్రపంచంలోకెల్లా అత్యంత భయంకరమైన స్టంపర్గా ధోనీ ఏరోజూ కనిపించలేదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాశీ పునర్వికాసం.. మొదటికే మోసం?
గత 15 సంవత్సరాలుగా భారత్, దాని పొరుగుదేశాల్లో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నప్పుడు గోడమీది రాతలు అనేది ఒక అన్యాపదేశక పదబంధంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఎందుకంటే అతిపెద్ద పండుగల కంటే ఎన్నికల సమయంలోనే ఉపఖండంలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రజల మనస్సుల్లో ఏముంది? వారి ఆశలు, ఆకాంక్షలు, సంతోషాలు, ఆందోళనలు, భయాలు ఏమిటి అనే అంశాలు అన్నీ ఎన్నికల సమయంలో గోడమీది రాతలను చదవడం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అది గోడమీది బొమ్మలు కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ఆకాశంలో వేలాడే బొమ్మలు, ఇంటి ఆవరణలు, లేదా రాళ్లూ రప్పలపై గీసే బొమ్మలు.. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయానికి అసలైన సంకేతంలా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం వారణాసిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. తాజాగా అక్కడ పోగుపడిన రాళ్లపై నడుస్తున్నప్పుడు ఒక బుల్డోజర్ కొన్ని గజాల దూరంలో ఆ ప్రాంతాన్ని చదును చేస్తూండటాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఉన్న గోడల్ని కూడా పరిశీలించవచ్చు. అక్కడి రాతల్ని మీరు చదవలేరు. ఎందుకంటే అక్కడ మీరు చదవడానికి ఏమీ లేదు. గతంలో ఉపయోగంలో ఉండి ఇప్పుడు శిధిలాలుగా మారిన అక్కడి దృశ్యాలకేసి చూడండి. వాటిపై నా సహోద్యోగి షోహమ్ సేన్ గీసిన చిత్రాలు చూడండి. లేదా వాటిపై మేం తీసిన వీడియోలను మా వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంటులో చూడండి. ఇవి నిన్నటివరకు అక్కడ కనిపించిన తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, కప్బోర్డులు వంటి వాటి అవశేషాలకు సంబంధించిన చిత్రాలు. ఇవన్నీ అక్కడి గోడలపై ఏదో జిగురుతో అతికించి మళ్లీ అక్కడినుంచి మొరటుగా లాగిపడేసిన చందాన కనిపిస్తాయి. మిమ్మల్ని ఎవరైనా ఆకాశం నుంచి కిందికి వదిలినట్లయితే, ఒక వింతైన కళాచిత్రాల మధ్యలోకి మీరు ఊడిపడుతున్నట్లు మీకనిపించవచ్చు. లేక, అది మరొక మ్యాడ్ క్యాప్ ఫెవికోల్ యాడ్ చిత్రణగా కూడా ఉండవచ్చు: ఫెవికోల్తో మీరు రెండు ఇళ్లను కలపండి, వాటిని బుల్డోజర్తో కూల్చివేయండి. ఇళ్లు మొత్తంగా కూలిపోయినా మా జాయింట్లు మాత్రం నిలబడే ఉంటాయి. వారణాసి గతం ఇక చరిత్రేనా? వారణాసిలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరిగింది. కేవలం 4.6 హెక్టార్ల (11.4 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో 300 ఇళ్లు, ఆలయాలు, ఇతర భవనాలు ఉండేవి. వీటిలో చాలావరకు ఎంత సన్నిహితంగా ఉండేవంటే, ఏకకాలంలో ఇవన్నీ కలిసి నిర్మించినట్లుగా కనబడుతుండేవి. వీటి కింది భాగంలో వారణాసికే పేరు తెచ్చిన లేదా అపఖ్యాతి తెచ్చిన బైజాంటైన్ గల్లీలు (సందులు) ఉండేవి. ఇవి ఎంత ఇరుకుగా ఉండేవంటే ఇద్దరు మామూలు ఆకారంతో ఉండే మనుషులు మాత్రమే నడవగలిగేటంత సన్నగా ఉండేవి. ఇదంతా ఇప్పుడు చరిత్రలో కలిసిపోయింది. హిందూమతానికి చెందిన అతి పవిత్రమైన, పురాతనమైన కాశీ విశ్వనాథాలయాన్ని ఇన్నాళ్లుగా కనుమరుగు చేస్తూ వచ్చిన ఆశ్రమాలను కూల్చివేశారు కాబట్టి హిందూ ప్రపంచం మొత్తంగా ఆలయాన్ని గంగా ఘాట్ల నుంచి నేరుగా తిలకించవచ్చని మోదీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికంటే ముఖ్యంగా సాపేక్షంగా నిరాడంబరంగా కనిపించే ఆలయాన్ని సగటు హిందువులు వీక్షిస్తున్నప్పుడు ఔరంగజేబు 1669లో అక్కడే నిర్మించిన జ్ఞాన్వాపి మసీదు కూడా వారికి కనబడుతుంది. కాశీ విశ్వనాథుని మూల ఆలయాన్ని ధ్వంసం చేసి మరీ ఔరంగజేబు ఆనాడు నిర్మించిన మసీదు ఇది. ఇది ఇప్పుడు అందరికీ కనబడుతుంది కాబట్టి మిలిటెంట్ హిందువుల కళ్లకు ఇది కంటగింపుగా మారి వారు తదుపరి కూలగొట్టే లక్ష్యంగా మారవచ్చు కూడా. కాశీలో మసీదు చెక్కుచెదరదు అయితే ఈ ప్రమాదం జరిగే అవకాశం తక్కువేనని నాకు అనిపిస్తోంది. ఈ మసీదును ఇప్పటికే 30 అడుగుల ఎత్తు ఉన్న భారీ ఉక్కు స్తంభాలతో, ఆటోమేటిక్ రైఫిళ్లు ధరించిన సీఆర్పీఎఫ్ బలగాలతో కాపాడుతూ వస్తున్నామని కాశీ విశ్వనాథాలయం అభివృద్ధి సంస్థ సీఈఓ విశాల్ సింగ్ తదితర అధికారులు చెప్పడం వల్ల నేను ఈ అభిప్రాయానికి రాలేదు. నాది అధికారుల వర్ణనకు మించిన వాస్తవిక దృక్పథం. ప్రస్తుత పాలకులు హింసాత్మకమైన మెజారిటీ ముసుగులోని నిరంకుశ అసంతుష్టిపరులే అయినప్పటికీ, మన వ్యవస్థలు రాజ్యాంగాన్ని ఏమాత్రం పరిరక్షించలేనంత బలహీనంగా మారిపోయి ఉన్నప్పటికీ కనుమరుగు ప్రదేశంలో ఉండకుండా అందరూ చేరగలిగిన, చూడగలిగిన భవంతికి ఎవరైనా హాని కలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నా అభిప్రాయం.కాబట్టి ఆలయాన్ని ఘాట్ల నుంచి నేరుగా చూసేందుకు అవకాశం కల్పిస్తూ, గంగానదికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో పునరభివృద్ధి పనులు చేస్తున్నందువల్ల అక్కడున్న మసీదుకు ప్రమాదం కలిగే అవకాశం ఏమాత్రం లేదు. అంజుమాన్ ఇంతెజామియా మస్జిద్ తరపున ఇలాంటి భయాలను వ్యక్తంచేస్తూ కొందరు స్థానిక ముస్లిం నేతలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. అయితే అంతకుమించిన వ్యతిరేకత వాస్తవానికి వారణాసి హిందూ సంప్రదాయవాదుల నుంచి ఎదురవుతోంది. ఆలయ ఆవరణలోని నీలకంఠ గేటునుంచి పవిత్రమైన మణికర్ణిక ఘాట్ (అంత్యక్రియలు జరిగే చోటు) వరకు కనెక్ట్ అయి ఉన్న ఇరుకు సందు గుండా నడుస్తూ అక్కడున్న స్థానిక రచయిత, జర్నలిస్టు, మేధావి త్రిలోచన్ ప్రసాద్ను కలిశాం. ఆయన ఆగ్రహంతో దహించుకుపోతున్నారు. మార్పుకు వీల్లేని దైవసంకల్పిత స్థలంతో మార్పుకు ఎవరు సాహసిస్తున్నారు? మా వారసత్వాన్ని, పవిత్రమైన ప్రతి అంశాన్ని వారు ధ్వంసం చేస్తున్నారు. దీనికోసం వందలాది కోట్ల రూపాయలను వృధా పరుస్తున్నారు. ఒక జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు అన్నది త్రిలోచన్ ఆగ్రహానికి కారణం. ప్రమాదాలను స్వాగతించే ప్రధాని మీరు ఇష్టపడండి లేక వ్యతిరేకించండి, ప్రధాని నరేంద్రమోదీ ప్రమాదాలను ఆహ్వానించే వ్యక్తి. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో 296 భవనాల కూల్చివేతతో ముడిపడివున్న 4.6 హెక్టార్ల ప్రాంత పునర్వికాస కార్యక్రమం మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే అటు ఉదారవాదులే కాదు.. కాశీ ఆలయ శాశ్వతత్వం, శతాబ్దాలుగా మార్పుకు గురికాని దాని విశిష్టత పట్ల గర్వంగా ఫీలయ్యే బ్రాహ్మణ ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో చాలామంది సంప్రదాయకులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. నివాస స్థలాల కూల్చివేతకు ప్రభావితమవుతున్న వారిలో దాదాపు 90 శాతం మంది బ్రాహ్మణులే. దాని పూజారుల్లాగే కాశీలో రాజకీయాలతో సంబంధమున్న పండితుల జనాభానే అత్యధికంగా ఉంటోంది. మోదీ–యోగీలు కాశీ ఆలయ ఆవరణలో తలపెట్టిన ఈ దుస్సాహసిక చర్య వల్ల 60 వేల నుంచి 75 వేల మంది ఓటర్లు వారికి దూరమవుతారని వీరిలో చాలామంది ఢంకా భజాయిస్తున్నారు. దీనికి ముందు,వెనకా జరిగిన ఘటనలను అర్థం చేసుకోవడానికి కాశీ ఆలయ అభివృద్ధి సంస్థ సీఈఓ ఆఫీసులోని చార్టులు, ప్లాస్టిక్ నమూనాల కేసి మనం చూడాలి. ఈయన మేరీల్యాండ్ యూనివర్శిటీ నుంచి పాలనా రంగంలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్నారు. యూపీ అసెంబ్లీలో నూతన చట్టం తీసుకొచ్చాక ఆలయ అభివృద్ధి సంస్థకు, పాత భవనాల కొనుగోలుకు రూ. 600 కోట్లు కేటాయించారు. ఆ ప్రాంతంలో భూములకు ఉన్న రేట్లకు రెట్టింపు మొత్తాన్ని యజమానులకు చెల్లించారు. వారు బాగానే సంతోషిస్తున్నట్లు కనబడుతోంది. భూ యజమానులకు రూ. 200 కోట్లు చెల్లించారు. ఇక భవనాలపై యాజమాన్యం లేకున్నప్పటికీ కిరాయి హక్కులు తమకే ఉన్నాయని ప్రకటించిన వారికి మరో రూ. 15 కోట్లు చెల్లించారు. ఇక ఆలయ ఆవరణ ప్రాంతంలో 12 మంది యజమానులు మాత్రమే ఇంకా హక్కు కలిగి ఉన్నారు. ఆ ప్రాంతంలోని గృహ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం దాదాపుగా పూర్తయింది. ఆలయ ప్రాకారాన్ని కొత్తగా నిర్మించడానికి మార్చి 8న మోదీ భూమి పూజ కూడా నిర్వహించారు. మరో సంవత్సరంలో ఇక్కడ పని పూర్తవుతుంది. గతంలో ఇళ్ల మరుగున దాగివుండిన 43 ఆలయాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి. ఇవి దాదాపు ఆక్రమించిన ఆలయాలే. ఇక్కడ నిర్మాణాలు పూర్తయ్యాక, ఆలయ సముదాయం పాత వారణాసి ప్రకటించుకుంటున్నదానికి ఏమంత భిన్నంగా కనబడదు. వారణాసి ఎంపీగా మోదీ అయిదేళ్లు ఉన్నప్పటికీ పరిశుభ్రత, ఆధునికత, అందరికీ అందుబాటులోకి రావడం అనే లక్షణాలకు ఈ పట్టణం ఇంకా దూరంగానే ఉంటోంది. మరి దీనికోసం ఇంత రిస్క్ తీసుకోవలసిన అవసరం ఉందా? నగర అంతర్భాగాన్ని అభివృద్ధి చేయడం భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. మన నాయకుల్లో చాలామంది ఈ యుద్ధరంగానికి దూరంగా ఉండిపోయారు. నగరాల్లో అభివృద్ధి అనే చిక్కుముడిని మొదటగా ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంజయ్ గాంధీ. నన్ను ప్రశ్నించవద్దు అనే రకం పచ్చి నియంత అయిన సంజయ్ టర్క్మన్ గేట్, జామామసీదు విషయంలో ఏం చేశాడో తెలిసిందే. ఇక రెండో వ్యక్తి కూడా ప్రశ్నించడానికి వీల్లేని మతబోధకుడు మహమ్మద్ బర్హానుద్దీని సయద్నా. ఈయన ఇప్పుడు సెంట్రల్ ముంబైలోని రూ. 4,000 కోట్ల విలువైన బెందీ బజార్ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక మూడో వ్యక్తి నరేంద్రమోదీ. తేడా ఏమిటంటే, మోదీ చట్టాలను ఉపయోగించి, ప్రజలను ఒప్పించే తత్వంతో ఈ పని చేస్తున్నారు. హిందూ ఛాందసత్వానికి మోదీ సవాలు లౌకికవాదం పట్ల మోదీ నిబద్ధతను ప్రశ్నిస్తూనే, ఆయన ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదం బోలుతనాన్ని ఎండగడుతూనే కొన్ని ముఖ్యమైన అంశాల్లో మోదీ హిందూయిజం సామాజిక ఛాందసత్వాన్ని సవాలు చేస్తున్నారని అంగీకరించక తప్పదు. స్వచ్ఛ భారత్, బహిరంగ స్థలాల్లో మల విసర్జనకు వ్యతిరేక ప్రచారాలు వాటిలో ఒకటి. మరొక అంశాన్ని అందరూ ఇప్పుడు మర్చిపోయి ఉండవచ్చు. అదేమిటంటే, గుజరాత్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన అనేక ఆలయాలను నిర్దాక్షిణ్యంగా తొలగించడం. ఈ చర్య విశ్వహిందూ పరిషత్తు నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక కాశీ విశ్వనాథ కారిడార్ వల్ల వారణాసిలోని సాంప్రదాయకుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసివస్తోంది. వారణాసి గురించి చాలామంది విజ్ఞులు, సుప్రసిద్ధ వ్యక్తులు శాశ్వత ప్రభావం కలిగించేలా మాట్లాడారు. వారిలో మార్క్ ట్వైన్ ప్రశంస మరీ గుర్తించుకోవలసి ఉంది: ‘బెనారస్ చరిత్ర కంటే పురాతనమైంది, సాంప్రదాయం కంటే ప్రాచీనమైంది, పురాణాల కంటే పాతది, ఈ అన్నింటినీ కలిపినప్పటికీ రెండు రెట్లు పురాతనమైంది’. కానీ అలాంటి వారణాసి నేటికీ ఇరుకు, మురికితనం విషయాల్లో రెండు రెట్లు మించిన స్థాయిలో కొనసాగాల్సిందేనా? నిజంగానే హిందూయిజం దాని పవిత్రమైన, మోక్షాన్ని కలిగిస్తుందని చెబుతున్న పురాతన నగర వైభవానికి అర్హమైందే. ప్రస్తుతం కొత్తగా ఉన్న ఆలయంలో బుల్డోజర్తో చదును చేయడం ద్వారా ఏర్పడిన శూన్యత చుట్టూ ఉన్న గోడరాతలను చూస్తే మార్క్ ట్వైన్ సైతం ఆశ్చర్యపడతాడు. వారణాసి ఆలయ పరిసరాలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నాయి. వారణాసి నుంచి మరోసారి మోదీ ఎన్నికవుతారా అని కొద్దిమంది సందేహిస్తున్నారు. వారణాసిలోని సాంప్రదాయిక బ్రాహ్మణ పండితులకు చెందిన వేలాది ఓట్లను మోదీ కోల్పోనున్నారా అనేది మే 23న మాత్రమే మనం అంచనా వేయగలం. కానీ ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టును మోదీ పూర్తి చేసినట్లయితే, తన జాతీయవాద హిందూ నియోజకవర్గంలో అది ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టు పట్ల నేనెంతో ఉద్వేగపడుతున్నానని చెప్పడానికి సంతోషపడుతున్నాను. దేశంలోని ఇతర నగరాలకు వారణాసి పునర్వికాసం ఒక పూర్వ ప్రమాణంగా మిగిలి ఉంటుంది. ఢిల్లీలోని చాందినీ చౌక్కు పూర్వ వైభవం తేవడానికి ఇది దోహదపడవచ్చు కూడా. ప్రధాని నరేంద్రమోదీ ‘హిందూ హృదయ సామ్రాట్’గా కొనసాగాలంటే మధ్యయుగాల నాటి మసీదులను కూల్చివేయడం కన్నా పురాతన ఆలయాలను పునరుద్ధరించడమే ఆయన చేయగలిగే ఉత్తమ కార్యక్రమంగా ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
ఎదురుదాడిలో మమతే సరిజోడీ
ఈ దఫా సార్వత్రిక ఎన్నికల ప్రచారం అన్ని విషాల్లో కంటే భయంకరమైన విషంగా మారుతోందంటే కారణం బీజేపీ నిందాత్మక ప్రచారమే. కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిగా బరిలో ఉన్న పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎదురుదాడే లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. కానీ మోదీ–షాల ఈ నిందాత్మక ప్రచార శైలి పశ్చిమబెంగాల్లో మమతా దీదీ ముందు పనిచేయడం లేదు. కారణం మోదీ–షాలకు మల్లే అసలైన వీధిపోరాట యోధురాలు మమత. కాంగ్రెస్ పార్టీలో రాహుల్, ప్రియాకలతో సహా ఏ ఒక్క నేత కూడా స్ట్రీట్ ఫైటర్ కాదు. అందుకే తన బెంగాల్ గురించి, తన గురించి మోదీ–షా ద్వయం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మమత అంతే స్థాయిలో సవాలు విసురుతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి... వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నది మన సమాజంలో బాగా వ్యాప్తిలో ఉన్న సామెత. దీన్ని విషానికి విషమే విరుగుడు అని కూడా మీరు ఇంకాస్త పొడిగించి చెప్పవచ్చు. అయితే ప్రస్తుత ఎన్నికల ప్రచారం అన్ని విషాల్లో కన్నా భయంకరమైన విషంగా ఉంటోందని మనం చెప్పుకుంటున్నందున పై సామెతల్లో మూడోది మరింత సందర్భోచితంగా ఉండవచ్చు. ఈ విషప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ తనదైన భూమికను ఏర్పర్చిపెట్టారు. ప్రత్యర్థులను నిదించడంలో ఆయన సాధించిన ఈ విశిష్టతను ఏ ఒక్కరూ తోసిపుచ్చలేరు. ప్రతిపక్షాలను జాతి వ్యతిరేకులనీ, పాకిస్తాన్తో కుమ్మక్కయ్యారని, వారసత్వ కుటుంబాలు బెయిల్పై ఉంటూ త్వరలో జైలుకు వెళ్లనున్నారనీ.. ఇలా మోదీ దేన్నీ వదిలిపెట్టలేదు. కాగా మోదీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. వీరిలో ఒకరు ముస్లిం శరణార్థులను చెదపురుగులుగా వర్ణిస్తే, మరొకరు బజరంగబలి వర్సెస్ ఆలీ మధ్య పోలిక తెచ్చి విషం చిమ్ముతారు. దేశంలోని విస్తృత ప్రాంతాల్లో, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఈ తరహా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ కూడా వ్యత్యాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఈ పంథానే సాగిస్తోంది. తనపై ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ దీటుగానే ఎదుర్కొంటోంది. ఇందిరా గాంధీ పాకిస్తాన్నే రెండు ముక్కలు చేసి ఉండగా మా కుటుంబ దేశభక్తిని ఎలా శంకిస్తారు? మా నాన్న, మా నాన్నమ్మ ఇద్దరూ ఉగ్రవాదుల చేతిలో బలైనప్పుడు మేం ఉగ్రవాదం పట్ల మెత్తగా వ్యవహరిస్తున్నారని ఎలా ఆరోపించగలరని రాహుల్ బీజేపీని నిలదీస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాదనలో ఆత్మరక్షణ ధ్వనిస్తోంది. పైగా దాని శ్రుతి కూడా సరిగా లేదు. ఎందుకంటే విషాన్ని కొబ్బరినీటితో కడిగేయలేం కదా. దేశం మొత్తం మీద ఎక్కడా జరగనంత హింసాత్మకమైన ఎన్నికల ప్రచారం పశ్చిమబెంగాల్లో జరుగుతోంది. మాటల తూటాలు, భౌతిక దాడులు అక్కడ సహజమైపోయాయి. మోదీ, షాలు తనపై చేస్తున్న విమర్శలకు మమతా బెనర్జీ ఏ సందర్భంలోనూ వెనుకడుగు వేయలేదు. మీరు ఆమెను పరిహసిస్తే, ఆమె మిమ్మల్ని అదే స్థాయిలో హేళన చేస్తారు. మోదీ, షాల బీజేపీ బెంగాల్ని గత అయిదేళ్లుగా లక్ష్యంగా చేసుకుంటూ వస్తోంది. అధికార సాధనకు హిందూ–ముస్లింల విభజనే వారికి ఆధారం అయితే, ఉత్తరప్రదేశ్ కంటే బెంగాల్ వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అస్సాంలాగే బెంగాల్లోనూ ముస్లిం జనాభా 30 శాతం మేరకు ఉంది. అస్సాంలో కాంగ్రెస్లాగే పశ్చిమబెంగాల్లోనూ పాలకులు మొదట వామపక్షాలు, ప్రస్తుతం మమతా బెనర్జీ ముస్లింలను ఓట్ల కోసం దువ్వుతున్నారని, బుజ్జగిస్తున్నారనే అభిప్రాయం ఆ రాష్ట్రంలో ఉంది. అస్సాంలో ఇది బీజేపీకి విజయం సాధిం చిపెట్టినప్పుడు, బెంగాల్లోనూ ఇది పనిచేస్తుంది. అందుకే బీజేపీ నాయకులు పశ్చిమబెంగాల్లో ఈ దఫా ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లకు గాను 22 స్థానాలను కొల్లగొడతామని ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారు. 2014లో తనకు అత్యధిక మెజారిటీని ఇచ్చిన ఉత్తరప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఈసారి తనకు కలగనున్న నష్టాలను పశ్చిమబెంగాల్లో అధిక విజయాల ద్వారా పూడ్చుకోవచ్చన్నది బీజేపీ అంచనా అయితే పార్టీ ఈ అంశాన్ని పునరాలోచించుకోవాలి. బెంగాల్లో ప్రధాని మోదీ ర్యాలీలు ఉత్సాహకరంగానూ, భారీస్థాయిలోనూ సాగుతున్నది నిజమే. కానీ బీజేపీకి ఈ రాష్ట్రంలో పునాది తక్కువగా ఉన్నందున సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించడం అనేది కాంచన్జంగా పర్వతాన్ని ఎక్కినంత పనే అవుతుంది. ఎన్నికల ప్రచారంలో షాక్ కలిగించి భయపెట్టే తరహా బీజేపీ ఎత్తుగడల పట్ల మమత ఏమాత్రం జంకడం లేదు. కారణం రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ నేతల్లాగా కాకుండా.. మమత నిజమైన వీధి పోరాట యోధురాలు. వామపక్ష నిర్బంధ శిబిరంగా ఉన్న రాష్ట్రంలో మనుగడ కోసం పోరాటంలో గెలిచి వచ్చిన మమత, ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే కళలో ఆరితేరిపోయారు. దుర్గా పూజ జరుపుకోవడం కూడా బెంగాలీలకు కష్టంగా మారిపోయిందంటూ మోదీ మమత పాలనపై ఆరోపిస్తున్న సందర్భంలోనూ ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. ఆమె తాజా ఎన్నికల ప్రచార ర్యాలీలలో ఒకదాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ‘కొల్కతా శివారులోని భటాపరా (బారక్పూర్), రాజర్హాట్ ప్రాంతాల్లో దుర్గామాతకు పూజలు సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. మోదీ బాబూ, మా బెంగాలీల ఎదుట అలా గొంతు చించుకునే ముందు కాస్త హోమ్ వర్క్ సరిగా చేసుకుని రండి’ అని మమతా మాట్లాడుతుంటే క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా అంత వేగంగా మాట్లాడలేడనిపిస్తుంది. ‘హోమ్ వర్క్ చేయకుండానే పాఠశాలకు వెళ్లినప్పుడు టీచర్లు కూడా పిల్లలను మందలిస్తారు. మరి మీరు పచ్చి అబద్ధాలు చెబుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీరు బెంగాల్ వచ్చి ఇక్కడి ప్రజల ముందు నిల్చుని మీ రాష్ట్రంలో దుర్గా పూజలు జరగడం లేదని చెప్పండి చాలు...’ అంటూ మమతా వేదికలపై ఆవేశంగా మాట్లాడుతూ ‘మీరే చెప్పండి అమ్మలారా, అక్కలారా.. మనం దుర్గాపూజలు చేస్తున్నామా లేదా’ అంటూ నేరుగా తన సభలకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తుండగా జనం ‘అవును, పూజలు చేస్తున్నాం’ అంటూ వంతపాడుతున్నారు. దుర్గా పూజ చేయకుండా మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా.. గట్టిగా చెప్పండి అంటూ మమత అడుగుతున్నప్పుడు జనం లేదు లేదు అంటూ ముక్తకంఠంతో సమాధానమిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో లక్ష్మీపూజ, సరస్వతీ పూజ, క్రిస్టమస్ పర్వదినం, రమజాన్, చాట్ పూజ అన్నీ చేసుకుంటున్నాం కదా అని రెట్టించి అడుగుతుంటే జనం వంతపాడుతున్నారు. అందుకే బెంగాల్లో మోదీ మాటలు, బీజేపీ అసత్యాలు పనిచేయడం లేదు. వ్యక్తుల శీలహరణం చేసే దాని ఎత్తుగడలు పనిచేయడం లేదు అంటూ మమత స్పష్టత నిస్తున్నారు. అందుకే మీరు హోమ్ వర్క్ సరిగా చేయండి. దాన్ని మీ టెలిప్రాంప్టర్లో పొందుపర్చండి. అప్పుడే మిమ్మల్ని మీరు మూర్ఖులుగా ప్రదర్శించుకోలేరు మోదీ బాబూ అంటూ మమత హేళన చేస్తున్నారు. రాహుల్ను షాజాదా అంటూ మోదీ పరిహసిస్తున్న దానికంటే, మోదీని దొంగ అని రాహుల్ ఎద్దేవా చేస్తున్నదానికంటే మమత వందరెట్లు ఎక్కువగా మోదీ పనిపడుతున్నారు. మోదీకి అసలు సరస్వతీ మంత్రం అనేది ఒకటుం దని తెలుసా, దాన్ని సంస్కృతంలో జపిస్తారని తెలుసా అంటూ ఆమె దాడి చేస్తుంటే బహిరంగ సభలకు హాజరవుతున్న వందలాది ముస్లింలు సంతోషంతో పొంగిపోతుంటారు. ఆ వెంటనే మమత ఆహార వైవిధ్యం గురించి ప్రస్తావిస్తారు. ‘మోదీ బాబూ, మేం గుజరాత్ వచ్చినట్లయితే డోక్లా ఆరిగిస్తాం, తమిళనాడులో ఇడ్లీ, కేరళలో ఉప్మా, బిహార్లో లిట్టీ–చొఖ్కా, గురుద్వారాలో హల్వా, పంజాబ్లో లస్సీ ఇలా అన్ని రకాల ఆహారాన్నీ మేం తీసుకుంటాం. కానీ మీరు ప్రజలకు చేపలు, మాంసం, గుడ్లు తినవద్దని ఆదేశిస్తారు. గర్భిణి స్త్రీలు గుడ్లు తినవద్దంటూ ఆంక్షలు పెడతారు. చెప్పండి భాయీ, మహళ ఏం తినొచ్చో, ఏం తినగూడదో చెప్పడానికి నువ్వెవరు?’ అంటూ ఆమె మోదీని నిలదీస్తున్నారు. అంతేకాదు. ‘మోదీ ఏం తింటే అదే తినాలని దేశానికి చెబుతున్నారు.. ఆయన వాడే సూట్నే అందరూ కొనాలంటున్నారు. రోజు పొడవునా టీవీలో ఆయన ముఖాన్నే చూడాలని చెబుతున్నారు. నేను మోదీని గతంలో స్వార్థం లేని ఆరెస్సెస్ ప్రచారక్ అని భావించేవాడిని. కానీ కాఖీ నిక్కర్లతో పెరేడ్ చేసే ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు షాపింగ్ మాల్స్లో ప్యాంట్లతో తిరుగుతూ, బ్రీఫ్కేసులు మోసుకుంటూ కోట్లరూపాయలు సాధిస్తూ సంపదలతో విర్రవీగుతున్నారు’ అంటూ మమత ముక్తాయిస్తున్నారు. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు, వెంటనే రఫేల్ వ్యవహారం గురించి ప్రస్తావిస్తారు. చివరగా బీజేపీని పిడుగుపాటుకు గురిచేస్తారు. ‘ఇటీవల వరకు ఆకలి బాధతో ఉన్న పార్టీ, ఒకే బీడీని రోజులో మూడుసార్లు కాల్చి పీల్చుతూ వచ్చిన పార్టీ ఇప్పుడు వందల కోట్లకు యజమాని అయిపోయింది చూడండి’ అంటూ వ్యంగ్యబాణాలు సంధిస్తారు. ‘అయినా వారు తామింకా చౌకీదార్లమే అంటుంటారు’ అని మమత చెబుతుంటే కిందనుంచి జనాలు చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అంటూ నినదిస్తారు. రాహుల్ ప్రసంగాల్లో ఒక్కదానికి కూడా జనం ఇలా స్పందించడం మీరు చూసి ఉండరు. రాహుల్ బెంగాల్లో మమత ప్రత్యర్థే కానీ ఆమె రాహుల్ నినాదాన్ని నేర్పుగా తన సొంతం చేసేసుకున్నారు. కాంగ్రెస్ కనిపెట్టిన చౌకీదార్ చోర్ హై నినాదాన్ని ఒక రాష్ట్ర స్థాయి నేత అత్యత సమర్థవంతంగా ప్రయోగిస్తే దేశమంతా అది ఎలా మార్మోగుతోందన్నది ప్రశ్న. దీనికి క్లుప్త సమాధానం ఏదంటే మోదీ–షాల వ్యవహారాన్ని కాంగ్రెస్ ఇంకా అర్థం చేసుకోవడం లేదన్నదే. వాజ్పేయి, అడ్వాణీల్లా కాకుండా మోదీ–షాలు వీధిపోరాట యోధులు. వీరు తమకు అనుగుణంగానే బీజేపీ డీఎన్ఏను మార్చిపడేశారు. స్ట్రీట్ ఫైట ర్లతో పోట్లాడాలంటే మీకూ స్ట్రీట్ ఫైటర్లు కావాలి. ముల్లును ముల్లుతో తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడం, విషానికి విషంతోనే విరుగుడు కనిపెట్టడం అని ఈ వ్యాసం మొదట్లో నేను చెప్పిన దాని సారాంశ మిదే. 2019 ఎన్నికల్లో విషపూరితమైన, ప్రజలను విభజించే తరహా ప్రచారాన్ని మాత్రమే మోదీ–షాలు తమ బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటే, మమత దాని పరిమితులను ఎత్తి చూపుతున్నారు. లేక 42 మంది ఎంపీలున్న తమ రాష్ట్రంలో అది చెల్లదు అని ఆమె తేల్చిచెబుతున్నారు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మనం గుర్తించని వ్యూహాత్మక తప్పిదం
పాకిస్తాన్ బూచిని చూపి మరోసారి అధికారంలోకి రావచ్చని బీజేపీ–మోదీలు పెను ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దానికి అడ్డుకట్ట వేశారు. పైగా ఎన్నికల నేపథ్యంలో భారతీయ ప్రజాభిప్రాయాన్ని వేరుపర్చే కీలక పాత్రను ఇమ్రాన్ పోషిస్తున్నారు. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాక్కి మేలు చేకూరుతుందని, కశ్మీర్ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఇమ్రాన్ చేసిన ప్రకటన మన వ్యూహాత్మక తప్పిదాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. మన నేతలు ప్రజలను రాజకీయాల కోసం వేరుచేశారు. దేశం నిలువుగా చీలిపోయిన నేపథ్యమే మన ప్రత్యర్థికి మన అంతర్గత రాజకీయాల్లో వేలుపెట్టే అవకాశాన్ని కల్పించింది. వార్తలు నివేదించడానికి నేను తరచుగా పాకిస్తాన్ ప్రయాణిస్తూ ఉండేవాడిని. ఆ క్రమంలో నేను పాక్ వెళ్లడానికి మరోసారి వీసా అప్లికేషన్ దాఖలు చేస్తున్నప్పుడు న్యూఢిల్లీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పాక్ హైకమిషనర్ ఒకరు నన్ను పరిహసించడమే కాకుండా కొంచెం ఆగ్రహంతో ప్రశ్నించారు. ‘‘నా దేశ వ్యవహారాల్లో మీరెందుకు ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు?’’ ‘‘పాకిస్తాన్ రాజకీయాలు భారత అంతర్గత వ్యవహారం కదండీ’’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నేను ఆయనకు జవాబిచ్చాను. కాని ఇది తల్లకిందులుగా మారి, భారత్ రాజకీయాలు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలుగా మారే పరిస్థితి వస్తుందని ఆరోజు మేం అస్సలు ఊహించలేకపోయాం. నరేంద్రమోదీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే పాకిస్తాన్కి మేలు చేకూరుతుందని, కశ్మీర్ సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించవచ్చని ఈ వారం మొదట్లో ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనను మనం ఇలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ ఎన్నికల ఫలి తంపై ఇంత స్పష్టంగా తన వైఖరిని గతంలో ఏ పాక్ ప్రధాని అయినా ప్రదర్శించిందీ లేనిదీ గుర్తు చేసుకోవడం కష్టమే. పాకిస్తాన్ పౌరులు భారత్లో ఓటు వేయరు. భారతీయ ఓటర్లు ఇమ్రాన్ మాటలను వినరు. కాబట్టి భారత్లో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారంటూ మనం ఇమ్రాన్ను నిందించలేం. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ ఇమ్రాన్కి నోటీసు పంపలేదు. ఎందుకంటే ఈసీ నియమావళి పాకిస్తాన్లో వర్తించదు. కానీ ఇమ్రాన్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ సైతం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇక ఖండన గురించి చెప్పపనిలేదు. ఈ మౌనం మనకు ఏం సూచి స్తోంది? బహుశా ఈ మౌనానికి కారణం ఉంది. వ్యవస్థ మొత్తంగా ఒకే ఒక సుప్రీం లీడర్కి జవాబుదారీగా ఉంటున్నందున (ఇది నరేంద్రమోదీ గురించి నేను చేసిన వర్ణన కాదు. బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా వర్ణన) మోదీని సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఇమ్రాన్ ప్రకటనను ఖండించే ప్రమాదాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. ఆ ప్రకటన ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు. కానీ ఆ ప్రకటనను ఎవరూ స్వాగతించడానికి సాహసించడం లేదు. అలాగని ఇమ్రాన్కి ధన్యవాదాలు చెప్పడం లేదు. ఎందుకంటే, నరేంద్ర మోదీని మరోసారి భారత ప్రజలు ఎన్నుకుంటే పాకిస్తాన్కు అది మంచిచేస్తుందని, భారత్తో శాంతి స్థాపనకు ఇది సానుకూలమవుతుందని ఇమ్రాన్ చెప్పారు మరి. కేంద్రప్రభుత్వ ఎన్నికల ప్రచారంలోని కీలక ప్రభావిత అంశాలకు ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, దేశాభివృద్ధి వంటి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని పాకిస్తాన్, ఉగ్రవాదం, ముస్లింలవైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి నెలల సమయంపట్టింది. ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా సరే.. నిర్ణయాత్మక యుద్ధం చేయడం ద్వారా పాక్కు గుణపాఠం చెబుతామనే హామీ ద్వారా మళ్లీ గద్దెనెక్కాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. పాకిస్తాన్తో శాంతిస్థాపన అంశంపై అది ఓటు అడగటం లేదు. ఈ కోణంలో ఇమ్రాన్ వ్యక్తం చేసిన మెత్తటి మాటలు తనను ఏదోలా ఉచ్చులోకి దింపాలని చూస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాక్ కేంద్ర బిందువుగా మారడం మన రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి అని ముగించడం సంబద్ధంగా ఉంటుంది. ప్రత్యర్థి విసిరిన ఉచ్చులో చిక్కుకున్నదెవరు, దాంట్లోంచి తప్పించుకున్నదెవరు? అనే అంశానికి సంబంధించి మనం చాలా విషయాలు చూడవచ్చు. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా భారతీయ వ్యూహాత్మక విధానాన్ని ఎన్నికల అంశంగా మార్చుకోవడానికి పాక్ పూనుకుంది. సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించి ఒక ఉదాహరణ ఉంది. 1980 నాటి ఎన్నికల కేంపెయిన్లో ఇందిరాగాంధీ పదేపదే ఒక విషయాన్ని ఎత్తి చూపేవారు. మొరార్జీ దేశాయి నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంటోందంటే అతి చిన్న దేశాలు సైతం భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి పూనుకుంటున్నాయి అని ఆమె విమర్శించేవారు. ఇక పాకిస్తాన్కు సంబంధించినంతవరకు 1990ల ప్రారంభంలో బేనజీర్ భుట్టో భారత రాజకీయాలపై ముఖ్య ప్రకటన చేశారు. అది ఎన్నికల సమయం కాదనుకోండి. ఒకవైపు కశ్మీర్ తగలబడిపోతుండగా పీవీ నరసింహారావు మౌనమునిలా చూస్తుండిపోతున్నారని, భారత్లో ఎవరితో సంప్రదించవచ్చో తనౖకైతే తెలియదని ఆమె ప్రకటించారు. గాంధీ (నెహ్రూ, ఇందిర) కుటుంబసభ్యులు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆమె మరికాస్త జోడించారు. బేనజీర్ చేసిన ఆ అహంకార ప్రకటనకుగాను బారత్ ఆమెకు భయానక అనుభవాన్ని రుచిచూపుతుందని ప్రధానమంత్రి పీవీ కొంతమంది సంపాదకులతో భేటీ సందర్భంగా ఆగ్రహ ప్రకటన చేశారు. దాంట్లో భాగంగానే ఆయన మొదట్లో కశ్మీర్ ఉగ్రవాదం తొలి దశ పోరాటాలను ధ్వంసం చేసిపడేశారు. అంతకంటే మిన్నగా పంజాబ్లో ఖలి స్తాన్ తీవ్రవాదాన్ని తుదముట్టించేశారు. దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇవ్వడంలో పీవీ చాలా తెలివిగా ఉండేవారు. భారత ఎన్నికలపై ఏనాడూ ప్రభావితం చూపని పాకిస్తాన్ను అవకాశం ఇవ్వని వ్యూహాత్మక విజ్ఞత పీవీలో చాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్కి సరిగ్గా అలాంటి బహుమతినే బీజేపీ మోదీ ప్రభుత్వం అందించింది. ఇది తన ఉచ్చులో తానే పడిన చందంగా ఉంది. ఇప్పుడు భారత రాజకీయాలు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలుగా కనిపిస్తున్నాయి. మన దేశీయ రాజకీయాల్లో పాకిస్తాన్ బహిరంగ జోక్యం పట్ల ఎలా ప్రతిస్పందించాలో మోదీ ప్రభుత్వానికి తెలియడం లేదు. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే, ఈ వైరుధ్యాన్ని తక్కిన ప్రపంచం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. భారత్లో అధికారంలో ఉన్న వారు పాకిస్తాన్ని శత్రువుగా చేసి తీవ్ర జాతీయవాద ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపున పాకిస్తాన్ భారత్లో మోదీ ప్రభుత్వమే మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకుంటోంది. దీనిపై మీరు సొంత వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. ఇది దక్షిణాసియాలో మాత్రమే సంభవిస్తుంది. ప్రపంచం ఇప్పుడు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి తలకిందులుగా మారిపోయినట్లుంది. కౌటిల్యుడి నుంచి మాకియవెల్లి, హెన్రీ కిసింజర్ వరకు ఎవరి విజ్ఞతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మీరే ఎంచుకోవచ్చు. మనందరం మూడు కీలక అంశాలపై ఏకీభావం తెలుపుతాం. 1. మీపై మీరే జోస్యం చెప్పుకోవద్దు. 2. ఏ దశలోనైనా సరే మీ ప్రజాభిప్రాయాన్ని విభజించేటటువంటి దుస్థితిని మీరు ఎన్నడూ అనుమతించవద్దు. 3.అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, నీ దేశ జనాభాలో 15 శాతం, ఆర్థిక వ్యవస్థలో 11 శాతం, మీ విదేశీ మారక నిల్వల్లో 2.5 శాతం మాత్రమే ఉన్న ఒక విఫలదేశానికి.. వచ్చే అయిదేళ్లు మిమ్మల్ని ఎవరు పాలించాలి అనే అంశంపై ప్రభావితం చేసే అవకాశాన్ని మీరు ఎన్నటికీ ఇవ్వవద్దు. దానికి అనుమతించవద్దు. అమెరికా ఎన్నికలపై రష్యా ప్రభావం గురించి ముల్లర్ విచారణ కొనసాగడం, జూలియన్ అసాంజె అరెస్టుతోపాటు మనకు కూడా తాజా సందర్భం సవాలు విసురుతోంది. ఒక అతిచిన్న, పేద, నిరంకుశ, అణ్వాయుధాలు కలిగిన దేశం.. ప్రపంచంలోనే అతి పెద్ద శక్తివంతమైన ప్రజాస్వామిక వ్యవస్థను దాని ఎన్నికల సందర్భంగా ప్రభావితం చేసి దాని ఫలితాన్ని నిర్దేశించేందుకు పావులు కదుపుతోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మూడు కోణాలు ఉన్నాయి. అనేక రహస్యాలను తనలో ఉంచుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా ఉదారవాదంతో కూడిన వైరాగ్యాన్ని పెంచడం, ప్రజాస్వామిక వ్యవస్థల విశ్వసనీయతను ధ్వంసం చేయడం, బలమైన రాజకీయ నేతల వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం. ఒకప్పుడు అసాంజే, స్నోడెన్ అమెరికా సమాజానికి నిజమైన ఉదార ప్రతీకలుగా ఉండేవారు ఇప్పుడు వారు అమెరికా రాజకీయాలను వినాశనం దారి పట్టించినందుకు వీరిని ద్వేషించాల్సిన వ్యక్తులుగా అమెరికా ఉదారవాద మీడియా ముద్రిస్తోంది. అయితే ఈ విషయంలో మనం మరీ అతిగా వ్యవహరిస్తున్నామా? చిన్నదేశమైన పాకిస్తాన్ని మహా రష్యాతో పోలుస్తున్నామా? ఒక విషయం గుర్తుంచుకోండి. రష్యన్ ఆర్థిక వ్యవస్థ నేడు భారత్ ఆర్థిక వ్యవస్థలో సగంకంటే ఎక్కువగానూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ అతి చిన్న భాగంగానూ ఉంటోంది. మీరు మరీ మేధావిగా ఉండనక్కరలేదు. పాకిస్తాన్లో మూడు నక్షత్రాలు ధరించిన సగటు పాక్ జనరల్ ఐఎస్ఐలో లేక దాని ఒకానొక డైరెక్టొరేట్లలో కూర్చుని ఉంటున్నట్లు, అతడి తెలివి తన మెదడులో కాకుండా కాళ్లలో ఉంటుందని ఊహించుకోండి. మోదీ, బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని తామెందుకు భావిస్తున్నాం అనే అంశాన్ని ఇమ్రాన్ నిజంగానే ప్రపంచానికి చెబుతున్నారనుకోండి. ఇలాంటి సైనిక జనరల్ ఇమ్రాన్కి ఇచ్చే సలహా ఎలా ఉంటుందో తెలుసా? కశ్మీర్లోని కొంత భాగాన్ని ధ్వంసం చేయాలని, సర్జికల్ దాడులకు తిరుగు సమాధానం ఇవ్వాలని మాత్రమే. భారత్లో ఎవరైనా స్నోడెన్, అసాంజే లాంటి ఉదారవాదులు ఉన్నారా అని కనుగొనే ప్రయత్నం కూడా ఆ పాక్ జనరల్ చేయడు. పాకిస్తాన్ అలాంటి ప్రయత్నం చేస్తుందా? నాకైతే తెలీదు. చేస్తుం దని ఆశకూడా లేదు. మనం ఇప్పటికే చేసిన వ్యూహాత్మక ఘోర తప్పిదాన్ని చూడలేకపోవడం అనే బాధాకరమైన వాస్తవం నుంచి మనల్ని మనం దాపెట్టుకుంటున్నాం. ఆ తప్పిదం ఏమిటి? మన శత్రువును దేశీ యంగా ప్రజలను వేరుచేసే అంశంగా మల్చడం, మన అంతర్గత వ్యవహారాల్లో వారికి చోటు కల్పించడం. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కేంద్రంలో ‘ప్రాంతీయ’ ప్రాబల్యం!
ప్రస్తుతం దేశంలో నిజమైన జాతీయ పార్టీ ఏదీ ఇప్పుడు లేదని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. గతంలో జాతీయపార్టీలుగా పేరొందిన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోయాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనబడుతున్నాయి. వైఎస్సార్ ఆకస్మిక మరణానంతరం తన నిజమైన వారసుడిని ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ఏపీలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. 20 మంది శక్తిమంతులైన ప్రాంతీయ నేతలతో భారత్ నిజమైన ఫెడరల్ రిపబ్లిక్గా ఎదుగుతోంది. 2019 సార్పత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణం తప్పదు. భారతదేశాన్ని అవలోకించడానికి రెండు మార్గాలున్నాయని మీరు అర్థం చేసుకోదలిచినట్లయితే, మీరు తరచుగా దేశరాజధాని ఢిల్లీని వదిలి బయటకు రావాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే లోపలినుంచి బయటకు చూడటం.. అంటే ఢిల్లీ, దేశ ప్రధాన భూభాగం నుంచి వెలుపలకు తొంగి చూడటం లేక వెలుపలినుంచి లోపలికి చూడటం. అంటే దేశ ప్రధాన భూభాగాన్ని సుదూరం నుంచి చూడటం. మీరు లోపలి నుంచి బయటకు చూస్తున్నప్పుడు, జాతీయ పార్టీ, జాతీయ నాయకుల కోణం నుంచి మాత్రమే దర్శించే కోణాన్నే మీకు అందిస్తుంది. అలా కాకుండా సుదూరం నుంచి దాపరికం లేకుండా మీరు చూసినట్లయితే ఈ నూతన భారత్లో జరిగిన, జరుగుతున్న మార్పును మీరు చూడవచ్చు. అదేమిటంటే జాతీయపార్టీలుగా ఇన్నాళ్లుగా మనకు తెలిసిన పార్టీలు క్షీణించిపోతున్నాయి. మహా జాతీయ నేత అనే భావన ఇందిరాగాంధీతోనే ముగిసిపోయింది. భారత మహా రాజకీయ చిత్రపటంపై కొత్త చిత్రణలు ఈ వారం ఇద్దరు బలమైన రాష్ట్ర నాయకుల గురించి వివరించాయి. ఒకరు తెలంగాణలో తిరుగులేని నేత కె. చంద్రశేఖరరావు (టీఆర్ఎస్), రెండు. అంధ్రప్రదేశ్లో వైఎస్. జగన్మోహన్ రెడ్డి (వైఎస్సార్ సీపీ). భారత్లో నిజమైన జాతీయ పార్టీ ఇప్పుడు ఏదీ లేదని ఈ ఇద్దరు నేతలూ తమ శైలిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా వర్ణించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండు పార్టీల పాదముద్రలు కనపడుతున్నాయి. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బీజేపీని జాతీయపార్టీగా ఎందుకు చెప్పలేం. ఢిల్లీలో కూర్చున్న మనం దేశం అంటే హిందీ ప్రాబల్యం ఉండే భూభాగం అని అయోమయానికి గురవుతున్నాం. ఉదాహరణకు 2014లో బీజేపీ సాధించిన 282 స్థానాల్లో మెజారిటీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హరి యాణా, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ (190 స్థానాలు) రాష్ట్రాల నుంచే వచ్చాయి. బీజేపీ సాధించిన మిగతా సీట్లలో 49 స్థానాలు పశ్చిమప్రాంతమైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. అంటే ఈ అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 299 సీట్లలో 239 స్థానాలను బీజేపీ సాధిం చింది. అంటే 80 శాతం స్థానాలు ఇక్కడినుంచే వచ్చాయి. మిగిలిన దేశ మంతటా మొత్తం దక్షిణప్రాంతం (కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు), తూర్పున (పశ్చిమబెంగాల్, ఒడిశా), ఉత్తరాన జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని 244 సీట్ల నుంచి బీజేపీ 43 స్థానాలు మాత్రమే గెల్చుకుంది. అంటే 17 శాతం మాత్రమే అన్నమాట. ఈ వ్యత్యాసాన్ని పరిశీలిస్తే బీజేపీని దేశమంతటా పునాది ఉన్న జాతీయ పార్టీగా గుర్తించలేం. అది కేవలం పది రాష్ట్రాల్లో మాత్రమే గెలిచిన పార్టీగా కనిపిస్తుంది. మరి జాతీయ నాయకుల మాటో? నరేంద్రమోదీ ఒక్కరు మాత్రమే ఆ స్థాయిని ఇవాళ ప్రకటించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన తెలుసు. కానీ ఈ పది రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ప్రజలు తనకు అధికంగా ఓట్లు వేసేలా మోదీ మ్యాజిక్ చేయగలరా? బీజేపీకి మెజారిటీనిచ్చిన ఈ పది రాష్ట్రాల్లో కూడా స్థానిక పార్టీలు, స్థానిక నేతల నుంచే మోదీకి సవాల్ ఎదురైంది. బిహార్లో లాలూ ప్రసాద్, నితిశ్ కుమార్లు సరిసమాన స్థాయి నాయకులు. ఈ ఇద్దరిలో చెరొకరితో కాంగ్రెస్, బీజేపీ జూనియర్ భాగస్వామి స్థాయిలో పొత్తు కట్టాయి. పంజాబ్లో బీజేపీ అకాలీదళ్తో పొత్తుకలిపి ఉంది. హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ స్థానిక భాగస్వామికోసం గాలిస్తున్నాయి. చివరకు అసాధారణమైన వాగ్ధాటి కలిగిన మోదీ సైతం ఏడు రాష్ట్రాలకు మించి ఇతరత్రా తన పార్టీకి మెజారిటీ తీసుకువచ్చే పరిస్థితిలో లేరు. బీజేపీ 7 నుంచి 9 రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీ స్థాయిలో ఉండగా, కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ పార్టీగా ఉంటోంది. అది కూడా చాలా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే. అవేమిటంటే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, కేరళ, పంజాబ్, కర్ణాటక. ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్లో కాంగ్రెస్ ఉనికిలో లేకుండా పోయింది. అందుకనే ఓటర్ దేవుళ్లు ఎంత కరుణిం చినా కాంగ్రెస్ గురిపెట్టగల స్థానాలు 150 మాత్రమే. ఇవి కూడా వచ్చే అవకాశం లేదని నాకు తెలుసు. మహా అయితే 100 స్థానాలను అది లక్ష్యంగా చేసుకోవచ్చు. అయితే బీజేపీ అర్థ జాతీయ పార్టీగా తన్నుతాను నిరూపించుకుంటూండగా, కాంగ్రెస్ మూడిట ఒక వంతు కూడా జాతీయ పార్టీ స్థాయిని కలిగిలేదు. నిజానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలుపు సాధించగలిగిన నిజమైన చివరి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ మాత్రమే. ఆమె తదనంతరం 1984 డిసెంబర్లో జరిగిన అసాధారణ ఎన్నికలను మినహాయిస్తే నిజమైన జాతీయనాయకులు కానీ, పార్టీలు కానీ ఆవిర్భవించలేదు. రాజకీయపరమైన ఈ ఖాళీని ప్రజాకర్షణ కలిగిన శక్తిమంతులైన రాష్ట్రాల, కులాల నాయకులు భర్తీ చేశారు. వీరిలో ఏ ఒక్కరినీ ప్రాంతీయ స్థాయి నేత అని వర్ణించినా అది అపప్రయోగమే అవుతుంది. ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలు 1952–77 కాలంలో కేవలం 4 శాతం ఓట్ల శాతాన్ని మాత్రమే సాధించగా, 2002–2018 కాలంలో అది 34 శాతానికి పెరిగింది. ఈ వేసవిలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. తమకు వస్తున్న ఓటింగ్ శాతం ప్రకారం వీరు మరిన్ని స్థానాలను పొందగలరు కూడా. ఇవాళ 34 శాతం ఓటుతో ఈ పార్టీలన్నీ లోక్సభ స్థానాల్లో 34 శాతం గెల్చుకోగలవు. ప్రతి అదనపు ఒక శాతం ఓట్లకు గానూ వీరు 11 స్థానాలను అధికంగా పొందనుండగా, జాతీయ పార్టీలు మాత్రం ఒక శాతం అదనపు ఓట్లతో కేవలం 7 స్థానాలు మాత్రమే పొందగలవు. ప్రణబ్ రాయ్, దొరబ్ సోపరివాలా పొందుపర్చిన ది వర్డిక్ట్ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా నేను ఇలా చెబుతున్నాను. విభజన పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాటా సాంప్రదాయికంగానే 40 శాతం మేరకు ఉండేది. కానీ విభజనానంతర ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి పడిపోయింది. మోదీ మెజారిటీతో ఉన్నా, అమిత్షా బీజేపీ సభ్యత్వాన్ని 10 కోట్లకు పెంచినా అసోం, త్రిపుర మినహాయిస్తే, కొత్త ప్రాంతాల్లో ఈ పార్టీ ఎక్కడా గెలుపొందలేదు. వాస్తవానికి దేశంలోని ఒక పరిమిత భూభాగంలో లేక రాజకీయ జనసంఖ్యలో ఇవాళ దేశంలో 20 మంది నాయకులు చాలా బలంగా ఉంటున్నారు. మోదీతో సహా ఏ జాతీయ స్థాయి నేత కూడా వీరి ఓట్లను కొల్లగొట్టలేరు. వీరిలో చాలామందికి పాలనాపరమైన, రాజకీయ పరమైన అనుభవం ఉంది. వీరందరికీ విభిన్న భావజాలాలు, అభిప్రాయాలు ఉండవచ్చు కానీ జాతీయ పార్టీల ఆధిపత్యం పట్ల ఏవగింపును ప్రకటించడంలో వీరందరూ ఐక్యత కలిగి ఉంటున్నారు. హిందీ ప్రాంతాలకు, ఢిల్లీకి బయట ఉన్న విశాలమైన ప్రగతిశీల ప్రపంచం మన ప్రముఖుల అభ్రదత అంశాన్ని ఈ ఎన్నికల సీజన్లో పట్టించుకోవడం లేదు. మోదీ గెలవకపోతే ‘కలగూరగంపే’ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. దక్షిణాదిలోగానీ, తూర్పునగానీ మోదీ గెలవకపోతే ఎవరు అనే ప్రశ్నేలేదు. మూడు దశాబ్దాల తర్వాత, కాంగ్రెస్ ఓటమి తర్వాత భారతదేశం నిజమైన ఫెడరల్ రిపబ్లిక్గా ఎదుగుతోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కాంగ్రెస్, బీజేపీ ఆధిక్యం కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో ఒక్క చోటా అసలైన ప్రాంతీయ నాయకుడు లేకపోవడం. యూపీ, బీహార్లలో లాలూ, నితీశ్, మాయావతి, అఖిలేశ్ బలమైన నాయకులు. కానీ, ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. బీజేపీ వారిని ఎదిరించడం లేదంటే కలుపుకుపోవడం ద్వారా విజయాన్ని పంచుకుంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒక రకంగా కర్ణాటక సహా చాలా రాష్ట్రాల్లో వారికి బలమైన నాయకులు లేకపోయినా జాతీయ పార్టీలదే ఇప్పటికీ హవా. మరో కారణం బలమైన రాష్ట్ర నాయకులు ఎదగడానికి జాతీయ పార్టీలు సుముఖంగా లేకపోవడం. ఆంధ్రప్రదేశ్లో తన నిజమైన వారసుడు వైఎస్ జగన్ని ఎదగనీయడానికి బదులుగా కాంగ్రెస్ సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. సీఎం పదవిని ఆశించినందుకు ఆగ్రహిం చిన కాంగ్రెస్ పార్టీ, హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్కి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ వల్ల బీజేపీకి ఏమాత్రం లాభం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్లను ఇప్పటికే అది పక్కన పెట్టేసింది. దీంతో భారతదేశపు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశకు చేరుకున్నాయి. హిందీ ప్రాంతానికి బయట నిజానికి జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ ఏర్పడే అవకాశం లేదు. సంకీర్ణ ప్రభుత్వాల పట్ల అభద్రతా భావం కూడా తగ్గుముఖం పడుతోంది. 2014 ఫలితాల్లో వలే పక్కపక్కనే ఉన్న రాష్ట్రాల్లో 200 స్థానాలు సాధించినా సరే.. పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడే సూచనలు ప్రస్తుతం లేవు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయడానికేమీ లేదు. ఇవి ఎవరికైనా గాలివాటం ఎన్నికలే. 2014లో వలే కాకుండా 2004లో లాగా ఇవి రాష్ట్రాలవారీ ఎన్నికలని ఇప్పుడు మనం గట్టిగా చెప్పొచ్చు. తదుపరి సంకీర్ణానికి ఎవరు నాయకత్వం వహిస్తారని నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలీదు. తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించినా రాం విలాస్ పాశ్వాన్ లాంటి వాడు కూడా నోరు తెరవగలిగే మంత్రివర్గం ఏర్పడుతుందని మాత్రమే నేను మీకు చెప్పగలను. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
‘ఉగ్ర’బూచితో గెలుపు సాధ్యమా?
నరేంద్ర మోదీ 2014లో జాతికి గొప్ప ఆశను వాగ్దానం చేసి ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగా కాకుండా తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళ్లే వ్యూహాన్ని మోదీ పకడ్బందీగా ఎంచుకున్నారు. ఈ వ్యూహం వెనుక దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, వ్యవసాయ దుస్థితి వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయి. రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం హామీతో ఆలస్యంగా ముందుకొచ్చినా అతి తక్కువ సమయం కారణంగా అది దేశ ప్రజలను ఆకర్షిస్తుందా అనేదే ప్రశ్న. అధికారంలో ఉంటూ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందాలని చూసే నాయకుడు తన ఓటర్లను అడిగే స్పష్టమైన ప్రశ్న: మీరు నాకు గతంలో ఓటు వేసినప్పటి కంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగుందని భావిస్తున్నారా? కానీ నరేంద్ర మోదీ విషయానికి వస్తే ఆ ప్రశ్న మరోలా ఉంటుంది: మీరు నాకు అధికారం అప్పగించిన నాటి కంటే ఇప్పుడు మీరు మరింత సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారా? సమాధానం ‘అవును’ అయినట్లయితే, మీరు రెండో దఫా కూడా అధికారంలోకి రావచ్చని భావించవచ్చు. సమాధానం ‘కాదు’ అయినట్లయితే అదే ప్రజలు, అదే ఓటర్లు మిమ్మల్నే మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి? అయితే మోదీ ప్రపంచంలో మూడో సంభావ్యత కూడా సిద్ధంగా ఉంటుంది. 2008లో ముంబైలో బాంబు దాడుల నాటి కంటే మీరు ఇప్పుడు తక్కువ అభద్రతా భావంతో ఉన్నట్లు భావిస్తున్నారా? ఒక సాంప్రదాయిక రాజకీయ నేత ఎల్లప్పుడూ తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగానే ఓటర్ల వద్దకు వెళుతుంటాడు. కానీ తెలివైన రాజకీయనేత మాత్రం తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళతాడు. ఈ కోణంలో చూస్తే మోదీని తెలివైన నేత అని కాకుండా మరోరకంగా చూడలేం. నిజంగానే మోదీ తన అయిదేళ్ల పాలనలో కశ్మీరేతర భారతదేశంలో ఎలాంటి భారీ స్థాయి ఉగ్రవాద దాడిని చవిచూడలేదు. పంజాబ్ సరిహద్దుకు అత్యంత సమీపంలో గుర్దాస్పూర్, పఠాన్కోట్లలో రెండు విఫల దాడులను మినహాయిస్తే, పాకిస్తానీ ఉగ్రవాద బృందాలు భారత్లో మరెక్కడా దాడి చేయలేకపోయాయి. అంతకు ముందు యూపీఏ మలిదశ పాలనలో (2009–14) కూడా కశ్మీర్తో సహా భారత్ కూడా ప్రశాం తంగా ఉండిందని మనం గుర్తించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఆ విషయాన్ని మర్చిపోయింది. జాతీయ భద్రత విషయంలో తన సొంత విజయాల ప్రాతిపదికన మోదీ తాజా ఎన్నికల ప్రచారాన్ని సాగించడం లేదు. బదులుగా మరిన్ని అభద్రతల పునాదిపై తన ప్రచారం సాగిస్తున్నారు. మరోలా చెప్పాలంటే, నేను అధికారంలోకి వచ్చాకే జైషే, లష్కర్, ఐఎస్ఐ ఉగ్రవాదం పతనమైపోయింది చూడండి. 2014లో, మోదీ గొప్ప ఆశను వాగ్దానం చేసి మరీ ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్ నుంచి భీకరమైన ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తనను వ్యతిరేకించిన వారెవరైనా సరే, ప్రత్యేకించి కాంగ్రెస్ వ్యతిరేకిస్తే వాళ్లు పాక్తో కుమ్మక్కు అయినట్లే లెక్క. అందుకనే, ఉగ్రవాదులు, పాక్ మాత్రమే ఈ ఎన్నికల్లో తన ఓటమిని కోరుకుంటున్నాయని మోదీ చెబుతూ వస్తున్నారు. అదే ఊపులో తన ప్రత్యర్థి ఉగ్రవాదులపై మృదువైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు కూడా. సరిహద్దులు దాటి పాక్పై జరిపిన దాడుల్లో విజయానికి సంబంధించిన ఆధారాలను అడిగే సాహసం చేస్తూ ప్రతిపక్షం మన సాయుధ బలగాలను అగౌరవిస్తున్నారని కూడా మోదీ అలవోకగా ఆరోపిస్తున్నారు. 2014లో తానే రేకెత్తించిన గొప్ప ఆశాభావం స్థానం నుంచి 2019లో ఈ భయాలను రేకెత్తించే స్థితికి మోదీ ఎందుకు మారిపోయినట్లు? మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ ‘సంపూర్ణ రాజకీయాలు’ అనేభావనను నమ్ముతోంది. ఇక్కడ రాజకీయాలే 24 గంటలపాటు మీ ఏకైక వృత్తి, వినోదం, మనఃస్థితి, మత్తుగా ఉంటుంటాయి. ప్రభుత్వాధికారాన్ని ఏరంకంగానైనా సరే గెల్చుకునే తరహా రాజకీయాలను మనం ఇవాళ చూస్తున్నాం. గెలిచాక ఆ అధికారంతో ఏం చేస్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది.కాబట్టి కృత్రిమ ప్రచారంతో గారడీ చేస్తున్నట్లయితే అది చాలా పదునుగా ఉంటుంది, ఈ తరహా రాజకీయాలకు అది ఉపయోగకరం కూడా. మరోవైపున మీ ఐదేళ్ల పాలన రికార్డు ఆధారంగా తిరిగి గెలుపుకోసం వెళ్లడం అనేది ప్రమాదకరం. ఎందుకంటే అప్పుడు మీరు గతంలో చేసిన వాగ్దానాలకు, ఈరోజు వాటి అమలులోని వాస్తవికతకు మధ్య తేడాను ప్రజలు పోల్చి చూస్తారు. మీరు ఉద్యోగాల కల్పన గురించిన సకల సమాచారాన్ని దాచి ఉంచి జీడీపీ గణాంకాలను పైకి లేవనెత్తవచ్చు. కానీ మీరెలా ఫీలవుతున్నారు అని ప్రజలను అడిగారంటే మాత్రం వారు వెంటనే వాస్తవాలను శోధిస్తారు. మరుగుదొడ్లు, ముద్రా రుణాలు, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లు, వ్యవసాయానికి మద్దతునిచ్చే ప్రత్యక్ష నగదు బదిలీలు, విద్యుత్ కనెక్షన్లు వగైరా మీ పథకాల ద్వారా ప్రజలు వాస్తవంగా ఎన్ని మేళ్లు పొంది ఉన్నా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలు ఇంకా ఉండే ఉంటాయి. అవెంత ప్రమాదకరమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2004 నాటి భారత్ వెలిగిపోతోంది అనే ప్రచారార్భాటం గురించి ఎల్కే అడ్వాణీని అడిగి చూడండి చాలు. మోదీ ప్రారంభ ప్రసంగాలు పాక్, ఉగ్రవాదం, తన ప్రత్యర్థి పార్టీల అవినీతి, వాటి జాతీయవాద రాహిత్యం వంటి వాటిని సూచించేవి. కానీ ఉద్యోగాలు, వృద్ధి, వ్యవసాయ దుస్థితి వంటి అంశాలను తాను ప్రస్తావించేవారు కాదు. దీనర్థం ఏమిటి? ప్రతిపక్షం తనపై మోపే ఆరోపణలను సమర్థించుకోవడానికి భిన్నమైన పద్ధతిలో మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని రూపొందించుకుంటున్నారు. ఉగ్రవాదం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తర్వాత మరొక అంశం కూడా ముందుపీఠికొస్తుంది. ముస్లిం లను పక్కన బెట్టడం ద్వారా మోదీ, షాలు 2014 ఎన్నికల్లో గెలుపు సాధించారు. మంత్రిమండలిలో, అత్యున్నత రాజ్యాంగ, పాలనా పదవుల్లో ముస్లింలను పూర్తిగా మినహాయించే తరహా అధికార నిర్మాణాన్ని వీరు చేపట్టారు. దేశ జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ఏడుగురు అభ్యర్థులను మాత్రమే పోటీకి నిలిపి కూడా లోక్సభలో వారు విజయం సాధించారు. ఆ తర్వాత 20 శాతం మంది ముస్లిం జనాభా ఉన్న యూపీలో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలపకుండానే ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. మోదీ, షా వ్యూహం ఎంత విజయవంతమైందంటే, బీజేపీ ముస్లింలను ఇంతగా దూరం పెట్టడంపై సవాలు చేయడానికి కూడా కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదు. కారణం తననెక్కడ ముస్లిం పార్టీ అని ఆరోపిస్తారో అనే భయం. భావజాలపరంగా కూడా తనకు సవాలు ఎదురు కాకపోవడంతో మోదీ ముస్లింలను దూరం పెట్టడం అనే వ్యూహాన్ని మరింత విస్తృతపరుస్తారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ ధైర్యంతోనే మోదీ తనను పాకిస్తానీలు, ఉగ్రవాదులతోపాటు ప్రతిపక్షం కూడా ఈ ప్రాతిపదికనే ఓడించాలని భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ బలమైన ఓటు బ్యాంకు అయిన ముస్లింల వైఖరి ఎలా ఉంటుంది? కాబట్టి ఉగ్రవాదులు, పాకిస్తానీలతోపాటు, ముస్లింలు కూడా తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని మోదీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు తనకు ఓటువేయకపోతే ఏం ఫర్వాలేదు. వారికి వ్యతిరేకంగా హిందువులు ఐక్యమవుతారు. అయితే తోటి భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా నేరుగా ఇలా ప్రచారం చేస్తే అది ఫలితమివ్వదు. కాబట్టి ముస్లింల నుంచి ప్రమాదం ఉందని చెబితే చాలు. పాకిస్తానీ ముస్లింలు, భారత్ పాక్ అనుకూల కశ్మీరీలు, పాక్ అక్రమిత కశ్మీర్లోని ముస్లింలు, తూర్పున బంగ్లాదేశీ ముస్లింలు అంటూ ప్రచారానికి లంకించుకుంటే సరిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు అమలులో ఉన్న అన్ని దేశాల్లో ఈ ధోరణే ఇప్పుడు నడుస్తోంది. ట్రంప్ మొదలుకుని ప్రపంచంలో ప్రజాదరణ పొందిన నేతలందరూ తమ పునాది వర్గాల గురించి మాత్రమే మాట్లాడుతూ, ఇతరుల్లో భయాందోళనలు కలిగిస్తూ వారిని జాతీయ స్రవంతి నుంచి పక్కను నెట్టివేస్తున్నారు. ట్రంప్ నుంచి, నెతన్యాహు నుంచి మోదీ వరకు మెజార్టీగా ఉన్న ప్రజల్లో ఒక భయానక అనుభవాన్ని కల్పిస్తారు. తమ సొంత దేశంలో తామే మైనార్టీలు కానున్న భావన కలిగిస్తారు. అక్రమ వలసదారులను ట్రంప్ బూచిగా చూపిస్తే, దేశంలోనే ఉన్న వామపక్ష ఉదారవాదులు, మైనార్టీలు, ప్రతిపక్షం, స్వేచ్ఛాయుత మీడియా, నిర్బంధ ప్రతికూలతలను పెద్ద శత్రువుగా మోదీ చూపుతున్నారు. ఇది ప్రతిపక్షాన్ని ఎక్కడికి నెడుతుంది? మోదీ తన వర్గాన్ని సురక్షితంగా ఉంచుకోగా, మిగిలిన వారంతా చెల్లాచెదురుగా ఉండటంతో ఆయన గమ్యం చేరుకోవడం సులువవుతుంది. అవినీతి, జాతీయ భద్రత అంశాల ఆధారంగా కాంగ్రెస్ మోదీతో పోరాడలేదు. తాజా దాడులతో మోదీ అనితర సాధ్యమైన కోటను నిర్మించుకున్నారు. ప్రతిసారీ మోదీ విమర్శకులుగా గుర్తింపు పొందినవారు దాడులపై ఆయన ఉద్దేశాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మోదీ రెండు అంశాలను సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాన్ని విభజించడం, తన పద్ధతిలో వారిపై యుద్ధం చేయడం. కనీస ఆదాయ పథకం (ఎన్వైఏవై) వంటి ప్రకటనలతో కాంగ్రెస్ ఆలస్యంగా మేలుకొంది. కాంగ్రెస్ నెలకు ఆరువేలు ఇస్తామనడం, మోదీ చిన్న రైతులకు ఇస్తానన్న ఐదొందలు కంటే చాలా ఎక్కువ. సంప్రదాయకంగా చూస్తే కాంగ్రెస్ సంక్షేమ పార్టీ కాగా, బీజేపీ కేవలం జాతీయవాద పార్టీ మాత్రమే. తీవ్ర నిరుద్యోగికత, వ్యవసాయ సంక్షోభం, పరిష్కారం కనుగొనకుండా సాగదీయడంపై అసంతృప్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు. ప్రశ్న అల్లా ఏమిటంటే మోదీ ఎంపిక చేసుకుంటున్న ప్రచారాంశాలనుంచి బయటకు లాగి, తాను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం రాబట్టేంత నైపుణ్యం, వనరులు కాంగ్రెస్కు ఉన్నాయా అన్నదే. ఒకవేళ దీన్ని సాధించినప్పటికీ, భారత్లోనే అత్యంత నిరుపేదలు నివసిస్తున్న పశ్చిమబెంగాల్, ఒడిశా, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్కు పునాదులే లేవు. కానీ కనీస ఆదాయ పథకం అనేది దాని రాజకీయ చింతనలో ఆసక్తికరమైనదే. ఈ ప్రాతిపదికన కొత్త పొత్తులకు ప్రయత్నాలు ఆరంభించి మోదీకి నిజమైన పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి మరి కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరి. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
స్వీయ విధ్వంసం దిశగా పాక్
భారత్తో వెయ్యేళ్ల పవిత్రయుద్ధాన్ని కొనసాగిస్తానని నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో ప్రకటించి 50 ఏళ్లు గడిచాయి. ఈ యాభై ఏళ్లలోనే పాక్ తన సైనిక బలాన్ని మినహాయిస్తే ఉజ్వల గతాన్ని కోల్పోయింది. జనాభా పెరుగుదలలో తప్పిస్తే ఏ రంగంలోనూ భారత్తో పోటీ పడే స్థాయి పాక్కు లేదు. పుల్వామా ఘటన తర్వాత పాక్ భూభాగంపై భారత్ యుద్ధ విమానాలు దాడి చేసినా అరబ్ దేశాలతో సహా యావత్ ప్రపంచం భారత్నే బలపర్చాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను పక్కనబెట్టి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కొత్త అడుగు వేయకపోతే పాక్ ఒక జాతిగా, దేశంగా మరింత దిగజారిపోవడం ఖాయం. ఇమ్రాన్కు ఆ శక్తి ఉందా అన్నదే కీలకం. నేటి పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు సవాళ్లు ఎదురవుతాయి. పాక్ చరిత్ర, దాని భూభాగం లేదా రాజకీయాలపై లేక ఆ దేశం గురించిన ఏ అంశంమీద అయినా సరే మాట్లాడాలని ఉన్నా ఎక్కడి నుంచి ప్రారంభించాలన్నదే ప్రశ్న. ఇప్పుడు వింగ్ కమాం డర్ అభినందన్ వర్థమాన్ భారత్కి తిరిగి వచ్చే క్షణాల కోసం మనందరం వేచి ఉంటున్నాము. గతంలోకి వస్తే పాక్పై చర్చకు నేను 2009, 1999, 1989, 1979 సంవత్సరాలను కూడా ఎంచుకునేవాడిని. అయితే వీటన్నిటికీ బదులుగా నేను మిమ్మల్ని ఇప్పుడు 1969 సంవత్సరంలోకి తీసుకువెళుతున్నాను. కలవరపడవద్దు. మీరు వర్తమానంలోకి త్వరలోనే తిరిగివస్తారు. ముస్లిం దేశాలపై 1967లో సాగించిన ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ అద్భుత విజయం సాధించిన తర్వాత ముస్లిం దేశాలు 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ)ను నెలకొల్పాలని నిర్ణయించుకున్నాయి. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆ సదస్సుకు దూరంగా ఉండటానికి బదులుగా తన మంత్రి పక్రుద్ధీన్ ఆలీ అహ్మద్ (తదువరి భారత రాష్ట్రపతి)ని భారత ప్రతినిధి బృందం అధిపతిగా పంపించాలని నిర్ణయించారు. కానీ ఆమె ప్రయత్నాన్ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఆనాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కల దేశం (పాక్) ప్రాతినిధ్యం లేకుండా ఓఐసీ ఉనికిలోకి రావడం అసాధ్యమన్న తర్కాన్ని ఇస్లామిక్ ప్రపంచం అంగీకరించింది కూడా. ఆనాటికి పాకిస్తాన్ను రెండుగా విడిపోలేదని గుర్తుంచుకోవాలి. దీంతో భారత్ రాకను ఓఐసీ తిరస్కరించింది. భారత్కు అవమానమే మిగిలింది. సరిగ్గా 50 ఏళ్ల ముందుకెళ్లి చూడండి. నాలుగో ఇస్లామిక్ దేశాల సమితి సదస్సులో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ గౌరవనీయ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా అధికంగా కలి గిన మూడో దేశంగా భారత్ను ఎత్తిపడుతూ ఆమె ఆ సదస్సులో అద్భుతంగా ప్రసంగించారు. ముస్లింలు భారతీయ వైవిధ్యతలో భాగమని, భారతీయ ముస్లింలలో కేవలం 100 మంది మాత్రమే ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆమె తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి చాలా భిన్నమైన, సరైన వాదనలు కూడా ఉన్నాయనుకోండి. భారత జాతీయ స్రవంతిలో ఉన్న ముస్లింలను సుష్మా స్వరాజ్ పార్టీ వేరుగా చూడడం, జాతి మొత్తం నుంచి వారిని దూరంగా ఉంచడం, కశ్మీర్లను రాక్షసులుగా చిత్రీకరించడంపై చాలా వ్యతిరేకత కూడా ఉంటోంది. కానీ ఒక మతవాద హిందూ జాతీయ మూలాలున్న భారత ప్రభుత్వానికి చెందిన ఒక అత్యున్నత మహిళా నేత ప్రపంచ ముస్లింలకు తన దేశ ముస్లింల గురించి ఇలా చెప్పడంలోని ప్రాధాన్యతను తక్కువ చేసి చూడవద్దు. పైగా భారత్ను ఆతిథ్య దేశంగా ఆహ్వానించారన్న దుగ్ధతో పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల కూటమి సదస్సుకు గైర్హాజర్ కావడాన్ని మనం విస్మరించకూడదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే పాక్ ఇస్లామిక్ దేశాల కూటమిలో భారత్ చేరికనే వీటో చేయగలిగేటంతటి శక్తిని కలిగి ఉండేది. ఈరోజు భారత్కు ఆహ్వానం పట్ల తీవ్ర వ్యతరేకతతో సరిపెట్టుకోవడమే కాకుండా అవమానకరంగా ఆ సదస్సునే పాక్ బహిష్కరించే స్థితిలో పడిపోయింది. తన అణ్వాయుధాలతో, క్షిపణులతో, 20 కోట్లమంది ముస్లిం జనాభాతో ఇస్లామిక్ దుర్గంగా తన్ను తాను పిలుచుకుంటూ వచ్చిన పాకిస్తాన్ ఎలాంటి విషాద స్థితిలోకి కూరుకుపోయిందో ఆలోచించాల్సిందే. 1979లో సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ను దురాక్రమించిన తర్వాత పాకిస్తాన్ ఉన్నట్లుండి అమెరికాకు, దాని మిత్ర దేశాలకు, సౌదీ ఆరేబియా, చైనాలకు కూడా ఆప్తమిత్రురాలైపోయింది. 1971 యుద్ధం తర్వాత పునర్నిర్మాణంలో ఉంటున్న పాకిస్తాన్కు దీంతో తన సైన్యాన్ని సాయుధం చేయడం సులభమైపోయింది. ఉన్నట్లుండి పాక్ నియంత జియా ఉల్ హక్ జిహాదీల నిజమైన నేతగా అవతరించేశారు. ఆప్ఘనిస్తాన్లో ప్రచ్చన్నయుద్ధం ప్రభావంతో పాకిస్తాన్ సాధించిన ఈ కొత్త శక్తి జియాకు పూర్తిగా తలకెక్కేసింది. సోవియట్ యూనియన్ వంటి అగ్రరాజ్యంపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్న తమకు భారత్తో యుద్ధం చేయడం ఒక లెక్కా అనేంత గర్వం జాతీయస్థాయిలో పెరిగిపోయింది. ఆ తర్వాతే భారత్లోని పంజాబ్లో 1981లో తీవ్రవాదం మొదలైంది. పాక్ ఆధిపత్యం శిఖరస్థాయిలో ఉన్న ఈ దశలోనే నేను పాక్లో తొలిసారిగా పర్యటించాను. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సిక్కు తీవ్రవాదులపై పాక్లో జరుగుతున్న విచారణను నివేదించడానికి 1985 వేసవిలో పాక్ వెళ్లాను. అక్కడి ప్రజల సంపద, జీవన ప్రమాణాలు, మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన టెలికామ్ సర్వీసులు వంటి అంశాల్లో సగటు పాకిస్తానీయులు 1985లో సగటు భారతీయులకంటే ఎంతో మిన్నగా జీవించేవారు. ఎందుకంటే పాక్ తలసరి ఆదాయం అప్పట్లో భారత్ కంటే 60 శాతం అధికంగా ఉండేది. మళ్లీ ఇప్పుడు 2019కి వద్దాం. నేడు సగటు భారతీయుడు పాకిస్తానీయుల కంటే 25 శాతం అధికంగా సంపాదిస్తున్నాడు. ప్రచ్చన్నయుద్ధ విజయం ద్వారా సరికొత్త భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యత సాధించిన పాకిస్తాన్ 60 శాతం సంపదను పొగొట్టుకుని భారత్ కంటే చాలా వెనుకబడిపోయింది. ప్రతియేటా ఈ అంతరం 5 శాతం మేరకు పెరిగిపోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు పాక్ కంటే 3 శాతం అధిక పాయిం ట్లతో ముందుకెళుతోంది. పాక్ను దాటి మనం ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం. 50 ఏళ్ల క్రితం నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో భారత్పై వెయ్యేళ్ల యుద్ధానికి పిలుపిచ్చారు. అయితే 1969 తర్వాత గడచిన 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను ఎంతగా కోల్పోయిందంటే, ఇస్లామిక్ దేశాల కూటమి సైతం భారత్కే ప్రాధాన్యం ఇస్తోంది. మరీ ముఖ్యంగా జిహాద్ను జీవనంగా మార్చుకున్న గత 40 ఏళ్ల కాలంలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ అడుగంటిపోయింది. భారత్తో శాశ్వత రక్తపాత ఘర్షణలకు గాను పాక్ చెల్లించాల్సి వచ్చింది దీంతోనే ముగియలేదు. 1989లో ఓటమిని అంగీకరించిన సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిచేందుకు చర్చలు ప్రారంభించింది. దాంతో విజయోన్మాదం తలకెక్కిన పాక్ పాలనా యంత్రాంగం తన దృష్టిని తూర్పువైపు మళ్లించింది. ఆ తర్వాత మూడేళ్లపాటు కశ్మీర్, పంజాబ్ రక్తమోడాయి. వేలాది మంది శవాలుగా మిగిలారు. ఆ తర్వాత పాక్లో అంతర్గత మార్పులు సంభవించి నవాజ్ షరీఫ్ నూతన ప్రధానిగా ఎంపికై 1999 జనవరిలో నాటి భారత ప్రధాని వాజ్పేయితో శాంతి చర్చలను ప్రారంభించారు. అదే సమయంలో ఆయన సైన్యం కార్గిల్లో యుద్ధరంగాన్ని సృష్టించింది. పాక్ ఆ యుద్ధాన్ని కోల్పోయింది. దాంతోపాటు రెండు ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కశ్మీర్ వివాదాస్పద భూభాగం అనే అభిప్రాయం ప్రపంచ స్థాయిలో ముగిసిపోయింది. ఆధీన రేఖ వాస్తవ సరిహద్దుగా ఉంటుం దని, దాన్ని ఇరుదేశాలూ గౌరవించాలనే అభిప్రాయం బలపడింది. పెర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా నవాజ్ షరీప్ను దించేశారు. దీంతో పాక్ ప్రజాస్వామ్యం మళ్లీ కనుమరుగైంది. ఆ పదేళ్ల కాలంలో పాకిస్తాన్ కశ్మీర్పై తన నైతికాధికారాన్ని చేజార్చుకుని సైనిక పాలనన కౌగలించుకుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం. స్వీయ విధ్వంసకరమైన ఆలోచనా తత్వం. అప్పటినుంచి మనం చాలా దూరం వచ్చేశాం. 2008 ముంబైలో ఉగ్రవాద దాడి ఉన్మాదంతో పాకిస్తాన్ గ్లోబల్ జిహాద్ కేంద్రంగా తన స్థానాన్ని చక్కగా పదిలిపర్చుకుంది. భారత్ విషయానికి వస్తే కార్గిల్ యుద్ధం, పార్లమెంటుపై ఉగ్రదాడి తర్వాత తీవ్రంగా స్పందించకుండా సంయమనం పాటించిన భారత్ తక్కిన ప్రపంచాన్ని తనవైపునకు లాక్కుంది. ఫలితంగా ఈరోజు పుల్వామా దాడి తర్వాత పాక్పై ఎదురుదాడి చేసినప్పటికీ సౌదీ అరేబియా, యూఏఈతో సహా యావత్ ప్రపంచ మద్దతును భారత్ పొందుతోంది. ఈ మొత్తం చరిత్రను అవలోకిద్దాం. కేవలం 50 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాధాన్యతను కోల్పోయింది. అరబ్ దేశాలు దాన్ని నిరోధిస్తున్నాయి. ఇరాన్ శత్రుపూరితంగా ఉంది. గత 40 ఏళ్ల కాలంలో పాక్ తలసరి ఆదాయం భారత్తో పోలిస్తే 90 శాతం లోటుతో కునారిల్లుతోంది. ఈ అంతరం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. గత 30 ఏళ్ల గతాన్ని చూస్తే పంజాబ్, కశ్మీర్లో తన సైనిక కేంపెయిన్లను పాక్ కోల్పోయింది. అదే సమయంలో పాక్ నగరాలు, వ్యవస్థలు శాశ్వతంగా జిహాద్ దుర్గాలుగా మారాయి. గత 20 ఏళ్ల కాలంలో ఆధీనరేఖ కశ్మీరులో వాస్తవ సరిహద్దుగా మారిపోయింది. ఉగ్రవాదాన్ని ఒక విధానంగా కొనసాగించడాన్ని ఏ ఒక్కరూ ఇప్పుడు సహించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంపై భారత్ వైమానిక దాడులు చేసినప్పటికీ ఏ ఒక్క దేశమూ దాన్ని ఖండించిన పాపాన పోలేదు. పైగా పాక్ పదే పదే ప్రదర్శిస్తున్న అణు బూచిని భారత్, ప్రపంచం కూడా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత పాలకుల విధానాలనే కొనసాగించవచ్చు లేక సరికొత్త ఆలోచనలతో నూతన ఇన్నింగ్స్ని ప్రారంభించవచ్చు. ఇమ్రాన్ సాహసంగా అడుగులేస్తే అది ప్రమాదకరమే కానీ దానివల్ల పాకిస్తాన్ విజయపథంలో నడిచే అవకాశం ఉంది. ఇమ్రాన్ అలా చేయలేకపోతే, రెండు విషయాలు మాత్ర పక్కాగా జరుగితీరుతాయి. వ్యక్తిగా ఇమ్రాన్ వైఫల్యం. ప్రతిభావంతులైన ప్రజలు, బలమైన జాతీయవాదం, భౌగోళిక సంపన్నత, బలమైన సైన్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఒక జాతిగా దిగజారిపోవడం కొనసాగుతుంది. పాక్ భవిష్యత్తుకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
దాచేస్తే దాగదు ‘రఫేల్’
రఫేల్ ఒప్పందంపై తాజా సంచలనాత్మక వివరాల నేపధ్యంలో స్పష్టమవుతున్నది ఒక్కటే. అహంకారంతో, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి కుంభకోణంలో ఇరుక్కునే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంటుంది. రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై తాజాగా ద హిందూ పత్రికలో ఎన్ రామ్ వెల్లడించిన విషయాలు, వాటికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచిన సమర్థనలు ఈ అంశంపై జరుగుతున్న చర్చను ముందుకు తీసుకుపోవడంలో మరింతగా సహాయపడ్డాయి. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందం గురించి స్పష్టమవుతున్నది ఒక్కటే. ఇది అహంకారం, మూర్ఖత్వంతో కేంద్రం తనకుతానుగా తెచ్చిపెట్టుకున్న కుంభకోణంగా తప్ప మరే కోణంలోనూ దీన్ని చూడలేం. రఫేల్ స్పష్టపరుస్తున్న తాజా వివరాలను ఒకటొకటిగా చూద్దాం. 1. మనోహర్ పారికర్ నేతృత్వంలోని రక్షణ శాఖ ఉన్నతాధికారులు రఫేల్ చర్చలు పట్టాలెక్కిన తీరుపై చాలా అసౌకర్యంగా లేక అభద్రతను ఫీలయ్యారు. ఈ ఒప్పందం పట్ల తమ అభ్యంతరాన్ని వారు రికార్డు చేశారు కూడా. 2. కానీ వారి అభ్యంతరాలను మరీ అతిగా స్పందించారని పేర్కొంటూ రక్షణ మంత్రి తోసిపుచ్చారు. పైగా ప్రధానమంత్రి పీఎస్ (బహుశా ప్రిన్సిపల్ కార్యదర్శి)తో సంప్రదింపులు జరపాల్సిం దిగా శాఖాధికారులను ఆదేశించారు. 3. దీనర్థం ఏమిటి? అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకత్వం ఉన్నతాధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిందనే కదా. ఈ ఒప్పందాన్ని సత్వరంగా కుదుర్చుకోవాలని నాయకత్వం కోరుకుంది. 4. సూత్రబద్ధంగా చూస్తే ఇది సరైందే. ఎందుకంటే సందేహాలను లేవనెత్తడం ఉన్నతాధికార వర్గం సహజ స్వభావం. నిర్ణయాత్మక శక్తి కలిగిన రాజకీయ నేత అలాంటి అభ్యంతరాలను తోసిపుచ్చి తన నిర్ణయానికి బాధ్యత తీసుకుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడినుంచి మనం సమస్యను కొనితెచ్చుకుంటాం. పై నాలుగు అంశాలు నిజానికి ఏం చెబుతున్నాయి? అంటే.. ఒక ఒప్పందం కుదరాల్సి ఉంది. సాధారణంగానే ఉన్నతాధికారులు తమ స్వచర్మరక్షణను చూసుకుంటారు, కానీ దృఢమైన, జాతీయవాదంతో కూడిన నిజాయితీ కలిగిన ప్రభుత్వం తమముందు ఉన్న అవరోధాలను తొలగించుకుని ఒప్పందాన్ని ఖాయపరుస్తుంది. అలాంట ప్పుడు సాహస ప్రవృత్తి కలిగిన అదే ప్రభుత్వం ఈ విషయాన్ని నేరుగా ప్రకటించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నట్లు? అలా వాస్తవాలను ప్రకటించడానికి భిన్నంగా తన చర్యపై వరుస సమర్థనల వెనుక ఎందుకు దాక్కుంటున్నట్లో? కేంద్రప్రభుత్వం వాస్తవాన్ని ముందే యధాతథంగా చెప్పి ఉన్నట్లయితే, సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రక్షణ శాఖ కుంభకోణంగా తలెత్తే ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేది. అప్పుడు ఆ సత్యం ఇలా ఉండేది: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2012 ప్రారంభంలో 125 యుద్ధవిమానాల కొనుగోళ్లకు గాను తక్కువ బిడ్ దాఖలు చేసిన రఫేల్ని ఎంచుకున్నారు. కానీ, 14 మంది సభ్యులతో కూడిన ధరల సంప్రదింపు కమిటీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరిచింది. నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పర్చి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడానికి ముగ్గురు బాహ్య పర్యవేక్షకుల బృందాన్ని నియమించారు. తర్వాత ఈ అభ్యంతరాలను 14 మంది సభ్యులతో కూడిన పూర్తిస్థాయి కమిటీ తోసిపుచ్చింది. ఒక కమిటీపై మరో కమిటీ, ఆ కమిటీ మరొక కమిటీ చర్చల ప్రక్రియ కొనసాగాక 126 యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. ఆపై ఏం జరిగింది? యధావిధిగానే నాటి రక్షణ మంత్రి ఆంటోనీ సందేహిస్తూనే ఈ కమిటీ తుది నిర్ణయంతో విభేదించి మళ్లీ బిడ్లను ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వాస్తవానికి ఈ ఒప్పందం 2001లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఆంటోనీ దీనిపై నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వానికి వదిలిపెట్టడానికే మొగ్గు చూపారు. తన హయాంలో ఏ రక్షణ కొనుగోలు కుంభకోణం చోటు చేసుకోకుండా ముగించాలన్నది ఆయన వైఖరి. ఒప్పందంలో ఒక భాగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పెద్దగా కొనుగోలు చేసిందీ లేదు. కానీ ఆయన సైతం చివరకి అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంతో పదవిని ముగించాల్సి వచ్చింది. మరి మన నిర్ణయాత్మకమైన, రాజీలేని మోదీ ప్రభుత్వం ఏం చేసింది? అది చాలా మొరటుగా వ్యవహరించింది. భారత వాయుసేన తన అవసరాలకు శాశ్వతంగా ఎదురు చూడలేదు. కాబట్టి కొన్ని విధివిధానాలను పాటించకుంటే ఏం కొంప మునుగుతుంది? పైగా ఆ విధానాలు కార్యనిర్వాహక నిబంధనలే తప్ప రాజ్యాం గబద్ధమైన ఆదేశాలు కావు. కాబట్టి ప్రధాని విశాల జాతి ప్రయోజనాల రీత్యా ఈ విధానాలను పక్కకు తోసేయగలడు. ఇదంతా బాగుంది. కానీ మోదీ ప్రభుత్వం ఈ ఒప్పంద వివరాలను పూర్తిగా ఎందుకు బహిర్గతం చేయలేదు? ఇంతకుముందే దాన్ని బహిర్గతపర్చి ఉంటే గత ఆరునెలలుగా రఫేల్ ఒప్పందంపై వస్తున్న పతాక శీర్షికలు పూర్తి అసందర్భంగా వెలిసిపోయి ఉండేవి. పైగా మీడియా కెమెరాల ముందు, పార్లమెంటులో ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రెచ్చిపోతూ మాట్లాడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. పైగా నచ్చబలికే వాస్తవాలు, ప్రస్తావనలతో ఆమె మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని ఉండి ఉంటే, రాహుల్ పదేపదే ఈ ఒప్పందంపై సంధిస్తున్న ప్రశ్నలకు ఆమె ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు? రఫేల్ ఒప్పం దంపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా? ఈ ప్రశ్నకు ఆమె నిజాయితీగా అవునని సమాధానం చెప్పి ఉంటే, ఒప్పందంపై వచ్చే అన్ని ప్రశ్నలను ప్రభుత్వం తన విజ్ఞతతో తోసిపుచ్చి ఉండేది. ప్రభుత్వాలు తమను తాను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి సాధారణ అంశాలను కూడా పాటించకపోవడానికి సాధారణంగా రెండు కారణాలు ఉంటుంటాయి. మరిన్ని విషయాలను తాను దాచి ఉంచి, వాటిని విమర్శకులు కనుగొనలేరని ప్రభుత్వం భావిస్తున్న సందర్భంగా ప్రభుత్వ వివేకం స్పష్టం కానప్పుడు ఇలా జరుగుతుంటుంది. రెండోది. ప్రత్యర్థులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఆశించగల అర్హత వారికి లేదని, తాము అన్ని అంశాల్లోనూ సరిగా ఉన్నామనే స్వీయ అహంకారంలో మునిగిపోయి ఉన్నప్పుడూ కూడా ఇలా జరుగుతుంటుంది. నన్ను ప్రశ్నించడానికి కూడా నీకెంత ధైర్యం? నీకు లాగ నేను కూడా అవినీతిలో కూరుకుపోయానని అనుకుంటున్నావా? రఫేల్ వివాదంలో మోదీ ప్రభుత్వం పతన దశ ఇక్కడే మొదలైంది. ఒక విశ్లేషకుడిగా, సంపాదకుడిగా ఈ రెండు నిర్ధారణల్లో మొదటిదాన్ని ప్రకటించడానికి నాకు మరింత సాక్ష్యాధారం కావాలి. అదేమిటంటే ప్రభుత్వం విషయాన్ని దాచి ఉంచడానికి ఏవైనా ముడుపులు తీసుకున్నటువంటి తప్పు మార్గంలో నడిచిందా? అదే జరిగివుంటే ప్రతిపక్షం సహనంగా ఉండటానికి కారణమే లేదు. ఇక రెండో నిర్ధారణ నిస్సందేహంగా ఇప్పుడు స్పష్టమైంది. గత మూడు దశాబ్దాల్లో ఈ డ్రామాను రెండు సార్లు విభిన్నమైన ఫలితాలతో చూశాం. మొదటిది బోఫోర్స్. రాజీవ్ గాంధీ స్పష్టంగా విజ్ఞతను ప్రదర్శించి ఉంటే ఆరోపణ వచ్చిన తొలిరోజే విచారణకు ఆదేశించి, నేరస్థులను శిక్షిస్తానని హామీ ఇవ్వడం ద్వారా బోఫోర్స్ కుంభకోణం నుంచి బయట పడేవారు. కానీ రాజీవ్ తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్లిపోయారు. స్విస్ అకౌంట్ వివరాలు వెలికి రాకముందే రాజీవ్ ఈ అంశంలో నిజాయితీతో లేరని, తప్పు చేశారని అనుమానం వచ్చేలా వ్యవహరించారు. దీని పర్యవసానమేమిటో స్పష్టమే. సరే, మీరు పరిశుద్ధులే. కానీ, ఎవరో చేసినప్పటికీ దేశం కోసం సరైన, నిజ మైన, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకే 32 ఏళ్లు గడిచినా బోఫోర్స్ ముడుపులకు సంబం ధించి ఎవరినీ పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ వ్యాఖ్యానించగలిగింది. కనీసం ఒక్క క్రోనా(స్వీడిష్ కరెన్సీ) స్వాధీనం కాలేదు. అదేసమయంలో కోల్పోయిన కాంగ్రెస్ ప్రతిష్ట కూడా తిరిగి రాలేదు. ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసిందనే విషయం పక్కనబెడితే, బోఫోర్స్ మచ్చ మిగిలే ఉంది. ఇక రెండోది, సుఖోయ్–30 కొనుగోళ్లు కూడా పెద్ద కుంభకోణ మేనని మార్మోగింది. 1996లో ఎన్నికలు ప్రకటించినప్పటికీ పి.వి.నర సింహారావు ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఈ విషయంలో ఏ నిబంధనలూ సక్రమంగా పాటించలేదు. ఇప్పటి ప్రమాణాలను బట్టి చూస్తే దాన్ని దేశద్రోహంగానే పిలవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష బీజేపీ నాయకులపై నమ్మకంతోనే ఆయన అలా వ్యవహరించారు. తరువాత ప్రధాని అయిన దేవెగౌడ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న ములా యం సింగ్ యాదవ్ అన్ని ఫైళ్లను తెరిచి ప్రతిపక్షంలోని పెద్దలందరినీ వదిలిపెట్టేశారు. తెలివిగా సాగిన రాజకీయ నేతల కుమ్మక్కు వ్యవహా రంపై మనం గతంలో ఓ కథనంలో పేర్కొన్నాం. 23 ఏళ్లు గడిచిపోయినా ఇంతవరకూ ఎవరూ సుఖోయ్ గురించి ప్రశ్నించలేదు. భారత వైమానిక దళానికి ఇప్పటికీ సుఖోయ్ విమానాలే ప్రధాన ఆధారం, బలం కూడా. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఎక్కడిదో మీరు గమ నించే ఉంటారు. తాను పరిశుద్ధుడనని, తనను నిష్కారణంగా అనుమా నిస్తున్నారని, తాను బాధితుడనని చెప్పుకుని తనకున్న పేరు ప్రఖ్యాతుల ద్వారా మోదీ బయటపడిపోతారనుకుంటే పొరపాటు. రహస్యాలను కాపాడుకోవడంలో ఈ సర్కారుకు అమోఘమైన ప్రావీణ్యం ఉన్నదన్న అభిప్రాయానికి భిన్నంగా రఫేల్æ పత్రాలు ప్రముఖులంతా కొలువుదీరే ఢిల్లీలోని లూటెన్స్లో సులభంగా లభ్యమవుతున్నాయి. కనీసం ఈ దశ లోనైనా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బావుంటుంది. విమ ర్శకులు, జర్నలిస్టులపై దాడి చేయడం కాకుండా, వారి ప్రశ్నలకు సమా ధానాలివ్వాలి. అలా చేయకపోతే, ఈ వ్యవహారం చాలా సులువుగా వారిని ముంచెత్తకమానదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మన్మోహన్ కంటే ఘనుడు మోదీ!
యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ఎన్డీఏ ప్రధాని నరేంద్ర మోదీనే ఎక్కువ మార్కులు కొట్టేశారన్నది ఏరకంగా చూసినా వాస్తవమే. బడా రుణ ఎగవేతదారుల వంచనకు అడ్డుకట్టలు వేయడం, ఆహార ధరలను కనీస స్థాయికి తగ్గించడం, ప్రభుత్వ రాబడిని మౌలిక వసతుల కల్పనపై పెట్టి స్థూలదేశీయోత్పత్తిని వృద్ధి చెందించడం వంటి అంశాల్లో గతంలోని ప్రభుత్వాల కంటే మోదీ ప్రభుత్వం మెరుగ్గా వ్యవహరించింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పెద్దనోట్ల రద్దు వంటి అకాల చర్యలు చేపట్టడంతో విమర్శలు చెలరేగినప్పటికీ, వినియోగదారుల సంతృప్తి వంటి కొన్ని అంశాల్లో నరేంద్ర మోదీ మంచి మార్కులే సాధించారు. మీ ఓటింగ్ ప్రాధాన్యతలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నాయి అనే అంశం ఆధారంగా చూసినట్లయితే, మోదీ ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థను మరీ గొప్పగా నడిపిందీ లేదు, అలాగని పూర్తిగా విధ్వంసకరంగా నిర్వహించారని చెప్పడానికీ లేదు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ డేటాను చూసి మాట్లాడమని ఆయన అభిమానులు చెబుతుంటారు. మోదీ విమర్శకులు కూడా ప్రతివాదం చేస్తూ డేటానే చూడాల్సిందిగా చెబుతుంటారు. కానీ అభిమానులుగా మీరు రూపొందిస్తున్న డేటా అబద్ధాలకుప్ప అయినప్పుడు దాన్ని మేం ఎలా అంచనా వేయాలని అడుగుతారు? ఈ అంశంపై ఇరుపక్షాల నిపుణులనూ యుద్ధం చేసుకోనిద్దాం. తర్వాత మోదీ హయాంలో అయిదేళ్లపాటు సాగిన రాజకీయ అర్థశాస్త్రం తీరుతెన్నుల గురించి విస్తృతస్థాయిలో పరిశీలిద్దాం. త్వరలో మోదీ అయిదేళ్ల పాలన ముగియనున్నందువల్ల, ఈ అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహారాలను నడిపిన అయిదు అంశాలను జాబి తాకు ఎక్కిద్దాం. ఈ అంశాన్ని రాజకీయాలు లేక రాజ కీయ అర్థశాస్త్రానికి చెందిన సులోచనాల నుంచే చూస్తున్నాను తప్ప కేవలం అర్థశాస్త్ర దృక్పథం నుంచి మాత్రం కాదని నేను మళ్లీ నొక్కి చెబుతున్నాను. కాబట్టి ఈ కోణంలో ఈ వ్యాసంలో కనిపించే అతి పెద్ద సానుకూలాంశం ఏదంటే ఐబీసీ అమలు. అంటే దివాలా, అప్పుల ఎగవేత కోడ్కి చెందిన ప్రక్రియను ఎలా అమలు చేస్తారన్నదే. ఇంతవరకు 12 మంది రుణ ఎగవేత దారుల్ని మాత్రమే రుణ ఎగవేత వ్యతిరేక విచారణ ప్రక్రియలో నిలబెట్టారన్నది వాస్తవం. కానీ ఈ 12 మంది దేశంలోనే అతి పెద్ద, అత్యంత శక్తిమంతులైన వ్యక్తులు. అయితే దేశంలోని చాలామంది శక్తివంతులైన రాజకీయనేతలు, స్పీడ్ డయల్పై బతికేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ రుణ ఎగవేతల నుంచి ఎంత పోగు చేసుకున్నారనేది తర్వాతి అంశంగా మిగులుతుంది. కానీ వీరిలో ఏ ఒక్కరికీ ఒక్క ఫోన్ కాల్ చేసి తమ అపరాధాలనుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. చివరకు బలవంతులైన రూయాలు, ఎస్సార్లకు కూడా ఇది సాధ్యం కాలేదు. ఇది నిజంగా దేశంలో సరికొత్త రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనం అనే చెప్పాలి. ఈ అంశాన్ని ఇలా చూద్దాం. ఒక ఫ్రెండ్లీ ఫోన్ కాల్ చేయడం ద్వారా తాము చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పుకునే లేక వాయిదా వేసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. భారతీయ పెట్టుబడిదారీ విధానంలో మీరు ఇప్పుడు ఒక కొత్త శకంతో వ్యవహరిస్తున్నట్లు తెలుసుకోవాలి. మీ వ్యాపారం విఫలమైనట్లయితేనే దివాలా తీస్తారు. కొత్త శకంలోకి రావాల్సింది పెట్టుబడిదారీ విధానమే కావచ్చు కానీ వ్యాపారంలో వైఫల్యం చెందడం ద్వారా మీరు ఎదుర్కొనవలసిన చేదు నిజాన్ని ఆమోదించాలని సమాజం నేర్చుకోవలసి ఉంది. భారత్లో దివాలా తీయడం అనే అంశాన్ని దాచిపెట్టవలసిన కుటుంబ అవమానంగా చూస్తూ్త వస్తున్నారు. బాహాటంగా వామపక్ష–సోషలిస్టు స్వభావంతో ఉన్నప్పటికీ, ’’ఫోన్ బ్యాంకింగ్’’ తరహా రాజ్యవ్యవస్థకు ఈ నేరంలో భాగముంది. నరేంద్రమోదీ ప్రభుత్వం దానికి ముగింపు వాక్యం పలికింది. బడా బాబుల వలువలు ఊడిపోతున్నాయి. ఈ తరహా కార్పొరేట్ డాంబికాలు, ఆడంబరాలు మంటల్లో కాలి పోయిన తర్వాత నూతన భారతీయ పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించగలదు. ఈ పరిణామాన్ని నేనయితే స్వాగతించదగిన తప్పనిసరి అవసరమైన రాజ కీయ, సాంస్కృతిక మార్పుగానే చూస్తున్నాను. ఒకవైపు ముడిచమురు ధరలు పడిపోతున్నప్పటికీ పెట్రోలు ధరలను అధికస్థాయిలో ఉంచినందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా విమర్శలను ఎదుర్కొంది. కానీ అది యూపీయే హయాంలో ప్రజలు పెట్టిన పెనుకేకల వంటిది కాదు. ఎందుకంటే వినియోగదారు నెల చివరలో తన షాపింగ్ బిల్లు ఎంతయింది కూడా గమనిస్తాడు. మోదీ పాలనాకాలంలో చమురుధరలు బాగా పెరిగాయి కానీ మొత్తం మీద చూస్తే తక్కువ ద్రవ్యోల్బణం ఉంటూ వచ్చింది. ప్రత్యేకించి ఆహారం విషయంలో ఇది మరీ స్పష్టం. మోదీ హయాంలోని ద్రవ్యోల్బణం డేటా అబద్ధాల కుప్ప అని ఎవరూ ఇంకా ఆరోపించడం లేదు. అలాగని జీడీపీ లెక్కల్లాగా దాన్ని మార్చి చూపారని కూడా ఎవరూ ఆరోపించడం లేదు. కాబట్టి మనం న్యాయమైన పోలికను పోల్చవచ్చు. మోదీ ప్రభుత్వం 2014 వేసవిలో ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు, అంతవరకు దేశాన్ని పాలించిన యూపీఏ–2 ప్రభుత్వం.. వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం 8.33 శాతం వరకు పెరిగిన ఆర్థిక వ్యవస్థను మోదీ చేతిలో పెట్టింది. కానీ ఈరోజు అది 2.19 శాతంగా మాత్రమే ఉంది. కాబట్టే చమురుధరలు అధికంగా పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్న విధానం మోదీ ప్రభుత్వానికి రెండో అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టింది. గతంలో చాలా ప్రభుత్వాలు చమురుధరలను తగ్గుముఖం పట్టించే విషయంపై ఆపసోపాలు పడుతూ నోటి బలం ఉన్న నగర కులీనులనుంచి శాంతిని కొనుక్కునేవారు. ధరల రాజకీయం తన సొంత మార్మికతను కలిగివుంది. యూపీఏ–1 హయాంలో వ్యవసాయ పంటలకు కనీస మద్ధతుధరలు పెంచినందున, రైతు, రైతుకూలీ ఇరువురూ సంతృప్తి చెందారు. దీంతో యూపీఏ రెండో దఫా కూడా సులభమైన విజయం సాథించేసింది. కానీ దాని రెండో దఫా పాలనలో వినియోగదారు ఆహార ధరలు చుక్కలనంటాయి, దీంతో వీధుల్లో బలమైన అశాంతి పెరిగింది. చివరకు అదే యూపీయే మనుగడను ధ్వంసం చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వినియోగదారు ఆహార ధరలను బాగా తగ్గించివేసింది. కొన్నింటికి గరిష్ట మద్దతు ధరను పెంచకపోవడంద్వారా, కొన్నిం టిని బాగా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం ఆహార ధరలను తగ్గించగలిగింది. ఈ క్రమంలో మార్కెట్ శక్తులను కేంద్ర పట్టించుకోలేదు. ఫలితంగా, రైతు నిండా మునిగాడు, వ్యవసాయ కూలీల కూలీలు పడిపోయాయి. గత మూడు పంట కాలాల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం గరిష్ట మద్దతు ధరను పెంచడం ప్రారంభించింది. కాని ఇది కూడా త్వరలోనే తనదైన ప్రభావాన్ని చూపుతుంది. అందుచేత మోదీ అయిదేళ్ల పాలనలో రైతు సర్వం కోల్పోయాడంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య తప్పే. అటు వినియోగదారు, ఇటు రైతు ప్రయోజనాలు పరస్పరం విభేదించినంత కాలం.. అధిక ధరలు, పంట ధరల తీవ్ర పతనం కారణంగా ప్రభుత్వం అధికారం కోల్పోవడం అన్నది క్రూరమైన రాజకీయ వాస్తవంగానే ఉంటుంది. ఈ చక్రవ్యూహం నుండి ప్రభుత్వాలు బయటపడాలంటే వ్యవసాయ సంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టడమే ఏకైక మార్గం. ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. ఇంధన పన్నుల కింద వసూలు చేసిన అదనపు నగదునంతా మోదీ ప్రభుత్వం ఏం చేసినట్టు? ఇలా వచ్చిన భారీ మొత్తాల్లో వేలాది కోట్ల రూపాయలను ఓటర్లకు నజరానాలుగా ఇచ్చేకంటే ఆర్థిక లోటును పూడ్చడానికి వినియోగించడం సరైనదని అనుకుంటాం. జాతీయ రహదారులపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టే బదులు, ఓడరేవులు, సాగర మాల ప్రాజెక్టులు, రైలు మార్గాలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టొచ్చు. ఎందుకంటే, వీటి నుంచి వచ్చిన ఆదాయం కారణం గానే మన స్థూల దేశీయోత్పత్తి గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఐదు విజయాలలో నాలుగోదైన పన్నుల చెల్లింపు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తిలో 9 నుంచి 12 శాతం పన్నుల నుంచే లభిస్తోంది. ఉన్నత స్థాయిలో చెల్లింపుదారుతో కఠినంగా వ్యవహరిస్తు న్నట్టు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు అనిపించినా; కింది, మధ్య స్థాయిల్లోని వారికి సంబంధించి పన్ను విధానం చాలా బాగుంది. చాలావరకు మధ్యవర్తుల ప్రమేయం లేదు. నిషేధించాల్సిన వ్యాపారాలు లేనట్టయితే, ఏజెన్సీలు ప్రత్యేకంగా దృష్టిసారించనట్లయితే, రాజకీయ బాధితులు కాకపోతే పన్ను చెల్లింపుదారుడికి సమస్యలేమీ లేనట్టే. ఐదవది, చివరిదీ జీఎస్టీ. బీజేపీ సొంత కూటమిలోనే దాని సా«ధక బాధకాలు దానికి ఉన్నాయి. అయినా, అది కొనసాగుతూనే ఉంది. చాలా విషయాల్లో వైఫల్యాలు కూడా ఉన్నాయి. వ్యవసాయం నుంచి ఎగుమతుల వరకు, తయారీ రంగం నుంచి ఉపాధి కల్పన వరకు, పీఎస్యూలను ఆధునీకరించకపోవడం నుంచి సమాచారాన్ని వక్రీకరిస్తున్నారనే చెడ్డపేరు ఉండనే ఉన్నాయి. వీటితోపాటు పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంలాంటి డీమోనిటైజేషన్ లాంటి చర్యలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక అంశాలపై మనం ఫిర్యా దులు చేయొచ్చు. ఈ వారం ఒక ప్రభుత్వం అరుదుగా ప్రదర్శించిన మంచి ఆర్థిక విధానాలను గుర్తిద్దాం.. కేవలం చెత్త రాజకీయాలనే కాదు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
భారత్ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదే
హైదరాబాద్ : అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్గుప్తా అన్నారు. బల హీన భారత్ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదేనన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చినా జాతీయ భద్రతపై ఆయన ఏనాడూ రాజీపడని దృఢసంకల్పం ప్రదర్శించారని కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో పీవీ స్మారకోపన్యాసం చేశారు. 1991లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి ఉండేదని, గల్ఫ్ యుద్ధం ముగింపు, సోవియట్ పతనం, తదితర అంశాలతో భారత్లో ఆ కూడా ప్రభావం ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని అలాంటి సమయంలో ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా అయోమయానికి గురికాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు, విదేశీ విధానాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించారన్నారు. అప్ప టిదాకా రష్యాతో మైత్రీబంధాన్ని నెరుపుతున్న భారత్కు సోవియట్ పతనం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలతో మైత్రి ఏర్పడటానికి పీవీ చేసిన కృషిని చాలామంది మర్చిపోయారన్నారు. అద్వానీ మాటలు నమ్మారు.. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో పీవీపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావన్నారు. బాబ్రీ మసీదు జోలికి వెళ్లబోమని బీజేపీ నేత అద్వానీ కచ్చితంగా చెప్పిన మాటలను పీవీ నమ్మారని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో పీవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపేందుకు రాష్ట్రపతిపాలన విధించి ఉండొచ్చు కదా అని చాలా మంది పీవీని విమర్శిస్తుంటారని అలా కేంద్ర పాలన అమలుకు కనీసం 48 గంటలు పట్టేదని ఆలోగా జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని పీవీ తనతో చెప్పారని శేఖర్గుప్తా గుర్తు చేసుకున్నారు. దేశంలో అల్లర్లు చెలరేగకుండా పీవీ చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభంలో అనవసర విషయాల్లో సమయం వృథా చేసి చివరి రెండేళ్లలో జీఎస్టీ లాంటి కీలక సంస్కరణలు అమలు చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పీవీ బహుభాషా కోవిదుడిగా అందరికీ సుపరిచితులని ఆయన రాజకీయాల్లో లేకపోతే కచ్చి తంగా గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు అయ్యేవారన్నారు. పీవీ తాను నిర్వహించిన అన్ని మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేసి పనితీరును మెరుగుపరిచారన్నారు. ప్రభుత్వ విభా గాలు సరైన విధానంలో పనిచేసేలా అనేక చర్య లు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నవోదయ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. -
నేడు పీవీ స్మారక ఉపన్యాసం
సాక్షి, హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం పీవీ స్మారక ఉపన్యాసం నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.37లోని దసపల్లా హోటల్లో ఉదయం 11గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు శేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని పీవీ స్మారక ప్రసంగం చేయనున్నారు. జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అధ్యక్షత వహించనున్న ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు హాజరవనున్నారు. -
అనంత ఏకాంతంలో ‘లోపలి మనిషి’
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నం తకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యా బలం బొటాబొటిగా ఉన్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై ఉంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, పొగిడిన ఆ నోళ్లతోనే ఆయన్ని తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి పార్టీకి ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాంలో జరిగిన తప్పులో, పొరబాట్లనో సమర్ధించడం నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’ అనే పదాలకి తావు లేకుండా పోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా బేగంపేటలోని ఒక సందులో ఉన్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ‘అధికారాం తమునందు..’ అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, ‘ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే’ అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు. పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా ఉండిపోయింది. మాజీ ప్రధానిగా పీవీ రాజ్భవన్లో వున్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగు పెట్టాము. పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ కని పించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరి చయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాల రావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసిగట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా. ‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో... మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావ్?’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. పీవీ స్మృతికి నా నివాళి. (నేడు హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో ఉదయం 11 గంటలకు సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘ది ప్రింట్’ సంపాదకులు శేఖర్ గుప్తా దివంగత ప్రధాని పీవీపై స్మారకోపన్యాసం చేయనున్నారు) భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ‘ 98491 30595 -
పాలన వీడి ప్రత్యర్థులపై గురి
యువ భారతీయులు 2014లో బ్రాండ్ మోదీ తమకు అమ్మిన ఆశను, ఆశావాదాన్ని ఎంతో మక్కువగా కొనిపడేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందిరాగాంధీ యుగం నాటి కాంగ్రెస్గా మారిపోవడమే కాకుండా ఒక ఆవును కూడా తోడు తెచ్చుకోవడంతో అదే యువతరం ఇప్పుడు ఆగ్రహంతో, నిరాశా నిస్పృహలతో దహించుకు పోతోంది. ఇప్పుడు తన సర్కారీ పథకాల గురించి మోదీ జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి, తప్పు చేసినవారిని శిక్షించడానికి బదులుగా గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాలచిట్టాను బయటపెట్టడంలోనే ఆయన కాలం గడిపేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్ గురు అలీక్ పదమ్సే తనకు ఇష్టమైన వాక్యాన్ని పదే పదే చెబుతుండేవారు. ‘క్లయింట్లు తమ బ్రాండ్లను జాగ్రత్తగా తీర్చిదిద్దమని నన్ను అడిగేవారు. నేను నా బ్రాండ్ను ఎన్నడూ తీర్చిదిద్దనని, నా పోటీదారు బ్రాండ్ను మాత్రమే జాగ్రత్తగా చూస్తానని నేను వారికి చెప్పేవాడిని. ‘దురదృష్టవశాత్తూ అలీక్ ఇటీవలే కన్ను మూశారు. నరేంద్రమోదీ, అమిత్ షాలు 2014లో ప్రతిపక్షం ఎలా ఘోర తప్పిదాలకు పాల్పడి ప్రతిపక్ష బ్రాండుగా మారిపోయి ఓట్ల బజారులో తమకు విజయం సాధించిపెట్టిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్న వైనాన్ని ఆలీక్యూతో చాట్ చేస్తే సరదాగా ఉంటుంది కాబోలు. నేరుగా విషయానికి వద్దాం. 2014 వేసవిలో నరేంద్రమోదీ ప్రతి కూలతకు, నిరాశావాదానికి సంబందించిన ఒక్క పదం కూడా పలక లేదు. ఆయన సందేశం చాలా దృఢంగా, స్థిరంగా, నచ్చచెప్పేవిధంగా ఉండేది. అభివృద్ధి, పురోగతి, ఉద్యోగాలు, దృఢ శక్తి, అచ్చేదిన్ (మంచి రోజులు).. అన్ని రంగాల్లోనూ ఆయన ఇవే మాట్లాడేవారు. ఒక స్వచ్ఛ మైన, నిర్ణయాత్మకమైన, పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలనను మోదీ జాతికి హామీ ఇచ్చారు. భవిష్యత్తును గురించి మాత్రమే మాట్లా డుతూ తాను దాన్ని ఎలా విప్లవీకరించబోతున్నదీ ప్రత్యేకించి యువత ముందు స్పష్టంగా చెప్పేవారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ గతం గురించి ఆయన ప్రస్తావించారంటే అది ఆర్థిక పతనం, పాలసీ పరమైన పక్షవాతం, యూపీఏ–2 హయాంలో పాలన పూర్తిగా అడుగం టిపోవడం, దాని ప్రధానికి తీరని అవమానం జరగడం, పర్యావరణ అనుమతుల మిషతో కుంభకోణాల మీద కుంభ కోణాలు చోటు చేసు కోవడం, ప్రభుత్వం మొత్తంగా కుంభకోణాలలో కూరుకుపోవడం వంటి అంశాలనే ప్రస్తావించేవారు. అంతే కానీ ప్రజలను వేరుపర్చడం, విడ దీయడం అప్పట్లో మోదీ ప్రసంగాల్లో ఉండేవి కావు. ఆయన కేంపెయిన్ థీమ్ ఏదంటే సబ్కా సాథ్, సబ్కా వికాస్ (అందరితో ఉంటాను, అంద రినీ ఎదిగేలా చేస్తాను) మాత్రమే. ఈ సబ్కా సాథ్ వెనుక ఉన్న సందేశం ఒక్కటే. నాకు సమస్యలు తెలుసు. నేను పరిష్కారాలతో వచ్చాను. నాకు మీ తీర్పును, సమ యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి, అన్నదే ఆ సందేశ సారాంశం. ఆ సందేశం గొప్ప ప్రాడక్టుగా మారి తన ప్రతిపక్షాన్ని ఊచకోత కోసేసింది. కానీ వచ్చే ఎన్నికలు ఇక ఆరునెలల్లో రాబోతుండగా మోదీ సందేశం దాదాపు వ్యతిరేకదిశకు మారిపోయింది. ఇందిరాగాంధీ తర్వాత దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా మోదీ ఆవిర్భవించారు. కానీ ఇప్పు డేమో కాంగ్రెస్ పార్టీ తనను పని చేయనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చివరకు భారత్ మాతాకు జై అనే తన ఊతపదాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఇటీవలి తన ఎన్నికల ప్రచారంలో మోదీ వాపోయారు. అంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ని నిర్వీర్యం చేసిన 10 జన్పథ్ ఇప్పుడు కేవలం 47 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పటికీ మోదీని ఊపిరా డకుండా చేస్తోందన్నమాట. మోదీ ప్రభుత్వ పాలనను పరిమితం చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు సమయమంతా తన సర్కారీ పథకాల గురించి జపం చేస్తున్నారు. తాను గతంలో పేర్కొన్న అవినీతి కుంభకోణాలను వెలికి తీసి తప్పుచేసినవారిని శిక్షించడానికి బదులుగా, గాంధీ, చిదంబరం కుటుంబాలకు సంబంధించిన పాత, కొత్త పాపాల చిట్టాను బయట పెట్టడంలోనే మోదీ కాలం గడిపేస్తున్నారు. 54 నెలల పాటు సంపూర్ణ అధికారాన్ని అనుభవించి, ప్రభుత్వ ఏజెన్సీలను సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తర్వాత దేశ ప్రజలకు ఒరిగింది ఇదే మరి. పాలనను పరిమితం చేయడం, గుజరాత్ తరహా పారిశ్రామికుల నేతృత్వంలోని అభివృద్ధికి తావియ్యడానికి బదులుగా, మరిన్ని కరపత్రా లను మాత్రమే అందిస్తున్నారు. పైగా భవిష్యత్తు గురించి చాలా అరు దుగా మాత్రమే మోదీ మాట్లాడుతుండటం ఆశ్చర్యం గొలుపుతోంది. పైగా గతంలోకి చాలా దూరం వెళ్లిపోయి జవహర్లాల్ నెహ్రూ, ఆయన తండ్రి, పుత్రిక, పటేల్, శాస్త్రిల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు, వికాస్, సంపద వంటి వాగ్దానాలు గూట్లో చేరాయి. జాతి ఐక్యత, సబ్కా సాత్ బదులుగా ప్రతి సీజన్లోనూ మతపరమైన విభజన మాత్రమే కర్తవ్యంగా మిగిలిపోతోంది. ఈ విషయంలో యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా దాని పెద్ద ఆయుధాలుగా మారిపోయారు. అంటే తన సొంత బ్రాండును, లేక ప్రొడక్టును మోదీ నాటకీయం గానే వ్యతిరేక దిశకు మళ్లించేశారు మోదీ. తన సొంత పనితీరు, చేసిన వాగ్దానాల అమలు గురించి ఆలోచించడం మాని, తన ప్రత్యర్థుల ప్రాచీన గతానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఓట్లు దండుకోవాలని ప్రయత్నించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా తన వాగ్దానాల విష యంలో మోదీ తీరు ఎలా ఉందంటే, ‘ఓహ్, వారు ఉద్యోగాలు అడుగు తున్నారా? అయితే వారికి తలొక ఆవును ఇవ్వండి చాలు..’ పనిచేయని గోరక్షణ మరోవైపున భారత్లో ఉద్యోగాలులేని యువసైన్యం గ్రామీణ ప్రాంతాల్లో కేరమ్స్, పేకాట అడుకుంటా గడిపేస్తున్నారు లేకపోతే ఊరకే పొగ తాగుతూ, చాట్ చేస్తూ, దాదాపుగా ఉచిత డేటాను అందిస్తున్న చైనీస్ స్మార్ట్ ఫోన్లలో చెత్తనంటినీ చూస్తూ పొద్దుçపుచ్చుతున్నారు. కానీ వీరిలో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతోంది. మోదీని అధికారంలోకి తీసు కొచ్చిన వారి ఆకాంక్షలు, ఆత్మగౌరవ తృష్ణ వంటివాటిని బలిపెట్టడానికి కూడా వెనుదీయని వీరు ఇప్పుడు తమ హృదయం నిండా గోరక్షణ కర్తవ్యసాధనలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నారు. కాని ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పవిత్ర కర్తవ్యం పనిచేసినట్లులేదు. నరేంద్రమోదీ పచ్చి వ్యతిరేకులు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామీణ, రైతుల దుస్థితి ఫలితమే అని ఎవరైనా విశ్లేషిం చవచ్చు. కానీ బీజేపీ ఈ రాష్ట్రాల్లోని చాలా నగరాలను కూడా పోగొట్టు కుంది. మోదీ మద్దతుదార్లలో చాలా పెద్ద, గొంతుబలం కలిగిన, ఆశా వాదులు పట్ణణ, సెమీ అర్బన్ మధ్యతరగతులకు చెందిన వారు, నిరు ద్యోగ యువతే మరి. 2018లో నెహ్రూను పునరుత్థానం చెందించి మళ్లీ ఆయన్ని సమాధి చేయాలన్న పిలుపును వీరెవరూ పెద్దగా పట్టించుకు న్నట్లు కనిపించలేదు. గందరగోళపడుతున్న ఓటర్లు 2014 సార్వత్రిక ఎన్నికల తీర్పు తర్వాత, భారత్లో సహస్రాబ్దిలో, భావజాలరహిత తరం ఆవిర్భవించిందని నేను రాశాను. నేను నీకేమీ బాకీ లేను అనే తరహా తరం పుట్టుకొచ్చింది. రాజరికానికి, వంశపాల నకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వారు తోసిపుచ్చేశారు. ఆ ప్రకారమే కాంగ్రెస్ను శూన్యంలోకి నెట్టేశారు. కానీ ఇప్పుడు మోదీ, షాలు ఆ వంశ పాలనకే వ్యతిరేకంగా పోరాడమని మళ్లీ పిలుపు ఇస్తున్నారు. కానీ ఇది పనిచేయడం లేదు. ఓటర్లు గందరగోళ పడుతున్నారు. వారి ప్రశ్న ఒకటే. ‘నేను ఆలోచిస్తున్న వ్యక్తి మీరేనా?’ 2014 నాటి మేధోవంతమైన కేంపెయిన్లో సోనియా గాంధీ ఆమె సంక్షేమవాదం గురించి ఒక అద్భుతమైన కథను నరేంద్ర మోదీ జనా లకు చెప్పేవారు. ఒక రైతు అడవిలో వెళుతూ ఆకలితో ఉన్న సింహం దారికి అడ్డంగా నడి చాడు. అతడిని చంపి తినేయాలని సింహం మాటు గాచింది. కానీ రైతు ప్రశాంతంగా ఉన్నాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి దిగకు, అంటూ అతడు సింహాన్ని హెచ్చరించాడు. లేకుంటే నిన్ను నా తుపాకితో కాల్చే స్తాను. సింహం ఆగింది. రైతుకేసి తీక్షణంగా చూసింది. కానీ తుపాకి ఏదీ అని అడిగింది. ఆ రైతు తన కుర్తా జేబునుంచి మడిచిన కాగితం బయటకు లాగాడు. ‘‘ఇదిగో ఇక్కడ ఉంది షేర్ భాయ్, తుపాకి ఇంకా దొరకలేదు కానీ సోనియా గాంధీ నాకు గన్ లైసెన్స్ ఇచ్చింది మరి’’. వేలాదిమంది జనం పకపక నవ్వారు. వారు ఈ కథ లోని సందేశం అర్ధం చేసుకున్నారు. దారిద్య్రం, నిరుద్యోగం, భవిష్యత్తుపై ఆకాంక్షలను కేవలం హక్కుదారీ పథకాలు నెరవేర్చలేవు. హక్కులు సంక్రమింపజేసే చట్టాలు(ఆ రైతుకు తుపాకి లైసెన్స్ ఇవ్వడంలాంటివి) మద్దతిచ్చినా సరే ఆ సమస్యలు తీరవు. పైగా జాతీయ ఉపాధి పథకం అనేది దశాబ్దాల కాంగ్రెస్ ప్రభుత్వాల తీవ్ర వైఫల్యానికి అతి గొప్ప సాక్ష్యమని మోదీ విమర్శించారు. కానీ అదే పథకంలోకి తానే ఇప్పుడు మరింత డబ్బు గుప్పిస్తున్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్యం కోసం మోదీ ఇస్తున్న తుపాకి లైసెన్సులా ఉంది. 2014లో మోదీ ఒక వంశ పాలనను ఓడించారుగానీ దాని రాజకీయ ఆర్థిక శాస్త్రాన్ని మాత్రం కౌగలించు కున్నారు. సిద్ధాంతాలతో పనిలేకుండా 2014 నుంచి గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకూ మోదీని చూసి ఓట్లు కుమ్మరించిన ఓటర్లు ఇప్పుడు అదే మోదీ విధానాలను చూసి గందరగోళంలో పడు తున్నారు. 2014లో నరేంద్రమోదీ, అమిత్షాలు తమకు ఎదురే లేదు అన్న విధంగా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించారు. కానీ ఇప్పుడు వారే ఆగ్ర హిస్తున్నారు. గదమాయిస్తున్నారు. తామే బాధితులమని వాపోతు న్నారు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఓడిపోయిన తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్నారు తప్ప తమకు ఓటేయ వలసిందిగా వీరిప్పుడు అడగటం లేదు. గెలిచే టిక్కెట్లను తమ వద్ద ఉంచుకుని కూడా ఇలా తమను ప్రతిపక్ష స్థానంలోకి ఎందుకు మార్చు కుంటున్నారు అనేది గమనించినట్టయితే మనముందు లేని అలీక్ పద మ్సే కూడా పకపకా నవ్వుతారు కాబోలు! వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
పెను సంక్షోభం ఊబిలో సీబీఐ
కేంద్ర అవినీతి నిరోధక సంస్థ సీబీఐ రెండు దశాబ్దాల సంస్కరణను ఉల్లంఘించిన కారణంగానే దాని ఉన్నతాధికారులు పరస్పరం దొంగలుగా ఆరోపించుకుని సంస్థ ప్రతిష్టను మంటగలిపారు. దీన్ని సాకుగా తీసుకుని, ఏపీ సీఎం చంద్రబాబు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తునకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను సైతం ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలమవడానికి కారణం ఏమిటంటే, సంస్థాగత సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొందించడమే. ప్రస్తుత కార్యం మరింత సంస్థాగతమైన క్రమశిక్షణతో సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు. ‘హమ్ సీబీఐ సే హై... అస్లీ వాలే‘ (మేం సీబీఐ నుంచి వచ్చాం, నిజమైన సీబీఐ), అని 2013లో నీరజ్ పాండే తీసిన అద్భుతమైన సినిమా స్పెషల్ 26లో ఒక రైడింగ్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సీబీఐ ఇన్స్పెక్టర్ వసీమ్ఖాన్ పాత్రను పోషించిన మనోజ్ బాజ్పేయి అంటాడు. అస్లీ వాలే అంటూ అతడు చెప్పుకోవడానికి కారణం ఏదంటే, అక్షయ్ కుమార్ నేతృత్వం లోని మరొక బృందం, తాము సీబీఐ నుంచి వచ్చామని చెప్పుకుంటూ సంపన్నులపై దాడి చేసి వారి సంపదను తీసుకుని మాయమవుతుండటమే. సరిగ్గా దీన్ని పోలిన మరొక డ్రామా ఇప్పుడు నిజజీవితంలో చాలావరకు గౌరవనీయ సుప్రీంకోర్టులో ప్రదర్శితమవుతోంది. సీబీఐలో ఉన్న నంబర్ వన్ గ్రూప్, నంబర్ టు గ్రూప్ తమ్ము తాము అస్లీ వాలే అని చెప్పుకుంటూ ఇతరులను దొంగలు అని పిలుస్తున్నారు. ఈ పేలవమైన ఆరోపణలు మరికొన్ని మసాలాలను కలిగి ఉన్నాయి: కేంద్రప్రభుత్వం ఒక పక్షానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు కనబడుతోంది. ఇక ఒక చీఫ్ విజి లెన్స్ కమిషనర్ (సీవీసీ) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆయన నెత్తిపై ఒక రిటైరైన న్యాయమూర్తి కూర్చుని ఉండటమే. ప్రతి ఒక్కరూ భారత్లో అత్యంత కాఠిన్యవంతులై కార్యకర్తలు, న్యాయవాదుల ఆగ్రహావేశాలకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఎవరూ ఎవరినీ నమ్మడంలేదు, ప్రతి ఒక్కరినీ మరొకరు నిశితంగా గమనిస్తున్నారు. అందుచే మనం ఏం చేయాలి? ఇక నిర్ణయించడానికే సంకోచిస్తున్నప్పుడు ఉన్నతాధికారులు చేసేది ఏమిటి? వారు కాలాన్ని వృథా చేస్తున్నారు. అందుకే, నాకు మరో రెండు వారాలు ఇవ్వండి. రోజుల తరబడి వేచి ఉండే సంప్రదాయం ప్రకారం ఇది మరింత ఆలస్యం అయినట్లయితే, ప్రస్తుత డైరెక్టర్ పదవీబాధ్యత వచ్చే జనవరిలో ముగియనుంది. ఆయన్ని వెళ్లనిద్దాం. నంబర్ టూని మాతృసంస్థకు తరలిద్దాం. అప్పుడు కొత్త సీబీఐ బాస్ కోసం శోధన ప్రారంభిద్దాం. ఇదే కథకు ముగింపు. ఈలోగా, మన అత్యంత ముఖ్యమైన అవి నీతి నిరోధక సంస్థ, దాని బాస్లు ఒకరిపై ఒకరు లీకులు, పుకార్లు రేపుకుంటూ ఉన్నందున నేటికీ స్తంభించిపోయి ఉంది. నా సహోద్యోగి అనన్య భరద్వాజ్ దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనెక్టివిటీ అంటూ సరిగ్గా వర్ణించారు. మరొకరి స్థానంలో పనిచేస్తున్న డైరెక్టర్ కూడా అనుమానాల మధ్య చిక్కుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరొక పోలీసును పట్టుకోవడానికి మీరు ఏ పోలీసును నియమిస్తారు? ఈ సంకుల సమరాన్ని అనువుగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాష్ట్రంలో కేసుల దర్యాప్తుకు సీబీఐకి ఇచ్చిన అధికారాలను ఉపసంహరించే సాహసానికి పూనుకున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే బాబుకు తన మద్దతును ప్రకటించేశారు. ప్రత్యేకించి సీబీఐ దర్యాప్తు, విచారణ కింద ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ప్రక్రియలో భాగమవడాన్ని దీని ఫలితంగా సీబీఐ ప్రథమస్థాయి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించవచ్చు కూడా. ఏదేమైనా, కోర్టులను నిందించాలంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. మన కోర్టులు గత రెండు దశాబ్దాలుగా ఏదో ఒకటి చేయాలని కనీస ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సీబీఐని సంస్కరించడంలో ఈ వైఫల్యానికి నేను న్యాయస్థానాలను నిందించలేను. మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా, తనను కోర్టులు, ప్రభుత్వం, లేక సామాజిక కార్యకర్తలు.. చివరకు ఇండియన్ పోలీసు సర్వీసులు వంటి ఏ సంస్థ కూడా పరి శుద్ధం చేయలేనటువంటి రాకాసిలా సీబీఐ మారిపోయింది. ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా పలువురు మంచి వ్యక్తులు దాంట్లో పనిచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తన మంచి పేరును సైతం ఉల్లంఘించిన క్రూర జంతువులా సీబీఐ మారిపోయింది. ఒకప్పడు పంజరంలో చిలుక అని తిరస్కారానికి గురైన ఇదే సంస్థ ఇప్పుడు మన రాజకీయాలకు, రాజకీయ నేతలకు డబ్బులు తీసుకుని శిక్షలు లేకుండా చేయగలిగే స్థాయికి చేరుకుంది. 1990ల్లో (జైన్ హవాలా కేసును గుర్తుతెచ్చుకోండి) సీబీఐ రాజకీయనేతల కెరీర్లనే ధ్వంసం చేసి వారిని మళ్లీ పునరుత్థానం చేసింది. వాస్తవానికి ఎల్.కె. అడ్వాణీ (జైన్ హవాలా), పీవీ నరసింహా రావు (జేఎమ్ఎమ్ ముడుపులు) ఎ. రాజా (టూజీ), దయానిధి మారన్ (టెలిఫోన్ ఎక్చేంజ్ కేసు) వంటి సీబీఐ ప్రాసిక్యూట్ చేసిన ప్రముఖులందరూ చివరికి నిర్దోషులుగా బయటపడ్డారు. అదే సమయంలో సీబీఐ సాగించిన సాక్ష్యాలు లేని తరహా కుంభకోణాల ఉన్మాదం టెలికాం నుంచి మైనింగ్ దాకా మన ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసింది. సీబీఐ ప్రభుత్వాలకు ఎంత ప్రశంసాత్మకంగా ఊడిగం చేసిందంటే, బోఫోర్స్ కేసును తుంగలో తొక్కింది లేక తన అభీష్టం ప్రాతిపదికన తిరగదోడింది కూడా. ఈ క్రమంలో ఏ ఒక్కరూ శిక్షలకు గురికాలేదు. పైగా ఆయా కేసుల్లోని నిందితులు అప్పటికే చనిపోయి ఉండటం కూడా తట స్థించేది. సీబీఐకి జవసత్వాలు కలిగించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నిం చింది. రెండు భారీ కుంభకోణాలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం నేర విచారణ ప్రక్రియను, విచారణ బృందాలను తన నియంత్రణలోకి తీసుకోకపోయి ఉండవచ్చు గానీ తన ప్రత్యక్ష పరిరక్షణలో ఉంచి పనిచేయించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షించినప్పటికీ జైన్ హవాలా, టూజీ స్పెక్ట్రమ్ కేసులు ఫలితం లేకుండా నీరుగారిపోయాయి. సుప్రీంకోర్టు పదే పదే సీబీఐకి సాధికారత కల్పించేందుకోసం జోక్యం చేసుకుంది, దానికి మరింత స్వతంత్రత కల్పించి, నిష్పాక్షికంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ సంస్థ డైరెక్టర్కి రెండేళ్ల పదివీకాలాన్ని ఫిక్స్ చేసింది కూడా. సీబీఐ డైరెక్టర్ ఎంపికకోసం త్రిసభ్య ప్రభుత్వ కమిటీని నియమించింది, తర్వాత చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన మరింత నూతనమైన, సృజనాత్మకమైన స్వతంత్ర యంత్రాంగాన్ని రూపొందిం చింది కూడా. నిజానికి ప్రభుత్వ వ్యవస్థ చరిత్ర మొత్తంలో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒక కార్యనిర్వాహక పదవికి నియామకం జరిపిన ఘటన ఇదొక్కటి మాత్రమే కావడం విశేషం. అంటే సీబీఐని మన వ్యవస్థ ఎంత తీవ్రంగా పట్టించుకుంటోందో దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత, అది సాధించిన ఫలితాల బట్టే దాన్ని తూచాల్సి ఉంది. బలహీనపడిన సీబీఐది ఒక ఘోర స్థితి అయితే, మళ్లీ బలోపేతం చేసిన సీబీఐ మరింత ఘోరంగా మారింది. న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నూతన వ్యవస్థలో నియమితులైన అదే డైరెక్టర్ల ఆధ్వర్యంలోని సీబీఐని ప్రభుత్వాలు వరుసగా ఎలా దుర్వినియోగం చేస్తూ వచ్చాయి అనే అంశంపై ఏ పరిశోధకుడైనా మొత్తం పీహెచ్డి థీసీస్గా మల్చగలడు. అలాంటి దుర్వినియోగానికి చెందిన అంశాలను కొన్నిం టిని గుర్తుకు తెచ్చుకుందాం. పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం ఎప్పుడైనా విశ్వాస తీర్మానం పరిధిలోకి వచ్చినట్లయితే, అప్పటికే అనుమానితులుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్, మాయావతిలపై సాగుతున్న కేసులు అద్భుత పురోగతి సాధించినట్లుగా జాతీయ పత్రికల పతాక శీర్షికల్లో ఊహాజనిత కథనాలు ప్రత్యక్షమయ్యేవి. అలాగే నరేంద్రమోదీ, అమిత్ షా, గుజరాత్లో వారి నమ్మిన బంటు పోలీసులకు వ్యతిరేకంగా సీబీఐని స్పెషల్ పర్పస్ వెహికల్గా ఇలాగే ఉపయోగించారు. చివరకు ఇష్రాత్ జహాన్ కేసులో అత్యున్నత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ని ఇరికించేత స్థాయికి సీబీఐ వెళ్లిపోయంది. ఈ కేసులో మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, అది సంకేతించే అంశం ఏది: ఏం జరిగింది? యూపీఏ బలహీనపడుతోందని సీబీఐ అధిపతి గ్రహించగానే ఆ కేసును సాగదీశారు. తర్వాత మోదీ అధికారంలోకి రాగానే ఆ కేసునే రద్దు చేసి పడేశారు. ఎందుకంటే అడ్డం తిరిగిన సాక్షులు ఈ కేసులో వందకు చేరుకున్నారు మరి. సీబీఐని సంస్కరించాలని చేసిన ప్రతి ప్రయత్నమూ విఫలం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, సంస్థాగతంగా సంస్కరణకు వెలుపల ఉండేలా సీబీఐని రూపొం దించడమే. న్యాయవ్యవస్థ మందకొడిగా పనిచేస్తున్న వ్యవస్థలో మితిమీరిన అధికారం కలిగివున్న ఏ పోలీసు వ్యవస్థ అయినా ఒక ప్రక్రియలో దండనాధికారిగానే మారిపోతుంది. ఈ స్థితిలో యువకులుగా ఉన్నప్పడు జైలుపాలయిన వారు మధ్య వయస్సు వచ్చినప్పటికీ ఆ జైళ్లలోనే ఉంటారు. అప్పటికి కూడా వారి విముక్తి పొందలేరు. అందుకే ప్రస్తుతం మనకు కావలసింది మరింత సంస్థాగతమైన క్రమశిక్షణ, సీబీఐని నియంత్రించడమే తప్ప దానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టడం కాదు. వినీత్ నారాయణ్ కేసులో తానిచ్చిన తొలి చారిత్రక తీర్పులో సుప్రీంకోర్టు సీబీఐ అధికారాలను పెంచి, దాని అధిపతి పదవీకాలానికి రక్షణ కల్పించింది. ప్రాసిక్యూషన్ని కొట్టేయడం లేక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడం జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్యానెల్లోని ఒక లాయర్ తప్పకుండా సమీక్షించాలి. బాధ్యతలను ఉపేక్షించిన వారిపైనే బాధ్యతను మోపాలి. తన విధిని విస్మరించిన అధికారిపై కఠిన చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇంతవరకు అలాంటివేమీ జరిగిన పాపాన పోలేదు. ఎందుకంటే కోర్టు తీర్పులో తమకు అనుకూలమైన వాటినే రాజకీయ నాయకులు అందిపుచ్చుకుని ఉపయోగించుకుంటారు. ఇటీవలి కాలంలో నలుగురు సీబీఐ డైరెక్టర్లలో ముగ్గురు వివిధ స్థాయిల్లో అవినీతీ ఆరోపణలను ఎదుర్కొనడంలో ఆశ్చ ర్యపడాల్సింది ఏమీ లేదు. తదుపరి సీబీఐ డైరెక్టర్ ఇంతకు మంచి ఉత్తమంగా ఉండగలరనడానికి గ్యారంటీ ఏదీ లేదు. సీబీఐ కార్యాలయంలో అపరిమితాధికారం ఉంది. కానీ చాలా తక్కువ జవాబుదారీతనం ఉంది. ఇలాంటి పరమ గందరగోళపు సంస్థాగత నిర్మాణంలో సూపర్మ్యాన్ మాత్రమే అస్లీ వాలేను నేనే అని ప్రకటించుకోగలడు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
సంకీర్ణ ప్రభుత్వాలంటే భయమేల?
సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. తర్వాత వచ్చిన చంద్రశేఖర్, వాజపేయి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలే అయినా నాటి, నేటి సుస్థిర ప్రభుత్వాలు కూడా చేపట్టలేని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నాయి. అందుకే మన భవిష్యత్తుకు సుస్థిర ప్రభుత్వాలు అవసరం అంటున్న అజిత్ దోవల్ ప్రతిపాదన వాస్తవ సమ్మతం కాదు. రాబోయే పదేళ్ల కాలానికి భారత్కు కఠిననిర్ణయాలు తీసుకోగలిగే, సుస్థిరమైన, మెజా రిటీ ప్రభుత్వం అవసరం ఎంతైనా ఉందంటూ, ఈ గురువారం సర్దార్ పటేల్ స్మారకోపన్యాసం సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ చేసిన వ్యక్తీకరణపై అన్యాయంగా దాడి చేస్తున్నారు. ఆయనపై ఈ రకమైన దాడి అభ్యంతరకరమైనది. జాతీయ భద్రతా సలహాదారు ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఆ పదవి రాజకీయ నియామకంతో కూడినది. కాబట్టి తన ఓటింగ్ ప్రాధాన్యతలను ఆయన దాచుకోవలసిన అవసరం లేదు. అలాంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ మాత్రమే అందించగలరని దోవల్ పేర్కొన్నా.. నేను ఆయనతో ఘర్షణకు దిగను. దోవల్ చేసిన రాజకీయ ప్రతిపాదనపై కాకుండా ఆయన ప్రాథమిక వాదనపైనే నేను చర్చిస్తాను. సుస్థిరమైన, బలమైన, పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు మాత్రమే భారత్కు మంచి చేస్తాయని, సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిరమైనవని, అయోమయంతో కూడినవని, అస్పష్టమైనవని, అనిశ్చితమైనవని, అవినీతికరమైనవని, బ్లాక్మెయిల్కి వీలు కల్పిస్తాయని అజిత్ దోవల్ మౌలిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదన.. వాస్తవాల నిర్ధారణలో నిలబడటం లేదు. ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఈ రంగంలో డేటాకు పక్షపాతం ఉండదు. మన రాజకీయ చరిత్రను రెండు సుస్థిర దశలుగా విభజించవచ్చు. ఒకటి 1952–89 కాలానికి చెందింది. ఈ 37 సంవత్సరాల్లో దేశం దాదాపుగా సుస్థిరతను చవిచూసింది. 1970ల చివర్లో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి కానీ సాధారణంగా ఒకే పార్టీ అటు కేంద్రం లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ పాలన సాగించిన కాలమది. ఆ దశలో దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు సుస్థిరతను సాధిం చాయి. ఒక పార్టీ నియంత్రణలో శక్తిమంతంగా అవతరించాయి. అది కూడా తిరుగులేని ఒకే కుటుంబం అంటే గాంధీల కుటుంబ యాజమాన్యంలోనే ప్రభుత్వాలు నడిచేవి. 1984–89లో లోక్సభలో గాంధీల పాలన దాదాపు 80 శాతం మెజారిటీని సాధించింది. ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదిస్తున్న సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైన ‘దోవల్ సిద్ధాంతం’ సరైందే అయితే, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో భారత్ అత్యుత్తమ అభివృద్ధిని సాధించి ఉండాలి. కానీ వాస్తవానికి అది 3.5 శాతం కంటే తక్కువ ‘హిందూ అభివృద్ధి రేటు’నే అందివ్వగలిగింది. ఇక రెండోది అస్థిరమైన యుగం. 1989లో రాజీవ్ గాంధీ పరాజ యంతో ఇది మొదలైంది. 2014 వరకు అంటే 25 ఏళ్ల పూర్తికాలం ఈ అస్థిర పాలనా దశ కొనసాగింది. సుస్థిరమైన, పూర్తి మెజారిటీ ప్రభుత్వాలు ముగిసిన తర్వాతే, దేశంలో ఆర్థిక సంస్కరణలు స్పష్టమైన రూపం తీసుకోవడం కాకతాళీయం. కాంగ్రెస్ పార్టీ పతనం తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం స్వల్పకాలం మాత్రమే మనగలగడంతో సంస్కరణల పరీక్షలో పాస్ కాలేకపోయింది. కానీ అతిపెద్ద సంస్కరణల ప్రభంజనం పీవీ నరసింహారావు అస్థిర ప్రభుత్వం ద్వారానే సాకారమైంది. 1996లో పీవీ హయాం ముగిశాక, తదుపరి ఎనిమిదేళ్ల కాలంలో భారత్ అయిదుగురు సంకీర్ణ కూటమి ప్రధానులను, నాలుగు సార్వత్రిక ఎన్నికలను చవి చూసింది. అయిదుగురు ప్రధానులు అని అంటున్నామంటే.. దేవేగౌడ, ఎల్కే గుజ్రాల్ స్వల్పకాలిక ప్రభుత్వాలతోపాటు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా మొదట 13 రోజులపాటు తర్వాత సంవత్సరం పాటు, చివరగా పూర్తికాలం పాలన చేశారు కదా. ఇప్పుడు చూద్దాం. 1991లో మన్మోహన్ సింగ్ తర్వాత రెండవ అత్యంత సంస్కరణాత్మక బడ్జెట్ ఏదంటే 1997 నాటి పి. చిదంబరం ‘డ్రీమ్ బడ్జెట్’ అని చెప్పాలి. ఈ డ్రీమ్ బడ్జెట్లోనే పన్నులు, వడ్డీరేట్లు తగ్గించారు. ఆదాయాన్ని స్వచ్చందంగా వెల్లడించే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ కాలంలోనే జాతీయ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడానికి తలుపులు తెరిచారు. తద్వారా ప్రైవేటీకరణకు నాంది పలికారు. దేవేగౌడ–గుజ్రాల్ ప్రభుత్వాలను ‘రోజు కూలీ’పై పనిచేసే ప్రభుత్వాలుగా వ్యంగ్యంగా పేర్కొనేవారు. తమాషా ఏమిటంటే మన దేశ చరిత్రలో వామపక్ష భావజాలం అధికంగా కలిగిన ప్రభుత్వాలు ఇవే మరి. మొట్టమొదటిసారిగానే కాదు.. చివరిసారిగా కూడా ఇద్దరు కమ్యూనిస్టు మంత్రులను కలిగిన కేంద్ర ప్రభుత్వాలు ఇవే. వాజ్పేయి స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను ప్రారంభించడానికి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలను ప్రైవేటీకరించడానికి, 11 ప్రభుత్వరంగ సంస్థలను, రెండు డజన్ల ఐటీడీసీ హోటళ్లను అమ్మేయడానికి తగిన శక్తిని కలిగి ఉండేవారు. అయితే గత నాలుగున్నర ఏళ్లలో అత్యంత శక్తివంతమైన మోదీ ప్రభుత్వం కనీసం ఒక్కటంటే ఒక్క పీఎస్యూని అమ్మలేకపోయింది. చివరకు ఎయిర్ ఇండియా వంటి అసమర్థ సంస్థను కూడా అది వదిలించుకోలేకపోయింది. 1989–2004 మధ్యలో సాగిన 15 ఏళ్ల అస్థిర శకంలో అతిస్పల్పకాలం మనగలిగిన ప్రభుత్వం చంద్రశేఖర్ ప్రభుత్వంగా చెప్పాలి. ఇది కేవలం నాలుగు నెలలు మాత్రమే పాలన సాగించింది. దీన్ని ‘క్యాష్ అండ్ క్యారీ’ ప్రభుత్వంగా అపహాస్యం చేసేవారు. ఎందుకంటే కేవలం 50 మంది సొంత ఎంపీలను మాత్రమే కలిగిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బయటనుంచి ఇచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. కానీ విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని అధిగమించడానికి ఈయన ప్రభుత్వమే భారత్ బంగారు నిల్వలను విదేశాలకు తరలిం చింది. సంపూర్ణ మెజారిటీ కలిగిన ప్రభుత్వం, చివరకు మోదీ ప్రభుత్వం కూడా దీనికి సాహసించేదని నేను భావించలేను. యశ్వంత్ సిన్హాను తన ఆర్థికమంత్రిగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ మరోవైపు డాక్టర్ మన్మో హన్ సింగ్ని శక్తివంతమైన ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఆ హోదాలో మన్మోహన్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాగలిగేవారు. తదనంతర సంవత్సరాల్లో ఈ ఇద్దరే మన సంస్కరణల రూపశిల్పులుగా అవతరించారు. బలహీనమైన సంకీర్ణ కూటముల హయాంలోనే ఇది చోటుచేసుకుంది. స్థిరంగా 37 ఏళ్లపాటు మన అభివద్ధి రేటును పరిశీలిస్తే అది సగటున 3.5శాతంకు తక్కువే. తర్వాత పాతికేళ్లలో అది 5కు చేరుకుంది. ప్రస్తుతం 7కంటే ఎక్కువే నమోదవుతోంది. పాతదానికంటే రెట్టింపు అయ్యింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు స్థిరమైన ప్రభుత్వాలకు, వృద్ధిరేటుకు మధ్య గ్రాఫ్ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ, జాతీయ భద్రత విషయానికి వస్తే సంకీర్ణ ప్రభుత్వాలు అసమర్థమైనవని భావిస్తారు. 1989–90 మధ్య వీపీ సింగ్ హయాంలో మినహాయిస్తే, జాతీయభద్రత విషయంలో మన ప్రభు త్వాలు బలహీనంగా ఎప్పుడూ లేవు. ఆ ప్రభుత్వంలోనూ దోవల్ పని చేశారు. పంజాబ్, కశ్మీర్లలో పరిస్థితులు చేయిదాటి పోతుంటే చూస్తూ ఊరుకున్నారు. తర్వాత అవకాశం వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నారు. ఇంతకు ముందు నేను రాసినట్టు, పంజాబ్లో చంపేసిన ప్రతి ‘ఏ’ కేటగిరీ ఖలిస్తానీ చొరబాటుదారుడినీ ‘గిల్ పట్టుకున్నాడు, దోవల్ పని పట్టాడు’అనే అభివర్ణించారు. చొరబాట్లను రూపుమాపడంలో ఐబీ, పంజాబ్ పోలీస్ మధ్య అది ఓ చక్కని ఆపరేషన్. ఇదే పద్ధతిలో 1991–96మధ్య అస్తవ్యస్థంగా వున్న çకశ్మీర్ని అదుపులోకి తీసుకొచ్చారు. దోవల్ కెరీర్ ఎదుగు దలకు ఇవన్నీ దోహదపడ్డాయంటే, అందుకు ఏమాత్రం చరిష్మాలేని ప్రధాని ఆధ్వర్యంలోని బలహీనమైన మైనార్టీ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అత్యంత శక్తిమంతురాలిగా వున్నప్పటికీ పోఖ్రాన్–1 పరీక్షలను అణుబాంబు ప్రయోగంగా చెప్పు కోడానికి ఇందిర సాహసించలేదు. శాంతి యుత ప్రయోజనాలకే అణు ప్రయోగాలు అనే ముసుగు కప్పుకోక తప్పలేదు. 24ఏళ్ల తర్వాత బల హీనమైన వాజ్పేయి హయాంలోని సంకీర్ణ ప్రభుత్వం అటువంటి ముసుగులు వేసుకోలేదు. వాజ్పేయి ప్రభుత్వం ఎంత బలహీనమైన దంటే పోఖ్రాన్–2 పరీక్షలు జరిగిన 11 నెలలకే ఒక్క ఓటు తక్కువ కావడంతో కూలిపోయింది. పోఖ్రాన్–2 పరీక్షలు సాహసోపేతమైన విధాన నిర్ణయం అను కుంటే, యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ కుదుర్చుకున్న భారత్–అమెరికా అణు ఒప్పందాన్ని ఏమనాలి? మన్మోహన్ ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఆధారపడి ఉంది. పార్లమెంట్లో తన ప్రభుత్వం ప్రమాదంలో వున్నప్పటికీ ప్రపంచం దృష్టిలో భారత్ వ్యూహాత్మక దృక్పథాన్ని మార్చివేశారు. యూపీ ఏ–2 హయాంలో కూడా ఇలాగే రిటైల్ రంగంలోకి ఎఫ్డీఐలను ఆహ్వానిం చారు. మోదీ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని అప్పనంగా స్వీకరించింది. కానీ, రిటైల్ రంగంలో ఎఫ్డీ ఐల వ్యవహారాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇందులో దృక్ప థానికి సంబంధించిన విభేదాలేమీ లేవు. ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత, విధానాలకు సంబంధించిన అంశాల్లో స్థిరమైన ప్రభుత్వాలకంటే అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, ధైర్యంగా వ్యవహరించాయని దీన్నిబట్టి మనకుఅర్థమవుతుంది. మన నేతలు పరిపూర్ణులేమీ కాదు. కానీ, వాళ్లకు ఏది మంచో వాళ్లకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చాక వదులుకోడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంటే, శాంతిభద్రతలు కొనసాగుతుంటే ప్రజలు వారిని మళ్లీ ఎన్నుకుంటారు. సంకీర్ణ ప్రభుత్వం అస్థిరమైనది. దాంతో నేతలు సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు వెతుక్కుంటారు. ఇతరులు చెప్పేది వింటారు. స్థిరమైన ప్రభుత్వాలు నేతలను సుఖంగా, పొగరుగా, వ్యక్తిగత రాగద్వేషాలతో ఉండేలా చేస్తాయి. ఇందిర, రాజీవ్ నుంచి మోదీ వరకు రాజకీయ చరిత్ర చెబుతున్న పాఠం ఇదే. అందుకే మనం సంకీర్ణ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
అపరిమితాధికారం.. అతి ప్రమాదకరం
ఇండియాలో అత్యంత శక్తిమంతమైన భద్రతా వ్యవస్థకు అధిపతిగా అజిత్ దోవల్ అవతరించారు. అయితే, అధికారాలన్నీ ఆయన చేతిలో కేంద్రీకృతం చేయడంతో దొంతరల రూపంలో ఉన్న మన భద్రతా వ్యవస్థకు కీడే జరుగుతుంది. ఇందిర హయాంలో మాదిరిగా దేశ భద్రత విషయంలోప్రధానికే సర్వాధికారాలు ఇస్తే, కీలకమైన కేంద్ర మంత్రులు రబ్బరు స్టాంపులుగా మారతారు! ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ ప్రధాన విషయంలో గట్టి చర్చ అవసరం. భారత ప్రభుత్వంలోని భద్రతా వ్యవస్థను భూమితో పోల్చవచ్చు. మార్పులకు అనుకూలంగాని పొరలతో కూడిన ఈ వ్యవస్థలో భూమిలో మాదిరిగానే మార్పులు అతి స్వల్పంగా ఉంటాయి. భూమిలోని పొరల మధ్య తీవ్ర రాపిడి ఉంటే కొంప మునుగుతుంది. భారత భద్రతా వ్యవస్థలో హఠాత్తుగా మార్పు తెస్తే అదే పద్ధతిలో ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రధాని నరేం ద్రమోదీ ఓ నోటిఫికేషన్ ద్వారా హడావుడిగా ఇంతటి మార్పునకు కారణమయ్యారు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ కుమార్ దోవల్ నాయకత్వంలోని దేశ భద్రతా విధాన నిర్ణయ గ్రూపు(ఎస్పీజీ) కొత్త రూపు సంతరిం చుకుంది. దీని 18 మంది సభ్యుల్లో ఎప్పటిలాగానే త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) అధిప తులు, ఇద్దరు నిఘాసంస్థల(ఐబీ, రా) అధిపతులు, రక్షణ, హోం, ఆర్థిక, అంతరిక్ష శాఖల కార్యదర్శులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, నీతి ఆయోగ్ వైస్చైర్మన్, రెవెన్యూ కార్యదర్శి, ఇంకా దేశంలోనే అత్యంత సీనియర్ సివిల్ సర్వెంట్ అయిన కేబినెట్ కార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. కేబినెట్ సెక్రెటరీ రాజ్యాం గబద్ధమైన పదవి కాగా, ఎన్ఎస్ఏకు అలాంటి హోదా లేదు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎస్పీజీ సమావేశానికి ఏ ఇతర మంత్రిత్వశాఖ కార్యదర్శు లనైనా రమ్మని ఆదేశించే అధికారం ఎన్ఎస్ఏకు ఉంటుంది. రెండోది, ఎస్పీజీ నిర్ణయాలను కేంద్ర మంత్రిత్వశాఖలు/విభాగాలు అమలు చేయడాన్ని కేబినెట్ సెక్రెటరీ సమన్వయం చేస్తారు. మూడోది, ఈ నోటిఫికేషన్పై సంతకం చేసింది ప్రధాని కార్యా లయం(పీఎంఓ) లేదా కేబినెట్ సెక్రెటేరియట్లోని సంబంధిత అధికారి కాదు. జాతీయ భ్రదతా మండలి(ఎన్ఎస్సీ)లోని జాయింట్ సెక్రెటరీ సంత కంతో ఇది విడుదలైంది. ఎస్పీజీని మొదట 1999 ఏప్రిల్లో వాజ్పేయి ప్రభుత్వం తొలుత ఏర్పాటు చేసింది. కాని, తేడా ఏమంటే అప్పుడు ఇది కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉండడమే. అప్పట్లో ఎన్ ఎస్ఏ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు దీనికి ప్రత్యేక ఆహ్వానితులు. ఈ సంస్థ(ఎస్పీజీ) కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి పనిచేసేది. తాజా నోటిఫికేషన్ ప్రకారం దీని కార్యస్థలాన్ని జాతీయ భద్రతా మండలి సచివాలయానికి (ఎన్ఎస్సీఎస్)కి మార్చారు. దీనికి సారథ్యం వహించాల్సిన కేబినెట్ కార్యదర్శి దీని సభ్యునిగా మారడమేగాక, దాని నిర్ణయాలు అమలుచేసే అధికారి అయ్యారు. ఎస్పీజీ కొత్త అధిపతి ఎన్ఎస్ఏ. ఇది పెద్ద మార్పు. ఈ మార్పులను చూశాక, ‘కేబినెట్ క్లర్క్’ ఇప్పుడు ‘ఎన్ఎస్సీఎస్ క్లర్క్’గా అవరించాడని వ్యాఖ్యానిం చక తప్పదు. ఇలాంటి విచిత్రమైన మార్పుల వల్ల అత్యంత సున్నితమైన రంగంలో అతి తెలివి ప్రదర్శి ంచడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఇది కేవలం ఉన్నతాధికార ప్రభుత్వ వ్యవస్థలో ఎవరు పైన, ఎవరు కింద అనే అధికార దొంతరల సమస్య కానే కాదు. జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విషయంలో గట్టి చర్చ అవసరం. కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలు తీసుకునే అధికారం కేబినెట్ సెక్రెటేరియట్ నుంచి ఎనెస్సీఎస్కు బదిలీ చేయ డమే ఇక్కడ అత్యంత ప్రధాన మార్పు. కేబినెట్ సెక్రె టేరియట్లోనే పరిశోధన, విశ్లేషణ విభాగం(ఆర్ఏడ బ్ల్యూ–రా) ఉంటుంది. రాకు నిధులకు కూడా అక్కడి నుంచే వస్తాయి. ఎస్పీజీ నిర్ణయాలను కేబినెట్ సెక్రె టరీ అమలు చేస్తారు కాబట్టి సాంకేతికంగా చూస్తే పూర్వ స్థితి కొనసాగుతుందనిపిస్తుంది. కాని, అధి కారం ఆయన చేతిలోనో, కేబినెట్ చేతిలోనో ఉండదు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రధా నికి కీలక సలహాదారు ఎన్ఎస్ఏ కావడంతో తనకు అప్పగించిన అధికారంపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఆయనకు ఉందని చెప్పవచ్చు. అయితే, ఇలాంటి మార్పునకు కేంద్ర సర్కారులో కీలకమైన ఈ వ్యవస్థ తేలికగా అలవాటు పడుతుందా? చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి! ఈ మార్పు వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చనీయాంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ మార్పు కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక మంత్రుల అధి కారాన్ని బలహీనపరచదా? వారి అధికారులు, త్రివిధ దళాల అధిపతులు వాస్తవానికి ఎస్పీజీ సమా వేశం నిర్ణయాలను వారికి తెలిపితే, కేబినెట్ కార్య దర్శి వాటిని అమలు జరిగేలా చూస్తారు. రెండు, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్)కు ఇక చేయడానికి పనేమి ఉంటుంది? కేబినెట్ తరహా పాలనా వ్యవస్థలో ఉమ్మడి బాధ్యత అత్యంత కీలకం. అంటే సీసీఎస్ సభ్యులందరికీ ఎలాంటి కీలకాం శంపైనైనా మాట్లాడవచ్చు. వారి మాటకు విలువ ఉంటుంది. అలాగే వారంతా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. వారిలో ప్రధాని మాటకు ఎక్కువ విలువ అని చెప్పాల్సిన పనిలేదు. సీసీఎస్లో భిన్నా భిప్రాయం, చర్చ ఎంతో అవసరం, ఆరోగ్యకరం. ప్రధాని అధికార పరిధికి లోబడి పనిచేసే త్రివిధ దళా ధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన భారీ ఎస్పీజీ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు చర్చగాని, భిన్నాభిప్రాయం చెప్పడంగాని సాధ్యమా? ఏదైనా అంశంపై ప్రధాని అభిప్రాయం అప్పటికే తెలిస్తే– దానిపై వారేం చర్చిస్తారు? అంటే మిగిలిన నాలుగు బడా శాఖల(హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగం) మంత్రులు కేవలం రబ్బరు స్టాంపులుగా మారి పోతారు కదా? మూడోది, ఇది జరిగేది కాదను కోండి. అదేమంటే, రక్షణ బలగాల ఉమ్మడి అధిపతి నియామకం లేదా ఈ అవసరంపై చర్చ ఇక ఈ తాజా మార్పు వల్ల ఉండదు. బలమైన ప్రధాని ఉన్న ప్పుడు నిర్ణయాలు పై నుంచి కిందకే గాని, కింద నుంచి పైకి రావనే అభిప్రాయానికి సర్వామోదం లభిస్తుంది. ఇందిరాగాంధీ హయాంలో ఇదే జరి గింది. అయితే, అధికార కేంద్రీకరణ లాంఛనంగా, వ్యవస్థీకృతంగా ఇప్పుడు జరుగుతోంది. ఇక అడ్డ గోలు నిర్ణయాలకు అడ్డుకట్టవేసే వ్యవస్థ ఉండదు. రఫాల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రశ్న? రఫాల్ యుద్ధవిమానాల కొనుగోలు వివాదంపై సుప్రీంకోర్టు ఏ ప్రశ్న అడిగిందో ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఈ ఒప్పందం విషయంలో నిర్ణీత పద్ధతి అనుసరించారా? లేక ప్రధాని నిర్ణయం తీసుకుని ప్రకటించారా? ప్రధాని సదుద్దేశంతో నిర్ణయించినా దానికి అవసరమైన లాంఛనప్రాయమైన లిఖితపూ ర్వక పని జరిగిందా? ఇన్ని అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మార్పులకు అవకాశం లేకుండా పనిచేస్తున్న ఉన్నతాధికార సర్కారీ వ్యవస్థలు చురుకుగా కదలవు. మార్పు అవసరమే. అంటే, అనేక దొంతరలతో కూడిన రాజ్యాంగబద్ధ వ్యవస్థను ఒక్కసారిగా చిందరవందర చేసి కూలదోయడం భావ్యం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్– ఇలా ‘కులాల మాదిరిగా విడి విడిగా పనిచేసే’ ఉన్నతాధికార వ్యవస్థలను (నిజా నికి నేను ఈ మాట అనలేదు. ఇండియన్ పోలిస్ సర్వీస్–ఐపీఎస్ అధికారుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రంలో ఈ మాట వాడింది) ప్రతిభ ఆధారంగా తిన్నగా, సక్రమంగా పనిచేసేలా చేయాలి. ఇది ఒక్క ఐఏఎస్కే కాదు ఏ ముఖ్య సర్వీ సుకైనా వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచిత్రమైన పద్ధతి కారణంగా అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారి ఎవరూ ఇక రిటైరయ్యే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. వారిలో అత్యధికులకు ప్రభుత్వంలో పదవీ విరమణ చేశాక కూడా పదవులు వస్తాయి. కాగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో చాలా మంది రిటైర య్యాక ఇంటి దారిపట్టడమో లేదా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడమో జరుగుతుంది. ఇక్కడ సత్వరమైన –నిర్దిష్టమైనది కాని– ఏర్పాటు ఉంది: రా మాజీ అధినేత రాజిందర్ ఖన్నా ఇప్పుడు డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. అతనికంటే ముందు ఆ స్థానంలో ఉన్న అలోక్ జోషిని ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఎన్టిఆర్ఓ చైర్మన్ని చేసేశారు. 65 ఏళ్లు సమీపించిన తర్వాత అయన్ని సాగనంపారు. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ సతీష్ ఝాని నియమించారు. ఈయనను పదవీవిరమణ తర్వాత మొదట్లో ఎన్టిఆర్ఓ సలహాదారుగా నియమించారు. ఇప్పుడు ఈయనకు ప్రమోషన్ వచ్చింది. ఐబీ మాజీ అధినేత దినేశ్వర్ శర్మ జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ప్రతినిధిని చేశారు. ఐబీ నుంచి రిటైరైన ఆర్.ఎన్.రవి నాగా వ్యవహారాల ప్రతినిధిగా ఉంటున్నారు. ఇప్పుడు తను డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా కూడా ఉంటున్నారు. రా మాజీ అధికారి అమితాబ్ మాథుర్ని టిబెటన్ వ్యవహారాల సలహాదారును చేశారు. రా సంస్థలో నంబర్ టూ స్థానంలో కూడా ఉన్న మాథుర్ మొదట ఎన్ఎస్సిఎస్లో ఇప్పుడు ఎన్ఎస్ఏబీ (జాతీయ భద్రతా సలహా మండలి)లో ఉంటున్నారు. వీరితో పాటు, కర్నాల్ సింగ్ని రిటైర్మెంట్ అనంతరం ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్గా చేశారు. మాజీ ఎన్ఐఏ అధిపతి అయిన శరద్ కుమార్ రైటైరయ్యాక ప్రస్తుతం విజిలెన్స్ కమిషర్గా ఉన్నారు. వీళ్లంతా రిటైరైన ఐఏఎస్ అధికారులే. ఎన్ఎస్సీఎస్ బడ్జెట్ 2016–17లో రూ.81 కోట్ల నుంచి 2018–19 నాటికి రూ. 333 కోట్లకు పెరిగింది. లెంట్రల్ లుటీన్స్లో ఎన్ఎస్సీఎస్ కొలువైనచోట ఉన్న సర్దార్ పటేల్ భవన్ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం నిర్మితమైంది. ఈ అంశంపై ఈ వారం మొదట్లో నేను చేసిన సాధారణ ట్వీట్పై తీవ్రంగా స్పందించారు. ఆ స్పందన ప్రభుత్వ సమర్థకులు, దోవల్ అభిమానుల నుంచి కాకుండా ఐపీఏస్ అసోసియేషన్ సభ్యుల నుంచి రావడం సరదా కలిగించింది. మాజీ కాని స్టేబుల్స్ హోమ్ మంత్రిగా (సుశీల్కుమార్ షిండే), ఉపరాష్ట్రపతిగా (బైరన్ సింగ్ షెఖావత్) అవుతున్న ఈ దేశంలో ఒక రిటైరైన ఐపీఎస్ అధికారి అతి శక్తిమంతుడైన భద్రతా జారు కావడంలో సమస్య ఉంటుందని చెప్పగలనా? అయితే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే 1.34 బిలియన్లమంది ప్రజలున్న, అణ్వాయుధ సమేతమైన దేశంలో అత్యంత శక్తిమం తుడు కావచ్చునా అనేది మంచిప్రశ్నగా ఉంటుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
దేశ రక్షణనూ వదలని జూదక్రీడ
మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొనలేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలుపుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. మనది మూర్ఖుల దేశం అంటూ జస్టిస్ మార్కండేయ ఖట్జూ కొన్ని సందర్భాల్లో చెప్పినది నిజమే అని భావించవచ్చు. భారత్లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమయంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయుధాలను కొనడానికి వెంపర్లాడతాం. ఈ కథనం 1998 ఆరం భానికి సంబంధించినది. అప్పుడే జార్జి ఫెర్నాం డెజ్ అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇది ఎవరూ ఊహించని విషయమేగాదు, ఆయన అసలేం చేస్తా రనే ప్రశ్న తలెత్తింది. నలిగిన కుర్తా, పైజామా, మామూలు చెప్పులు ధరించే ఈ వింత పోకడల కార్మిక నాయకుడు సాదాసీదాగా నడిచే భారత రక్షణ శాఖను ఎలా నడుపుతారని పలువురు ప్రశ్నించారు. ఫెర్నాండెజ్ మాత్రం చాలా వేగంగా తనదైన మార్గంలో బాగా పనిచేస్తూ మనల్ని ఆశ్చర్యపరి చారు. ‘నేనేమీ చేయను–మిమ్మల్నేమీ చేయనీయను’ అనే ధోరణి ఉన్న ఉన్నత ఉద్యోగవర్గంతో నిండిన విషవలయాన్ని మొదట ఛేదించడం ఆయనకు తొలి సవాలు అయింది. నాస్తికుడైన ఫెర్నాండెజ్కు సియా చిన్ గ్లేసియర్ ప్రాంతం ఇష్టమైన పుణ్యతీర్థమైంది. ‘భారత రక్షణశాఖలో వారు(అధికారులు) అవునని గాని, లేదనిగాని చెప్పరు. వారు ఫైళ్లను ఓ కక్ష్యలో పడేస్తారు. మనం దాని వెంటపడతూ ఉండాల్సిందే. ఈ లోగా యుద్ధాలొస్తాయి, పోతాయి. వాటిని గెల వచ్చు, గెలవకపోవచ్చు. ఫైల్లోని విషయం మాత్రం తేలదు. ఇది నేను గుర్తించిన చిరాకుపుట్టించే వాస్త వం’ అని సియాచిన్లో నాకిచ్చిన ఇంటర్వ్యూలో జార్జి చెప్పారు. సియాచిన్ మంచుకొండల్లో వేగంగా కదలడానికి సైనిక దళాలకు విదేశీ స్నోమొబైల్ ఫోన్లు, స్కూటర్లు అత్యవసరమని ఆయన ఈ ప్రాంతానికి వెళ్లిన ఓ సందర్బంలో గుర్తించారు. ఇవి కొనుగోలు చేయడానికి పంపిన ఫైలు కూడా పైన చెప్పినట్టు కక్ష్యలో తిరుగుతూనే ఉంది. రాజధానికి తిరిగి వచ్చాక ఈ ఫైలు ముందుకు జరగకుండా తొక్కిపట్టిన ఉన్నతాధికారులెవరో జార్జి గుర్తించారు. వెంటనే సియాచిన్కు వెళ్లాలని వారిని ఆదేశించారు. సైనికులకు ఈ స్కూటర్ల అవసరం ఎంత ఉందో తెలుసుకునే వరకూ వారు అక్కడే గడపాలని కూడా మంత్రి కోరారు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విషయాలపై ఆయన మాట్లాడే స్థితిలో లేరు. అందుకే, రాఫెల్ యుద్ధవిమానాల కొనుగో లుకు సంబంధించిన ఫైలుపై తమ అసమ్మతి తెలుపుతూ తమ వ్యాఖ్యలు రాసిన రక్షణశాఖలోని జాయింట్ సెక్రెటరీ గురించి మనం అంచనాలకే పరిమితం కాకతప్పదు. ఈ అధికారి నోట్ను ఫెర్నాం డెజ్ చదివితే, వెంటనే ఆయనను ‘అత్యంత నైపుణ్య మున్న రాకెట్ సైంటిస్టు’గా ప్రకటించేవారు! ఎందు కంటే ఎంతో అవసరమైన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలును కూడా ముందుకు సాగనీయకుండా అడ్డుపడడం మామూలు విషయం కాదు. ఇది రక్షణ శాఖ ఉన్నతాధికారుల నైజం. ఒక్క రాఫెల్తో ఆరు సుఖోయీ విమానాలా! ఈ సందర్భంగా ఈ రక్షణశాఖ అధికారి తెలివితేట లను ప్రశ్నించే సాహసం చేస్తున్నాను. 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ కంపెనీ డాసోకు చెల్లించే సొమ్ముతో హెచ్ఏఎల్ నుంచి మరెన్నో సుఖోయి యుద్ధవిమానాలు కొనవచ్చని సూచిస్తూ ఆయన ఇచ్చిన నివేదిక నన్నెంతో ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకు లభించేపక్షంలో హెచ్ఏఎల్ నిర్మించే సుఖోయి విమానాలు మనకు సరిపోతే మనం విదే శాల నుంచి ఎందుకు యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలి? ‘‘ఒక రాఫెల్ విమానానికి చెల్లించే ధరతో హెచ్ఏఎల్ నుంచి ఆరు మిగ్–21 విమానాలు ఎందుకు కొనకూడదు?’’ అని ఫెర్నాండెజ్ ఈ అధికా రిని ప్రశ్నించేవారే! అంతేకాదు, మిగ్ విమానాలపై శిక్షణ ఇచ్చే కేంద్రానికి ఆయనను బదిలీచేసేవారు. అంతటితో ఆగకుండా, రోజూ ఉదయం మిగ్ విమా నంలో పైలట్ వెనుక (బెల్టుతో కటి)్ట ఈ అధికారిని కూర్చుని విహరించాలని కూడా ఆదేశించేవారు! ఒక రాఫెల్ ధరకు మరెన్నో సుఖోయి విమానాలొస్తా యని భావించే ఉన్నతాధికారి(సివిల్ సర్వెంట్) ఎవ రైనా ఆయనకు ఇలాంటి ‘శిక్షణ’ అవసరం. సైనిక సంబంధ విషయాలపై నైపుణ్యంలేని ఇలాంటి సివిల్ సర్వెంట్లపై సైనికాధికారులకు అపనమ్మకం ఎక్కువ. ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ఏ కుంభ కోణంలోనూ ఎవరికీ ఏ కోర్టులో శిక్షలు పడినట్టు నేను వినలేదు. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం చూసిన ఆ తరం ప్రముఖులు నేనీ మాటలు అన్నం దుకు నన్ను నిందిస్తారని తెలుసు. అయితే, ఆయు ధాల లావాదేవీల్లో చేతులు మారిన ముడుపుల సొమ్ము ఏదీ ఇండియాకు రాలేదనేది వాస్తవం. బోఫోర్స్ కుంభకోణం నాటి రాజీవ్గాంధీ తర్వాత అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్, వాజ్పేయీ ప్రభు త్వాలు సైతం శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో దళారులుండరని హామీ ఇచ్చిన స్వీడన్ సర్కారును సైతం మాట నిలబెట్టుకోవాలని ఒత్తిడి చేయలేక పోయారు. అంటే, బోఫోర్స్లో కుంభకోణం ఏదీ లేదనుకోకూడదు. ఈ కుంభకోణానికి ముగింపు పల కకుండా దాన్ని ఎన్నికల్లో వాడుకుని ఓట్లు సంపాదిం చుకోవాలనే ఆలోచనే దాన్ని ఇంకా బతికిస్తోంది. ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకున్నవారి నుంచి సొమ్ము రాబట్టి, కొందరు దోషులను జైలుకు పంపా లనే ఆసక్తి ఎవరికీ లేదు. బోఫోర్స్ దెబ్బతో నిలిచిపోయిన కొనుగోళ్లు! బోఫోర్స్ కుంభకోణం ఫలితంగా రష్యా మినహా ఇతర దేశాల నుంచి మన ఆయుధాల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయాయి. 1982లో ఇందిరా గాంధీ మిరాజ్–2000 విమానాల కొనుగోలుకు ఆదేశాలు జారీచేశాక, మళ్లీ ఇన్నేళ్లకు రష్యా మినహా ఇతర దేశాల నుంచి కొంటున్న తొలి యుద్ధవిమానం రాఫెల్ మాత్రమే. కొత్త ఆయుధాల కొనుగోలుకు ఏమాత్రం చొరవ చూపకుండా అడ్డుకట్ట వేసే రక్షణ శాఖ ‘సంప్రదాయాని’కి రాఫెల్ ఒప్పందం కూడా బలి అయితే ఇది నిజంగా విషాదమే అవుతుంది. 20 ఏళ్ల తర్జనభర్జన తర్వాత అత్యంత అవసరమైన ఆధు నిక యుద్ధవిమానం(రాఫెల్) కొనుగోలుకు నిర్ణయం తీసుకోగానే కొన్ని వదంతులు వ్యాపించాయి. ఈ వివాదం కారణంగా నేతలు ఒకరినొకరు ‘నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ’ అని దూషించుకుంటు న్నారు. ఈ ఒప్పందం వ్యవహారంలో దోషులుగా ఎవరూ పట్టుపడలేదు. ఏమీ జరగనే లేదు. కాని అంతులేని గోల. ఫలితంగా, రాఫెల్ విమానాల కొనుగోలుకు మొదటి ఆర్డరు తర్వాత మళ్లీ ఇవి కావాలని ఏ ప్రభుత్వం కూడా ఫ్రెంచి కంపెనీని అడిగే ధైర్యం చేయకపోవచ్చు. దీంతో మన రక్షణ బలగాలు అవసరమైన యుద్దవిమానాలు లేక ఇబ్బం దులు పడకతప్పదు. ఈ గొడవ కారణంగా రాఫెల్ విమానాల కొనుగోలు కూడా ముందుకు సాగదు. తగినన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధవిమానాలు లేక వైమానిక దళం అల్లాడిపోక తప్పదేమో! రాఫెల్ వివాదం ఫలితంగా లోక్సభ ఎన్నికల సమయంలో దేశంలో ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనా టిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు ఎనలేని ప్రచారం, గౌరవం దక్కడం అత్యంత ఆసక్తికరమైన అంశం. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్–ఆడాగ్ సంస్థతో పోల్చితే నేడు హెచ్ఏఎల్ గొప్ప కంపెనీగా కనిపిస్తుందని నేను అంగీకరిస్తాను. కాని, ఈ అత్యంత భారీ భారత సర్కారీ ఆయుధాల కంపెనీ ఏం చేస్తోందో చూద్దాం. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైనిక దళం ఇండియాకుంది. 75 శాతం వైమానికి దళం, నూరు శాతం ఆర్మీ, 66 శాతం నౌకాదళం, నూరు శాతం కోస్ట్ గార్డ్ దళాల వైమానికి సంబంధ అవసరాలను హెచ్ఏఎల్ తీరుస్తోంది. వాటికి అవసరమైనవాటిని తయారుచేసి సరఫరా చేస్తోంది. అయితే, వ్యాపారం విలువ ఎంతో చూద్దాం. దీని టర్నోవర్ రూ. 18,000 కోట్లు. అంటే దేశంలో అతి పెద్ద లారీ తయారీ కంపెనీల్లో ఒకటైన అశోక్ లేలాండ్ టర్నోవర్లో సగమే. ఇండిగో ఎయిర్ లైన్స్, హిందూజాల యాజమాన్యంలోని చిన్న బ్యాంకు ఇండస్ఇండ్ టర్నోవర్ల కన్నా తక్కువే. బడా కంపెనీలకు స్థానం లభించే ఫార్చ్యూన్ 500 ఇండియా జాబితాలో హెచ్ఏఎల్ పేరు ఎక్కడో వెనుక ఉంటుంది. తన రంగంలో పూర్తి గుత్తాధి పత్యంతోపాటు తన దగ్గర మాత్రమే ఉత్పత్తులను తప్పక కొనుగోలు చేసే ఖాతాదారులన్న ఈ ప్రభుత్వ రంగం పనితీరు ఇంత గొప్పగా ఉంది. దీని వార్షిక ఎగుమతులు రూ. 300 కోట్లు దాటవు. మీర్జాపూర్, పానిపట్లోని కొందరు చేనేతదారులు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేస్తున్నారు. ఇప్ప టికి హెచ్ఏఎల్ నాలుగు వేలకు పైగా విమానాలు తయారుచేసింది. అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి లైసెన్స్తో విదేశీ కంపెనీల విమానాలను చూసి తయారుచేసినవే. ఇంకా ఇండియా పూర్తిగా దేశంలో నిర్మించే హెచ్ఫ్–24 మారుత్ విమానాలు దాదాపు 150 వరకూ హెచ్ఏఎల్ నిర్మించింది. అయితే, ఈ విమానం విఫలమైంది. ఈ కంపెనీ అతి సునాయా సమైన పద్ధతిలో పనిచేస్తోంది. ప్రభుత్వ ఓ విదేశీ యుద్ధవిమానాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ విదేశీ కంపెనీతో కలిసి దీన్ని దేశంలో తయారు చేయడానికి ఒప్పందం చేసుకుని ఆ పని హెచ్ఏఎల్కు అప్పగి స్తుంది. ఈ ప్రభుత్వ కంపెనీ ఇన్నేళ్లుగా ఇలాగే నెట్టుకొస్తోంది. మన రక్షణ కొనుగోళ్లలో కచ్చితంగా భారీ కుంభ కోణం చోటు చేసుకున్నట్లే మరి. మనం దేన్నీ కొన లేని అసమర్థులం. దీనికి బలయ్యేది మాత్రం మన సాయుధ బలగాలే. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉత్పత్తిదారులు రక్షణ రంగంలో బలంగా పాదం మోపుతున్నప్పటికీ భారత్ మాత్రం వ్యతిరేకత తెలు పుతూ సొంత యుద్ధవిమానం తయారీ విషయంలో వెనుకంజ వేస్తోంది. భారత్లో ఆయుధాల తయారీకి మనం ప్రైవేట్ రంగాన్ని అనుమతించం. అదే సమ యంలో ప్రపంచ ప్రైవేట్ రంగం నుంచి అవే ఆయు ధాలను కొనడానికి వెంపర్లాడతాం. యూపీఏ హయాంలో నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఆయుధాల కొనుగోళ్లకు ప్రయత్నించడానికే భయపడిపోయారు. ప్రపంచంలోని ప్రతి ప్రధాన ఆయుధ ఉత్పత్తిదారుల సంస్థలనూ నిషేధించడం లోనే ఆయన కాలం గడిపేశారు. మోదీ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావడానికి సిగ్గుపడలేదు. కానీ రిలయన్స్–అడాగ్స్తో ఇన్నింగ్స్ మొదలెట్టమని దానికి ఎవరు చెప్పినట్లు? పారదర్శ కత, సత్యం అనేవి ఉత్తమ ఆత్మరక్షణ పద్ధతులు కాగా అహంకారం, లెక్కలేనితనంలో ప్రభుత్వం ఎందుకు మునిగి తేలుతున్నట్లు? శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
రక్షణ కొనుగోళ్లలో ‘సెల్ఫ్గోల్’
రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను చేరుస్తూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా సెల్ఫ్గోల్ వేసుకుంది. రాఫెల్ ఒప్పందం కుంభకోణమే కాదు. బీజేపీ ప్రభుత్వం అతి జాగ్రత్తతో, పిరికితనంతో ఆయుధాల కొనుగోలు వ్యవహారాల్లో వ్యవహరిస్తోందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పం దంలో భారీ కుంభకోణం ఉందనడానికి తగినంత సాక్ష్యాధరాలు లభ్యమౌతున్నాయిగాని ‘కుంభ కోణం’ అనే మాట స్థానంలో ‘మూర్ఖత్వం’ అనే పదం వాడాలి. ‘మూర్ఖత్వం’ అనే మాట మరీ ఎక్కువవుతుందనుకుంటే మరో పదం వాడవచ్చు. ఎందుకంటే దాదాపు వేయి కోట్ల డాలర్ల ఈ కొను గోలు ఒప్పందంలో విమానాల ధర నిర్ణయంపై అడిగిన ఏ ప్రశ్నకూ జవాబు చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ ఒప్పందం రెండు ప్రజాతంత్ర ప్రభుత్వాల మధ్య జరిగింది. కాని, ఒప్పందంలోని వివరాలను వెల్లడించకూడదనే (రహస్యంగా ఉంచాలనే) నిబంధన ఉందని చెప్పడం అడ్డగోలు వాదన. పార్లమెంటు నిశిత పరిశీలన తర్వాతే ఇంతటి భారీ కొనుగోలు ఒప్పందానికి ఆమోదముద్ర లభిస్తుంది. అందుకే సర్కారు వివరణ హాస్యాస్పదంగా ఉంది. నేటి అంతర్జాతీయ ఆయు ధాల విపణిలో ఆయుధాలు, వాటి రకాలు, ఉపకర ణాలకు సంబంధించి రహస్యా లేవీ ఉండవు. రాఫెల్ విమానాలతో ప్రయోగించే మిటియోర్ క్షిపణులు కూడా కొనే ఆలోచన మీకుంటే, వాటి గురించి స్మార్ట్ఫోన్ ఉండి, రక్షణ వ్యవహరాల నిపుణుడిగా భావించే ఏ కుర్రాడైనా ఉపన్యాసం దంచగలడు. ఈ విషయంలో రహ స్యంగా ఉంచాల్సింది సున్నితమైన ఎలక్ట్రానిక్స్, వ్యూహాలు మాత్రమే. మిటియోర్ క్షిపణి, పైలట్ ధరించే 360 డిగ్రీల ఇజ్రాయెలీ హెల్మెట్ అంచనా ధరల గురించి కూడా నేడు సులు వుగా దొరికే ఆయుధాల వివరాలు తెలిపే పుస్తకాలు, పత్రికల్లో బహిరంగంగానే చర్చిస్తున్నారు. కాబట్టి రాఫెల్ ఒప్పందంపై బహిరంగంగా చర్చించడంలో తప్పేమీ లేదు. దాచ డానికి కారణాలు కూడా లేవు. రక్షణ ఒప్పందంపై మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరి కైనా ఎంత ధైర్యం? బోఫోర్స్ శతఘ్నిల ఒప్పందం జరిగిన కాలం నాటి కాంగ్రెస్ పార్టీ అనుకుంటు న్నారా మమ్మల్ని? అనే అహంకారపూరిత ధోరణితో కేంద్ర సర్కారు మాట్లా డుతోంది. అయితే, ఇప్పుడు బీజేపీకి విషయం అర్థమౌతోంది. బోఫోర్స్ కుంభ కోణం తర్వాత, భారీ ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకునే ఏ ప్రభు త్వమైనా తనను దొంగ అని పిలుస్తారనే అంచనాతో ఉండక తప్పదు. ఇలాంటి సమస్యపై మూడు రకాలుగా వ్యవహరిం చవచ్చు. మొదటిది, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పద్ధతి. అంటే, ఏమీ కొనకుండా ఉండడమే గాక, అన్ని అంతర్జాతీయ ప్రైవేటు ఆయుధాల కంపెనీలను నిషేధించడం. ఆయన హయాంలో ప్రభుత్వాల మధ్యే ఆయుధాల కొనుగోళ్లు జరిగాయి. ఆయుధాల ధరల విషయంలో పారదర్శకత పాటిం చని రష్యా ప్రభుత్వం నుంచి ఆయుధాలు కొన్నారు. అలాగే, అమెరికా నుంచి ప్రాణాతకం కాని ఆయు ధాలను కొనుగోలు చేశారు. రెండో పద్ధతి, పార దర్శక విధానంతో ధైర్యంగా కొనుగోలు చేయడం. చివరికి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం. ఇక మూడోది, రాజు లాగా ఆయుధాలు కొనడం. అంటే, భద్రతపై కేబినెట్ కమిటీ పరిశీలన వంటి అన్ని రకాల ‘విసుగు పుట్టించే’ ప్రక్రియలకు స్వస్తి పలకడం. ఇందులో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు మీడి యాలో భారీ ప్రచారం వచ్చేలా చూసుకోవడమేగాక ఇలాంటి రక్షణ ఒప్పందాలపై అడిగే ప్రశ్నలకు సమా ధానం చెప్పడానికి మొండిగా నిరాకరించడం. ఈ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అహంకారపూరితమైన మూర్ఖత్వంతో పదే పదే రాఫెల్ ఒప్పందంపై వ్యక్త మైన అనుమానాలు తీర్చడానికి నిరాకరిస్తూ పెద్ద తప్పు చేసింది. అనవసరంగా తనకు తాను గొయ్యి తవ్వుకుంది. లోతుగా గొయ్యి తవ్వుకుంటున్న ప్రభుత్వం! ఈ వ్యవహారంలో ప్రభుత్వం రోజు రోజుకూ తాను ఇరుక్కుపోయే ప్రమాదమున్న లోతైన గొయ్యి తవ్వు కుంటూనే ఉంది. మొదట అనుకున్న ఒప్పందం ప్రకారం 126 రాఫెల్ విమానాల్లో 108 విమానాలను ప్రభుత్వరంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) తయారు చేయాలి. అయితే, హెచ్ఏ ఎల్ వద్ద ఈ విమానాల ఉత్పత్తికి తగినంత మౌలిక సౌకర్యాలు లేని కారణంగా 126 విమానాలు కొనా లన్న నిర్ణయం మార్చుకున్నామని ప్రభుత్వం వివ రణ ఇచ్చింది. అత్యంత ఆధునిక విదేశీ యుద్ధ విమానాలకు ప్రపంచంలోని ఏ కంపెనీలోనూ తక్షణ ఉత్పత్తి–అమర్చే (అసెంబ్లీలైన్) సౌకర్యాలుండవు. ఏ కంపెనీ రూపొందించిన యుద్ధ విమానాలనైనా లైసె న్స్పై ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలా మెరుగైన కంపెనీ హెచ్ఏఎల్ అని హేతుబద్ధంగా ఆలోచించే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ సంస్థ తనకు ఎదురులేని గత కొన్ని దశాబ్దాల కాలంలో చేసిన పని ఇదే. అంత సమర్ధంగా చేయకపోయినా ఆయుధాలు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ కంపెనీని ఎవరూ చులకనచేసి మాట్లాడరు. వాజ్పేయి పాలనాకాలంలో మిరాజ్– 2000 రకం విమానాలన్నింటినీ ఇండియాలోనే రూపొందించాలని భారత వైమానికిదళం(ఐఏఎఫ్) ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో తెహెల్కా వ్యవ హారంతో భయపడిన రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ అందుకు అంగీకరించలేదు. ఒకే కంపెనీ చేతిలో పెడితే అనుమానాలొస్తాయని భయపడ్డారు. ఒకేసారి 126 రాఫెల్ విమానాల భారీ కొనుగోలుకు అవస రమైన నిధులు సమకూర్చడం కష్టమనే వాస్తవాన్ని చెప్పడానికి ప్రభుత్వం ఏదో కారణం వల్ల సిద్ధంగా లేదు. నిజంగా ఇన్ని విమానాలు కొనాలంటే ఆర్మీ, నేవీ దళాల బడ్జెట్లకు కోత పెట్టాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి రెండు స్క్వాడ్రన్ల విమా నాలు(36) చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రాఫెల్ విమానాల తయారీకి వేరే ఇతర కంపెనీకి అవకాశం ఇవ్వడం కోసం హెచ్ఏఎల్ను వదిలేశారని నిందించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కాని, కొనుగోలు చేసే విమానాల సంఖ్య తగ్గిం చుకున్నారనీ, కలిసి ఉత్పత్తి చేసే అవకాశం పోగొ ట్టుకున్నారని మాత్రం విమర్శిస్తున్నారు. ఈ వ్యవహా రంలో వాస్తవాలు వెల్లడించి అనుమానాలు నివృత్తి చేసే అవకాశం ఉండగా ప్రభుత్వం అనవసరంగా అర్థం లేని వాదనలు వివరణలతో వివాదంలో చిక్కు కుంటోంది. యుద్ధ విమానాలు వైమానిక దళానికి తక్షణమే అత్యవసరమైనందునే రాఫెల్ విమానాల కొనుగోలు చేయాల్సివస్తోందనేది కేంద్ర సర్కారు చెప్పే మరో కారణం. తగినన్ని యుద్ధ విమానాలు లేవనేది 15 ఏళ్లుగా తెలిసిన విషయమే. 2001లోనే మొదటిసారి విమానాల అవసరం గుర్తించి, కొనుగో లుకు ప్రతిపాదించారు. రెండు దశాబ్దాల క్రితమే అవ సరమైన యుద్ధవిమానాలను కొనలేకపోవడం అగ్ర రాజ్యంగా అవరించాలనే కలలుగనే దేశం బలహీన తకు అద్దంపడుతోంది. ఈ 36 రాఫెల్ విమానాలు సైతం యుద్ధరంగంలో వినియోగించడానికి 2022 వరకూ పూర్తిగా సిద్ధం కావు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి అసమర్ధ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ వ్యవస్థగానీ (ఏ పార్టీ అధికారంలో ఉన్నాగాని) తన జాతీయ భద్రత బాధ్యతను మరో అగ్రరాజ్యానికి అప్పగించడం లేదా కశ్మర్ను పాకిస్తాన్కు, అరుణా చల్ప్రదేశ్ను చైనాకు ఇచ్చేయడం మంచిది? అలా చేయగా మిగిలే సొమ్మును దేశ ప్రజల విద్య, ఆరో గ్యానికి ఖర్చు చేయవచ్చు! జాతీయ భద్రతపై హామీతోనే అధికారం 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీని అధికారంలోకి తీసు కొచ్చిన ప్రధాన వాగ్దాల్లో ఒకటి జాతీయ భద్ర తపై ఇచ్చిన హామీ. జాతీయ భద్రత విషయంలో నిర్ణ యాత్మకంగా, కఠినంగా వ్యవహరిస్తామని ఎన్డీఏ వాగ్దానం చేసింది. సైనిక దళాలకు కొత్త ఆయుధాలు కొనుగోలు చేసే ధైర్యం చేయలేని యూపీఏ సర్కారు వాటిని బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. ఆయన సరిగానే మాట్లాడారు కాబట్టి అప్పుడు ప్రజలు ఆయన మాటలు నమ్మారు. అందుకే, లోపాలు సరిదిద్దుకోవడానికి కొద్ది నెలలే ఉన్నందున ‘మీరేం చేశారు?’ అని ప్రధానిని అడగడంలో తప్పేమీ లేదు. రక్షణ ఆయుధాలకు సంబంధించి కొన్ని ఇండియాలోనే తయారు చేస్తున్నట్టు ప్రచారం చేయడం, కొన్ని వైమానిక ప్రదర్శనలు జరపడం మాత్రం ఈ ప్రశ్నకు జవాబు కాజాలదు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువ అనేది వాస్తవం. ఆ విషయం చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ విషయంలో యూపీఏ ఎన్నడూ గొప్పలు చెప్పుకోలేదు. కాని, దాని కంటే మెరుగైన రీతిలో పనిచేస్తానని చెప్పిన బీజేపీ అందులో విఫలమైంది. వచ్చే ఏడాది రాఫెల్ విమనాలు భారత గగన తలంలో ఎగిరే మాట వాస్తవమే కావచ్చు. కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల భవిష్యత్తులో జరిగే ఆయుధాల కొనుగోళ్లపై దాని నీడ పడుతుంది. ఆయుధాలు దేశంలోనే ఉత్ప త్తిచేయాలనే లక్ష్యం ఘోరంగా దెబ్బతింది. కొన్ని దశాబ్దాల కాలంలో అతి పెద్దదిగా భావించే రక్షణ కొనుగోలు ఒప్పందంలో దేశంలోని అత్యంత వివా దాస్పదమైన కార్పొరేట్ సంస్థను లబ్ధిదారుగా చేయడం ద్వారా ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ కూడా సైన్యానికి అవసరమైన ప్రధాన ఆయుధాలను తయారు చేసి ఇవ్వలేదు. రక్షణరంగ ఏజెంట్లు, ఫిక్సర్లు, కార్పొరేట్ లాబీయిస్టులు, స్వయం ప్రకటిత జ్ఞానులతో కూడిన ఈ దయనీయ నగరంలో జరిగే ఏ కీలకమైన రక్షణ ఒప్పందాన్నయినా కుంభకోణం అనే చెప్పాల్సి ఉంటుంది. బోఫోర్స్ అనంతర దశాబ్దాల్లో ప్రతి ప్రభుత్వమూ అలాంటి అపనిందలనుంచి తప్పించుకోవడానికి అత్యంత సంక్లిష్ట నిబంధనలను తీసుకుంటూ వచ్చింది. కానీ అలాంటి అవినీతి నిరోధక వ్యవస్థ సాధనలో ఎలాంటి పురోగతి కనిపించకుండా పోయింది. ఎవరూ సాధించలేరు కూడా. మోదీ ప్రభుత్వం పారదర్శకతతో ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని దక్కించుకుంది కానీ మోదీ ప్రభుత్వమే దాన్ని ధ్వంసం చేసి పడేసింది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
శాంతి సాధన ఓ ముళ్లబాట...!
పాకిస్తాన్ నూతన ప్రధానికి అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారుల తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించ లేదు. ఇక మూడోది, ఎన్నికైన ప్రతి ప్రధాని ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. పాక్లో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పిం చిన ప్రతి ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇవన్నీ దాటుకుని ఇమ్రాన్ శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూనుకుంటాడు. భారత్, పాక్ మధ్య శాంతి స్థాపనకు అత్యంత సాహసోపేత, నాటకీయ ప్రయత్నం గురించి తెలియని విషయాలు వెల్లడించ డానికి పాకిస్థాన్ 30వ ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణం చేస్తున్న రోజే తగిన రోజని భావిస్తున్నా. ఈ ప్రయత్నం చేసిన ఇద్దరు ఎన్నికైన నేతల్లో ఒకరు గురువారం కన్నుమూయగా, రెండో నాయకుడు క్రూరమైన రావల్పిండి జైల్లో మగ్గుతున్నారు. దీనిలో ఈ వ్యాస రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది. మియా నవాజ్ షరీఫ్ 1997లో రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో అధి కారంలోకి వచ్చింది. అప్పటికి కొంత కాలంగా భారత–పాక్ సంబంధాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. వాజ్పేయి సర్కారు పోఖ్రాన్–2 పేరుతో అణుపరీక్ష జరపడంతో ఇవి మరింత క్షీణించాయి. పాకిస్తాన్ చాగైలో అణుపరీక్షతో పదునైన జవాబి చ్చింది. 1998 చివరి మాసాల నాటికి రెండు వైపులా ఓర్పు నశించిన సూచనలు కనిపించాయి. ఇద్దరు కొత్త నేతలూ రెండు దేశాల సంబంధాలు మెరుగుప డాలని కోరుకున్నాగాని, పరస్పర అవిశ్వాసం అందుకు అడ్డు నిలిచింది. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉభయ దేశాల ఉన్నతాధికారుల వల్ల ముందుకు సాగలేదు. ఈ దశలో చలికాలం ఆరంభంలో పాకిస్థాన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నుంచి అని రాసి ఉన్న ఈ లేఖ కవరుపై ఉన్న పోస్టల్ ముద్రలను బట్టి చూస్తే ఇది ఢిల్లీ చేరడానికి చాలా వారాలు పట్టిందని అర్థమైంది. మధ్యలో ఈ లేఖ ఎన్వలప్ను రెండు దేశాలకు చెందిన వివిధ శాఖలు తెరచి, చదవి మళ్లీ మళ్లీ సీలు చేశాయి. ఎందుకంటే, పాక్ ప్రధాని సాధారణ పోస్టులో గతంలో ఉత్తరం పంపలేదు. కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ కోసం నేను రాసిన లేఖకు జవాబుగా ఆలస్యంగా పంపినా ఆత్మీయంగా పంపిన స్పందన ఇది. నేను ఇస్లామా బాద్లోని పాక్ ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నవాజ్ షరీఫ్ నాకు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ చేయడానికి పాకిస్థాన్ ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. కొద్దిసేపు నేను మాట్లాడాక, ‘‘ఇద్దరు ప్రధానులూ సంబంధాలు ముందుకు సాగ డానికి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇంటర్వ్యూల వల్ల ప్రయోజనం ఏముంటుంది? పెద్ద ఒప్పందాల సంగతి వదిలేయండి. కనీసం బస్సు సర్వీసు కూడా మొదలు కాలేదు’’ అన్నాను. దీనికి షరీఫ్ దౌత్య వేత్తలు మాట్లాడే రీతిలో కొన్ని కారణాలు చెప్పారు. నేను సరదాగా పంజాబీలోనే మాట్లాడుతూ ‘‘ నాకు మీరిచ్చే ఇంటర్వ్యూలోనే బస్సు సర్వీసు ప్రారంభించే విషయం ప్రకటించడంతోపాటు, మొదటి బస్సులో రావాలని మా ప్రధానిని ఎందుకు ఆహ్వానించకూడదు?’’ అని ప్రశ్నించాను. నా సలహాను నవాజ్ షరీఫ్ సీరియస్గా తీసుకుని ఆలోచించారు. నా ఐడియా ఆయనకు నచ్చింది. అయితే, తాను ఆహ్వానించాక భారత ప్రధాని అందుకు నిరాకరిస్తే ఏం చేయాలి? అనే అనుమానం ఆయనను పీడించింది. అదే జరిగితే బావుండదు కదా. నేను విషయం కనుక్కుని చెబుతానని ఆయనతో అన్నాను. వాజ్పేయికీ నచ్చిందీ ప్రతిపాదన! విషయం తెలియజేయగానే, ఈ ప్రతిపాదన వాజ్పేయికి కూడా నచ్చింది. అయితే, పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాకే నేను ఆయనను కలవాలనీ, అప్పటిదాకా ఇది ప్రచురించవద్దని వాజ్పేయి చెప్పారు. లాహోర్లోని సొంత ఇంట్లో నవాజ్ షరీ ఫ్ను ఇంటర్వ్యూ చేశాను. మధ్యమధ్యలో భారత– పాక్ క్రికెట్ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారంతో మా సంభాష ణకు బ్రేకులు పడ్డాయి. ఆయన తన మాట నిలబెట్టు కున్నారు. బస్సు సర్వీసుకు అంగీకారం తెలపడమే గాక, వాజ్పేయిని ఈ బస్సులో రావాలని ఆహ్వానిం చారు. చరిత్రలో నిలిచిపోయేలా తాను భారత ప్రధా నికి స్వాగతం పలుకుతానని షరీఫ్ తెలిపారు. షరీఫ్తో ఇంటర్వ్యూను ఒక రోజు ఆపాలనీ, తాను విమానంలో లక్నోలో దిగే రోజు అది ప్రచురితమయ్యేలా చాడాలని వాజ్పేయి నన్ను కోరారు. ఆనవాయితీగా భారత విదేశాంగశాఖ అనుమానాలు వ్యక్తం చేయక ముందే తాను ఆహ్వానం అంగీకరిస్తానని వాజ్పేయి చెప్పారు. ఆ తర్వాత జరిగిదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అత్యంత నాటకీయ పరిణామాల తర్వాత అటల్ బస్సు యాత్ర జరిగింది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా వాజ్ పేయికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు శాల్యూట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ అంగీకరించలేదు. బస్సు దిగాక వాజ్పేయి మీనారే పాకిస్తాన్ మెట్ల వరకూ వచ్చి, పాక్ సుస్థిరతతో సుసపన్నంగా ఉండడం భారతదేశా నికి మేలని ప్రకటించారు. నేను ఈ యాత్రలో భాగం కావడం నాకెంతో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇది నాకు మొదటి ఏకైక అనుభవం. బస్సు యాత్ర విషయం నేను ఇంటర్వ్యూ ద్వారా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఓ పక్క ఇద్దరు ప్రధానులూ తమకు పూర్తిగా అవగాహన లేని శాంతి చర్చలు జరుపు తుంటే, మరో పక్క పాకిస్తానీ ఆర్మీ కార్గిల్ ప్రాంతం లోని విశాల సరిహద్దు గుండా తన సైనికులు భారత భూభాగంలోకి చొరబడేలా చేసింది. మే నెల మధ్య నాటికి ఉభయ దేశాల దళాల మధ్య తొలి ఘర్షణలు జరిగాయి. మే 26న ఇండియా తన వైమానికి దళాన్ని రంగంలోకి దింపింది. మరుసటి రోజు రెండు భారత మిగ్ విమానాలను పాక్ సైనికులు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో కూల్చివేశారు. శత్రు శిబిరం వివరాలు తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా పోతున్న మూడో యుద్ధవిమానం ఇంజన్లలో ఒకదానికి క్షిపణి దెబ్బతగిలింది. అయితే, అది అదృష్టవశాత్తూ కూలి పోకుండా తిరిగి తన స్థావరానికి సురక్షితంగా వచ్చే సింది. ఇలాంటి నాటకీయ మలుపునకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రధాని నుంచి నా హోటల్ రూముకు ఫోన్! ఉదయం ఆరున్నరకు ముంబైలో నేను బసచేస్తున్న హోటెల్ రూములో ఫోను మోగింది. ప్రధానమంత్రి నాతో మాట్లాడాలనుకుంటున్నారని అవతలి వ్యక్తి చెప్పారు. వెంటనే వాజ్పేయి ఫోన్లైన్లోకి వచ్చి ‘‘యే క్యా కర్ రహాహై మిత్ర్ ఆప్కా?(మీ స్నేహి తుడు చేస్తున్న ఈ పనేంటి?)’’అని ప్రశ్నించారు. పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ చైనా పర్యటనలో ఉండగా కశ్మీర్ ముజాహదీన్ల చేతుల్లోకి క్షిపణులు రావడంపై అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని ఆయన అన్నారు. ‘అసలేం జరుగుతోంది? ఈ విషయం మీరు మీ మిత్రుణ్ని అడగగలరా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను ఇస్లామాబాద్లోని నాకు తెలిసిన పాత ఫోన్ నంబర్కే డయల్ చేసి ఓ కబురు పంపాను. ఆ రోజు రాత్రి నాకు పాక్ రాజదాని నుంచి ఫోనొచ్చింది. నవాజ్ షరీఫ్ కూడా వాజ్పేయి మాదిరిగానే కలవరపాటుతోనే మాట్లా డారు. ‘‘నేను ఆయనకు ద్రోహం చేయబోనని ఆయ నకు మీరు చెప్పండి. అధీనరేఖపై ఎప్పటిలా కొన్ని మామూలు ఘర్షణలు జరిగాయని నిన్న నాకు చెప్పారు. నేడు గగనతల ఉల్లంఘనలు జరిగాయి. నాకు కూడా ఈ పరిణామాలపై ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ వైమానిక ఘర్షణలను ప్రస్తావిస్తూ షరీఫ్ నాతో అన్నారు. రాజధానికి రాగానే వాజ్పేయి, ఆయన సహాయకుడు బ్రజేష్ మిశ్రా నాతో ఫోన్లో మాట్లాడారు. జనరల్ ముషారఫ్, ఆయన డెప్యూటీ సైనికాధికారి మధ్య జరిగిన సంభాషణలను ‘మన మనుషులు’ రహస్యంగా విన్నారనీ, ఇది పూర్తిగా పాక్ చేపట్టిన సైనిక చర్యయేనని తేలిందని వారు నాకు చెప్పారు. ‘‘కాబట్టి, మీరు ఇంటర్వూ్య పేరుతో ఇస్లామాబాద్ వెళ్లి, పాక్ సైనికాధిపతుల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణ గురించి నవాజ్ షరీఫ్కు చెప్పగలరా?’’ అని నన్ను అడిగారు. కానీ, నాకు ఈసారి విషయం తీవ్రత అర్థమైంది. నేను మొదట చేసింది నిజమైన ఇంటర్వూ్య. దాని సత్ఫలి తమే బస్సు యాత్ర. వారు చెప్పినట్టు చేస్తే జర్నలిజం పరిధి దాటినట్టే అవుతుందని వారికి తెగేసి చెప్పాను. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. వారు అంతటితో ఆగకుండా మాజీ ఎడిటర్ ఆర్.కె.మిశ్రాకు ఈ పని అప్పగించారు. ఆయన అప్పుడు అబ్జర్వర్ ఫౌండే షన్లో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టే ఆయన ఇస్లా మాబాద్కు అనేకసార్లు వెళ్లొచ్చారు. పాక్ సేనల చర్య లకు సాక్ష్యంగా పైన చెప్పిన రహస్య సంభాషణల టేపులను కూడా ఆయన పాక్ ప్రధానికి అందజే శారు. దీంతో పాత్రికేయ పరిధిని దాటిన నా సాహసం ఇంతటితో ముగిసింది. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రికి ఇక్కడ అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారులు తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించలేదు. ఇక మూడోది ఏమిటంటే ఎన్నికైన ప్రతి ప్రధాన మంత్రీ ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. గత దశాబ్ది కాలంలో ప్రజా స్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పించిన ప్రతి ప్రయత్నమూ ఎదురుదెబ్బ తిన్నది. ఇవన్నీ దాటు కుని ఇమ్రాన శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూను కుంటాడు. అంతే తప్ప సైన్యాన్ని ధిక్కరించి కాదు. చివరగా, ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకం మొదలైనట్లయితే అది అందరిలో ఆశలు రేపవచ్చు కానీ కపటత్వంతో కూడి ఉంటుంది. అప్పటికి కూడా అది ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన చక్కటి గాథగా మారవచ్చు. ఈ విషయాలను ఇప్పుడు చెప్పడానికి నాకు నాలుగు కారణాలున్నాయి. వాజపేయి నిష్క్ర మణం, నవాజ్ షరీప్ జైలు శిక్ష, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం, అన్నిటి కంటే ముఖ్యంగా ఆనాటి ఘటన జరిగి ప్రస్తుతం 20 సంవత్సరాలు గడిచిపోయాయి. శేఖర్ గుప్తా(వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్) twitter@shekargupta -
గత వైభవం ఇక గగనమేనా!
తాను ఎన్నికలలో విజయం సాధించలేనని 1989 వరకు బీజేపీ విశ్వసించింది. అందుకు కారణం హిందూ సమాజంలోని కులవిభజనలు. ఈ వాస్తవాన్ని మొదట గుర్తించినవారు ఎల్కె అద్వాణీ. అందుకే మతాన్ని ఉపయోగించుకుని ఆ వర్గాలను ఏకం చేయాలని ఆయన ఒక పథకం (అయోధ్య ద్వారా) ప్రారంభించారు. ఇది చాలా విస్తృతంగా పనిచేసింది. కానీ దీని ప్రభావం ఎక్కువ కాలం లేదు. యూపీలో ఒకప్పుడు బీజేపీదే ఆధిక్యం. కానీ ములాయం/అఖిలేశ్, మాయావతి 8 పర్యాయాలు ముఖ్యమంత్రులయ్యారు. భారతదేశ ఓటర్లలో ముస్లింలు కేవలం 15 శాతం ఉన్నారు. వీరంతా ఏనాడూ బీజేపీకి ఓటు వేయలేదన్న మాట నిర్వివాదాంశమైనది. 1989 తరువాత కాంగ్రెస్ తన కీలక ఓటు బ్యాంకులను జార విడుచుకున్న అనంతరం కూడా ముస్లింలు బలమైన ఓబీసీ వర్గం యాదవులతోనే కలిశారు. ఇక మాయావతి వెనుక ఉండే దళితులు అప్పుడప్పుడు బీజేపీని దూరంగా ఉంచడమే కనిపిస్తుంది. ఇలాంటి లెక్కలను చూస్తూ నిరాశలో కూరుకుపోయిన బీజేపీ నేతలు భారతదేశాన్ని ఎవరు పాలించాలో ముస్లింలు తమ వీటో అధికారం ద్వారా శాసిస్తున్నారని విమర్శలు గుప్పించేవారు. కానీ ఈ పరిస్థితిని 2014లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మార్చివేశారు. లౌకికవాదం ముసుగులోని అన్ని ప్రతీకలని, నిజం చెప్పాలంటే అలాంటి కపటత్వపు ప్రతీకలని మోదీ చెత్తబుట్టలోకి విసిరేశారు. ముస్లింలు మాకు వేటు వేయకూడదని భీష్మించుకుంటే అలాగే, మాకు పడే ఓట్లు చాలినన్ని మరొక చోట ఉన్నాయి, దీనిని వారు గుర్తించేటట్టు చేయండి అన్నదే మోదీ వాదన. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టంగానే ఉన్నారు. మైనారిటీలకు ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. అందరిలాగే వారూ సబ్కా సాత్, సబ్కా వికాస్లో అంతర్భాగమే. ముస్లింలు మోదీకి ఓటు వేయలేదు. అయినప్పటికీ ఆయన లోక్సభ ఎన్నికలలో విజయం సాధించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకుండా 282 స్థానాలు గెలిచారాయన. రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో కూడా ఇదే పునరావృతమైంది. ఉత్తరప్రదేశ్లో 19 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు. అయినా కూడా 77 శాతం అసెంబ్లీ స్థానాలను ఆయన కైవసం చేసుకున్నారు. తమకు ఉన్న వీటో అధికారంతో ముస్లింలు దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయిస్తారన్న అదృశ్య భూతారాధనను మోదీయే పటాపంచలు చేసేశారు. పైగా ఏవో కొన్ని ముస్లిం పేర్లను నామమాత్రంగా చేర్చడం ద్వారా వారు ఈ విమర్శకు స్పందించలేదు. స్నేహపూర్వకంగా ఉండే ముస్లిం మేధావి వర్గాన్ని తయారుచేసుకోవడం గురించి కూడా పట్టించుకోలేదు. అంటే – మీరు మాకు ఓటు వేయకపోతే, మీతో మేం అధికారం పంచుకుంటామని ఆశించవద్దు అనే. ఇంతవరకు బీజేపీతో జాగ్రత్తగా ఉన్న వివిధ హిందూ సామాజిక వర్గాలకు మోదీ చేసిన విన్నపంతో ఇది సాధ్యమైంది. యాదవేతర ఓబీసీ ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్లడం ఒక వాస్తవం. అంతేకాదు, 2014 లోక్సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలకు గాను మాయావతి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. 2017 శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీ 19 స్థానాలకు పరిమితమైంది. అంటే పెద్ద సంఖ్యలో దళిత ఓట్లు కూడా బీజేపీకి దక్కాయని తార్కికంగా ఒక ముగింపునకు రావచ్చు. బీజేపీ గెలుచుకున్న 282 లోక్సభ స్థానాలలో దళితులు గెలిచినవి నలభై ఉన్నాయి. అవి వారికి కేటాయించిన నియోజకవర్గాలు. మరో ఆరుగురు దళితులు కూడా ఉన్నారు. వీరు ఎన్డీయే భాగస్వాములు ఎల్జేపీ, టీడీపీలకు చెందినవారు. ఆ 15 శాతం ఓట్లతో ప్రమేయం లేకపోయినా బీజేపీ సునాయాసంగా విజయం సాధించడానికి కారణం ఇదే. అయితే దేశవ్యాప్తంగా దళితులలో పెరుగుతున్న ఆగ్రహం, వారు చెబుతున్న మాటలు గడచిన రెండు మాసాల నుంచి కొన్ని కొత్త ప్రశ్నలను సంధిస్తున్నాయి. నిజానికి ఇలాంటి ప్రశ్నలు రోహిత్ వేముల, ఉనాల కారణంగా కొద్దికాలం క్రితమే తెర మీదకు వచ్చాయి. 2014 పరిణామం తరువాత ముస్లింలు కాక మిగిలిన 85 శాతం ఓటర్లు అనుసరిస్తున్న విధానం ఊహకు అందనట్టుగానే ఉంది. విద్యార్థుల నుంచి, కిందిస్థాయి రాజకీయం నుంచి యువ దళిత నాయకులు రావడం, భీమా–కొరెగావ్ ఉదంతం దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ అరాచకాల నిరోధక చట్టం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత జరిగిన నిరసనలు ఇందుకు కారణం. దళితులలో ఆగకుండా పెల్లుబుకుతున్న ఆగ్రహం ఆ 85 శాతం కాస్తా 70 శాతానికి కుదించుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నది. ఇటీవల ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు దళిత ఎంపీలు బహిరంగంగా చేసిన ఫిర్యాదు ఇచ్చే సందేశం ఇదే. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు సంజయ్ కుమార్ డెక్కన్ క్రానికల్కు ఒక వ్యాసం (ఆగస్ట్ 31, 2016) రాశారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రానికి (సీఎస్డీఎస్) చెందిన కుమార్, 2014 ఎన్నికలలో బీజేపీకి అంతకు ముందు ఎప్పుడూ దక్కనన్ని దళిత ఓట్లు దక్కిన సంగతిని ధువీకరించారు. గడచిన కొన్ని లోక్సభ ఎన్నికల వరకు కూడా 12–14 శాతం దళితులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారని ఆయన రాశారు. అయితే 2014లో ఈ సంఖ్య రెట్టింపయిందని (24 శాతం), కాంగ్రెస్ (19 శాతం), బీఎస్సీ (14 శాతం)ల కంటే బీజేపీయే ఎక్కువ దళిత ఓట్లను కైవసం చేసుకుందని ఆయన నిర్ధారించారు. ఇటీవల దళితులలో కనిపిస్తున్న అసహనం ఈ విజయానికి బెడదగా తయారైంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీల మధ్య కుదిరిన సయోధ్య ఈ బెడదను మరింత తీవ్రం చేస్తున్నది. ఈ రెండు పార్టీల కలయిక ఎంత శక్తిమంతమైనదో గోరఖ్పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. మరొక ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఆ ఉప ఎన్నికలలో బీఎస్పీ పోటీ చేయలేదు. పూర్వం వలెనే తన ఓట్లను ఎస్పీకి బదలీ చేయగలిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆ ముగ్గురు ఎంపీలు బాహాటంగా చేసిన ఫిర్యాదులో ఆ కొత్త అభద్రత ప్రతిఫలిస్తున్నది. రోహిత్ వేముల, భీమా–కొరేగావ్ ఉదంతాల తరువాత పరిణామాలతో వెల్లడైన ఇలాంటి అభద్రతలకు తోడు ఇప్పుడు కొత్తవి తోడవుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది– గ్వాలియర్లో నిరసన తెలుపుతున్న దళితుల మీద అగ్రకులానికి చెందిన ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడడం. అయితే ఒకటి వాస్తవం– ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో కేంద్రం నిర్వహించే పాత్ర ఏమీ ఉండదు. కాబట్టి ఈ జాతీయ స్థాయి దళిత నిరసన ఏం చెబుతున్నదంటే ఇదంతా అణచుకున్న ఆగ్రహం కట్టలు తెగిన ఫలితం. 2019 దగ్గరవుతున్న ప్రస్తుత సందర్భంలో దీనిని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా పట్టించుకోకుండా ఉండడం సాధ్యం కాదు. మోదీ మాంత్రిక విద్య కూడా దీనిని పరిగణనలోనికి తీసుకుంటుంది. 2014 ఎన్నికలలో తమకు దక్కిన 24 శాతం ఓట్లను వారు వదులుకోలేరు. ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 31 శాతం. దళితులలో నాలుగో వంతు మళ్లీ ఓటు చేయకపోతే ఆ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యం. రిజర్వేషన్ల గురించి ప్రధాని అంత గట్టిగా మాట్టాడుతున్నా, ఒడిశాలో అమిత్ షా దళితుల ఇంట్లో భోజనం చేయడం గురించి అంత ప్రచారం కల్పించినా కారణం ఇదే. అయితే ఇటీవల దళితుల ఆగ్రహం, చెబుతున్న మాటలు గతంలో మాదిరి కంటే భిన్నమైనవి. చాలామంది పాఠశాలలకీ, కళాశాలలకీ వెళ్లడం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ఈ తరం మరింత జాగరూకత కలిగిన తరంగా తయారైంది. వారి ఆకాంక్షలు భౌతికపరమైన రక్షణ, ఆహారం, నివాసం, సంప్రదాయికమైన వృత్తుల రక్షణకే పరిమితం కావడం లేదు. ఇలాంటి ఎరలను ఛేదించాలని కొత్త తరం దళితులు అనుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ మిగిలిన రాష్ట్రాలతో సంబంధాలు పెట్టుకోవడానికి వారికి ఆస్కారం కల్పిస్తున్నాయి. మొదటిసారి ఎంఎల్ఏగా ఎంపికైన జిగ్నేశ్ మేవానీ వంటి యువనేత ఉత్తర, మధ్య, పశ్చిమ భారతాలలో ఎక్కడికి వెళ్లినా, అంటే దాదాపు భారతదేశంలో ఎక్కడైనా జనాన్ని ఆకర్షించగలుగుతున్నారు. దళితులలో వచ్చిన ఈ ఎదుగుదల గతం కంటే సిద్ధాంతపరమైనది. వీరి భావం, భాష ప్రధానంగా వామపక్షాలవి. కాబట్టి అవి కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమే. తాను ఎన్నికలలో విజయం సాధించలేనని 1989 వరకు బీజేపీ విశ్వసించింది. అందుకు కారణం హిందూ సమాజంలోని కులవిభజనలు. ఈ వాస్తవాన్ని మొదట గుర్తించినవారు ఎల్కె అద్వాణీ. అందుకే మతాన్ని ఉపయోగించుకుని ఆ వర్గాలను ఏకం చేయాలని ఆయన ఒక పథకం (అయోధ్య ద్వారా) ప్రారంభించారు. ఇది చాలా విస్తృతంగా పనిచేసింది. కానీ దీని ప్రభావం ఎక్కువ కాలం లేదు. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బీజేపీదే ఆధిక్యం. కానీ ములాయం/అఖిలేశ్, మాయావతి ఎనిమిది పర్యాయాలు ముఖ్యమంత్రులుగా అధికారం చేపట్టారు. అందులో మాయావతి, అఖిలేశ్ రెండు పర్యాయాలు పూర్తికాలం ముఖ్యమంత్రులుగా కొనసాగారు. అయితే ఒకటి. పాతి కేళ్ల క్రితం నాటి అద్వాణీ నాయకత్వం కంటే 2014లో వచ్చిన మోదీ–అమిత్షా కూడిక చాలా శక్తిమంతమైనది. వారు పునరాలోచనకు అతీతమైన జాతీయవాదాన్ని తెచ్చిపెట్టారు. దీనికి మోదీ ఆకర్షణ శక్తి, అచ్చేదిన్ నినాదాలు తోడయ్యాయి. గుజరాత్లో మోదీ సాధించిన రికార్డులతో వీటిని ప్రజలు విశ్వసించారు. కుల విభజనలను ఇది పక్కకు పెట్టింది. బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ విభజనల పార్టీలు కకావికలయ్యాయి. ఇంతటి విజయం సాధ్యం కావాలంటే, తాము ఊహించని వర్గాల నుంచి, దళితుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓట్లు రావాలి. ఈ రెండో అంశమే ఇప్పుడు ప్రమాదంలో పడింది. కులం ఒకసారి పై చేయి, ఒకసారి దిగువస్థాయిగా ఉండడం, ఉద్యోగాలు లేకపోవడం, ఉత్తరప్రదేశ్లో అగ్రకుల ముఖ్యమంత్రి రావడం వంటి పరిణామాలు మళ్లీ కులాన్ని సమీకరణలో భాగమయ్యేటట్టు చేశాయి. దీనిని బీజేపీ త్వరగానే గుర్తించింది. ఆ విషయాన్ని మోదీ, షా చెబుతున్నారు కూడా. కానీ వారికి మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి– వారికి అందిరినీ ఒప్పించగలిగే, బలమైన దళిత గళం ఏదీ లేదు. రెండు– గతంలో ఆ పార్టీ నరేంద్ర మోదీ, శివరాజ్ చౌహాన్ వంటి ఓబీసీ ప్రచార సారథులను ముందుకు తెచ్చింది. కానీ 2014 దశ తరువాత అగ్రకులాల ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో ఈ పరిణామం కని పించింది. మూడు– ఈ ధోరణులను విడనాడడంలో వారు చాలా ఆలస్యం చేశారు. పార్టీ, ప్రభుత్వ నిఘా వర్గాలు దళితుల నిరాశ గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వడంలో విఫలమైనాయి. ఏమైతేనేం ఇప్పుడు పార్టీ దీని గురించి చర్చిస్తున్నది. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి జరిగిన ఈ నష్టాన్ని ఏ మేరకు నివారించుకోగలరో వేచి చూడవలసిందే. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, twitter@shekargupta -
పశ్చాత్తాపంలోని పరమార్థం
జాతిహితం 2014 తరువాత రాజకీయాలు మైనారిటీ ఓటు పరిమితులను బహిర్గతం చేశాయి. అలాగే దీనినే సెక్యులర్ ఓటుకు పర్యాయపదంగా పరిగణించే తెలివిమాలిన తనం కూడా మొద లైంది. ముస్లిం ఓట్లే తమకు విజయాన్ని చేకూర్చి పెట్టలేవన్న వాస్తవం నిన్నటి కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే వారు విస్తృత స్థాయిలో ప్రధానమైన కులాలతో, సామాజిక సమూహాలతో సంబంధాలు నెరపేవారు. ఇప్పుడు ఈ సంకీర్ణాలు బద్దలయ్యాయి. మధ్య, పశ్చిమ భారత రాష్ట్రాలలో ఉన్న అగ్రకులాలను బీజేపీ తన పరం చేసుకుంది. ఈ మధ్య జరిగిన ‘ఇండియా టుడే’ పత్రిక సమావేశంలో సోనియా గాంధీ ఒక మాట అన్నారు. ముస్లిం పార్టీగా ముద్ర పడడం వల్ల కాంగ్రెస్ మూల్యం చెల్లించవలసి వచ్చిందని ఆమె అన్నారు. దీనితో భారతీయ ముస్లింలు, వారి సంస్కృతి, రాజకీయాలు, వీటి పట్ల సాధారణ ప్రజల స్పందన ఎలా ఉన్నది అనే అంశాల గురించి చర్చకు తెర లేచింది. మేధావులు ఈ అంశాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో హర్ష్ మందిర్, రామచంద్ర గుహ వంటి వారి స్పందనలు వెలుగు చూడడం ఇందులో భాగమే. మనం ఈ వ్యాఖ్య వెనుక రాజకీయ అర్థాన్ని శోధించవలసి ఉంది. నిజానికి ఈ వాదనను సంస్కృతి, జీవనశైలి, మత చిహ్నాలు– ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముస్లింతనం’ అనే అంశానికి కనుక పరిమితం చేస్తే అది అసంపూర్ణంగా ఉంటుంది. ముస్లింలు కావచ్చు, లేదా ఇతర మత విశ్వాసాలు కలిగిన వారు ఎవరైనా కావచ్చు, వారు కోరుకున్న మేరకు చిహ్నాలను ఎంచుకోవచ్చు. అయితే ఈ చిహ్నాలే వారికి రాజకీయ సాధి కారతను కల్పిస్తాయా? ఇదొక ప్రశ్న. తన పార్టీ చర్యలు, ముస్లింల బుజ్జగింపు గురించి అధిక సంఖ్యాకులైన హిందువులలో భయాలు పెంచడానికీ, హిందువులకు సాధికారత లేకుండా చేయడం గురించీ బీజేపీ ప్రచారం తోడ్పడడం, ఉగ్రవాదం ఇలాంటివన్నీ సోనియా గాంధీ పశ్చాత్తాపంలో కనిపిస్తాయి. తప్పో ఒప్పో – 2014 నాటికి ఆ దృశ్యం ఒక వాస్తవమే. తాము తీసుకున్న గోతిలో తామే... విస్తృతంగా ఉన్న మెజారిటీ హిందువులు మైనారిటీల పట్ల ఆందోళన పడడమనే అసంబద్ధ వైఖరి 1989 మండల్–మందిర్ దశ నుంచి భారతదేశంలో కనిపిస్తుంది. ఇదంతా బీజేపీ, ఆరెస్సెస్ రాజేసినదేనని మరోసారి నిరసన ప్రకటించవచ్చు. మరొకవైపున మీకూ నిరసన సెగ తగులుతుంది. ఇదంతా రాజకీయం. ఒకవైపున మైనారిటీల అభద్రతా భావాన్ని వాడుకుంటూ ఉంటే, మరొకవైపు అదే నిజమని భావించేటట్టు మెజారిటీని నమ్మిస్తారు. 1985లో షాబానో తప్పిదం బద్దలయ్యేవరకు కాంగ్రెస్ ఒక వైపున నిలబడి ఈ క్రీడను చాలా తెలివిగా సాగించింది. అంతదాకా కాంగ్రెస్కు వెన్ను దన్నుగా ఉన్న విశాల హిందూ మెజారిటీ ఓటర్ల దగ్గరకు వెళ్లడానికి ఇదే పరిణామం బీజేపీ/ఆరెస్సెస్లకు మార్గం చూపించింది. దీని ఫలితం ఏమిటంటే, అప్పటి నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ముస్లిం ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో (పదిశాతానికి మించి) ఉన్న రాష్ట్రాలలో అయినా మళ్లీ అధికారంలోకి రావ డానికి, పూర్వ వైభవం సాధించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తంటాలు పడు తూనే ఉంది. తాను మాట్లాడుతున్న విషయం ఏమిటో సోనియాగాంధీకి తెలుసు. క్రూరమైన మైనారిటీ వాదాన్ని పట్టుకున్నందువల్ల ఆమె పార్టీ దారుణమైన మూల్యం చెల్లించింది. అయితే ఇందులో చేదు నిజం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వాదం వల్ల ముస్లింలకు ఒనగూడిన ప్రయోజనం ఏమీ కనిపించదు. దీనిని వారు కపటత్వం అద్దాల నుంచి చూశారు. కలకాలం మోసగించలేరు కదా! ఈ పరిణామాన్ని ఒక ముస్లింగా గమనించండి! ఒక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బాట్లా హౌస్ ఎన్కౌంటర్ను జరిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ను నిర్వహించిన అధికారికి మరణానంతర పురస్కారంగా అశోక చక్ర కూడా ఇప్పిస్తుంది. ఆ తరువాత పెద్ద గొంతు ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్కౌంటర్ నకి లీదని ఆక్రోశిస్తాడు. అంతేకాదు, ఈ పరిణామం సోనియాను కంటతడి పెట్టించిందని చెబుతారు. యూపీఏ–1 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్)ను రద్దు చేస్తుంది. ఎందుకంటే ఆ చట్టం ముస్లింలను బలి పశువులను చేస్తున్నదని చెబుతారు. తరువాత ఆ చట్టానికే కొన్ని మార్పులు చేస్తారు. అది పాత చట్టం రద్దును మాయం చేస్తుంది. ఆ ప్రభుత్వమే సచార్ కమిటీని నియమిస్తుంది. కానీ ఆ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో విఫలమవుతుంది. వీటన్నిటినీ తలదన్నేది మన్మోహన్ సింగ్ ప్రకటన. అదేమిటంటే, జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలదేనని ఆయన అంటారు. ఇది పైకి ఆదర్శవంతంగా కనిపించవచ్చు. కానీ రాజకీయంగా తప్పిదం. ఉద్యమకారుల మాదిరిగా మాట్లాడడం లేదా, వ్యవహరించడం రాజకీయవేత్తలకు సాధ్యం కాదు. ఇలాంటి ప్రకటన కూడా యథాప్రకారం అమలుకు నోచుకోదు. కాబట్టి ఇదంతా బూటమని ముస్లింలు భావించక తప్పదు. తప్పుడు రాజకీయాల ఫలితం అలాగే హిందువుగా కూడా ఈ పరిణామాన్ని గమనించండి! ఇదంతా ఎంత ప్రమాదకర మైనారిటీ బుజ్జగింపు ముఠా? ఉగ్రవాదులను వాళ్లే హత మారుస్తారు. వారు బలైపోతున్నారని అదే నోటితో మళ్లీ అంటారు. ఇదంతా ఓట్ల కోసమే. ఈ భాగోతం ఇంక చాలు అనిపిస్తుంది. దీనితో కాంగ్రెస్ రెంటికీ చెడిన రేవడి అయింది. ముస్లింలందరూ బలంగా ఉన్న స్థానిక నాయకుల వెనుక చేరిపోయారు. సోనియా గాంధీ చెప్పినట్టు కాంగ్రెస్ను హిందువులు ముస్లిం పార్టీగా పరిగణించారు. కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి తోడు ఈ తప్పుడు రాజకీయంతో వచ్చిన మరొక వాదన కూడా ఉంది. ముస్లింలను రాజకీయ హక్కుకు దూరంగా నెట్టివేయడమన్న వాదన అది. భారత రాజ కీయ చరిత్రలో ఇలాంటి సందర్భం ఏదీ ఇంతకు ముందు లేదు: లోక్సభలో మెజారిటీ పార్టీ తరఫున ఒక్క సభ్యుడు కూడా లేరు. కేంద్రంలో ఎలాంటి కీలక మంత్రిత్వ శాఖలోను (కేంద్ర మంత్రిమండలిలో ఉన్న ఏకైక ముస్లిం– మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక్కరే) వారు లేరు. ఏ కీలక మంత్రిత్వ శాఖలోను కార్యదర్శి స్థాయి అధికారిగా కూడా వారు కనిపించరు. రక్షణ, నిఘా వ్యవస్థలలోని ఏ రకమైన ఉన్నత స్థానంలోను వారికి స్థానం లేదు. అలాగే జమ్మూకశ్మీర్లోని మాయా సంకీర్ణ ప్రభుత్వానికి తప్ప, దేశంలో ఎక్కడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో 20 శాతం ముస్లింలు ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలోకి దించకుండా బీజేపీ 80 శాతం సీట్లను సొంతం చేసుకుంది. నిన్నటి తరం కాంగ్రెస్ నేతల దృష్టిలో... ఇదంతా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదు. ముస్లింలలో నెలకొన్న భయం ముస్లిం నాయకులు అసదుద్దీన్ ఒవైసీ, బద్రుద్దీన్ అజ్మల్ వంటివారి విన్న పాలలో బయటపడుతూ ఉంటుంది. అయితే భారత్–పాక్ విభజన నుంచి కనిపిస్తున్న ధోరణికి ప్రస్తుత వాతావరణం చాలా భిన్నమైనది. ఇంతకు ముందు రాసిన జాతిహితం శీర్షికలో (2015, నవంబర్, 13) దానిని పేర్కొ న్నాను. జిన్నా భారతదేశాన్ని వీడి వెళ్లిపోయిన తరువాత, భారత ముస్లింలు ఎవరూ కూడా తమ నాయకునిగా పొరుగు ముస్లింను నమ్మడం లేదు. అంతకంటే ఒక హిందువును విశ్వసిస్తున్నారు. 2014 తరువాత రాజకీయాలు మైనారిటీ ఓటు పరిమితులను బహిర్గతం చేశాయి. అలాగే దీనినే సెక్యులర్ ఓటుకు పర్యాయపదంగా పరిగణించే తెలివిమాలినతనం కూడా మొద లైంది. కేవలం ముస్లిం ఓట్లే తమకు విజయాన్ని చేకూర్చి పెట్టలేవన్న వాస్తవం నిన్నటి తరం కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసు. అందుకే వారు విస్తృత స్థాయిలో ప్రధానమైన కులాలతో, సామాజిక సమూహాలతో సంబంధాలు నెరపేవారు. ఇప్పుడు ఈ సంకీర్ణాలు బద్దలయ్యాయి. మధ్య భారతదేశం లోను, పశ్చిమ రాష్ట్రాలలో ఉన్న అగ్రకులాలను బీజేపీ తన పరం చేసుకుంది. బీజేపీని కూడా నిలువరించడానికి చాలినన్ని కులపు ఓట్లు ఉన్న ఓబీసీ నేతల వెనుక ముస్లింలు చేరిపోయారు. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తారని, అందుకే వారు ప్రభుత్వం ద్వారా దేశాన్ని ఏలుతున్నారని గతంలో బీజేపీ తీవ్రంగా ఆరోపించేది. అయితే అదే పార్టీకి చెందిన మోదీ–షా ద్వయం దీనిని తారుమారు చేసింది. అంటే చాలినంత మంది హిందువులను వెనుక ఉంచు కోగలిగితే ముస్లింలను పట్టించుకోనక్కరలేదు. సెక్యులరిజం, మైనారిటీ ఓటు తమ రాజకీయాలను మళ్లీ దారిలో పెడతాయని చెప్పుకునే వారు ఉన్నం తవరకు ఇది మారదు. మెజారిటీల దన్ను సాధించేవరకు వారికి ఎలాంటి అవకాశం ఉండదు. అందరి అండతోనే గెలుపు సాధ్యం కాబట్టి ఇప్పటి చర్చ బురఖా, హిజబ్, ముస్లింల టోపీ, గెడ్డాలు, తలాక్ లేదా హజ్ రాయితీ గురించి కూడా కాదు. దీనివల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. ఇది ముస్లింలలోని పీడన భావాన్ని పెంచవచ్చు. ఇంకా సెక్యులర్ పార్టీలలోని గందరగోళాన్ని, తమను చూసి తాము జాలి పడే పరిస్థితిని పెంచవచ్చు. ఇలాంటి వారంతా తమ రాజకీయ విధానం నుంచి వారికి వారే బయ టపడకపోతే అదే గతి తప్పదు కూడా. వారు బతికి బట్టకట్టడం కష్టం. ఉదారవాద భావాలున్న కొన్ని ప్రాంగణాలు, గోష్టుల బృందాలు, అభిప్రాయ తయారీ కేంద్రాలు దీనిని నిరోధించవచ్చు కానీ, జాతీయ రాజకీయాల విషయం వరకు మోదీ, షా ద్వయం సెక్యులరిజాన్ని పునర్ నిర్వచించిందన్న మాట నిజం. ఏదైనా ఒక పార్టీ, అంటే కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే అది యూపీఏ హయాంలో వామపక్షాలు తీసు కువెళ్లిన కేంద్రబిందువు దగ్గరకు కాదు, అసలైన సెక్యులర్ కేంద్రబిందువు దగ్గరకు చేరడం అవసరం. ఇష్టం ఉన్నా లేకున్నా రాహుల్గాంధీ ఆలయాల సందర్శన ఇచ్చే సందేశం ఇదే. కాంగ్రెస్ను ప్రజలు ముస్లిం పార్టీగా చూశారంటూ సోనియా వ్యక్తం చేసిన భావంలోని సందేశం కూడా అదే. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రాజకీయాల్లో ‘ఆప్’ సోపాలు
జాతిహితం మూడేళ్ల క్రితం తాను అనుభవించిన రాజకీయ అధికారంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆప్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఏ ఉప ఎన్నిక నిర్వహించినా ఆ పార్టీయే గెలుస్తుంది. కానీ, సగం ఢిల్లీ రాష్ట్రానికి పరిమితమై మమతా బెనర్జీతో సమానంగా నిలబడటం అనేది కేజ్రీవాల్, అతడి పార్టీ పెట్టుకున్న లక్ష్యం కానేకాదు. వాళ్లు వ్యవస్థను మార్చడానికి వచ్చారు. భారత్ను రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు అదంతా ముగిసిపోయింది. మళ్లీ వీరు పూర్వ ప్రాభవాన్ని సాధించగలరా? ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎప్పుడు పుట్టిందీ ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఆప్ను స్థాపించింది 2012 ఆగస్ట్ 4న అని చెప్పవచ్చు. ఎందుకంటే, అదే రోజు ఈ పార్టీ స్థాపకులు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా రాజ కీయాలు మురికి కూపం అని వర్ణించాక కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడిం చారు. ఇండియా అగ్నెస్ట్ కరప్షన్ పేరిట అవినీతి వ్యతిరేక పోరాటం ఉధృ తంగా దేశవ్యాప్తంగా సాగిన 2010లో ఆప్ పుట్టుకకు మూలాలు ఉన్నాయని నా పుస్తకంలో రాశాను. ఈ పార్టీకి ప్రధాన చిహ్నంగా, ప్రచారకర్తగా అన్నా హజారే దొరికారు. ఈ అవినీతి వ్యతిరేక ఆర్కెస్ట్రా నిర్వాహకుడు(కండక్టర్)గా అరవింద్ కేజ్రీవాల్ నిలబడ్డారు. ఈ కొత్త రాజకీయశక్తి స్పష్టమైన రూపం సంపాదించలేకపోయింది. దీనికి గట్టి మేనిఫెస్టో గానీ, అజెండా గానీ ఎప్పుడూ లేదు. జన్ లోక్పాల్ అనే జనాస్త్రంతో అవినీతి రాక్షసిని అంతమొం దించడం ఒక్కటే దాని లక్ష్యంగా కనిపించింది. పార్టీకి సిద్ధాంతమంటూ లేదు. దాని వల్ల దేశం నలుమూలల నుంచీ జనం ఆప్ వేదికపైకి వచ్చి అన్నా హజారే వెలుగులో మురిసిపోవడానికి, మెరిసిపోవడానికి వీలయింది. పత్రి కల్లోనే గాక, సామాజిక మాధ్యమాల్లో కూడా వారికి మంచి ప్రచారం లభిం చింది. ఏ విషయంపైనా బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా దేని పైనా విభేదాలు రాకుండా నివారించడమే పంథాగా ఈ వేదిక మొదలైంది. పూర్తి వ్యతిరేక భావాలున్న ఇద్దరు కాషాయాంబరధారులైన స్వామి అగ్నివేశ్, బాబా రాందేవ్ ఈ వేదికపై ఒకేసారి కనిపించే అవకాశం వచ్చింది. వామ పక్షం వైపు మొగ్గే లాయర్ ప్రశాంత్ భూషణ్, మితవాదిగా ముద్రపడిన కవి కుమార్ విశ్వాస్–ఈ ఇద్దరికీ ఆప్ స్థానం కల్పించింది. ఆప్ తెగింపు, ఆదర్శాలు మీడి యాలోని పలువురు యువకులను ఆకట్టుకున్నాయి. జర్నలిస్టులుగా పని చేసిన ఆశిష్ ఖేతాన్, మనీష్ సిసోడియా, అశుతోష్లు వారిలో ప్రముఖులు. సామాజిక కార్యకర్తలకు కేంద్రం! మేధా పాట్కర్ నుంచి అఖిల్ గోగోయ్, మయాంక్ గాంధీ వరకూ అనేక మంది సామాజిక కార్యకర్తలకు ఇది పెద్ద కేంద్రస్థానంగా మారింది. వివిధ వృత్తుల్లో నిపుణులు(మీరా సన్యాల్), విశ్రాంత సీనియర్ ఉన్నతాధికారులు (పుణెలో అరుణ్ భాటియా), జడ్జీలు(సంతోష్ హెగ్డే) వంటి ప్రముఖులెంద రినో ఆప్ ఆకర్షించింది. అలాగే, యోగేంద్ర యాదవ్ వంటి వామపక్షవాదు లైన లిబరల్ మేధావులూ ఈ కొత్త రాజకీయపక్షానికి చేరువయ్యారు. ఆప్ అంటే విపరీత స్థాయిలో ప్రజల్లో ఉత్సాహం ఉప్పొంగిన ఆ రోజుల్లో ప్రజా ఉద్యమంగా పుట్టిన ఆప్ ఉద్దేశాలు, పద్ధతులను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఓ మోస్తరుగా ప్రశ్నించిన మాలాంటి వారిని దుర్భాషలాడారు. దుమ్మెత్తిపోశారు. ఈ వేదిక దేని కోసం నిలబడుతోంది? అనేదే మా ప్రధాన ప్రశ్న. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సొంతగా రాసిన సంక్షిప్త మేనిఫెస్టోను చదవాలని మాకు సలహా ఇచ్చారు. దీన్ని చదవగానే కొన్ని వాస్తవ దూరమైన కథలను ఒక చోట గుచ్చినట్టు (అరవింద్ చిత్ర కథ) అనిపించింది. ఓ సిద్దాంతం లేకుండా నాలుగు కాలాలు సాగే రాజకీయ మార్గాన్ని నిర్మించలేరనీ, కేవలం అవినీతి వ్యతిరేకంగా పోరాడితే చాలదనేది మా వాదన. దీంతో, రాజకీయాలపై ఆసక్తి లేకుండా ఇలాంటి ప్రశ్న అడిగే ధైర్యం మీకు ఎక్కడిదంటూ మాపై మండిపడ్డారు. మేరా నేతా చోర్ హై(మా నాయకుడు దొంగ) అనేది వారి ప్రధాన నినాదమైతే వారికి రాజకీయ సిద్ధాం తం ఎక్కడుంటుంది? పార్లమెంటును దొంగలు, బందిపోట్ల స్థావరంగా వారు వర్ణించారు. జన్లోక్పాల్లో నోబెల్, మేగససే అవార్డుగ్రహీతలు సహా రాజకీయాలతో సంబంధం లేని వారు ఉండాలనీ, సీబీఐ సర్వస్వతంత్ర సంస్థగా పనిచేయాలనేవి వారి నిశ్చితాభిప్రాయాలు. చివరికి, ‘‘వ్యవస్థను మార్చడానికి మరో మార్గం లేదు’’ అంటూ వారే ఓ శుభ ముహూర్తాన రాజ కీయ నాయకులుగా అవతారమెత్తారు. పొందిక లేని ‘యువ’ నేతల పార్టీ ఆప్! సంప్రదాయానికి భిన్నంగా కాస్త చిన్న వయసులో ఓ ప్రజా ఉద్యమాన్ని తెలివిగా, చురుకుగా నడిపిన నాయకులు రాజకీయపక్షంగా రూపాంతరం చెందారు. ముందే ఊహించినట్టే పొందిక, కుదురు లేకపోవడమే ఆప్కు ప్రధాన సవాలుగా మారింది. అధికారం అందుకున్నాక వారిని కలిపి ఉంచా ల్సిన లక్ష్యం గాలికి కొట్టుకుపోయింది. ఇప్పుడు వారిని నడిపించే లక్ష్యం అవినీతిని తుదముట్టించడం కాదు. సాధ్యమైనంత వరకూ స్వచ్ఛమార్గంలో పాలన అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబడటమే వారి ఉద్దేశంగా కనిపిం చింది. ఇలాంటి ప్రణాళికలు ఎప్పుడూ విజయవంతం కావని అనుభవాలు చెబుతున్నాయి. అత్యంత జనాదరణ కలిగిన అస్సాం విద్యార్థి ఉద్యమం బలమైన రాజకీయ పార్టీగా (అస్సాం గణపరిషత్) నిలబడలేక కుప్ప కూల డమే ఇందుకు మంచి ఉదాహరణ. ఆప్లాగే ఈ విద్యార్థి నేతలు 1985లో జరి గిన తమ తొలి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. విదేశీ పౌరులను బయటికి పంపాలనే లక్ష్యం ఆచరణలోకి రాలేదు. ఈ పార్టీ నేతలు ఎంతో కాలం కలిసి నడవలేకపోయారు. విదేశీయుల వ్యతిరేక ఉద్యమ నేతలు ఎంతోమంది నేడు బీజేపీలో ఉన్నారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, కీలక మంత్రి హిమంతా బిశ్వశర్మ ఇలాంటి నేతలే. ఏజీపీగా మిగిలిన అతి పెద్ద చీలికవర్గం ప్రస్తుతం బీజేపీ జూనియర్ భాగస్వామిగా సంకీర్ణ సర్కా రులో కొనసాగుతోంది. గతంలో ఏజీపీ వామపక్షాలతో కలిసి పాలన సాగిం చడం విశేషం. లక్ష్యం మాయమైంది. శూన్యాన్ని భర్తీ చేయడానికి సిద్ధాంతం మిగలలేదు. ఎవరి దారి వారిది. ఇవే ఏజీపీ దుస్థితికి కారణాలు. ఒక్క తేడా మినహాయిస్తే ఆప్ కూడా పైన చెప్పిన పరిస్థితినే ఎదుర్కొం టోంది. ఆప్ స్థాపకుల్లో ప్రముఖులైన ఎందరో నిరాశానిస్పృహలతో పార్టీ నుంచి దూరమయ్యారు. వారిలో ప్రసిద్ధులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సామ్యవాద సిద్ధాంతాలతో రాజకీయపార్టీ ప్రారంభించారు. మరి కొందరు ఆప్పై తమ ఆగ్రహాన్ని భిన్న మార్గాల్లో వ్యక్తంచేస్తున్నారు. కేజ్రీవాల్ అధికార ఉన్మాదంతో నడుస్తున్నారని అన్నాహజారే తరచు విమర్శిస్తున్నారు. మయాంక్ గాంధీ ఇటీవల ఆప్ నేతల పోకడలపై ఆగ్రహం ప్రకటిస్తూ పుస్తకం రాశారు. కేజ్రీవాల్ తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన మాజీ మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా ట్విటర్లో నిప్పులు కక్కుతున్నారు. తాజాగా ఇప్పుడు పంజాబ్లో పార్టీ నాయకత్వం కీచులాటల నుంచి సంక్షోభంలోకి పయనిస్తోంది. ఏడాది క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని అంచనాలు వేశారు. అయితే, ఇక్కడ మనం ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయపక్షాలుగా అవతరించిన ఏజీపీ, ఇతర చిన్న పార్టీలకూ, ఆప్కూ మధ్య ఉన్న ఒక తేడా గమనించాలి. ఈ పార్టీలకు లేని తిరుగులేని నేత అరవింద్ కేజ్రీవాల్ ఆప్కు ఉన్నారు. 2010 నుంచి అంటే గడచిన ఎనిమిదేళ్లుగా అధికార రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో ఎలాంటి దయాదాక్షిణ్యాలకు తావులేకుండా నడుపుతున్న నేతగా కేజ్రీవాల్ పేరు తెచ్చుకున్నారు. ఫలితంగా ఆప్ తన లక్ష్యాలను కోల్పో యింది. వ్యక్తిపూజకు నిలయంగా మారింది. ఈ క్రమంలో ఎలాంటి నిచ్చెన మెట్ల అధికార వ్యవస్థలేని రాజ కీయపక్షంగా రూపుదిద్దుకుంది. తన నాయక త్వానికి పోటీ లేదా సవాలు ఎదురైతే–మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా ‘మమ్మల్ని ఢీకొనే వారెవరైనా పచ్చడి పచ్చడి కావాల్సిందే’ అనే సూత్రాన్ని అమలు చేస్తారు. అయితే, పార్టీ లోపల సవాలు చేసేవారిపై, బయటి ప్రత్య ర్థులపై కేజ్రీవాల్ మరో ఎత్తుగడ ప్రయోగిస్తారు. వారిపై అత్యంత తీవ్ర ఆరో పణలు చేయడం, ముఖ్యంగా ఆ వ్యక్తుల నిజాయితీని అనుమానించే రీతిలో అడ్డగోలుగా దాడిచేయడం ఆయ నకు ఆనవాయితీ. ఈ అభియోగాల నిరూ పణకు సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవా అన్నది ఆయనకు అనవసరం. దూషణలతో భయపెట్టే ఎత్తుగడలు చెల్లుతాయా? నిజజీవితంలో ప్రతిదీ దాని నిర్దిష్ట గడువుతేదీతో వస్తుంటుంది. అనాగరికమైన నిందలతో భయపెట్టే ఎత్తుగడ మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది. తన పరిశుద్ధమైన ప్రతిబింబం ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతుంది. రెండు తాను ఏ కోశానా భయం లేని తిరుగుబాటుదారు కాబట్టి తాను చేసే ఈ దాడులు ప్రజల ప్రశంసకు పాత్రమవడమే కాకుండా తను గురిపెట్టిన లక్ష్యాలను నైతికంగా దిగజార్చివేస్తాయి. చివరగా, అతడి బాధితులు న్యాయస్థానానికి వెళ్లినప్పటికీ, న్యాయ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుంటుంది. భారత్లో ఉత్తమ విద్యావంతులైన నేతల నేతృత్వంలో ఉన్న అతి తరుణ రాజకీయ పార్టీ కూడా అత్యంత అసభ్యంగా, మొరటుగా వ్యవహరిస్తుందనే ఒక విచారకరమైన రాజకీయ అభాసను అది సృష్టిస్తుంది. ఈ మూడు కారణాలు కూడా ఇప్పుడు మారిపోయాయి. అధికారంలో కొనసాగుతున్న మూడేళ్ల కాలంలోనే కేజ్రీవాల్ తాను స్వయంగా ఎంపిక చేసుకున్న పార్టీనేతలను.. అవినీతి నుంచి నైతిక పతనం దాకా వివిధ నేరారోపణలతో మంత్రిమండలి నుంచి తొలగించాల్సి వచ్చింది. దీంతో పార్టీ గొప్పగా చెప్పుకున్న పరిశుద్ధత తన మెరుగును కోల్పోయింది. అరుణ్ జైట్లీపై నిందారోపణలకు సంబంధించి న్యాయ ప్రక్రియ వేగవంతం కావడం కేజ్రీవాల్ను భయపెట్టింది. తన బాధితులనుంచి తానెదుర్కొంటున్న న్యాయపరమైన సవాళ్లు (30 పైచిలుకు) దృఢమైనవని, తనను కాపాడలేవని కేజ్రీవాల్కి తెలుసు. కాబట్టే ఆయన వెంటనే తిరోగమన బాట పట్టారు. ‘భయంలేని తిరుగుబాటుదారు’ అనే ప్రతిష్టను ఈ వెనుకంజ మసకబార్చేసింది. మూడేళ్ల క్రితం తాను అనుభవించిన రాజకీయ అధికారంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆప్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఏ ఉప ఎన్నిక నిర్వహించినా ఆ పార్టీయే గెలుస్తుంది. కానీ, సగం ఢిల్లీ రాష్ట్రానికి పరిమితమై మమతా బెనర్జీతో సమానంగా నిలబడటం అనేది కేజ్రీవాల్, అతడి పార్టీ పెట్టుకున్న లక్ష్యం కానేకాదు. వాళ్లు వ్యవస్థను మార్చడానికి వచ్చారు. భారత్ను రక్షించడానికి వచ్చారు. ఇప్పుడు అదంతా ముగిసి పోయింది. మళ్లీ వీరు పూర్వ ప్రాభవాన్ని సాధించగలరా? రాజకీయాల్లో ఇది జరగదని మీరు ఎన్నటికీ చెప్పలేరు. ఏఏపీ మళ్లీ పునరుత్థానం చెందడాన్ని మనం చూడవచ్చు కానీ అదేరకమైన దూషణ రాజకీయాలతో మాత్రం కాదు. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ప్రజల దృష్టిని మళ్లించే ప్రతిభ
ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలిం చండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కనిపిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాట కీయంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్తో సర్దుకున్నారు. దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. వారం క్రితం అందరి దృష్టినీ బాగా ఆకర్షిస్తూ పత్రికల మొదటి పేజీలలో కనిపించిన పతాక శీర్షికలనీ, వాటి ఆధారంగా చానళ్లలో ప్రైమ్టైమ్ కార్య క్రమాలలో వినిపించిన గావుకేకలనీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి! ఇవన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఆ మామాఅల్లుళ్లు నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ సొమ్ము దొంగిలించిన ఉదంతానికి సంబంధించినవే. ఆ గొడవ పేపర్లలో కనిపిస్తూ ఉండగానే వేయి కోట్ల రూపాయల పరిమితితో రోటోమ్యాక్ పెన్నుల సంస్థ అధిపతి విక్రమ్ కొఠారీ, ఇంకా ఇతరులు బ్యాంకు లకు టోపీ వేయడం గురించి కూడా వార్తలు వచ్చాయి. చూడబోతే ఇలాంటి భాగోతం ఇంకా కొనసాగేటట్టే కనపడుతోంది. అవినీతి మీద పోరాటం నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ పరిణామం అంత మంచిది కాదు. ప్రజా«ధనానికి కాపలాదారుడిని (చౌకీ దార్) అంటూ గతంలో మోదీ చెప్పుకోవడాన్ని గుర్తుచేస్తూ విమర్శకులూ, కాంగ్రెస్వారూ ప్రధానిని ఎద్దేవా చేస్తున్నారు. ఇక బీజేపీ అవినీతి వ్యతిరేక నినాదాన్ని చేజార్చుకుందనీ, మరీ ముఖ్యంగా దావోస్లో జరిగిన సమావే శంలో నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఫొటో దిగిన నేపథ్యంతో ఇది మరింత స్పష్టమైందనీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పన్ను ఎగవేత లేదా రుణాల ఎగవేత కారణంగా విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా, లలిత్ మోదీ అనే ఇద్దరు లబ్ధప్రతిష్టుల పేర్లు, తాజాగా మరో రెండు పేర్లతో జతగూడాయి. కానీ బీజేపీ అధికార ప్రతినిధి మాత్రం టీవీ చానళ్లలో మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇబ్బంది పడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాం లోనే, 2011లో ఈ దొంగతనం మొదలయిందంటూ ఆ అధికార ప్రతినిధి చేసిన వాదన సీబీఐ వారి ఎఫ్ఐఆర్ దగ్గర వీగిపోయింది. అయితే ఇలాంటి పతాక శీర్షికలు రుచించలేదు. దీనితో అంతా మారిపోయింది. ఆ పతాక శీర్షిక లన్నీ కాలగర్భంలో కలసిపోయాయి. కొత్తవి అవతరించాయి. సమయం సందర్భమే ముఖ్యం అంటే ఇది శ్రీదేవి మరణంతో జరిగిందని మాత్రం నేను సూచించడం లేదు. ఆ నటి మరణం పూర్తిగా విషాదం, యాదృచ్ఛికం. ఆ పెద్ద మార్పు మానవ ప్రేరేపితమే. ఇంకా చెప్పాలంటే బీజేపీ తెచ్చిన మార్పే. ఈ కాలమ్ అచ్చుకు వెళ్లిపోతున్నది కాబట్టి, కొత్త పతాకశీర్షికల గురించి ఆలోచించాలి. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాల నుంచి కార్తి చిదంబరం 7,00,000 డాలర్లు తీసు కున్నారా? ఈ ఒప్పందం కుదర్చడంలో ఆయన తండ్రి తోడ్పడ్డారా? కస్టడీలో ఉన్న కార్తికి ఇంటిదగ్గర నుంచి వచ్చిన భోజనాన్ని అనుమతించలేదు. కానీ ఆయన బంగారు గొలుసు, ఇతర ఆభరణాలని మాత్రం న్యాయమూర్తి అను మతించారు. ఇలాంటివే ఇంకా శీర్షికలు. ప్రకటనలన్నీ మారిపోయాయి. నిజా నికి కార్తిని గడిచిన ఆ ఏడురోజులలో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. అయితే ఆయన దేశం వీడి వెళుతున్నప్పుడు అరెస్టు చేయలేదన్న విషయాన్ని మాత్రం గమనించండి! ఆయన తిరిగి స్వదేశానికి చేరుకున్నాక విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం? ప్రజలకు చేరవేయదలుచుకున్న సమాచారాన్ని క్రమబద్ధం చేయదలుచుకుంటే అందుకు సరైన సమయం ఎంచుకోవడం ప్రధానం. నాలుగు సంవత్సరాలు నానిన తరువాత ఇప్పుడు లోక్పాల్ నియా మకం విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అంతా ఊహించినట్టే కాంగ్రెస్ నిర సన వ్యక్తం చేసింది. దీని మీద ధర్మబద్ధమైన పతాకశీర్షికలతో వార్తలు వచ్చాయి. తరువాత మరో తాజా అంశానికి సంబంధించిన శీర్షికలు వచ్చాయి. అవి పరారైన ఆర్థిక నేరగాళ్ల పని పట్టేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదిస్తూ ఈ వారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణ యానికి చెందినవి. ఈ బిల్లు ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ఆదేశాలకు ఆరువారాల లోగా స్పందించని వారందరినీ పరారైన ఆర్థిక నేరగాళ్లుగానే పరి గణిస్తారు. మాల్యానీ, నగల వ్యాపారి మోదీని పరారైన ఆర్థిక నేరగాళ్లని ఇప్పుడు ప్రకటిస్తే అందులో తేడా ఏమిటో తెలియక మనం విస్తుపోవల సిందే. అంతేకాదు, ఒక ప్రశ్నను కూడా మనం సహేతుకంగా అడగవచ్చు. వారు ఇప్పటికే పరారైన నేరగాళ్లు కాదా? మరొక సందర్భంలో అయితే దీనిని నేను లాలీపాప్ రాజకీయమని కొట్టిపారేసేవాడిని. అంటే ఒక సమస్యని పరిష్కరించలేని స్థితిలో, ఆ సమస్యని పరిష్కరించేశామన్నట్టు ఒక చట్టాన్ని మాత్రం చేసి ఊరుకోవడమే. కానీ ఇప్పుడు ఆ మాట అనను. ఎందుకంటే ఏం కావాలని కోరుకున్నారో దానినే ఇది చక్కగా నెరవేరుస్తున్నది. చేతులు కాలాక... ఇమ్మిగ్రేషన్కు సంబంధించి ప్రభుత్వం చేయదలుచుకున్న కొత్త చట్టాల గురించి కూడా వార్తలు బయటకొస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతో దేశం విడిచి వెళ్లిపోతున్న వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేస్తారని, దీనికి అవసరమైన కొత్త నిబంధనలనే కేంద్రం రూపొందిస్తున్నదని వార్తలు బయటకొస్తున్నాయి. ఈ విషయాన్ని చట్టబద్ధత, ప్రాథమిక హక్కులు అనే కోణం నుంచి చూద్దాం. వ్యాపారంలో నష్టం రావడం చేత, లేదా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ఒక పౌరుడు దేశాన్ని వీడి వెళుతున్నాడని ఎవరు నిర్ధారిస్తారు? ఇంకా చెప్పాలంటే, భారతదేశంలో పాత పోలీసు వ్యవస్థలో కనిపించే పద్ధతిలా ఇది కనిపిస్తుంది. దోపిడీ జరిగిపోయిన తరువాత, అది జరిగిన ఇంటి ముందు పోలీసులను నియమించేవారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇలాంటిదేనని అనిపించడం లేదా? ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితినీ, సరిగ్గా వారం క్రితం బీజేపీ చేష్టలుడిగిన క్షణాలనీ పోల్చి చూడండి. ఏ టీవీ చానల్లో చూసినా బీజేపీ పైచేయిగా తన దాడిని కొనసాగిస్తూ ఉంటే, కాంగ్రెస్ చిదంబరాలను వెనకేసుకురావడంలో మునిగి ఉంది. లోక్పాల్, పలాయత ఆర్థిక నేరగాళ్ల నిరోధక బిల్లు, ఇలాంటి నేరగాళ్ల కదలికల మీద ఇమ్మిగ్రేషన్ శాఖ ఆంక్షలు వంటి అంశాల మీద ఇతరత్రా కూడా సంపాదక వ్యాఖ్య, చర్చలు వినపడుతున్నాయి. జాతీయ బ్యాంకుల చార్టర్డ్ అకౌంటెంట్స్ పర్యవేక్షణల మీద కొత్త నిబంధనావళిని కూడా ప్రకటిం చారు. రూ. 50 కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన వారి జాబితాలను సీబీఐకి అందించాలని కూడా ఈ బ్యాంకులను ఆదేశించినట్టు కనిపిస్తున్నది. శీర్షికల మర్మం ఇదే! ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పలుకుబడి కలిగిన బడా వ్యాపా రులు రూ. 20,000 కోట్లకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన తరు వాత మాత్రమే ఈ చర్యలన్నీ ప్రారంభమైనాయి. అలా పలాయనం చిత్త గించిన వారిలో ఒకరు మోదీతో దావోస్లో ఫొటో దిగినవారు. మరొకరు స్వయంగా మోదీయే ‘మేహుల్ భాయ్’ అని సంభోధించినవారు. ఇదంతా అశుభ సమాచారమే. అయినా మనం మరచిపోదగినది, మరిచిపోయినదీ కూడా. కానీ ఒక్క వారంలోనే ఇలాంటి దోపిడీని అరికట్టలేని ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం మీద ముద్ర పడింది. తన రక్షణలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను దోపిడీ చేయడానికి, దివాలా తీసే పరిస్థితులు కల్పించడానికి ఇలాంటి దొంగలకు అవకాశం ఇచ్చిందన్న అభియోగం ఎదుర్కొంది. అంతా తల్లకిందులైంది. పతాకశీర్షికలను శాసించడంలో రాజకీయం చేసే మర్మం ఇదే. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఎదురైన సంక్షోభాల జాబితాను పరిశీలించండి. ఎప్పుడూ ఇదే వ్యూహాన్ని అనుసరించడం కని పిస్తుంది. యురిలో వైఫల్యాన్ని నాటకీయంగా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్తో సర్దు కున్నారు. అయితే దీనిని ప్రశ్నిస్తే సైనిక బలగాలను శంకించినట్టవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా చాలావరకు నోరెత్తకుండా అభినందించాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇక సహించలేరన్న స్థాయికి చేరుకున్న తరువాత, దేశంలో అక్కడా ఇక్కడా పెద్ద పెద్ద నోట్ల గుట్టలు కనుగొన్నట్టు కథనాలు, ఫొటోలు దర్శనమిచ్చాయి. తరువాత ఆ నోట్ల గుట్టలు నకిలీవని కూడా తేలింది. కానీ అప్పటికి ప్రజల ఆలోచనలను అది మళ్లించగలిగింది. రోహిత్ వేముల ఉదంతాన్ని తీసుకోండి. అతడి ఆత్మహత్య తరువాత జేఎన్యూ విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి దృష్టి మళ్లించారు. కన్హయ్యకుమార్, ఉమర్ ఖాలిద్ ‘భారత్ను ముక్కలు చేస్తాం’ అని ఉపన్యాసాలు ఇచ్చారంటూ దేశద్రోహం కేసులు మోపారు. వాళ్ల ఉపన్యాసాల వీడియోలను చూడకుం డానే ఈ కేసులు నమోదయ్యాయి. డోక్లాం సంక్షోభాన్ని మరింత సున్నితమైన విధానంతో ఏమార్చారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ విషయాన్ని విశేషంగా చూపించవద్దని పత్రికలను, టీవీ చానళ్లను ‘ఒప్పిం చడం’ ద్వారా ఆ పని చేశారు. కశ్మీర్ సరిహద్దులలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి సాయం వేళల్లో గొంతు చించుకునే కమాండో కమేడియన్లు డోక్లాం గురించి మాటమాత్రంగా కూడా ఏమీ చెప్పలేదు. వార్తలన్నీ మోదీని ఆకాశానికెత్తేవే... సాధారణంగా సందేశాలని ప్రభుత్వాలన్నీ సొంతం చేసుకుంటాయి. కానీ మోదీ, షా బీజేపీ మాత్రం దానిని ఒక లలితకళగా అభివృద్ధి చేసింది. అన్ని పతాక శీర్షికలు కూడా కచ్చితంగా మోదీ ముద్రకు చెందిన మూడు కోణాలను ప్రతిబింబిస్తాయి: ఆయన మచ్చలేని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు. హిందూత్వ ఛాయతో ఉన్న జాతీయవాదాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా రక్షించేవాడు. విస్తారమైన భుజాలు, విశాలమైన ఛాతి కలిగిన ఆయన ముఖంలో ఎలాంటి సంక్షోభమైనా సరే, చిన్న మార్పును కూడా తేలేదు. ఆయన చేసేదేదీ తప్పు కాదని ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన అజేయుడు. ఆ కారణంగానే ఆయన ఏ వైఫల్యం గురించి స్పందించ రాదని గట్టిగా నిశ్చయించుకున్నారు. మన్మోహన్ సింగ్తోను, ఆయన ప్రభుత్వం తోను బేరీజు వేసి చూడండి. తమ సంరక్షణలో ఒక కూరల బండి నుంచి ఎవరో కొన్ని టొమేటోలు దొంగిలించారని తెలిసినా వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. అందుకే సంక్షోభాల వేళ మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారు భయ విహ్వలురై చూడాలి. అలాగే వారి ప్రభుత్వం ప్రదర్శించే రాజ కీయ తెలివిడిని శ్లాఘించాలి. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
విజేతలను వెంటాడే భయం
ఈసారి క్లీన్స్వీప్లు అసాధ్యమని బీజేపీ నేతలకు తెలుసు. ఆఖరికి గుజరాత్లో కూడా కొన్ని స్థానాలు నష్టపోవచ్చు. మోదీ మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం వల్ల గుజరాతీయులు తమ అశాంతిని మరిచిపోయి ఓట్లు వేసినప్పటికీ సీట్లు తగ్గుతాయి. ఆ కోణం నుంచి ఇప్పుడు ఇండియా మ్యాప్ను పరిశీలిస్తే 272 ప్లస్ స్థానాలు రావడం గగనమన్న సంగతి తెలుస్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (శివసేన దూరం కావడంతో), ఉత్తరప్రదేశ్లలో కూడా బీజేపీ సీట్లు కోల్పోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ హావభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వృథా ప్రయాస. ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆయన ఒక పరిపూర్ణ కళాకారుడు. కేవలం సౌజ్ఞలు చేస్తూ, వాటి మధ్య మాటతో చెప్పనివి, ప్రదర్శించనవి అనేకం మన ముందు ఆవిష్కరిస్తారు. ఆలోచనలలో వాస్తవంగా ఏముందో దానిని కూడా మోసం చేసి వచ్చిన అంశాలు ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడడంలో చాలా తర్ఫీదు పొందినవారాయన. ఆయన నిరంతర ప్రచార యుద్ధ సంరంభంలో కనించే రాజకీయనాయకుడు. ఒక అవిశ్రాంత ప్రచారకుడు. తన ప్రచారంతోనే 2014 ఎన్నికలలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో, అలాంటి ఒక కొత్త ప్రచార సంరంభానికి ఆయన సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ వారంలోనే పార్లమెంట్ ఉభయ సభలలో మోదీ ఇచ్చిన రెండు ఉపన్యాసాలను ఆత్రంగా చదివిన వారి కోసమే ఈ చిన్న హెచ్చరిక. అందులోని కొన్ని అంశాలను మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయన నుదిటి మీది ముడతలు చాల లోతైనవని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రతిపక్షానికి సంబంధించి ఆ ముడతలు మరింత ఆగ్రహాన్ని, చిరాకును ప్రదర్శిస్తాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, చాలాకాలం తరువాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ఆయన తలపులను గట్టిగా తట్టింది. ఇంకోమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన గుబులు పడవలసిన విషయమైంది. లోక్సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో కనీసం పన్నెండు పర్యాయాలు కాంగ్రెస్ పేరు ప్రస్తావించారని మా లెక్కలో తేలింది. అంటే 48 మంది సభ్యులు ఉన్న ఆ పార్టీ ఎంపీలు ప్రతి నలుగురిలో ఒకరికి ఆ ప్రస్తావన వర్తిస్తుంది. కాంగ్రెస్ గురించి ప్రస్తావించడం ఒక్కటే కాదు. నెహ్రూతో ఆరంభించి ‘రాజవంశం’ పేరుతో కూడా ప్రధాని పలుమార్లు ఆ కుటుంబం గురించి ప్రస్తావించారు. నెహ్రూతో పాటు, ఆయన వారసులందరి పాపాల గురించి మోదీ గుర్తు చేశారు. కశ్మీర్ అంశంలో నెహ్రూ పాపం, అత్యవసర పరిస్థితి విధింపు ఘనతలో ఆయన కుమార్తె ఇందిర చేసిన పాపం, 1984 నాటి సిక్కుల ఊచకోత పాపంలో ఇందిర కుమారుడు రాజీవ్గాంధీ వాటా, ఆంధ్రప్రదేశ్ను తొందరపాటుతో అనాలోచితంగా విభజించారంటూ ఆ పాపాన్ని సోనియా గాంధీకి, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ను బహిరంగంగా చింపిన పాపం సోనియా కుమారుడు రాహుల్కు ప్రధాని ఆపాదించారు. ఇది రాజ వంశంలోని ఐదు తరాల వారిని రాజకీయంగా నిందితులుగా నిలబెట్టడానికి ఉద్దేశించిన బలమైన ఆరోపణల పత్రమే. కానీ తన ప్రభుత్వం గురించి మాట్లాడడానికి మాత్రం ఆయన చాలా తక్కువ సమయం మిగుల్చుకున్నారు. ఈ ఉపన్యాసాన్ని సంప్రదాయ పంథాలో విశ్లేషిస్తే, ప్రధాని మాటలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత మీద ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శను స్ఫురింపచేస్తాయి. లేదా అధికారంలో ఉన్న నాయకుడు తనకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వాస్తవాన్ని గమనించి, మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆశతో, ఒక దుర్బల స్థితిలో చేస్తున్న ఉపన్యాసంలా కూడా అనిపిస్తుంది. ఇదంతా చూస్తే ప్రధాని మోదీ కాంగ్రెస్కు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి మోదీ ఉపన్యాసాన్ని సంప్రదాయ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఆయన గురించి తెలిసిన వారు లేదా ఆయనతో కలసి పనిచేసినవారు మీకు ఒకటే చెబుతారు. విపక్షాన్ని తేలిక తీసుకోవడం తమ ఇంటా వంటా లేదనే వారు చెబుతారు. కాబట్టి మోదీ నిరంతరం ప్రచార యుద్ధ సంరంభంలో ఉంటారనడమే నిజం. అది నిజం కాకపోతే మొత్తం 19 రాష్ట్రాలలో మోదీ సొంత పార్టీ ప్రభుత్వాలు, లేదా ఇతర పార్టీలతో కలసి బీజేపీ సంకీర్ణాలు ఏర్పడడం ఎలా సాధ్యమయ్యేది. మళ్లీ సంప్రదాయబద్ధమైన తర్కంతో ఆలోచిస్తే 48 మంది సభ్యులు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి తన ఉపన్యాసంలో ప్రధాని అన్ని సార్లు ప్రస్తావించడంలోని సహేతుకతని కూడా గ్రహించవచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రబావాన్ని ఏ మేరకు చూపుతుందో గానీ, ఈ సంవత్సరం జరిగే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి గట్టి సవాలే. ఇందులో త్రిపురను మాత్రం మినహాయించవచ్చు. కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో–కర్ణాటక, మేఘాలయలలో అధికారంలో ఉంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈసారి తమకు అవకాశం ఉండవచ్చునని నమ్ముతున్నది. 2018 సంవత్సరంలో జరిగే ఆ ఏడు లేదా ఎనిమిది మినీ ఎన్నికలే 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంకేతించేవిగా ఉంటాయని మోదీకి తెలుసు. ఒకవేళ కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధిస్తే, ఈ సంవత్సరాతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి వాలుగాలి వీస్తుంది. ఆ మూడింటిలో రెండు గెలిచినా, 2019 ఎన్నికలలో బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ కళ్లెం వేయగలుగుతుంది. అదే కర్ణాటకలో బీజేపీ కనుక విజయం సాధిస్తే పరిస్థితులు మారిపోతాయి. గుజరాత్ మిగిల్చిన గందరగోళం, రాజస్తాన్ ఉప ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బ గురించి కూడా అంతా మరిచిపోతారు. ఇక, మోదీ అంటే కోచ్ సలహా మేరకు ఒక దశ తరువాత ఒక దశ మెలకువలు నేర్చుకునే వినయశీలి అయిన బ్యాట్స్మెన్ కాదు. బ్యాట్స్మెన్కు తన కోసమే విసిరే ఒకే బాల్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. తరువాత వచ్చే బంతి గురించి అప్పటికి ఆ బ్యాట్స్మెన్కు ఎలాంటి ఆలోచన ఉండదు. అయితే పిచ్తోను, వాతావరణంతోను, అంపైర్తోను కూడా ఏకకాలంలో ఆడుకునే క్రీడాకారుడు మోదీ. మోదీ రాజకీయ విధానం కూడా మధ్యయుగాల నాటి గెలుపు తరహాలో విజయ ఫలితమంతా విజేతకే దక్కాలన్న తీరులో ఉంటుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్తో కలసి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఒక ముస్లిం ముఖ్యమంత్రిని ప్రతిష్టించడానికి చేతులు కలిపారని ఆరోపించడం ఇలాంటిదే. మోదీ శైలి లేదా మోదీ–అమిత్షా శైలి పూర్తిగా రాజకీయ మయమే. వాళ్లు కేవలం విజయాన్ని మాత్రమే కోరుకోరు. ప్రతిపక్షాన్ని ధ్వంసం చేసి, శంకరగిరి మన్యాలు పట్టిం చాలని కోరుకుంటారు. ఇందులో ఏది ఆమోదనీయమో, దానిని ఆ పార్టీ స్వీకరిస్తుంది. కానీ నేటి పరిస్థితి ఆరుమాసాల క్రితం వంటిది కాదు. గుజరాత్ ఎన్నికలలో ఆశించనదాని కంటే చాలా తక్కువ ఫలితం దక్కడం, రాజస్తాన్ ఉప ఎన్నికల ఓటమిలో కనిపించిన ఓట్ల భారీ తేడా బీజేపీని బాగా ఇరకాటంలో పడవేసే సంకేతాలు. ఇవి కాకుండా వేరే అంశాలు కూడా ఉన్నాయి. ఈ సుదీర్ఘ ఆరుమాసాల కాలంలో రాహుల్ గాంధీ తన దృష్టిని కేంద్రీకరించారు. తన పార్టీలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల జనాభాను కూడా తన వైపు ఆకర్షింపచేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇతర విపక్షాలు కాంగ్రెస్ ఛత్రం కిందకు రావడానికి నిరాసక్తంగా ఉన్నాయి. ఒకవేళ కర్ణాటకను కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగితే మళ్లీ ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. మోదీ, అమిత్షా ఎన్నికల ప్రచారకులు, రాజకీయవేత్తలు మాత్రమే కాదు, ఎన్నికల నిర్వహణలో ఎన్నో మెలకువలు తెలిసిన నిపుణులు. 2014 లోక్సభలో కాంగ్రెస్కు వచ్చిన 44 స్థానాలను చూసి వారు ఆచితూచి మాత్రమే తృప్తి పొందుతున్నారు. ఆ ఎన్నికలలో బీజేపీ 17 కోట్ల ఓట్లు సాధించింది. 11 కోట్ల ఓట్లు సాధించుకున్నా కూడా కాంగ్రెస్ దారుణమైన ఫలితాలను దక్కించుకుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన కొన్ని అంచనాల ప్రకారం 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న కూట మిగా ఎన్టీయేనే ముందంజలో ఉంది. అయితే కాంగ్రెస్ ఓట్లు కనుక గత ఎన్నికలలో వచ్చిన 11 కోట్లను మించి 13 కోట్లకు చేరితే అప్పుడు ఎన్డీయే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది జరగకూడదనే మోదీ, అమిత్షా పోరాడుతున్నారు. భారతదేశంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఎదురవుతున్నప్పటి నుంచి (1984) ఏర్పడుతున్న సంకీర్ణాలలో ఒక తర్కాన్ని నేను గమనిస్తున్నాను. అది టెన్నిస్లో చెప్పే బెస్ట్ ఆఫ్ నైన్ సెట్స్ తర్కం. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయాల తలరాతలను మారుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (2014లో తెలంగాణ సహా), మధ్యప్రదేశ్, బిహార్, రాజస్తాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాజకీయ క్రీడలో టెన్నిస్ ఆటలో వలెనే తొమ్మిది సెట్లు. ఈ తొమ్మిదింటిలో ఏ ఐదు రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీ లేదా సంకీర్ణం ఆధిక్యం చూపగలిగితే అదే దేశాన్ని ఏలగలుగుతుందన్నదే నా వాదన. ఈ అన్ని రాష్ట్రాలలో కలిపి 351 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఒక పార్టీ అందులో 200 స్థానాలు గెలిస్తే చాలు. చిన్నా చితకా పార్టీలను చేర్చుకోగలిగితే 272 స్థానాల వరకు సాధించవచ్చు. కానీ 2014 ఎన్నికలలో మోదీ, షా ఇలాంటి విశ్లేషణకు కాలం చెల్లిందని నిరూపించారు. వారు కేవలం 272 స్థానాలు మాత్రమే కాదు, 282 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సీట్లు అప్పుడు ఎలా వచ్చాయో గమనిస్తే, ఇప్పుడు బీజేపీ నేతల కలతకు కారణం తెలుస్తుంది. అప్పుడు 282 స్థానాలు వచ్చాయంటే మధ్యప్రదేశ్లో రెండు మినహా మిగిలిన అన్ని సీట్లు, రాజస్తాన్లో మొత్తం సీట్లు వచ్చాయి. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 42 దక్కాయి. ఉత్తరప్రదేశ్లో 80కి 70 స్థానాలు, బిహార్లో 40 స్థానాలకు గాను 31 స్థానాలు లభిం చాయి. గుజరాత్లో అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. జార్ఖండ్, చత్తీస్గడ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి చిన్న చిన్న రాష్ట్రాల స్థానాలు మొత్తం బీజేపీకి వచ్చాయి. అయితే ఈసారి క్లీన్స్వీప్లు అసాధ్యమని బీజేపీ నేతలకు తెలుసు. ఆఖరికి గుజరాత్లో కూడా కొన్ని స్థానాలు నష్టపోవచ్చు. మోదీ మళ్లీ ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడం వల్ల గుజరాతీయులు తమ అశాంతిని మరిచిపోయి ఓట్లు వేసినప్పటికీ సీట్లు తగ్గుతాయి. ఆ కోణం నుంచి ఇప్పుడు ఇండియా మ్యాప్ను పరిశీలిస్తే 272 ప్లస్ స్థానాలు రావడం గగనమన్న సంగతి తెలుస్తుంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (శివసేన దూరం కావడంతో), ఉత్తరప్రదేశ్లలో కూడా బీజేపీ సీట్లు కోల్పోతుంది. అయినప్పటికీ తక్కువ మెజారిటి సాధించిన బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీయేకే అధికారం రావచ్చునని చెప్పవచ్చు. అలాగే ఇప్పటికి కాంగ్రెస్ను అధికార పీఠం మీద చూసే అవకాశం కనిపించడం లేదు కాబట్టి ఆ పార్టీని మన్నించమని కోరాలి. æఆరుమాసాల క్రితం కనిపించిన చిత్రం ప్రకారం తక్కువ మెజారిటీ సీట్ల బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీయే వస్తుంది. అదొక అస్పష్ట చిత్రం. కానీ ఇప్పుడు అదే స్పష్టమైన చిత్రం. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మధ్య తరగతి ప్రజలే లోకువ
జాతిహితం గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగవేతదారు లను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు. తరతరాలుగా కాసాబ్లాంకా సంస్కృతి విస్తరిస్తున్నది. ఆ కారణంగా దానికి సంబంధించినవే శిలాక్షరాల వంటి రెండు పంక్తులతో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ భారత మధ్య తరగతి ప్రజానీకానికి ఏం ఒరగబెట్టిందనే విషయం చెప్పవచ్చు. రిక్ కేఫ్ అమెరికన్ ఉదంతం సందర్భంలో కెప్టెన్ రెనాల్ట్ అనే ఎందుకూ కొరగాని పోలీసు చెబుతాడు చూడండి, ‘ఎప్పుడూ పట్టుకునే అనుమానితులనే పట్టు కోండి!’ అని. అలాగే జరిగింది. భ్రష్టత్వం వల్ల కావచ్చు, రాజకీయం ప్రయోజనాలతో ఓట్ల కోసం డబ్బును వెదజల్లడం వల్ల కావచ్చు– మన ప్రభుత్వానికి నిరంతరం డబ్బుకి కొదవే. ప్రభుత్వం ఎప్పుడూ ఈ దురదృష్టకర మధ్య తరగతి మీదే పడుతుంది. మరీ ముఖ్యంగా వేతనాల మీద ఆధారపడి జీవించే ఉద్యోగులే కనిపిస్తూ ఉంటారు. వీళ్లని ఎంతవరకు వీలుంటే అంత వరకు ఊపిరి సలపకుండా చేసేయవచ్చు. వీళ్ల గురించి మాట్లాడేవారు లేరు. ప్రజా ప్రతినిధులు లేరు. అలాగే వీరందరికీ సమంగా వర్తించే ఏకసూత్రం కూడా ఏదీ లేదు. అలా వాళ్ల మెడ పట్టుకుని, వెనక ఒక్క తన్ను తన్నితే చాలు వారి నుంచి ఏదైనా సరే కక్కించవచ్చు. పైగా రాజ కీయాలకు వచ్చిన ప్రమాదం కూడా ఏమీ ఉండదు. పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం ఒకవేళ వారి నుంచి ఏదైనా పెద్ద ఆరోపణ వస్తే, అది పేదందరికి దృశ్యానం దపు తృప్తిని కలిగించేదే అవుతుంది. ప్రస్తుత వాతావరణంలో ఈ పరిస్థితిని పెద్ద నోట్ల రద్దు తరహా రాజకీయం అని పిలవవచ్చు. ఏదో ఒకటి నాటకీ యంగా చేయాలి. అది పేదల దగ్గరకు తీసుకెళ్లి, ఆ చర్యతో వారు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేటట్టు చేయాలి. నేను చెప్పేది కొంచెం ఓర్పుగా వినండి, ధనవంతులు ఎంతగా నష్టపోతున్నారో మీకు అవగాహన లేదు. అయితే వాస్తవానికి ధనికులు ఎప్పుడూ దెబ్బతినరు. అది వేరే విషయం. పేదలు నమ్ముతారు. వారిలో గందరగోళం అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఇక మధ్య తరగతినైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు గాయ పరచవచ్చు. ఈ బడ్జెట్ మన స్మృతిపథంలో ఎంతోసేపు ఉండదు. అది వెంటనే వార్తాకథనం కూడా కాలేదు. అందులో చాలా విషయాలు 2019 సంవత్సరం వేసవిలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక తయారయ్యే వరకు కూడా మనని వెంటా డుతూనే ఉంటాయి. కానీ స్టాక్, బాండ్ల మార్కెట్లో మారణహోమం సృష్టిస్తూ ఇవాళ మాత్రం సజీవంగానే ఉంది. మార్కెట్ విధ్వంసక అత్యవసర బడ్జెట్గా వెళ్లింది కాబట్టి, ఇది దాదా ప్రణబ్ ముఖర్జీ పునరావృత ఒడాఫోన్ సవరణ తరగతికి చెందుతుంది. చాలా విషపూరితం. ఆయన తరువాత ఇద్దరు ఆర్థికమంత్రులు బడ్జెట్లు సమర్పించిన ఆరేళ్ల కాలంలో కూడా శస్త్ర చికిత్స చేసేటప్పుడు ధరించే గ్లోవ్స్ ధరించి కూడా అలాంటి బడ్జెట్ జోలికి మాత్రం వెళ్లలేదు. బ్యాంకు నగదు లావాదేవీలపై పన్ను, సెక్యూరిటీల లావాదేవీల మీద పన్ను, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ను తిర గరాసిన పన్నులను కూడా వెంటపెట్టుకుని వచ్చిన పి. చిదంబరం బడ్జెట్ కూడా మార్కెట్లను కకావికలు చేసింది. పైన ముగ్గురు ఆర్థిక మంత్రులలో ఆయన కూడా ఒకరు. మధ్య తరగతి మదుపునకు దెబ్బ కానీ ఈ బడ్జెట్ చేసిందేమిటంటే, మధ్య తరగతి మదుపులకు దశాబ్దంగా ఉన్న భద్రత మీద దాడి. మధ్య తరగతికి ఎటూ పాలుపోని పరిస్థితిని కల్పిం చింది. ఇదంతా నేను బిజినెస్ స్టాండర్డ్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, ఆర్థిక వ్యవస్థ విశ్లేషకుడు టీఎన్ నైనన్ మాటల ఆధారంగా రాస్తున్నాను. ఆయన షేర్ల మీద దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్ పన్నును ఉపసంహరించుకోమని గట్టిగా కోరారు. 2017, జనవరి 6న ఆయన నిర్వహించిన వారాంతపు జ్ఞాపకాల కార్య క్రమంలో ఈ విషయం గురించి వాదించారు. లోటును తగ్గించాలని ఆర్థిక మంత్రి కోరుకుంటే ఈక్విటీ ప్రాఫిట్ల మీద పన్ను విధించడం తప్ప మరో మార్గం లేదని నైనన్ చెప్పారు. ఆర్థికమంత్రి కూడా నైనన్ సలహా విలువైన దని గ్రహించారు. లోటును తగ్గించడానికి ఆయన సూచించిన విధానం బల మైనదని కూడా గుర్తించారు. ఈ అంశాన్నే నేను మరో కోణం నుంచి వివరి స్తున్నాను. ఆ కోణం పరిశీలించడానికి అనువైనది కూడా. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మొదటిగా ఒక ప్రశ్న. ఆర్థిక విధానంలో ఎదరుయ్యే పరిణామాలతో, ఎగుడు దిగుళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఒక ప్రభుత్వం ఎన్నికల రాజకీ యాల కోసం ప్రజాధనం యథేచ్ఛగా వెచ్చించగలదా? అలాగే తన ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించగలదా? అలా అని నేను పేదల అనుకూల పథ కాలను లేదా రాయితీలను విమర్శించడం లేదు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి ఒక వికృత ఆలోచన ఒక సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తిలో 1 నుంచి 2 శాతం పెరుగుదలకు మంగళం పాడింది. అక్కడితో ఆగకుండా చిన్న చిన్న వ్యాపారులకు నష్టం చేయడంతో పాటు ఎన్నో ఉద్యోగాలను ఊడ గొట్టింది. దీని వెనుక ఉన్న ఆర్థికపరమైన ప్రతిపాదన లక్షలాది మందిని అధికారిక ఆర్ధిక వ్యవస్థ నుంచి అనధికార ఆర్థిక వ్యవస్థకు నెట్టింది. ఆర్థికవేత్త కౌశిక్ బసు ఆర్థికసర్వేలో ప్రత్యేకంగా కనిపించే కొన్ని వాక్యాలను కను గొన్నారు. అవి పెద్ద నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని అంగీకరించేవి. ముందు తీసుకున్న విధాన పరమైన చర్యల ప్రభావం అదృశ్యం కావడమే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత మందగమనానికి కారణమని 2017–18 ఆర్థిక సర్వేలో చెప్పడమంటే పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదమని అంగీకరించడమేనని కౌశిక్ ట్వీట్ చేశారు. తరువాతి వాదన లేదా ప్రశ్న రాజకీయాలకు సంబంధించినది. మధ్య తరగతిని ప్రభుత్వాలు (ఒక్క బీజేపీ ప్రభుత్వాలే కాదు, మొత్తం అన్ని ప్రభు త్వాల గురించి) అంత కర్కశంగా చూడడానికి కారణం వారి వెనుక ఎలాంటి లాబీ లేకపోవడమే. అలాగే ఎన్నికలను నిర్దేశించే ఎలాంటి శక్తి వారి వద్ద లేకపోవడం కూడా. ఈ తరహా బడ్జెట్ మీ రాజకీయాల వరకు సానుకూల మైనదే కావచ్చు. కానీ పేదలను ఒప్పించగలగాలి. అలాగే రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కావలసినంత వెచ్చిస్తామని చెప్పాలి. ఎందుకంటే వారికి కూడా ఓటు హక్కు ఉంది. మీ ప్రభుత్వాన్ని ఓట్లతో ముంచెత్తిన మధ్య తరగతికి నష్టం జరగకుండా అదనపు పరిహారాలు ఇవ్వాలి. కొన్ని గణాంకాలు మన విశ్లేషణలో కనిపిస్తాయి. అందులో ఒక అంశం– కేవ లం 1.7 శాతం భారతీయులు ఆదాయపు పన్ను చెల్లిస్తారు. 2015–16 నాటి అంచనాల అధికారిక సమాచారంలో ఈ విషయం పేర్కొన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో, అదికూడా అత్యధికంగా మధ్య తరగతి ఉన్న దేశంలో ఈ విషయం భయంకరంగా అనిపిస్తుంది. దీనిని మరో ప్రశ్న రూపంలో చెప్పవచ్చు. అంటే దేశంలో వంద శాతం పన్నును ఈ 1.7 శాతమే చెల్లిస్తున్నారా? పన్ను చెల్లింపుదారులు ఇంతేనా? గొప్ప ప్రభుత్వం ఆ 1.7ను గొప్పగా విస్తరింపచేయడానికి ఏదో ఒకటి చేయాలని ఇది సూచిస్తుంది. ఆ క్రమంలో మొదటి తెలివైన చర్య పెద్ద నోట్ల రద్దు అని భావించారు. తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. కానీ ఆశించిన పెరుగుదల ఏదీ? వాస్తవానికి ఈ ఒక్క లక్ష్య సాధనలోనే అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఫలితంగా, పెద్దమొత్తంలో పన్ను ఎగ వేతదారులను, లేదా పన్ను చెల్లించని కోట్లాదిమందిని పట్టుకోవడానికి బదులుగా దాచుకోవడానికి తమవద్ద ఏదీ లేని వారిపైనే దాడిచేయడా నికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వేతన జీవులు తమ పొదుపులను ఎక్కడ పెడతారు? ఎందుకంటే వారివద్ద నగదు లేదు. వీరు ఆస్తుల కొనుగోళ్లవైపు అడుగు పెట్టడం కష్టం. పైగా ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో ఆస్తులు తమ విలువను వేగంగా కోల్పోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా వడ్డీ రేట్లను తగ్గించివేశాయి. కానీ ఈ బ్యాంకులే తాము అప్పులిచ్చినవారికి ఈఎమ్ఐ రేట్లను తగ్గించడానికి పూనుకోవడం లేదు. ప్రభుత్వాలలాగే దురాశాపూరితమైన బ్యాంకులు కూడా భారీస్థాయి ఎగవేతదారులు ధ్వంసం చేసిన బ్యాలెన్స్ షీట్లను మళ్లీ పూరించుకోవడానికి నివాస గృహాలు, విద్య, వాహనాలను ఆశించే మధ్యతరగతి డిపాజిట్దారులు, రుణగ్రహీతలపైనే కన్నేస్తున్నాయి. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం 2004లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ల తక్షణ పతనానికి కారణమైనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆర్థికమంత్రులు తరచుగా చెప్పే మాటలనే వల్లె వేశారు. నేను బడ్జెట్ను రైతుకోసం రూపొం దించాలా లేక బ్రోకర్ కోసం రూపొందించాలా? అప్పుట్లో నేను దీనిపై వ్యాఖ్యానిస్తూ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇకపై రైతు వెర్సెస్ బ్రోకర్గా ఉండకూడదని, అది ఇక నుండి రైతు, అలాగే బ్రోకర్లాగా కూడా ఉండాలని రాశాను. ఎందుకంటే వ్యవసాయం, ద్రవ్యమార్కెట్లు ఒక దాన్నొకటి నిషేధిం చుకోవడం లేదు. అందుకే చిదంబరం బడ్జెట్ తర్వాత అనేక దిద్దుబాట్లకు గురైంది. పలు నష్టనివారణ చర్యలు చేపట్టింది. జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ కూడా దాన్నే అనుసరించాల్సి ఉంటుంది. భారతీయ మధ్యతరగతి దాదాపుగా పట్టణ స్వభావంతో కూడి ఉంటోంది. గుజరాత్ ఎన్నికల్లో మాదిరి అది ఇప్పటికీ నరేంద్రమోదీ పట్ల అభిమానం చాటుతోంది. గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని మధ్యతరగతికి అందించకుండా, దానినుంచి అదనపు వసూళ్లకు పూనుకుంటున్నప్పటికీ ఆ వర్గం మోదీ పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూనే ఉంది. ఇప్పుడు పొదుపులను నిరుత్సాహపరుస్తున్న ప్రభుత్వ చర్య మధ్య తరగతికి మరింత గాయాన్ని కలిగిస్తోంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupt -
నేరంపై కులం ముద్రా!?
జాతిహితం దిగువ కులాలు, ముస్లింలలో అవినీతి, నేరగ్రస్తత సాధారణమని భావించడం సహేతుకమేనా? లేక పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు ఈ వ్యవస్థ అణగారినవారి పట్ల చాలా అన్యాయంగా ఉంటున్నదా? ఒకే కేసులో నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుంటే, శిక్షపడ్డ సుఖరామ్కు జైలుకు వెళ్లకుండానే గడిచిపోతోంది. అంటే, బంగారు లక్షణ్ను జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్కు రాజకీయ పునరావాసం కల్పించడం సాధ్యమేనని అర్థం. అవినీతి, నేరగ్రస్తతలకూ, కులానికి లేదా మతానికి ఏదైనా సంబంధం ఉన్నదా? లేకపోతే, కులాల నిచ్చెన మెట్లపై కిందకు దిగే కొద్దీ మీరు అవినీతికి పాల్పడి (పట్టుబడి) కేసులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయా? వాస్తవాలేమిటో చూద్దాం. 2–జీ కుంభకోణం కేసులో దోషిగా పదిహేను నెలలు విచారణలో ఉన్న ఖైదీగా జైల్లో గడిపి, ఆరేళ్లు విచారణను ఎదుర్కొన్న ఎ. రాజాను నేడు నిర్దోషిగా తేల్చారు. ఆయన దళితుడు. పార్టీలో ఆయన సహ నేత, కేసులో సహ నిందితురాలైన కనిమొళిని కూడా అలాగే నిర్దోషి అని తేల్చారు. ఆమె కూడా వెనుకబడిన కులాలకు చెందినవారే. మధు కోడా (బొగ్గు కుంభకోణంలో ఇటీవలే శిక్ష పడింది), శిబూ సోరెన్ (లంచం తీసుకోవడం, హత్య కేసులను చివరకు కొట్టివేశారు) ఇద్దరూ ఆదివాసులు. ఇక మాయావతి దళిత మహిళ. లాలూప్రసాద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ ఓబీసీలు. వీరు ముగ్గురు అవినీతి లేదా లెక్కకు మించిన ఆస్తుల కేసుల్లో దొరికినవారు. ఎప్పటికప్పుడు అప్పటి రాజకీయాలను బట్టి ఈ కేసులు ముందుకు వస్తూ, మరుగున పడిపోతూ ఉంటాయి. అధికారంలో ఉన్న పెద్దలు ఎప్పుడు వారు నోళ్లు మూయాలని లేదా వారి ఆమోదం కావాలని అనుకుంటే అప్పుడు ఆ కేసులను పతాక శీర్షికలకు ఎక్కించే కొత్త సినిమా తయారవుతుంది. ఆ రాజకీయ లక్ష్యం ఏదో నెరవేరిన వెంటనే ఊహించినట్టుగానే అది మరుగున పడిపోతుంది. అతి సుదీర్ఘ కాలపు శిక్షను (పదేళ్లు) అనుభవిస్తున్న హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓమ్ ప్రకాశ్ చౌతాలా జాట్ కులస్తుడు, వెనుకబడిన కులాలకు చెందినవారు కారు. అయినప్పటికీ, కులాల అంత స్తులలో ఆయన కులం సవర్ణుల కంటే దిగువన ఉండేదే. పట్టుబడేవారంతా దిగువ కులాల నేతలే 2008 నాటి పార్లమెంటులో ఓటుకు నోట్లు కుంభకోణాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూడండి. రాజ్దీప్ సర్దేశాయ్, సుధీంద్ర కులకర్ణి (అప్పట్లో అద్వానీకి సన్నిహితుడు) ఒకప్పుడు సీఎన్ఎన్–ఐబీఎన్ కోసం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఫలితమది. ఫగ్గన్సింగ్ కులాస్తే, అశోక్ అర్గాల్, మహవీర్సింగ్ భరోగాలు అందులో ఇరుక్కున్నవారు. వారంతా ఎస్సీ/ఎస్టీలే. అంతకు ముందటి స్టింగ్ ఆపరేషన్లో నోటుకు ప్రశ్న కుంభకోణం వెలుగు చూసింది. అందులో ఇరుక్కున్న 11 మంది ఎంపీలు 2005లో పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దాదాపు వారంతా ఎస్సీ/ఎస్టీలే. వారిలో ఆరుగురు బీజేపీకి, ముగ్గురు బీఎస్పీకి, ఒకరు కాంగ్రెస్కు, ఒకరు ఆర్జేడీకి చెందిన వారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అగ్ర కులాలకు చెందిన సుప్రసిద్ధ ప్రజా ప్రతినిధులు కూడా లేకపోలేదు. సుఖ్రాం, జయలలిత, సురేష్ కల్మాడీలను చెప్పుకోవచ్చు. అయితే వాళ్లు చాలా కొద్ది మందే. వారికి కేసుల నుంచి తప్పిం చుకునే అవకాశాలూ ఎక్కువే. లేకపోతే వారి కేసులు ఎంతకాలమైనా సాగుతూ పోతూనే ఉంటాయి. వాస్తవం ఏమిటో చూడండి: సుఖ్రామ్ పరుపు కింద డబ్బు దొరికినా, శిక్షపడ్డా ఆయన ఎన్నడూ జైలు శిక్ష అనుభవించాల్సి రాలేదు. ఇప్పుడు 90ల వయసులో ఉన్న ఆయన సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్వాది. బీజే పీని కౌగలించుకుని నేడు ఆ పార్టీలో పునరావాసాన్ని పొందారు. ఎన్నికలకు ముందు ఆయన పార్టీ ఫిరాయించారు. ఆయన కుమారుడు అనిల్ బీజేపీ ఎంఎల్ఏ. బహుశా హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి కూడా కావచ్చు. బీజేపీలో చేరితే రాజాకుగానీ, ఆయన పిల్లలకు గానీ ఆలాంటి భాగ్యం కలుగుతుందని మీరు ఆశించగలరా? అవినీతి పట్ల నా ‘‘కులతత్వవాద’’ దృష్టిపై విరుచుకు పడటానికి ముందు మీరు దయచేసి నాలుగు వాస్తవాలను చూడండి. ఒకటి, సుఖ్రామ్, రాజా ఇద్దరూ వారు టెలికాం మంత్రులుగా ఉండగానే వారిపైన అవినీతి ఆరోపణలను మోపారు. రెండు, సుఖ్రాంకు శిక్షపడగా, రాజాను వదిలిపెట్టారు. మూడు, ఒకరి వద్ద ఆయన పరుపు కిందనే డబ్బు దొరికింది. మరొకరివద్ద విచారణ సాగించిన న్యాయమూర్తి వెటకారంగా ప్రశ్నించినట్టుగా డబ్బు ఎక్కడుందీ? డబ్బు దొరకలేదూ అంటే ఇక అవినీతి ఎక్కడిది? కాబట్టి, నిర్దోషిగా ప్రకటించారు. ఇక నాలుగో వాస్తవం అత్యంత ముఖ్యమైనది. సుఖ్రామ్ బ్రాహ్మణుడు. ఆయన ఏదో ఒకసారి దారి తప్పి ఉంటారంతే. అలాంటివాళ్లు సాధార ణంగా అవినీతికి పాల్పడరు. ఇక రాజా అంటే దళితుడు. అలాంటి వాళ్ల నుంచి అంత కన్నా ఎక్కువ ఏం ఆశించగలరు? అధికారాన్ని, బాధ్యతలను వాళ్లు సక్రమంగా నిర్వహించలేరు అంతే. సాధారణంగా అనుమానించాల్సినవారు వారే. కులాన్ని బట్టే కటకటాలు లెక్కించాలా? ఇక ఇప్పుడు బీజేపీకి చెందిన ఒక ఆసక్తికరమైన ఓ కేసును పరిశీలిద్దాం. రెండు భిన్న సందర్భాల్లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు లంచం పుచ్చుకుంటూ కెమెరాకు దొరికిపోయారు. ఒకరు, దిలీప్సింగ్ జాదవ్. 2003లో రూ. 9 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఆయన అగ్ర కులస్తుడు. బీజేపీ సంతోషంగా ఆయనకు పునరావాసం కల్పించి తిరిగి ఎన్నికల్లో నిలబెట్టింది. ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించారు. పైగా ‘‘డబ్బే దేవుడు కాదు, ఆ దేవుని సాక్షిగా చెబుతున్నా డబ్బు దేవుని కంటే తక్కువదేం కాదు’’ అంటూ కెమెరాకు చిక్కారు. వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడు జూనియర్ మంత్రిగా ఉన్న ఆయన లంచం ఇచ్చే వ్యక్తితో కలసి బ్లాక్ లేబుల్ సీసాను ఖాళీ చేస్తూ చెప్పారీ మాట. మరొకరు తెహల్కా స్టింగ్ ఆపరేషన్లో (2001) కేవలం రూ. 1 లక్ష తీసు కుంటూ పట్టుబడ్డ బంగారు లక్ష్మణ్. జాదవ్ కేవలం జూనియర్ మంత్రే. కానీ బంగారు లక్ష్మణ్ నాటి బీజేపీ జాతీయ అధ్యక్షులు. అయితేనేం, ఆయన ముందుగా ఒక దళితుడు. నేటికి కూడా బీజేపీలో అంత ఉన్నత స్థాయికి చేరిన ఒకే ఒక్క దళితుడు ఆయనే. ఆ పార్టీ ఆయనతో తమకు సంబంధం లేదంది, ఖండించింది, పార్టీ నుంచి వెళ్లగొట్టింది, ఏకాకిని చేసింది. ఆయన జైలుకు వెళ్లారు. ఆ తెహెల్కా కేసుల్లో తనంత తాను ఒంటరిగా పోరాడుతూనే మర ణించారు. ఆ స్టింగ్ ఆపరేషన్లో జైలుకు వెళ్లిన ఏకైక నేత ఆయనే. జాదన్ను ఇంకా కాపాడుకుంటూనే వస్తున్న ఆ పార్టీ లక్ష్మణ్ను అంటరానివాడన్నట్టు గానే చూసింది. ఇది దురదృష్టకరమైన అభివర్ణనే అయినా అలా చెప్పక తప్పడం లేదు. ఈ వాదనను మీరు న్యాయవ్యవస్థకు విస్తరింపజేయాలం టారా? మన ప్రధాన న్యాయమూర్తులలో ఎక్కువ మంది అవినీతిపరులని చాలా మందే పరోక్షంగా సూచించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆ ఉద్యమంలోని పలువురు ప్రము ఖులు సైతం అలా అన్నారు. కానీ పేరు పెట్టి దాడిని ఎక్కుపెట్టింది ఎవరి పైన? జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఒక్కరిపైనే. ఆయన దళితుడు. దశాబ్ది దాటినా నేటికీ ఆయనకు వ్యతిరేకంగా కనిపెట్టింది ఏదీ లేదు. వ్యవస్థలోనే ఉన్న పక్షపాతం ఈ విషయాన్ని మరింతగా శోధిద్దాం. వృత్తిపరమైన ఓ చిన్నపాటి పొరపాటు చేసినందుకు... ఉన్నత న్యాయస్థానంపట్ల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డందుకు జైలుకు వెళ్లిన ఏకైక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కన్నన్. ఆయన దళితుడు. గణనీయులైన ముగ్గురు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చినా వారు ఏ మచ్చా అంటకుండా బయటపడ్డారు. ఈ మూడు కేసులనూ సమాధి చేసేశారు. ఒక కేసులోనైతే, ఆ ఆరోపణల గురించి మాట్లాడటానికే వీల్లేదని మీడియాపై నిషేధం విధించేంత వరకూ కూడా ఒక హైకోర్టు వెళ్లింది. ముగ్గురిలో ఇద్దరు సుప్రీం కోర్టు చేరగా, ఒకరు పదవీ విరమణానంతరం చేపట్టగల ఒక ఉన్నత పదవిని అలంకరిం చారు. చివరగా ఒక్క మాట చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరూ కింది కులాలకు చెందిన వారు కారు. కాబట్టి సాధారణ అనుమానితులు కారు. ఇది, సామాజిక వ్యవస్థ అనే గోపురంలోని శిఖరాగ్ర భాగం ఒక నియ మంగానే ‘‘ఎక్కువ పరిశుద్ధమైనది’’గా ఉండటం ఫలితం కావచ్చా, లేక దిగువ సగ భాగం పట్ల ఈ వ్యవస్థ బాగా అన్యాయంగా ఉండటం ఫలితం కావచ్చా? మన దేశంలో పదవులు ఉద్యోగాల వంటి స్థానాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ముస్లింల సంఖ్య వారి జనాభాతో ఏమా త్రం పొంతన లేకుడా అతి తక్కువ సంఖ్యలో ఉన్నది. ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసిన సచార్ కమిటీ నివేదిక సైతం అదే విషయాన్ని తెలిపింది. జనాభాతో పొంతన లేకుండా ముస్లింలు ఎక్కువగా ఉన్నది ఒక్క జైళ్లలోనే. కాబట్టి హిందువుల కంటే ముస్లింలలో నేరగ్రస్తులయ్యే ధోరణి ఎక్కువగా ఉంటుందా, లేక వ్యవస్థ వారి పట్ల బాగా అన్యాయంగా ఉన్నదా? ‘ఐసీ తైసీ డెమోక్రసీ’ (పరిహాసాస్పద ప్రజాస్వామ్యం) అనేది బాగా ప్రాచుర్యం పొందిన రంగస్థల ప్రదర్శనల్లో ఒకటి. మన దేశంలో హత్య నేరానికి ఉరిశిక్షను అనుభవించేవారిలో అత్యధికులు మైనారిటీలు లేదా దిగువ కులాల వారేనని ఆ రాజకీయ వ్యంగ్య ప్రదర్శన మనకు గుర్తుచేస్తుం టుంది. ఒక బ్రాహ్మణున్ని ఉరితీస్తామంటే వారు కత్తులు నూరుతారు, అతగాడు ఎవరినో కాదు మహాత్మా గాంధీనే హత్య చేసినా సరే. కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. అవినీతి, నేరగ్రస్తతల విషయంలో జన్యు పరమైన అంశాల ప్రభావం ఏమైనా ఉంటుందా? లేకపోతే ఈ వ్యవస్థ... పోలీసులు, న్యాయమూర్తుల నుంచి మీడియా, ప్రజాభిప్రాయం వరకు బడు గులకు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారినవారి పట్ల బాగా అన్యా యంగా ఉంటున్నదా? పోలీసు కాల్పులకు గురయ్యే లేదా జైళ్లలో జనాభాతో పొంతన లేకుండా ఎక్కువ సంఖ్యలో ఉండే ఆఫ్రికన్–అమెరికన్ల సంఖ్యను చూడండి. కొన్ని చోట్ల జాతి అనేది మన దేశంలోని కులం స్థానంలో నిలు స్తోంది. కొన్ని మైనారిటీలు, ఆదివాసులు కూడా మన దేశంలో అదే కోవకు చెందుతుండటంతో ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. ఈ పక్షపాతం కొనసాగుతూనే ఉంటుంది. నిర్దోషిగా తేలిన రాజాను ఇంకా దొంగగానే చూస్తుండగా, శిక్షపడ్డ సుఖరామ్ జైలుకు వెళ్లకుండా ఈ వ్యవస్థ కాపాడు తుంది. అంటే, బంగారు లక్షణ్ను ఒంటరిగా జైల్లో మగ్గుతూ చావమని వదిలేసినా, జాదవ్కు రాజకీయ పునరావాసం కల్పించగలుగుతుందని కూడా అర్థం. ఇలాంటి చేదు ఆలోచనలతో మీ క్రిస్మస్ వారాంతాన్ని పాడు చేస్తు న్నందుకు మన్నించండి. వాస్తవం ఏమిటో సరిచూసుకోవడానికి మంచి సమయం అంటూ ఏదీ ఉండదు. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
బీజేపీ ఆందోళనతో మునివేళ్లపై నిలుచుంది!
ఆర్థికపరమైన తప్పుడు చర్యలు, అధ్వానమైన స్థానిక నాయకత్వం, రిమోట్ కంట్రోలు పరిపాలన విఫలం కావడం కలసి నల్లేరు మీద బండిలా సాగిపోవాల్సిన గుజరాత్ ఎన్ని కల్లో బీజేపీ గందరగోళపడటానికి కారణమయ్యాయి. రాహుల్ ఆ మేరకు విజయం సాధించారు. సమరాన్ని ఆయన ప్రత్యర్థి భూభాగంలోకి తీసుకుపోయారు. లోక్సభలో 46 సీట్లున్న పార్టీ నేతపైన దాడి చేయడానికే బీజేపీ తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నది. ఇది బీజేపీ తన కోసం తాను రచించుకున్న కథనం కాదు. మీరు గుజరాత్కు మళ్లి వచ్చారా? అక్కడ గాలిని బట్టి మీరు పసిగట్టింది ఏమిటి? అక్కడేమైనా మార్పు రానున్నదా? ఇవే నేటి ‘‘ట్రెండింగ్’’ (సోషల్ మీడియాలో హోరెత్తుతున్న) ప్రశ్నలు. వీటిలో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం తేలిక... లేదు, ఇప్పటికింకా నేను గుజరాత్ వెళ్లలేదు. ఇక పసి గట్టడానికి వస్తే, నాకు అలా వాసన పసిగట్టగల ఘ్రాణేంద్రియ శక్తులు లేవు. అలాంటి శక్తులున్న కుక్కలంటే నాకు ఇష్టమే, కానీ నేను వాటిలో ఒకణ్ణి కాను. కాకపోతే నేను చేయగలిగినది... రాజకీయ పార్టీల చర్యలను, ప్రతిస్పందన లను, ముఖ కవళికలను, అవి నొక్కి చెప్పే వాటినీ, వాటి ఎత్తుగడలు, వ్యూహాలు, లక్ష్యాలు, ప్రచార పదజాలం, వ్యాకరణాలు, నియమ నిబంధనల్లో వస్తున్న మార్పుల అంతరార్థాన్నీ విప్పి చదవగలను. వాటిని బట్టే గుజరాత్లో ఇప్పుడు వీస్తున్న గాలి మార్పును సూచిస్తున్నదో లేదో చెబుతాను. డిసెంబర్ 18న ఫలితం ఎలా ఉన్నా... నేడు బీజేపీ 2014 తర్వాత ఎన్నడూ ఎరుగని విధంగా ఆందోళనతో మునివేళ్లపై నిలిచిన స్థితిలో ఇరుక్కుంది. ఆత్మస్థయిర్యం కోసం వెతుకులాట బీజేపీ వారు గుజరాత్ గురించి ఆందోళనతో ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రద ర్శిస్తున్న నూతన నిబద్ధతను, ప్రజలను ఆకర్షించడాన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నారు. తమ పట్ల క్షేత్ర స్థాయిలో, ప్రత్యేకించి యువతలో ఆగ్రహం ఉన్నదనే వాస్తవాన్ని వారు గుర్తిస్తున్నారు. తమ కీలక కుల సమీకరణలు, ప్రత్యే కించి పటేళ్లకు సంబంధించినవి ‘‘గందరగోళం కావడం’’ గురించి వాపోతున్నారు. స్థానిక నాయకత్వం అసమర్థతను గురించి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. 2013 శీతాకాలంలో ఆ పార్టీ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఎన్నడూ ఇలాంటి స్థితిలో ఉండటాన్ని మనం చూడలేదు. బీజేపీలో ఏ ఒక్కరూ తాము ఓడిపోతామని అస్పష్టంగానైనా అంగీకరిం చడం లేదా సూచించడం చేయడం లేదు. ఆహా, మేం గుజరాత్ను పోగొట్టు కోలేం. మోదీజీ, అమిత్బాయ్ అలాంటి ఉపద్రవాన్ని జరగనిస్తారనే అను కుంటున్నారా? ఇప్పుడు చూడండి, నరేంద్ర భాయ్ ప్రచారం సాగిస్తున్నారు. 22 ఏళ్లు అధికారంలో ఉన్నందువల్ల ఓటర్లు ఆగ్రహంతో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటర్లను అందరినీ పోలింగ్కు తీసుకురాగల సాధనసంపత్తి ఉందని మీరు నిజంగానే భావిస్తున్నారా? ఓటింగ్ బూత్ సమరంలో అమిత్ భాయ్ వాళ్లను ఓడిస్తారు. ఆయన నిర్మించిన యంత్రాంగాన్ని చూడండి అంటూ బీజేపీ వారు నొక్కి చెబుతున్నారు. ఇవన్నీ ప్రతికూలమైన స్థితిలో ఒక విధమైన ఆత్మస్థయిర్యాన్ని తెచ్చుకోవడానికి చెప్పుకునేవే. మోదీ–షా హయాంలో బీజేపీ పోరాడిన ఇతర ఎన్నికలకంటే గుజరాత్ ప్రచారం భిన్నమైనది. ఈ పోరాటంలోనే వారు పైకి బలహీనుల్లా కనిపించ కుండా పోటీలో ముందున్నవారిలా, అధికారంలో ఉన్న వారిలా పోరాడుతు న్నారు. 2013లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో తప్ప, అన్ని ఎన్ని కల్లోనూ వారు అధికారంలో ఉన్నవారిని సవాలు చేశారు. పంజాబ్లో ఆ పార్టీ జూనియర్ భాగస్వామిగా, గోవాలో మరింత చిన్న భాగస్వామిగా ఉంది. కాబట్టి వాటిని వదిలేస్తున్నాను. గుజరాత్లో ఇందుకు భిన్నంగా, బీజేపీ పెద్ద బరువును లేదంటే తనకు వ్యతిరేకంగా భగ్గున మండగల రెట్టింపుస్థాయి అధికార పార్టీ వ్యతిరేకతను మోసుకుంటూ పోరాడుతోంది. ఆ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికా రంలో ఉండ టమే కాదు. నరేంద్ర మోదీ, అమిత్ షాలే రెండు చోట్లా ప్రభు త్వానికి, పార్టీకి కూడా నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ప్రతి దానిలోనూ, గుజరాత్లో లాగే ఈ నూతన నాయకత్వమే నేతృత్వం వహి స్తోందనీ, ఇది నేటి వాస్తవికతని బీజేపీ నేతలు వాదించొచ్చు. కానీ ఇది మాత్రమే పూర్తి వాస్తవం కాదు. ప్రధాని, పార్టీ అధినేత ఇరువురూ గుజరాత్ నుంచి వచ్చి నవారు. వారు రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్లో తాము సాధించిన వాటిని చూపించే దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లను మెప్పించిన వారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నట్టుగా రాష్ట్రాన్ని దృఢంగా పాలించినవారు. అనుకున్నది జరగలేదా? వారు అనుకున్నదానికి అనుగుణంగా ఇక్కడ జరిగినట్టు లేదనేది స్పష్టమే. పార్టీ హైకమాండ్ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉన్నా మూడేళ్లలో రాష్ట్రం దారి తప్పిపోయింది. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. వర్తకం, వస్తు తయారీ కార్యకలాపాలతో ఊపు మీదున్న ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. యువత కలత చెందుతుండటం అర్థం చేసుకోగలిగినదే. మూసపోత కథనా లకు భిన్నంగా గుజరాతీ యువత ఎన్నడూ రాజకీయంగా విధేయమైనదిగా లేదా ప్రశ్నించడం తెలియనిదిగా లేదు. అత్యవసర పరిస్థితికి ముందటి కాలంలో, నవనిర్మాణ్ ఉద్యమం ఇక్కడ కాళ్లూనుకోగలిగింది. తర్వాత, 1985లో మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించిన వెంటనే మొదటి నిరసన ప్రదర్శన జరిగింది గుజరాత్లోనే. గుజరాత్లోని ఏ అసంతృప్తి విష యంలోనైనా జరిగేదే అప్పుడూ జరిగింది. కులపరమైన అల్లర్లు మతపరమైన అల్లర్లుగా మలుపు తీసుకున్నాయి. హిందీ మాట్లాడే ప్రధాన భూభాగం మాత్రమే రాజకీయంగా అస్థిరమైన దని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. గుజరాత్లో బహుశా ఇద్దరు నేతలు.. చిమన్భాయ్ పటేల్, నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పాటూ అధి కారంలో ఉండటం అందుకు కారణం కావచ్చు. హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ల వంటి కుల బృందాల యువ నేతలు నేడు వెలుగు లోకి వచ్చారు. ఇది, గతంలో మనం చూసిన గుజరాత్ రాజకీయాల సిని మాకు తర్వాతి భాగం. మోదీ, షాలు కేంద్రంలోకి వెళ్లడంతో అధికారంలో ఏర్పడ్డ శూన్యాన్ని వారు పూరించారు. బలమైన నేతల హయాంలో రెండు తరాల గుజరాతీలు సుఖమయ జీవితాన్ని గడిపారు. ఆ ఏర్పాటును మెచ్చిన వారు ఇప్పుడు అది లేని లోటు గురించి చింతిస్తూ ఉండవచ్చు. మోదీ ముఖ్య మంత్రిగా ఉండగా పార్టీ హైకమాండ్ ఏ ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ముందుగా ఆయనను పిలిపించుకునేది. అలాంటి ముఖ్యమంత్రి వారికి నేడు లేరు. ఏది ఏమైనా, రిమోట్ కంట్రోల్ పాలన ఎప్పుడూ కాంగ్రెస్ న మూనాగానే ఉండేది తప్ప, బీజేపీదిగా ఉండేది కాదు. రాష్ట్రంలో పార్టీ ఆకర్షణ శక్తికి కేంద్ర స్థానం ఢిల్లీకి మారడంతో గందరగోళం ఏర్పడింది. పార్టీ అక్కడ గ్రూపులుగా, వైరి వర్గాలుగా చీలిపోయి ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి, అది ఆందోళనతో ఉండటంలోనూ ఆశ్చర్యం లేదు. వికాసం మరచి, అజెండా మార్చి.. ‘గుజరాత్ నమూనా’ వాగ్దానం 2014లో నరేంద్ర మోదీని అధికారం లోకి తెచ్చింది. ఆయన హయాంలో గుజరాత్లో పారిశ్రామిక, వ్యవసాయ, మౌలి కవసతుల రంగాలు మునుపెన్నడూ ఎరుగని విధంగా వృద్ధి చెందాయి. చెప్పుకోదగిన పాలనాపరమైన సంస్కరణలు, ఆవిష్కరణలు జరిగాయి. ప్రత్యేకించి విద్యుత్తు, నీటిపారుదల రంగాల్లో అవి చోటు చేసుకున్నాయి. వ్యాపారవేత్తల నుంచి ఆయన ప్రభుత్వానికి గొప్ప ప్రశంసలు, ఆమోదమూ లభించాయి. సంక్షోభపూరితమైన యూపీఏ రెండో దఫా పాలనలో ఐదేళ్లను వృధాగా కోల్పోయిన దేశం మోదీకి ఓటు చేసింది. 2002 నాటి గుజరాత్ అల్లర్ల జ్ఞాపకాలను పక్కకు నెట్టింది. ప్రత్యర్థులు ‘వినాశ్ పురుష్’ (వి«నాశకా రుడు)గా పిలవడానికి అలవాటుపడ్డ మోదీని ‘వికాస్ పురుష్’ (అభివృద్ధిని సాధించేవాడు) అనే కొత్త అవతారంలో దేశం ఆమోదించింది. మోదీ-బీజేపీలు సాగిస్తున్న ప్రచారంలో గత రెండు వారాలుగా అదృశ్యమైనది ఒక్కటే... ‘వికాస్’. ‘గుజరాత్ నమూనా’ ఆయనకు మూడు దశాబ్దాలుగా ఎవరికీ లభించనంతటి ఆధికారాన్ని కట్టబెట్టింది. అయితే, గుజరాత్ ఎన్నికల అజెండాలోనే అది కీలకమైనదిగా లేకుండా పోయింది. రాహుల్ గాంధీ, ఆయన నిర్లక్షంతో చేసే తప్పులు, ఆయనకు ఔరంగజేబు, ఖిల్జీ గుర్తింపును అపాదించడం, నెహ్రూ, బాబ్రీ/అయోధ్య సమస్యపై సుప్రీం కోర్టులో కపిల్ సిబల్ ఏం అన్నారు అనేవి అజెండాలోకి ఎక్కాయి. ఎవరికీ అంతుపట్టని పాత పాకిస్తాన్ సైనికాధికారులు కమాండో–కామిక్ చానళ్లలో తిరిగి ప్రత్యక్షమై కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా అహ్మద్ పటేల్కు మద్దతు తెలపడం, మైనారిటీల పట్ల, గాంధీ కుటుంబ వారసత్వం పట్ల వ్యతిరేకతా వాదంతో అది తిరిగి తన సొంత గుర్తింపునకు (‘నా పక్షం, నా ప్రత్యర్థుల పక్షం’) తిరిగి చేరుకుంది. దాదాపుగా ఇది 2002 నాటికి తిరిగి పోవడమే. ‘‘మియా ముషర్రాఫ్’’ అనే వేడుకోలు మాత్రమే తక్కువ. ఇదే మార్పు. మన ఎన్నికల రాజకీయాల్లో, ప్రచారంలో, ఓటర్ల పట్ల అనుసరించే వైఖరిలో కీలకమైన తేడాను తెచ్చే అంశం ప్రభుత్వ వ్యతిరేకత. బలీయమైన, రెండింతలు అధికారం (రాష్ట్రంలో, కేంద్రంలో) ఉన్న పార్టీ ప్రతి పక్షంలాగా బలహీనశక్తిగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీలా పోరాడటం జరుగుతున్న అరుదైన సందర్భం ఇది. కాంగ్రెస్ గత మూడు దశాబ్దాలుగా ఓడిపోతూనే ఉన్నా, దానికి రెండుగా చీలిపోయి ఉండే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ నమ్మకంగా వచ్చే ఓట్ల శాతం దాదాపు 40 శాతంగానే ఉంటోంది. కాబట్టి అది అక్కడ ఎప్పుడూ ఒక శక్తిగానే ఉంది. పాత ప్రచార రికార్డులను, ప్రత్యేకించి 2007, 2012, 2014 ఎన్నికలవి చూడండి. మోదీ ప్రచారంలోని కేంద్రీకరణ ప్రత్యర్థులపై నుంచి తన ప్రభుత్వం సాధించిన వాటిపైకి మరలుతూ వచ్చింది. దాంతో పాటే ఆయన అధికారం వృద్ధి చెంది, సంఘటితమైంది. ఆర్థికపరమైన తప్పుడు చర్యలు, అధ్వానమైన స్థానిక నాయకత్వం, రిమోట్ కంట్రోలు పరిపాలన వైఫల్యం కలసి నల్లేరు మీద బండిలా సాగిపోవాల్సిన రాష్ట్రంలోనే బీజేపీలో ఈ గందరగోళానికి కారణమయ్యాయి. డిసెంబర్ 18 ఫలితం సంగతి ఎలా ఉన్నా, రాహుల్ ఆ మేరకు విజయం సాధించారు. సమరాన్ని ఆయన ప్రత్యర్థి భూభాగం లోకి తీసుకుపోయాడు, ఇంతవరకు తనను చూస్తున్న దాని కంటే తాను గట్టి ప్రత్యర్థినని బీజేపీ గుర్తించేలా చేశారు. బలాధిక్యతగల, శక్తివంతమైన పార్టీ బీజేపీ లోక్సభలో కేవలం 46 సీట్లున్న పార్టీ నేతపైన దాడి చేయడానికే తన పూర్తి కాలాన్ని వెచ్చిస్తున్నది. ఇది బీజేపీ తన కోసం తాను రచించుకున్న కథనం కాదు. అందుకే అది ఆగ్రహంగా, ఆందోళనగా ఉంది. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
తండ్రి చేసిన తప్పులే చేస్తూ...
ఉదారవాదం, దూకుడైన లౌకికవాదాలతో పాటూ మృదువైన జాతీయవాదాన్ని, మతవాదాన్ని ప్రదర్శించగలిగిన శక్తి కాంగ్రెస్కు ఉంది. బీజేపీది రాజ్యాంగపరంగా కట్టుబడక తప్పని లౌకికవాదాన్ని ధరించిన కరడుగట్టిన హిందుత్వవాదం, కఠిన జాతీయవాదం, ఏ జంకూలేని బహిరంగ మతాచరణవాదం. అవతలి పక్షం బలాల విషయంలో ఏ పక్షమూ సురక్షితం కాదు. ఏ ఉన్మాదం ఆవహించి రాహుల్ బీజేపీకి బలమైన అంశాలపైనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా? అని ఆశ్చర్యం కలుగక తప్పదు. నేటి ‘యువ’తరం మనకు ఎన్నటికీ అంతుపట్టే బాపతు కాదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన, తన మతాచరణపై చీల్చి పోగులు పెట్టే (త్రెడ్బేర్ ఇంగ్లిష్ పద ప్రయోగంతో జంధ్యం ధరించడం అనే శ్లేషార్థాన్ని వాడారు). చర్చను కోరుకుంటారో లేదో, లేకపోతే అది ఇçప్పుడే ఆయన చేజారిపోయిన చర్చేమో కచ్చితంగా చెప్పలేం. ఎలా జరిగినా ఆయన , ఆయన పార్టీ రాజ కీయాల్లోని తదుపరి అధ్యాయం ఇప్పుడే తయారైంది. కొంత కాలంపాటూ నిలిచేదిగానే ఈ అధ్యాయాన్ని రచించారు. ఆయన జంధ్యం ధరించి, కాల కృత్యాలను తీర్చుకునే సమయంలో ఎలా పద్ధతి ప్రకారం దాన్ని చెవికి చుట్టుకుంటారో తెలిపే ఫొటోలను సోషల్ మీడియాలో ప్రదర్శించినంత మాత్రాన లేదా తన మత స్వీకారం జరిగే రోజును ప్రకటించి, ఫొటోల సాక్ష్యా ధారాలను చూపినంత మాత్రాన నాటకీయంగా ఇది ముగిసిపోయేది కాదు. లేదంటే సోమనాథ్ దేవాలయం సందర్శకుల రిజిస్టర్లోని సంతకాలను ప్రదర్శించడం లాంటి బీజేపీ జిత్తులతో రుజువు చేసుకోవడంతో సమసి పోయేదీ కాదు. రాహుల్ కొత్త రాజకీయ క్రీడ ఈ కథ అంతత్వరగా, నాటకీయంగా ముగిసేది కాకపోవడానికి కారణం సరళమైనదే: రాహుల్ మతం లేదా మతాచరణ ఎన్నడూ జాతీయ రాజకీ యాల్లో చర్చనీయాంశం కాలేదు. ఆయన తల్లి విదేశీ పుట్టుక కారణంగా, ఆమె విషయంలో కొంతవరకు ఇలాంటి సమస్య తలెత్తింది. మరి రాహుల్ మాటేమిటి? ఆయన ఏ దేవుడ్ని ప్రార్థిస్తాడని గానీ, లేదా అసలు ప్రార్థన చేస్తాడా అనిగానీ, ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? లౌకికవాదానికి స్థిరమైన, సైద్ధాంతిక నిర్వచనం లేదనేది సమంజసమైన వాదనే. నెహ్రూ అజ్ఞేయవాదం (దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేమనే వాదం) నుంచి వాజ్పేయి మృదువైన, వ్యక్తిగతమైన, భావజాల రహితమైన, అన్నిశాఖలనూ కలుపుకుని పోయే విశాల మతవాదం వరకూ, మోదీలాగా రాజ్యాంగపరమైన పరిమితుల వల్ల నామమాత్రంగా లౌకికవాదానికి కనీస ఆమోదాన్ని తెలపడం వరకూ లౌకిక వాదం రకరకాలుగా ఉండొచ్చు. తనదైన సొంత లౌకికవాదంతో పూర్తి హిందుత్వకు సయోధ్యను సాధించడం కోసం మోదీ నిరంతరం విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. మీరు కచ్చితమైన నాస్తికులు అయ్యేట్టయితే లౌకికవాదం మీ కోసం కాదు. కాబట్టే లౌకికవాదంపై చర్చను మత విశ్వాసులకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. భారతీయుల్లో 98 నుంచి 99 శాతం వరకు మత విశ్వా సులేనని ప్రజాభిప్రాయ సేకరణల్లో పదే పదే తేలింది. ఇంతవరకు మన జాతీయ రాజకీయాల్లో మతం గురించి వచ్చిన వాదనలు ఇవి: మీరు మీ రాజకీయాల్లో మతాన్ని వాడుకోగలరా/ వాడుకుం టారా, లేదా? అన్ని మతాల అనుయాయులను మీరు సమానంగా చూస్తారా? ఏదో ఒకదానికి కట్టుబడాల్సి వచ్చినప్పుడు మీరు ప్రాధాన్యమి చ్చేది... రాజ్యాంగానికి కేంద్ర స్థానంలోని లౌకికవాదానికా లేక మీ మత భావ జాలానికా? మతం పేరిట మీరు ఓట్లు అడుగుతారా? అనేవే. అంతేగానీ, మీరు దేవుడ్ని నమ్ముతారా, లేదా? నమ్మేట్టయితే, ఎవర్ని నమ్ముతారు? ఎంత తరచుగా ప్రార్థనకు వెళతారు? మీ మతస్తులు పాటించాల్సిన ఆచారాలు, కర్మ కాండలు ఏవో మీకు తెలుసా/వాటిని పాటిస్తారా? పాటిస్తుంటే నాకు ఆధా రాలు చూపండి? అనేవి ఎన్నడూ పెద్ద ప్రశ్నలు కాలేదు. దేవుడు ఉన్నాడో లేడోననే నెహ్రూని, విగ్రహారాధనకు వ్యతిరేకులైన ద్రవిడ పార్టీలను, వామ పక్ష నాస్తికులను, అలాగే కాషాయాంబరధారులైన సాధువులు, మహంతులు, సిక్కు, ముస్లిం మత గురువులను పదే పదే ఎన్నోమార్లు ఎన్నుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మతం కీలకమైనదిగా మారింది. పంజాబ్లో అకాలీ దళ్కు సిక్కులు ఓటు బ్యాంక్ అయితే, కేరళలో ముస్లింలీగ్ ముస్లింలను, కాంగ్రెస్ క్రైస్తవులను ఓటుæ బ్యాంకులను చేసుకున్నాయి. హైదరాబాద్లోని ఓ చిన్న ప్రాంతంలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి కూడా ఇలాగే ఓటు బ్యాంకుంది. కానీ, ఎవరైనా ఎప్పుడైనా రాహుల్ మతం లేదా మతాచరణ గురించి పట్టిం చుకున్నారా? కొత్త ఆట బొమ్మ (సెల్ఫోన్)లో ట్వీటర్ ట్రాల్స్ను (ఉద్దేశ పూర్వక దూషణలతో కూడిన వ్యాఖ్యలు) చదివి, వాటిని సీరియస్గా పట్టిం చుకునే బాపతైతే తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఏ సమరంలోనూ చేయకూడని తప్పు సైనిక, రాజకీయ, క్రీడా రంగాల్లో సాగే ఏ సమరంలోనైనా... ప్రత్యర్థికి బలమైన అంశాలుగా ఉన్నవాటితో పోరాటానికి దిగకండి, మీ బలమైన అంశాలేవో వాటితోనే పోరాడండి అనేది ప్రథమ నియమం. కాంగ్రెస్, బీజే పీల మధ్య ఈ సమీకరణం తగినంత స్పష్టంగానే ఉంది. ఒకరిది ఉదార వాదం, దూకుడైన లౌకికవాదాలతో పాటూ తేలికపాటి జాతీయవాదాన్ని, అలాగే మతవాదాన్ని కూడా బహిరంగంగా ప్రదర్శించగలిగిన శక్తి. మరొకరిది రాజ్యాంగపరంగా కట్టుబడక తప్పని లౌకికవాదాన్ని ధరించిన కరడుగట్టిన హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, ఏ జంకూ లేని, బహిరంగ మతా చరణవాదం. అవతలి పక్షం బలాల విషయంలో వీటిలో ఏ పక్షమూ సుర క్షితం కాదు. ఏ ఉన్మాదం ఆవహించి రాహుల్ గాంధీ, ఆయన సలహాదారులు బీజేపీకి బలమైన అంశాలపైనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారా? అని మీకు ఆశ్చర్యం కలుగక తప్పదు. కర్మికజె (రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ యుద్ధ విమానాల ఆత్మాహుతి దాడులు) రోమాంచకమైన సాహస చర్యే. మీ సాహసం గురించి ప్రజలు తరతరాలు చెప్పుకుంటారు. కానీ, అది జరిగేది మీరు యుద్ధంలో ఓడిపోయాక, మీరు పోయాక. 2014 తర్వాతి భారతంలో జాతీయవాదానికి ఇచ్చిన కొత్త నిర్వచనంలో మతాన్ని విజయవంతంగా కలగలిపేయగలిగారు. కాబట్టి రాహుల్ కొన్ని దేవాలయాలను సందర్శించడం వాస్తవికవాద దృష్టితో ఈ కొత్త నిజాన్ని అంగీకరించడంగా కనిపిస్తుంది. మీరు మాకు ఎన్నడూ ఓటు వేయనప్పుడు అధికారంలో వాటా కోసం మా వద్దకు ఎందుకు వస్తారు అనే వాదనతో మైనారిటీలను అధికారపు చట్రాలకు దూరంగా ఉంచారు. హిందూ ఓటర్లలో తగినంత ఎక్కువమందే దాన్ని ఆమోదించారు. కాబట్టి నేనూ హిందువునే అని ప్రకటించుకోవడం తప్ప మీరు మరేం చేయగలరు? ఎందుకీ బహిరంగ మతాచరణ? సమస్య ఇప్పటికే ఆలయాల సందర్శనను లేదా సోమనాధ దేవాలయ రిజిస్టర్లో సంతకం చేయడాన్ని మించిపోయింది. ఆలయ సందర్శన రాజకీయమైనదైనా ఫర్వాలేదు. అదిప్పుడు చిన్న అంశంగా మారిపోయింది. నేను మత విశ్వాసిని గనుక అన్ని ఆరాధనాస్థలాలకు వెళతాను. మీ మతం మీ వ్యక్తిగత విశ్వాసమని నమ్ముతాను, అలాగే హిందూ మతమూ నాకు అంతే, ఇతరుల్లా నేను దాన్ని బహిరంగంగా ప్రదర్శించను అని రాహుల్ అని ఉంటే ఈ చర్చ మరో దిశకు మళ్లేది. 22 ఏళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తన మతాచరణను ఒక ప్రచారాం శాన్ని చేయాలనుకోవడం చవకబారు, దిక్కుతోచక చేసిన ట్రిక్కు. మరోపక్క, రాహుల్ మతం గురించి ప్రశ్నించినందుకు ఆగ్రహోదగ్రు డైన రణ్దీప్ సింగ్ సుర్జేవాలా... ఆయన బ్రాహ్మణుడే కాదు, జంధ్యం ధరిం చినవాడు అని చెప్పాడు. అంటే జంధ్యం ధరించడం మిమ్మల్ని సరైన హిందు వును చేస్తుందా? బ్రాహ్మణ కర్మకాండలనన్నిటినీ పాటిస్తూ, మత సంకే తాలను ధరించిన హిందువులనే మన దేవతలు కటాక్షిస్తారా? ఇదే గనుక హిందు మతానికి అర్హత అయ్యేట్టయితే, మన దేశంలోని కోట్లకు కోట్ల ప్రజలు మతానికి బాహ్యులై మతభ్రష్టులవుతారు. సిక్కు, ఇస్లాం తదితర మతాలకు భిన్నంగా హిందూమతం ఎలాంటి మత చిహ్నాలను ధరించమనీ పట్టు బట్టదు. ఇందిరా గాంధీ 1977లో ఓటమి పాలయ్యే వరకు వారి వంశం తమ మతాచరణను ప్రైవేటు వ్యవహారానికే పరిమితం చేసింది. ఆ ఓటమి, అంతకు మించిన విషాదకరమైన ఘటన సంజయ్ గాంధీ మరణం కలసి ఆమె వైఖరిలో మార్పును తెచ్చాయి. రుద్రాక్ష మరింత స్పష్టంగా కనిపించ సాగింది. ఆమెలోని అభద్రతలపై కొందరు తాంత్రికులు పట్టుసాధించారు. అయినాగానీ ఆమె ఎన్నడూ తన కొత్త మతాచరణను బహిరంగంగా ప్రద ర్శించలేదు, ఆమెను ఎవరూ ఎలాంటి ప్రశ్నలూ అడగనూ లేదు. రాజీవ్ గాంధీ హయాంలోనే పెద్ద మార్పు వచ్చింది. మౌల్వీల ఒత్తిడికి లొంగి షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కకు నెట్టి, చట్టాన్ని సవరించడం ఆయన చేసిన మొట్టమొదటి తప్పు. మధ్యే మార్గాన్ని అను సరించే హిందువులకు అది దిగ్భ్రాంతి కలిగించింది. లోక్సభలో రెండు సీట్లకు క్షీణించిన బీజేపీకి కొత్త ఊపిరి పోసింది. ముస్లింలను సంతృప్తిపరచడం అనే వాదనకు విస్తృతంగా ఆదరణ లభించింది. బహుశా దీనికి ప్రతిచర్యగానే కావచ్చు రాజీవ్ ఆ తర్వాత వరుసగా తప్పులు చేశారు. బాబ్రీ మసీదు– రామజన్మభూమి స్థలం తాళాలను తెరిపించారు. రామరాజ్యాన్ని తెస్తా నంటూ అక్కడి నుంచే 1989 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్ని కల్లో కాంగ్రెస్ 414 స్థానాల నుంచి సగం కంటే తక్కువకు దిగజారింది. ముస్లింల ప్రధాన ఓటు బ్యాంకును కోల్పోయి, బీజేపీకి ఎదురు చూస్తున్న అవకాశాన్ని అందించింది : కులం చీల్చిన వారిని ఐక్యం చేయడానికి మతాన్ని వాడటం అది ప్రారంభించింది. ఆ ఓటమి నుంచి కాంగ్రెస్ ఇక ఎన్నడూ కోలుకోలేదు. ఆ సమయంలోనే ఎన్నో కేసులు రాజీవ్ను చుట్టుముట్టాయి. కానీ ఆయన చేసిన అసలు పాపం... షాబానో కేసులో చేసినదే. అదే ఆయనకు లౌకిక–ఉదారవాద మత బోధకుని స్థాయిని కట్టబెట్టింది. బెంబేలెత్తిపోయి ఆయన అతి దిద్దుబాటును చేపట్టి, ముస్లింల (అయోధ్యలో ముప్పును చూసిన) మద్దతును కోల్పో యారు. మధ్యేవాద మార్గ హిందువులను బీజేపీకి కానుకగా అందించారు. బీజేపీకి బలమైన అంశాలపైన పోరాటానికి దిగడమే ఆయన చేసిన ఘోర మైన తప్పు. రాహుల్ అదే తప్పు చేయదలచుకుంటే అదే చరిత్ర ఇప్పుడూ పునరా వృతం అవుతుంది. జంధ్యం ధరించడం తదితరాలన్నీ అయన స్వేచ్ఛగా చేయవచ్చు. ఆయన వయసు వచ్చిన వాడు, తన పార్టీకి అధిపతి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘చేతి’వాటమున్నా రక్షణ బాగే
మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్ షీట్ ఖాళీగానే ఉంది. మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. మరో సాయమేదీ లేకుండా ఎన్నికలలో విజయం సాధించిన ఘనతను చరిత్రలో నమోదు చేసుకున్నది బొఫోర్స్ గన్ ఒక్కటే. ఈ యంత్రాంగం వెనుక ఎవరో ఒకరు ఉన్నారని అనడం మనకీ ఇష్టమే కాబట్టి, ఆ విషయం పరిగణనలోకి వస్తుంది. ఆ వ్యక్తి వీపీ సింగ్. లక్ష్యం గుండా చూస్తే ఆయనే కనిపిస్తారు. 1988లో అలహాబాద్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో వీపీ సింగ్ గెలుపొందారు. అప్పుడే రాజీవ్గాంధీని శంకరగిరి మన్యాలు పట్టిస్తానన్న తన సవాలు అమలుకు శ్రీకారం చుట్టారాయన. అలహాబాద్ గ్రామీణ ప్రాంతాలలో మోటార్సైకిల్ మీద ప్రయాణిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఆగి సూటిగా మాట్లాడేవారు. ఆయన సందేశం సాధారణమైనదే. మీ ఇళ్లు దోపిడీ అయిపోతున్నాయి! ఎలా అంటారా? మీరు ఓ బీడీ కట్ట లేదా అగ్గిపెట్టె కొంటారు. అందులో కొన్ని అణాలు పన్ను పేరుతో ప్రభుత్వం దగ్గరకు చేరతాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నడిపినా, పాఠశాలలు నిర్వహించినా ఆఖరికి మీ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసినా ఆ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బుతోనే. కానీ మీరు ప్రభుత్వానికి చెల్లించిన ఆ డబ్బులో కొంత అపహరణకు గురవుతున్నది. దీనిని మీరు ఇల్లును దోచేయడం అనక ఇంకేమంటారు? ఈ మాటలతో పాటు ఆయన జత చేసిన ఇంకో రెండు అంశాలు మినహాయిస్తే అంతవరకు బాగానే ఉంది. ఆ రెండు అంశాలలో మొదటిది– మామూలుగా రాజకీయ పరిధిలో ఉపయోగించే అతిశయోక్తే– బొఫోర్స్ చోరుల జాబితా నా కుర్తా జేబులోనే ఉంది. నేను అధికారంలోకి వచ్చేదాకా వేచి చూడండి ఏం జరుగుతుందో! అనేవారు. రెండో అంశం: తమకు ఇచ్చిన తుపాకులు వెనుక నుంచి పేలుతున్నాయని మన సైనికులు అవాక్కయ్యేవారు. శత్రువులకు బదులు తమనే చంపుతున్నాయని బిత్తరపోతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి మాటలను ఎవరూ నమ్మరు. కానీ ఈ మాటలతో ప్రజలు బాగా వినోదించేవారు. బొఫోర్స్ రగడ మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. బొఫోర్స్ ముడుపుల కేసులో ఎవరినీ పట్టుకోలేదు. ఎవరికీ శిక్ష కూడా పడలేదు. కానీ అప్పుడు దర్యాప్తు పేరుతో బయటకు వచ్చిన కథలన్నీ కాలగర్భంలో కలిశాయి. ఆ గన్ మాత్రం చాలా బాగా పనిచేసింది. కార్గిల్ ఘర్షణ సమయంలో భారత్కు పరువు దక్కిందంటే బొఫోర్స్ గన్ వెనక్కి పేలడం వల్ల కాదు. ఇప్పటికీ ప్రధానంగా ఉపయోగపడుతున్న ఆయుధం అదే. అయితే, ఈ ముప్పయ్ ఏళ్లలో ఒక్క బొఫోర్స్ తుపాకీ కొనుగోలు కోసం కూడా మళ్లీ ఆర్డర్ వెళ్లలేదు. ఇటీవల కాలంలో ధనుష్ వంటి తుపాకుల తయారీకి ప్రయత్నాలు చేసినా, ఒక్క తుపాకీ కూడా తయారుచేసుకోలేదు. బొఫోర్స్ సృష్టించిన గలభా అలాంటిది. అసలు భారతదేశ రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఉల్లిపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడిన పల్లెటూరి మూఢుడి కథలా ఉంటుంది. ఎలాంటి శిక్ష కావాలో నీవే తేల్చుకొమ్మని పంచాయతీ చెప్పింది. ఆ శిక్షలు– వంద చెప్పుదెబ్బలు తినడం, లేదా వంద ఉల్లిపాయలు తినడం. ఈ మూఢుడు మొదట వంద ఉల్లిపాయలు తిని శిక్షని అనుభవిస్తానని చెప్పాడు. కానీ పది తినేసరికే ఘాటుకు తట్టుకోలేకపోయాడు. మళ్లీ తూనాబోడ్డు, చెప్పుదెబ్బలే తింటానన్నాడు. పది దెబ్బలు పడేసరికి తట్టుకోలేక, లేదు లేదు ఉల్లిపాయలే తింటానన్నాడు. అలా, అవి కాదని ఇవి, ఇవి కాదని అవి – మొత్తానికి రెండు శిక్షలు అనుభవించాడు. 1977 తరువాత రక్షణ పరికరాల సేకరణలో భారత్ అనుసరించిన తీరుతెన్నులను చెప్పడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది. ఆ సంవత్సరాన్ని మైలురాయిగా తీసుకోవడం ఎందుకంటే, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినది అప్పుడే. అలాగే భారత్ సోవియెట్ రష్యా ఆయుధాలే కాకుండా ఇతర దేశాల ఆయుధాలు తీసుకోవడం మొదలుపెట్టినది కూడా అప్పుడే. జనతా ప్రభుత్వం అన్వేషించిన తొలి ఆయుధ వ్యవస్థ ఆంగ్లో–ఫ్రెంచ్ జాగ్వార్. కానీ, వైరి సంస్థల ఏజెంట్లు వార్తలు పుట్టించడంతో ముడుపులు చేతులు మారాయంటూ వెంటనే గోల మొదలయింది. అప్పుడే గ్రీన్ హౌస్ జర్నలిజం పుట్టుకొచ్చింది కూడా. రక్షణ కొనుగోళ్ల గురించి వార్తలు రాయడమే గ్రీన్హౌస్ జర్నలిజం. జాగ్వార్ కూడా వివాదాస్పదంగా మారింది. దాని శక్తి సామర్థ్యాలను గురించి మొదట్లో ఊహించిన స్థాయికి అది ఏనాడూ చేరలేదు. ఇలాంటి వ్యవస్థకు సంబంధించినంత వరకు శక్తిసామర్థ్యాలతో ఉన్న విమానం ఏదీ అని అడిగితే ఐఏఎఫ్ 100 – ప్లస్ జాగ్వార్ అనే సమాధానం. ఈ నాలుగు దశాబ్దాల తరువాత కూడా దీని ఘనతను ఇది నిలుపుకుంటూనే ఉంది. ఇందిర అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ సోవియెట్ రష్యా దగ్గర కొనుగోళ్లు ప్రారంభించారు. మళ్లీ రాజీవ్గాంధీ అధికారంలోకి వచ్చి సమీకరణలలో గణనీయంగా మార్పులు తెచ్చే వరకు ఇదే కొనసాగింది. ఈ విషయం ఇప్పుడు ఘనంగా చెప్పవలసినదేమీ కాదు. కానీ బొఫోర్స్ తరం ఆగ్రహానికి గురి కావలసి వస్తున్నా, నేను కచ్చితంగా చెప్పే వాస్తవం ఒకటి ఉంది. మన చరిత్రలో త్రివిధ దళాల ఆధునీకరణ ప్రయత్నమంటూ జరిగినది– ఇందిర–రాజీవ్ల హయాములలోనే. స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్ కేటాయిం పులు నాలుగు శాతానికి మించినది వారి పాలనా కాలంలోనే. మామూలుగా ఈ కేటాయింపు రెండు శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్నది నియమం. రాజీవ్ ఫ్రాన్స్ నుంచి మిరాజ్ –2000 విమానాలు, స్వీడన్ నుంచి బొఫోర్స్ శతఘ్నులు, మిలన్, మాట్రా (ఫ్రెంచ్)ల నుంచి క్షిపణులు, జర్మనీ నుంచి టైప్–209 తరహా జలాంతర్గాములను కొనుగోలు చేశారు. అయితే ప్రతి కొనుగోలు మీద ఏదో రూపంలో కుంభకోణం ఆరోపణ వచ్చింది. దీనితో ప్రతి ఆయుధ వ్యవస్థ కొనుగోలు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలీ చేసుకోలేదు. ఇతర దేశాలతో కలసి ఉత్పత్తి సాగించలేదు. సంతృప్తికరమైన స్థాయి రక్షణ సామర్థ్యాన్ని గుర్తించే యత్నమే కనిపించదు. అయితే సోవియెట్ రష్యా నుంచి కూడా రాజీవ్ పెద్ద ఎత్తున రక్షణ కొనుగోళ్లు చేశారు. బీఎంపీ యుద్ధ వాహనాలు, కొత్త కిలో జలాంతర్గాములు, అణు జలాంతర్గామిని (మొదటి చక్ర) లీజుకు తీసుకున్నారు. వీటన్నిటికీ ఆయన చెల్లించిన మూల్యం, తాను అధికారం కోల్పోవడం. ఈ కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని నేను పందెం వేసి మరీ చెబుతాను. కుంభకోణాలున్నాయని కూడా అంటాను. కానీ ఈ చేదు నిజం ఉన్నప్పటికీ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు భారత్ కనుక యుద్ధానికి వెళితే, యుద్ధరంగంలో అధికంగా కనిపించే ఆయుధాలు ఇందిర, రాజీవ్ పాలనా కాలాలలో దిగుమతి చేసుకున్నవే అయి ఉంటాయి. లేదంటే పీవీ నరసింహారావు కాలంలో దిగుమతి చేసుకున్నవయినా అయి ఉంటాయనడం వాస్తవం. నిస్తేజంగా బీజేపీ హయాం ఇదొక నిష్టుర సత్యం. ఇది మనసులను గాయపరుస్తుంది కూడా. రక్షణ పరికరాల సేకరణలో బీజేపీ ప్రభుత్వం రికార్డు అత్యంత నిరాశాజనమైనది. యుద్ధ సమయంలో అత్యవసరంగా చేసినవి తప్ప, శవపేటికల కొనుగోళ్ల కుంభకోణం (ఇది పూర్తిగా ఊహాజనితమైనది) దెబ్బ తగిలిన వాజపేయి చేసిన కొనుగోళ్లు చాలా తక్కువ. మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది మాత్రం యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు పరిశీలిస్తే మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్ షీట్ ఖాళీగానే ఉండిపోయింది. మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. రాఫెల్ దిగుమతికి బీజేపీ ప్రభుత్వం సంతకాలు చేసిన ఒప్పందం కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఇది మోదీని అశాంతికి గురి చేయవచ్చు. నేను గాని, నా ప్రభుత్వం గాని ఎలాంటి తప్పు చేయలేదని (నేనుగాని, నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి తప్పు చేయలేదని రాజీవ్ చెప్పినట్టు కాకుండా) మోదీ ధైర్యంగా అనగలరా? సు–30 విమానాలు 20 ఏళ్ల క్రితానివి. అంటే భారత వైమానికి దళం ప్రాధాన్యం లేని శక్తిగా మారుతుంది. మిగిలిన రెండు దళాల విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపాలి. రాఫెల్ మీద జరుగుతున్న చర్చ కూడా పాత పంథాలోనే సాగుతోంది. ఇందులో మరీ హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానం బదలీ అన్నమాట. ఆరు దశాబ్దాలుగా, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇతర రక్షణకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలు అనేక సాంకేతిక విజ్ఞాన బదలీలతో దిగుమతి చేసుకున్న వ్యవస్థలను ఒకచోట చేర్చి కూర్చాయి. అయినప్పటికీ ఒక్క హెలి కాప్టర్ని మినహాయిస్తే, ఈ సూక్ష్మబుద్ధితో కూడిన సాంకేతిక విజ్ఞాన బద లీలలో ఏ ఒక్కదాన్నయినా ఉపయోగించి మనకు ఉపయోగపడగల ఏ వ్యవస్థనూ ఇవి తయారు చేయలేకపోయాయి. ఉదాహరణకు, ఇన్ఫాంట్రీ రైఫిల్స్, భుజాన ఉంచుకుని కాల్పులు జరిపే లేదా మ్యాన్–ప్యాడ్ క్షిపణులు, పొరలుపొరలుగా ఉండే జాకెట్లు, ఇతర ప్రాధమిక సామగ్రి కొనుగోలు కోసం కోసం మనం ఇప్పటికీ ఆర్డర్ చేస్తున్నాం, రద్దు చేస్తున్నాం. బహుశా రాజీవ్ గాంధీ చేపట్టిన సాహసంతో కూడిన నిర్ణయాలను మోదీ చేపట్టి, 1980ల నాటి స్పర్థ కోసం రక్షణరంగ ఆధునీకరణను ప్రారంభించవచ్చు. లేదా బల గాల స్థాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, జీ జిన్పింగ్, జనరల్ క్వామర్ బజ్వాలను పిలిపించి, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్ సమస్యను పరిష్కరించుకుని, మిగిలిన భారత్ రక్షణకోసం, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లాగా, అమెరికన్/ నాటోతో ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆవిధంగా జీడీపీలో 1 శాతానికి భారత రక్షణ రంగ బడ్జెట్ను పరిమితం చేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక్క శాతం కూడా ఎందుకు? ఎందుకంటే దేశం లోపలి మావోయిస్టులతో మీరు పోరాడాల్సి రావచ్చు. మరికొంత మొత్తాన్ని రిపబ్లిక్ డే పెరేడ్ల కోసం, సైనిక స్థావరాల్లో మంత్రులు తమ వారాంతపు ఫొటోలు దిగడానికి ఖర్చుపెట్టవలసి ఉండవచ్చు. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఇప్పటికీ ‘ఇందిరమ్మ’ పాలనే!
ఇందిర, చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగంలో ‘సామ్యవాదం’ చేర్చారు. దేశం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్నా, ఏ ఒక్క నేతా దాన్ని తొలగించాలనడం లేదు. బీజేపీ/ఆర్ఎస్ఎస్ తగు ఆధిక్యతను సాధించినా లౌకికవాదం పోతుందే తప్ప, సామ్యవాదం పోదు. మోదీ అర్థశాస్త్రానికి ప్రేరణ ఇందిరా గాంధీ. మరి రాజకీయాలో? ఇందిర పద్ధతి ‘çపరిపూర్ణ రాజకీయం’. మొత్తం దేశాన్ని తమ పార్టీనే పాలించాలి. ప్రతిపక్ష ముక్త్ భారత్ను ఆమె కోరుకున్నారు. ఈ మాట సుపరిచితమైనదిగా వినిపిస్తోందా? నాకు నా పాత్రికేయ వృత్తి అంటే మహా ఇష్టం. కథలు చెప్పడమన్నా నాకు ఇష్టం కావడం కూడా అందుకు ఒక కారణం. అందువల్ల, ఇందిరా గాంధీ శత జయంతి సందర్భంగా రాస్తున్న ‘జాతిహితం’లో చెప్పడానికి తగినన్ని కథలు లేనందుకు విచారంగా ఉంది. ఆమె మరణించే నాటికి నాకు 27 ఏళ్లు. అయినా, నేను ఆమెకు సన్నిహితంగా ఉన్న రెండు సందర్భాల్లోనూ ఆమెకు ఉండే వీవీఐపీ భద్రత ఎంత పరిమితంగా ఉండేదో నాకు గుర్తుంది. ఆమె అధికారంలో లేని రోజుల్లో, 1979 వేసవిలో ఆమె ఢిల్లీ నుంచి శ్రీనగర్కు విమానంలో వెళుతుండగా తొలిసారి ఆమెను కలిసే అవకాశం కొద్దిసేపు దొరి కింది. ఆ ప్రయాణంలో చండీగఢ్లో కొన్ని నిమిషాలపాటు ఆగారు. అప్పుడు నేనెలాగో తంటాలు పడి ఆమెను కొన్ని ప్రశ్నలడగగలిగేంత దగ్గరకు చేరగలి గాను. ఆ కథనం కంటే కూడా ఎక్కువగా ఆ జ్ఞాపకము, జ్ఞానీ జైల్సింగ్, వీఎన్ తివారీతో జరిపిన ఆ చిన్న భేటీలో ఆమె చెప్పేదాన్ని మహా శ్రద్ధగా వింటున్న నలుపు తెలుపు ఫొటో మాత్రం మిగిలిపోయాయి. ఆమె తీరే వేరు ఆ తర్వాత నాలుగేళ్లకు అస్సాంలో అత్యంత అప్రతిష్టాకరమైన ఎన్నికలు జరు గుతుండగా 1983 ఫిబ్రవరి 18న గువాహటికి 120 కిలోమీటర్ల దూరంలో నెల్లి మహా మారణకాండ జరిగింది. 3,000 మందికిపైగా ముస్లింలను ఊచకోత కోశారు. ఆ మరుసటి రోజున ఆమె ఘటనాస్థలిని సందర్శించారు. ఆ సందర్భంగానే ఆమెను గురించి లోతుగా తెలుసుకునే అవకాశం దొరికింది. హెలికాప్టర్ రెక్కలు తిరగడం ఆగీ ఆగడంతోనే ఆమె కిందికి దిగి, గబాగబా వచ్చేశారు. ఇసుక దుమారం చుట్టబెట్టేస్తుండగా ఆమె చీర కొంగును ముక్కుకు అడ్డుపెట్టుకున్నారు. అయినా అది ఆమె ఆగ్రహాన్ని దాచలేక పోయింది. ‘‘మూడు వేల మంది ముస్లింలు చనిపోయారు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, మీరా?’’ అంటూ ఆమె ఆర్వీ సుబ్రహ్మణ్యంను మంద లించారు. అప్పుడాయన రాష్ట్రపతి పాలనలో ఉన్న అస్సాంకు ప్రధాన పరి పాలనాధికారి (గవర్నర్ ప్రధాన సలహాదారు). ఆ తర్వాత ఆమెకు ఐజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఉన్న కేపీఎస్ గిల్ కనిపించారు. ‘‘మీరంతా నిద్రపోతు న్నారా?’’ అన్నారు. ఇద్దరూ తప్పు చేసిన బడిపిల్లల్లా మౌనంగా నిలబడ్డారు. అప్పుడామె కొంగుతో మొహం తుడుచుకుని ‘‘హూ, ఏం మాయదారి దుమ్ము!’’ అన్నారు. సత్యజిత్ రే, నిత్య జీవితంలో ఇందిరా గాంధీ పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మిస్తూ ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ స్ఫురణకు వచ్చింది. ఆ సందర్భంగా ఆమె తన గదిలోని కుర్చీని సర్దుతూ లేదా గోడల మీది చిత్రాలను మారుస్తూ రోజువారీ పనులను చేçసుకుంటూ లేదా చేస్తున్నట్టు నటిస్తూ కనిపించారు. దుమ్ముకొట్టుకున్న ఫ్రేమ్కట్టిన తండ్రి ఫొటోను తీసి ఆమె తుడవబోతున్న ట్టుగా దాన్ని చూశారు. మీరు మీ చీర కొంగుతో దాన్ని తుడవండి, అది గొప్ప దృశ్యం (షాట్) అవుతుంది అని రే సూచించారు. ఇందిర, వద్దు అన్నారు. ఎందుకు వద్దండీ శ్రీమతి గాంధీ గారూ? మీ తండ్రిగారి పట్ల మీకు సెంటిమెంట్లేమీ లేవా? అని రే అడిగినట్టుంది. ‘‘ఉన్నాయి, కానీ దుమ్ము పట్ల సెంటిమెంట్లేమీ లేవు’’ అని సమాధానం ఇచ్చారు. బ్రహ్మపుత్ర లోయలో ఆమె కొద్దిసేపు గడిపిన ఆ విషాదకరమైన ఉదయం ఇందిర జీవితంలోని మంచి ఘట్టం కాదు. కానీ అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితంలో కెల్లా అతి కటువైన నిర్ణయాలలో ఒక టిగా లెక్కకు వస్తుంది. అప్పుడు అస్సాంలో నాలుగేళ్లుగా ‘‘విదేశీయులకు వ్యతిరేకంగా’’ గొప్ప ప్రజా ఉద్యమం శాంతియుతంగా చెలరేగుతోంది. అక్కడి చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు సరఫరాను సైతం దిగ్బం ధింపజేసేంత ప్రబలమైనదిగా అది సాగుతోంది. పరిస్థితిపై ప్రభుత్వానికి ఎలాంటి అదుపూ లేదు. ప్రజలలో అత్యధికులు బహిష్కరిస్తున్నా బలవం తంగా జరిపిన ఆ ఎన్నికలు అధికారాన్ని తిరిగి నెలకొల్పడానికి ఇందిర ప్రయోగించిన శైలిని తెలుపుతుంది. నా అంచనా ప్రకారం ఆ ఎన్నికల కోసం పదిహేను రోజుల్లోనే 7,000 మంది ప్రాణాలను మూల్యంగా చెల్లించు కోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయానికిగానూ చరిత్ర ఆమెను ఎలా అంచనా కడుతుంది? అలా ఆమె అధికారాన్ని ప్రయోగించిన తీరు పాశవికమైనది, క్రూరమైనది, హింసాత్మకమైనది. చాలా నియోజకవర్గాల్లో కశ్మీర్ లోయలో కంటే కూడా తక్కువ పోలింగ్ జరిగినా గానీ, ఆమె అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని నిలప గలిగారు. ఓ మంత్రికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఓట్లు దక్కాయి. నిరసన ప్రదర్శనల కారణంగా ఆయన ప్రత్యర్థికి ఓటు వేసే అవకాశం కూడా కలుగలేదు. ఆమె అందుకు ఆందోళనచెందే బాపతు కారు. ఆ నిర్దాక్షిణ్యమైన వైఖరే మేలు చేసింది ఆమె వ్యక్తిత్వంలోని ఈ నిర్దాక్షిణ్య పార్శ్వం, ఆమె ‘‘గుంగి గుడియా’’గా (మూగ బొమ్మ, రామ్మనోహర్ లోహియా ఆమెను అప్రతిష్టాకరంగా చేసిన అభివర్ణన) పార్లమెంటులో తడబడుతూ మాట్లాడే రోజుల్లో సైతం కనిపిస్తుం డేది. చాలా వరకు తన కుమారుడి(రాజీవ్గాంధీ)లాగే, ఆమె కూడా ఒక హఠాన్మరణంతో... లాల్బహదూర్ శాస్త్రి మరణంతో... ఒక్కసారిగా ప్రధాన మంత్రి పదవిలోకి వచ్చి పడ్డారు. కుంగదీసే యుద్ధాలకు(1962–65), ఆహార కొరతలు తోడై ఏర్పడిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం అప్పుడప్పుడే కోలు కుంటుండగా ఆమె అధికారంలోకి వచ్చారు. ఆమె ప్రధాని అయిన కొన్ని వారాలకే మిజో తిరుగుబాటుదారులు మిజోరాం రాజధాని ఐజ్వాల్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రెజరీని, అస్సాం రైఫిల్స్ ఆయుధాగారాన్ని కొల్ల గట్టబోతున్నారు. ఆ పరిస్థితిలో ఆమె ఎవరూ అంతకు ముందు చేసి ఉండని లేదా ఆ తర్వాత చేయని పనిచేశారు. ఐజ్వాల్పై దాడికి భారత వైమానిక దళాన్ని ఉపయోగించారు. ఆ చర్య ఇప్పుడు విమర్శలకు గురవు తోంది. కానీ అదే ఆ రోజున మనల్ని కాపాడింది. ఐజ్వాల్పై వైమానికి దాడి నుంచి బంగ్లాదేశ్ యుద్ధం, 1983 అస్సాం ఎన్నికలు, ఆపరేషన్ బ్లూస్టార్ వరకు అమె అదే నిర్దాక్షిణ్యమైన వైఖరితో అధి కారాన్ని ప్రయోగించారు. రాజ్యం ఆధిక్యతలో ఆమెకున్న విశ్వాసమే ఆమె అధికార శైలిని నిర్వచించింది. వీటిలో ప్రతి చర్యా ఆ గాయాల మచ్చలను మిగిల్చింది. అయితే ఆమె దేశానికి ఉన్న పెను ముప్పును శాశ్వతంగా తొలగించారు. పాకి,స్తాన్ ఇక ఎన్నటికీ రెండు వేపుల నుంచి పొంచి ఉన్న ముప్పు కాలేదు. బంగ్లాదేశ్ నమ్మకమైన మిత్రదేశం కాగలుగుతుంది. మిజో రాం ఇప్పుడు అత్యంత శాంతియుతంగా ఉన్న ఈశాన్య ఆదివాసి రాష్ట్రం. అస్సాంలో ఒకప్పుడు చమురు సరఫరాలను, 1983 ఎన్నికలను అడ్డుకున్న ప్రజా నేతలు ఆమె కుమారునితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు అధికారంలోకి వచ్చాక, ఓడిపోయారు. వారిలో మిగిలిన చిన్నా చితగా ఇప్పుడు బీజేపీ కూటమిలో చిన్న భాగస్వాములుగా ఉన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ వల్ల ఆమె హత్యకు గురైనా, పంజాబ్లో 25 ఏళ్లపాటూ సాధారణ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె చేసే చికిత్స శస్త్రచికిత్సా నిపుణుడు మృదువుగా కత్తితో పెట్టే గాట్ల లాంటివి కాదు, గొడ్డలితో వేసిన వేటులాంటివి. అవి ఆ గాయాల మచ్చలను మిగిల్చాయి. ఇవి అమెకు కొత్త ప్రతిపక్షాన్ని(అందులో చాలావరకు ఆమె సొంత పార్టీవారే), నేటి కాంగ్రెసేతర నాయకత్వాన్ని కూడా సృష్టించాయి. ఆమె ఆర్థిక, రాజకీయ విధానాలకే పట్టం జాతీయ భద్రతకు పెనుసవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆమె ఆ విష యంలో అద్భుతంగా పనిచేశారు అయితే, రెండు పెద్ద వైఫల్యాలు కూడా ఉన్నాయి. మతపరమైన శాంతిని నెలకొల్పడంలోని ఆమె వైఫల్యం, లౌకిక వాదిగా చెప్పుకోవడమే కాదు, నిజంగానే దానికి కట్టుబడిన ఏ వ్యక్తికైనా ఇబ్బందికరమైనదే. ఆమె అధికారంలో ఉండగా దేశంలోని అత్యంత ఘోర మైన మతకల్లోలాలు కొన్ని జరిగాయి. రెండవది, ఆమె ఆర్థిక వ్యవస్థకు చేసిన నష్టం. నెహ్రూ సామ్యవాదం మృదువైనది. ఆయనలోని వామపక్షవాద వైఖరులు ఆ కాలపు ఆదర్శవాదా నికి అద్దంపట్టేవి. ఇందిర సామ్యవాదం మొరటుది. ఆమె ప్రచ్ఛన్న యుద్ధ యోధురాలే తప్ప, ఉదారవాద ప్రేమికురాలు కాదు. పార్టీని చీల్చడానికి ఆమె సామ్యవాదాన్ని వాడుకున్నారు. బ్యాంకులు, బొగ్గు, పెట్రోలియం, బీమా ఇలా ఒకొదాని తర్వాత మరో పరిశ్రమను జాతీయం చేసేశారు. దేన్నీ వద ల్లేదు. 1973లో అమె, వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభానికి బెంబే లెత్తిపోయి పక్కా కమ్యూనిస్టు శైలిలో ఆహారధాన్యాల వర్తకాన్ని జాతీయం చేసి ఘోర తప్పిదం చేశారు. అలా ఆమె బెంబేలెత్తినది ఆ ఒక్కసారే. మన రాజ్యాంగానికి ఆమె చేసిన నష్టంలో కొంత శాశ్వతమైనది. రాజ్యాంగపు అవతారికలో ఆమె ‘‘సామ్యవాద’’ అనే పదాన్ని చేర్చారు. చట్టా నికి, రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమైన పార్లమెంటు (అత్యవసర పరిస్థి తులో పదవీకాలాన్ని ఆరేళ్లకు పొడిగించినది) చేసిన సవరణ అది. 1991 నుంచి దేశం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతోంది. అయినా ఏ ఒక్క నాయకుడూ రాజ్యాంగంలో చట్టవిరుద్ధంగా చేర్చినదాన్ని తొలగించాలనడం వినలేదు. బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఏదో ఒక రోజు అంత పెద్ద మెజారిటీని సాధిం చినా, లౌకికవాదం పోతుందే తప్ప, సామ్యవాదం అలాగే నిలుస్తుంది. అందుకు ఆధారాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం, బ్యాంకుల జాతీయకరణను వెనక్కు మరల్చడానికి బదులుగా, వాటి ‘‘పునరుద్ధరణ’’కు రూ. 2.11 లక్షల కోట్లను సమర్పించుకున్నారు. మోదీ రాజకీయ అర్థశాస్త్రానికి వాజ్పేయి కంటే, ఇందిరా గాంధీయే ప్రేరణ. మరి రాజకీయాలో? ఇందిరాగాంధీ పూర్తి పట్టు సాధించిన పద్ధతి ‘‘çపరి పూర్ణ రాజకీయం.’’ మొత్తం దేశాన్ని ఆమె పార్టీనే జయించాలి, ప్రతిపక్షాన్ని నాశనం చేయాలి. జనాకర్షక పథకాలు, కూటములు కటై్టనా, బెదిరించైనా బుజ్జగించైనా, ఆర్టికల్ 356ను ప్రయోగించైనా ఆ పని చేయాల్సిందే. ఆమె దుమ్ము దులపడం కోసం ఎంత సమయం కేటాయించేవారో అంతే సమ యాన్ని ప్రతిపక్షాల కోసం కూడా కేటాయించేవారు. కాబట్టి ఆమె కోరు కున్నది ప్రతిపక్ష ముక్త్ భారత్. ఈ మాట సుపరిచితమైనదిగా వినిపిస్తోందా? - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
వెర్రి చేష్టలే పరిష్కారాలా?
ఢిల్లీ వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. కాకపోతే, ఇంతవరకు అందరు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయని గుర్తించాలి. ఉదాహరణకు, ఈ సమస్యతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించడా నికి డీజెల్ పైన, ట్రక్కులపైన వసూలు చేస్తున్న వందల కోట్ల సెస్లో కొంత భాగాన్ని మళ్లించవచ్చు. అంతేగానీ ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పరిష్కారం చేయలేరు. మాకు టెడ్డీ అనే లాసా జాతి టిబెటన్ బొచ్చు కుక్క ఉండేది. అదెన్నడూ ఆహారం కోసం వెతుక్కునేది కాదు. అలమారా దిగువ అరల్లోని పుస్తకాలకు తప్ప మరెవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు సాయంత్రం ఓ ఎలుక దారి తప్పి మా వంట గదిలోకి చొరబడింది. అది చూసిన వెంటనే టెడ్డీ దాని వెంట పడింది. బెంబేలెత్తిపోయిన ఎలుక వంటగ్యాస్ సిలిండర్కు వెనుక ఇరుక్కు పోయింది. మొట్టమొదటిసారిగా తను వేటాడిన జంతువును మా టెడ్డీ కొద్ది సేపు పట్టుకుని చూసింది. ఆ తర్వాత దాన్ని అది వదిలిపెట్టేసింది. భయంతో ఎలుక పరుగు తీసింది. అది దానికి అవమానకరం అని మాకు అనిపించింది. మొదట్లో మా అతిథులకు వినోదం కల్పించడం కోసం మేం ‘ఎలుక’ అని అరిస్తే చాలు... మా ‘వేటగాడు’ పరుగందుకుని తక్షణమే గ్యాస్ సిలిండర్ వెనక్కు వెళ్లేవాడు. ఆ తర్వాత క్రమంగా అది ఓ కథగా మాత్రమే మిగిలి పోయింది. ఎప్పుడు ఎవరు అలాంటి మూర్ఖపు, అమాయకపు స్వాభావిక స్పందనలను కనబర చినా మేం ఇప్పుడు... ఒకసారి ఎలుక కనిపించిందని అక్కడే ప్రతిసారీ వెతక్కు అంటుంటాం. ఆత్మవంచన, పరవంచనే పరిష్కారమా? ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, సరి–బేసి పథకాన్ని మన మీద రుద్ది, మొట్టమొద టిసారిగా వంటింటి ఎలుకను పట్టడానికి కృషి చేసింది. అందులో సైతం అది విజయవంతం కాలేకపోయింది. ఈ పద్ధతి వల్ల ఢిల్లీ గాలి నాణ్యతలో చెప్పు కోదగిన మెరుగుదలేమీ కనబడలేదని గణాంకాలన్నీ తేల్చాయి. అయితేనేం అది రాజకీయంగా విజయవంతమైంది. చాలా మంది ఢిల్లీ పౌరులు, ప్రత్యే కించి సంపన్న పౌరులు (పలు వాహనాల యజమానులు) కనీసం ఈ సమస్య గురించి ఏదో ఒకటి చేస్తున్నారని, అందులో తాము కూడా భాగస్వా ములం అవుతున్నామని నమ్మేట్టు చేస్తోంది. అంతకు ముందు దీపావళి టపాసుల నిషేధపు ప్రహసనాన్ని కూడా ఇలాగే ప్రదర్శించారు. ఈ చర్యల పట్ల మైత్రీ పూర్వకంగా ఉండే టీవీ చానళ్లు వాటికి మద్దతుగా నిలిచాయి. గొప్ప ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మన వాయు నాణ్యతను మెరుగుపరుస్తు న్నదని ఊపిరి సలపకుండా ప్రశంసించాయి. హైబ్రిడ్ కార్లు, ఇంటిలో వాడే ఎయిర్–ప్యూరిఫయర్ల తయారీదారుల నుంచి ఈ ప్రశంసా కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రసారం చేయడానికి స్పాన్సర్షిప్లను సైతం అది సంపా దించి పెట్టింది. ఆ కార్లను, ప్యూరిఫయర్లను కొనగలిగేది సంపన్న వంతులే. రెండు చలి కాలాల తర్వాత, ఆప్ ప్రభుత్వం వంటింటి ఎలుక వెంటబడి తిరిగి పరుగులు తీస్తూనే ఉంది. మమతా బెనర్జీతో పోటీపడుతూ ఆమ్ ఆద్మీ మన దేశంలోకెల్లా అత్యంత ప్రజాకర్షక పార్టీగా మారింది. అయితే జనాకర్షక నిరంకుశ పార్టీలకు భిన్నంగా ఆ పార్టీలో అభిప్రాయాలలో, వివేకంలో వైవి«ధ్యానికి తావు ఉంది. ఇక దాని బలహీనతకు వస్తే, అది ఈ వారం ఆ పార్టీ పంజాబ్ నేత సుఖ్పాల్ సింగ్ ఖైరా నోటి నుంచి వెలువడింది. గడ్డిని కాలబెట్టే ‘కార్యక్రమాని’కి అధ్యక్షత వహిస్తూ ఆయన... గడ్డిని స్వయంగా కోసి శుభ్రం చేయడానికి ప్రభుత్వం రైతులకు నెలకు రూ. 5,000 చెల్లించే వరకు దీన్ని కొనసాగించాల్సిందేనని బోధించారు. ఇందుకు మీరు నవ్వండి, ఏడ్వండి, కోపగించండి. లేదంటే, మీ అతిశయాన్ని దింగమింగి, ఆ ఇన్హేలర్ను అందుకుని, అందులోంచి వచ్చే ఆ దరిద్రగొట్టు కార్టిసోన్ను పీల్చండి. ఢిల్లీ గాలి మాత్రమే కలుషితమై పోయిందా? అనేది మంచి ప్రశ్న. లేదు, దేశమంతటా గాలి కలుషితం అయిపోయిందనేదే సమాధానం. మరి ఢిల్లీ వాయు కాలుష్యం గురించే ఎందుకీ వెర్రి? వాయుకాలుష్యం ఢిల్లీకే పరిమితమా? మంచి ప్రశ్న. ప్రధాని సహా దేశంలోకెల్లా అత్యంత శక్తివంతులైన రాజకీయ వేత్తలు, పర్యావరణ శాఖ కార్యదర్శి సహా ఉన్నత ప్రభుత్వాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు, మీడియా దాదాలు అంతా ఉండేది అక్కడే. వారు తమ కలుషితమైన గాలి, మరణిస్తున్న నదులు, కాలుష్యంతో నురగలు కక్కుతున్న సరస్సులు, కూలుతున్న పర్వతాల సమస్యనే పరిష్కరించుకోలేకపోతే... ఇక మిగతా దేశం గురించి ఏమైనా చేసే అవకాశం ఏం ఉంటుంది? వారంతా ఏమీ ప్రయ త్నించడం లేదని కాదు. కాకపోతే, మా చిన్నారి లాసాలాగా ఆ ఎలుక కోసం వంటగదిలో వెతకడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనమంతా నవ్వు కోవాల్సి వస్తోంది. ఇకపోతే గౌరవనీయులైన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉంది. వారు ఢిల్లీ నగరం పట్ల చూపుతున్న ఉద్వేగాన్ని, దాని కోసం చేస్తున్న కృషిని, నగర కాలుష్యంపై ప్రదర్శిస్తున్న ఆగ్రహాన్ని చూస్తుంటే... దాని పేరును దేశ రాజధాని ప్రాంత హరిత ట్రిబ్యునల్గా మారిస్తే బావుంటుందని మనవి చేసుకుంటున్నాను. అది భారీ ఎత్తున జారీ చేసే ఫర్మానాలను (ఆదేశాలు) చూసి తుగ్లక్ ఎంతగానో గర్విస్తాడు. కాబట్టి ఆ సంస్థకు ఓ భవనాన్ని కేటాయించి, దానికి తుగ్లక్ భవన్ అని పేరు పెట్టాలని సూచిస్తున్నాను. ప్రజల అసమ్మతి ప్రాంతంగా ఉండే జంతర్ మంతర్లోని ఓ చిన్న ప్రాంతాన్ని.. పాలకుల చెవులకు మీ గోల విన రాకుండా, సుదూరంలోని మరో ప్రాంతానికి తరలించాలని అది తాజాగా మరో ఫర్మానాను జారీ చేసింది. నిరసన తెలపడం ఉద్దేశమే పాలకులకు మీ మాట వినిపించేట్టు చేయడం. అయితేనేం, ఢిల్లీ నగరంలోని ఆ సామ్రాజ్యాధికారానికి వ్యతిరేకంగా వాదించే వారు, ప్రత్యేకించి సదుద్దేశాలతో వాదించే వారు ఎవరున్నారు? ఢిల్లీలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎన్జీటీ తాజాగా పతాక శీర్షికలకు ఎక్కింది. మంచి ఆలోచన అంటారు మీరు. ఆర్థిక కార్య కలాపాల్ని నిలిపివేయడం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడే పద్ధతి కాలేదు నిజమే. పైగా, ఈ ఆదేశం వల్ల నిర్మాణ పనులు ఆగిపోతాయిగానీ, కాంట్రా క్టర్లు కార్మికులకు వేతనాలను చెల్లిస్తూనే ఉండాలి. ఈ ఆదేశాన్ని అమలుపరచే ఒక్క కాంట్రాక్టర్ను చూపండి, ఎన్జీటీ అంతకు ముందు ఆదేశించినట్టు గడ్డిని కాల్చడం ఆపేసిన రైతును చూపిస్తా. జాతీయ మానవ హక్కుల కమి షన్ సైతం బోలెడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సహకారంతో దుష్కృ త్యాలకు పాల్పడుతున్న గో రక్షకుల వెంట పడటం కంటే ఈ పని సురక్షిత మైనది. ఇకపోతే సుప్రీం కోర్టు, ఢిల్లీ వాయు నాణ్యత అధ్వానంగా మార డంతో ఆ సమస్య పరిష్కారానికి భూరేలాల్ కమిషన్ను నియమించింది. ఆ కమిటీ తొలి రోజుల్లో గణనీయమైన తేడాను తేగలిగింది. రాజధానిలోని ప్రజా రవాణా వ్యవస్థను అది సీఎన్జీకి పరివర్తన చెందించింది. కాలుష్యానికి ప్రధాన కారణమైన డీజెల్పైనా, ట్రక్కులపైనా కూడా పడతారని ఆశించారు. కానీ ఇçప్పుడున్న ఉపద్రవకరమైన పరిస్థితుల్లో సైతం ప్రతి ప్రముఖ వ్యక్తి వంటింట్లోనూ ఎలుక (డీజెల్ వాహనాలు) ఉంది. కాబట్టి అది జరగలేదు. పరిష్కారాలు లేకపోలేదు కానీ... రంకెలు వేయడం పరిష్కారం కాదు. కానీ కొన్ని పరిష్కారాలు లేక పోలేదు. కాకపోతే, దీపావళి నుంచి మొదలయ్యే రెండు నెలల పతాక శీర్షికల కాలాన్ని వదులుకోవాలి. మిగతా పది నెలలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఒకటి, అసలు సమస్యంటూ గుర్తించాలి. రెండు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు, కార్య కర్తలు ఇలా ప్రతి ఒక్కరు ప్రయత్నించిన పరిష్కారాలూ పని చేయడం లేదు. మూడు, వెక్కిరింతలకు లేదా రాజకీయం చేయడానికి దిగకూడదు. అప్పుడు వాస్తవాలను తిరగేయండి. వాటిలో మొదటిది ఆప్ నేత అతిషి మార్లెనా తయారు చేసిన ఉత్తర భారత కాలుష్యపు పొగ మేఘాల మ్యాప్. దాన్ని పరి శీలిస్తే ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, మొత్తం ఆ ప్రాంతమంతా కాలుష్యంతో ఊపిరి సలపకుండా ఉందని అర్థమౌతుంది. ఈ కాలుష్యం పొగ కాలంలో వెలువడ్డ మొట్టమొదటి అర్థవంతమైన ప్రకటన ఇది. ఈ మ్యాప్ను మీరు మరింత పశ్చిమానికి విస్తరిస్తే, పాకిస్తాన్లోని విశాల ప్రాంతాలు కూడా అలాగే కనిపిస్తాయి. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు పాకిస్తాన్ విషయంలో ఏమీ చేయలేని మాట నిజమే. కానీ ఈ సమస్యతో సంబంధం ఉన్న ఢిల్లీ, హరి యాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ముఖ్యమంత్రులు నలుగురితో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరవచ్చు. బాధ్యతను వేరొకరి మీదకు నెట్టే యడం అనే వెటకారాన్ని ఇక మర్చిపోండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించే మార్గాన్ని అన్వేషించండి. సుప్రీంకోర్టు, ఎన్జీటీల ఆదేశాల ప్రకారం డీజిల్, ట్రక్కుల మీద వందల కోట్ల సెస్ను వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న నిధులలో కొంత భాగాన్ని ఇందుకు మళ్లించేలా అంతా కూర్చుని నిర్ణయం చేయవచ్చు. బ్రాంకి యోటిస్ వల్ల వచ్చే దగ్గు తెరలకు పరిష్కారంగా మింట్ మాత్రలను చప్పరించడం లేదా అగర్బత్తీలను వెలిగించుకోవడం.. అవి పతంజలి తయారీవే అయినా.. ఎలాగో, అలాగే ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పోరాడాలని అను కోవడం కూడా అంతే భ్రమాత్మకమైనది. ఇప్పుడిక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఈపీసీఏ నివేదికలను చూడండి. ఢిల్లీలోని కాలుష్యపు తెరలకు దుమ్ము 38 శాతం కారణం. పై నుంచి నీళ్లు చల్లడం లేదా ఫైర్ బ్రిగేడ్లతో చెట్లకు స్నానం చేయించడంలాంటి వెర్రి ఆలోచనలను మరచిపోండి. 2016లో వాగ్దానం చేసినట్టుగా ఢిల్లీ రోడ్లను శుభ్రం చేయడానికి వాక్యూం స్వీపింగ్ మిషన్లను కొనమని ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి. కనీసం వందల కొద్దీ మరణావస్థలో ఉన్న పాత డీటీసీ బస్సుల స్థానంలో కొత్త వాటిని కొనమనండి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదం టారా? ఢిల్లీ ఓటర్లకు సబ్సిడీకి విద్యుత్తును, ఉచితంగా తాగునీటిని పంచి పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండాల్సింది. ఈ చర్యలేవీ, బేసి–సరి పద్ధతి కంటే లేదా నిషేధాల కంటే ఆకర్షణీ యమైనవిగా ఉండవు. కానీ ఉపయోగపడేవి. ఈ పొగ కాలంలో చేసిన మిగతా పనులన్నీ హాస్యాస్పదమైనవి మాత్రమే కాదు. మనలో కోట్లాదిమం దిని సామూహికంగా వంచించి చేసిన అఘాయిత్యం. సినిమా వాళ్లకు ఉండే స్వాతంత్య్రం పాత్రికేయులకు ఉండదు. కాబట్టి, ఇష్కియా సినిమాలో విద్యా బాలన్ అతి తరచుగా వాడిన మూర్ఖత్వం అనే అర్థాన్నిచ్చే ఆ ముతక మాటను వాడలేను. కాబట్టి దీన్ని సరి–బేసి గంధక ధూమం అంటాను. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
గెలుపు మత్తులో పాలన చిత్తు
మొదటి ప్రేమయాత్ర దశలో రాజకీయ పలుకుబడి తారస్థాయిలో ఉన్నా, తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. చాలా క్లిష్టమైన నిర్ణయాలన్నింటినీ ప్రజా మద్దతు అత్యంత పటిష్టంగా ఉన్న కాలంలోనే తీసుకోవాలి. నీ కృషి ఇచ్చిన ఫలితాలను కూడా చూడగలగాలి. గెలుపు యావలో మునిగిపోయిన మోదీ ప్రభుత్వం అలాంటి అమూల్యమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. కఠిన నిర్ణయాలను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోకుండా విడిచిపెట్టింది. దాని ఫలితమే ఇవాళ్టి సంక్షోభం. విజేతలలో రెండురకాల వారు ఉంటారని చరిత్ర చెబుతుంది. ఒక రకం విజేతలు విజయం సాధించిన తరువాత పరిపాలనను సుస్థిరం చేసుకుంటారు. సామ్రాజ్యానికి పరిమితమై ప్రజల పరిస్థితిని మెరుగుపరుస్తారు. ఇంకో రకం విజేతలు ఉంటారు. వీరు నిరంతర రణ కండూతితో ఉంటారు. విజయం వీరి పాలిట ఒక యావ. మొగలాయి వంశీకులైన అక్బర్, ఔరంగజేబులను చరిత్ర ఏ విధంగా వ్యాఖ్యానించిందన్న అంశాన్ని, వారి వారసత్వం ఎలాంటిదన్న అంశాన్ని తులనాత్మకంగా చెప్పాలని ఒక పక్క మనసు ఉవ్విళ్లూరుతున్నా, ఆ ఉదాహరణలు చెప్పాలంటే మాత్రం కొంచెం ఇరకాటమే. అంతకంటే మౌర్య చక్రవర్తి అశోకుడి జీవితం నుంచి ఉదాహరణలు తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. పైగా అశోక చక్రవర్తి జీవితంలో ఆ ఇద్దరు మొగలు పాలకులకు సంబంధించిన జాడలు సచిత్రంగా దర్శనమిస్తాయి. అశోకుడు రాజ్యాధికారం చేపట్టిన తొలి దశలో ఆయన ఒక విజేత. కానీ కళింగ యుద్ధం జరిగిన తరువాత, అంటే ఆయన పాలన మలిదశలో, శాంతికాముకుడయ్యాడు. సంస్కరణలు చేపట్టిన పాలకునిగా అవతరించాడు. చరిత్ర మీద ఒక చెరగని ముద్రను మిగిల్చినది ఈ దశలోనే. ఆధునిక పాలనా వ్యవస్థకు సంబంధించిన సూత్రాలు రూపొందడానికి ఆ సమయంలోనే పునాదులు పడినాయి. కొన్ని సహస్రాబ్దుల పాటు భారత్ పటిష్టంగా ఉండడానికి కావలసిన పునాదులు పడింది కూడా అశోకుని శాంతియుత పాలనాకాలంలోనే. అశోకుడు తన పాలన మలిదశలో సాధించిన ఘనత ఇదే. ఆయన కాలానికి సంబంధించిన చిహ్నాలనే మనం జాతీయ పతాకం మీద అలంకరించుకున్నాం కూడా. సమీక్షకు ఈ కాలపరిమితి చాలు అయితే ఒకటి. సైనిక దురాక్రమణల యుగం ఏనాడో అంతరించింది. ఇవాళ్టి నేతలు ఎన్నికల ద్వారా, పొత్తుల ద్వారా లేదంటే కుయుక్తుల ద్వారా కూడా కావచ్చు, రాజకీయాధికారం సాధించడం కోసం ప్రచార యుద్ధం చేస్తారు. 2014 లోక్సభ ఎన్నికలలో నరేంద్ర మోదీ నమోదు చేసిన రాజకీయపరమైన విజయం భారతదేశ చరిత్రలో అనన్య సామాన్యమైనది. ఇప్పుడు మోదీ గెలిచిన స్థానాలకు మించి గతంలో గాంధీ, నెహ్రూ వంశం చాలా అధికంగానే విజయాలను సాధించి ఉండవచ్చు. కానీ అధికారంలో ఉన్నవారు ఇంత దారుణమైన ఓటమిని చవిచూసిన సందర్భం, అది కూడా ఒక బయటవాని చేతిలో చూసినది, ఎప్పుడూ లేదు. మోదీ అధికారంలో ఉండబోయే కాలంలో మూడింట రెండువంతుల కాలాన్ని బట్టి ఆయన ఇంతవరకు ఎలాంటి పాలనను అందించారో సమీక్షించడానికి అది చాలినంత సమయమే అవుతుంది. నిజాయితీగా ప్రతిబింబించే ఒక అంశం ఉంది. దానిని మోదీ కూడా అంగీకరించవచ్చు. ఆయన, ఆయన కీలక అనుచరులు వారి స్కంధావారాలకు ఏనాడూ విశ్రాంతిని ఇవ్వలేదు. వారంతా ఎడతెరిపి లేని ఒక ప్రచార యుద్ధంలో తలమునకలై ఉండిపోయారు. ఇదొకటే కాదు, మోదీ ప్రభుత్వం, పార్టీ కూడా ఎన్నికలలో విజయం సాధించడమనే ఏకైక పరమావధి కలిగిన యంత్రాలుగా మారారు. దీనితో పాటు, నిఘా సంస్థల ద్వారా ప్రత్యర్థులను లక్ష్యం చేసుకోవడం, బీజేపీ నామమాత్రంగా ఉన్న సుదూర రాష్ట్రాలలో, అంటే క్షాత్రపుల వంటి ప్రాంతీయ పాలకులు పాలించే రాష్ట్రాలలో కొత్త కూటములకు చోటు కల్పించడం వంటి పనులూ ఉన్నాయి. ఇవన్నీ కలసి మొత్తానికి ఎంతో విసుగు కలిగించే, సహనంతో కాని సాధ్యం పడని, కొరుకుడు పడని పరిపాలనా వ్యవహారాల పట్ల వారిని పరధ్యానం వహించేటట్టు చేసేశాయి. దీని ఫలితమే ఇవాళ్టి మందకొడితనం. పైగా ఎలాంటి సమయంలో ఈ సంకట స్థితి ఎదురైందంటే, సరైన దిశా నిర్దేశం చేసుకోవడానికి గానీ, పోయిన వైభవాన్ని తిరిగి సాధించడానికి గానీ అవసరమైన సమయం బొత్తిగా లేని వేళలో వచ్చింది. ఏదో చేద్దామనుకున్నప్పుడల్లా ఆరేసి మాసాలకు ఒకసారి రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చేవి. ఆ ప్రతి ఎన్నిక రాబోయే 18 మాసాలలో జరగబోయే మరో కీలక ఎన్నికను నిర్దేశించేదే. అజేయుడైన ఏ నాయకుడైనా కూడా గతంలో తాను సాధించిన వాటితోనే సంతృప్తి పడి ఉండిపోడు. ఇక్కడ మన ఉద్దేశం కూడా మోదీ తన రాజకీయ ప్రభను కుదించుకోవాలని కాదు. ప్రతి గొప్ప నాయకుడు కూడా తన కాలం, ఆలోచనల ప్రాధామ్యాలను గుర్తించడానికి తగినంత నైపుణ్యం, ఓరిమి కలిగి ఉంటాడు. వీటన్నింటికీ మించినది ఒకటి ఉంది. అది, వారి రాజకీయ పలుకుబడి. మొదటి ప్రేమయాత్ర దశలో ఆ పలుకుబడి తారస్థాయిలో ఉన్నా, తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. చాలా క్లిష్టమైన నిర్ణయాలన్నింటినీ ప్రజా మద్దతు అత్యంత పటిష్టంగా ఉన్న కాలంలోనే తీసుకోవాలి. నీ కృషి ఇచ్చిన ఫలితాలను కూడా చూడగలగాలి. ప్రచారయావలో మునిగిపోయిన మోదీ ప్రభుత్వం అలాంటి అమూల్యమైన అవకాశాన్ని జారవిడుచుకుంది. కఠిన నిర్ణయాలను, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోకుండా విడిచిపెట్టింది. దాని ఫలితమే ఇవాళ్టి సంక్షోభం. 2014 సంవత్సరం నాటి ఎన్నికలలో బీజేపీ/మోదీ చేసిన అద్భుత ప్రచారంలో మూడు కోణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. అవి: అచ్ఛే దిన్ (మంచి రోజులు), దృఢమైన జాతీయ భద్రతా విధానం, అవినీతి వ్యతిరేక పోరాటం. ఇందులో చివరి కోణానికి అసాధారణమైన ప్రచారాన్ని తీసుకువచ్చారు. విదేశాలకు తరలిన లక్షల కోట్ల రూపాయలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అలా తిరిగి తెచ్చిన సొమ్మును రూ. 15 లక్షల మేరకు చెక్కు రూపంలో ప్రతి భారతీయునికి పంపుతామని, అవినీతిపరులైన పెద్దమనుషులను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేస్తామని చేసిన వాగ్దానం భారీ స్థాయిలో ప్రచారాన్ని సంతరించుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యానికి చేర్చిన తరువాత తెలివైన ఏ నాయకుడైనా దిగి వెళ్లిపోయే గుర్రం అంటే ఇదే. కానీ మోదీ ప్రభుత్వం ఆ గుర్రంతో ప్రేమలో పడింది. పాలన 42 మాసాల కాలంలో చూస్తే బ్యాలెన్స్ షీట్లో ఉన్నది చాలా తక్కువ. ఓడిపోయిన ప్రత్యర్థుల మీద తనిఖీల దాడులు, కొన్ని కేసులు, భీతాహమైన కొత్త పన్నుల యుగం, స్వాధీనం చేసుకున్న కొద్దిపాటి సంపద ఇవే అందులో కనిపిస్తాయి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే, విజయ్ మాల్యా వంటి ఆశ్రిత పెట్టుబడిదారుడైన అవినీతిపరుడు భారతదేశం నుంచి పలాయనం చిత్తగించడమే కాకుండా, బ్రిటన్ నుంచి అతి పైశాచికంగా భారతదేశం కంటిలో కారం కొడుతున్నాడు. ఇక పెద్ద పథకం ప్రకారం సాహసోపేతంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నల్లడబ్బును వెలికి తేవడంలో దారుణంగా విఫలమైందని ఇప్పుడు రుజవైంది. ఇది అసంఘటిత రంగాన్నీ, సరఫరా వ్యవస్థలనీ కకావికలు చేసింది. అసలే మందగించిన ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసింది. జీఎస్టీ విజయావకాశాలను కూడా ఇది దారుణంగా దెబ్బతీసింది. ఆలస్యం అమృతం విషం రాజకీయంగా విస్తరించడమే నిత్యకృత్యంగా ఉన్న ప్రభుత్వం ప్రధాన విధానాలపై నిర్ణయాలను నిరీక్షణలో ఉంచింది. బుల్లెట్ రైలు ఇందుకు ఒక ఉదాహరణ. దీని నిర్మాణానికి ఐదేళ్లు కాలం పడుతుందనుకుంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఆ పనిని ఆరంభించడం తెలివైన చర్య అవుతుంది. దీనితో ప్రభుత్వ కాలపరిమితి పూర్తయ్యే సమయానికి అందుకు సంబంధించిన సత్పలితాలు ప్రస్ఫుటమయ్యేవి. కానీ ఇప్పటికే ఇది చాలా ఆలస్యమైంది. బుల్లెట్ రైలు ఇచ్చే ఫలితాలను చూడడానికి వచ్చే 18 మాసాల కాలం ఏమాత్రం సరిపోయేది కాదు. దీనితో ఒక మంచి ఆలోచన గురించి కూడా ఆర్థికంగా భారమంటూ విపక్షం చులకన చేయడానికి అవకాశం కల్పించినట్టయింది. బ్యాంకులను బాగు చేయడం, ముంబై కోస్టల్ రోడ్, కొత్త విమానాశ్రయం వంటి భారీ మౌలిక వసతి కల్పనా పథకాలు కూడా అలాంటివే. వీటికి ఇంతవరకు పునాది కూడా పడలేదు. ముంబై దగ్గరే సముద్ర జలాలలో తలపెట్టిన శివాజీ స్మారక నిర్మాణం పని ఇంతవరకు ఆరంభం కాకపోవడం పథకాలు చేపట్టడంలో ఘనాపాటి అని చెప్పుకునే ప్రభుత్వానికి ఇరకాటం కలిగించేదే. భారీ స్థాయిలో ఆలోచించిన మేక్ ఇన్ ఇండియా పథకం నిలిచిపోయింది. రాఫెల్ల ఆర్డరు మినహా రక్షణ పరికరాల సేకరణ వ్యవహరంలో కూడా ఎలాంటి పురోగతి సాధించలేదు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పుకున్న ప్రభుత్వమిది. అందుకే ఒక విషయం చెప్పాలి. ఈ మూడు సంవత్సరాలలో ఈ ప్రభుత్వం సేకరించుకున్న రక్షణ సామగ్రి ఏదైనా ఉన్నదీ అంటే, అది యూపీఏ ప్రభుత్వం ఆర్డరు ఇచ్చిన సామగ్రిని దిగుమతి చేసుకోవడం మాత్రమే. సైనిక వ్యవస్థకు సంబంధించిన సామగ్రిని సేకరించడానికి ఎక్కువ సమయమే తీసుకుంటుంది. కానీ సైన్యం దాడిలో ఉపయోగించే తుపాకీలపై నిర్ణయం తీసుకోవడానికి, ఇలాంటి ఒక మౌలిక నిర్ణయం తీసుకోవడానికి మూడున్నర సంవత్సరాలు నాన్చడం మాత్రం దారుణం. మితిమీరిన విశ్వాసం బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల నుంచి ఆర్థిక వ్యవస్థ పునర్వ్యస్థీకరణ వరకు, బుల్లెట్ రైలు మొదలు నవీ ముంబై విమానాశ్రయం వరకు, మధ్య తరహా యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయడం గురించి ఆలోచించడంతోనే ఎన్డీయే సమయమంతా గడిచిపోయింది. నరేంద్ర మోదీ వంటి శక్తిమంతుడైన, నిశిత బుద్ధికలిగిన నాయకుడు ఇలాంటి నిర్ణయాలను ఎందుకు ఆలస్యం చేసినట్టు? ఇందుకు సంబంధించి ఇక్కడో సూత్రీకరణ ఉంది. 2014 లోను, ఆ తరువాత రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలోను బీజేపీ సాధించిన విజయం, రెండో పర్యాయం కూడా ఖాయంగా అధికారంలోకి తీసుకువస్తుందన్న నమ్మకాన్ని కలిగించింది. దీనితోనే మొదటి దశలో రాజకీయ దండయాత్రకు, జాతీయ స్థాయిలో లేదా ప్రాంతీయ స్థాయిలో విపక్షాన్ని నాశనం చేయడానికి బీజేపీ సమయం కేటాయించింది. పాలన వంటి కఠినమైన పనులు చేయడానికి రెండో ఇన్నింగ్స్ను ఎంచుకుంది. కానీ క్రికెట్ అంటే అద్భుతమైన అనిశ్చిత క్రీడ మాత్రమే కాదు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రాజకీయాలు నిర్లక్ష్యాన్ని సహించవు. మోదీ ప్రభుత్వ వైభవం క్షీణిం చడం వెనుక ఉన్న వివరణలలో ఇదొకటి. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
విభేదిస్తే మరణ శిక్ష తప్పదా?
జాతిహితం గౌరి హత్య, రాజకీయ నేరాల దర్యాప్తు, విచారణ రాజకీయ జోక్యానికి అతీతంగా ఉండా లని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడానికి హామీని కల్పించాలని చెబు తోంది. మన మధ్య విభజన రేఖ ఎక్కడ ఉన్నది ఆనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అందరికీ ఉన్నదని గుర్తించాలి. ఉదారవాదం అంటే ‘ఎదుటి పక్షం’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణలపై నుంచి తిరిగి నాగరికత సరిహద్దుల్లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. గౌరీ లంకేశ్ గురించి, ఆమె హత్య లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే ఆమెను తుదముట్టించడం గురించి మనకు కచ్చితంగా తెలిసిన సంగతులు చాలానే ఉన్నాయి. ఒకటి, ఆమె సుస్పష్టమైన కొన్ని అభిప్రాయాలకు శక్తివం తమైన నాయకురాలు, సునిశితమైన వామపక్ష ఉదారవాద పక్షంలోని భయ మెరుగని హేతువాది. రెండు, ఆమె తన ఆలోచనలను బహిరంగంగా మాట్లాడే, అలవాటుగా వచ్చే బెదిరింపులకు వెరవని ధైర్యశాలి. మూడు, రెండుగా బాగా చీలిపోయి ఉన్న చర్చలో నిర్దిష్టంగా ఒక వైఖరిని తీసుకున్న వారి విషయంలో అనివార్యంగా జరిగేట్టే... ఆమెతో ఏకీభవించేవారు ఆమెను మహోద్వేగంతో సమర్థించేవారు. ప్రత్యర్థి పక్షాన నిలిచేవారు లేదా భావ జాలపరమైన గోదాలో అటువైపున ఉండేవారు కూడా అంతే ఉద్వేగభరి తంగా ప్రతిస్పందించేవారు. వీరిలో కొందరు విమర్శకులు... గత దశాబ్ద కాలంగా రివాజుగా మారినట్టు... ఆమె చర్యలకు ఉద్దేశాలను ఆపాదించే వారు. కొందరు నీచమైన, బెదిరించే వ్యాఖ్యలు చేసేవారు. భావాల కారణంగా హింస సహించరానిది ఇక ఆ తర్వాత మనం సహేతుకంగా కచ్చితంగా చెప్పగలిగినది, ఇది రాజ కీయ హత్యని. దీనికి బా«ధ్యతను మనకు ఇష్టమైన అనుమానితులపైకి నెట్టేసి సరిపెట్టుకోవడానికి మనం సోషల్ మీడియా విదూషక యోధులమో లేదా రాజకీయ దురభిమానులమో కాము. అలా చేయడం వల్ల పలు ప్రమాదాలు న్నాయి. రాజకీయ హత్యల విషయంలో తరచుగా జరిగేట్టు కేసు రాజకీ యాలు పులుముకున్న పోలీసు–కోర్టు ‘‘కక్ష్య’’లో పరిభ్రమిస్తూ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎటంటే అటు వంగుతుంటుంది. సంఝోతా ఎక్స్ప్రెస్, మాలెగావ్, అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కేసులు పథకం ప్రకారం ఎలాంటి మలుపులు తిరిగాయో చూశాం. ఈ చర్చకు కేంద్ర బిందువు చాలా సరళమైనదే. అభిప్రాయాలను కలిగి ఉండటానికి, వాటిని ప్రచారం చేసుకోవడానికి, ప్రజాస్వామ్యం అనుమతించే రూపాలలో కార్యాచరణకు దిగడానికి, ఒప్పించడానికి, నిరసన తెలుపడానికి ఎవరికైనా హక్కు ఉంది. వారు హింసాత్మక చర్యల్లో పాల్గొనడం లేదా ప్రేరే పించడం చేయనంత కాలం ఆ హక్కు ఉంటుంది. అలాగే, విభేదించేవారు సైతం ఎంతగట్టిగానైనా ఆ పనులను శాంతియుతంగా చేయవచ్చు. అభిప్రా యాలు లేదా విశ్వాసాల కారణంగా ఆమెపై హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదు. దేశ పౌరులలో ఒకరైన ఆమె అభిప్రాయాల కారణంగా చావడానికి ‘‘అర్హురాలు’’ అనడాన్ని ఏ పౌర సమాజమూ ఆమోదించలేదు. ఒకరి అభి ప్రాయాల కారణంగా వారి ప్రాణాలను హరించడం... మన నాగరిక, రాజ్యాంగయుత జాతీయ దేశాన్ని ఒక విధమైన భయానక స్థలిగా మారు స్తుంది. కాబట్టి, అభిప్రాయాల కారణంగా ఎవరిని హతమార్చడానికీ వీల్లేద నేదే చర్చకు ఉత్తమమైన కేంద్ర బిందువు అవుతుంది. దశాబ్దం క్రితం సామాజిక మాధ్యమాలు అప్పుడే మన జీవితాల్లోకి ప్రవేశించనప్పుడు మాలాంటి పాత సజ్జు బాపతు వాళ్లం దాన్ని హేళన చేశాం, ఇలా వచ్చి అలా పోయే వెర్రి అని తీసిపారేశాం. కానీ నేడు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలు కోట్లాది మంది ఫాలోయర్స్తో... వాటిని ప్రజ లతో ప్రత్యక్ష సంబంధాలను నెరిపే సాధనాలుగా వాడుతున్నాయి. ఇక, క్రమంగా అది ప్రజాభిప్రాయాన్ని ‘‘హైజాక్’’ చేసే, హింసను ప్రేరేపించే మీడి యాగా మారడమూ జరుగుతుంది. ఆ హింస సాంప్రదాయకమైనదైనా లేక సోషల్ మీడియా పరమైనదైనా నేరమే. మహాత్మాగాంధీతో ప్రారంభించి మన దేశం అప్రతిష్టాకరమైన రాజ కీయ హత్యల చరిత్రను పోగుచేసుకుంది. ఆ హత్యలకు కారణం రాజకీయ వైరాలు లేదా ప్రతీకారం తీర్చుకోడం (ప్రతాప్ సింగ్ కైరాన్, లలిత్ నారా యణ్ మిశ్రా, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ), భావాలూ కావచ్చు. భావ జాలపరంగా బాగా చీలిపోయి ఉన్న ప్రాంతాల్లో, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్, బిహార్లో వామపక్షం, మితవాద పక్షం కూడా ఇతరుల నోళ్లను మూయించడానికి హత్యలకు పాల్పడ్డాయి. ఏపీలో నక్సల్స్ జరిపిన దాడి నుంచి చంద్రబాబు నాయుడు ప్రాణాలతో బయటపడ్డారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తండ్రిని రాజకీయ ప్రత్యర్థులు ఆయన కారుపై బాంబు దాడి చేసి హతమార్చారు. 1974–94 మధ్య పంజాబ్లో వేలాది మందిని హతమార్చారు, వారిలో పలువురిని కేవలం వారి భావాల కారణం గానే చంపారు. పంజాబ్ కేసరి మీడియా సంస్థల వ్యవస్థాపకుడు లాలా జగత్ నారాయణ్ను, ఆయన కుమారుడినే కాదు, ఆ సంస్థల్లో పనిచేసేవారని, పత్రి కలు అమ్మేవారిని సైతం హతమార్చారు. జర్నైల్ సింగ్ బింద్ర¯Œ వాలా పద్ధతి చాలా సరళమైనది. స్వర్ణ దేవాలయంలో ఆయన కోర్టును నిర్వహించే వారు. ఎవరైనా లేచి ఏ రాజకీయవేత్తనో లేదా మేధావినో వంచకుడని లేక దైవ దూషకుడని ఆరోపించేవారు. ఆయనే వారికి ఏం శిక్ష విధించాలో అడిగే వాడు. ఇక ఆ తర్వాతి పనిని తుపాకీ ముగించేసేది. ముద్రలు వేసేయడం హత్యలకు లైసెన్సా? ఇప్పటిలాగే అప్పుడు కూడా ఎవరినైనా లక్ష్యం చేసుకుని తుదముట్టిం చేయ డానికి దాన్ని సమర్థించుకోడానికి ‘‘మాట’’ చాలు. గతంలో ఇలా మాట్లాడిన వ్యక్తి, తన మతానికి సంబంధించిన అత్యున్నత ఆధ్యాత్మికతకు ఇహలోక పీఠంపై ఉన్నవారు. నేడు, ఆ గురు పీఠంపై ఉన్నది సామాజిక మాధ్యమాలు. వాటిని ఉపయోగించుకోవడానికి మీరు ఒక సాధువు లేదా బాబా, సంత్, లేదా మౌలానా కావాల్సిన అవసరం సైతం లేదు. వ్యక్తులకు జాతి వ్యతి రేకులు, దేశద్రోహులు, మతాన్ని ధిక్కరించేవారు, విదేశీ ఏజెంట్లు అని పేర్లు పెట్టేసి తిట్టిపోస్తూ మీరొక ట్వీట్ల దుమారాన్ని రేకెత్తించేస్తే సరి పోతుంది. ఎవరైనా ఒకరిని తుపాకీతో కాల్చి చంపేయడానికి, లేదా మూకు మ్మడిగా చావబాది హతమార్చడానికి అదే సమర్థనను కల్పిస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక బృందం ఒక ప్రాణాన్ని హరించడానికి నైతిక సమం జసత్వంతో సాయుధమైతే చాలు, వారి చేతికి ఎలాగోలా తుపాకీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎలాగూ రాజకీయాలు ఆ కేసును హస్తగతం చేసుకుని, న్యాయ క్రమాన్ని ఇష్టానుసారం మెలి తిప్పగలుగుతుందని సైతం వారు ఆశిస్తారు. ప్రత్యర్థులు అప్పుడిక నేర రాజకీయాలపై కొట్లాడుకుంటారు. మీ మట్టుకు మీరు ఆ హత్య కేసు నుంచి తప్పించుకు పోవచ్చు. పోల్చడానికి వీల్లేనిదే అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... 1978లో ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం అరెస్టు చేసినందుకు నిరసనగా లక్నో నుంచి ఢిల్లీ వెళు తున్న విమానాన్ని పాండే, అతని మిత్రులు హైజాక్ చేయడం గుర్తుకు తెచ్చు కోవాలి. 1980లో ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతోనే ప్రాసిక్యూషన్ కేసు గాల్లో కొట్టుకుపోయింది. రాజకీయ నేరాలకు పాల్పడేవారు వెంటనే తమ చర్యలను రాజకీయం చేస్తారు. గౌరి హత్య నేర్పే గుణపాఠాలు గౌరీ లంకేశ్ హత్య నుంచి సరళమైన, విజ్ఞతాయుతమైన గుణపాఠాలను తీయవచ్చు. ఒకటి, నేర దర్యాప్తులు, న్యాయ క్రమాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఈ కేసును వెంటనే సీబీఐ లేదా ఎన్ఐఏ లేదా మరేదైనా పొట్టి పేరు సంస్థకు అప్పగించాలని హడావుడిగా చేసే డిమాండ్లను తోసి పుచ్చాలి. ఏదైనా ఒక కోర్టు ఆ కేసు పర్యవేక్షణ బాధ్యతలను స్వీకరించడం ఉత్తమం. మన కోర్టులు ఇప్పడు అలాంటి బాధ్యతలను నిర్వరిస్తున్నాయన డానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాజకీయ హత్యకు అలాంటి జోక్యాన్ని కోరడానికి తగినంత ప్రాధాన్యం ఉన్నది. లేకపోతే ఇది కమాం డో–కామిక్ చానళ్లకూ, గౌరీ లంకేశ్తో వైరం ఉన్న ఆమె సోదరుడు ముందు నిలవగా నూతనోత్తేజంతో సోషల్ మీడియా హ్యండిల్స్ (ఖాతాలు) సృష్టించే కొత్త పౌరాణిక కథలకూ లేదా గౌరీ లంకేశ్ జీవించి ఉండి వుంటే హేళన చేసేలా ఆమె మరణాన్ని సొమ్ముచేసుకుంటూ ఆమెకు వలసవాద సంకేతమైన 21 తుపాకుల వందనాన్ని సమర్పించిన కర్ణాటక ముఖ్యమంత్రికీ మధ్యా ఇరుక్కుపోతుంది. కర్ణాటక హేతువాదులను ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోయిందో లేక వారి హంతకులను ఎందుకు పట్టుకోలేక పోయిందో సమాధానం చెప్పాల్సి ఉంది. గౌరీ లంకేశ్ తన మరణంతో, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడుకోవడంపై చర్చను ముగించి ఉండవచ్చు. ఇటు నుంచి వీళ్లు, అటు నుంచి వాళ్లు సందర్భశుద్ధి లేకుండా అలవాటుగా ఇష్టానుసారం చర్చలు సాగించడానికి వీల్లేదు. సామాజిక మాధ్యమాల్లోని విద్వేషపూరితమైన వ్యాఖ్యల విషయంలో చట్టం అందరికీ సమానంగానే వర్తించాలి. సాంప్రదా యకమైన రీతిలోనే అది సామాజిక మాధ్యమాల ద్వారా హింసను ప్రేరేపిం చడంతో కూడా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాలను రాజకీయ వర్గం చావబాదే గుంపులను ప్రయోగించడానికి వాడుకోవాలనే ఉబలాటాన్ని విడ నాడాలి. అవతలి పక్షం కూడా ఇదే చేస్తున్నదనేది ఇందుకు సమర్థన కాజా లదు. వారి లక్ష్యం దుమ్మెత్తిపోసే విభ్రాంతికరమైన దాడితో తమ విమర్శకుల నోళ్లను మూయించాలనేదే. దాన్ని అనుసరించి భౌతిక హింస కూడా వస్తుంది. ప్రధాని ఈ కీలక విషయాన్ని గ్రహించాలి. ఎవరినో ఒకరిని సామా జిక మాధ్యమాల్లో అనుసరిస్తున్నంత (ఫాలో) మాత్రాన వారి అభి ప్రాయా లకు ఆమోదం తెలపడం కాదనే వాదన... ఆ వ్యక్తి ప్రజా జీవితంలో ఉన్న వారైనా, వారి ప్రత్యర్థి అయినా వారి తప్పును తుడిచేయలేదు. మీ పేరిట ఇత రులను తిట్టిపోసేవారిని మీరు అనుసరించడం అంటే మీరు వారి అభిప్రా యాలకు అంగీకరిస్తున్నట్టే. ఇక చివరిగా, మీడియాకు చెందిన మనమూ, ఉదారవాదులుగా చెప్పు కునేవారూ నేర్చుకోవాల్సిన గుణపాఠం: మన మధ్య ఉండే విభజన రేఖ ఎక్కడ ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా వాక్, భావ స్వాతంత్య్రం అంద రికీ ఉన్నదే. ఆగ్రహంతో రెండు శిబిరాలుగా చీలిపోయి ఉన్న స్థితిలో ఈ స్వేచ్ఛల పరిరక్షణ నిర్ద్వంద్వమైనది. ఉదారవాదం అంటే ‘‘ఎదుటి పక్షం’’ చెప్పేది విని చర్చించడమే తప్ప, దాన్ని మూర్ఖమైనదిగానో లేక అనైతికమనో కొట్టిపారేయడం కాదు. అలాంటప్పుడే, ప్రస్తుత చర్చను హింస, దూషణల నుంచి తిరిగి నాగరికత సరిహద్దులోకి తీసుకువచ్చే అవకాశం లభిస్తుంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
నిష్కళంక దేశభక్తికి నిలువుటద్దం
జాతిహితం భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపి వేయాలని ఒత్తిడి తెచ్చింది. పీవీ అణు పరీక్షను నిర్వహిస్తూ దొరికిపోయినట్టు నటించి, దాన్ని ‘రద్దు చేసి’ క్లింటన్ను సంతృప్తి పరచారు. మన అణు శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. నరేశ్ చంద్ర దీనిలో కీలకమైన ‘గూఢచారి’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా అత్యంత దేశభక్తియుత కారణంతో జరిగినదే. దీనికి ప్రతిఫలంగా చంద్రకు ముట్టినవి దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే. ప్రజా జీవితంలోని ఒక ప్రముఖుని మృతికి నివాళి అర్పించేటప్పడు మనం మహా బద్ధకంగా, సురక్షితంగా ఆయన ‘‘దేశభక్తుడు’’ అనేస్తుంటాం. బద్ధ కంగా అనడం ఎందుకంటే, దేశభక్తులు కారని రుజువైన ఎవరో కొందరిని తప్ప తోటి భారతీయులెవరినైనా దేశభక్తులని భావించాల్సిందే. మృతి చెందిన వారి గురించి అలా అనడాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడరాదన్నంతగా మనం వినమ్రంగా ఉంటాం. మనం నివాళి అర్పించే వ్యక్తిని ద్రోహి అని సూటిగా అన కున్నా, ఒక సారి కంటే ఎక్కువగానే అలా అనుమానించి ఉన్నప్పుడు ఇది మారుతుంది. భిన్న పార్టీలకు, కూటములకు చెందిన తొమ్మిది మంది ప్రధానుల హయాం లోని రెండు తరాల భారత వ్యూహకర్తలు ఆయనను అతి గొప్ప దేశభక్తులలో ఒకరుగా చూసినప్పుడు కచ్చితంగా అది జరుగుతుంది. వైవిధ్యభరితమైన వివిధ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు మూడు దశాబ్దాలకు పైగా అంతగా నమ్మకం ఉంచి, గౌరవం చూపిన వ్యక్తులు అరుదు. నరేష్ చంద్ర అలా అంత సుదీర్ఘ కాలం ‘‘వ్యవస్థలో’’ ప్రభుత్వ అధికారిగా మనగలిగారు. భారత గూఢ చార సంస్థలో చేరి, దానికి అధిపతి అయిన తన అన్న ‘‘గ్యారీ’’ సక్సేనా గోప్యతను కాపాడాలని గామోసు నరేశ్ చంద్ర ఎన్నడూ తన ఇంటి పేరు ‘‘సక్సేనా’’ను వాడేవారు కారు. గ్యారీ ఇటీవలే ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆయన విమర్శకులు సహా నరేష్ చంద్రతో పరిచయం ఉన్నవారెవరైనా ఆయన కేవలం ఐఏఎస్ పాసై, అధిష్టించగలిగిన పదవులన్నిటినీ చేపట్టిన సాధారణ ప్రభుత్వాధికారి మాత్రమే కారని అంగీకరిస్తారు. ప్రభుత్వ సర్వీ సుల సోపానాలలో నరేష్జీ ఎక్కని మెట్టు ఏదీ లేదు. ఆయనకు సాటి మరెవరూ లేరు ప్రభుత్వాధికార వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరిన అధికారులు సాధా రణంగా రెండు రకాలు. ఒకటి, పదవీ విరమణ చేయడం, ఏదో ఒక సంస్థకు నియంత్రణాధికారిగా లేదా మరో పదవిని సంపాదించి విశ్రాంతిగా గడు పుతూ జీతాలు పుచ్చుకునేవారు. సీవీసీ, కాగ్, యూపీఎస్సీ,ఆర్టీఐ తదితర కమిషన్లలో నిజంగానే తమకు ప్రియమైన చట్టబద్ధమైన ఉద్యోగాల్లో చేరే వారు. నిజంగానే పాలకులకు ప్రీతి పాత్రులై ఉంటే సులువైన రాజ్భవన్ పని ఉండనే ఉంటుంది. ఇక మరో రకం వారు మరిన్ని సవాళ్ల కోసం అన్వేషిస్తూ, అసలు సిసలైన దేశ సేవలో తమ వృత్తి జీవితాన్ని పొడిగించుకుంటారు. నరేష్ చంద్ర ఈ రెండో కోవలో ఉంచదగినవారు. ఆయన అతి విశిష్టమైన రకం మనిషి. పలు దశాబ్దాలుగా ఎందరో తెలి వైన మంతులను కలుస్తున్నా.. నేను అలాంటి వ్యక్తులను మరిద్దరినైనా కలి శానని కచ్చితంగా చెప్పలేను. కొత్త సవాలు లేదా మరింత సరిగ్గా చెప్పాలంటే సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆయన వైఖరే వేరు. సమస్యలను పరిష్కరిం చడంలో ఆయన రాణించారు, సంక్షోభంలో మరింత గొప్పగా రాణించారు. అలాంటి సమయాల గురించిన కథనాలను చెప్పడంలో ఆయన మరింత మెరుగు. జిల్లా సర్వీసులో తను నేర్చుకున్న విషయాలు ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించడంలో ఎలా ఉపయోగపడ్డాయనే దాన్ని అవేవో సరదా కబుర్లన్నట్టుగా చెప్పేవారు. ఆయన అన్ని వాస్తవాలను వెల్లడించేవారు కారు. కానీ మరెక్కడి నుంచైనా మీరు వాటిని తెలుసుకుంటే... మీరు ఆయన నమ్మకంలోకి తీసుకునే వ్యక్తులు అయితే... వాటిని సరిపోల్చి చెప్పేవారు. నేను ఉదయాన్నే లేచే బాపతు కాదు. మన్హట్టన్ లెక్సింగ్టన్ హోట ల్లో మోగినట్టుగా, ఉదయం 6 గంటలకే ఫోన్ మోగడాన్ని ఇష్టపడేవాణ్ణి కాను. అది 1997 ఆకురాలు కాలం, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నరేశ్ చంద్ర వాషింగ్ట¯Œ లోని భారత రాయబారి. 1992లోనే ఆయన కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. ‘‘అరె భయ్ మీరు ప్రచురించింది ఏమిటి? నేనిక్కడ రాయబారిని, ఈ పెద్ద మనిషేమో నేను గూఢచారిని అంటున్నాడు’’ అన్నారు నరేశ్ చంద్ర. ఆ రోజునే ఆయన నాటి ప్రధాని గుజ్రాల్తో కలసి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను కలుసుకోవాల్సి ఉంది. తన సహచరులు, అమెరికన్లు ఆ వ్యాసాన్ని చదివాక తను వారి మొహం ఎలా చూడాలి అంటూ ఆయన ఆక్రోశాన్ని ధ్వనిస్తూ విషయం చెప్పారు. మన రాయబారే గూఢచారా? ఆయన ప్రస్తావించిన ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాసాన్ని రాసినది స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్, నా మిత్రుడు ఎస్. గురుమూర్తి. పీవీ నర సింహారావు పోఖ్రాన్లో అణు పరీక్షను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తూ చివరి క్షణంలో వెనక్కు తగ్గడంలోని మర్మాన్ని గురించి గురుమూర్తి రాశారు. క్లింటన్ ప్రభుత్వం, పీవీ పథకాలకు సంబంధించి తమ ఉపగ్రహ గూఢచార సమాచార ఆధారాలను చూపడం వల్లనే అలా జరి గిందని, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి ఒక ‘‘గూఢచారి’’ చేరవేశా డని, అది చంద్రేనని గురుమూర్తి సూచించారు. ఆ వ్యాసం ప్రతితో సహా నరేశ్ చంద్ర లెక్సింగ్టన్లో నేను బసచేసిన హోటల్కు వస్తున్నానన్నారు. ఆ వ్యాసం ప్రచురితమైనది నేను సంపాదకునిగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ కాదని, అదే కుటుంబానికి చెందిన మరో శాఖ నిర్వహిస్తున్న ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని నేను ఆయనకు వివరించాను. ఇదంతా బాగానే ఉందిగానీ ఇక ప్రపంచానికి నేను మొహం ఎలా చూపించాలి? అనేదే ఆయన సమస్య. ఈ విషయంలో నేను ఆయనకు ఏమీ ఉపయోగపడలేననేది స్పష్టమే. ఆయన కున్న విశిష్టమైన అర్హతలు, సంబం«ధాలు ఎలాంటివో నాకు బాగా తెలుసు. ఏదిఏమైనా కేబినెట్ కార్యదర్శిగా ఆయనకు మన దేశంలో రహస్యంగా ఉంచాల్సిన ప్రతి విషయమూ తెలుసు. పైగా రా సైతం కేబినెట్ సెక్రటేరి యట్ నియంత్రణలోనే ఉంటుంది. అలా అని గురుమూర్తి వ్యాఖ్యలు అంత తేలిగ్గా కొట్టిపారేయగలిగినవి కావు. ఆయనకు విషయ పరిజ్ఞానం, మేధస్సు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల నుంచి విదేశాంగ విధానం వరకు ఆయనతో ఏ విషయం మీదైనా విభేదిస్తూ వాదించవచ్చునే గానీ ఆయన దేశభక్తిని ప్రశ్నించలేం. మరి అసలు నిజం ఏమిటి? దాదాపు ఒక దశాబ్ది పాటూ నేను అదేపనిగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం అన్వేషించాను. గుజ్రాల్, వాజ్పేయి, నరసింహారావుల వద్ద ఈ విష యాన్ని ప్రస్తావించాను. అందరి నుంచీ నిగూఢమైన నవ్వులూ, ‘‘ఆ విష యాన్ని మీరిక వదిలిపెట్టేయండి’’ అనే లాంటి మాటలే సమాధానమ య్యాయి. కానీ ఏళ్లు గడిచే కొద్దీ చంద్రపై పడ్డ మచ్చను అత్యున్నత అధికార వ్యవస్థలో ఎవరూ నమ్మలేదని సూచించే ఆధారాలు పోగుపడ్డాయి. పీవీ ఆయనను అణు సంబంధమైన, క్షిపణులకు సంబంధించిన సమస్యలపై అమెరికాతో చర్చలు జరిపే కీలక అధికారిగా నియమించారు. గురుమూర్తి అంతటివాడు ఆయనను గూఢచారిగా ఆరోపించినా గుజ్రాల్, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఆయనను అమెరికాలోని భారత రాయబారిగా కొన సాగించాయి. గురుమూర్తికి ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనాయకత్వంలో పలుకు బడి ఉండటమే కాదు, వాజ్పేయి, అద్వానీల ఇళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లగలిగేవారు. జశ్వంత్ సింగ్, బ్రజేశ్ మిశ్రాలు సైతం చంద్రను పూర్తిగా విశ్వసించేవారు. నిష్కళంక దేశభక్తికి అవమానాల మకుటం చికాకుపరచే ఈ భ్రమణం పరిపూర్తి అయ్యేట్టుగా 2006లో నరేశ్ చంద్ర ఇతర ప్రముఖ వక్తలతో పాటూ జశ్వంత్ సింగ్ పుస్తకావిష్కరణ సభలో వేదికను అలంకరించారు. తన పుస్తకంలో జశ్వంత్ సింగ్, పీవీ ప్రభుత్వంలోని గూఢచారి గురించి ప్రస్తావించారు. ఏమాత్రం అనుమానం ఉన్నా చంద్రను ఆ పుస్తక ఆవిష్కరణ సభకు జశ్వంత్ పిలిచేవారా? ఈ విషయంపై నేను పీవీని వేధించినప్పుడల్లా ఆయన... దాన్ని అక్కడే ఉండనివ్వండి అన్నట్టుగా తన పొట్టను తట్టుకునేవారు. ఒక ‘వాక్ ద టాక్’ ఇంటర్వ్యూలో నేను, డిసెం బర్ 1995లో ఏం జరిగిందంటూ ఒత్తిడి చేశాను. ‘‘నాతో పాటూ చితిలోకి తీసుకు పోవడానికి కనీసం కొద్దిగానైనా మిVýæలనివ్వు’’ అంటూ నా నోరు కట్టే శారు. 2006లో వెలువడ్డ జశ్వంత్సింగ్ పుస్తకం నా అన్వేషణను కొన సాగించడానికి కొత్త ప్రేరణ అయింది. నా ‘జనహితం’లో మూడుసార్లు ఆ అంశంపై రాశాను. ఆ గూఢచారి చంద్ర అని, ఆయనను ప్రయోగించినది పీవీ అని నిర్ధారించాను. చంద్రతో నేను గంటల కొద్దీ గడిపినా, ఆయన నోరు విప్ప లేదు. పీవీ అణు పరీక్ష చేయాలనుకోలేదనే నా నిర్ధారణను ఇంతవరకు ఎవరూ సవాలు చేసింది లేదు. భారత్ ప్రమాదకర స్థితిలో ఉండగా క్లింటన్ ప్రభుత్వం అణు కార్యక్రమాన్ని నిలిపేయాలని ఒత్తిడి తెచ్చింది. పీవీ అమెరికాను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వేశారు. అణు పరీక్షను నిర్వహిస్తున్నట్టు, దొరికిపోయినట్టు నటించి... ‘‘రద్దు చేయడం’’ ద్వారా క్లింటన్ను సంతృప్తి పరచి, భారత శాస్త్రవేత్తలకు అవసరమైన సమయాన్ని సమకూర్చారు. బహుశా నరేశ్ చంద్ర దీనిలో పాత్రధారి కావచ్చు, ‘‘గూఢ చారి’’ పాత్ర ధరించి ఉండవచ్చు. ఇదంతా సత్సంకల్పంతో, దేశభక్తితో జరిగి నదే. దీనికి ప్రతిఫలంగా ఆయనకు ముట్టినవి పుకార్లు, తీవ్ర విద్రోహానికి పాల్పడ్డారన్న అనుమానాలే. 1989లో రాజీవ్ గాంధీ, చంద్రతో జనాంతి కంగా మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీకి అతి చేరువలో ఉన్నది’’ అని చెప్పారు. మనకు వ్యూహాత్మకంగా కుటుంబ ఖజానాకు సమా నమైన నిధికి తాళాలను చంద్రకు అప్పగించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షల వరకు దశాబ్దం పాటూ అతి చాకచక్యంగా ఆడిటర్లకు అనుమానం రాని రీతిలో మన అణు కార్యక్రమానికి ఆయన ఆర్థిక వనరులను సమకూర్చారు. అందువల్లనే ఆ విశిష్ట వ్యక్తికి నివాళులర్పించే సందర్భం ఏదో రివాజుగా సాగేది కాదు. ఎంతగా ఆయన దేశభక్తి సందేహానికి గురవుతున్నా చలించ కుండా మొండిగా నిలిచిన చిత్తశుద్ధితో కూడిన దేశభక్తి ఆయనది. తనపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి, దేశం కోసం తాను చేసినదాన్లో కొంతైనా చెప్పడానికి ఆయన తన జ్ఞాపకాలనైనా రాయలేదు. నేను రాయ గలిగిన దాన్ని ఎవరూ చదవరు అనేవారు. భరత మాతకు ఆయనలా అత్యు త్తమ సేవలందించిన ప్రభుత్వాధికారిని ఎవరినీ మనం చూడలేదు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
దౌత్యం చతికిలపడిందా?
జాతిహితం నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్, చైనాలతో గట్టి సంబంధాలను కోరుతూనే పాలన ఆరంభించారు. మొదట ఇరువైపుల ఆశ మెరిసినా అంతలోనే మాయమైంది. నరేంద్ర మోదీ, వ్యూహాత్మక అంశాల కోసం పనిచేస్తున్న ఆయన బృందం ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం జమ్మూకశ్మీర్లో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత కారణంగానే భారత్–పాక్ సంబంధాలలో ఈ గందరగోళం ఏర్పడింది. భారత్ చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చైనా భావించి ఉండవచ్చు. రెండున్నర యుద్ధరంగాలలో కూడా పోరాటం చేయడానికి తన సైన్యం సంసిద్ధంగా ఉందని జనరల్ బిపిన్చంద్ర రావత్ ఇచ్చిన ప్రకటన మీద భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇక్కడ రెండున్నర యుద్ధరంగాలు అంటే పాకిస్తాన్, చైనా, కొన్ని అంతర్గత ఘర్షణలు అని. రావత్ ప్రకటన ధైర్యాన్ని నూరి పోసిందన్న రీతిలో దేశీయంగా వ్యాఖ్యానాలు వినిపించాయి. చైనా నుంచి విమర్శలు వచ్చాయి. ఒకటి మాత్రం నిజం. భారత్ 1959 నుంచి బహుముఖమైన, బహుళ దశలతో ఉన్న బెడదలు ఎదుర్కొన్నది. వీటికి బదులివ్వడానికి భారత రాజకీయ నాయకత్వం సైన్యాన్ని తన ఆయుధంగా ఎంచుకుంటోంది. అయితే 1962 నాటి ఒక్క ఆ మినహాయింపు తప్ప, మిగిలిన సమయాలలో జరిగింది అదే. ఈ ధోరణి గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కొన్ని దశాబ్దాల తరువాత రెండో యుద్ధరంగంలో హఠాత్తుగా చైనా మేల్కొనడం, ఆ దేశ మీడియా ప్రయోగిస్తున్న భాష నేపథ్యంలో ఈ ప్రశ్నలు రేకెత్తుతాయి. ఆ దేశ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న తీరు మరీ ముఖ్యం. మన దేశంలో గద్దించి మాట్లాడుతున్నట్టు ఉండే కామిక్ చానళ్లలో పాల్గొనే వక్తల మాదిరిగా అక్కడి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. మొదటి ప్రశ్న ఏమిటంటే– ఆ రెండున్నర యుద్ధరంగాల సవాలు ఆరంభమైన ఆరు దశాబ్దాల తరువాత– ఇంకా చెప్పాలంటే మూడు పూర్తి స్థాయి యుద్ధాలు జరిగి, పాకిస్తాన్తో పూర్తిగా బంధాలు తెగిపోయాక, ఈశాన్యంలో శాంతి ఒప్పందాల మీద సంతకాలు కూడా జరిగిన తరువాత, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా కూడా, అణ్వాయుధాలు విస్తరిస్తున్న కాలంలో కూడా– ఇప్పటికీ ఆ సవాలు ఎందుకు యథాతథంగానే మిగిలి ఉంది? ప్రపంచంలో మిగిలిన ఏ పెద్ద దేశంలో లేదా సైనిక శక్తిలో ఇన్ని కోణాల నుంచి సవాళ్లు కొనసాగుతున్నాయా? అలా ఆరు దశాబ్దాలుగా ఉన్నాయా? రెండో ప్రశ్న– ఆ సైనిక అస్థిత్వం కొనసాగింపు భారత్ దౌత్య, వ్యూహాత్మక ఆలోచనల ఫలితమేనా? ఈ ప్రశ్న అక్కడితో అయిపోలేదు. భారతీయ దౌత్యం, వ్యూహం సైనిక శక్తి శాసించినట్టు నడుస్తూ, దానికి లొంగి ఉందా? లేకుంటే ఇది మరో మార్గమా? మొదటిది ప్రచ్ఛన్న యుద్ధంతో సోవియెట్ రష్యాను తాకిన ఉత్పాతం. సైనిక దళాల భారం, సైనికపరమైన ఆలోచనల కారణంగా వార్సా ఒప్పందం చెల్లాచెదురైందనీ, దానితోనే సైద్ధాంతిక, మేధోపరమైన యుద్ధం ముగిసిపోయిందనీ ఇప్పుడు అంతా అంగీకరిస్తున్నారు. అసలు ప్రచ్ఛన్నయుద్ధం ఎలా అంతమైందంటే, రొనాల్డ్ రీగన్ నాయకత్వంలోని అమెరికా, సోవియెట్ రష్యాను అధిగమించడం వల్ల కానేకాదు. సోవియెట్ రష్యా అఫ్ఘానిస్తాన్ మీద దాడి చేసి దుస్సాహసం చేయడం వల్లనేనని ప్రముఖ చరిత్రకారుడు నియాల్ ఫెర్గూసన్ వాదన. ఇక మూడో ప్రశ్న– అరవై ఏళ్ల తరువాత ఈ ప్రపంచం పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్న తరువాత కూడా మన శత్రువులు, శత్రుత్వాలు అలాగే కొనసాగుతున్నాయంటే, మన ప్రతిష్టంభనలు కూడా అలాగే ఉండిపోయాయంటే, ఈ స్థితిలో కూడా మన ప్రయోజనాలను రక్షించే బాధ్యతను సైన్యానికి అప్పగించామంటే అర్థం ఏమిటి? దాని అర్థం ఇది కాదా? జాతీయ ప్రయోజనాలకు సంబంధించి ఎంతో ముఖ్యమైన ప్రమాణం విషయంలో మన రాజకీయ, వ్యూహాత్మక నాయకత్వం వైఫల్యం చెందినట్టు కాదా? చైనీయులను తరిమి కొట్టండి అంటూ 1962లో నెహ్రూ సైన్యానికి పిలుపునిచ్చినట్టే, పరిస్థితులు విషమిస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు ఈ అర్థంపర్థం లేని మాటలు చెప్పగలరా? పనులు చేయగలరా? ఎవరైనా వాస్తవాలను పట్టించుకోవలసిన అవసరం లేదా? రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించడమనే తప్పు హిట్లర్ చేశాడని చెప్పడం కాదు కానీ, ఏ దేశమైనా కూడా, తన రక్షణ కోసం ఎంత సాహసంతో పోరాడినా కూడా రెండు యుద్ధ రంగాలలో యుద్ధం చేసి విజయం సాధించిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతుంది. కాబట్టి దౌత్యం అనేది మూడు ప్రాధామ్యాలను కలిగి ఉండాలి. జాతీయ ప్రయోజనాలను మరిం తగా కాపాడుకునేందుకు యుద్ధాన్ని నివారించేందుకు తుదికంటా ప్రయత్నించాలి. రంగంలోకి దించకుండానే సైన్యం పరపతి ఏపాటిదో తెలియచెప్పే ప్రయత్నం చేయడం మరొకటి. ఈ రెండు విఫలమైనప్పుడు, 1962, 1965 సంవత్సరాలలో మాదిరిగా యుద్ధం చేయక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు, లేదా 1971లో మాదిరిగా యుద్ధం చేయాలని దేశం భావించినప్పుడు, మిగిలిన యుద్ధ రంగాలతో వచ్చే ప్రమాదమేదీ లేదని నిర్ధారించుకున్నప్పుడు –యుద్ధం గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీ సైన్యానికి వదిలిపెట్టాలి. మనం యుద్ధం చేసిన ప్రతిసారి మరోపక్క కొత్త కొత్త యుద్ధరంగాలు సిద్ధమవుతాయన్న భీతి ఉండేది. ఒక యుద్ధరంగంలో చర్యను కొనసాగించే క్రమంలో ప్రభుత్వాలు రకరకాల విధానాలను ఉపయోగించేవి. 1962లో భారత్ రెండున్నర యుద్ధ రంగాలలో పోరాడుతున్నప్పుడు జవహర్లాల్ సాయం కోసం పాశ్చాత్య దేశాలను కోరారు. భారత్ ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితిని ఆసరా చేసుకోవద్దని పాక్కు నచ్చచెప్పడానికి నెహ్రూ అమెరికా, బ్రిటన్లను ఆశ్రయించారు. దీనికి చెల్లించిన మూల్యం ఏమిటంటే, కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్తో జరిపే చర్చలలో (స్వరణ్సింగ్–భుట్టో చర్చలు, 1962–63) మూడో పార్టీ జోక్యం. కానీ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి అనూహ్యంగా ఈ ప్రక్రియను ఆలస్యం చేయడంతో పాకిస్తాన్ అదనుగా భావించి కశ్మీర్ను ఆక్రమించే క్రమంలో 1965లో సైనిక చర్య మొదలుపెట్టింది. ఇక్కడ చిన్న అంశాన్ని జ్ఞాపకం చేయాలి. 1962లో రెండున్నర యుద్ధరంగాల సమస్యలో నాగాలాండ్ తిరుగుబాటు అంశం ఉంది. ఈశాన్యం నుంచి (అరుణాచల్, నీఫా) సైన్యం తప్పుకోవడంతో అప్పుడు నాగాలాండ్ సంగతి తాత్కాలికంగా పట్టించుకోలేదు. రెండో యుద్ధ రంగాన్ని విజయవంతంగా వదిలేయడం జరిగింది. అలా మిగి లిన సగం యుద్ధరంగంలో పెద్ద బెడదకు చోటిచ్చే అవకాశం కల్పించాం. కశ్మీర్లో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనడానికి 1965లో అనూహ్యంగా శాస్త్రి ప్రభుత్వం ధైర్యంగా లాహోర్, సియాల్కోట యుద్ధరంగాలకు శ్రీకారం చుట్టింది. ఇవి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయి. మనం చేసిన ఆఖరి పూర్తిస్థాయి యుద్ధం 1971 నాటి యుద్ధం. ఈ యుద్ధం ప్రణాళికా బద్ధంగా జరిపిన యుద్ధం కూడా. తన కంటే ముందు ప్రధాని పదవిలో ఉన్నవారి కాలం మాదిరిగా కాకుండా, చైనా బెడద గురించి ఆమెకు బెంగ లేదు. ‘శాంతి, స్నేహం, సహకారం’ అన్న అంశాల ప్రాతిపదికగా ఆమె రష్యాతో ఆదరాబాదరా చేసుకున్న ఒప్పందం వల్ల, ఒకే శత్రువు, ఒకే యుద్ధరంగం అన్న అంశాలు రూఢీ అయినాయి. ఒప్పందం జరిగిన 13 రోజుల తరువాత అన్ని సైనిక సన్నాహాలు జరిపే పనిని మానెక్షాకు అప్పగించారు. ఆ సమయంలో సగం యుద్ధరంగం మిజోరం–నాగాలాండ్. అక్కడ నుంచి పోరాడుతున్న వారి స్థావరాలను తూర్పు పాకిస్తాన్లో ధ్వంసం చేయడం జరిగింది. దీనితో వేర్పాటువాదుల నడ్డివిరిగింది. కానీ భారత్ దురవస్థ ఏమిటో గానీ, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినా, ఇస్లామిక్ ఉగ్రవాదం మీద ప్రపంచం ఆగ్రహం ప్రకటిస్తున్నా రెండు యుద్ధరంగాల బెడద తప్పడం లేదు. ఈ మార్పులు కూడా చైనా–పాకిస్తాన్ సంబంధాలలో మార్పులు తేలేకపోయాయి. పైగా ఇదివరకు ఎన్నడూ లేనంత పటిష్టమైనాయి. డొనాల్డ్ ట్రంప్ ఏకధ్రువ ప్రపంచాన్ని సవాలు చేయగల సత్తా తనకు ఉందని చైనా భావిస్తుండగా, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పథకం ప్రకారం పాకిస్తాన్ చైనాకు మరింత సన్నిహిత మిత్రుడని తేలింది. నిజానికి కారిడార్ పథకం ఆర్థికపరమైనది కాబట్టి వ్యూహాత్మకమైనది కూడా. అది కాకపోతే, అంతకంటే కీలకమైన పథకమే అవుతుంది కూడా. అయితే ఈ పథకం రెచ్చగొట్టే చర్య అని భారత్ భావన. ఎందుకంటే ఆ పథకం భారత్ భూభాగం ద్వారా వెళుతుంది. కాబట్టి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత దేశం ఇప్పుడు అణ్వాయుధ సంపద కలిగిన రెండు దేశాల నుంచి బెడదను ఎదుర్కొంటున్న దేశంగా ప్రపంచంలో మిగిలింది. ఇదంతా ప్రస్తుత ప్రభుత్వ చలవ మాత్రమే కాదు. లేదా తప్పు కాదు. మన దేశానికి చెందిన ప్రతి నాయకుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. రాజీవ్గాంధీ, వాజపేయి మరింత ముందుకు Ðð ళ్లి పరిష్కరించే యత్నం చేశారు. వారి కృషి రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన తగ్గడానికి కొంత సాయపడింది కూడా. సిక్కిం భారత్లో అంతర్భాగం కావడానికి చైనా అంగీకరించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో ఇంకాస్త పురోగతి సాధించడం మినహా తరువాత ఎప్పుడూ రెండు దేశాల మధ్య గొప్ప సంబంధాలు కొనసాగలేదు. మన్మోహన్ అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్తో శాంతిని నెలకొల్పడం సులభం. పాకిస్తాన్ ప్రభుత్వ ధోరణిని మార్చామని చెప్పుకోవడానికి ప్రపంచం, ఇంకా ముఖ్యంగా అమెరికా కోరుకుంటున్నాయి. అందుకే 26/11 ఉదంతం జరిగినప్పటికీ మన్మోహన్ పాకిస్తాన్తో శాంతినే కోరుకున్నారు. దాని ఫలితమే షర్మెల్ షేక్ ప్రకటన. అయితే ఆయన పార్టీయే ఆ ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఆయన కూడా తన ఆలోచనను విరమించుకున్నారు. నరేంద్ర మోదీ కూడా పాకిస్తాన్, చైనాలతో గట్టి సంబంధాలు కోరుతూనే పాలన ఆరంభించారు. మొదట ఇరువైపుల ఆశ మెరిసినా అంతలోనే మాయమైంది. నరేంద్ర మోదీ, వ్యూహాత్మక అంశాల కోసం పనిచేస్తున్న ఆయన బృందం ఇలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం జమ్మూకశ్మీర్లో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత కారణంగానే భారత్–పాక్ సంబంధాలలో ఈ గందరగోళం ఏర్పడింది. భారత్ చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చైనా భావించి ఉండవచ్చు. అలాగే టిబెట్ ప్రవాస ప్రభుత్వ ప్రతినిధులు భారత ప్రభుత్వ కార్యక్రమాలలో కనిపించినందుకు (మోదీ ప్రమాణ స్వీకారోత్సవం నుంచి) కావచ్చు. అరుణాచల్లో దలైలామా పర్యటించినందు వల్ల కావచ్చు. అలాగే తాము సరిహద్దులను టిబెట్తోనే పంచుకుంటున్నాం గానీ, చైనాతో కాదని అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రకటించడం కావచ్చు. అసలు ఇవన్నీ యథాలాపంగా జరిగినవా; లేక ఒక ప్రణాళిక ప్రకారం చెప్పిన మాటలా? మనకు తెలియదు. కానీ వ్యూహానికి సంబంధించి ఈ రెండు దేశాలకు ఒక వాస్తవం తెలియాలి. అది– ఈసారి సగం యుద్ధరంగం తూర్పు మధ్య భారతంలోని మావోయిస్టు పీడిత ప్రాంతమే. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
సమున్నత పదవికి స్థాయి ముఖ్యం
జాతిహితం మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం : అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్కు అలాంటి స్థాయి లేదు. భారత 14వ రాష్ట్రపతి పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు ఉన్నాయా లేవా అన్న ప్రశ్న ఇప్పుడు పూర్తిగా విద్యా విషయకమైనది. సర్వ సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రజాజీవితంలో కోవింద్ సాధించిన విజయాలను గురించి ఆయనకు మద్దతు ఇస్తున్నవారు ఏకరువు పెట్టవచ్చు. అయితే ఈ వివరణలలో 2007 సంవత్సరంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిభా పాటిల్ను కాంగ్రెస్ నియమించినప్పుడు చెప్పిన మాటలే ధ్వనిస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరారైన తరువాత పాటిల్ గతానికి సంబం«ధించిన రహస్యాలు బయటపడడంతో కాంగ్రెస్ నాయకులు ఇరకాటంలో పడ్డారు. అప్పుడు నా సంపాదకత్వంలోని పత్రిక ప్రతిభా పాటిల్ గతాన్ని వలేసి వెతికి పట్టుకుని చక్కెర వ్యాపారంలో, సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో, ప్రైవేటు విద్యా సంస్థలలో ఆమె చీకటి కార్యకలాపాలను గురించి ధారావాహికంగా ప్రచురించింది. అయినా అలాంటి శత్రుత్వానికి స్వస్తి పలికే ఉద్దేశంతో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక సాయంత్రం, బాగా పొద్దుపోయిన తరువాత నా దగ్గరకు వచ్చాడు. వెంట ఒక మామిడిపళ్ల బుట్ట కూడా తెచ్చాడు. ‘‘మీ విలేకరులు రాసిన వార్తలన్నీ నిజమే’’అన్నాడాయన. అయితే వాటిని మేమెందుకు ఆపాలి అని అడిగాను. ఎందుకా సోదరా! మంచికో చెడుకో జూలై 25కి ఆమె ఈ గణతంత్ర దేశపు వైభవానికి ప్రతినిధిగా నిలవబోతున్నారు. ఈ మురికంతా ఇప్పుడు తవ్విపోసి కాబోయే మీ రాష్ట్రపతికి అపకీర్తి ఎలా తెచ్చి పెట్టగలవు?’’అని కూడా అన్నాడాయన. ఇప్పుడు కోవింద్ అభ్యర్థిత్వం గురించి చెబుతున్న అంశాలు నాడు ప్రతిభా పాటిల్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలతో పోల్చదగినవిగా కనిపిస్తున్నాయి. ఆమెకు పార్లమెంటు సభ్యురాలిగా సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. గవర్నర్గా అనుభవం ఉందని చెప్పారు. మొదటి మహిళా రాష్ట్రపతి అని చెప్పారు. ఇంతకు ముందు పనిచేసిన వారికంటే ఎక్కువా కాదు తక్కువా కాదని వాదించారు. ఎలక్టొరల్ కాలేజ్లో సంఖ్య ప్రధానం కాబట్టి ఆనాడు యూపీఏ పక్షాలన్నీ కాంగ్రెస్ వెంటే విన్నాయి. అయితే ఈ కాలమిస్ట్ సహా చాలామంది విమర్శకులు నామమాత్రపుదే అయినా ఆ అత్యున్నత పదవికి సంబంధించిన అంశాన్ని తేలికగా తీసుకోవద్దని, అలాంటి నిర్ణయంతో పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అయినా ఒక అవాంఛనీయ సంప్రదాయాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అదే పునరావృతం కావడం చూస్తున్నాం. రాజకీయానుభవం అనే కోణం నుంచి చూస్తే కోవింద్ ప్రతిభా పాటిల్ కంటే కొంచెం వెనుకపడి ఉండవచ్చు. అయితే విద్యా విషయంలో ఆయన ఆమె కంటే ఉత్తమ అర్హతలే కలిగి ఉన్నారు. న్యాయ పరిజ్ఞానంలో మంచి పేరే ఉంది. వ్యక్తిగత, కుటుంబ జీవితాలు కూడా మచ్చలేనివిగానే ఉన్నాయి. ఆయన కరిక్యులమ్ వీటా (సీవీ, వ్యక్తిగత వివరాలు)ను బట్టి చూస్తే అ«ధ్యక్ష పదవికి ఆయనను అనర్హుడని ఎవరూ వాదించలేరు. కానీ ఒక ప్రశ్న అడగవలసిన అవసరం ఉంది: ఏ వ్యక్తికైనా దేశంలో అత్యున్నత పదవికి అర్హుడని చెప్పడానికి గొప్ప కరిక్యులమ్ వీటా ఒక్కటే సరిపోతుందా? అది గొప్పగా లేకుంటే వారు అనర్హులవుతారా? గతం మీద విహంగ వీక్షణం భారత రాష్ట్రపతుల పరంపరను చూస్తే వారి ఎంపికలో విద్యార్హతలు, సామాజిక, రాజకీయ నేపథ్యాలను పట్టించుకున్నట్టు కానరాదు. మేధాసంపన్నుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసుకున్నాం. అలాగే దాదాపు నిరక్షరాస్యుడైన జ్ఞానీ జైల్సింగ్ను కూడా ఆ పదవికి పంపించాం. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రణబ్ ముఖర్జీ, ఆర్. వెంకటరామన్ వంటి రాజ కీయ దిగ్గజాలనీ, అలాంటి వారే నీలం సంజీవరెడ్డి, శంకర్దయాళ్ శర్మలను, అంతంతమాత్రం అనిపించిన వీవీ గిరిని కూడా రాష్ట్రపతి పదవిలో చూశాం. విశేష గౌరవ ప్రతిష్టలు కలిగి, ముస్లిం వర్గం నుంచి వచ్చిన డాక్టర్ జకీర్హుస్సేన్తో పాటు, ఏమాత్రం గుర్తుంచుకోవలసిన అవసరం లేని ఫక్రుద్దీన్ అలీ అహ్మద్లను కూడా ఆ అత్యున్నత పదవిలో ప్రతిష్టించుకున్నాం. విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసిన కేఆర్ నారాయణన్, శాస్త్ర, సాంకేతిక రంగం నుంచి వచ్చిన మరో ఉన్నతోద్యోగి డాక్టర్ ఏపీజే అబ్దుల్కలాంలను కూడా రాష్ట్రపతి పదవికి పంపించాం. ఆ పదవిని అలకరించిన వారికి సంబంధించి గుర్తు చేసుకోదగిన చక్కని ఉదాహరణలు ఉన్నాయి. అలాగే ఆ అత్యున్నత పదవి గౌరవ ప్రతిష్టలను నిలబెట్టేందుకు అవసరమైన రీతిలో వివాదరహితంగా వ్యవహరించడంలో ఎవరూ విఫలం కాలేదని సగర్వంగా కూడా చెప్పవచ్చు. కొన్ని మినహాయింపులు అయితే ఇందుకు కొన్ని చెప్పుకోదగిన మినహాయింపులు మాత్రం ఉన్నాయి: అత్యవసర పరిస్థితి వి«ధించినప్పుడు ఇందిరాగాంధీ జారీ చేసిన ఆర్డినెన్స్ను ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చదవకుండానే సంతకం చేశారు. ఇంకొక ఉదాహరణ– జ్ఞానీ జైల్సింగ్ పదవీకాలం చివరి అంకంలో నాటి ప్రధాని రాజీవ్గాంధీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి రాష్ట్రపతి భవన్ను కేంద్రంగా అనుమతిం చడం. అదే సమయంలో ఒక అత్యంత సాధారణ పౌరుడు కూడా ఆ అత్యున్నత పదవికి ఎదగవచ్చునని ఆయనతోనే వెల్లడైంది. కలకాలం గుర్తు పెట్టుకోవలసిన రాష్ట్రపతులు, ఎంతమాత్రం గుర్తుంచుకోనవసరంలేని కొందరు రాష్ట్రపతుల హయాముల మధ్య తేడాను ప్రత్యేకంగా పరీక్షిస్తే వాటి నడుమ చాలా వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇందుకోసం మనం మరీ యాభయ్యో దశకం, లేదా అరవయ్యో దశకం వరకూ కూడా వెళ్లనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞులను పాతరేయడానికీ, పార్టీని చీల్చడానికీ ఇందిరాగాంధీ ఆడిన చదరంగంలో పావుగా ఉపయోగపడ్డ వీవీ గిరిని ఇప్పుడు యాభయ్యో పడిలో ఉన్నవారు ఎవరూ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆయన పూర్తికాలం ఆ పదవిలో కొనసాగారు కూడా. కానీ కొన్ని చేదువాస్తవాల కారణంగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను మాత్రం మనం గుర్తు చేసుకుంటాం. అద్భుత వ్యంగ్య చిత్రకారుడు అబూ అబ్రహాం వేసిన కార్టూన్ ఫక్రుద్దీన్ అంటే ఏమిటో మా తరానికి బాగా అవగాహనకు తెచ్చింది. ఆ వ్యంగ్య చిత్రంలో గుండెల నిండా రోమాలతో స్నానాల తొట్టెలో ఉన్న ఫక్రుద్దీన్ సంతకం చేసిన ఒక పత్రాన్నీ, కలాన్నీ తన వద్ద పనిచేసే సిబ్బందిలో ఒకరికి తిరిగి ఇస్తూ ఉంటారు. అప్పుడే ఒక మాట కూడా ఆయన అంటున్నట్టు అబూ చిత్రిం చారు, ఆ మాట: ‘ఇంకా ఆర్డినెన్స్లు ఉంటే కొద్దిసేపు వేచి ఉండమని చెప్పు!’. ఎగరేసిన కీర్తిపతాకాలు మరోపక్క గుర్తుండిపోయే విధంగా వ్యవహరించిన వారిలో అబ్దుల్కలామ్ ఉంటారు. బిహార్ విషయంలో ఆయన జోక్యం, కొలీజియం ఉన్నప్పటికీ న్యాయమూర్తుల నియామకాలలో జరిగిన మతలబుల విషయంలో కలగచేసుకోవడం గుర్తుండే విషయాలు. అలాగే గుజరాత్ అల్లర్ల అనంతర వాతావరణం మీద, ఆపరేషన్ పరాక్రమ్ తరువాత పరిస్థితుల మీద కలామ్ ప్రభావం పరోక్షంగా ఎంతో ఉంది. రోజువారీ వేతనాలతో నడిచినట్టు, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్న కాలంలో కూడా రాష్ట్రపతి వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరించవచ్చునో చూపి నమ్మకం కలిగించిన వారు ఆర్. వెంకట్రామన్, శంకర్దయాళ్ శర్మ. రాష్ట్రపతి పదవికి ఉండే మే«ధోపరమైన, నైతికమైన స్థాయిని తిరిగి నిలబెట్టిన వారు కేఆర్ నారాయణన్. ఆ విషయంలో కేఆర్ రాధాకృష్ణన్ హయాంను గుర్తుకు తెచ్చారు. కృతజ్ఞతాభావంతో, ప్రేమతో మనం గుర్తు చేసుకున్న రాష్ట్రపతుల హయాంలకు, మనం మరచిపోయిన రాష్ట్రపతులకు, మరచిపోవడమే మంచి దనిపించేవారి మధ్య ఉన్న తేడా ఏమిటి? మన రాష్ట్రపతి పదవి చరిత్రను పరిశీలిస్తే విద్యార్హతలకీ, రాజకీయ నేపథ్యానికీ, కులమతాలకీ, సామాజిక నేపథ్యానికి సంబంధం లేదని తెలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాష్ట్రపతి పదవిని చేపట్టబోయే వారి పనితీరు, ముద్రలను కరిక్యులమ్ వీటా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉంది, అది ఊహకి అతీతమైన లక్షణం: అదే స్థాయి. కలామ్, వెంకట్రామన్, నారాయణన్లకు అలాంటి స్థాయి ఉంది. వీవీ గిరి, ఫక్రుద్దీన్, ప్రతిభా పాటిల్కు అలాంటి స్థాయి లేదు. కోవింద్ గురించి ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఉంటే కనక ఎంతటి ఉన్నతి పదవిలోకైనా వెళ్లవచ్చు. అయితే కరిక్యులమ్ వీటా ఉన్నతమైనదా, కాదా అన్న విషయంతో నిమిత్తం లేకుండా ఆ అత్యున్నత పదవికి తగిన స్థాయిని పెంపొందించుకోవడమే ఎవరికైనా పెద్ద సవాలు. మన రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి రాష్ట్రాల గవర్నర్ పదవి కంటే కూడా అప్రాధాన్యమైనది, నామమాత్రమైనది. రాష్ట్రపతి పాలన విధించిన సమయంలో అయినా గవర్నర్ వాస్తవంగా కొన్ని అధికారాలను చలాయించగలుగుతారు. రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి హోదాను గణతంత్ర రాజ్యానికి ప్రతీకగా, వైభవానికి చిహ్నంగా భావించారు.అయితే కోవింద్ గురించి ముందే మనం ఒక అభిప్రాయానికి రాకూడదు. ఏమో, ఆయన సంశయవాదులందరినీ విస్మయపరుస్తారేమో! తాజాకలం: జ్ఞానీ జైల్సింగ్ గురించి అంతగా నచ్చని విషయాలు కొన్ని ముచ్చటించుకున్న తరువాత, ఆయన తెలివితేటలు ఎలాంటివో సరసత, రాజకీయ చతురత ఎంతటివో చెప్పే ఒక ఘట్టాన్ని గుర్తు చేసుకోవడం కూడా న్యాయంగా ఉంటుంది. 1987 ఫిబ్రవరిలో నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు జియా ఉల్హక్ క్రికెట్ మ్యాచ్ వీక్షించే మిషతో భారత్కు వచ్చారు. ఆ సందర్భంలోనే జైల్సింగ్ను ఆయన కలుసుకున్నారు. అప్పుడే, ‘తనకూ ఒక ప్రధానమంత్రి ఉండేవారని (జునేజో), ఆయన రాష్ట్రపతి జైల్సింగ్ వలెనే ఉత్సవ విగ్రహం వంటివార’ంటూ పంజాబీలో జియా ఒక జోక్ పేల్చారు. ‘అయితే చిన్న తేడా ఉంది జియా గారూ!’ అంటూ జైల్సింగ్, ‘నా పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందో నాకు కచ్చితంగా తెలుసు. కానీ మీరు ఎంతకాలం ఉండదలుచుకుంటే అంతకాలం పదవిలోనే కొనసాగవచ్చు’ అన్నారు. జైల్సింగ్ ఐదేళ్లు ముగియగానే పదవీవిరమణ చేశారు. తరువాత జియా ఒక సంవత్సరం వరకు పదవిలో ఉన్నారు–సి–130తో ఆయన ఖర్మ కాలేదాకా. శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఒక పతనం.. ఒక ఉత్థానం..!
జాతిహితం మీరు యూపీఎస్సి పరీక్షలకోసం సిద్ధమవుతున్నవారిలో భాగం కానట్లయితే, ఒలింపిక్స్లో నిజమైన బంగారు పతకాన్ని భారత హాకీ జట్టు ఎప్పుడు గెల్చుకుందనే విషయం మీకు గుర్తు ఉండకపోవచ్చు. నిజమైన అని ఎందుకంటున్నానంటే 1980లో మాస్కో ఒలింపిక్స్లో మనకు హాకీలో స్వర్ణ పతకం ఒక మినహాయింపు కింద లభించింది. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్పై సోవియట్ దాడికి నిరసనగా బలమైన హాకీ జట్లు మాస్కో ఒలింపిక్స్ను బహిష్కరిం చాయి. పై ప్రశ్నకు సమాధానం.. 1968లో మెక్సికో నగరంలో మనం హాకీలో కంచుపతకం సాధించాం అన్నదే. దాని తర్వాత 1975లో కౌలాలంపూర్లో ప్రపంచ కప్ గెల్చుకోవడమే భారత హాకీ సాధించిన ఏకైక పెద్ద ట్రోఫీగా మిగిలిపోయింది. 60ల వరకు ప్రతి ప్రపంచ స్థాయి పోటీలోనూ భారత్–పాకిస్తాన్ హాకీ జట్లు ఫైనల్ చేరడం రివాజుగా ఉండేది. నిజం చెప్పాలంటే, పాకిస్తాన్ జట్టు నేటికీ తొలి మూడు లేదా నాలుగో స్థానంలో నిలబడటానికి కాస్త పోరాటం సాగిస్తోంది. ఒలింపిక్, ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలకు అర్హత పొందడానికి కొట్టుమిట్టులాడుతూ చివరకు విఫలం అవుతున్న చందాన భారత హాకీ అంతిమ దిశకు చేరుకున్న విధంగా పతనమైపోయింది. దీనికి మనం ముందుగా భారతీయ హాకీ సమాఖ్య అధికారులను తప్పు పట్టాల్సి ఉంటుంది. తర్వాత క్రీడాకారులకు ప్రోత్సాహకాల లేమిని, చివరగా ఆస్ట్రో టర్ఫ్ (అన్ని వాతావరణాల్లో, వర్షంతో పని లేకుండా హాకీ అడటానికి వీలిచ్చే కృత్రిమ ఉపరితలం)ని ప్రవేశపెట్టడాన్ని తప్పుపట్టాలి. గతంలో 9 ఒలింపిక్ స్వర్ణాలు, ఒక ప్రపంచ కప్ సాధించిన బలుపుతో హాకీ అధికారి కంగా మన జాతీయ క్రీడగా కొనసాగుతున్నప్పటికీ మనం హాకీ గురించి మాట్లాడుకోవడం మానేశాము. అనివార్యంగా పాకిస్తాన్ కూడా పెద్ద లీగ్ పోటీల్లో అర్హత సాధించలేక పతనమైపోయింది. ఎనిమిది దశాబ్దాలపాటు ప్రపంచాన్ని శాసించిన ఉపఖండ హాకీ శకం ముగిసిపోయింది. జన్మస్థానంలోనే మహాపతనం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్తో పాటు యూరోపియన్ దేశీయ లీగ్, జాతీయ జట్లు కూడా ముందుగా భారత్పై, తర్వాత పాకిస్తాన్పై టెన్నిస్ తరహా స్కోర్లు సాధించడం రివాజుగా మారిపోయింది. అంతర్జాతీయ హాకీ సంస్థ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా భీతిల్లుతున్న స్థాయికి మనదైన హాకీ పతనమైపోయింది. హాకీకి జన్మస్థానమైన ఉపఖండంలోనే అది పూర్తిగా అంతరించిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న చింతతో వీరు ఇప్పుడు ఆటను కాపాడే పేరుతో భారతీయ హాకీ సమాఖ్యకు డబ్బులు గుమ్మరించడం ప్రారంభించారు. ఈ భీతితో కూడిన ఔదార్యంతోనే ప్రముఖ విదేశీ కోచ్లు (ఆస్ట్రేలియన్ దిగ్గజ కోచ్ రిక్ చార్ల్స్వర్త్తోపాటు) భారత్కు హాకీ పాఠాలు బోధించడానికి వచ్చేశారు. హాకీ క్రీడ ఎంత మౌలికమార్పుకు గురైందంటే, బంతిని డ్రిబ్లింగ్ చేసే, అదుపులో ఉంచుకునే, ప్రత్యర్థిని ఏమార్చి బంతిని తప్పించే కళలో మన సాంప్రదాయిక నైపుణ్యాన్ని అది అసందర్భంగా మార్చి వేసింది. ఆస్ట్రో టర్ఫ్ కీలక సమస్య కాదు. అన్ని వాతావరణాలకు తట్టుకునే ఉపరితల పరిస్థితులను రూపొందించవలసిన అవసరం ఉంది. ఆటను వేగవంతంగా మార్చడంలో, గోల్ స్కోర్ చేయడంలో, రిఫరీ విజిల్స్ని పరిమితం చేయడంలో మార్పు తీసుకొచ్చిన స్థితి ఇది. కాబట్టి హాకీ స్టిక్ వాడే సమయంలో తప్పులు చేయడాన్ని (గట్టిగా బాదుతున్నప్పుడు హాకీ స్టిక్ను భుజంకంటే పైకి ఎత్తకపోవడం), బంతిని ప్రత్యర్థి పాదాల కేసి కొట్టడాన్ని పరిమితం చేశారు. ఇలాంటి అనేక సందర్భాల్లో మీరు ఇప్పుడు ఆటను కొనసాగించవచ్చు. ఆటకు వేగాన్ని కల్పించడమే ఈ భావన ఉద్దేశం. ఈ క్రమంలో సంక్లిష్టమైన ఉపఖండ నిపుణతలు మనకు అందించిన సానుకూలతను ఇది ధ్వంసం చేసింది. ఆధునిక లేక కొత్త హాకీ పూర్తిగా పవర్ హిట్టింగ్, వేగంతో కూడి ఉంది. పాత ఆసియన్ అటాకింగ్ సూత్రం 5–3–2–1 (అయిదుగురు ఫార్వర్డ్లు) భూస్థాపితమైపోయింది. కొత్త నిబంధనల వల్ల మీ డేంజర్ ఏరియా కుడివైపున పొంచివున్న ప్రత్యర్థి అటాకర్ లాంగ్ పాస్ని అడ్డగించి బంతిని గోల్లోకి తోసే అవకాశం ఉంటోంది. ఫీల్డ్ హాకీ అనేది షూకింద జారడానికి ధరించే స్కేట్లు లేని ఐస్–హాకీలా మారిపోయింది. మీకు బలం, వేగం, అవకాశం కోసం పొంచుకుని ఉండటం సాధ్యమైతే గోల్ చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. ఈ తరహా ఆట యూరోపియన్లకు సరిగ్గా సరిపో యింది. అక్కడే హాకీ స్వర్ణయుగాన్ని అది తన చేతుల్లోకి తీసేసుకుంది. అధికారం చలాయించేవాళ్లదే ఆధిపత్యం యూరోపియన్ల గుత్తాధిపత్యంలోని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్)ను 1924లో నెలకొల్పినప్పటినుంచి 2017లో భారతీయుడైన నరేందర్ బాత్రా కీలక స్థానం పొందేంత వరకు, ఆసియా ఆధిపత్యంలోని హాకీ క్రీడకు సంబంధించినంతవరకూ ఏ యూరోపియనేతర వ్యక్తి కూడా సమాఖ్య అత్యున్నత పదవిని చేపట్టలేకపోయాడు. అధికారం ఉన్న చోటే గేమ్ విధి నిర్ణయమైపోయింది. ఈ సమస్య ఇంకా ముందుకెళ్లింది. దీంతో మరొక సమస్య ఏర్పడింది. హాకీకి పతకాలు ఉన్నాయి కానీ మార్కెట్లు లేవు. డబ్బులు లేవు. హాకీ అంతర్జాతీయంగానే పతనమైపోయింది. మీకు అధికారం లేనట్లయితే అంతర్జాతీయ స్థాయిలో ఆ ఆటపై ఆధిపత్యం ఉన్న యజమానులు మీపై కూడా ఆధిపత్యం చలాయిస్తారన్నదే ఈ తొలి కథ గుణపాఠం. ఇక రెండో కథ క్రికెట్కి సంబంధించింది. భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఇంగ్లిష్ క్లబ్ వ్యవస్థ నుంచి తన క్రికెట్ని వారసత్వంగా పొందింది. కానీ భారత్ లాగా కాకుండా పాక్ ప్రభుత్వం ప్రారంభం నుంచే క్రికెట్పై ఆజమాయిషీని తనవద్దే పెట్టుకుంది. క్రికెట్పై ఆజమాయిషీ చేయడం జాతీయ విధి అని పాక్ పాలక వర్గం భావించింది. ప్రభుత్వాధికారం కిందే ఒక లెఫ్టినెంట్ జనరల్, ఒక అత్యున్నతాధికారి, రాజకీయ నేతలు, ఇప్పుడు ఒక సంపాదకుడు పీసీబీని నిర్వహించడానికి నియమితులవుతూ వస్తున్నారు. ప్రధాని లేదా అధ్యక్షుడు బోర్డు ప్రధాన సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. విషాదకరమైన విషయం ఏమిటంటే, ఒక క్రికెటర్ లేదా ప్రొఫెషనల్ తప్ప మరెవరైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నిర్వహించే అవకాశముంది. దీని ఫలితం ఏమిటి? దేశంలో గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్కు దీనివల్ల జరిగిన మంచి ఏమిటి? అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్, చీటింగ్, బాల్ ట్యాంపరింగ్, విదేశీ జైళ్లలో దాని టెస్టు ప్లేయర్లు శిక్ష అనుభవించడం, తిరిగొచ్చాక మళ్లీ దేశం కోసం ఆడటం. దాని ఆర్థిక వనరులు సంవత్సరాలుగా కుప్పగూలిపోయాయి. పాక్ క్రికెట్ బోర్డు 2004లో భారత్ పర్యటన సమయంలో మాత్రమే వాస్తవంగా చివరిసారిగా లాభాలను ఆర్జిం చింది. ఉగ్రవాదుల హెచ్చరికలు దేశీయ క్రికెట్ను ఇప్పుడు ధ్వంసం చేశాయి. కాని వాస్తవానికి గత ఏడు దశాబ్దాలుగా పాకిస్తాన్ దేశీయ క్రికెట్ భారత్లాగా ఎన్నడూ అభివృద్ధి చెందింది లేదు. ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లను అందరినీ ఆకర్షించిన ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ పతనంతో పాకిస్తాన్ క్రికెట్కు పెనుదెబ్బతగిలింది. కానీ ఆ పరిణామం భారత్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. వాస్తవానికి ప్రపంచంలోని ఉత్తమ ప్రతిభా సంపన్నులను ఆకర్షిస్తున్నదీ, వారిని ఇక్కడ ఆడిస్తున్నదీ భారత్ మాత్రమే. ప్రభుత్వం కానీ, న్యాయవ్యవస్థ కానీ ఎంత సదుద్దేశంతో అయినా సరే.. ప్రైవేట్ నాయకత్వంలో నడుస్తున్న ఒక ప్రొఫెషనల్ క్రీడలో జోక్యం చేసుకుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయినేది ఈ రెండో కథ చెబుతోంది కదా. వైఫల్యాలనుంచే పునరుజ్జీవం ఇక మూడవది అత్యంత సంతోషకరమైన కథ. భారత హాకీని ఎలా పునరుద్ధరించవచ్చు అని చెబుతుందిది. దాదాపుగా అంత్యదశకు చేరుకున్న హాకీ క్రీడ బాధ్యతను కొత్త నాయకత్వం చేపట్టింది (ప్రభుత్వ మద్దతుతోనే), పైగా భారత క్రికెట్ను నిర్వహిస్తున్న వారి సలహా కూడా భారత హాకీ బోర్డు తీసుకుంటోంది. దేశీయంగా కూడా హాకీ లీగ్ పోటీల నిర్వహణకు ప్రయత్నం జరిగింది. కొన్ని వైఫల్యాలున్నప్పటికీ ప్రపంచంలోనే ఉత్తమ క్రీడాకారులను ఆకర్షించడం ద్వారా ఇది వాస్తవంగానే విజయం సాధించింది. దీంతో రాంచీ వంటి చిన్న పట్టణాల్లో కూడా స్టేడియంలు కళకళలాడాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు దేశీయ లీగ్ పోటీలు విలాస జీవితాన్ని కల్పించాయి. కానీ, భారత్ ప్రపంచ విజేతగా మారలేదు. యూరోపియన్ నిబంధనలతో కూడిన హాకీ ఇప్పటికీ ఆసియా ఖండ జట్టుకు సవాలుగానే ఉంటోంది. కానీ భారత్ ఇప్పుడు ఆసియా నంబర్ వన్ గానూ ప్రపంచ హాకీలో 6వ స్థానంలోనూ ఉంటోంది. తద్వారా వరల్డ్ కప్, ఒలింపిక్స్, చాంపియన్స్ ట్రోఫీలకు ఆటోమేటిక్గా అర్హత సాధించింది. ప్రధాన జట్లపై మన జట్టు ఆటతీరు మెరుగుపడింది. వాస్తవానికి ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లపై భారీ స్కోరుతో ఓడిపోయిన ఘటనలు మన జ్ఞాపకాల నుంచి తొలిగిపోతున్నాయి. ప్రపంచ స్థాయిలో గెలుపొందనప్పటికీ, స్వర్ణం గెలుచుకున్న రోజుల కంటే ఇప్పుడే భారత హాకీ ప్రపంచ హాకీ శక్తిగా పేరు సాధించింది. భారత్ హాకీకి మార్కెట్ను సాధించి దాన్ని ప్రపంచానికి బహుమతిగా అందించింది. దీని ఫలితం ప్రపంచ స్థాయి ఉత్తమ ఆటగాళ్లు ఇక్కడికి రావడమే కాకుండా ఈ సంవత్సరం అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు ఒక భారతీయుడు అధ్యక్షుడయ్యారు. పతకాల కంటే అధికంగా డబ్బే మాట్లాడే అంతర్జాతీయ క్రీడలో మీ ఆర్థిక బలాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేందుకు ఇది గొప్ప పాఠం. ప్రపంచ క్రికెట్ను ‘లార్డ్స్’ నడుపుతున్నప్పుడు 1971–72 మధ్య కాలంలో భారత్ తన స్పిన్ బలంతో కేవలం రెండంటే రెండు సీరీస్లు నెగ్గగానే వారు లెగ్ ట్రాప్లోని ఫీల్డర్లపై నిబంధనలు విధించారు. తర్వాత వెస్టిండీస్ తమ పేస్ బౌలింగుతో శివతాండవమాడుతున్నప్పుడు ఈ కులీనులే బౌన్సర్లపై పరిమితి విధించారు. నలుగురు ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యంలోంచి పెరుగుతూ వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ ఆనాటినుంచి కోలుకోలేదు. అలాంటి ఘటనలు గత రెండు దశాబ్దాలుగా జరగక పోవడానికి కారణం.. అధికారాన్ని ఎలా ఉపయోగించాలో భారత్ తెలుసుకుని ఉండటమే. ఇప్పుడు మళ్లీ అలాంటి అధికారాన్ని వదులుకుని మంచి బాలురుగా మారిపోవాలని మనల్ని ఆదేశిస్తున్నారు. నన్ను నమ్మడం లేదా.. అయితే ఐసీసీకి చెందిన నిర్వాహక కమిటీ (సీఓఏ) ఇటీవలే బీసీసీఐకి జారీ చేసిన రెండు ఫర్మానాలను ఒకసారి చూడండి. శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘భద్రత’పై వీరూ వారూ ఒకటే తీరు
జాతిహితం మావోయిస్టు ప్రాంతాలలో, ఈశాన్యంలో కొనసాగుతున్న సమస్యలూ, పెచ్చరిల్లుతున్న గోరక్షకుల దాడులూ, భద్రతా బలగాలకు వాటిల్లుతున్న నష్టాలూ కలిస్తే బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మోదీ ప్రభుత్వం యూపీఏలా బలహీనమైనదిగా, దిక్కు తోచనిదిగా, ఊగిసలాడేదిగా కనబడటానికి వీల్లేదు. కానీ అంతర్గత భద్రతా వైఫల్యాలు పోగుపడుతున్నాయి. అవి మోదీ జనాకర్షణను బద్ధలుకొట్టే స్థాయికి చేరవచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆగ్రహిస్తే ఇక మీకు ఓటు వేయనేకూడదనే నిర్ణయానికి రావచ్చు. అంతర్గత భద్రతాపరంగా తగులుతున్న ఎదురు దెబ్బలకు ట్వీటర్ లేని రోజుల్లోనైతే భారత ప్రభుత్వం సరిగ్గా ఎలా స్పందించి ఉండేది? దాదాపుగా ట్వీటర్ ఉన్న నేటి రోజుల్లో లాగానే స్పందించి ఉండేది. ఈ విషయానికి సంబంధించి ఎన్డీఏ అనుసరిస్తున్న తీరు దాదాపుగా యూపీఏ వైఖరినే పోలి ఉంది. యూపీఏ అత్యంత అనువుగానూ, వేగంగానూ స్పందిస్తుండటం ఒక్కటే ఉన్న తేడా. రెండూ చేసేది ‘‘పిరికి’’, ‘‘విద్రోహకర’’, ‘‘జాతి వ్యతి రేక’’ అనే సుపరిచితమైన పద క్షిపణులను ప్రయోగించడమే. ఇక డాక్టర్ మన్మోహన్సింగ్ ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘‘హేయమైన’’ అనే మహావిధ్వంసక ఆయుధం ఉండనే ఉంది. ఆ తగిలిన ఎదురుదెబ్బే గనుక ఈ వారం బస్తర్ అంత్యక్రియలకు హాజరుకావాల్సి రావడం లాంటి అత్యంత ఇబ్బందికరమైన దైతే... ఆగ్రహంతో ట్వీట్లను సంధించాక అత్యున్నత స్థాయి సమావేశాలు జరి గాక జవాన్ల త్యాగాలను వృ«థా పోనివ్వమనే వాగ్దానాలు వెలువడతాయి. ఆ తర్వాత 48 గంటలలోనే, అంతకంటే ముందే కాకున్నా, మరేదో దుర్గంధాన్ని వెదజల్లే ఘటన ఆ రోజుకు జరిగి దీన్ని మరచిపోతారు. బస్తర్ ఘటన జర గడంతోనే అంతకు ముందే జరిగిన కుప్వారాను మరచిపోయినట్టే, బస్తర్ కూడా కొన్ని గంటల్లో మరుగున పడిపోయింది. వినోద్ ఖన్నా మరణ వార్తే అందుకు కారణం. యూరీ ఘటన తర్వాత జరిగిన సర్జికల్ స్రై్టక్ను (లక్ష్యిత దాడి) మిన హాయిస్తే... యూపీఏ ప్రభుత్వానికి వెన్నెముక లేదంటూ ఒకప్పుడు బీజేపీ నేతలు అతి మొరటుగా తీవ్ర ఖండనలు చేసినట్టుగానే నేటి ప్రభుత్వమూ స్పందిస్తోంది. స్మృతి ఇరానీ గాజులు పంపి హేళన చేయడాన్ని గుర్తుకు తెచ్చు కోవచ్చు. 26/11 ముంబై ఉగ్ర దాడులలో జాతీయ భద్రతా బలగాలు ఇంకా ఉగ్రవాదులతో పోరాడుతుండగానే... నరేంద్ర మోదీ ఆ పక్కనే ఉన్న ఒబె రాయ్ హోటల్ వద్దకు వచ్చి వాలడాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. పక్కరాష్ట్రం సీఎం అలా రావడం అసాధారణమైనది. మన్మోహన్ సింగ్, శివ రాజ్ పాటిల్లనూ, ఆ తదుపరి సుశీల్ కుమార్ షిండేను అవహేళన చేశారు. యూపీఏకు ఎసరు తెచ్చిన అంతర్గత భద్రతా వైఫల్యాలు యూపీఏ ప్రభుత్వం అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి వరు సగా తప్పులు, శుద్ధ మూర్ఖపు పనులు చేసింది. దీంతో ఆ ప్రభుత్వం అంత ర్గత భద్రతా సమస్యల విషయంలో బలహీనమైనదని, దాని నాయకత్వం వెన్నెముకలేకపోవడాన్ని మించి అధ్వానమైనదని ప్రజలకు నమ్మకం కలి గింది. దేశం లోపలి జిహాదీలు, మావోయిస్టులు ఇరువురితోనూ యూపీఏ కుమ్మక్కయిందన్నట్టుగా చూశారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత కాంగ్రెస్, ముస్లిం జిహాదీ గ్రూపులకు సంబంధించి ద్విముఖ వైఖరిని అను సరించింది. ఇది, ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ మెత కగా ఉంటోందనే భయాలను ధ్రువీకరించింది (ఆ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ముజాహిదీన్లతోపాటు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కూడా మరణించారు). ఆ ఇన్స్పెక్టర్కు మరణానంతరం శాంతికాలపు అత్యున్నత సాహస పురస్కారమైన అశోకచక్రను ప్రదానం చేశాక అది అనుసరించిన దాటవేత ధోరణి ప్రత్యేకించి హానికరమైనది. ఇక మావోయిస్టుల విషయానికి వస్తే రెండు విషయాలు అదే భావనను ధ్రువీకరించాయి. ఒకటి, పి.చిదంబరం మావోయిస్టుల పట్ల అనుసరించిన వైఖరిని రాజకీయంగా తోసిపుచ్చడం. నిజానికి ఆయన విధానం వల్ల ఇద్దరు పొలిట్ బ్యూరో సభ్యులు మరణిం చడమే గాక కొందరు అరెస్టయ్యారు కూడా. ఇక రెండవది, దేశద్రోహ ఆరోపణలకు శిక్ష పడ్డ డాక్టర్ బినాయక్ సేన్ను ప్రణాళికా సంఘానికి సంబంధించిన ఒక ముఖ్యకమిటీలో సభ్యునిగా తీసుకోవడం. 2014లో బీజేపీ ఘన విజయం తదుపరి జరిగిన విశ్లేషణంతా యూపీఏ 2 ఆర్థిక విధానపరమైన నిష్క్రియా పరత్వంపైనే సాగింది. కానీ అంతర్గత భద్రతాపరమైన సవాళ్ల విషయంలో అది పిరికితనంతో వ్యవహరిస్తోందన్న భావనే ఆ ప్రభుత్వంపై భ్రమలు తొల గడాన్ని.. మహోపద్రవకరమైన ప్రభుత్వ వ్యతిరేకతగా మార్చింది. ప్రధాని మోదీ తన మూడేళ్ల పదవీ కాలం తర్వాత తనకు సంక్రమించిన అంతర్గత భద్రతాపరమైన మంచీ చెడుల పట్టీతో పోలిస్తే తన పనితీరును ఎలా ఉందని అంచనా వేయగలుగుతారు? 2014లో కశ్మీర్ సమంజసమై నంత శాంతంగానే ఉంది, అదిప్పుడు భగ్గున మండుతోంది. కశ్మీర్ లోయలో ఇంతకు ముందూ ఇలాంటి తీవ్ర తిరుగుబాట్లు జరిగాయి నిజమే. కానీ కశ్మీ ర్కు సంబంధించిన అనుభవజ్ఞులను ఎవరినైనా అడిగి చూడండి.. అక్కడి ప్రజలు ఇంతకు మునుపెన్నడూ ఇంతగా విరక్తిచెంది లేరని చెబుతారు. ప్రత్యర్థి పీడీపీతో కలవాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కుప్పకూలింది. పరస్పర విరుద్ధ భావజాలాలను సమన్వయించడంలో అత్యు న్నత స్థాయి నాయకత్వపు వైఫల్యమే అందుకు ప్రధాన కారణం. గత ఎన్నికల తర్వాత ఈ అసహజమైన కలయిక తప్ప మరే ఇతర ఏర్పాటైనా రెండు జాతుల సిద్ధాంతాన్ని మరో రూపంలో ముందుకు తెస్తుంది, రాష్ట్రాన్ని ‘‘ముస్లిం’’ లోయ, ‘‘హిందూ’’ జమ్మూలుగా విభజిస్తుందనేదే ఆ కలయికకు నైతిక, వ్యూహాత్మక, రాజకీయ సమర్థనగా ఉండేది. ఆ కూటమి సక్రమంగా పని చేయగలిగేలా బీజేపీ మరింత సహనాన్ని ప్రదర్శించాల్సింది. గోమాంస నిషేధం, ముసారత్ అలాం విడుదలవైపు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ దృష్టిని మళ్లనీయకుండా ఉండాల్సింది. నికరంగా కలిగిన ఫలితమే నేటి ఆగ్రహభరితమైన, హింసాత్మకమైన అల్లర్లు. మోదీ వాగ్దానం చేసినది ఇదేనా? తాజాగా తగిలిన రెండు ఎదురుదెబ్బలు మినహా మావోయిస్టుల విష యంలో మోదీ ప్రభుత్వం పురోగతిని ప్రదర్శించింది. తగినంత క్షేత్ర స్థాయి నిఘా సమాచారంగానీ, పారా మిలిటరీ బలగాల మోహరింపుగానీ లేకుం డానే చేపట్టిన రోడ్ల నిర్మాణ కార్యక్రమంలోని బలహీనతలను ఇటీవలి రెండు ఎదురుదెబ్బలూ బట్టబయలు చేశాయి. ఈ రెండు ఘటనలలోనూ భద్రతా బలగాల స్పందన అధ్వానంగా ఉన్నట్టు, అప్రతిష్టాకరమైన నాయకత్వ వైఫ ల్యాలు, తేలికగా మంచి ఆయుధాలను కోల్పోవడం కనిపించాయి. గత రెండు నెలల్లో మావోయిస్టులు ఒక అటవీ యుద్ధ బెటాలియన్కు ఉండే అత్యున్నత స్థాయి ఆయుధ సంపత్తికి సమానమైన ఆయుధాలను కొల్లగొట్టారు. వాటిలో అసాల్ట్ రైఫిల్స్, లైట్ మెషిన్ గన్స్, గ్రనేడ్ లాంచర్స్, వీహెచ్ఎఫ్ రేడియో సెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. మావోయిస్టులు తమ పాశవికత గుర్తుండిపోయేలా కొందరు జవాన్ల మృతదేహాలను ఛిద్రంచేసే వరకు ఘటనాస్థలిలోనే ఉన్నారు కూడా. భద్రతా దళాలలో రేగే ఆగ్రహాన్ని, తమకు ఏర్పడే సంకటాన్ని దృష్టిలో ఉంచుకుని సీఆర్పీఎఫ్ అగ్ర నాయకత్వం ఆ విషయాన్ని ఖండించింది. కానీ ఆలస్యం జరగనే జరిగిపోయింది. జవాన్లలో ఆ ఘోర చిత్రాలు పంపిణీ అవుతూనే ఉన్నాయి. మీడియాలోని బాధ్యతా యుతమైన విభాగం వాటిని ప్రచురించకున్నా, అవి బయటకు రావడానికి ఎంతో కాలం పట్టదు. 2014లో మోదీ వాగ్దానం చేసినది ఈ పరిస్థితిని మాత్రం కాదు. ఈ వారం జరిగిన మాటు దాడి ఉదయం 11.30కి జరిగింది. అంటే నిజంగానే గట్టి ప్రభుత్వం ఏదైనా గానీ హంతకులను అటకాయించడానికి, వేటాడటానికి తగినంత పగటి వెలుతురుంది. కాబట్టి హెలికాప్టర్లలో మరింత సుశిక్షితులైన తాజా బలగాలను రంగంలోకి దించాల్సింది. అది జరగకపోవ డానికి ఒక కారణం, సీఆర్పీఎఫ్ బలగాలకు అవసరమైన సాధనసంపత్తి లేక పోవడం. ‘‘గట్టి, జాతీయవాద’’ ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ప్రద ర్శించిన అదే సంసిద్ధతారాహిత్యాన్ని, దృష్టి కేంద్రీకరణ కొరవడటాన్ని కొన సాగించింది. సరిగ్గా అందుకే యూపీఏను బీజేపీ అప్పట్లో విమర్శించింది. ప్రమాదకరమైన ఎత్తుగడలు నేటి భారత అంతర్గత భద్రతా పటాన్ని 2014 మే నాటి పటంతో పోల్చి చూస్తే, నేటి చిత్రమేమీ మోదీని పొగడదగ్గదిగా ఉండదు. గురుదాస్పూర్, పఠాన్కోట, యూరీ ఉగ్రదాడుల తదుపరి మోదీ ప్రభుత్వం విఫలమైందన్న భావన ఉప్పొంగుతుండగా జరిపిన సర్జికల్ స్రై్టక్స్ ఆయన ఆ వెల్లువ నుంచి గట్టెక్కడానికి తోడ్పడ్డాయి. కానీ ఒకే చెక్కును మళ్లీ మళ్లీ నగదుగా మార్చు కుంటూ ఉండలేరు. కశ్మీర్ అదుపు తప్పడాన్ని... ఆయనా, ఆయన పార్టీ చాక చక్యంగా... పాక్ను తప్పుపట్టడం, ఇస్లామిజం పెరుగుదల, సైనికులు వారికి విరుద్ధంగా రాళ్లు రువ్వే ద్రోహులు అంటూ మిగతా దేశానికంతటికీ ఒక రాజ కీయ సందేశాన్ని çపంపడానికి వాడుకోగలిగారు. ఇది ఆ పార్టీకి అనుకూలంగా ఓట్ల కేంద్రీకరణ జరగడానికి కూడా తోడ్పడి ఉండొచ్చు. కానీ ఈ ఎత్తుగడలు సుస్థిరమైనవి కావు, ప్రమాదకరవైనవి. కుప్వారాలా ముగిసే ఒక ఘటన లేదా యూరీ నరమేధంలాంటి ఒక్క ఘటన జరిగితే చాలు. లేదా ఏదైనా ఒక సీఆర్పీఎఫ్ లేదా సైనిక దళం నెలల తరబడి ఒత్తిడికి గురై, అదువు తప్పి హింసాత్మకమైన ఓ బృందంపై కాల్పులకు దిగితే... అది 1990 నాటి గాక్డాల్ తరహా నరమేధానికి తలుపులు తెరుస్తుంది. 27 ఏళ్ల క్రితం జరిగినా ఆ ఘటన నేటికీ మాయని మచ్చగానే మిగిలి ఉంది. ఇప్పుడు చెప్పిన పరిస్థితులేవీ దురదృష్టవశాత్తూ అవాస్తవికమైనవి కావు. కశ్మీర్ సమస్యను మరింత పెద్దదిగా, నిరాశామయమైనదిగా చేసి చూపే పక్షపాతపూరితమైన రాజకీయాలు ఇంతవరకూ ఫలితాలను ఇచ్చి ఉంటే ఉండొచ్చు. కానీ మావోయిస్టు ప్రాంతాలలో, ఈశాన్యంలో కొనసాగుతున్న ఇబ్బందులూ, నానాటికీ పెచ్చరిల్లుతున్న గోరక్షకుల దాడులూ, భద్రతా బల గాలకు వాటిల్లుతున్న నష్టాలూ కలిస్తే బీజేపీ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యలపై అది బలహీనమైనదిగా, దిక్కుతోచనిదిగా, అనిశ్చి తితో ఊగిసలాడేదిగా కనబడటానికి వీల్లేదు. ప్రత్యేకించి తనకు ముందటి యూపీఏ ప్రభుత్వం అలాంటిదే కాబట్టి అసలే అలా అనిపించకూడదు. మోదీకి ఉన్న జనాకర్షణశక్తి ప్రబలమైనదే గానీ మరణాల పెరుగుదల, పరి స్థితి అదుపు తప్పడం కొనసాగుతుండటాన్ని అది కప్పిపుచ్చలేదు. త్వరలోనే దాన్ని బలహీనతగా, అసమర్థతగా చూడటం మొదలవుతుంది. అంతర్గత భద్రతా వ్యవహారాలలోని వైఫల్యాలు ఇప్పుడు కుప్పగా పోగుపడుతు న్నాయి. అవి మోదీ జనాకర్షణను బద్ధలుకొట్టే స్థాయికి చేరే దశ రానూ రావచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఆగ్రహించినప్పుడు మీకు గాజులు పంపడానికైనా వెనుకాడరని ఎన్నికల చరిత్ర చెబుతోంది. వాళ్లు ఇక మీకు ఓటు వేయనేకూడదనే నిర్ణయానికీ రావచ్చు. twitter@shekargupta శేఖర్ గుప్తా -
కశ్మీర్ను చేజార్చుకుంటున్నామా?
జాతిహితం కశ్మీర్కు సైనికపరమైన ముప్పు అనే భావన 1965లో నిజమైనది. నేడు దాదాపు అలాంటి పరిస్థితి లేదు. కాకపోతే మనం మన సొంత ప్రజలనే సైనిక ముప్పుగా చూసే పరిస్థితి ఏర్పడటానికి కృషి చేశాం. అదే నాటికి నేటికీ తేడా. 52 ఏళ్ల తర్వాత గతంలోలాగే మన ఆలోచన సైనికమైనదిగా సాగుతుండటం ఆందోళనకరం. కశ్మీర్ భౌగోళికంగా సురక్షితం గానే ఉన్నా... ఉద్వేగాలపరంగా, మానసికస్థితిపరంగా అది వేగంగా చే జారిపోతోంది. సరిగ్గా అందుకే అది చర్చించాల్సిన అంశం కావచ్చు. కశ్మీర్ మన చేజారిపోయిందా? స్పష్టత కోసం చెప్పే సమాధానం లేదు అనే. అయితే దాన్ని వెన్నంటే ఎన్నో షరతులు, హెచ్చరికలను చెప్పుకోవాల్సి ఉంటుంది. 1947 నుంచి ఇలాగే కశ్మీర్ను మనం చాలా సార్లు చేజార్చు కున్నాం. మొదటిసారి, పాకిస్తానీ సాయుధ దుండగులు శ్రీనగర్ విమానా శ్రయంపై విరుచుకుపడబోతుండగా... చిన్న డకోటా విమానాలు ఒక్కొక్క సారి ఒక్కొక్కటి దిగుతుండగా లెఫ్టినెంట్ జనరల్ (ఆ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్) నేతృత్వంలో మన సేనలు అక్కడకు చేరాయి. అప్పుడు పరిస్థితి ఏ ఆశా లేదన్నట్టే ఉండింది. రెండోసారి 1965లో కశ్మీర్ మన చేజారిపోయింది. అది నిజానికి చైనా యుద్ధంలో భారత్ దెబ్బ ఉన్న 1962లోనే పాక్ ప్రారం భించిన పెద్ద పన్నాగానికి తార్కికమైన ముగింపుగా జరిగిన దాడి. హజరత్ బల్లో పవిత్ర అవశేషం ‘‘దొంగతనానికి ’’ గురైన వెన్నంటి కశ్మీర్ లోయలో ప్రజా తిరుగుబాటు వెల్లువ పెల్లుబికింది. అదేసమయానికి కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వ ప్రాభవం బలíహీనపడుతోంది. దీంతో చివరకు అయూబ్ ఖాన్ దురాశాపూరితమైన ఆపరేషన్ జిబ్రాల్టర్ దాడిని ప్రారంభించారు. వేలాది మంది పాక్ సైనికులు ఆ దాడిలో కశ్మీర్ లోయలోకి చొరబడ్డారు. దాన్ని వెన్నంటే పాక్ చేపట్టిన ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ఛాంబ్ దాదాపుగా విజయవంతమైంది. కశ్మీర్ దాదాపుగా మన చేయి జారిపోయినట్టే అనిపిం చింది. చివరిసారి మనం కశ్మీర్ను సైనికంగా కోల్పోయినట్టనిపించినది ఆ 1965లోనే. అప్పటినుంచి 52 ఏళ్లు గడిచాయి. సైనిక ముప్పు లేకున్నా అదే ఆలోచనా తీరు ఆ తర్వాత అలాంటిది మళ్లీ జరగలేదు. 1971లో పాక్ సైన్యం పూంఛ్, ఛాంబ్లలో గొప్ప దృఢసంకల్పంతో దాడులను సాగించింది. ఆ తర్వాత 1969 కార్గిల్ దాడులతో కశ్మీర్పై భారత్ పట్టుకు ముప్పు వాటిల్లింది. అయినా ఈ అర్ధ శతాబ్ది కాలంలో భారత్ చేతిలో గతంలో కంటే కొంత ఎక్కువ కశ్మీర్ భూభాగమే ఉంటూ వచ్చింది. మరైతే మనం ఆందోళన చెందాల్సింది ఏముంది? సరిగ్గా ఇదే, 52 ఏళ్ల తర్వాత కశ్మీర్కు సంబంధించి చెప్పుకోదగిన సైనికపరమైన ముప్పు ఏమీ లేకపోయినా... మన ఆలోచన గతంలోలాగే సైనికీకరణకు చెందినదిగా సాగుతుండటమే ఆందోళనకరం. పాఠశాల సమావేశాల్లో మనం ‘‘దేశభక్తి’’ గీతాలను ఆలపిస్తుండిన ఆ రోజు ల్లోని ఆలోచనా రీతి అది. నేటి ఆలోచనకు ఆనాటి ఆలోచనకు ఉన్న తేడా ఒక్కటే. సైనిక ముప్పు అనే ఆనాటి భావన నిజమైనది. జనం చెప్పుకునే కథల్లో సైతం కశ్మీరీ లను స్థూలంగా జాతీయవాదులుగా, విశ్వసించదగ్గ వారుగా చూసేవారు. 1965లోని పాక్ చొరబాటుదార్లను స్థానికులు తిరస్కరించారని, వారి గురించిన సమాచారాన్ని అందించారని గుర్తుకు తెచ్చుకోండి. నేడు దాదాపుగా ఎలాంటి సైనికపరమైన ముప్పూ లేదు. కాకపోతే మనం మన సొంత ప్రజలనే సైనిక ముప్పుగా చూసే పరిస్థితి ఏర్పడటానికి శాయశక్తులా కృషి చేశాం. అదే నాటికీ నేటికీ ఉన్న తేడా. కశ్మీర్ భౌగోళికంగా సురక్షితంగానే ఉన్నా... ఉద్వేగాలపరంగా, మానసికస్థితిపరంగా అది వేగంగా మన చే జారిపోతోంది (ఇప్పటికే చేజారిపోకపోయి ఉంటే). సరిగ్గా అందుకే అది చర్చించాల్సిన అంశం కావచ్చు. ఇక్కడ మూడు ప్రశ్నలు తలెత్తుతాయి. మనకిది ఎలా తెలుసు? దీనిపట్ల మనకు చింతేమైనా ఉందా? చివరిది, మనం దీన్ని పట్టించుకోవాలా? ఇక మొదటి ప్రశ్నకు సమాధానం స్వయం విదితమే. ఇప్పటికి కొన్ని నెలలుగా లోయలోని కశ్మీరీలు లాఠీలు, తూటాలు, తూటా రవ్వలకు (పెల్లెట్స్) వీధుల్లోకి వస్తున్నారు. వారాలు గడిచేకొద్దీ మానవ కవచాలుగా వాడుతున్న తమ తోటి కశ్మీరీలను ‘‘త్యాగం’’ చేయడానికి సైతం సంకోచిం చకపోవచ్చు. నేడు పాక్ ఉగ్రవాదులతో నిజమైన ఎదురు కాల్పులు జరుగు తున్నప్పుడు వారు సైన్యాన్ని అడ్డగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రం లోని అత్యంత శక్తివంతుడిగా ఉన్న, వృద్ధ నేత బరిలో ఉన్నా, ఆ ఎన్నిక రాష్ట్ర రాజధానిలోనే జరుగుతున్నా, అందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసినా... కేవలం 7 శాతం ఓటర్లు మాత్రమే ఓటు చేయడానికి బయటకు వచ్చారు. కశ్మీర్ భూభాగంపై మీ పట్టు చెక్కుచెదరకుండా ఉన్నా కశ్మీర్ ప్రజలను మీరు పోగొట్టుకుంటున్నారనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరేం అక్కర్లేదు. రెండో ప్రశ్నకు మొదట సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది చాలా తేలిక. లేదు, మనకు ఏ చింతా లేదు. ఎందుకో చెప్పే వాదన దేశభక్తికి సంబంధించిన చాలా వాదనాల్లాగే చిన్నది, సునిశితమైనది నిర్ధాక్షిణ్యమైనది. మిమ్మల్ని ద్వేషిస్తున్న. దశాబ్దాలుగా దేశంపట్ల అవిధేయంగా ఉంటున్న, పాకి స్తాన్కు, మితవాద ఇస్లాంకు కట్టుబడిన మన సైనికులపై రాళ్లు రువ్వే ప్రజల ప్రేమను సాధించాలని తాపత్రయపడటం ఎందుకు? నేటి పునరుజ్జీవం పొంది అహంకరిస్తున్న పరివర్తనాత్మక భారతం మన ప్రధాన భూభాగంలో సినిమా హాల్లో జాతీయ గీతాన్ని వినిపిస్తుండగా లేచి నిలవకపోవడం వంటి సాపేక్షికంగా చిన్న నేరాలకు సైతం సామాన్య ప్రజలను చావగొట్టకపోయినా జైలుకు పంపుతోంది. అలాంటి దేశం ఇలాంటి బహిరంగ దేశద్రోహాన్ని ఎలా సహిస్తుంది? జరిగిందేదో జరిగింది ఇక చాలు. ఆ కశ్మీరీలకు భారత్ నచ్చక పోతే పాకిస్తాన్కు పోవచ్చు. ఇక మూడవ ప్రశ్న, కశ్మీరీలను మనం పట్టించుకోవాలా? ఇది మరింత సంక్లిష్టమైనది. మీరే గనుక సాధారణంగా కనబడే ఆవేశపూరిత దేశభక్తు లైతే... ఆ ‘‘దేశ ద్రోహులను’’ పాకిస్తాన్కు పోనివ్వండి అని బదులు చెబు తారు. ఆ తదుపరి కశ్మీర్ లోయకు ఇతర రాష్ట్రాలలోని జాతీయవాదులను (హిందువులను) పంపి ముంచెత్తండి. లేదా కొందరు బాధ్యతాయుతులైన అధికారపార్టీ నేతలు సూచిస్తున్నట్టు... కశ్మీరీలను అక్కడి నుంచి తరలించి, సుదూర రాష్ట్రాల్లోని శిబిరాలలో ఉంచండి. లేదంటే కొందరు పదవీ విరమణ చేసిన సీనియర్ జనరల్స్ గట్టిగా చెబు తున్నట్టు కనబడ్డవాళ్లను కనబడ్డట్టు కాల్చి పారేయండి, ఇక అదే సద్దుమణిగి పోతుంది. ఆ సాహస కృత్యాన్ని లైవ్ ప్రసారం చేయడానికి వీలుగా ఆ పనేదో పట్టప గలే చేయడం మంచిది. దాన్ని చూసి దేశద్రోహులు కాగల వారు నీరుగారిపో తారు. ఇది కశ్మీర్నే కాదు, భారతదేశాన్నే కచ్చితంగా పోగొట్టుకునే మార్గం. ఇక్కడ మనం భారతదేశాన్ని గురించిన కాల్పనికమైన ఊహాత్మక భావన గురించి కాదు, కఠోర వాస్తవా లను గురించి మాట్లాడుతున్నాం. భారత్ అంటే ఇజ్రాయెల్ కాదు, కాబోదు ఇజ్రాయెల్ అంటే మనకు అపారమైన ప్రశాంసాభావం ఉంది. అది 50 ఏళ్లుగా ప్రయత్నించి విఫలమైన మార్గమిది. 1967లో ఆరు రోజుల యుద్ధం చేసి అతి పెద్ద అరబ్బు భూభాగాలను ఆక్రమించింది అప్పటి నుంచి అది ఆ భూభాగాలను ఉంచుకుని, అక్కడి ప్రజలను తరిమేయాలనే భావనను రక రకాలుగా అమలు చేసి సఫలం కావాలని ప్రయత్నించింది. ఇజ్రాయెల్కు పాశ్చాత్యదేశాల మద్దతు, అత్యంత ప్రబలమైన సైనిక ఆధిక్యత ఉంది. ఆ దేశ సైన్యానికి, గూఢచార విభాగానికి అవధులులేని అధికారాలున్నాయి. అంతకు మించి ఆఫ్రికా, తూర్పు యూరప్ల నుంచి తమ పవిత్ర భూమికి వలస వచ్చే విధేయులైన సరికొత్త యూదు పౌరుల అంతులేని ప్రవాహమూ ఉంది. ఇజ్రా యెల్ ఎన్నో అరబ్బు తిరుగుబాట్లను అణచివేసింది. ఐరాసను, అంతర్జాతీయ ఒత్తిడులను లెక్కచేయక అది కనిపిస్తే కాల్చేస్తోంది. మొత్తంగా సమాజాన్నే సైనికీకరించింది. ఈ వ్యూహం అమలుకు అది ధన రూపేణానే కాదు యూదు ప్రాణాల రీత్యా, అంతర్జాతీయ ప్రతిష్ట రీత్యా అపారమైన మూల్యాన్ని చెల్లిం చింది. అది భూభాగాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ ఇంకా ఆ ప్రాంతాల్లో అరబ్బు ప్రజలు ఉండనే ఉన్నారు. గతంలో జోర్డాన్, సిరియా, ఈజిప్ట్, లెబ నాన్లను ఓడించిన మధ్యప్రాచ్యంలోకెల్లా అత్యంత ప్రబల సైనిక శక్తి ఈ స్వీయవినాశక శాశ్వత ప్రతిష్టంభనలో ఇరుక్కుపోయింది. ఇజ్రాయెల్లోని పలు జాతీయ లక్షణాలను ఈ రచయిత సహా మన మంతా ప్రశంసిస్తుంటాం. కానీ, భార తదేశం ఇజ్రాయెల్ కాదు, కాలేదు కూడా. అందువల్ల ఈ వ్యూహం ఆత్మహత్యాసదృశమైనది. ఇజ్రాయెల్ ఏర్ప డిందే యూదు దేశంగా. అక్కడ గణనీయమైన జనాభాగా ఉండే స్థానిక అరబ్బులకు ఓటు హక్కుంది. కానీ వారు సమాన పౌరులు కారు. భారత్లోని ముస్లింలు, క్రైస్తువులు, బౌద్ధులు, పార్సీలు, నాస్తికులలో ప్రతి ఒక్కరూ సమాన పౌరులే. అందరికీ ఉన్నవి ఒకే హక్కులు. రాష్ట్రపతి, ప్రధాన న్యాయ మూర్తి, రక్షణ బలగాలు, గూఢచార విభాగాల అధిపతులు సహా అత్యంత సున్నితమైన ఏ ఉద్యోగానికైనా లేదా పదవికైనా అందరూ అర్హులే. లాంఛ నంగా కశ్మీర్ను ఆక్రమిత ప్రాంతంగా ప్రకటించదలిస్తే తప్ప,ప్రధాన భూభా గంలో ఒక వ్యవస్థను, కశ్మీర్లో మరో వ్యవస్థను మీరు అనుసరించలేరు. ఒక దేశం రెండు వ్యవస్థలు అనేది చైనాలాంటి నియం తృత్వంలోనే మనగలుగు తుంది. హాంకాంగ్ విషయంలో అది అదే విధానాన్ని అమలుచేస్తోంది. రాజకీయ నాయకత్వానికి సవాలు గత ఆదివారం నేను ఢిల్లీలో జరిగిన భారత గూఢచార సంస్థ రా మాజీ అధిపతి గిరీష్ చంద్ర సక్సేనా (గారీ) స్మారకసభకు హాజరయ్యాను. 1991లో కశ్మీర్లో పాక్ చొరబాట్లు తారస్థాయికి చే రిన సమయంలో ఆయన కశ్మీర్కు గవర్నర్గా ఉన్నారు. ‘టైం’ పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్ ఎడ్వర్డ్ డెస్మండ్, నేనూ కలసి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని రోజులు గడపాలని, సాధ్యమైతే దగ్గరి నుంచి ఎదురుకాల్పులను చూడాలని అనుకున్నాం. ఆ సందర్భంగా నేను గారీ సాబ్ను కలిసినప్పుడు, కశ్మీర్ మన చేయిజారిపోయిందా? అని అడి గాను. అవి కశ్మీర్ తిరుగుబాటు తీవ్రంగా ఉన్న రోజులు అని గుర్తుంచు కోండి. ‘‘లేదు’’ అన్నారాయన ప్రశాంతంగా. ‘‘ఒక దేశం సమైక్యంగా నిల వాలంటే దానికా ఆత్మస్థయిర్యం ఉండాలి, మనకి అది ఉంది’’ అన్నారు. ఈ పోరాట దశ ముగిసిపోయి (ఆయనేం మెతక పద్ధతులు వాడినవారు కాదు) సాధారణ ప్రభుత్వ పాలన నెలకొన్నాక ప్రజలను ఆకట్టుకునేందుకు, భార త్లో ఉండటంవల్ల మేలు జరుగుతుందని వారికి నచ్చజెప్పేందుకు సంబం ధించిన రాజకీయ ప్రణాళిక మనకు అవసరం అన్నారు. మేం ఇప్పుడు చేస్తున్న పని తేలికపాటిదే. నిజమైన సవాలు రాజకీయ నాయకత్వపు విశాల హృదయానికి ఎదురయ్యేదే. నేడైనా ఆయన అవే మాటలు చెప్పి ఉండేవారు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఎవరికీ పట్టని భద్రతా సమస్య
జాతిహితం కొత్తగా ఖలిస్థానీ తీర్థం పుచ్చుకున్న కెనడా దిగుమతి బాపతు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రమాదాన్ని మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఎండగట్టలేదు? కెనడా ప్రభుత్వంలోని కొత్త సిక్కు మంత్రుల గతం గురించి మోదీ ప్రభుత్వం దానికి ఎందుకు గుర్తు చేయలేదు, వారు ఖలిస్థాన్ అనే ఆ కాల్పనిక లోకం నుంచి బయటపడ్డారనే విస్పష్టమైన హామీని ఎందుకు కోరలేదు? ఈ శక్తుల నుంచి ఆమ్ ఆద్మీకి నిధులు అందుతున్నా కాంగ్రెస్, బీజేపీలు ఆందోళన వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యకరం. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అమరీందర్సింగ్తో గురు వారం నాటి ‘ఆఫ్ ద కప్’ (యథాలాపం) అనే నా కొత్త సంభాషణ వేదికలో మాట్లాడాను. ఆ సందర్భంగా ఆయన ప్రత్యేకించి తమ పార్టీకి సంతోషం కలి గించి ఉండని పలు విషయాల గురించి మాట్లాడారు. వాటిలో మొదటిది ఎల క్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపట్ల ఆ పార్టీ వెలిబుచ్చుతున్న అనుమానానికి సమా« దానంగా చెప్పినది. ఆ మెషిన్లతో ఓట్లను తారుమారు చేయగలిగేట్టయితే ఇక్కడ నేను కాదు ‘ఎవరో ఒక బాదల్’ కూచుని ఉండేవారు అన్నారు. ఆయన పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా ప్రధాన నాయకత్వం ఇదే సమస్యపై రాష్ట్ర పతి భవన్కు నిరసన తెలపడానికి వెళ్లిన రోజే సరిగ్గా ఆయన ఇది చెప్పారు. ఆ తర్వాత ఆయన, జాతీయ పార్టీలు ఇకపై బలమైన ప్రాంతీయ నాయ కులు ఉండటం ముఖ్యమనే విషయాన్ని అంగీకరించక తప్పదని తన గెలుపు చాటిందని అన్నారు. ప్రజలు, తమ పరిపాలకులుగా తాము ఎన్నుకుంటు న్నది ఎవరినో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. జాతీయ నాయకులు వచ్చి ఓట్లు సంపాదించి పెట్టే ఆ రోజులు పోయాయి. మూడవది, అభ్యర్థుల ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం కూడా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అంత మంచి ఫలితాలను సాధించడానికి కారణాలలో ఒకటని చెప్పారు. గత ఎన్నికల్లో 117 మందిలో 46 మందే తాను ఎంపికే చేసినవారని, పర్యవసా నంగా ఓటర్ల నుంచి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొని తమ పార్టీ ఓడిపోయిం దన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల్లో ఏదీ ఆయన పార్టీగానీ, ప్రజలు ఎన్ను కోని దాని దర్బారీ నేతలకుగానీ సంతోషం కలిగించేది కాదు. అయితే జనాం తికంగా వారంతా ఆయన చెప్పినదంతా నిజమేనని గుసగుసలాడుతారు. ఖలిస్థానీలపై అమరీందర్ దాడి ఈ వ్యాఖ్యలకు ఆయన పార్టీ ఎలా ప్రతిస్పందించి ఉంటుందో కచ్చి తంగా తెలియదు. అయితే అమరీందర్ కెనడాలోని సిక్కు మిలిటెంట్ల సానుభూతి పరులపై చేసిన వ్యాఖ్యలు మాత్రం అత్యంత సంచలనాత్మకమైనవి, పతాక శీర్షికలకెక్కేవి. సిక్కు రెజిమెంటు (ఆయన అందులో పనిచేశారు) దేన్నీ లెక్కచేయకుండా చేసే దాడిలాంటి దాడి అది. అందరి ప్రశంసలను అందు కుంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉదారవాద ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకించి అలాంటివే. పంజాబ్ పర్యటనకు రానున్న కెనడా రక్షణ మంత్రి, ఒకప్పటి కల్నల్, అఫ్గాన్ యుద్ధ హీరో వంటివారైన హర్జిత్సింగ్ సజ్జన్కున్న ‘‘ఖలిస్థాన్ సంబంధాల’’ కారణంగా తాను ఆయనను కలుసు కోవడం సైతం చేయనని చెప్పారు. కెనడా ప్రభుత్వంలో ఉన్న నలుగురు సిక్కు మంత్రులూ ఖలిస్థానీ సానుభూతిపరులేనని ఆయన అన్నారు. ఇది, ఒక పంజాబీకి లేదా సైనికునికి మాత్రమే ఉండగల క్రమశిక్షణ అనీ, తాను ఆ రెండూనని వ్యాఖానించారు. ఈ ‘‘ఖలిస్థానీ కార్యకర్తల’’ ఒత్తిడి వల్లనే తనను కెనడాకు రానివ్వలేదని, ఆ దేశానికి వెళ్లి అక్కడి పంజాబీలతో మాట్లాడతాన న్నారు. ట్రూడో ఉదారవాదాన్ని ప్రపంచమంతా ప్రశంసిస్తున్నట్టే తానూ మెచ్చుకుంటాననీ, కానీ కెనడాకు రానివ్వకుండా చేసి ఆయన నా భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ఎందుకు నిరాకరించినట్టు? అని ప్రశ్నించారు. కెనడా ప్రభుత్వం తమ మంత్రులకు మద్దతుగా తక్షణమే స్పందించి, అమరీందర్ పర్యటనను స్వాగతించింది. అయితే అది అసలు కథనంలోని పిట్టకథే. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఊపిరిసలపకుండా తలమునక లయ్యే మన మీడియా అమరీందర్ సాధించిన ఈ అద్భుత దౌత్య విజయాన్ని పట్టించుకోకపోవడానికి ఏకైక కారణం.. కొంత మేరకు ఆయన బీజేపీకి చెందినవారు కాకపోవడం, కొంత మేరకు పంజాబ్కు వారి దృష్టిలో ఏమంత ప్రాధాన్యం లేకపోవడమే. సందర్భోచితంగా బీజేపీ తక్షణమే స్పందించి, అత్యున్నత జాతిహితం కోసం అమరీందర్ ప్రదర్శించిన సాహసాన్ని, ముక్కు సూటితనాన్ని స్వాగ తించి, విదేశాలలోని సిక్కు రాడికల్ గ్రూపులపై ఆయన చేసిన విమర్శలకు బలాన్ని చేకూర్చి ఉంటే ఎలా ఉండేది? కాంగ్రెస్, బీజేపీలకు పట్టని జాతీయభద్రతా సమస్య ఎన్నికల్లో అమరీందర్సింగ్కు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి సహాయపడటం కోసం విదేశాలలోని సంపన్న రాడికల్ సిక్కులు భారీ సంఖ్యలో పంజాబ్కు రావడం ఆయనకు కచ్చితంగా ఆగ్రహం కలిగించింది. వారు ‘‘చాలా వరకు కెనడా నుంచి వచ్చినవారే, కొందరు ఆస్ట్రేలియా నుంచీ వచ్చారు’’ అని ఆయన అన్నారు. 1984 నాటి అమృత్సర్, ఢిల్లీ గాయాలను వారు తిరిగి రేపాలని యత్నించారు. వారి పక్షం గెలిచేట్టయితే ఆదే పాత భయానక చిత్రం తిరిగి ప్రదర్శితమవుతుందనే మాట వ్యాపించింది. అమ రీందర్ లేవనెత్తుతున్న సమస్య దేశభక్తుడైన ఏ భారతీయుడైనా, ప్రత్యేకించి సరిహద్దులను దాటి విస్తరించిన ఏ జాతీయ పార్టీ అయినా లేవనెత్తాల్సినదే. అమరీందర్ సొంత పార్టీ ఇలాంటి పరిస్థితికి తగ్గట్టుగా స్పందించ లేనంతటి నిద్రమత్తులో జోగుతూ ఉండి ఉంటుంది. బహుశా ఆ గతంలోని తన సొంత పాత్ర గురించిన అపరాధ భావన సైతం దానిలో ఉండి ఉంటుందా? తన దేశం గురించి, తన గురించి ప్రశంసాత్మక ప్రభావాన్ని కలుగజేయాలని ప్రపంచనేతలతో చర్చలు జరపడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టే వారు, ప్రత్యేకించి ఆ విషయంలో అత్యంత చాతుర్యాన్ని కలిగిన వారు అయిన నరేంద్ర మోదీ సైతం ఈ ఎత్తుగడను ఎలా విస్మరిస్తారు? కొత్తగా ఖలిస్థానీ తీర్థం పుచ్చుకున్న ఈ బాపతు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమాదాన్ని ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎందుకు ఎండ గట్టలేదు? కనీసం ఏదో ఒక సందర్భంలో ఆయన ప్రభుత్వం కెనడా ప్రభు త్వంలోని కొత్త సిక్కు మంత్రుల గత చరిత్ర గురించి ఆ దేశానికి ఎందుకు గుర్తు చేయలేదు, వారు ఖలిస్థాన్ అనే ఆ కాల్పనిక లోకం నుంచి బయట పడ్డారనే స్పష్టమైన హామీని ఎందుకు కోరలేదు? భారత్ దృష్టిలో వారిలో కనీసం ముగ్గురి గతాలు ప్రమాదకరమైనవి. సజ్జన్ తండ్రి ప్రపంచ సిక్కు సంస్థ (డబ్యూఎస్ఓ) వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన ఒకప్పటి అఫ్ఘాన్ యుద్ధ వీరుడు. వాంకోవర్ కేంద్రంగా మిత్ర దేశాల కూటమికి సలహాలనిచ్చే గూఢచార సమాచార సేవల సంస్థను నడిపేవారు. మరోమంత్రి నవ్దీప్ సింగ్ బైన్స్. ఆయన మామ దర్శన్సింగ్ సైనీ నిషేధిత బబ్బర్ ఖల్సాకు అధికార ప్రతినిధిగా పనిచేసేవారు. తన గతాన్ని ఆయన ఎన్నడూ దాచుకోలేదు. మరో మంత్రి అమర్జిత్సింగ్ సోహీ వాస్తవానికి ఉగ్రవాద ఆరోపణలతో భారత్లో నిర్బంధంలో గడిపారు, తదుపరి ఆ ఆరో పణలేవీ రుజువుకాకపోవడంతో న్యాయస్థానాలు విడుదల చేశాయి. కెనడా ప్రభుత్వం ఈ విషయంలో జనాంతిక హామీలను ఇచ్చిందే తప్ప ఆ పాత ఉద్యమం గతించిపోయినదని నిర్ద్వంద్వంగా ప్రకటించలేదు. కెనడాలోని ఈ రాడికల్ శక్తుల నుంచి తమ ప్రత్యర్థులకు నిధులు అందుతున్నా కాంగ్రెస్, బీజే పీలు ఇంతవరకు ఆందోళనను వ్యక్తం చేయకపోవడం మరింత ఆశ్యర్యకరం. జాతీయవాదాన్ని మోదీకి ధారాదత్తం చేసిన కాంగ్రెస్ ఒక స్థాయిలో ఇది రాజకీయ ఆధిక్యతను సాధించే అంశం. కానీ దీనిలో ఇమిడి ఉన్న ఒకొక్క అంశాన్ని విడిగా తీసుకుని లోతుగా విశ్లేషిస్తే.. మరింత ప్రగాఢమైన రాజకీయ సమస్యను సూచిస్తుంది. నేటికి దాదాపు ఒక దశాబ్దికి పైగా అమరిందర్ పార్టీ జాతీయవాద ఎజెండాను బీజేపీ ఎగరేసుకు పోవ డాన్ని అనుమతించింది. అలా అని యూపీఏ పాకిస్థాన్తో, ఉగ్రవాదులతో, చివరకి చైనాతో సైతం ఎన్నడూ మెతకగా వ్యవహరించింది లేదు. అయినా సోనియా గాంధీ కాంగ్రెస్, జాతీయ ప్రయోజనాలతో ముడిపడ్డ జటిల సమ స్యలపట్ల ‘‘మెతక’’గా వ్యవహరించేదనే పేరును సమంజసంగానే తెచ్చు కుంది. ఆ రంగాన్నంతటినీ మోదీ తన సొంత భావనతో చాపలా చుట్టేసుకు పోవడానికి వదిలిపెట్టేసింది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణ పేరిట మోదీ అంతర్గర్భితమైన హిందుత్వ భావన చుట్టూ ఆ రంగంలో అజేయమైన జనా కర్షక శక్తిని సమీకరించుకున్నారు. బాట్లా హౌస్ ఎదురుకాల్పులపై సందేహాలను లేవనెత్తుతూ దిగ్విజయ్ సింగ్ తన సొంత పార్టీ వాదనను ఎలా నాశనం చేసేశారో గుర్తుకు తెచ్చు కోండి. ధైర్యసాహసాల ప్రదర్శనకు శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత పుర స్కారమైన అశోకచక్రను తమ సొంత ప్రభుత్వం చేతుల నుంచే అందుకున్న ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఆ ఎదురుకాల్పులలో మరణించారు. లేదంటే మావో యిస్టులకు మద్దతునిస్తున్నారంటూ రాజద్రోహ నేరారోపణకు గురైన బినా యక్సేన్కు ఉపశమనాన్ని కలుగజేయడానికి సహాయపడటాన్ని గుర్తు చేసు కోండి. అలా సహాయం చేయడం ఒక సంగతి సరే, కానీ బినాయక్ సేన్కు కీర్తిప్రతిష్టలను కట్టబెట్టేలా ప్రణాళికా సంఘానికి చెందిన ఒక ముఖ్య కమి టీలో ఆయనను సభ్యునిగా నియమించారు. ఇందిరా గాంధీ హయాంలో జాతీయ భద్రతా విషయాలలో అనుసరించిన కఠిన వైఖరిని ఆ పార్టీ విడిచి పెట్టేసిందనీ, అది ఒక ఎన్జీవోలా ఆలోచించడం ప్రారంభించిందనీ ఓటర్లను ఇలాంటి ఘటనలు పూర్తిగా ఒప్పించాయి. ఉద్వేగభరితమైన ‘జాతీయ భద్రత’ సమస్యపై మోదీ ప్రభుత్వాన్ని ఇర కాటంలో పెట్టే అవకాశాన్ని ఆ పార్టీ సొంత నాయకుడే అయిన అమరీందర్ సింగ్ సృష్టించారు. అయినా మోదీ ప్రభుత్వం కెనడా రక్షణమంత్రిని ఎలా ఆహ్వానిస్తుంది? దేశ సమగ్రతకు, దాని ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండటానికి ఆయన నుంచి విస్పష్టమైన హామీని కోరుతుందా? కానీ కాంగ్రెస్ ఎప్పటిలా నిద్రపోతోంది. బహుశా వాళ్లు అమరీందర్ మరీ ఎక్కువగా మాట్లాడటంలేదూ, అని ఆలోచిస్తుండొచ్చు. నరేంద్ర మోదీది ఎంత సునిశిత దృష్టో తెలిసిందే. ఆయనైతే ఈ విషయాన్ని వెంటనే మదిలో భద్రపరుచుకుని ఈ సమస్యను లేవనెత్తడానికి వచ్చిన మొట్టమొదటి సంద ర్భాన్నే అంది పుచ్చుకునేవారు. ఏదో ఒక విశ్వసనీయమైన హామీని లేదా విప రణను రాబట్టి... అమరీందర్ కల్పించిన ఈ అవకాశాన్ని తనకు అనుకూ లంగా వాడుకునేవారు. జాతీయవాదం అనే అంశం ఏ రాజకీయ పార్టీ, అన్ని టికి మించి ఏ జాతీయ పార్టీ వదిలి పెట్టకూడనిది. అలాంటి జాతీయవాదా నికీ, హిందుత్వకు మధ్య ఉన్న విస్పష్టమైన తేడాను గుర్తించగల శక్తి సైతం లేనిదిగా కాంగ్రెస్ మారేలా దాని బుర్రకు నూరిపోశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టిన గతే ఆ విషయాన్ని తెలుపుతోంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
అంతర్గత చర్చ అవసరం కాదా?
జాతిహితం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా మన ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతున్నారు. ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని పరిరక్షించుకుని, మరింతగా విస్తరింపజేసుకునేట్టు చేయడం ఎలాగని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ప్రతిష్టను కాపాడుకునే ఉత్తమ మార్గం అవుతుందా? చచ్చేటంత విసుగెత్తించే రాజకీయాల నుంచి తరచుగా నేను క్రికెట్లోకి జారు కుంటూ ఉంటాను. మన న్యాయ వ్యవస్థ గురించి వ్యాఖ్యానించాల్సి వచ్చిన ప్పుడు సినిమా సంగీతాన్ని అందులోకి చొప్పించడమూ చేస్తుంటాను. ప్రత్యే కించి సుప్రసిద్ధ సినీ గేయ రచయిత ఆనంద్ బక్షీ వర్థంతి (మార్చి 30) సంద ర్భంగా ఇది రాస్తున్నాను కాబట్టి. మన న్యాయ వ్యవస్థతో పాటూ బక్షీ శకాన్ని గురించి ఒకే సమయంలో ఆలోచిస్తుంటే, నాకు ఆయన రాసిన ఒక గేయ చరణాలు గుర్తుకు వస్తు న్నాయి. 1969లో విడుదలైన దో భాయ్ చిత్రంలో అశోక్ కుమార్, జితేంద్ర– మాలాసిన్హా నటించారు. అందులో అశోక్ కుమార్, జితేంద్ర అన్నదమ్ములు. ఒకరు న్యాయమూర్తి, మరొకరు పోలీసు అధికారి. ఇక మిగతా కథంతా ఊహించి చెప్పేయ గలిగిందే. తమ్ముడ్ని శిక్షించడమా లేక క్షమించడమా? అనే సందిగ్ధంలో పడతాడు అన్న. ‘‘ఇస్ దునియా మెయ్ ఓ దునియావాలో, బదా ముష్కిల్ హై ఇన్సాఫ్ కర్నా/బడా ఆసాన్ హై దేనా సజాయేం, బడా ముష్కిల్ హై రపర్ మాఫ్ కర్నా’’ (క్షమించడం కంటే శిక్షించడం చాలా సులువైనప్పుడు న్యాయమూర్తిగా ఉండటం చాలా కష్టం అని సంక్షిప్తార్థం). ఆనంద్ బక్షీ రాసిన ఈ గేయాన్ని మహ్మద్ రఫీ పాడారు. న్యాయమూర్తితో పోలిస్తే సంపాదకుని జీవితం ఎన్నో యోజనాలు దిగు వన ఉంటుంది. అయినా మా జీవితాలకు కూడా అదే తర్కం వర్తిస్తుంది. ప్రచురించకుండా ఆపి, అందుకు కారణాలను వివరించడం కంటే ప్రచురించి బాధపడటం తేలిక. ఒక సంచలనాత్మక కథనాన్ని, అది కొంత నమ్మదగినదిగా లేనంత మాత్రాన ప్రచురించకుండా వదిలేసేవాడు తెగువలేని సంపాదకుడు మాత్రమే. నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నది 1998 శీతాకాలం నాటి భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన కథనాన్ని గురించి. కొందరు వివేక వంతులు, గౌరవనీయులైన వ్యక్తులు నాపై ఉంచిన నమ్మకాన్ని 20 ఏళ్ల తర్వాత వమ్ము చేసి వారి పేర్లను వెల్లడి చేయాల్సి వస్తోంది. అందుకు నాకున్న కారణాలను వారు అర్థం చేసుకుంటారు, మన్నిస్తారు. న్యాయమూర్తిపై సంపాదక సందిగ్ధం అప్పుడే ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన జస్టిస్ ఏఎస్ ఆనంద్ గత జీవితంపై మంచి దిట్టౖయెన మా న్యాయ సంపాదకుడు క్షుణ్ణ మైన దర్యాప్తును చేపట్టారు. అది జస్టిస్ ఆనంద్ను ప్రయోజనాల సంఘ ర్షణను విస్మరించిన వారిగా, కానుకల విషయంలో పారదర్శకత పాటించని వారుగా, తన భూముల భాగస్వామ్య కౌలుదారులతో నిజాయితీలేకుండా ప్రవర్తించిన వారిగా చిత్రిస్తుంది. ఆ కథనాన్ని సాధ్యమైనంత అతి సూక్ష్మ వివరాలు సైతం ఉన్నదిగా రూపొందించే క్రమంలో అది ఎన్నోసార్లు మార్పులు, చేర్పులకు గురైంది. ఆ కథనాన్ని ప్రచురించే విషయమై 12 మంది అగ్రశ్రేణి న్యాయవాదు లలో దాదాపు 10 మంది సలహాలను నేనే స్వయంగా తీసుకున్నాననుకోండి. అంత గొప్ప కథనాన్ని ప్రచురించాలా, వద్దా అనే విషయంలో తీర్పు 2:8 నిష్పత్తిలో వచ్చింది. ప్రచురించవద్దన్న 8 మంది అభ్యంతరాలు పూర్తిగా న్యాయపరమైనవిగానీ లేదా వాస్తవాలకు సంబంధించినవిగానీ కావు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, చివరకు అమాయకులను బాధపెట్టి, మన అతి గొప్ప సంస్థకు నష్టం కలుగజేయడంగా ఇది ముగియకుండా చూడంyì . ఇదే వారి సలహా. ఇక ప్రచురించమన్న ఇద్దరిలో ఒకరు వాస్తవాలు వాస్తవాలే, ఇక మరే తర్కమూ పనిచేయదు అంటే, మరొకరిది మహోత్సాహం. ఆ న్యాయ మూర్తి మనల్ని ఏం చేస్తారు, కోర్టు ధిక్కారం నేరం మోపి చావగొడతారా? అని ఆయనను అడిగాను. అలాంటిదేమీ చేయరు, ఆయన చేయగలిగిందే మైనా ఉంటే అది ఆత్మహత్య చేసుకోవడమే అన్నారు. ఆ సమాధానం మమ్మల్ని కుదిపి పారేసింది. భారత న్యాయ వ్యవస్థలోని అత్యంత సుప్రసి ద్ధులైన ఆ న్యాయవాది అనాలోచితంగానే... మేం ఏం చేయాలని యోచిస్తు న్నామో దాని ప్రాధాన్యం స్ఫురించేలా చేశారు. మా కథనంలోని ప్రతి వాక్యాన్ని తిరిగి చదివాం. అందులో ఒకే ఒక్క అంశం లోపించింది. అది జస్టిస్ ఆనంద్ ప్రతిస్పందన. ఆయన కార్యాలయంతో మేం జరిపిన సంప్ర దింపులన్నిటికీ ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడం వల్ల మీడియాతో మాట్లాడరనే సమాధానం వచ్చింది. కాబట్టి మా వద్ద రుజువులు ఉన్నట్టే. తుస్సుమన్న సంచలనాత్మక కథనం అప్పుడు నేను గొప్పగా గౌరవించే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు నన్ను సంప్రదించారు. వారు, సుష్మా స్వరాజ్, అరుణ్ శౌరి. వారిద్దరూ నాటి వాజ పేయి ప్రభుత్వంలో మంత్రులు. ఇద్దరికీ చాలా కాలంగా జస్టిస్ ఆనంద్తో, ఆయన కుటుంబంతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఆయన ఏదైనా నిజా యితీ లోపించిన పని చేసి ఉంటారనే విషయాన్ని వారిద్దరూ ఏ మాత్రమూ అంగీకరించలేదు. మేం ఈ కథనాన్ని ప్రచురించడం కోసం ఇప్పటికే తగినంత కాలం వేచి చూశామని, ఇంకా దాన్ని దాచి ఉం^è డం సాధ్యం కాదని వారికి చెప్పాను. మేం పేర్కొన్న వాస్తవాలు తప్పయితే జస్టిస్ ఆనందే మమ్మల్ని ఆ విషయంలో ఒప్పించాలి. సుష్మా స్వరాజ్ ఒక సూచన చేశారు. నన్ను ఆయనకు ఓ సారి ఫోన్ చేయమన్నారు, నేనా పని చేశాను. ఆయన నన్ను నా వద్ద ఉన్న వాస్తవాల ఆధారాలను తీసుకుని రమ్మన్నారు. అయితే మా సంభాషణ జనాంతికంగానే జరుగుతుంది. ఆ తర్వాత జరిగింది సంక్షిప్తంగా ఇది. అనుమానం, ఆదరణ కలగలిసిన భావనతో ఆయన నన్ను ఆహ్వానించారు. ప్రతి ఆరోపణ గురించి మేం గంటల తరబడి చర్చించాం. ఆయన ఒక లెదర్ బ్రీఫ్ కేసు నిండా ఉన్న పత్రాలు, ట్యాక్స్ రిటర్నులు, రాసి ఉంచుకున్న చిట్టీలు, వరి అమ్మకం వల్ల వచ్చిన రాబడుల రసీదులు, తన పిల్లల పెళ్లి శుభలేఖలు, ఆయన కోర్టులకు, ట్యాక్స్ అధికారులకు సమర్పించిన పెళ్లిళ్లకు వచ్చిన నగదు కానుకల పద్దుల పుస్తకాలను చూపారు. ఆయన చూపిన ‘‘వాస్తవాల’’న్నిటి చుట్టూ తిరిగాను. అదీ ఇదీ ఇంకా చాలానే తిరగేశా. చూడబోతే ఆయన వద్ద అన్నిటికీ ఒప్పించ గలిగిన సమాధానాలు ఉన్నట్టే ఉంది. చివరకు నికరంగా ఒకే ఒక్కటి లెక్కకు రానిది తేలింది. అది చాలా ఏళ్ల క్రితం ఆరు అర బస్తాల వరి ధాన్యం విలువ. అది నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువేమీ కాదు. కాబట్టి అది పద్దుల పరమైన పొరపాటుగా పోయేదే. దీంతో నా గాలంతా తీసేసినట్టయింది. దీనిలో మా జీవితకాలపు రహస్య కథనం ఏదో ఉన్నదని మేం అనుకున్నాం. తీరా చూస్తే మా ఉత్సాహంపై నీళ్లు చల్లే వాస్తవాలు ముందుకు వచ్చాయి. సందేహాస్పదమైన ఆరు అర బస్తాల వరి ధాన్యం లావాదేవీ కోసం ప్రధాన న్యాయమూర్తిని ఏ దినపత్రికా తప్పు పట్టలేదు. జస్టిస్ ఆనంద్తో కలసి గంటల తరబడి గడిపిన ఇద్దరికీ బాధాకరమైన ఆ సమయంలో ఒక్క „ý ణం ముద్ర నా మదిలో అలాగే నిలిచిపోయింది. దాన్ని ప్రస్తావిస్తున్నందుకు ఆయన క్షమిస్తారనే అనుకుంటున్నా. ప్రతి వాస్తవాన్ని మీ ముందుంచాను, భారత ప్రధాన న్యాయమూర్తినైన నేను మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను... అయినా మీరు మీ కథనాన్ని ప్రచురించి నన్ను మాత్రమే కాదు, ఇంతటి గొప్ప సంస్థను కూడా గాయపరుస్తారా? అని అడిగారు. జస్టిస్ ఆనంద్, 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నందుకు మన్నించండి... ఆ మాటలు అంటున్నప్పుడు చెమ్మగిల్లిన మీ కళ్లను నేను తత్త రపడుతూ, భీతావహుడినై చూశాను. ఆ కథనం గొంతు నులిమేశాం. నా వృత్తి జీవితంలో అలాంటి అతి కొన్ని సందర్భాలలో అదే అత్యంత బాధాకరమైనది. ఈ విషయంపై నేను తగినం తగా తిరిగి ఆలోచించలేదు. ఇదే గనుక ఒక రాజకీయవేత్త విషయంలో ఇంత ఓపికగా, ఇంత నిష్పక్షపాతంగా, అన్నిటికీ మించి ఇలా స్వీయ ప్రయోజన నిరాకరణతో వ్యవహరించేవారమా? ప్రధాన న్యాయమూర్తి కథనాన్ని తెలు సుకోవడానికి అంత సుదీర్ఘంగా వేచి చూడటానికి కారణం.. అది మనం ఎంతగానో గౌరవించే సంస్థకు సంబంధించినది కావడమే. మన స్వేచ్ఛలలో దేనికి ముప్పు వాటిల్లినా ఆశ్రయించే సంస్థను ఏమాత్రమూ దిగజార్చరాదనే. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేదెలా? ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో నమ్మకం చారిత్రకంగానే అట్టడుగు స్థాయిలో ఉండగా.. న్యాయ వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైన సంస్థగా నిలుస్తోంది. మన న్యాయ వ్యవస్థలో లోపాలున్నా, కోర్టులు ఎంత అధ్వా నంగా ఉన్నా... ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఒకరు మరొకరితో ఏమంటారు? నీ సంగతి కోర్టులోనే తేల్చుకుంటాననే. న్యాయవ్యవస్థలో ఏ లోపాలున్నా ప్రజలు మాత్రం అది న్యాయం చేస్తుందని నమ్ముతారు. ఈ కారణాలన్నిటి రీత్యా, ప్రజలలో ఉన్న ఈ విశ్వాసాన్ని, సామాజిక ఒప్పందాన్ని కాపాడుకుని, మరింతగా అది విస్తరించేట్టు చేయడం ఎలా అని మన అత్యున్నత న్యాయవ్యవస్థ లోతైన అంతర్గత చర్చను సాగించాలి. పరిపాలనా రంగంలో అతి తరచుగా జోక్యం చేసుకోవడం ఈ ప్రతిష్టను కాపా డుకునే ఉత్తమ మార్గం అవుతుందా? పాలనాపరమైన సమస్యల నుంచి వాయు కాలుష్యం, అక్రమ కట్టడాలు, క్రికెట్ వరకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులతో సాధికారిక కమిటీలను ఏర్పాటు చేయడమనే భావన.. న్యాయ నిఘావాదం నుంచి ఎంత దూరంగా వచ్చేసింది? ఆగ్రహంతో మాట్లాడటం, చర్యలు చేపట్టడం నాయ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందా? పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో 70 శాతం మంది ఏదో ఒక ప్రభుత్వ ట్రిబ్యునల్లో లేదా కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో స్థానం పొందుతున్నారని అంచనా. అది చర్చనీయాంశం కాదా? దాని నుంచి తేలే నిర్ధారణ పదవీ విరమణ వయస్సును 70 ఏళ్లకు పెంచాలనే అయినా దాన్ని నేను సమర్థిస్తా. హైకోర్టు న్యాయమూర్తులు 60 ఏళ్లకు, సుప్రీం న్యాయ మూర్తులు 65 ఏళ్లకు పదవీ విరమణచేయడం అంటే అది మరీ త్వరగానే లెక్క. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ కావడం సమం జసమేనా? చర్చించరాని సున్నితమైన విషయం అంటూ ఏదీ లేదు. ఇది ఇంతటి కీలకమైన, విలువైన సంస్థ కాబట్టే సంపాదకులమైన మేము ఒక సంచలనాత్మక క£ý నం ప్రచురణపై వారాల తరబడి తర్జనబర్జనలు సాగించి, దాని గొంతు నులిమి పారేశాం. అది, దివంగత ఆనంద్ బక్షీ గీతంలో వర్ణించి నంతటి కష్టభరితమైన నిర్ణయం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఎటువైపు ఈ ప్రస్థానం?
జాతిహితం ప్రస్తుతం ఆయన ప్రదర్శించిన చర్యలు, అంటే–ఒక ముస్లిం మత గురువు ఇచ్చిన టోపీని ధరించడానికి నిరాకరించడం, ప్రధాని నివాసంలో అప్పటిదాకా వస్తున్న ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని ఆపడం, తన మంత్రిమండలిలో ఒక ముస్లింకు లేదా ఒక క్రైస్తవుడికి సాధారణ పదవికి మించి అవకాశాలు కల్పించకపోవడం, ఆఖరికి నిన్నటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 403 స్థానాలు ఉన్నా ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడం మోదీలోని ఆ మనస్తత్వం పుణ్యమే. భారత రాజకీయ చరిత్రని యుగాలుగా విభజిస్తే, 1969లో కాంగ్రెస్ పార్టీని చీల్చిన క్షణం దగ్గర ఇందిరాగాంధీ యుగం ఆరంభమవుతుంది. లోక్సభలో అఖండ మెజారిటీ సాధించినప్పటికీ దానిని నిలుపుకోలేక, 1989లో ఆమె కుమారుడు రాజీవ్గాంధీ ప్రతిపక్షానికి పరిమితం కావడం దగ్గర ఆ యుగం ముగిసిపోతుంది. కొన్ని అత్యవసర కారణాలతో పాటు, రెండు రాజకీయ వ్యతిరేక శక్తుల ఆవిర్భావం కూడా రాజీవ్గాంధీ పతనానికి దోహద పడి నాయి. అవి–మందిర్, మండల్. తరువాత పదిహేను సంవత్సరాలు అధికా రంలో ఉన్నప్పటికీ (పీవీ నరసింహారావు ప్రధానిగా ఒక దఫా, సోనియా/ మన్మోహన్సింగ్ హయాంలో రెండు దఫాలు) కాంగ్రెస్ పార్టీ శక్తియుక్తులను తిరిగి పొందలేకపోయింది. మందిర్/మండల్ పరిణామాలతో ఉద్భవించిన తరంవారు కాంగ్రెస్తో వివిధ దశలలో, టెస్ట్ మ్యాచ్లలో రెండు బృందాలు సెషన్స్ను పంచుకున్న తీరులో అధికారం పంచుకున్నారు. ఇలాంటి యుగం లేదా రాజకీయ టెస్ట్ మ్యాచ్ యుగం కూడా ఇప్పుడు ముగిసిపోయింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ 325 అసెంబ్లీ స్థానాలు గెలిచి, యోగి ఆదిత్యనా థ్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుని చేయడంతో 1989 తదనంతర రాజకీయాలకు కూడా తెరపడింది. గడియారంలో లోలకం ఊగిసలాట మాది రిగా ప్రత్యర్థులు ఒకరి నుంచి ఒకరు అధికారం తీసుకోవడమనే పరిణా మంగా దీనిని చూడడం సరికాదు. ఆ మార్పు మౌలికమైనది. ఈ మార్పుని భూకంపంలో పొరల ఘర్షణతో పోల్చవచ్చు. లేదా భౌగోళిక మార్పులన బట్టి జరిగే ఖండాల కదలికగా అయినా చెప్పవచ్చు. అది మీ ఇష్టం. ఈ మార్పు భారత రాజకీయాలలో పాత నిబంధనలను చెరిపేసి, కొత్త సూత్రాలను ఆవి ష్కరించింది. పాత నిబంధనలు కల్యాణ్సింగ్నూ, రాజ్నాథ్సింగ్నూ రంగం మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో యోగిని చూడడం కంటే ఆ ఇద్దరిలో ఎవరిని ఆ స్థానంలో చూసినా కరడు కట్టిన వామపక్ష వాదు లకు కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ కొత్త సూత్రాలు మరింత మంది యోగులను ప్రతిష్టించేవే. ఇప్పటికి కూడా అధికారం చేపట్టాలని విప క్షాలకు ఆశ ఏమైనా మిగిలి ఉంటే ఈ సూత్రాన్ని పటాపంచలు చేసే మార్గాన్ని అన్వేషించవలసి ఉంది. చెల్లాచెదురైన ఓటు బ్యాంకులు ఏవో ఒకటి రెండు ప్రముఖ వెనుకబడిన కులాలను, షెడ్యూల్డ్ కులాలను; ముస్లింలను ఏకం చేస్తే నెగ్గవచ్చునన్న వ్యూహం ఇకపై మధ్య భారతంలో ఎక్కడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే నరేంద్ర మోదీ/ అమిత్షాల ఎన్నికల యంత్రాంగం దానిని తుత్తునియలు చేసింది. బీజేపీ సాధించిన ఈ విజయా నికి ఊతమిచ్చిన హిందుత్వ, అటు పరిమితమైనదీ కాదు, ఇటు రామ మందిరానికి ప్రతీకాత్మకమైనదీ కాదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు గంప గుత్తగా ఓటు వేశారంటూ వచ్చిన వాద నలు చాలా సౌకర్యంగా ఏర్పరుచుకున్న భ్రమ. నిజానికి మొత్తం ఓట్లలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ యాభయ్ శాతం చీల్చాయి. వాటిలో బీజేపీ 39.7 శాతం ఓట్లు దక్కించుకుంది. బీజేపీకి వ్యతిరేకంగానే ముస్లింలు సామూహి కంగా ఓట్లు వేయకుంటే, ఆ పార్టీలు అన్ని ఓట్లు సాధించగలిగేవి కావు. బీజే పీకి అన్ని ఓట్లు రావడానికి కారణం– హిందువులలోని మధ్య తరగతి, వెనుక బడిన వర్గాలు, సంప్రదాయక పోరాట బాటను వదిలిన కొందరు షెడ్యూల్డ్ కులాల వారు ఆ పార్టీ వైపు మొగ్గడమే. అయితే వీరంతా రామమందిరం నిర్మాణం కోసమో, గోరక్షణ కోసమో, ముస్లిం స్మశాన వాటికల కంటే, హిందూ స్మశాన వాటికలకు మరిన్ని నిధులు వస్తాయనో బీజేపీ వైపు మొగ్గ లేదు. నిజానికి ఇవే ఆ పార్టీ ఆశయాలైతే అందుకు ఆదిత్యనాథ్ను ప్రయో గించవలసిన అవసరం లేదు. ఆ పార్టీలోని పాత తరం నాయకులు చాలు అవన్నీ సాధించడానికి. అసలు ఆదిత్యనాథ్ ఎంపిక మోదీది కాదనీ, ఆరెస్సెస్ బలవంతం చేయడం వల్లనే ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టవలసి వచ్చిందని మాటలు వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాలన్నీ ఒట్టి ఉబుసుపోక కబుర్లు. ఢిల్లీలో పుష్కలంగా లభించే ఇలాంటి భ్రమలలో మనం దేనినైనా నెత్తికెత్తు కున్నామంటే ఆదిత్యనాథ్ను ఎందుకు ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చిందో విశ్లేషించడానికి గానీ, అర్థం చేసుకోవడానికి గానీ సాధ్యపడదు. ఏడు దశాబ్దాల పాటు కాంగ్రెస్, లేదా కాంగ్రెస్ వంటి వామపక్ష కేంద్రీకృత రాజకీయాలు మన దేశ రాజకీయాలను శాసించాయి. ఇప్పుడు బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో జరిగిన పోటీ అంతా భారతదేశంలోని మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే, కొన్ని కులాలతో కూడిన ఓటు బ్యాంకులకూ; అభద్రతా భావంతో ఉన్న మెజారిటీ వర్గాన్ని మేలు కొలుపేం దుకు యత్నిస్తున్నదని చెప్పే బీజేపీకీ మధ్య జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో హిందూ ఓటు బ్యాంకుకు నాయకత్వం వహి స్తున్నది. కానీ ఆ ఓటు బ్యాంకు ఇదివరకు మాదిరిగా పాత అభద్రతా భావంతో నిలుబెట్టుకోవడం సాధ్యం కానిది. ద్విగుణీకృతమైన కొత్త విశ్వాసంతో నడుస్తుంది. లేదా అహంకరిస్తుంది. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం ఈ విషయాన్ని మరింత వివరంగా చెబుతాను. లండన్ కేంద్రంగా పనిచేసే వ్యూహాత్మక అధ్యయనాల అంతర్జాతీయ సంస్థ (అడెల్ఫీ పేపర్ సిరీస్) కోసం తయారు చేసిన మోనోగ్రాఫ్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొ న్నాను. భారతదేశం ఒక అసాధారణ దశకు చేరుకుంటున్నదని, ఆ దశలో అధిక సంఖ్యాకులు అల్ప సంఖ్యాకుల మనస్తత్వానికి అలవాటు పడు తున్నారని కూడా వాదించాను. హిందువులలో ఈ అభద్రత, వారు పడు తున్న ఇక్కట్ల గురించి ఎల్.కె. అడ్వాణీ, ఆరెస్సెస్ ప్రచారాన్ని నిర్వహించిన సమయం కూడా అదే. కాంగ్రెస్ తరహా సెక్యులరిజంలో ముస్లింలు, క్రైస్తవులు ప్రత్యేక హక్కులు పొందుతున్నారని నమ్మించేందుకు ప్రయత్నం జరిగింది. హజ్ యాత్రికులకు ఇచ్చే రాయితీ, మంత్రులు ఇచ్చే ఖరీదైన ఇఫ్తార్ విందులు, మైనారిటీ విద్యా సంస్థల వైఖరి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చరిల్లడం, ప్రపంచమంతటా ఇస్లాంను విస్తరించాలన్న ఆ దేశపు ఆశయం–అన్నీ కలసి హిందువుల అభద్రతా భావానికి తోడ్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు రెండుసార్లు బీజేపీకి అనుకూలతను ఏర్పరిచాయి. 1998–2004 మధ్య ఆరేళ్ల పాటు అధికారాన్ని చేపట్టే అవకాశం ఇచ్చాయి. చాలావరకు ‘సెక్యులర్’ శక్తులు ఒకే తాటిపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాలంలోనే ఇదంతా జరిగింది. అయితే మెజారిటీ వర్గం అభద్రతా భావం∙ఆసరాగా ఆ పార్టీ అమలు చేయదలుచుకున్న స్వారీ వ్యూహానికిS కొన్ని పరిధులు ఉన్నాయి. సంస్కరణల ప్రవేశం తరువాత, గడచిన ఈ రెండు దశాబ్దాల కాలంలో జరిగిన పురోగతి అన్ని వర్గాల వారికీ ఇతోధిక అవకాశాలు కల్పిం చింది. ముఖ్యం ప్రైవేట్ రంగంలో పట్టణ ప్రాంత హిందువులకు, గ్రామీణ ప్రాంత విద్యావంతులకు కూడా ఆ అవకాశాలు అందివచ్చాయి. 2007 నుంచి నరేంద్ర మోదీ (పూర్తికాలం ముఖ్యమంత్రిగా రెండవ దఫా ప్రమాణం చే సినప్పుడు) పాలనా సరళిని విశ్లేషించినట్టయితే, ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన చెప్పిన ప్రతిమాట ఏకపక్షంగా ఒకటే చెబుతూ ఉంటుంది. అది–ఆయన నాయకత్వంలో హిందువులు కష్టాల నుంచి బయట పడి, పునరుత్తేజం పొందుతారు. ఆయన అప్పటి నుంచి ముస్లిం పట్ల దుడు కుగా వ్యవహరించినట్టు కనిపించలేదు. అలా అని క్షమాపణలు కోరే రీతి లోనూ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన ప్రదర్శించిన చర్యలు, అంటే– ఒక ముస్లిం మత గురువు ఇచ్చిన టోపీని ధరించడానికి నిరాకరించడం, ప్రధాని నివాసంలో అప్పటిదాకా వస్తున్న ఇఫ్తార్ విందు సంప్రదాయాన్ని ఆపడం, తన మంత్రిమండలిలో ఒక ముస్లింకు లేదా ఒక క్రైస్తవుడికి సాధారణ పదవికి మించి అవకాశాలు కల్పించకపోవడం, ఆఖరికి నిన్నటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 403 స్థానాలు ఉన్నా ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టకపోవడం మోదీలోని ఆ మనస్తత్వం పుణ్యమే. ఇదంతా రాజకీయ సెక్యులరిజమ్, హిందుత్వ పునాది మీద జాతీయవాదం అనే అంశాలను పునర్ నిర్వచించ డానికి ఉద్దేశపూర్వకంగా చేసినదే. సరిగ్గా ఈ ధోరణిలో ఇమిడిపోయే మరో అంశమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియామకం. మోదీ, షాల నిర్వచనం ప్రకారం కొత్త సెక్యులరిజం అంటే విశ్వాసంతో తొణి కిసలాడే, పునరుత్తేజం పొందిన హిందువు. ఆ విధంగా వారితో కూడిన సరి కొత్త సెక్యులర్ దేశం. అలాగే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ముస్లింలు సురక్షితంగా ఉంటారు. దేశాన్ని ఎవరు పాలించాలి లేదా పాలించరాదు అనే విషయం మీద నిర్ణయం చేసే హక్కును వినియోగించడానికి వారిని ఎంత మాత్రం అనుమతించరు. ఇప్పుడు మెజారిటీ వర్గం విజయం సాధించింది. అధికారం చేపట్టింది. చరిత్రలో మున్నెన్నడూ లేనంత బలంగా ఉన్నట్టు ఆ వర్గం భావిస్తున్నది. ఏదో విషయానికి ఎవరికో ఒకరికి క్షమాపణ చెప్పే విధంగా ఉండే రోజులు పోయాయి. ముస్లిం మౌల్వీ నుంచి టోపీని నిరా కరించాలన్న నిర్ణయం తీసుకున్నంత సులభంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక జరిగింది. కాంగ్రెస్తో సహా, ఏ ప్రతిపక్షమూ పాత నినాదాలతో ఈ ధోరణికి కళ్లెం వేయలేకపోయింది. ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి పక్షాలు సెక్యులరిజమ్ భావనతో, ముస్లింల పరిరక్షకులుగా జెండా పట్టుకుని బరిలోకి దిగాయి. ఓడిపోయాయి. ప్రతిపక్షాలు ఓడిపోయినది హిందూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తి పోరాడినందుకు కాదు. ఇప్పుడు అక్కడ మోదీ సరికొత్త జాతీయవాదాన్ని ఆయుధంగా ఇచ్చారు. అది విప క్షాలు ప్రయోగించిన ఆయుధం కంటే బలమైనది. ఇప్పటిదాకా కాంగ్రెస్ తరహా సెక్యులరిజమే జాతీయ రాజకీయ చర్చలలో ప్రధానంగా కనిపిం చింది. అందులో బీజేపీ, ఆరెస్సెస్ తాము కూడా సెక్యులరిస్టులమేనని చెప్పు కునేవి. అలాగే కాంగ్రెస్ చెప్పే సెక్యులరిజం కుహనా సెక్యులరిజమని ఎదురు దాడికి దిగేవి. ఇప్పుడు మోదీ జేఎన్యూ తరహా వక్రీకరించిన లిబరలిజంకు పోటీగా జాతీయవాదాన్ని చర్చలోకి తెచ్చారు. ఈ జాతీయవాదం ప్రకారం భారత్ గుండెలలో జాన్ లెనిన్ ఊహించిన సరిహద్దులు లేని, జాతీయత లేని ప్రపంచం లేదు. ఈ మార్పును గమనించి, జాతీయ వాదం మీద జాతీయ వాదంతోనే పోరు జరిపే ఒక నేతను ప్రతిపక్షం తయారు చేసుకునే వరకు నరేంద్ర మోదీ అనితరసాధ్యుడే. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
గతంపై సవారీ.. ఓటమికి దారి
జాతిహితం పంజాబ్ను పూర్తి మతవాద దృష్టితో చూడటం ఆప్ చేసిన ఘోర తప్పిదమనేది స్పష్టమే. తమకు కావాల్సింది సిక్కు ఓట్లేనని భావిస్తే, తదనుగణంగా అది తన రాజకీయ ఆకర్షణను మలచుకోవాల్సిందే. కాబట్టి ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిర హత్యానంతరం సాగిన సిక్కుల ఊచకోత వంటి పాత గాయాలను తిరిగి రేకెత్తించ యత్నించింది. దీంతో ఖలిస్తానీలు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆప్ను వాడుకుంటున్నారని ప్రజలు భావించారు. ఆ భయంతో సిక్కులు, హిందువులు ఆప్ను ఓడిస్తారనుకున్న పార్టీకి ఓటు చేశారు. ఓటమి అనాథ అనేది మానవజాతి చరిత్రలోకెల్లా అతి పురాతనమైన నానుడి. ఇప్పుడది నా మదిలో మెదలడానికి కారణం బహుశా మైరా మెక్ డొనాల్డ్ అనే బ్రిటిష్ పాత్రికేయురాలు అదే పేరుతో (డిఫీట్ ఈజ్ ఎన్ ఆర్ఫన్) ఇటీవలి కాలపు పాకిస్తాన్ చరిత్రపై రాసిన పుస్తకం చదువుతుండటమే కారణం కావచ్చు. పంజాబ్, గోవాలలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు దెబ్బ తినడం గురించి ఆలోచిస్తుండటం కూడా అందుకు కార ణం. ఆ రెండు రాష్ట్రాలూ ఆమ్ ఆద్మీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకున్నవే. మెరుపు వేగంతో బలగాలను కేంద్రీకరించి. కోటను పట్టేసుకోవడంగా ఇప్పటికే మనకు సుపరిచితమైన ఆ పద్ధతి నిజ స్వభావానికి తగ్గట్టే... సానుకూల ‘అంతర్గత’ సర్వేల ఆధారంగా ఆ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు తథ్యమని ప్రకటించేసింది. గోవాలో దాని పోరాటానికి అడ్డుకట్టపడిందనేది స్పష్టమే. పంజాబ్లో ఆ పార్టీ ప్రత్యర్థులు, విమర్శకులు (ఈ రచయిత సహా) సైతం అది ఇంత కంటే చాలా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశించారు. నేనైతే అది మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందన్నాను. 40 సీట్ల కంటే ఎక్కువ సంఖ్యాబలంతో అది బలమైన రెండవ పార్టీగా అవతరిస్తుందే తప్ప అంత కంటే తీసిపోదని అనుకున్నాను. అది రెండో స్థానంలోనే నిలిచింది. కేరళలో వలే రాజకీయంగా రెండుగా చీలిపోయి ఉన్న రాష్ట్రంలో ఒక ‘బయటి’, యువ పార్టీకి అది చెప్పుకోదగిన విజయమే. కానీ దానికి లభించినది కేవలం 20 సీట్లే. ప్రత్యేకించి ముందే విజయోత్సవాలు జరిపేసుకున్న దృష్ట్యా ఆ పార్టీకి ఇది అవమానకరమనే అనిపిస్తుంది. ఈ ఎన్నికల తర్వాత ఆప్ వ్యవహారాలు సాగుతున్న తీరు గురించి ఎన్నో కఠినమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఇక ఇప్పుడు అరవింద కేజ్రీవాల్ భారత క్రికెట్లో వినోద్కాంబ్లీలాగా మిగలవచ్చు... అలా మెరుపులా మెరిసి, జగజ్జేతగా నిలుస్తానని నమ్మించి, ఆ తర్వాత తుస్సుమని పోవచ్చు. ఓటమి ఎంతైనా అనాథే కదా. ఎదురు లేదనిపించి... ఆప్ ఎందుకు ఓడిపోయింది, అది చేసిన తప్పు ఏమిటి? అని ఇప్పటికే చాలా రాశారు. అయితే అది చేయాల్సిన ప్రతి సరైన పనిని చేసిందని విస్మరిం చరాదు. పంజాబ్ క్షీణత, నిరుద్యోగం, రాజకీయమైన విసుగు, స్వాభిమానం గల ప్రజల సామూహిక అహం దెబ్బతినడం వంటి సరైన సమస్యలనన్ని టిపైనా అది దృష్టిని కేంద్రీకరించింది. రెండు, విస్తృత ప్రజానీకం దోషులుగా చూస్తున్న శిరోమణి అకాలీదళ్ను అందుకు తప్పుపట్టి, దానిపైకే ఎక్కు పెట్టింది. శిరోమణి ఆకాలీదళ్ లేదా మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే బాదల్ కుటుంబీకులు సమంజసమైనంత ప్రజాస్వామిక ‘పాంథివాద’ (సిక్కు గురు వుల మతపరమైన, దాదాపు గ్రంథాల పంథాను అనుసరించేవారు) పార్టీని భూస్వామ్యపు కలుగు స్థాయికి దిగజార్చారు. పంజాబ్లో ఆప్ ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించింది. సామాజిక మాధ్యమాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుంది. పంజాబ్లో జనాదరణ పొందిన సాంస్కృతిక యువ స్టార్ కళాకారులందరినీ పార్టీలోకి చేర్చుకుంది. ప్రశంసార్హమైన జనాకర్షణను సాధించింది. భావజాలరంగంలోని రెండు కొస లైన అతివాద, మితవాదాల మధ్య ఉన్న సకల ధోరణులకు చెందిన ఆగ్రహ వేశపరులందరితో కలసి వినూత్న కూటమిని సైతం నిర్మించింది. సంప్రదా యకంగా హిందీ మాట్లాడే ప్రధాన భారతంలోని దళితులు, జాట్ సిక్కులను అణచివేతదారులుగా కాకున్నా పెత్తనం చలాయించేవారుగా చూస్తూ, వారికి విరుద్ధంగా కాంగ్రెస్కు ఓటు వేస్తుండేవారు. దేశంలోకెల్లా దళిత ఓటర్ల శాతం అత్యధికంగా, 33.4 శాతం ఉన్నది పంజాబ్లోనే. బహుజన్ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ తమ రాష్ట్రానికి చెందినవాడే అయినా పంజాబీ దళితులు ఎన్నడూ ఆ పార్టీని ఆదరించలేదు. వారు సైతం పంజాబ్ లోని ఆప్ను ఆసక్తికరమైన ప్రత్యామ్నాయం అవుతుందేమోనని చూశారు. కేజ్రీవాల్ భారీ ఎత్తున ప్రజలను ఆకర్షించడాన్ని, గత పార్లమెంటు ఎన్నికల్లో 33 అసెంబ్లీ స్థానాలకు సమానమైన విజయాన్నిSసాధించడాన్ని చూస్తే ఆ పార్టీ ఉధృతిని దెబ్బ తీయగలిగినది ఏదీ లేదనే అనిపించింది. అత్యంత విద్యావంతులు, తెలివితేటలు గల యువతీయువకులతో కూడిన బృందం ఆప్కు నేతృత్వం వహించింది. వారిలో చాలామంది ప్రజా స్వామిక కార్యకర్తలు, నిర్దిష్టంగా చెప్పాలంటే సమాచార హక్కు కార్యకర్తలు. ఆ çసమాచారమే కేజ్రీవాల్ ఏం మాట్లాడటానికైనా సాధికారతను కల్పించేది. ఎన్నికల గురించిన వార్తా కథనాన్ని రాస్తూ నేను చెప్పినట్టుగానే ఆప్.. అవి నీతి (కరప్షన్), ప్రతీకారం (రివెంజ్), యువత(వై) అనే మూడు అ„ý రాల ‘క్రై’ (సీఆర్వై) ఫార్ములా చుట్టూ తన రాజకీయాలను కేంద్రీకరించింది. ఆ ఫార్ములా ఢిల్లీలో అద్భుతంగా పనిచేసింది. అందువల్లనే లోక్సభ ఎన్నికల తదుపరి నరేంద్రమోదీకి ఉన్న ఉధృత ఉరవడిని అది ఢిల్లీలో దెబ్బ తీయగలి గింది. ఆ తర్వాత పంజాబ్లో ఆకట్టుకునే కోలాహలాన్ని రేకెత్తించింది. అయినా అసలు లెక్కలోకి వచ్చే ఫిబ్రవరి 4న తగినంతగా ఫలితాలను సాధిం చడంలో అది విఫలమైంది. ఆప్లోని కుశాగ్రబుద్ధులంతా దీని గురించి యోచిస్తే... ‘మాయ’ ఓటింగ్ యంత్రాలకంటే మరింత అర్థవంతమైన కార ణాలు చాలానే కనిపిస్తాయి. మతవాద దృష్టితో దారి తప్పింది పంజాబ్ను పూర్తి మతవాద దృష్టితో చూడటం ఆప్ చేసిన ఘోర తప్పిదమని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నేను మాటల్ని జాగ్రత్తగా ఎంచుకునే వాడుతున్నాను. పంజాబ్ ప్రధాన సాంస్కృతిక చిహ్నాలు సిక్కుల తలపాగా, భాంగ్రా, భల్లె–భల్లె, స్వర్ణదేవాలయం. అది కేవలం సిక్కుల రాష్ట్రం కాదు. రాష్ట్ర జనాభాలో 43%గా ఉన్న హిందువులు కూడా అదే సంస్కృతిని అను సరిస్తారు, అదే గురుద్వారాలలో వారంతటి భక్తితోనే ప్రార్థనలు చేస్తారు. పంజాబీలు బయటి ప్రదేశాలకు పోయే ప్రజలు, బయటి వారిని హృదయా నికి హత్తుకునే వారు. తమ అస్తిత్వం పట్ల ఆత్మన్యూనత గలవారు మాత్రం కారు. బయటి నుంచి వచ్చిన వారు పంజాబీలను ఆకట్టుకోవడానికి చేయగల పనులలో చిట్టచివరిది తలపాగాను ధరించి దర్పంగా సిక్కులా నటించడమే. అది వారిని వినోదపరస్తుంది, చికాకూ పెడుతుంది. ‘‘నాకు ఇతను బయటి వాడని తెలుసు, అయినా ఇష్టమే. అయినా ఈ వెర్రి వేషంతో ఆకట్టుకోవా లనుకోవడం దేనికి?’’ అనేదే దీనికి పంజాబీల ప్రతి స్పందన అని చెప్పొచ్చు. అనుకోకుండానే ఖలిస్తానీ భయాన్ని రేకెత్తించింది పంజాబ్లో తమకు కావాల్సింది సిక్కు ఓట్లేనని ఆప్ భావించినట్టయితే, తదనుగుణంగా అది తన రాజకీయ ఆకర్షణను పెంపొందించుకోవాల్సింది. ఇక ఆ తర్వాతి తప్పు సహజంగానే జరిగిపోతుంది. అది, ఆపరేషన్ బ్లూస్టా ర్లో సిక్కుల అత్యంత పవిత్ర స్థలాలను ‘అపవిత్రం’ చేయడం, ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో వారిపై సాగిన ఊచకోత వంటి 1980ల నాటి బాధల గాయాలను తిరిగి రేకెత్తించడమే. 1984 నాటి హత్యలపై న్యాయం కోసం పోరాడిన ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్యకర్త, న్యాయవాది హెచ్ఎస్ ఫూల్కాన్ను అది అక్కడికి దించింది. పంజాబ్లో దాదాపు ఎవరికీ ఆయన తెలియదు. అయినా ఆయనను స్థానిక నేతగా చూపింది. ఖలిస్తాన్ కాలపు శిథిలాల మధ్య మనగలిగి, ఆ కష్టకాలపు జ్ఞాపకాలను అçపురూపమైనవిగా మిగుల్చుక్నునవారితో కూటమిని ఏర్పరచింది. తద్వారా ఆపరేషన్ బ్లూస్టార్ వల్ల సిక్కులలో కలిగిన ఏకాకితనాన్ని, ప్రతీకారాన్ని పునరుజ్జీవింపజేయాలని భావించింది. అందుకు మరింత మద్దతు, ఆర్థబలం, అంగబలం ఎన్ఆర్ఐ సిక్కుల నుంచి, ప్రత్యేకించి కెనడా వారి నుంచి లభించాయి. ఇవన్నీ కలసి సిక్కు ఓట్లను సమీకరించి ఆప్కు అందిస్తాయని భావించారు. ఆచరణలో ఇది అకాలీల ఓట్లన్నింటినీ ఊడ్చిపారేయడమే అవుతుంది. మిగతా ఓట్లు భావ జాలపరమైన వామపక్షానికి బలమైనది, తిరుగుబాటు తత్వంగలది అయిన మాల్వా మెట ్టప్రాంతం నుంచి వస్తాయనుకున్నారు. ఇలా యుద్ధ విజయాన్ని పదిలం చేసేసుకున్నామని ధీమాగా ఉన్నారు. ఢిల్లీలో ఇలాగే కాంగ్రెస్ ఓట్లన్నీ ఆప్కు లభించి, భారీ విజయం లభించింది. నిద్రాణంగా ఉన్న తిరుగుబాటువాదులతో ఆప్కు ఉన్న ఈ ప్రమాదకర సంబంధాలను మొదట నేను 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో గుర్తిం చాను. ఆనాడు ఆప్ అభ్యర్థులుగా నిలిపిన సుచాసింగ్ చోటేపూర్, హరిందర్ సింగ్ ఖల్సాలు ఒకప్పటి తిరుగుబాటువాదులే. 24 ఏళ్ల వయసులో భింద్రన్ వాలే ఆంతరంగికుల బృందంలో ఒకరుగా ఉన్న జర్నయిల్సింగ్ను సైతం నేను కలిశాను. ఆప్కు మద్దతునిస్తానని వాగ్దానం చేసిన ఆయన నాతో స్వేచ్ఛగా మాట్లాడారు. ఇలామొదలైన కెనడియన్ సిక్కుల దిగుమతి హిందు వులను భయపెట్టి, వారు ఆప్ను ఓడించే ఆవకాశం ఉన్నదనుకున్న పార్టీకి ఓటు చేసేట్టు చేసింది. 2014లో ఆప్లో ఉన్న యోగేంద్ర యాదప్, పాత తిరుగుబాటువాదు లను ప్రధాన స్రవంతిలోకి తెచ్చి, వారి అసంతృప్తికి అహింసాత్మక, ప్రజా స్వామిక మార్గాలను తెరిచేందుకు ఇదే మార్గమని వాదించారు. 1979–94 దశలో బాధలకు గురైన హిందూ, సిక్కు పంజాబీలకు అంత ఓపిక లేదు. ఈ ఖలిస్తానీలకు (ప్రత్యేకించి కెనడియన్లకు) పంజాబ్లో కావాల్సింది ఏమిటి, ప్రభుత్వమేనా? అనే మాట వ్యాపించిపోయింది. బయటి పార్టీ అయిన ఆప్ను వాడుకుని వాళ్లు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారనే భావన కలిగింది. ఒక్కసారి గురుద్వారాలు చేతికి చిక్కాక వాళ్లు... తాము అప్పటికే చూసిన పాత విషాదాంత సినిమాను తిరిగి చూపడం మొదలెడతారని భావించారు. పంజాబ్లో ఏ ఒక్కరికీ, ప్రత్యేకించి సిక్కులకు అది రుచించేది కాదు. ఆ కష్టకాలం నుంచి కోలుకుని, తిరిగి ముందుకుసాగడానికి రాష్ట్రానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. కాంగ్రెస్ ఆ తర్వాత మూడుసార్లు ఎన్నికైంది. అకాలీల నుంచి విడివడ్డ గ్రూపులు గత 25 ఏళ్లుగా డిపాజిట్లు కోల్పోతున్నాయి. ఎవరూ అంత వెనక్కు పోవాలని కోరు కోవడం లేదు. గతం గురించి అతిగా మాట్లాడేకంటే ఆప్ మంచి భవిష్యత్తును వాగ్దానం చేసి ఉంటే మరింత మెరుగైన ఫలితాలను సాదించగలిగేది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
వారసత్వానికి మోదీ పాతర!
సందర్భం ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకువచ్చే ప్రభావ శక్తి ఇప్పుడు ప్రధాని సొంతం. ఇప్పుడు భారత రాజకీయాల్లో సరికొత్త విరాణ్మూర్తి నరేంద్ర మోదీ. ఇక్కడ ప్రశ్న 2019 ఎన్నికల్లో గెలుపునకు పరిమితం కాదు.. తన సరికొత్త కీర్తితో మోదీ ఏం చేయనున్నారన్నదే ప్రశ్న. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ‘టెక్టానిక్ షిప్ట్’ అనే పదబంధంతో వర్ణించారు. భూ ఉపరి తలంలోని ఫలకాలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకు పోవడమే టెక్టానిక్ షిఫ్ట్. అత్యవసర పరిస్థితి అనంతరం జనతా పార్టీ ప్రభంజనం నాటి నుంచి మరెవరికీ సాధ్యం కానంత ఘన విజయం మోదీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ పది కంటే తక్కువ స్థానాలకు పరిమితమైపోయింది. ఇక ఉత్తరాఖండ్ను ఊడ్చేసిన బీజేపీ ఇంతవరకు ఉనికే లేని మణిపూర్లో నిజమైన రాజకీయ శక్తిగా మారింది. అయితే, భారత ప్రాదేశిక రాజకీయాలనే కాకుండా దేశ సామాజిక, మానసిక, భావజాల రంగాలను కూడా పునర్నిర్మిస్తున్న ఈ అధికార మార్పిడిని టెక్టానిక్ మార్పు తో పోల్చడం మరీ తేలికగా ఉందని నా అభి ప్రాయం. ఈ మార్పునకు చెందిన అతిపెద్ద తొలి సంకేతం ఏదంటే ఇందిరాగాంధీ తర్వాత అత్యంత జనాకర్షణ గల భార తీయ నేతగా నరేంద్ర మోదీ ఆవిర్భవించారు. అది కూడా వారసత్వంపై కాకుండా తన సొంత ప్రయత్నంతో దీన్ని సాధించారు. రెండోది.. ఇందిరా గాంధీ అనంతరం ఏ భారతీయ నేతా సాధించని అజమాయిషీని అధికార పార్టీపై మోదీ దఖలుపర్చుకున్నారు. మోదీతోపాటు ఎన్ని కల రణరం గంలో సంపూర్ణ విజయాలను సాధిస్తున్న ఫీల్డ్ మార్షల్ అమిత్ షా కూడా 1960లనాటి కామరాజ్ నాడార్ తర్వాత జాతీయ స్థాయి పార్టీకి అత్యంత శక్తిమంతమైన అధినేతగా ముందు కొచ్చారు. స్వాతంత్య్రానంతరం దేశ ప్రధాన కేంద్రానికి వెలు పల నుంచి వచ్చి అంతటి జాతీయ ఉన్నతిని పొందిన తొలి నేత కూడా మోదీనే. బయటి ప్రాంతం నుంచి వచ్చి దేశవ్యాప్త ప్రాచుర్యం పొందిన మరో నేత మహాత్మా గాంధీ మాత్రమే అని నేనంటే తప్పుగా భావించే ప్రమా దం ఉంది కానీ, గాంధీ కూడా గుజరాత్ నుంచే వచ్చాడ న్నది మినహా ఇరువురికీ పోలికలు పెట్టలేం. మోదీతో విభే దించేవారు సైతం అతని సమగ్ర వ్యక్తిత్వాన్ని శంకించ లేరు. అందుకే పెద్దనోట్ల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడినా ప్రజలు మోదీని క్షమించారంటే ఇదే కారణం. ఆర్థిక సంస్కరణ, సామాజిక సందేశం వంటి అంశాల్లో ప్రధానిగా మోదీ తొలిదశ పాలన రికార్డు అతు కుల బొంతలాగే ఉందని మోదీకి అత్యంత విశ్వాస పాత్రు లైన సమర్థకులు కూడా గుర్తిస్తున్నారు. కానీ గుజరాత్లో ఆయన పాలనా చరిత్రను మనం తెలుసుకోవాలని, మోదీ రెండోదశ పాలనకోసం వేచి ఉండాలని వీరంటున్నారు. సీఎంగా తొలి పాలనాకాలంలో మోదీ తన విభజన రాజ కీయాలతో తీవ్ర ఘర్షణాత్మక వైఖరిని పాటించేవారు. రెండో దశ పాలనలో ఆర్థిక, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి జాతీయ రాజకీయాధికార సాధనకు ఒక బలమైన పునాదినే నిర్మించుకున్నారు. ఇప్పుడు మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకు వచ్చే సామర్థ్యం ఇప్పుడు మోదీ సొంతం. తన అధికారాన్ని మోదీ ఇకపై ఎలా ఉపయోగిస్తార న్నదే ఇప్పుడు ప్రశ్న. 2007లో గుజరాత్లో చేసినట్లే.. ఎన్నికల్లో అడ్డు వచ్చే ఎవరినైనా నిర్మూలించడం నుంచి తప్పుకుని ఇకపై ప్రధాని ఆర్థిక మార్పుపై దృష్టి పెడ తారా? నిజంగానే అలాంటి అవకాశం ఇప్పుడు మోదీకి దక్కింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాని తొలి కుటుంబంలాగా ఓట్లు సాధించే రోజులు పోయాయి. 2004లో సాధించిన అనూహ్య విజయం.. అలాంటి రోజులు వచ్చాయన్న భ్రమలను మళ్లీ రెకెత్తించింది కానీ, ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. రెండోది. రాహుల్ గాంధీ ప్రజానేత కారు. మహా అంటే ఆయన పార్టీని కలిసి కట్టుగా ఉంచగలరు. కానీ నిజమైన అధికారం కలిగిన సీఈఓలతో కూడిన కంపెనీగా పార్టీని నిర్వహించకపోతే కాంగ్రెస్కు ఇక భవిష్యత్తు లేనట్లే. పైగా అధికారం హక్కు భుక్తం అనే భావనకు ఇప్పుడు యువ భారతం పూర్తి వ్యతిరేకం. రాహుల్ తన వారసత్వ రికార్డుతో వారిని మెప్పించడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఇకనుంచి రాహుల్ తన గురించి తాను మాట్లాడితే మంచిది. ఇక ఉత్తర ప్రదేశ్లో కుల ప్రాతిపదిక రాజకీయ పార్టీలు తమను తాము పునర్నిర్మించుకోవాలి లేక సన్యా సమైనా పుచ్చుకోవాలి. కులాలుగా చీలిపోయిన దేశ ప్రధాన కేంద్రంలో మూడు దశాబ్దాలుగా బీజేపీ హిందు త్వ అనే విశ్వాసంతో మెజారిటీని కూడగట్టే వ్యూహంతో పని చేసింది. హిందువులు ఉన్నత, నిమ్న, మధ్యతరగతి కులాలుగా వేరుపడటం కాకుండా కలిసి కట్టుగా ఓటేసి నంత కాలం ఇక బీజేపీని ఓడించటం అసాధ్యం. గతంలో రామమందిరం ఉద్యమం ద్వారా ఎల్కే అడ్వాణీ ఈ విషయంలో కొంత సఫలమయ్యారు కాని అది కొన్నాళ్లే ప్రభావం చూపింది. ఇప్పుడు మెజారిటీ భారత జాతీయ వాదం ద్వారా మోదీ, అమిత్ షాలు కొత్త ప్రభంజనం సృష్టించారు. ముఖ్యమైన వాస్తవం ఏదంటే ముస్లిం ఓటర్లు భవి ష్యత్తు గురించి చింతిస్తున్నారు. మోదీ–షా వ్యూహం ముస్లిం ఓటును వేరు చేసింది. అదిప్పుడు అసంగతమైన విషయమని నిరూపించారు. ‘లౌకిక పార్టీ’లు తమ రాజ కీయాలను ఇకపై పూర్తిగా తిరగ రాసుకోవాల్సిందే. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మన దూకుడు ఇలాగే సాగాలి
జాతిహితం భారత క్రికెట్ సాధించిన ఆసాధారణ మెరుగుదలకు సంబంధించిన మధురమైన మలుపు 2000లో గంగూలీ కెప్టెన్ కావడం. ఆ పరంపరలో వచ్చిన ఆకలిగొన్న, దూకుడు ఆటగాళ్ల వల్ల మన క్రికెట్ ఉన్నత శిఖరాలకు చేరింది. గత కాలపు స్టార్ క్రికెటర్లకు భిన్నంగా నేటి క్రీడాకారులు ఓటమిని సహించరు. మన క్రికెట్ అలాగే ఉండాలి. కానీ మన కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేనని పొరబడి దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. ఎన్నికల ఫలితాల కోసం మీరు ఉదయాన్నే నిద్ర లేచేసరికే నేను చప్పుడు చేయకుండా, మన క్రికెట్ గురించి కొన్ని తీవ్రవ్యాఖ్యలను చేసేస్తాను. ఈ వ్యాఖ్యలు చేయడంలో నా ఉద్దేశాలు మాత్రం మన క్రికెట్కు మంచి చేసేటం తటి ఉదాత్తమైనవి. ‘‘సముచితమైన నడవడిక, స్నేహశీలత, మంచి పెంపకం ఉన్న’’ క్రీడాకారులతో కూడినదిగా ఉన్నంత కాలం మన క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ జట్టు అంత బాగానే ఉండేదని నా మొదటి వ్యాఖ్య. ఆక్స్ఫర్డ్/స్టీఫెన్ కళాశాలల విద్యార్థుల తరానికి చెందిన ‘‘మంచివాళ్లు’’, ‘‘సొగసుగా ఓడి పోయే వారు’’ వైదొలగి.. చిన్న పట్టణాలకు చెందిన హెచ్ఎమ్టీ (హిందీ మీడియం టైపు) వారికి దారివ్వడంతో ‘‘చెడ్డవాళ్లు’’ వృద్ధి చెందడం ప్రారంభ మైంది. ఇది నా రెండో వ్యాఖ్య. ఆ తదుపరి మన క్రికెట్ క్రీడా నైపుణ్యాలు అసాధారణమైన రీతిలో మెరుగుపడ్డాయి. దేశ చరిత్రలో ఇంతవరకు ఆడిన క్రీడాకారులతో నేడు అత్యుత్తమ భారత జట్టును, 18 మంది క్రీడాకారులతోఎంపిక చేసి చూడండి. అందులో 1992కు ముందటి 25 ఏళ్ల కాలానికి చెందిన స్టార్ క్రీడాకారులు ముగ్గురికి మించి ఎంపిక కారు (గవాస్కర్, విశ్వనాథ్, కపిల్). ఈ ముగ్గురిలోకి పాత వాడైన విశ్వనాథ్ 1969లో తొలి టెస్ట్ ఆడారు. అంటే 1932–1969 మధ్య జరిగిన 115 టెస్టులలో ఆడిన వారెవరూ ఈ జట్టులోకి రాలేకపోయారు. గతంలో మన స్పిన్ చతుష్టయం (బిషన్సింగ్ బేడీ, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకటరా«ఘవన్) అద్భుతమైనదే. కానీ ఇక ఎంత మాత్రమూ అది ఇంత వరకూ గడచిన కాలానికంతటికీ గొప్పది కాదు. ఈ వ్యాఖ్య బహుశా మరింత వివాదాస్పదమైనది కావచ్చు. వారి తర్వాత ఇటీ వలి కాలానికి చెందిన నలుగురు స్పిన్నర్లు... అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, ఊపిరి బిగబట్టి వినండి సర్ రవీంద్ర జడేజా. నాటి దిగ్గజాల కంటే నేటి క్రికెటర్లే మిన్న ఈ వాదనలో నాకు ఇద్దరు తోడుగా ఉన్నారు. భారత అత్యుత్తమ క్రికెట్ గణాంక నిపుణుడు మోహన్దాస్ మీనన్, హార్పర్ కాలిన్స్వారి అద్భుతమైన కొత్త పుస్తకం ‘నంబర్స్ డు(నాట్) లై’. గణాంకాలను అద్భుతంగా విశ్లేషించే జట్టు ప్రభావ సూచీ ఈ పుస్తకంలో ఉంది. ఒకప్పటి మన టెస్ట్ క్రికెట్ ఓపె నర్, నేటి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆ పుస్తకంలో దానిని వివరించారు. నా గణాంకపరమైన వివరాలన్నింటికీ ఆధారం మీనన్. పాత కథలు, గత జ్ఞాప కాల మక్కువలకు మించి ఒక క్రీడాకారుడిని గొప్పవాణ్ణి చేసేది ఏమిటో తేల్చే తర్కాన్ని ‘నంబర్స్ డు(నాట్) లై’ అందించింది. లేదంటే నేనిలాంటి వ్యాఖ్యలు చేసే వాడినే కాదు. రాజకీయ వ్యవస్థతో వాదనకు దిగడం వేరు. అదే క్రికెట్ విరాట్టులుగా ఆరాధనలను అందుకుంటున్నవారిని సవాలు చేయడం ఘోర అపచారం. 1932–67 మధ్య భారత్ తొలి 100 టెస్టు మ్యాచ్లను ఆడింది. ఇందులో కేవలం 10 సార్లు గెలిచి, 40 సార్లు ఓడిపోయింది. ఆ పురాతన కాలం నాటి మన జట్టు, నేటి బంగ్లాదేశ్ జట్టుకంటే మెరుగ్గా ఉండేదేం కాదు. అది 2000 తర్వాత ఇంతవరకు ఆడిన 98 టెస్టులలో 8 టెస్టులలో గెలిచింది. వినూ మన్కడ్, లాలా అమర్నాథ్, పాలీ ఉమ్రీగర్, పంకజ్రాయ్, సీకే నాయుడు, సుభాష్ గుప్తే, నారీ కంట్రాక్టర్, బాపూ నడకర్ణి, నవాబ్ ఆఫ్ పటౌడీ, చందు బోర్డె తదితరులపై మనకున్న ఆరాధనను పట్టించుకోకండి. దక్షిణాఫ్రికా జాతి వివక్షను పాటించడం వల్ల అప్పట్లో ఆ జట్టుపై నిషేధం ఉండేది. ఆ తదుపరి 25 ఏళ్లలో (1967–91) భారత విజయాల శాతం రెట్టింపైంది. 174 టెస్టు లలో 34 విజయాలు లభించాయి. ఆ తర్వాతి 25 ఏళ్లలో (1992–2017) విజయాలు మళ్లీ రెట్టింపై 39.2 శాతానికి చేరాయి. దీంతో మన జట్టు పరా జయాల శాతం కూడా తగ్గింది. గంగూలీ శకం... విజయ పథం భారత క్రికెట్లో వచ్చిన అసాధారణమైన మెరుగుదలలో మరో మధు రమైన మలుపు ఉంది. అది నవంబర్ 2000లో అసలు సిసలు ‘‘చెడ్డ అబ్బాయి’’ సౌరవ్ గంగూలీ మన క్రికెట్ జట్టుకు కెప్టెన్ కావడం. ఆ తదుపరి ఆడిన 177 టెస్టులలో మన గెలుపుల రికార్డు మరింతగా మెరుగుపడి, ఓట ములు పడిపోయాయి. వాస్తవానికి మీనన్ గుర్తుచేసినట్టుగా అప్పటి నుంచి మన జట్టు 43.5% విజయాల రికార్డుతో ఆస్ట్రేలియా(60.6%), దక్షిణాఫ్రికా (49%)ల కంటే మాత్రమే వెనుకబడి గౌరవప్రదమైన మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ల కంటే ముందుంది. ఈ గంగూలీ శకంలోనే దిక్కుమాలిన వివాదాలలో క్రికెట్ వాటా కూడా పెరిగిందని చెప్పడానికి గణాంకవేత్తలు అవసరం లేదు. గంగూలీ సంతో షంగా ముల్లును ముల్లుతోనే తీసే వైఖరిని అవలంబించేవాడు, ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బతీయడం కోసం దూషణలకు దిగడంలో ఆస్ట్రేలియా క్రీడా కారులను మించిపోయేవాడు. లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి ఊపినవాడతను. తనకి ముందటి ప్రముఖ క్రీడాకారులు ఎవరూ వీటిలో దేనినీ ఆమోదించేవారు కారు. మధ్యాహ్నం పూట బీరు తాగే కొందరు ముసలాళ్లు, కుక్కలు తప్ప మరెవరూ చూడని మ్యాచ్లంటూ కౌంటీ క్రికెట్ను ఈసడించి, ఎమ్సీసీ ఆహ్వానాన్ని తిరస్కరించిన ఖ్యాతి సునీల్ గవాస్కర్కే దక్కుతుంది. కాకతాళీయంగా గంగూలీ ఎదుగుదలతో పాటే భారత క్రికెట్ సామాజిక పరివర్తన కూడా సాగింది. మొరటుదనం ఉన్న, చిన్న పట్టణాలకు చెందిన, ఇంగ్లిషు మీడియంలో చదువుకోని, కాలేజీ మొహం చూడని (సచిన్ టెండూ ల్కర్ కూడా అదే బాపతు) క్రీడాకారులు జాతీయ జట్టులోకి ప్రవేశించారు. మనేకా గాంధీ ఆధునిక ప్రయోగంగా తాజాగా వాడుకలోకి తెచ్చిన పద బంధాన్ని ఉపయోగించి చెప్పాలంటే ఇది నిజంగానే ‘‘హార్మోన్ల విస్ఫో టనం’’. ఇది కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. ఇదే కాలంలో భారత హాకీ వైఖరి, ఆట తీరు కూడా మారింది. రమేష్ క్రిష్ణన్ లేదా విజయ్ అమృతరాజ్ల నైపుణ్యంలో బహుశా ఒక భాగం మాత్రమే ఉన్న లియాండర్ పేస్ టెన్నిస్ టూర్లలో, డేవిస్ కప్ పోటీలలో మరిన్ని ఎక్కువ విజయాలను సాధించాడు. ఆ ఉరవడిలోనే నిర్దాక్షిణ్యమైన వ్యాపారవేత్తలు లేదా రాజకీయవేత్తలు బీసీసీఐ లోకి ప్రవేశించారు. ఇంగ్లండ్ను మెచ్చుకునే రాకుమారులు, బడా వ్యాపార వేత్తల శకం ముగిసిపోయింది. జగ్మోహన్ దాల్మియా, గంగూలీ, ఐఎస్ బింద్రా, లలిత్ మోదీ, ఎన్ శ్రీనివాసన్లు రంగ ప్రవేశం చేశారు. వారికీ, ఒక ప్పటి విజయ్ మర్చంట్, రాజ్సింగ్ దుంగార్పూర్, మాధవ్ రావ్ సింథియా, ఆర్పీ మిశ్రా, ఫతేసింగ్ రావు గేక్వాడ్, అందరిలోకీ అత్యుత్తమమైన పెద్ద మనిషి విజయనగరం మహారాజ్కుమార్ లేదా విజ్జీలకూ పోలికే లేదు. ఒక ఇంగ్లిషు జట్టును తమ రాజప్రాసాదాలకు తీసుకురావడమే వారికి గొప్ప. అడ్డూ అదుపూ లేకుండా బోరవిరుచుకుని, చొక్కాలు విడిచేసి తిరిగే శకంలోకి భారత్ ప్రవేశిస్తోంది. ఈ మార్పు మన క్రికెట్లోని సంప్రదాయవాదులకు, పాత వ్యవస్థ (ఇంగ్లండు–ఆస్ట్రేలియా)లకు వేరు వేరు కారణాలతో మింగుడు పడటం లేదు. నేటి స్పిన్నర్లు బేడీ/ప్రసన్న తరగతికి చెందవచ్చు, చెందకపోవచ్చు. కానీ వారు ఎన్నడూ చేసి ఎరుగని విధంగా వీరు తమ బంతిని బౌండరికి కొట్టినందుకు బ్యాట్స్మన్ను ప్రశంసించడం కనిపిస్తుంది. గంగూలీ పూర్వ కాలంలో మన మొదటి నిజమైన నాటురకపు, దూకుడు ఆటగాడిగా కపిల్ దేవ్ను చూశాం. 1992 పోర్ట్ ఎలిజెబెత్ టెస్ట్లో నాన్ స్రై్టకింగ్ బ్యాట్స్మన్గా ఉన్న పీటర్ కిర్స్టన్ బౌలర్ బంతిని వేయడానికి ముందే క్రీజును దాటి నందుకు కపిల్ రన్ ఔట్ చేశాడు (మాన్కేడింగ్). అందుకుగానూ కిర్స్టన్ తన బ్యాట్తో కపిల్ను కొట్టాడు. ఆ బహిరంగ అవమానాన్ని, శారీరకమైన బాధను కపిల్ దిగమింగాల్సి వచ్చింది. విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ లేదా అశ్విన్లను అలా ఎవరైనా చేయగలరా? అది గతించిన గతం... ఇది క్రికెట్ విప్లవం పంజాబీ మాట్లాడే, బిడియంగా ఉండే పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇమ్రా న్ఖాన్ 1970లలో ప్రపంచ చాంపియన్లుగా మార్చాడు. ఇమ్రాన్ తమ క్రీడా కారుల భయాన్ని పోగొట్టి, విదేశీయులన్న భావనను దూరం చేశాడు. సూటు, టై «అలవాటులేకపోతే అధికారిక కార్యక్రమాల్లో సల్వార్–కమీజ్ వేసు కోండి, పత్యర్థులను ఎన్నడూ ‘‘సర్’’ అని పిలవకండి, దేనికైనాగానీ సారీ చెప్పకండి, అవసరమైతే శాపనార్థాలు పెట్టండి, ఇంగ్లిష్ రాకపోతేనేం, పంజా బీలో ఆ పని చేయండి, అయినా అది వాళ్లకు అర్థమౌతుంది అని వారికి బోధించాడు. గంగూలీ వచ్చాక భారత క్రికెట్లో కూడా అ విప్లవమే వచ్చింది. ఆకాశ్ చోప్రా రాసిన పుస్తకంలో కపిల్కు భారత దేశపు ప్రభావశీల క్రీడా కారులలో స్థానం దక్కలేదు. అయినా ఆ పుస్తకావిష్కరణకు కపిల్ పెద్ద మనసుతో వచ్చాడు. పాత ‘‘బోంబే స్కూల్’’ బ్యాటింగ్లో బ్యాట్స్మన్ బాల్ను బాదినప్పుడు ఫాస్ట్ బౌలర్ మొహంలోకి చూస్తే, ఎక్కడ అతనికి చిర్రెత్తుతుందోనని చూసేవాడు కాడని కపిల్ చెప్పాడు. ఇప్పుడు కోహ్లి బంతులను బౌండరీకి కొట్టి ‘‘పోయి తీసుకురా’’ అంటాడు బౌలర్లను. నేటి మన పెద్దమనిషి తరహా కొత్త క్రికెట్ బోర్డు సదుద్దేశాలతోనే అయినా... క్రికెట్ ఆట అంటే ఇంకా పాతకాలపు పెద్దమనుషుల ఆటేననే పొరబాటు నమ్మకంతో దీన్ని వెనక్కు మరల్చాలని చూస్తోంది. తాజా కలం : నేను చివరగా చేసిన వ్యాఖ్యపై రేగే దుమారం నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు. మన అతి గొప్ప స్పిన్నర్లు ఎవరు? 52 రన్స్కు ఒక వికెట్ చొప్పున తీసిన అశ్విన్ 1945 తర్వాత ప్రపంచంలోనే అత్యధిక స్ట్రయికింగ్ రేట్ను నమోదు చేసిన స్పిన్నర్గా నిలిచాడు. మురళి (55), వార్న్ (57)లకంటే ముందున్నాడు. ఇండియాకువస్తే జడేడా, కుంబ్లేలు 62, 66 రన్స్తో వరుసగా అశ్విన్ తర్వాత నిలిచారు. పాత స్పిన్నర్ల చతు ష్టయం కుంబ్లే (66) తర్వాత ఉంది. ప్రసన్న (76), బేడీ (80), వెంకట్ (95)lవెనుకబడి ఉన్నారు. బజ్జీ (69) సైతంlవారికంటే ముందే ఉన్నాడు. అందువల్లనే వారెవరూ ప్రభావశీల సూచీ/ఆకాశ్ చోప్రా ప్రభావశీల క్రీడా కారుల జాబితాలో లేరు. అది ఎంతటి అపచారంగానైనా కనిపించొచ్చు నేటి భారత జట్టులోకి వారు ప్రవేశించలేరు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
నిరాశ నిశిలో ఆశల ఆరాటం
జాతిహితం తూర్పు యూపీ ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మోదీ మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువకుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. అంత నిశ్శబ్ద ప్రతిస్పందనను చూసి ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అనుకుంటోందో అర్థం కాలేదనే. అమెరికన్లు బేస్బాల్ క్రీడా మైదానాన్ని బాల్పార్క్ అన్నట్టే పనికిరాని బీడుభూములను బ్యాడ్ల్యాండ్స్ అనడం పరిపాటి. ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలు ఆ వర్ణనకు సరిపోయేవిగా ఉంటాయి. బుందేల్ఖండ్లోని యమున, ఛంబల్ నదుల వెంబడే నిస్సారమైన, ఒరుసుకుపోయిన లోయల ప్రాంతం, ఇటావా సరిగ్గా ఆ అభివర్ణనకు సరిపోతాయి. బ్యాడ్ల్యాండ్స్ అనే దానికి ముక్కస్య ముక్క అర్థం చెప్పుకుని చెడ్డ భూములు అన్నా లేదా ప్రజా ప్రాచుర్యం పొందిన అరాచక ప్రాంతాలు అన్నా సరిగ్గా సరిపోతుంది. ఇంకా తూర్పునకు పోతే ప్రకృతి చిత్రం మారిపోతుంది. క్రమబద్ధమైన, సాధారణ నీటి కాలువలు, వాటి ఒడ్డున నీటితో తడిచి కళకళలాడే మరింత సారవంత మైన నేలలు కనిపిస్తాయి. కానీ జీవన నాణ్యతతో పాటే, అంతే వేగంగా చట్ట బద్ధపాలన కూడా క్షీణించిపోతుంది. ఏ కప్పూ లేక బహిరంగంగా, పొంగిపొర్లే మురుగునీటి కాలువలు, మురుగు నీటి గొట్టాలు, పైన వదులుగా వేలాడే వైర్లు, గాలిలోని శాశ్వత దుర్గంధం, గుంతలు, దురాక్రమణలు, గిడసబారిన పిల్లలు, దవడలు పీక్కుపోయిన పెద్దలు, వారిలో వందలాది మంది ఏటేటా జపనీస్ ఎన్సెఫాలిటిస్ శిక్షకు గురై బలైపోయేవారూ కనిపిస్తారు. రోడ్డు పక్క పాదచారుల బాటలు పూర్తిగా చెత్తతో నిండి పేవ్మెంట్ల అవతారమెత్తు తాయి. అర్థరాత్రి మాత్రం రోడ్లు మధ్యలో మాత్రం శుభ్రంగా తుడిచి ఉంటాయి. కనీసం గోరఖ్పూర్లోని ‘పోష్’ (విలాస) ప్రాంతాల్లో, ఆ చుట్టు పక్కలనైనా ఇది కనిపిస్తుంది. మనం మరచిన యూపీ గోరఖ్పూర్, యూపీలోని అత్యంత నిరాశాజనక ప్రాంతమైన తూర్పు యూపీకి దాదాపుగా రాజధాని వంటిదే. దానికి ఉత్తరాన నేపాల్తో నిర్ని బంధ సరిహద్దుంది. పశ్చిమ బిహార్ను ఆనుకుని మిట్టపల్లాలుగా ఉండే తూర్పు జిల్లాలున్నాయి (కుశీనగర్సహా బౌద్ధుల ముఖ్య ప్రాంతాలు ఉన్నది అక్కడే). దక్షిణాన ఉన్నవి మరింత గందరగోళంగా ఉండే దియోరియా, అజామ్గర్, బాలియా, జునాపుర్ తదితర జిల్లాలు. మన కంటికి కనిపించని, ఆలోచనల్లోకి రాని విస్మృత ప్రాంతంగా ఈశాన్య భారతాన్ని మనం ఎన్నడో ఆమోదించాం. తూర్పు యూపీకి, ప్రత్యేకించి గోరఖ్పూర్కు వచ్చి చూడండి. మీకు అలాంటి అనుభవమే కలుగుతుంది. మీరు ఎక్కడ చూస్తారనే దాన్ని బట్టి.. కిందికా, పైకా లేక నేల మీది నుంచా, ఆకాశం నుంచా అనే దాన్ని బట్టి.. గోరఖ్పూర్పై మీకు రెండు అభిప్రాయాలు ఏర్పడవచ్చు. మీ కాళ్ల కింద చెత్త, బురద ఉంటే మీ దృష్టిని అక్కడి నుంచి పైకి, రోడ్ల కూడలి కుడి ఎడమలకు, ముందుకు చూడండి. ప్రైవేటు ఉన్నత విద్య, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు గత 15 ఏళ్లుగా దేశ ప్రధాన భూభాగంలో వేగంగా వృద్ధి చెందాయని గోడల మీది రాతలు చాటుతాయి. 1991 సంస్కరణల తర్వాత మన దేశంలోని చిన్న పట్టణాలలో విద్య అత్యంత జనా దరణగల వినియోగ వస్తువుగా మారింది. తూర్పు యూపీ లేదా పూర్వాం చల్లో అది పూర్తిగా విభిన్నమైన, అవాస్తవిక ప్రమాణాలకు హైదరాబాద్ లోని టాలీవుడ్ సినిమా హోర్డింగులంత పెద్ద ప్రకటనలు ఇక్కడికి సుదూ రంలో ఎక్కడో దొరికే ఉద్యోగానికి టికెట్ను అమ్మజూపుతుంటాయి. సివిల్ లైన్స్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కలా అర్ధరాత్రి నడకకుపోయి 200 హోర్డింగులను లెక్కించాను. వాటిలో 170కు పైగా విద్య, శిక్షణ, పోటీ పరీక్షలకు కోచింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు సంబంధించినవే. ‘‘మీకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యం అక్కర్లేదని మీరు నిజంగానే అనుకుంటున్నారా?’’ అని పెద్ద పెద్ద అక్షరాలతో హిందీలో రాసి ఉన్న ప్రకటన మిమ్మల్ని వెక్కి రించేలా ఉంటుంది. పీఎంటీ కోచింగ్ సెంటర్ ద్వారా ‘‘గత 18 ఏళ్లలో 1,012 మంది డాక్టర్లను సృష్టించిన’’ డాక్టర్ రాహుల్ రాయ్ను మరో హోర్డింగ్ పరిచయం చేస్తుంది. ఆశల దీవికి ఎగిరిపోవాలి తక్కువ నిరాశాజనకమైన, అవకాశాలు కొన్నయినా ఉన్న ప్రాంతానికి వెళ్లగల గడానికి మించి పూర్వాంచలీ యువత కోరుకునేది ఏదీ లేదు. ఆకాంక్షా భరితమైన ఆ పోటీలో నెగ్గుకురాగలిగేది అతికొందరే. మిగతా వారంతా రిక్షాలు లాగుతూ, నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ, తోపుడు బళ్లపై పళ్లు, కూర గాయలు అమ్ముకుంటూ, చిన్న చాయ్ దుకాణాలు పెట్టుకుని కుళ్లిపోతున్న మన మెట్రో సబర్బన్, మురికివాడలను నింపుతారు. ఆరు కోట్ల భారతీయు లున్న ఈ విస్మృత ప్రాంతాన్ని ‘ఉడ్తా పూర్వాంచల్’ అని కీర్తించాలని ఏ సినీ నిర్మాతా అనుకోడు. అయినా అక్కడి యువతకంతటికీ ఉన్నది చాలా వరకు ఒకే ఒక్క ఆకాంక్ష: ఎక్కడికో ఎగిరిపోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి శ్రోతలను కూడా తన ఉపన్యాసంలో భాగస్వా ములను చేయడంలో అసాధారణ ప్రతిభ ఉంది. దాన్ని వర్ణించడానికి ఆయనో అద్భుత వక్త అంటే సరిపోదు. శ్రోతలు ఏమి, ఎప్పుడు, ఏ స్థాయిలో వినాలని కోరుకుంటున్నారో ఆయనకు తెలుసు. సరైన సమయాన్ని ఎంచు కోవడం, మధ్యలో ఆగడం, హావభావ విన్యాసాలు, రెండు చేతులూ చాచి వలయంలా ఊపడం, ఏదైనా మంచి విషయం చెప్పానని అనుకున్నప్పుడు ఒక అరచేతిని మరో చేతిపై తడుతూ వేచి చూడటం తదితర విషయాల్లో ఆయనది సహజ చాతుర్యం. అందుల్లనే దాదాపు లోపరహితమైన ఆయన పకడ్బందీ ప్రచారంలో దియోరియాలోఒక అపస్వరం వినిపించడం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ గాంధీ గత ప్రచార కార్యక్రమాల్లో దొర్లినట్టుగా అది స్థానిక పరిస్థితిని అర్థం చేసుకోవడంలోని పొరబాటు కావడం మరింత వైచిత్రి. 2012 రాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ లాగే నేడు మోదీ కూడా ఆ ప్రాంతపు ప్రధాన సమస్య అర్థికపరమైన వలసలేనని మాట్లాడారు. ఎక్కడో దూర ప్రాంతాలకు పోయేకంటే మీ యువత మీ సొంత తాలూకాలోనే ఉద్యోగాలు కావాలని అనుకోవడం లేదా? ముసలి తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలని ఏ యువ కుడు అనుకోడు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన శ్రోతల స్పందన కోసం ఆగారు. ఆ స్పందన అంత నిశ్శబ్దంగా ఉన్నదేమని ఆయన ఆశ్చర్యపోయి ఉంటే ... పూర్వాంచల్ యువత పోరాడాలనిగాక, పారిపోవాలని ఎంత బలంగా అను కుంటోందో అర్థం కాలేదనే. ఇక్కడ సమస్య కేవలం విద్యో, ఉద్యోగాలో కాదు. అభిలషణీయమైన దానికంటే తక్కువ స్థాయి నాణ్యతగల జీవితాలను అను భవించేలా శాపగ్రస్తులు కావడం. వర్షాకాలం వస్తే మురుగు కాలువలు పెద్ద కాలువలుగా మారిపోతాయి. గాలి దుమ్ముతో నిండి ఉంటుంది. ఇక దోమల సంగతి చెప్పనవసరమే లేదు. దారిన నడుస్తూ నడుస్తూ ఫోన్లో మాట్లాడితే కొన్ని దోమలను మీరు మింగేయనూవచ్చు. ప్రధాని సైతం ఆ ప్రాంతపు సామాజికాభివృద్ధి సూచికలు నిరుపేద ఆఫ్రికా దేశాల స్థాయిలో ఉన్నాయ న్నారు. అంటే అది పూర్వాంచల్ గురించి మాట్లాడటమే అవుతుంది. ఆ ప్రాంతం ఇలా శాపగ్రస్తమైనది కావడానికి భౌగోళికత కొంతవరకు కారణం. ఎక్కడి నుంచి చూసినాగానీ గోరఖ్పూర్ మరీ సుదూర ప్రాంతం. దేశంలోని ప్రధాన రైలు లేదా రోడ్డు వ్యవస్థలతో అది అనుసంధానమై లేదు. ఇటీవలి వరకు అది మీటర్ గేజ్ రైల్వే లైన్ల ప్రాంతంగానే ఉండేది. ఆ ప్రాంత ప్రజలు ఎప్పడూ ప్రతిభావంతులు, కష్టించేవారు, తిరగబడేవారే. గోరఖ్పూర్ నుంచి దియోరియాకు మధ్య దారిలో చౌరీ చౌరా ఉంది. 1922లో ప్రజలు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టి 23 మంది పోలీసులను హతమార్చినది అక్కడే. మార్షల్ లా విధించి బ్రిటిష్వారు అక్కడ సృష్టించిన భయోత్పాతానికి నిరసన తెలపడానికి అక్కడి వచ్చిన నెహ్రూను అరెస్టు చేశారు. ఆయన అంత దూరం ఎలా వచ్చారో 94 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరే ఊహించుకోండి. గోరఖ్పూర్ జైలులో ప్రముఖ విప్లవకారుడు రామ్ప్రసాద్ బిస్మిల్ను ఉరితీశారు. అయినా ఆ ప్రాంతం ఇంకా అంత దూరంగానే ఉంది. పూర్వాంచల్ దిశగా నాటి విప్లవకారుల స్థానంలో మాఫియా సభ్యులు వచ్చారు. బ్రాహ్మణ, రాజ పుత్ర మాఫియాల మధ్య రక్తసిక్త ప్రతీకార హత్యాకాండలు నేడు లేవు. కానీ పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ముఠాలున్నాయి. నగరాలలో ఎప్పుడు సుపారీ హత్యలు జరిగినా సాధారణ అనుమానితులు ఇక్కడివారే అయి ఉంటారు. విశాల్ భరద్వాజ్ చిత్రం ‘ఇష్కియా’లో పారిపోతున్న నసీరుద్దీన్ షా, అర్షాద్ వార్సీలు గోరఖ్పూర్ దగ్గర్లోనే దాక్కుంటారు. ఆ సన్నివేశంలో వార్సీ, నసీరు ద్దీన్ షాతో మరువలేని ఈ మాటలంటాడు :‘‘కాలికి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెంటనే ఉడాయిద్దాం. మన భోపాల్లోనైతే షియాలు, సున్నీలే కొట్లాడుకుం టారు. ఇక్కడ బ్రాహ్మణులు, ఠాకూర్లు, యాదవ్లు, జాట్లు అందరికీ (ప్రైవేటు) సేనలున్నాయి.’’ కాబట్టి పూర్వాంచల్ కూడా బ్యాడ్ల్యాండ్స్ అనే పదబంధం జనప్రాచుర్యం పొందిన అర్థ పరీక్షలో నెగ్గుతుంది. గోరఖ్పూర్లో రాజ్యం చలాయిస్తున్నది భూస్వాములో లేక సంప్రదా యక మాఫియా ముఠాలో కాదు. అంగబలం ఉండి, సుస్పష్టంగా మాట్లాడ గలిగిన, కాషాయాంబరధారి యోగీ ఆదిత్యనాథ్. శక్తివంతమైన గోరఖ్పూర్ మఠా నికి ఆయన వారసత్వ అధిపతి. ఆయన ఐదుసార్లు గెలిచారు. ఈసారి ఆయన బీజేపీకి ఆ జిల్లాలోని ఎక్కువ స్థానాలను సాధించిపెడతారని ఆశిస్తు న్నారు. ఆయన గుడి, మఠం రెండూ ఆ ప్రాంతానికి ప్రామాణిక చిహ్నాలు. అంతేకాదు అత్యంత పరిశుభ్రమైనవి కూడా. ఈ ఎన్నికల్లో బీజేపీ ముస్లింలను ఎవరినీ ఎందుకు నిలపలేదు? అని అడిగాం. గెలవడం మాత్రమే లెక్కలోకి వస్తుంది అని ఆయన అన్నారు. బీజేపీ జాబితాలో ముస్లింలు లేకపోతేనేం, ఇక్కడ ఎన్నడూ మత కల్లోలాలు జరగవు అన్నారు. ఎందుకని అడిగాం. ‘‘మేం అందించే మంచి పాలన, భయం’’. భయం ఎందుకు, ఎవరంటే భయం అని అడిగాం. మా ప్రశ్నను ఆయన పట్టించుకోలేదు. యూపీని చిన్న రాష్ట్రాలుగా విభజించే విషయం ప్రస్తావనకు వచ్చిన ప్పుడు ఆయన కళ్లు వెలిగాయి. వాటిలో ఒకటి పూర్వాంచల్ అవుతుంది. ఈ ఎన్నికలు అందుకు సమయం కాదు. అయితే ఆ విషయాన్ని ఆయన ముందు ముందు పట్టించుకుంటారని, కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఆయన అనుకుంటున్నారనేది స్పష్టమే. జరగనున్న ఈ అనివార్య పరిణామం గోడ మీద కనిపిస్తుండగా ఇష్కియా చిత్రంలోని అర్షాద్ వార్సీ సలహాను ఎవరు మాత్రం పాటించరు? కాళ్లకు బుద్ధి చెప్పి వెంటనే ఇక్కడి నుంచి పలాయనం చిత్తగిద్దాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
యూపీలో వీస్తున్నది పాతగాలే
జాతిహితం ఈసారి యూపీ ఎన్నికల్లో ఎవరూ ఎవరిపైనా పెద్దగా ఆశపెట్టుకోలేదు. ప్రజలు తమ సంప్రదాయక ఓటింగు ధోరణులను మార్చుకునేలా చేసే బలమైన ప్రేరణ ఏదీ లేదు. ‘బయటివారు’ అని ఆలోచించేవారు మోదీనే అలా చూస్తున్నారు తప్ప, ఆయన ప్రత్యర్థు లను కాదు. సంఖ్యాబలాన్ని తారుమారు చేయడానికి అది సరిపోతుందా? షహజాద్ పూర్లో బంగాళ దుంపలను ఏరుతున్న బడి పిల్లల్లాంటి యువత పెద్ద సంఖ్యలో ఉంది. 2019 నాటికి వారు ఓటర్లవుతారు, అప్పుడైనా ఈ ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఎన్నికల బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ వెలువరిస్తున్న సంకేతాలు గత దశాబ్దిగా మనం చదువుతున్న, నివేదిస్తున్న వాటికంటే చాలా విభిన్నమైన చిత్రాన్ని సూచిస్తున్నాయి. బిహార్లోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ గోడల మీది రాతలు అప్పట్లో ఆకాంక్షను ఎక్కువగా తెలియజేస్తుండేవి. ఆశావాదం, ఆకలి, ఆత్మవిశ్వాసం, ప్రత్యేకించి యువతలో కనిపించేవి. కుటుంబాల వద్ద ఖర్చుపెట్టడానికి కొంత మిగులు డబ్బుండేది. ఉత్తరాదిలో ప్రైవేటు బడి చదువుల నుంచి దక్షిణాదిన బ్రాండెడ్ చికెన్ వరకు మార్కెట్లు కళకళలాడుతుండేవి. ఇక పంజాబ్ నుంచి విదేశాలకు వలస పోతుండేవారు. రోజుకు రెండుసార్లు నోట్లోకి వేళ్లు పోవడమే గగనమై, ఆశనేదే కానరానిదిగా ఉండిన పేద రాష్ట్రం బిహార్ సైతం నితీష్ కుమార్ తొలి దఫా పాలనలో బ్రాండెడ్ లోదుస్తులను కొనడం మొదలెట్టింది. ఆవిరైపోయిన ఆశావాదం ఈ పరిస్థితి మారడం మొదలైందనడానికి ఉత్తరప్రదేశ్ ఒకవేళ సంకేతమే అయితే అది మెరుగైన మార్పు కానవసరం లేదు. ఆకాంక్షాభరితమైన ఆ వెల్లువ 2009లో యూపీఏను మరింత ఎక్కువ సంఖ్యాబలంతో తిరిగి అధి కారంలోకి తెచ్చింది. పాత ‘ముయా’(ముస్లిం–యాదవ్) ఓటు బ్యాంకుతోనే సాధ్యం కానంతటి పెద్ద మెజారిటీతో అది యువకుడైన అఖిలేష్ యాదవ్పై నమ్మకం ఉంచింది. 2014లో నరేంద్ర మోదీకి అది మెజారిటీని కానుకగా ఇచ్చింది, ‘‘పని చేస్తున్న’’ పలువురు ముఖ్యమంత్రులకు తిరిగి పట్టంగట్టింది. వారిలో కొందరు మూడోసారి ఎన్నికయినవారు. ఆ వెల్లువ నేడు సన్నగిల్లి పోతోంది. కానీ అంతరించిపోలేదు. ఆనాటి కొంత ఆశావాదం స్థానే నిరాశా నిస్పృహలు ప్రవేశిస్తున్నాయి. ఇది కొన్నిసార్లు చెడ్డ, పాత చిట్కాను తిరిగి ఆశ్రయించేలా చేస్తోంది. అంతకంటే ఎక్కువగా అది ఒకప్పటి హిందూ వృద్ధి రేటు కాలాన్ని గుర్తుకుతెచ్చేలా అస్తిత్వ రాజకీయాలు తిరిగి రంగప్రవేశం చేయడాన్ని సూచిస్తోంది. గత నాలుగేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థ 6 శాతం వృద్ధి వద్ద నిలచిపోవడాన్ని హిందూ వృద్ధి రేటుగానే అభివర్ణించాల్సి ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్లో నేడు జరుగుతున్న ఎన్నికలు తిరిగి అలాగే జరుగు తున్నాయి. అస్తిత్వ (కులం లేదా మత విశ్వాసం) దుర్గం నుంచి యువతను బయటకు నడిపిన ఆశావాదం నేడు ఆవిరైపోయింది. కాబట్టే నేటి ఎన్నికల ప్రచారం పాతకాలపు కందకాల యుద్ధంగా మారింది. ఈ ప్రతిష్టంభనను బద్దలు కొట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నది ఒక్క నరేంద్ర మోదీనే. ఓటర్ల మానసిక స్థితిలో వచ్చిన ఈ మార్పునకు మరింత కచ్చితమైన ఆధారాల అన్వేషణలో నాలుగు రోజులు రోడ్డు మార్గాన పయనించాను. ఢిల్లీ నుంచి పశ్చిమ యూపీలోని జాట్ల ఆధిక్యతగల ప్రాంతం నుంచి బుందేల్ ఖండ్కు, యాదవ్లకు పెట్టనికోట ఇటా, కాన్పూర్, లక్నోల గుండా ఈ ప్రయాణం సాగింది. అంతేలేనిదిలా అనిపించే ఆ తూర్పు పయనపు మధ్యలో బారాబంకి సమీపంలోని జైద్పూర్ గ్రామంలో (నియోజక వర్గం కూడా) నాకు అలాంటి ఆధారం దొరికింది. అది నిగనిగలాడుతున్న బిజినెస్ కార్డు. అది 23 ఏళ్ల అటార్ రెహ్మాన్ అన్సారీది. ఆ కార్డుకు మించి షెల్ఫ్లు, సరుకులే లేని అతని దుకాణం లేదా దాని గోడల మీది ప్రకటనలు ఎక్కువ విషయాలు చెప్పాయి. అతని స్టార్ ఆన్లైన్ సెంటర్ అండ్ జనసేవా కేంద్రం నెలరోజుల క్రితమే ఏర్పాటైంది. కిరాణా దుకాణంలో దొరకనివి దాదాపు అన్నీ అక్కడ దొరుకు తాయి: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ–చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూయాజమాన్య రికార్డుల నకళ్లు, మార్పులు చేర్పులు చేయిం చడం, జీవిత బీమా, పాస్పోర్ట్, యూనివర్సిటీ పరీక్షల, ఉద్యోగాల దర ఖాస్తులు, ఫోన్ రీచార్జ్లు, మొబైల్ ఈ–వాలెట్ యాప్స్ను ఇన్స్టాల్ చేయడం వగైరా. ఇంటర్నెట్ ద్వారా చేయగలిగినది ప్రతిదీ. అటా బీఎస్సీ రెండో ఏడాది విద్యార్థి. అతని కుటుంబం చేనేత మగ్గంపై నూలు, విస్కోజ్, పట్టువస్త్రాలను నేసే వృత్తిని నమ్ముకున్నది. పెద్ద నోట్ల రద్దుతో సరఫరాలు నిలిచిపోయి, కనీసం తాత్కాలికంగానే అయినా అది దెబ్బతినిపోయింది. పెద్ద నోట్ల రద్దు సృష్టించిన∙సంక్షోభంపై ఆధారపడే అటా స్టార్ ఆన్లైన్ సెంటర్ దుకాణం పెట్టాడు. అందులో జియో ఇంటర్నెట్ లైన్లతో కూడిన రెండు కంప్యూటర్లున్నాయి. గోడలకు ఆన్లైన్–చెల్లింపులు, ఈ–వ్యాలెట్ కంపెనీల పోస్టర్లు అతికించి ఉన్నాయి. ఇక విద్యుత్ సరఫరా మరో సవాల్. దుకాణం ముందే ఓ సౌర విద్యుత్ యూనిట్ను పెట్టుకు న్నాడు. పగటిపూట అది నిలకడగా 300 వాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. దుకాణంలోని కంప్యూటర్లు, లెడ్ బల్బులు, ఫ్యాన్ పనిచేయడానికి అది చాలు. తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి పోర్టబుల్ సోలార్ విద్యుత్ యూనిట్ విలక్షణమైన యోచన. ఫోన్ చార్జింగ్, మోటార్ రిపేర్ల నుంచి హెయిర్ కటింగ్ దుకాణాల ముందు సైతం అవి అక్కడ కనిపిస్తాయి. మనిషి సృష్టించిన అత్యంత ప్రబలమైన ప్రతికూలతల మధ్యనే ప్రజలు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. అటా స్టార్ ఆన్లైన్ సెంటర్ ఉత్తర భార తంలోని సమస్యలను ఏకరువు పెడుతుంది: నాసిరకం పాలన, ఆర్థిక వృద్ధి లేమి, నిరుద్యోగం, వీటి నుంచి ఎలాగైనా బయటపడాలనే తపన, ఇటీవలే కోల్పోయిన ఆశావహదృష్టి. ఈ పరిస్థితి ఒక విద్యావంతుడైన యువ కునికి మంచి చేసినా, అందుకు భిన్నంగా ప్రతికూలతల మధ్య అవకాశాన్ని చేజిక్కిం చుకోవాలని ప్రయత్నిస్తున్నవారు కోట్లలో ఉన్నారు. మార్పునకు ఆధారాలు ఇవిగో ఉత్తర భారతానికి సంబంధించిన నిరక్షరాస్యత, పేదరికం, ఆఫ్రికా దేశాల స్థాయి సామాజిక సూచికల మూసుపోత చిత్రానికి కాలదోషం పట్టిపో యింది. విద్య ద్వారా ఆ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉన్నదని ప్రజలు భావించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ ఆ అవసరాలను తీర్చడంలో విఫలమైంది. దీంతో వారు పిల్లలకు తమ తాహతుకు మించిన ఖరీదైన చదువులను చెప్పించడానికి అప్పులు చేశారు, భూమిలో కొంత అమ్మేశారు. నేడు వారి పిల్లలకు మంచి డిగ్రీలున్నాయి. కానీ ఉద్యోగాల్లేవు లేదా విద్య నాణ్యత రీత్యా వారు ఉద్యోగాలకు అర్హులు కారు. ఇంకా రుణగ్రస్తులుగానే ఉన్న వారి తల్లిదండ్రులంతా ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి వారిలో కొందరు పొలాల్లో తమ తల్లిదండ్రులు ఏం చేశారో సరిగ్గా అవే పనులను చేస్తున్నారు. దీన్ని ద్వేషిస్తున్నారు. పాసీ దళితుడైన రామ్ శరణ్కు బీఎస్సీ డిగ్రీ ఉంది. అతను షహజాద్పూర్లో బంగాళ దుంపలను తవ్వి తీస్తున్నాడు. బాగా ప్రచారంలోకి వచ్చిన ఎన్డీటీవీ వీడియోలో మోదీ చర్యలను, శైలిని తాను ఎందుకు అభిమానిస్తాడో అత్యుత్సాహంగా చెప్పింది అతడే. అతని ఊహకు అందేది ఉపాధ్యాయ ఉద్యోగమే. రిజర్వేషన్లున్నా అది దొరకడం లేదు. బీఈడీ చేసినా ‘‘ఇదిగో, ఈ పనికిరాని బతుకే’’ అన్నాడు. అతని పొలంలో బడిలో చదువుతున్న ఏడుగురు ఆడపిల్లలు కూలీలుగా, ఉత్త చేతులతో మట్టిని కుళ్ల గిస్తూ బంగాళ దుంపలను దేవులాడుతున్నారు. వారు కూడా దళిత పాసీలే. వారికింకా ఓటు హక్కు రాలేదు. అయినా ఎవరికి ఓటేస్తారని అడిగితే, మోదీ అంటారు. 2019 వరకు వేచి చూడంyì . ఆ పిల్లలు పెరిగి భ్రమలు కోల్పోయి, విసిగిపోయి, ఆగ్రహంతో తిరుగబడుతుంటారు. మరో ఠాకూర్ (రాజ్పుట్) గ్రామంలోని జనక్ సింగ్కు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉంది. అతను పొలం పని చేసుకుంటూ, రేషన్ దుకా ణాన్ని చూసుకుంటున్నాడు. సైనికుల రిక్రుట్మెంట్లో మూడుసార్లు విఫలమ య్యాడు. మాస్టర్స్ డిగ్రీ ఉన్న వ్యక్తి సైనికుడు కావాలని ఎందుకు ప్రయత్ని స్తాడు? కొన్ని వందల బంట్రోతు లేదా సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు 20 లక్షల మంది, వారిలో ఎక్కువ మంది డిగ్రీలు, చాలా మంది మాస్టర్ డిగ్రీలు, పీహెచ్డీలు సైతం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతం అది. హిందూ వృద్ధి రేటు తిరిగి రావడం, నాణ్యతలేని విద్య కలసి మనల్ని జనాభాపరమైన విపత్తుకు చేరువగా నెట్టాయి. మీకేమైనా సందేహాలుంటే నాతోపాటూ యూపీలో పర్యటించండి.. భావి పరిణామాల సూచనలు స్పష్టంగా కని పిస్తాయి. సరిపెట్టుకుంటూనే ఉంటారా? ప్రతిచోటా కనిపించేది ఇదే చిత్రం. లక్నోలో అఖిలేష్ యాదవ్ ప్రచార బృందపు కాల్సెంటర్లో పనిచేసే బ్యూటీ సింగ్ అమే«థీలోని రాజ్పుట్ కుటుంబానికి చెందినది. ఆమెలో ఆత్వవిశ్వాసం ఉంది, జాగ్రత్తా ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఉన్నా ఆమె నెలకు రూ. 11,000కు ఈ అతి స్వల్ప కాలపు ఉద్యోగం చేయడానికి ఇబ్బందేమీ పడటం లేదు. ఇది ఉత్తర భారతంలో వచ్చిన పెద్ద మార్పు. లేదా ఎన్నోవిధాలుగా విచారించదగిన మార్పులేక పోవడం. విద్య ఉన్నా ఉద్యోగాల్లేవు. ఆశనుగానీ, ఉద్యోగార్హతను గాని కలి గించలేని డిగ్రీలున్నాయి. అందువల్ల కలిగే నిరాశాస్పృహ ఉంది. కొత్త పారి శ్రామిక సంస్థలు లేవు. ఇంకా మిగిలిన కుటీర పరిశ్రమలేమేనా ఉంటే అవి పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నాశనమయ్యాయి. వాస్తవానికి కొత్తగా ఆశ చిగు రించడమే లేదు. అయినా ఆగ్రహంతో విసుగెత్తి ఉన్న యువత నగరాలను తగలబెట్టడం లేదు, సాయుధ నక్సలైట్లలో చేరడం లేదా పంజాబ్లోలాగా మాదకద్రవ్యాలకు అలవాటు పడటం లేదు. మన గతి ఇంతేనని సరిపెట్టు కోవడం ఉత్తర భారతంలో బహుశా తేలిక కావచ్చు. ఇంకా వారికి ప్రజా స్వామ్యంలో, ఎన్నికల్లో నమ్మకం ఉండటం కూడా కొంతవరకు అందుకు కారణం కావచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి మూడు స్వాభావిక లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, ఎవరూ ఎవరిపైనా పెద్దగా ఆశపెట్టుకోలేదు. రెండు, తమ సంప్ర దాయక (ప్రధానంగా కుల ప్రాతిపదికన) ఓటింగు ధోరణులను మార్చు కునేలా చేసేటంతటి బలమైన ప్రేరణ ఏదీ ప్రజలకు లేదు. మూడు, ‘‘బయటి వారు’’ అనే రీతిలో ఆలోచించేవారు... అలా మోదీవైపే చూస్తున్నారు తప్ప, అఖిలేష్, రాహుల్, మాయావతిల వైపు చూడటం లేదు. మనకు తెలియం దల్లా ఒక్కటే, ఇది ఈ ఎన్నికల్లో సంఖ్యాబలాన్ని తారుమారు చేయడానికి సరిపోతుందా? అలా జరగకున్నా, ఆశలేదని భావించే యువతలో చాలా మంది షహజాద్పూర్లో బంగాళ దుంపలను ఏరుతున్న బడి పిల్లల్లా ఇంకా ఓటర్లు కాలేదు. 2019 ఎన్నికల నాటికి వారు ఓటర్లవుతారు. అప్పుడు ఈ ప్రతిష్టంభన తొలగిపోతుంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఆందోళనకరం అంతర్గత భద్రత
జాతిహితం కశ్మీరీ ప్రజలలో, ప్రత్యేకించి యువతలో ఆశావాదాన్ని నింపడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. ఒకప్పటిలాగే కశ్మీర్ను పూర్తి భద్రతా సమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. వాజ్పేయి కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్పేయి రచించినది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయమైనదే తప్ప సైనికమైనది కాదు. దాదాపు దశాబ్ద కాలంగా దేశం ఇంతకు మున్నెన్నడూ ఎరుగని రీతిలో అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా మరింత ఎక్కువ సురక్షితంగా ఉన్న అద్భుతమైన దశలో ఉన్నదనే వాదన సమంజసమనే అనిపించవచ్చు. అది ముగింపునకు వచ్చేసిందని లేదా మంచైనా, చెడైనా ఏ దశైనా మిగతా అన్నిటిలాగే ముగిసిపోక తప్పదని ప్రకటించడం తొందరపాటు కావచ్చు. బహిర్గత పరిస్థితికి వస్తే, నెలల తరబడి వాస్తవాధీన రేఖ మండుతున్నా, మునుపటిలాగే ఉన్నది. మన సరిహద్దులన్నీ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముప్పు ఏమీ లేదు. కానీ అంతర్గత పరిస్థితి మాత్రం బాగా ఆందోళనకరమని అనిపించసాగే స్థాయికి దిగజారింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవీ కాలం సగం ముగిసేసరికి అంతర్గత భద్రతకు సంబంధించిన పనితీరు సూచిక ఏ మాత్రం ఉత్సాహకరంగా లేదు. రెండున్నరేళ్లలో అంతా తలకిందులు 2014 వేసవిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అంతర్గత పరిస్థితిలో సమంజసమైన స్థాయి సుస్థిరత నెలకొని ఉంది. కశ్మీర్ ప్రశాంతంగా ఉండగా, ఈశాన్యం దాదాపుగా పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అప్పట్లో ఎక్కువ ఆందోళనకరం ఉన్నది తూర్పు భారతం, ఆదివాసి భారతాల్లోని మావోయిస్టు లేదా హోంశాఖ ముద్దుగా పిలిచే వామపక్ష తీవ్రవాద (ఎల్డబ్యూఈ) ప్రభావిత ప్రాంతమే. సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని భారత దేశపు మొట్టమొదటి స్థాయి భద్రతా సమస్యగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సరిగ్గా అంచనా వేశారు. అయినాగానీ యూపీఏ ప్రభుత్వం మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరించింది. పోలీసు, కేంద్ర బలగాలు మావోయిస్టులకు కలిగించిన నష్టాలతో పోలిస్తే, అవే చాలా పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి. ఎప్పుడు హత్యకు గురవుతామో అని లేదా చట్టవిరుద్ధమైన ‘‘పన్నులు’’, బలవంతపు వసూళ్లకు ఇక అంతే ఉండదేమో అనే భయం మన రాజకీయ వర్గాలను నిరంతంరం వెంటాడుతుండేది. స్వదేశంలోనే తలెత్తిన లేదా ఐఎస్ఐ దన్ను ఉన్న పాకిస్తానీ జిహాదీల వల్ల నిరంతర ప్రమాదం ఇక ఎలాగూ ఉండనే ఉండేది. ఏదేమైనా 2008 తర్వాతి కాలంలో ఈ విషయంలో సుస్థిరత నెల కొంది. అందువల్లనే హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు 2014 మేలో ఎల్డబ్ల్యూఈ, కశ్మీర్, ఈశాన్యం అనే క్రమంలో మన అంతర్గత భద్రతా సవాళ్లను పేర్కొనడంతో నేను ఏకీభవించవచ్చు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పరిస్థితి గణనీయంగా మారింది. మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది. భద్రతా బలగాల నష్టాలు కనీస స్థాయికి చేరాయి. ఎన్కౌంటర్లలో.. వాటిలో చాలావరకు అలా చిత్రించినవి లేదా కల్పనే అయినా... పలువురు చనిపోవడం, పట్టుబడటం వల్ల, పెద్ద ఎత్తున జరిగిన లొంగుబాట్ల వల్ల సాయుధ తిరుగుబాటు శ్రేణుల సంఖ్య బాగా క్షీణించిపోయింది. రాష్ట్రప్రభుత్వాలకు ఆ ప్రాంతాలపై మరింత ఎక్కువ నియంత్రణ ఏర్పడటం, గనుల తవ్వకాలు సాగుతూండటం శుభ సూచకం. కానీ మన మిగతా రెండు ప్రధాన సవాళ్లకు సంబంధించి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ సవాళ్లను ఇప్పుడు కశ్మీర్, ఈశాన్యం, మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం అనే ప్రాధాన్య క్రమంలో అమర్చాల్సివస్తోంది. ఇక ఐఎస్ఐ/ఐఎమ్/ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ముప్పు మునుపటిలాగే పొంచి చూస్తూనే ఉంది. ఒక దశాబ్దం తర్వాత కశ్మీర్ ఈ జాబితాలో ప్రథమ స్థానం లోకి వచ్చింది. అందుకు పలు బహిర్గత, అంతర్గత అంశాలు కారణం. ప్రస్తుతం పాక్తో మన సంబంధాలు మరీ దిగజారి ఉన్నాయి. మన వైపు నుంచి తీసుకున్న రాజకీయ నిర్ణయమే అందుకు కారణం. అయితే కశ్మీర్కు సంబంధించి అత్యంత ఆందోళనకరమైన కోణం మాత్రం అంతర్గతమైనదే. గత కొన్ని నెలలుగా కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి అత్యంత అధ్వానంగా ఉన్న 2010–11 రోజులను జ్ఞప్తికి తెస్తోంది. అయితే, శాంతియుతంగా ఎన్ని కలు జరగడం, రాజకీయ క్రమం తిరిగి మొదలుకావడంవల్ల సిద్ధించిన రాజ కీయ ప్రయోజనాలను చాలా వరకు కోల్పోవాల్సి రావడం మరింత ప్రాధా న్యం గల అంశం. రాజనీతియుక్తంగా పరస్పర విరుద్ధ భావజాల శక్తు లైన పీడీపీ, బీజేపీల మధ్య ఏర్పడ్డ కలయిక నుంచి ఎంతో ప్రయోజనం సిద్ధిస్తుం దని ఆశించాం. కానీ కార్యరంగంలో అది విఫలమైంది. అది నిజంగా సాధిం చగలిగి ఉండగలిగే దానితో పోలిస్తే ఆ కూటమి కృషి దానికి నీడగా కూడా మిగలలేదు. ఈ వారం మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడి నదానిలో ఆవేదనే ఎక్కువ తప్ప, నిజంగా స్థానిక ప్రజలపై యుద్ధం సాగించా లనే ఉద్దేశం మాత్రం కాదు. కశ్మీర్ లోయలో క్షేత్ర స్థాయిలో తలెత్తున్న పరిస్థితి వల్ల కలిగిన నిస్పృహ అది. వాజ్పేయి విధానం ఇదేనా? వాస్తవాధీన రేఖపై ఎదురయ్యే సవాళ్లకు ఇది భిన్నమైనది. అక్కడి పరిస్థితితో వ్యవహరించగల శక్తిసామర్థ్యాలు మన సైన్యానికి దండిగా ఉన్నాయి. మనది యుద్ధాల్లో రాటుదేలిన సేన, సమరోత్సాహంతో ఉవ్విళ్లూరుతూంటుంది. కానీ అల్పస్థాయి, పట్ణణ సైనిక చర్యలను చేపట్టడం, ఆగ్రహావేశపరులై ఉన్న వేలాది మంది పౌరులతో వ్యవహరించడం అనేవి పూర్తిగా విభిన్నమైనవి. అలాంటి సమస్యలతో వ్యవహరించడానికి మన సైన్యం సంసిద్ధమై లేదు. అల్లర్లకు దిగే గుంపులవద్ద ఉండే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు రాళ్లే. ఇజ్రాయెల్, తమ ప్రజలుగా భావించని అలాంటి గుంపు లపై ప్రయోగించిన ఎంతో కఠిన చర్యలు ౖసైతం ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి ఇజ్రాయెల్ సైనిక మేధస్సు అనేది ఉత్త డొల్లగా బయటపడిపోయింది. ఇజ్రాయెల్ ప్రయోగిం చిన పద్ధతులతో ఏ కొద్దిగానో పోల్చడానికైనా తగిన ఎలాంటి ప్రాణాంతక మైన లేదా ప్రాణహాని కలిగించని ఆయుధాలను సొంత భూభాగంలోని ప్రజ లపై భారత సైన్యం ప్రయోగించగలిగే అవకాశం లేదు. కశ్మీరీ ప్రజలను, ప్రత్యేకించి యువతను పాలనలో మరింతగా భాగస్వా ములను చేయడంలో, మరీ ముఖ్యంగా భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఉండ గలిగేలా చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. అదే వాటి ప్రధాన వైఫల్యం. ఈ క్రమంలో, ఒకçప్పటి 2002కు ముందటి రక్తసిక్త కాలం నాటిలో లాగే కశ్మీర్ సమస్యను పూర్తి భద్రతాసమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. అంటే, గూఢచార సంస్థలను కంట్రోల్ రూంలో ఉంచి సైన్యాన్ని ముందుశ్రేణిలో నిలిపే వైఖరికి తిరిగిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి అనుసరించిన కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్పేయి రచించిన సన్నివేశం కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయపరమైనదే తప్ప వ్యూహా త్మకమైనది, ఎత్తుగడలపరమైనది లేదా సైనికపరమైనది కాదు. కేంద్ర సాయుధ బలగాలను (సీఏపీఎఫ్లను) ఎంత విస్తృత స్థాయిలో మోహరింపజేశామనేది అంతర్గత భద్రతకు ముఖ్య సూచిక. సంఖ్య రీత్యా వాటి బలం నేడు 10 లక్షలకు దాటింది (మన రెగ్యులర్ సైన్యం 13 లక్షలు). ప్రపంచంలోనే మనది అతి పెద్ద ఈఏపీఎఫ్. ఆ బలగాలను మనం దాదా పుగా రిజర్వు బలగాలే లేని విధంగా పూర్తి స్థాయిలో మోహరించాం. రాష్ట్రాల ఎన్నికలు కూడా కొంతవరకు కారణం. అయితే మార్చి తర్వాత సైతం వాటికి కాస్త వెసులుబాటు కలగడం కష్టమే. రాజకీయ క్రమం తిరిగి మొదలైతే తప్ప, చలికాలపు మంచు కరగడం ప్రారంభం కావడంతోనే కశ్మీర్లోయలో తిరిగి ‘‘సైనికచర్యల’’ కాలం ప్రవేశి స్తుంది. అది కూడా ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఇంతవరకు తక్కువ ఆందోళనకరంగా ఉన్న ఈశాన్యంలోకూడా ఇప్పుడు అశాంతికర కార్యకలాపాలు ఉ«ధృతమవుతున్నాయి. మళ్లీ రగులుతున్న ఈశాన్యం 1980ల మధ్యలో రాజీవ్గాంధీ మిజోరాం తిరుగుబాటుదార్లతో, అస్సాం ఆందోళనకారులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇంతగా ఆందోళనలు సాగుతుండటం ఇప్పుడే. గతంతో పోలిస్తే ఈశాన్యంలో ఇప్పుడు తక్కువ సైన్యం ఉంది. ఈశాన్యంలో తిరిగి రాజుకుం టున్న సమస్య సైనికపరమైనది కాదు, రాజకీయమైనది. దానితో వ్యవహరిం చడం ఇంకా ఎక్కువ కష్టభరితమైనది. మణిపూర్, జాతుల మధ్య అరాచకం చురుగ్గా ఉన్న రాష్ట్రం. అక్కడికి మరిన్ని సీఆర్పీఎఫ్ కంపెనీలను, వైమానిక దళ విమానాల్లో డీజిల్ను పంపడమూ తప్ప ఎవరూ ఏమీ చేస్తున్నట్టు అని పించడం లేదు. వేర్పాటువాద తిరుగుబాటు ఏళ్ల తరబడి సద్దుమణిగి ఉన్న సమయంలో ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. లోయలోని ప్రజలకు, కొండలలోని తెగలకు మధ్య సంఘర్షణ కాబట్టి పరిపాలనా వైఫల్యం కొన సాగుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎన్నికల లబ్ధికోసం రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. నాగాలాండ్ కథ మరింత సంక్లిష్టమైనది, నిరుత్సాహ çకరమైనది. అతిపెద్ద తిరుగుబాటు గ్రూపుతో ఒకే ఒక్క పేజీ సూత్రప్రాయ అంగీకారపత్రంపై సంతకాలు చేసి, ఒప్పందం కుదురిందన్నారు. దీంతో శాంతి ప్రక్రియ చల్లారిపోతున్నది. వివిధ గ్రూపుల మధ్య వైరం, సంఘర్షణ లకు ఇది సమయాన్ని కల్పించింది. ఈ గ్రూపులన్నీ బహిరంగంగా ఆయు ధాలు ధరించి ‘‘పన్నులు’’ వసూలు చేస్తున్నాయి. ఆయా గ్రూపులకు వాటి సొంత ప్రాబల్య ప్రాంతాలున్నాయి. అక్కడ వాటికి ఎదురు లేదు. స్థానికు లతో కలగలసిపోయి అరుణాచల్ లోతట్టు జిల్లాలకు అవి విస్తరిస్తున్నాయి. ఇది త్వరలోనే సున్నితమైన చమురు జిల్లాలున్న ఎగువ అస్సాంకు వ్యాపించ నుంది. రెండు దశాబ్దాల తర్వాత ఈశాన్యం నేడు తిరిగి సమస్యాత్మక ప్రాతం అవుతోంది. మొత్తంగా చూస్తే మన అంతర్గత భద్రత పరిస్థితి ఇంత కంటే చాలా మెరుగ్గా ఉండాల్సింది. తాజా కలం: కశ్మీర్లోయలోని అశాంతి నాకు, 1989లో నాటి హోం మంత్రి బూటాసింగ్తో జరిగిన ఒక సంభాషణ నుæ గుర్తుకుతెస్తోంది. నాటి రష్యా విదేశాంగ మంత్రి ఎడ్వర్డో షెవర్దనాజే ఆయనను ఒకసారి... ఇంతింత భారీ గుంపులతో భారత్ ఎలా వ్యవహరిస్తోందని ఆశ్యర్యం వ్యక్తం చేశారట. దానికి బూటాసింగ్ ‘‘గుంపులను అదుపు చేయడానికి మేం సైన్యాన్ని ప్రయో గించం. వారు చేయగలిగింది మారణాయుధ ప్రయోగమే... అందుకు మాకు సీఆర్పీఎఫ్ అనే బలగం ఉంది. కావాలంటే మీ వాళ్లకు శిక్షణ ఇవ్వడా నికి ఓ రెండు బెటాలియన్లను పంపుతాను’’ అన్నారట. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
భావజాల అన్వేషణలో ‘ఆప్’
జాతిహితం అధికారాన్ని కోరుకుంటున్నా ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. అన్నా హజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది. ఎనిమిదేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమం రాజకీయవేత్తల/ రాజకీయాల వ్యతిరేక సమర నాదంతో మొదలైంది. భారత సమాజంలోని, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలలోని చెడులన్నిటికీ రాజకీయాలను, రాజకీయవేత్తలను అది తప్పుపట్టింది. ‘‘నేత’’ అనే మాటే తిట్టయిపోయింది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయాలని ఆయన కోరుకోరనుకోండి. త్వరలోనే ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం, మధ్యస్థ స్థాయికి చెందినవారు, పట్టణ వృత్తిజీవులు ‘‘కుళ్లు’’ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే ఒక విధమైన తిరుగుబా టుగా పరిణమించింది. ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖులు, దాని సాను భూతిపరులు, నిలకడగల వామపక్షవాదులను ఆ ఉద్యమం ఆకట్టుకుంది. బాబా రామ్దేవ్ నుంచి జనరల్ వీకే సింగ్ వరకు, కిరణ్ బేడీ నుంచి ప్రశాంత్ భూషణ్, షబనా ఆజ్మీ, ఓంపురి, అమీర్ ఖాన్ల వరకు మద్దతుగా ముందుకు వచ్చారు. భావజాలాలకు అతీతంగా ఆ ఉద్యమం అందరినీ ఆకట్టుకుందనే దానికి ఇది మంచి ఉదాహరణ. కేజ్రీవాల్ నేతృత్వంలో అన్నా హజారే, ఆయన వీరయోధులు ఆ ఆగ్రహావేశపు తరంగంపైనే ఎగిసివచ్చారు. ఎన్నికల తతంగం అంతా అవినీతిపరుల కోసమేనని, ప్రజలు ఓ సీసా మందు కోసమో లేదా రూ. 500 నోటు కోసమో ఓటు వేసేవారని, పార్లమెంటు అత్యా చారాలు చేసేవారు, బందిపోట్లు, దొంగలకు నిలయం మాత్రమేనని తీసిపారే శారు. అలాంటి పార్లమెంటులోని ఈ 800 మంది (ఉభయ సభల మొత్తం సభ్యులు) 125 కోట్ల మంది తలరాతలను ఎలా రాస్తారు? అని నిలదీశారు. అధికారం ఆవిర్భవించాల్సి ఉంది, పరిపాలన, చట్టాల రూపకల్పన అట్టడుగు నుంచి పైకి సాగాలి, వ్యవస్థను తలకిందులు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పా లంటే ఇప్పుడు కావాల్సింది విప్లవమే తప్ప, అంతకు తక్కువ కాదు. ఎన్నికల బాటలో ‘విప్లవం’ అన్నా హజారే, గాంధీలా నటిస్తుండగా, యువ కార్యకర్తలు, నానా రకాల సోషలిస్టులు, అందరికంటే ముఖ్యంగా టీవీ యాంకర్లు ఆయనకు నీరా జనాలు పట్టారు. ఆయన తన ప్రధాన ఆయుధమైన ఆమరణ నిరహార దీక్ష కూడా గాంధీ నుంచి అరువు తెచ్చుకున్నదే. కాకపోతే ఆయన ప్రయోగించిన సంకేతాలు, అభిభాషణలు మాత్రం గాంధేయమైనవి కావు. భగత్సింగ్, సుభాష్ చంద్ర బోస్లకు, చివరకు మహారాణా ప్రతాప్కు అవి దగ్గరగా ఉండేవి. రామ్లీలా మైదాన్లో అన్నా చేతులు జాపి ‘‘దిల్ దియా హై జాన్ భీ దేంగే, ఏ వతన్ తేరే లియే’’ అనే దిలీప్ కుమార్ పాట చరణాన్ని వినిపించ డాన్ని గానీ, లేదా అరెస్టయి, పోలీసు బస్సులో పోతూ కిరణ్ »ే డీ టీవీ కెమె రాల వైపు తిరిగి ‘‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’’ అని ఆలాపించ డాన్నిగానీ గుర్తుతెచ్చుకోండి. అయితే ఆమె ఉపయోగించినది ఎన్నటికీ మర పురాని హఖీకత్ చిత్రంలో కైఫీ అజ్మీ రాసినదో లేక బాగా ఇటీవలి కాలపు అమితాబ్–అక్షయ్–బాబీ డియోల్ల చెత్త చిత్రం లోనిదో తెలియదు. కానీ ఆ సందేశం మాత్రం ఏదో ఒక కొత్త చట్టం, కనీసం మొత్తం రాజకీయాధికారం కావాలి అనేది మాత్రం కాదు.. ‘‘వ్యవస్థను’’ మార్చే విప్లవం సాగించాలనేదే. అన్నా ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్న ఆనాటి నుంచి నేడు అది ఎక్కడికి చేరిందో చూద్దాం. అన్నా హజారే ఎక్కడుండాలో అక్కడికే చేరారు. రాలెగావ్ సిద్ధిలో ఏకాంతంగా తన ఊహాలోకంలోని దయ్యాలతో పోరాటం సాగిస్తు న్నారు. అప్పుడప్పుడూ ప్రధాని చేపట్టిన ఏ చిన్నపాటి చర్యనో ప్రశంసిçస్తూ లేదా కేజ్రీవాల్ చేసే చాలా పనులను విమర్శిస్తూ విజయవంతంగా పతాక శీర్షికలను వేటాడుతున్నారు. ఆయన ఉద్యమంలో ప్రధాన భూమికను పోషిం చిన కీలక వ్యక్తుల్లో ఏ ఒక్కరూ నేడు ఆయనతో లేరు. కిరణ్ బేడీ, మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, మేధా పాట్కర్ తదితరు లంతా ఎన్నికల రాజకీయాల్లో చేరారు. వైఖరి, పద్ధతి, ఉద్దేశాలకు సంబం ధించి అన్నా ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ దానితో తలపడ్డ మాలాంటివారి విషయా నికి వస్తే్త... మౌలిక మేధోపరమైన చర్చలో గెలుపొందామని మేం ప్రకటించగలం. వ్యవస్థను మార్చాలంటే, మీరు దాన్ని వాటేసుకోవాల్సిందే, దాన్ని మార్చాలంటే మీరు అధికారంలోకి రావాల్సిందే. ఎన్నికల రాజకీయాలను రొచ్చుగుంట అన్నాగానీ, మీరు దాన్ని ఈదుకుంటూ పోవాల్సిందే. అంటే, అధికారాన్ని చేపట్టడానికి ఉన్న ఏకైక మార్గం బ్యాలెట్ ద్వారా ప్రజా బాహు ళ్యపు ఆమోదాన్ని పొందటమే అని. ఎన్నికల ప్రక్రియ ఆవశ్యకంగా న్యాయ మైనది, ఓటర్లు తెలివిగలవారు, చాలావరకు అవినీతి సోకని బాపతే. కేజ్రీ వాల్ ఢిల్లీని తుడిచిపెట్టేశాక, పంజాబ్, గోవాలతో జాతీయస్థాయి రంగ ప్రవేశం చేయనున్నాడు, గుజరాత్లోనూ సరికొత్త సవాలుదారు కావచ్చని భయపెడుతున్నాడు. రాజకీయాలు, ఎన్నికలు అన్నీ బూటకమేనని కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇక ఎంత మాత్రమూ అనలేరు. అన్నా హజారే ఉద్యమం రాజకీయాలకు వ్యతిరేకమైనదిగా నటించడాన్ని విమర్శస్తూ మనలో కొందరు చెప్పింది సరిగ్గా ఇదే కాదా? ‘‘నిజాయితీగా మీకు రాజకీ యాధికారం కావా లని చెప్పండి’’ అని మేం నిలదీశాం. కేజ్రీవాల్ బ్రాండ్ రాజకీయం ఆమ్ ఆద్మీ పంజాబ్లో మొదటి స్థానంలో ఉన్నా లేక రెండో స్థానంలో ఉన్నా లేదా గోవాలో ఏ స్థానంలో నిలిచినా... దాని జనాకర్షణ మాత్రం విస్తరి స్తోంది. గుజరాత్లో ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాలు సైతం అదే సూచి స్తున్నాయి. అధికారాన్ని కోరుకుంటున్నా ఆప్ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. భావజాలేతరమైన పార్టీగా ఉన్న దాని ఆకర్షణకు తోడు, బీజేపీకి దీటైన అతి జాతీయవాదపు నగిషీలు, అలంకారాలూ సైతం ఉన్నాయి (ఇంకా అది భగత్సింగ్ పేరును వాడుతూనే ఉంది). కేజ్రీవాల్ తన ప్రచార కార్య క్రమాల్లో అరుదుగా తప్ప ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీపైనా దాడి చేయరు. అన్నిS పార్టీలపైనా, అంటే ఆచరణలో ‘‘వ్యవస్థ’’కు సంబంధించిన రాజకీయ వేత్త లందరిపైనా దాడి చేస్తారు. ఆయన బ్రాండుకు ఉన్న కీలకమైన ఆకర్షణ ‘గొప్ప విచ్ఛిన్నకుడు’ అనే ఆ గుర్తింపే. కేజ్రీవాల్, ఆయన కీలక అనుచరులు అందరిదీ యువతరం, సాధార ణంగా వారు అవినీతిపరులు కారన్నట్టుగానే కనిపిస్తారు (ఢిల్లీ పోలీసు, సీబీ ఐల ఎఫ్ఐఆర్లను నమ్మేవారు లేరు). అతి పెద్ద యువ ఓటర్ల పునాదిలో ఆయనకు సానుకూలాంశం. ఆయన ప్రత్యర్థులలో కొందరు, సుఖబీర్ బాదల్, రాహుల్ గాంధీ అంత పెద్దవారేమీకారు, చిన్నవారు కూడా. అయినా గానీ వారు సంపన్నుల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించేవారు. కాగా, కేజ్రీవాల్ స్వీయకృషితో రాణించినవారు. గత చరిత్ర లేకపోవడం, అనుభవ రాహిత్యాలను ఆయన తనకు అనుకూలతగా, అమాయకత్వానికి మారుపే రుగా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల, మాకు కనీసం ఒక్క అవకాశం ఇవ్వండి అనే ఆయన మాట యువ ఓటర్లను మరింత ఎక్కువగా ఒప్పించ గలిగేదిగా ఉంటోంది. భావజాలం కోసం అన్వేషిస్తున్న భావజాలరహిత పార్టీ కాంగ్రెస్ ఓట్లను తుడిచిపెట్టేయడం ద్వారానే కేజ్రీవాల్ ఢిల్లీలో ఘన విజయం సాధించారని మనకు తెలుసు. పంజాబ్లో ఆయన అకాలీ–బీజేపీ కూటమి ఓట్లను ఎక్కువగా రాబట్టుకుంటారనడం సమంజసమే అవుతుంది. నిజమైన భావజాలమంటూ లేకపోవడం లేదా ఒక రాష్ట్ర రాజకీయ అవసరాలకు పూర్తిగా అనుగుణమైనది కాగలిగినదిగా ఆవిర్భవిస్తున్న భావజాలం ఉండ టం దానికి సానుకూలతగా లెక్కించాలి. అయితే ఇంతకు మించి ఆప్ను సువ్యవస్థితమైన పార్టీల నుంచి వేరుచేసేది ఏమైనా ఉందా? ఆ పార్టీలలో మనం ఉన్నాయనుకుంటున్న లోపాలన్నింటి జాబితాను తయారు చేయండి. అవినీతి, వయసు, అధికారంలో ఉండటం అనే అంశాలను మినహాయిస్తే... అందులో ఉన్న వ్యక్తిపూజ, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, అధిష్టాన వర్గపు సంస్కృతి, మీడియా విమర్శల పట్ల అసహనం, లోతైన ఉదారవాద వ్యతిరేకత, ఎలాంటి అసమ్మతిని, ప్రశ్నించడాన్ని సహించని అత్యంత శక్తి వంతుడైన సుప్రీమ్ తరహా నేత తదితరాలను చూడండి. వాటిలో ఏమన్నా ఆప్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కనిపించనివి ఏమైనా ఉన్నాయేమో సరి చూడండి. ఆ పార్టీ నేత ఎంతటి అత్యంత శక్తివంతుడంటే తాను పరిపాలి స్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రాన్ని(ఢిల్లీ) వదలి దాదాపు రెండు వారా లుగా సుదూరంలోని నగరంలో గడుపుతున్నారు. ఏ రాజ్యాంగపరమైన లేదా పార్టీపరమైన జవాబుదారీతనం లేని రాహుల్ ఏడాది చివర్లో ఒక వారం విశ్రాంతి తీసుకున్నందుకు విమర్శల వెల్లువను ఎదుర్కొన్నారు. అన్నాహజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది. నిలకడగా నిలిచిపోయిన, విసుగెత్తించే మన రాజకీయాలకు అది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అది రాజకీయ రిపోర్టర్లుగా, అభి ప్రాయ రచయితలుగా మన ఉద్యోగాల్లోకి మరింత సరదాను తెచ్చింది. మనం మరి కొంత ధూషణను ఎదుర్కొంటే పోయిందేముంది? తాజా కలం: గతవారం ‘జాతిహితం’లో నేను పంజాబ్లో ఆప్ పెద్ద శక్తిగా ఆవిర్భవించడం గురించి రాసినందుకు నన్ను ప్రశ్నలు ముంచెత్తాయి. ఆప్ ఆధినేత సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోసినాగానీ నేనిలాంటి సాను కూల నివేదికను ఎలా ఇస్తానని ప్రశ్నించారు. ఎవరైనా నన్ను తిట్టిపోసినంత మాత్రాన నేను నా వార్తా నివేదికల్లో అబద్ధాలాడాలా? తద్వారా నా పాఠకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవాలా? ట్రంప్ లేదా నరేంద్ర మోదీ లేదా అరవింద్ కేజ్రీవాల్ ఎవరి విషయంలోనైనా వార్తలను అందించేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అదే అని భావిస్తాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ప్రమాదకర నూతన ప్రపంచం
జాతిహితం సామాజిక మాధ్యమాలు సమాచార వాహికలుగా, చర్చకు, తిట్టిపోయడానికి వేదికలుగా ఉండటం నుంచి పరిపాలనకు, ప్రజా రాజకీయాలకు, దౌత్యానికి సాధనాలుగా వ్యవహరించే అర్హతను సాధించాయి. అవి పరిపాలన నుంచి ఓపికను, దౌత్యం నుంచి గోప్యంగా చర్చలు జరిపే శక్తిని, తెర వెనుక సంభాషణలను హరించేశాయి. అంతే కాదు, ప్రజా రాజకీయాల నుంచి జవాబుదారీతనాన్ని దూరం చేశాయి. సామాజిక మాధ్యమాల పాలన, రాజకీయాలు విరాజిల్లే ప్రమాదకర నూతన ప్రపంచానికి స్వాగతం. సామాజిక మాధ్యమాలు లేదా మరింత కచ్చితంగా చెప్పాలంటే ట్వీటర్ గొప్ప శక్తిగానూ, వాట్సాప్ వృద్ధి చెందుతున్న శక్తిగానూ ఆవిర్భవించడాన్ని గత రెండు వారాల్లో చూశాం. అమెరికా, మెక్సికోల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఎన్రిక్ పరెనా నీటోలు ట్వీటర్ ముచ్చట్లతోనే ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(నాఫ్తా) నాశనం చేయడం మొదలెట్టారు. అమెరికా నిర్మిస్తున్నానంటున్న గోడ వ్యయం 1,500 కోట్ల డాలర్లను ఎవరు భరించా లనే దానిపై ఆ ఇద్దరు దేశాధినేతలు 280 అక్షరాల్లోనే చరిత్రను సృష్టించారు, సృష్టించ లేదు కూడా. ఇక మన వేపు చూడండి. జల్లికట్టు ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించింది, పెంచి పోషించింది, అదుపు తప్పిపోయేలా చేసింది పూర్తిగా సామాజిక మాధ్యమాలే. కేవలం ట్వీటర్, వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారానే ఆ ఆందోళ నలు వ్యాపించాయి. సాధారణంగా నోరు తెరవని చదరంగం చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, క్రికెట్ క్రీడాకారులు రవిచంద్రన్ అశ్విన్, మెగాస్టార్ కమల్ హాసన్, మరీ ఆశ్చర్యకరంగా ఏఆర్ రెహమాన్ల వంటి వారు సైతం నోళ్లు విప్పారు. ఆ ఉద్యమానికి నాయకులూ లేరు, అధికారిక ప్రతినిధులూ లేరు, చర్చలు జరపడానికి వెళ్లేవారూ లేరు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఆజ్యం పోసిన ఈ ప్రజా వెల్లువకు, అరబ్బు వసంతానికి పోలికే లేదు. ఇక ట్వీటర్ దౌత్యమేనా? ఇదే సమయంలో భారత్, అమెరికాల మధ్య ఏమి జరిగిందో చూడండి. మన అధికార వ్యవస్థ ప్రపంచంలోని అతి పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన అమె జాన్ను బెదిరించి చరిత్రను సృష్టించింది. ఆ సంస్థ కెనడియన్ విభాగం మన జాతీయ జెండా రంగులను డోర్ మ్యాట్లపై చిత్రించినందుకుగానూ మన విదేశాంగ శాఖ దానితో క్షమాపణ చెప్పించింది. అంతేకాదు అటావాలోని మన దౌత్యకార్యాలయాన్ని ట్వీటర్లో దాని సంగతి తేల్చుకోమని ఆదేశిం చింది. దౌత్య వ్యవహారాల్లో ఎంత వెనుకబడిన దేశమైనా పద ప్రయోగంలో విచక్షణను చూపుతుంది, గోప్యతను ప్రదర్శిస్తుంది. సాధారణంగానైతే మన విదేశాంగశాఖలోని ఒక విభాగపు కార్యదర్శి అమెజాన్ అమెరికా ఖండాల జాయింట్ సెక్రటరీ పేరిట ఆ సంస్థకు ఒక ‘వర్తమానాన్ని’ పంపుతారు. అంతేగానీ ‘‘నీ నెత్తురు కళ్ల చూస్తా’’ అన్నట్టుగా ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శస్త్రం సంధించడం జరగదు. అతిగా జాగ్రత్త పాటించే మన అధి కార యంత్రాంగం ఇలా స్పందించడం కొంత విప్లవాత్మకమైనదే. పైగా కొద్ది నెలల్లో ఖాళీ అయ్యే సెబీ చైర్మన్ పదవికి అతి క్లుప్తమైన దరఖాస్తుగా కూడా ఇది ప్రశంసనీయమైనది. సామాజిక మాధ్యమాల గురించి కొన్ని నిర్ధారణలకు రావడానికి తగి నన్ని తాజా ఆధారాలు మనకు అమెరికా, మెక్సికో, చెన్నై, ఢిల్లీల నుంచి అందాయి. ఒకటి, సామాజిక మా«ధ్యమాలు ఒక సమాచార వాహికగా, చర్చకు, తిట్టిపోయడానికి సైతం వేదికగా ఉండటం నుంచి పరిపాలనకు, ప్రజా రాజకీయాలకు, దౌత్యానికి సా«ధనంగా వ్యవహించే అర్హతను పొందాయి. రెండవది సామాజిక మాధ్యమాలు పరిపాలన నుంచి ఓపికను, దౌత్యం నుంచి గోప్యంగా చర్చలు జరిపే శక్తిని, దొడ్డి దారులను, తెరవెనుక చర్చలను హరించేశాయి. అంతేకాదు ప్రజా రాజకీయాల నుంచి జవాబు దారీతనాన్ని దూరం చేశాయి. తమిళనాడు ఆందోళనలు నిజంగానే చేయి దాటిపోతే ఎవర్నని నిందించగలం? ప్రపంచంలోని అతి పెద్ద అగ్రరాజ్యపు అధ్యక్షుడు... గత కాలపు తెగ నాయకునిలా పొరుగువారు పంపిన దూత తలను నరికి పంపినట్టు ప్రవర్తిస్తే మనం దాన్ని ఎలా అర్థం చేసువాలి? లేదా అతి వేగంగా అంతర్జాతీయ మార్కెట్ను విస్తరింపజేసుకుంటున్న అగ్రశ్రేణి దేశపు ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు హఠాత్తుగా నడి రాత్రి ప్రపంచంలోని అతి పెద్ద ఈ–వాణిజ్య సంస్థను దెబ్బతీస్తే ఏం చేయాలి? సామాజిక మాధ్యమాల పాలన, రాజకీయాలు విరాజిల్లే ప్రమాదకర నూతన ప్రపంచానికి స్వాగతం. ఫర్మానాలు, ఆజ్ఞలు అన్నింటికీ అవే వేదికలా? సాధారణంగా బాగా ఆచితూచి వ్యవహరించే దేశాధినేతలు, దౌత్యవేత్తలు, ప్రజా జీవితంలోని ప్రముఖులే ఈ తుఫానుకు కొట్టుకుపోతే, సాంప్రదాయక మీడియా దీన్ని అనుసరించకుండా ఉండాలనుకోవడం అసమంజసం. సోమరి పాత్రికేయ వ్యాసంగానికి గొప్ప, మరింత ఎక్కువ సమర్థనను కల్పిం చే విగా సామాజిక మాధ్యమాలు ఆవిర్భవించాయి. ప్రైమ్ టైమ్లో మీ అభిమాన టీవీ చానళ్లనుగానీ, డిజిటల్ వార్తా వేదికలనుగానీ, చివరికి విసుగెత్తించే పాత చింతకాయ పచ్చడి వార్తా పత్రికలైనాగానీ చూడండి. ఈ రోజు సామాజిక మాధ్యమాల్లో వారు ఇలా, వీరు అలా అన్నారు అనే వాటిపై పలు చర్చా కథనాలు కనిపించే అవకాశాలే ఎక్కువ. అగ్రరాజ్యానికి ఖలీఫా లాగా ఫర్మానాలను లేదా పోప్లాగా ఆజ్ఞలను జారీ చేయడానికి ట్రంప్ ట్వీటర్ను వాడుతున్నారు. దీంతో ఈ ధోరణి ఇప్పుడు ఇంకా తీవ్రమైనదిగా మారుతోంది. సామాజిక మాధ్యమాల తీరే అంత. అయితేనేం, వాటి ద్వారా తోటి పాత్రికేయుల వ్యాఖ్యలపై కథనాలు, చర్చలు కూడా కనిపిస్తుంటాయి. మీడియాదీ అదే దారి పైన పేర్కొన్న పరిణామాల దృష్ట్యా గత కొన్ని రోజులుగా నేనీ విష యాన్ని గురించి బాగా ఆలోచిస్తున్నాను. లెబనాన్కు చెందిన కార్టూనిస్ట్ వేసిన అద్భుతమైన ఓ వ్యంగ్య చిత్రాన్ని కూడా చూశాను. అందులో ట్రంప్, వైట్ హౌస్లో డెస్క్ వద్ద కూచుని ఉంటాడు. దాని మీద 'ట్వీటర్', 'అణు బాంబు' అని రాసి ఉన్న రెండు స్విచ్లు ప్రముఖంగా కనిపిస్తుంటాయి. అయితే సామాజిక మాధ్యమాల గురించిన నా ఈ వాదనకు సంబంధించి తక్షణమైన నిప్పు రవ్వ వచ్చి పడింది మాత్రం ఈ ఉదయమే. విజయ్ మాల్యా అప్పు, తప్పించుకుపోవడాలపై ప్రముఖ బయోటెక్ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్, నేనూ స్వల్ప విభేదాలతో కూడిన ప్రమాదరహితమైన ట్వీట్లను ఒకరిపై ఒకరం వేసుకున్నాం. మధ్యాహ్నానికల్లా రెండు ప్రముఖ వ్యాపార చానళ్లు సహా మూడు వార్తా సంస్థలు నాకు ఫోన్ చేసి... 'మీ ట్వీటర్ చర్చను కొనసాగించడానికి' మా షోకు రండి అని పిలిచాయి. మిత్రుడు కిరణ్కు కూడా చేసే ఉంటారు. ప్రస్తుతం సాగుతున్న చర్చలపై వ్యాఖ్యానిం చడానికి ఈ మాధ్యమాన్ని వాడుకోవచ్చని అప్పుడు అనుకున్నాం. 'ఎకో ఛాంబర్' అనే వ్యక్తీకరణను సోషల్ మీడియా విమర్శకులు చాలా కాలంగా వాడుతున్నారు (ఒకరు ట్వీట్ చేసిన దాన్ని మరొకరు ట్వీట్ చేయడం ద్వారా మన సందేశం ఎంతో మందికి ప్రతి«ధ్వనిలా చేరుతుందని అర్థం. ఆ క్రమంలో చివరికి మొదట మనం చెప్పిన దానికి పూర్తిగా భిన్నమైనదిగా మారుతుందని విమర్శ). ఈ ఎకో చాంబర్ లేదా అలాంటిదే ఇంకేదో మన ప్రభుత్వాలను, రాజకీయాలను, ప్రజాభిప్రాయాన్ని, చర్చను ముంచెత్తేసి అశక్తం చేస్తోంది. సోషల్ మీడియా ఎకో చాంబర్ పుణ్యమాని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ అణు దాడి బెదిరింపును నిజమైనదిగా పొరబడి... తమ అణ్వస్త్రాలతో బదులు చెబుతామని హెచ్చరించారు. పాక్ రక్షణ మంత్రులకు తమ అణ్వస్త్రాలు ఎక్కడున్నాయో కూడా తెలియవని మనకు తెలిసిందే. అలాగే హఫీజ్ సయీద్ నకిలీ ట్విటర్ హ్యాండిల్తో ఎవరో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై చేసిన వ్యాఖ్యపై ఎప్పుడూ జాగ్రత్త గానూ, సరిగ్గానూ ఉండే రాజ్నాథ్సింగ్ ఆగ్రహంతో స్పందించారు. ఇదేమీ సామాజిక మాధ్యమాలపై ఖండనగానీ లేదా సంప్రదాయవాద విలాపంగానీ కాదు. నాకా నైతిక ఆర్హత లేదు కూడా. ఏళ్లతరబడి చులకనగా చూసి తిరస్కరించిన తర్వాత నేను కూడా ఈ మాధ్యమాల ప్రలోభానికి లొంగిపోయాను. రెండేళ్ల క్రితమే ఇందుకు కారణాలను సైతం నా జాతిహితం కాలంలో వివరించాను (http://indianexpress.com/ article/opi-nion/ columns/national-interest-8618/). 8,618 అక్షరాల్లో (ఈ వ్యాసంలోని అక్షరాల సంఖ్య) చెప్పిన దాన్ని 140 అక్షరాల్లో ఎలా చెప్పగలననేదే ఇందులో ఉన్న తిరకాసు. నాకు మద్దతుగా నేను హాలివుడ్ స్టార్ జార్జ్ క్లూనీ అన్న మాటలను అరువు తెచ్చుకున్నాను: "140 అక్షరాల కోసమని నేను నా వృత్తి జీవితంలో సాధించినదానికంతటికీ ముప్పును తెచ్చుకోలేను". కానీ మూడు అంశాలు నా ఆలోచనను మార్చుకునేలా చేశాయి. ఒకటి, సామాజిక మాధ్య మాలు మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తాయని మీరు దానికి దూరంగా ఉంటారు. కానీ కనీసం మీరు చెప్పదలచుకున్న దేమిటో చెప్పడానికైనా దాన్ని ఉప యోగించుకోవడమే మెరుగు కావచ్చు. తిప్పికొట్టకపోయినా రెచ్చగొట్టవచ్చు. రెండు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల పాత్రికేయులకు ఇప్పడు కొత్త శక్తి సమ కూరిందని కూడా నేను గుర్తించాను. మనం మన వేదికలను మార్చుకున్నా మన పాఠకులను, శ్రోతలను మనతో పాటూ తీసుకుపోగలుగుతాం. ఎందు కంటే బ్రాండు కాదు, వారే రాజులు. మూడవది నన్ను మరింత ఎక్కువగా ఆకట్టుకున్నది. ఫేస్బుక్ అకౌంటైనా లేకపోతే... 2015లో మెల్బోర్న్ నుంచి ఓ సుదీర్ఘ విమాన ప్రయాణం చేస్తూ "బర్డ్ మ్యాన్" ఆనే సినిమాను చూశాను. అందులోని హీరోను అతని కుమార్తె "నాన్నా! నువ్వు కావాలని పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి... నువ్వు బ్లాగర్లను ద్వేషిస్తావు. ట్వీటర్ను ఎగతాళి చేస్తావు. నీకు కనీసం ఫేస్బుక్ అకౌంటైనా లేదు. నువ్వు అసలు అస్తిత్వంలోనే లేని మనిషివి" అని మందలిస్తుంది. నన్ను లొంగదీసేసుకోవడానికి అవసరమైన ఆఖరి కుదుపు అదే అయింది. రెండేళ్ల క్రితం నా శ్రోతల సంఖ్య పది లక్షలు దాటినప్పుడు నేనా వ్యాసం రాశాను. వారికీ, అంత తక్కువ కాలంలో అంత పెద్ద సంఖ్యలోని శ్రోతలను చేరుకుని, వారితో సామూహికంగానూ, ఎంపిక చేసిన స్థాయి లోనూ అంత నాటకీయంగా సంభాషించడానికి తోడ్పడ్డ వేదికలను అందిం చినవారికీ రుణపడి ఉన్నాను. అయితే, మన పిల్లలను, మన పిల్లల భవి ష్యత్తును నియంత్రించగల ముఖ్య వ్యక్తులు ఈ సామాజిక మాధ్యమాల పట్ల వెర్రి వ్యామోహాన్ని ప్రదర్శిస్తుండటం, లేదా పాత కాలపు రాజకీయాలకు, పాలనకు, వాస్తవాల ఆధారంగా జరిగే ముఖ్య చర్చలకు సులువైన ప్రత్యా మ్నాయంగా చూడటం ఆందోళన కలిగిస్తోంది. twitter@shekargupta శేఖర్ గుప్తా -
న్యాయస్థానాలు ఆడకూడని ఆట
బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించిన మాట నిజమే. కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని మనవి చేయాల్సి వస్తుంది.బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడిలోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనేకూడదు. బోర్డు నాయకత్వాన్ని మార్చాలని బలవంతపెట్టే కంటే నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది. జాతిహితం ఈ గురువారం సాయంత్రం అయిష్టంగా నేను ఇంటి నుంచి బయల్దేరి విమానాశ్రయానికి చేరేసరికి, అప్పటికే రెండు గంటలు ఆలస్యమైన నా బెంగళూరు విమానం మరింత ఆలస్యమైంది. క్రీడా ప్రేమికులకు చిర్రెత్తించే పరిస్థితి ఇది. అప్పుడు నేను ఆలోచిస్తున్నది కుస్తీ గురించి.. దంగల్ సినిమా లోని కుస్తీ గురించి కాదు... నిజం కుస్తీ గురించి. అప్పుడే నేను సోఫియా మాటిసన్ చేతిలో బబితా పోగట్ ఓడిపోవడం చూశాను. కిక్కిరిసిన ప్రేక్షకు లంతా పోగట్ను ప్రోత్సహిస్తున్నా, 45 సెకన్లలోనే ఆమె ఏకపక్షంగా సాగిన ఆ పోటీలో ఓడిపోయింది. ప్రపంచంలోని అత్యుత్తమ కుస్తీ వస్తాదుల్లో ఒకడు, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత తొగ్రుల్ అస్గరోవ్కు ప్రత్యర్థిగా అనా మక భారతీయుడు వికాస్ కుమార్ బరిలోకి దిగాడు. మొదటి రౌండ్ను వికాస్ 5–0తో అస్గరోవ్ కు సమర్పించుకున్నా, రెండో రౌండ్ను 3–2తో నెగ్గాడు. మ్యాచ్ను కోల్పోతేనేం, అనామక భారత వస్తాదు ప్రపంచ అత్యు త్తమ వస్తాదుతో పోటాపోటీగా తలపడ్డాడు. అరచేతిలో క్రీడా ప్రపంచం నేటి భారత ప్రొ రెజ్లింగ్ లీగ్ డబ్బు, ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఐపీఎల్లో లాగా సంపన్న వ్యాపారవేత్తలు నగర, రాష్ట్ర ప్రాతిపదికపై కుస్తీ వస్తాదుల జట్లకు నేడు యజమానులు. బహుమతులు, వెలల రూపంలో డబ్బును చెల్లిస్తూ అది ప్రపంచంలోని అత్యుత్తమ స్త్రీ, పురుష కుస్తీ వస్తాదులను ఆకర్షి స్తోంది. ఇప్పుడు చెప్పిన పోటీలో అస్గరోవ్ ఎన్సీఆర్ పంజాబ్ తరఫున, వికాస్ ముంబై మహారాఠి తరఫున పాల్గొన్నారు. మీరిప్పుడు అసలైన ప్రపంచ స్థాయి కుస్తీలను (సుల్తాన్ సినిమాలో లాంటి చెత్తకాదు) టీవీ తెరల పైనో లేదా ఆధునిక ఇండోర్ స్టేడియంలలోనూ చూడొచ్చు. ముఖ్యంగా పేరు ప్రతిష్టలతో పాటూ మంచి జీవితం గడపడానికి అవసరమైన దాని కంటే ఎక్కువ సంపాదించగల భారత కుస్తీ వస్తాదులు పెరుగుతున్నారు. భారత కుస్తీ ప్రధాన రంగస్థలిపైకి ప్రవేశించింది. ఈ సాయంత్రం మంచి కుస్తీ పోటీలు జరిగాయి బాగుంది. అయితే అసలు రాజు మాత్రం చేత రిమోట్ పట్టిన క్రీడా ప్రేమికుడే. అప్పుడు, అదే సమయంలో మరో స్పోర్ట్స్ చానల్లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) పోటీల్లో తాజా భారత స్టార్ క్రీడా కారుడు, ప్రపంచ 15వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్, డెన్మార్క్కు చెందిన ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు జాన్ ఓస్టెర్గార్డ్ జోర్గెన్సన్పై హోరాహోరీగా పోరాడి గెలిచాడు. లక్నోలోని ఆ స్టేడియం కిక్కిరిసిపోయి ఉంది. ప్రపంచం లోని అత్యుత్తమ బ్యాండ్మింటన్ నిపుణులంతా ఇప్పుడు నూతన బ్యాడ్మిం టన్ శక్తి అయిన భారత్లోనే ఉన్నారు. మీరే గనుక పీబీఎల్ పోటీలను చూసి ఉంటే వీఐపీల తొలి వరుసలో ఉన్న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) అధిపతి అఖిలేష్ దాస్ను గమనించే ఉంటారు. ఆయన ఆ క్రీడను తన ఉక్కు పిడికిలితో నడుపు తున్నాడు. ఆయన రాజకీయ వేత్త, బడా విద్యా వ్యాపారవేత్త, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత బనారసీ దాస్ కుమారుడు. యూపీఏ–1 హయాం లో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రాహుల్ గాంధీపై ఆగ్రహంతో కాంగ్రెస్ని వీడి బీఎస్పీలో చేరారు. ఆయన హయాంలో బీఏఐలో పలు వివా దాలు తలెత్తాయి. వాటిలో క్రీడాకారులతో రేగినవీ ఉన్నాయి. డబుల్స్ బ్యాడ్మింటన్లో ఆరితేరిన క్రీడాకారిణి, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత గుత్తా జ్వాలతో వివాదం సుప్రసిద్ధం. ఏదిఏమైనా భారత బ్యాడ్మింటన్ నేడున్నంత ఉత్తమంగా మునుపెన్నడూ లేదని అంగీకరించక తప్పదు. దాస్ చెప్పుకోద గిన బ్యాడ్మింటన్ ఆటగాడు ఎన్నడూ కాడు. లోధా పరీక్షకు నిలవలేని మార్గదర్శకులు ఇక భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్భూషణ్ శరణ్ సొంత జాగీరే అనుకోండి. తూర్పు యూపీలోని గోండా నుంచి ఆయన ఐదుసార్లు ఎంపీ. బాబ్రీ–అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఐపీసీ 307 సెక్షన్ కింద, ఆ తర్వాత టాడా కింద అరెస్టయి జైల్లో ఉన్న 16 మందిలో ఒకరిగా ఆయన ఎక్కువగా పేరు మోశారు. ఆయనకు నిజంగా కుస్తీ పోటీల్లో లభిం చిన గౌరవం ఏమైనా ఉందంటే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రెజ్లింగ్ అసోసి యేషన్లకు నాయకత్వం వహించినందు వల్ల లభించిందే. డబ్ల్యూఎఫ్ఐ లేదా బీఏఐ గనుక బీసీసీఐ అయివుంటే బ్రిజ్ భూషణ్, అఖిలేష్లు లోధా కమిటీ పరీక్షకు అస్సలు నిలవలేరు. కానీ ఆ రెండు క్రీడలు వారి మార్గదర్శకత్వంలోనే అత్యుత్తమంగా రాణించాయి. పురోగతిని సాధించిన మరి కొన్ని ఇతర క్రీడలను కూడా ఓసారి చూద్దాం. అభయ్ చౌతాలాను అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) జీవిత కాల పోషకునిగా నియమించినందుకుగానూ... ఆయన ఆ ఫెడరేషన్ను ‘‘సొంతం చేసేసుకున్నారు’’ అని వారం క్రితమే ఆగ్రహం వెల్లు వెత్తింది. ఆయన హయాంలోని 2007–12 మధ్యనే భారత బాక్సింగ్ సము న్నతంగా వర్థిల్లింది. అవినీతి ఆరోపణలపై అభయ్ చౌతాలా తండ్రి, సోద రుడు జైలుకు వెళ్లినప్పుడు భూపిందర్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ అధి కారంలో ఉంది. అయినా అభయ్, హుడాలు ఇద్దరూ కలసి హరియాణాను భారత బాక్సింగ్కే కాదు కాంటాక్ట్ (క్రీడాకారుల శరీరాలు తాకే) క్రీడలకే రాజధానిగా మలిచారు. హరియాణాకు చెందిన విజేందర్ సింగ్ భారత దేశపు మొదటి ప్రపంచ స్థాయి బాక్సింగ్ స్టార్గా ఆవిర్భవించాడు. చౌతాలా ఆ పదవిని కోల్పోయాక మన బాక్సింగ్ క్షీణించింది. స్పైస్ జెట్ కొత్త యజ మాని అజయ్సింగ్ నేతృత్వంలో బాక్సింగ్ ఫెడరేషన్ను ఇప్పుడు పునర్వ్య వస్థీకరించారు. ఆయన దివంగత ప్రమోద్ మహాజన్కు పాత మిత్రుడు. ఇక కబడ్డీ నేడు తిరిగి వికసిస్తోంది. భారత్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కబడీ లీగ్లు, రెండు ‘‘ప్రపంచ కప్’’లు జరుగుతున్నాయి. ఇరుపక్షాల తరఫున ఆడిన రాజకీయ రంగ క్రీడాకారుడు జనార్థన్సింగ్ గెహ్లాట్ భారత కబడ్డీని భార్య డాక్టర్ మృదులా భాదురియా చేతుల్లో ఉంచి... ప్రపంచ కబడ్డీ ఫెడ రేషన్ అధిపతి కావడమే మిగిలింది. గొప్ప మెరుగుదలను కనబరుస్తున్న క్రీడలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఎవరూ ఏవిధంగానూ లోధా పరీక్షకు నిలవలేరు. అయితే భారత అథ్లెటిక్స్ (వ్యాయామ క్రీడలు) ఫెడరేషన్ దీనికి అపవాదంగా కనిపిస్తుంది. దానికి నేతృత్వం వహిస్తున్నది మాస్కో ఒలింపిక్స్లో పాల్గొన్నవాడు, చాలా ఏళ్లపాటూ అతి వేగంగా పరుగెత్తే భారతీయునిగా నిలిచిన అగ్రశ్రేణి అథ్లెటిక్స్ క్రీడాకారుడు అదిల్లే సుమారివాలా. ఇంకా యువకునిగానే ఉన్న సుమారి వాలా లోధా పరీక్షను పూర్తిగా నెగ్గుతారు. అయితే భారత అథ్లెటిక్స్ రంగం చాలా వరకు గందరగోళంగానే ఉంది. తాజాగా ప్రవర్థిల్లుతున్న మరో క్రీడ హాకీ. భారత హాకీ ఫెడరేషన్ అధ్యక్షునిగా కేపీఎస్ గిల్ ప్రశంసలందుకు న్నారు. జాతీయ జట్టు ఎంపిక సందర్భంగా సెలక్షన్ కమిటీ సభ్యులు లంచాలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారని గిల్ను సస్పెండ్ చేశారు. ఆ పని చేసినది సాక్షాత్తూ ఐఓఏకు చెందిన సురేష్ కల్మాడీ. కల్మాడీ ఐఓఏ, క్రీడా మంత్రిత్వశాఖ కలసి హాకీ ఇండియాను ఏర్పాటు చేశాయి. ఇటీవలి వరకు దానికి ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రి యజమాని నరిందర్ బాత్రా నేతృత్వం వహించారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భారత మహిళల, పురుషుల జట్లు ఆసియా చాంపియన్ షిప్లను తిరిగి సాధించాయి, ప్రపంచంలో 5–6 స్థానా లకు చేరాయి. 25 ఏళ్ల తర్వాత ప్రపంచ సీనియర్, జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లు మనకు దక్కాయి. బాత్రా ఇప్పుడు అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు (ఎఫ్ఐహెచ్) అధిపతి అయ్యారు. భారత హాకీని ఆయన, మాజీ జాతీయ హాకీ క్రీడాకారిణి మరియమ్మ కోష్కీకి అప్పగించారు. హాకీ ఇండియా లీగ్ ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులను అందరినీ ఆకర్షిస్తోంది. హాకీ క్రీడాకారులకు కలనైనా ఊహించని ధరలు పలుకుతున్నాయి. మన ప్రతిభ పెంపొందుతోంది. క్రికెట్లో టీ20 లాగా ఐదు జట్ల హాకీ రంగప్రవేశం చేయడంతో ఈ క్రీడ మరింతగా కనక వర్షం కురిపించనుంది. కోర్టులు విప్పలేని చిక్కుముడి ఈ గందరగోళపు సమాచారం నుంచి మనం నిర్ధారణలను ఏమైనా చేయ గలమా? వయసు, రాజకీయాలు, సంపద, క్రీడాపరమైన రికార్డు ఉండటం లేదా లేకపోవడం... వీటిలో ఏవైనాగానీ ఒక క్రీడలో సాఫల్యతకు హామీని స్తాయా? అలాంటప్పుడు అందుకు మీరు గీటురాళ్లను... అదీ కూడా ఒక్క క్రికెట్కే ఎలా నిర్ణయిస్తారు? భారతదేశపు అత్యంత విజయవంతమైన క్రీడ క్రికెట్టే. బీసీసీఐ పారదర్శకతలేనిదిగా, అవినీతిగ్రస్తమైనదిగా, తలపొగురు దిగా మారింది. అందులో పదవుల్లో ఉన్న పలువురి విషయంలో స్వీయ ప్రయోజనాల సంఘర్షణ సమస్య కూడా ఉన్నది. అయితే అది కూడా ఉన్నత శ్రేణి క్లబ్లన్నిటిలాగే ఇతరుల అసూయకు గురవుతోంది. న్యాయస్థానం, నిజాయితీపరులైన ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? బీసీసీఐ ఆగ్రహం రేకెత్తించేటంతటి అహంకారంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించింది నిజమే. కానీ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడమంటే ఆగ్రహంతో తుపాకీ పేల్చడం లాంటిదేనని సవినయంగా మనవి చేయాల్సి వస్తుంది. బీసీసీఐని ‘‘సంస్కరించడం’’ అనే చిక్కుముడి లోకి కోర్టు లేదా అది నియమించే కమిటీ తలదూర్చడం చేయనే కూడదు. రోగిని నిలువునా కోసేసి, కుట్లు వేయకుండా వదిలేయడం లాంటి ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. బోర్డు అత్యున్నతాధికార సంస్థ నాయకత్వాన్నే మార్చాలని బలవంతపెట్టే కంటే, నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తగినంతగా చర్చించాక తీసుకున్న చర్యల నివేదికను కోరితే సముచితమై ఉండేది. న్యాయమూర్తులు చాలా కష్టపడ్డారు. కానీ వారు ఆధునిక క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని విస్మరించారు. నేడు క్రీడ అంటే గ్లామర్, అట్టహాసం, డబ్బు, గోల, రంగులు, ప్రదర్శనాతత్వం, సమరో త్సాహపు పోటీతత్వం. బాణాసంచా జిలుగులు, చీర్ లీడర్లు వగైరా అన్నీ ఆటలో భాగమే. పెద్దమనుషుల ఆటగా పిలిచే క్రికెట్ అందుకు మినహా యింపు కాదు. వ్యాపార నైపుణ్యాన్ని వాణిజ్యీకరించినప్పుడు ఉద్వేగం విజ యం సాధిస్తుంది. భారత్లో ఐఏపీఎల్ అందుకు మార్గదర్శి. పైన పేర్కొన్న క్రీడలన్నిటి వికాసానికి కారణం ఐపీఎల్ దారిని అవి అనుసరించడమే. -శేఖర్ గుప్తా twitter@shekargupta -
అలాంటి శక్తిమంతులెక్కడ?
జాతిహితం ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఈ సంస్థలన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్యసాహసాలతో పనిచేయడం కనిపిస్తుంది. ‘జాతి ప్రయోజనం’ శీర్షికలో ఈ వారం రాస్తున్న వ్యాసాన్ని గ్రంథచౌర్య అన్వేషకులు పరిశోధిస్తే వారి కళ్లు విప్పారతాయి. కానీ వారి ఆనందం క్షణి కమే. కొంత పోలిక ఉన్నా గ్రంథచౌర్యం కాదని మీరే సమాధానపడతారు. ఆరేళ్లక్రితం రాసిన ఆ వ్యాసానికి ప్రేరణ–జస్టిస్ జేఎస్ వర్మ ప్రసంగంలోని ఒక వాక్యం. ‘కోబ్రా డ్యాన్సర్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘంలో అరవీరభయంకర సభ్యుడు కేజే రావు తన జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసిన పుస్తకమది. కేజే రావు పదవీ విరమణ చేసిన తరువాత కూడా రూ. 12,000 వేతనానికి తిరిగి ఎన్నికల సంఘం సలహాదా రుగా పనిచేశారు. బిహార్ వంటి రాష్ట్రంలో పారదర్శకమైన ఎన్నికలను నిర్వ హించినవారాయన. ఆ ఎన్నికలలోనే లాలూ ప్రసాద్ కుటుంబ పాలన అంత మైంది. ఆ పుస్తకం మీద చర్చ కోసం ఏర్పాటు చేసిన బృందంలో జస్టిస్ వర్మ, అప్పటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వై ఖురేషీలతో పాటు నేను కూడా సభ్యుడిని. ఆ సందర్భంలోనే జస్టిస్ వర్మను నేనొక ప్రశ్న అడిగాను: ఒక వ్యవస్థకు సరికొత్త రూపు ఇవ్వడం ఒకే ఒక వ్యక్తికి సాధ్యమయ్యేదేనా? దీర్ఘకాలంలో లేదా అనతికాలంలో ఒక్క వ్యక్తి ఆ పని చేయగలరా? అందుకు జస్టిస్ వర్మ చెప్పిన సమాధానం: చాలా కష్టం, అలాగే పూర్తిగా సాధ్యమే కూడా. ఆ వ్యక్తికి రెండు అర్హతలు ఉంటే, మన మన రాజ్యాంగ సృష్టికర్తలు ఆశించిన స్థాయికి వ్యవస్థల రూపురేఖలను మార్చవచ్చు. ఆ వ్యక్తి గతంలో పెద్ద ప్రముఖుడై ఉండకూడదు. అలాగే భవిష్యత్తు మీద ఆశలు లేనివాడై ఉండాలి. అయితే మన వ్యవస్థ మొత్తం కాగడా వేసి వెతికినా అలాంటి అర్హతలు కలిగిన వ్యక్తిని కనిపెట్టడం సాధ్యం కాదు. నిజానికి జస్టిస్ వర్మ ముందుకు తెచ్చిన ఆ సిద్ధాంతానికి ఆయనే ఒక ప్రతిరూపం. పురాతన చరిత్ర కలిగిన భారత అత్యున్నత న్యాయస్థానం రూపునే కాదు, అప్పుడే ఆకృతి దాలుస్తున్న జాతీయ మానవ హక్కుల సంస్థ రూపును మార్చిన వ్యక్తి ఆయన. మూడు దశాబ్దాల క్రితం ఇదేవిధంగా భారత పౌరులమైన మనందరి హక్కులను సుప్రీంకోర్టు సాధ్యమైనంత మేర రక్షిస్తుందని ఇందిర నియం తృత్వ పోకడలు రాజ్యమేలుతున్న సమయంలోనే, అత్యున్నత న్యాయస్థానా నికే చెందిన మరో న్యాయమూర్తి దృఢంగా చెప్పారు. ఆయనే హెచ్.ఆర్. ఖన్నా. మనం ఇంకొందరి గురించి కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు: టీఎన్ శేషన్నే తీసుకోండి. రెండు దశాబ్దాల రాజకీయ విన్యాసాల బారి నుంచి కాపాడి, ఎన్నికల కమిషన్ను కాగితం పులి స్థాయి నుంచి నిజమైన పులి స్థాయికి పెంచారు. ఎన్నికల కమిషన్ ముగ్గురు సభ్యుల సంస్థగా మారింది. అయితే వారు తరువాత ఆయన పక్షమైపోయారు. బలీయ వ్యవస్థగా ఆవిర్భవించిన తరువాత కూడా దానిని విచ్ఛిన్నం చేయడానికి జరిగిన యత్నం అలా విఫలమైంది. ఇలాంటి వ్యక్తి సీబీఐ లేదా చీఫ్ విజిలెన్స్ కమిషన్లో తయారైతే ఎలా ఉంటుందని మనం తరువాత ఆలోచించాం. అవినీతి వ్యతిరేక ఉద్యమం విస్తృతంగా నిర్మితమైన 2010 సంవత్సరం మధ్యభాగాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు జరిగిన చాలా కుంభకోణాలు ప్రజలను ఆగ్రహా వేశాలకు గురి చేశాయి. ఏదో ఒకటి చేయాలన్న తపన కనిపించింది. అదే సమయంలో ఉత్తర కొరియా బాటలో జన్లోక్పాల్ బిల్లు వంటి ఇబ్బందికర ఆలోచనలు కూడా వచ్చాయి. సరే, దాచడానికి వీల్లేని గతమేదీ లేని, భవి ష్యత్తులో దేని కోసమూ ఆశ పడని ఓ పోలీసు అధికారి, లేదా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ తన శక్తి మేరకు ఈ వ్యవస్థల రూపురేఖలు మారిస్తే ఏమవుతుంది? మరీ రాక్షసంగా మీ ఇంటి పక్కనే గూఢచారి అవసరం, అవినీతి నిరోధక చట్టం, వేయి కొత్త కారాగారాల నిర్మాణం మాత్రం అవసరం ఉండవని చెప్ప వచ్చు. వాటి దుర్వినియోగమైనా చాలావరకు తగ్గుతుంది. అయితే ఇందులో ఏవీ కార్యరూపం దాల్చవు. నిజానికి సీబీఐకి కొత్త డైరెక్టర్ వచ్చిన ప్రతిసారి నైతికంగా, నైపుణ్య పరంగా ఆ సంస్థ తిరోగమనంలోకే దిగజారడం కనిపి స్తుంది. ఈ అవినీతి వ్యతిరేక పోరాట సంస్థకు అధిపతులుగా నియమించడా నికి యోగ్యులు అనదగ్గ రెండు పేర్లు ఎవరైనా ప్రస్తావించగలరా అని నేను సవాలు చేస్తున్నాను. ప్రస్తుతం ఆ సంస్థ అధిపతిగా ఉన్న వ్యక్తి పేరును కాంగ్రెస్ మినహా ఎవరం ప్రస్తావించబోమని కూడా పందెం కాసి మరీ చెబు తాను. అయితే దీని ఉద్దేశం ఎవరినీ వ్యక్తిగత హోదాలో అవమానించడం కాదు. మన సంస్థల పరిస్థితి అదే. జస్టిస్ వర్మ తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కీర్తిప్రతిష్టలను ఆర్జించినవారు జస్టిస్ ఆర్ఎం లో«థా. పదవీ విరమణ తరువాత బీసీసీఐని సంస్కరించడానికి ఆయన నేతృత్వంలో నియ మించిన చేవగల ఆ కమిటీ చేసిన సేవలకు జాతి రుణపడి ఉంటుంది. ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తరువాత ఈ పాతిక సంవత్సరాల కాలంలో టెలికాం, బీమా, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు సంబంధించి చాలా బలమైన వ్యవస్థలు ఆవిర్భవించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రధానంగా క్రమబద్ధీకరణకు సంబంధించినవే. ఇవన్నీ సమర్థంగా పనిచేస్తున్నట్టు చెప్పగలిగినప్పటికీ, జస్టిస్ వర్మ చెప్పిన ఒకే శక్తిమంతుడైన వ్యక్తి చేయూత కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాయి. ఇటీవలకాలంలో చూస్తే యూకే సిన్హా ఆధిపత్యంలో ఉన్న సెబీ మాత్రమే కాస్త ధైర్య సాహసా లతో పనిచేయడం కనిపిస్తుంది. అయితే సహారా వ్యవహారాలను వెలికి తీసి, ఆ సంస్థ అధిపతిని జైలుకు పంపిన ఆ సిన్హా పదవీకాలం త్వరలోనే పూర్తి కాబోతున్నది. అంతటి ధైర్యసాహసాలు ప్రదర్శించడం చిన్న విషయం కాదు. సహారా అధిపతి ఎంత పలుకుబడి కలిగినవారో ఆయన రాసిన పుస్తకం ఆవిష్కరణోత్సవం తిహార్ జైలులో జరిగినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ (గులాం నబీ) నేతలు అక్కడకు రావడం ద్వారా వెల్లడవుతోంది కూడా. ప్రధానికి ముడుపులు ముట్టాయని ఆదాయపన్ను శాఖ దాడుల సంద ర్భంగా దొరికిన డైరీల ఆధారంగా రాహుల్గాంధీ ఆరోపణలు చేస్తూ మాట్లా డిన రోజునే తిహార్ జైలులో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన ఆర్థిక వ్యవస్థలలో ఎంతో ప్రతిష్ట కలిగిన, కీలకమైన, పురాతన సంస్థ రిజర్వు బ్యాంక్. ముంబైలో ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో సంస్థ అధిపతి గదికి ముందు ఉండే గదిలో చాలా ఫొటోలు కనిపిస్తాయి. అవన్నీ ఆ సంస్థకు పూర్వం ఆధిపత్యం వహించినవారివి. అవి భారత ఆర్థిక చరిత్ర మీద విహంగ వీక్షణం చేయిస్తాయి. అయితే న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘాల మాదిరిగా, లేదా చీఫ్ విజిలెన్స్ కమిషన్, ఆఖరికి కమ్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ వలె రిజర్వు బ్యాంక్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి ఎలాంటి చట్టం చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖకీ, దాని ద్వారా పార్ల మెంటుకు రిజర్వు బ్యాంక్ జవాబుదారు. వైవీ రెడ్డి ఆయన వారసుడు డీవీ సుబ్బారావులు గవర్నర్లుగా ఉన్న కాలంలో రిజర్వుబ్యాంక్ కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నది. యూపీఏ హయాంలో పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రులుగా ఉన్నప్పుడు ఆ ఇద్దరు గవర్నర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రఘురామ్రాజన్ పదవీకాలాన్ని పొడిగించకుండా ఆ ఇబ్బందుల నుంచి తప్పించారు. తరువాత ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయ్యారు. ఆయన పదవిలోకి వచ్చి మూడు మాసాలు గడిచింది. అయితే ఆయన హయాంలోనే రిజర్వు బ్యాంక్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ పెద్ద నోట్ల విషయంలో రిజర్వు బ్యాంక్ నిర్వహించిన వాస్తవ పాత్ర ఏమిటన్నది చర్చనీయాంశం. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ (కేంద్ర ఆర్థికమంత్రి కార్యాలయం) దగ్గర, లేదా ముంబైలోని టంకసాల వీధిలో వినిపించే గుస గుసలను బట్టి నోట్ల రద్దు గురించిన సత్యం లేదా కల్పన మీ దృష్టికి వస్తుంది. రిజర్వు బ్యాంక్ బోర్డు సిఫార్సు ప్రాతిపదికగానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్న మాట అందులో ఒకటి. నల్లధన కుబేరులకు అవకాశం కల్పిం చకుండా ఉండేందుకు ఆ మాత్రం గోప్యత అవసరమే. ఆరు వారాలు గడిచి పోయాయి. ఆ గోప్యత ఇక అవసరం లేదు. అయినా నోట్ల రద్దుకు సంబం ధించిన సమావేశం, ఇతర చర్చనీయాంశాలను రిజర్వు బ్యాంక్ ఎందుకు వెల్లడించదు? నిజానికి వీటిని ఆర్టీఐ ద్వారా పొందవచ్చు. కానీ ప్రశ్న ఏమి టంటే రిజర్వు బ్యాంక్ తనకు తానుగా ఎందుకు పారదర్శకంగా ఉండదు? రిజర్వు బ్యాంక్ వెబ్సైట్ చూడండి: ‘బ్యాంకుల ద్వారా విడుదలయ్యే నోట్లను క్రమబద్ధీకరించడం, భారత్లో ద్రవ్య స్థిరత్వం కోసం నిల్వల నిర్వహణ’ తన విధిగా ప్రకటించుకోవడం కనిపిస్తుంది. అంటే కరెన్సీ ప్రధాన బాధ్యత ఆ బ్యాంక్దే. కాబట్టి నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులు, ఇతర బాధ్యతల నుంచి అది తప్పించుకోలేదు. నవంబర్ 8 తరువాత ఆ సంస్థ పాటిస్తున్న మౌనం, గోప్యత (తాజాగా రూ. 5,000 నగదు మదుపుపై ఆంక్షలు) వరకు ఏవీ రిజర్వు బ్యాంక్ ప్రతిష్టను, దాని గవర్నర్ పరపతిని పెంచేవి కావు. మదుపు వివరాలను వెల్లడిస్తూ ఇచ్చే వారాంతపు నివేదికను నిలిపివేయడం గానీ, ఎలాంటి వివరణ ఇవ్వకుండా డిసెంబర్ 10 వరకు మొత్తం డిపాజిట్ల వివరాలను వెబ్ సైట్ను తొలగించడం ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న సంస్థకు న్యాయం కాదు. ఉర్జిత్ అంటే గతంలో ఎవరికీ తెలీదు. ఆయన భవిష్యత్ గురించి పెద్దగా ఆశలు పెట్టుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఔన్నత్యాన్ని కాపాడ్డానికి నడుం కట్టవచ్చు. (వ్యాసకర్త : శేఖర్ గుప్తా twitter@shekargupta) -
ఆయనలో ఆమె జాడలు
జాతిహితం రాజ్యపాలన, రాజకీయాలు, ఆర్థిక సిద్ధాంతం విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానం ఎలాంటిదో నోట్ల రద్దు వెనుక ఉన్న ఆకర్షణీయమైన, లోతైన ఒక అంశంలో ప్రతిబింబిస్తున్నదని అనుకోవచ్చు. 1971 నాటి భారత్–పాక్ యుద్ధం 45వ వార్షికోత్సవాన్ని దేశం జరుపుకుంటున్న ప్రస్తుత సందర్భంలో ఈ వారం రాస్తున్న వ్యాసంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందిరాగాంధీ నాయకత్వ ప్రాభవం మధ్యాహ్న మార్తాండునిలా వెలిగిన కాలమది.. ఇక్కడే ఒక విషయం ప్రస్తా వించాలి. నరేంద్ర మోదీతో పాటు, ఆయన మాతృసంస్థ ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్పథం యావత్తూ నెహ్రూ ఆజన్మాంతం ఆచరించిన విధానాల ఎడల బద్ధవైరంతో నిర్మితమైనవే. కానీ, ఇందిరాగాంధీ రాజకీయ ఆర్థిక విధానంతో పాటు; రాజకీయాలలో, వ్యవహార సరళిలో ఆమె శైలిని అనుసరించక తప్పని స్థితిలో ఒక ఆరాధనా భావం కూడా వారిలో కనిపిస్తుంది. పోవర్టేరియనిజంకు మద్దతా? ఈ విషయాన్ని మనం ప్రభుత్వం వారి అభిమాన ఆర్థికవేత్త ఆచార్య జగదీశ్ భగవతి ప్రస్తావనతో విశ్లేషించడం ఆరంభిద్దాం. నోట్ల రద్దు అంశాన్ని సమర్థించే పనిని కాస్త ఆలస్యంగా మొదలుపెట్టిన భగవతి గడచిన వారం ఒక విషయాన్ని మనందరికీ గుర్తు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగాన్ని చాలా ఏళ్లు బోధించిన వ్యక్తిగా ఒక అంశాన్ని కచ్చి తంగా చెప్పగలననీ, ప్రభుత్వం చలామణీ చేసే నోట్లు, నాణేల విషయంలో పౌరుల హక్కులను నిరాకరించడం ఎంత మాత్రం చట్ట విరుద్ధం కాదనీ ఆయన చెప్పారు. కొంత పరిహారం చెల్లించే అనుకోండి, ‘సామాజిక అవ సరాల’ కోసం పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం రాజ్యాం గానికి గతంలో జరిగిన కొన్ని సవరణల ద్వారా ప్రభుత్వానికి దఖలు పడిందని కూడా భగవతి చెప్పారు. లేకపోతే జమిందారీలు, రాజభరణాల రద్దును సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండేదని కూడా ఆయన అన్నారు. అయితే హోదా కోల్పోయిన రాజులకూ, జమిందార్లకూ ఎంత నష్ట పరిహారం ముట్టచెప్పారో మనం అడగడం లేదు. ఎందుకంటే ఆ అంశం సాధారణ ప్రజానీకానికి సంబంధించినది కాని, అసలు ప్రస్తుత సమస్య కాని కాదు. నిబద్ధత కలిగిన ఈ సంస్కరణల అనుకూల గౌరవ ఆర్థికవేత్త ఒక సోషలిస్ట్ సంస్కరణను కాంగ్రెస్ వారి, ముఖ్యంగా ఇందిరాగాంధీ పెంచి పోషించిన పోవర్టేరియనిజం (మిమ్మల్ని దారిద్య్రంలో ఉంచడం మా జన్మహక్కు)కు సాధికారిత కల్పించడానికీ, తాత్కాలికంగానే అయినా దేశాన్నీ, ఆర్థిక వ్యవస్థనీ అతలాకుతలం చేసిన రాజ్యపు పశుబలాన్ని సమ ర్థించే పనికిS ఉపయోగించడానికి సిద్ధపడుతున్నారు. ఏమిటీ వైరుధ్యం ఇది వ్యక్తిగత అంశం కాదు. అలాగే ఇది ఆచార్య భగవతి గురించి చెప్పడం కూడా కాదు. మనకి చరిత్ర తెలుసు. ఆచార్య భగవతి, ఆచార్య అమర్త్యసేన్ వంటి ఇద్దరు మహానుభావులు ఒక అంశం మీద మాట్లాడితే అందులో ఒకదానిని వ్యతిరేకించడానికి అవసరమైన అవగాహన మన ప్రజలకు వచ్చింది. ఇక్కడ కీలక అంశం ఏమిటి? ఆర్థిక సంస్కరణలు, వృద్ధి వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి, అవి గుజరాత్లో సాధించిన వ్యక్తిగా చరిత్ర ఉన్న నాయకుడూ; ఆయన ఎంతో ఆరాధించే ప్రపంచ ఆర్థికవేత్త కూడా ఇందిరాగాంధీని, ఆమె విధానాలను, ఇంకా ఆమె ఇతర మార్గాలను, మరీ ముఖ్యంగా విపత్కర ఆర్థిక విధానాలను అను సరించిన ఆ నాయకురాలి పట్ల ఆరాధనా భావం ఎలా ఏర్పరుచుకున్నారు? దీనినే మరో విధంగా చెబితే, తొలి సంస్కరణ చర్యగా ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసిన ప్రధానమంత్రి, బ్యాంకుల జాతీయకరణవల్ల జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన కేంద్రీకృత స్వభావాన్ని ఎలా మార్చగలరు? మోదీలో ఇందిర కనిపించడం లేదా? 1971 యుద్ధ విజయం 45వ వార్షికోత్సవం ఈ వారమంతా అధికారికంగా జరుపుతున్నారు. అయితే ఇందులో ఇందిరాగాంధీ ప్రస్తావన అంతగా ఏమీ కనిపించడం లేదు. ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే నరేంద్ర మోదీ రాజకీయాలను కనుక నిశితంగా పరిశీలిస్తే ఇందిర శైలితో సమాం తరంగా ఉండే కొన్ని లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి. నిరసన భావంతో కూడిన ఒక ఆరాధన కూడా కనిపిస్తుంది. వ్యవస్థలను తమ వైపు తిప్పుకోవడంలోని ఆ ప్రతిభను చూడండి. పన్నుల శాఖలోని కింది స్థాయి ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయి విచక్షణా ధికారాలను దఖలు పరచడానికి ఉద్దేశించిన ఒక సవరణను ఆదాయపు పన్ను చట్టంలో తీసుకువచ్చారు. దీనితో పాతికేళ్ల సరళీకరణ ప్రయాణాన్ని దిగ్విజయంగా పాడుచేయవచ్చు. ఈ చట్ట సవరణ మీద ఒక్క వాక్యం కూడా చర్చ జరపకుండా, కేవలం మూజువాణీ ఓటుతో లోక్సభలో ఆమోదింపచేశారు. హైకోర్టు న్యాయ మూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించి పంపిన ప్రతిపాదనలలో సగానికి సగం తిప్పి పంపడం మరొకటి. ఇంతదాకా మీరు చేసిందేనంటూ విపక్షాన్ని శపిస్తూ గడచిన రెండు రోజులుగా పార్లమెంటును స్తంభింపచేయడానికి అధికార పక్షాన్నే ఉపయోగించుకోవడం మరొకటి. రిజర్వు బ్యాంక్ గవర్నర్ స్థాయిని ఆర్థిక మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి స్థాయికి దిగజార్చడం ఇంకొకటి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఐఏఎస్ అధికారులు చేసే పని ఒక్కటే–కరెన్సీ విధానంలో వచ్చిన రోజువారీ మార్పుల గురించి నిరంతరాయంగా మాట్లాడడమే. మరోపక్కన ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒకరు ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతున్నదనీ, బడ్జెట్లో వడ్డీరేట్లను కూడా తగ్గించబోతున్నదనీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. బోధనలు, మాటలతో ఒప్పించడం సాధ్యం కాదంటూ ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడే ఒక గట్టి మద్దతుదారుడు లేదా సిద్ధాంతవేత్త అభి ప్రాయంలో ఇదంతా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం మార్పును తీసుకురావలసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే పశుబలాన్ని కూడా ప్రయోగించవలసిందే. విధివిధానాలలో లేదా వ్యవస్థలతో ప్రమాదం పొంచి ఉందా, అయితే–అసలు వ్యవస్థనే పూర్తిగా నిరాకరించాలి. ఇందిరా గాంధీ చేసిన పని సరిగ్గా ఇదే. 1967 నాటి ఎన్నికలలో ఎదురైన అపజయాలు ఇచ్చిన ప్రేరణ వల్ల అయి ఉండాలి, ఆమె వ్యవస్థను సర్వనాశనం చేసే ఒక బృహత్ ప్రణాళికను ఆరంభించారు. తన మంత్రిమండలితో పాటు, పార్టీ నాయకత్వాన్ని కూడా డూడూబసవన్నల స్థాయికి దింపేశారు. సామాజిక నిబద్ధత పేరుతో ఇతర వ్యవస్థలను, ఉద్యోగస్వామ్యాన్ని కూడా బలహీనం చేశారు. ఒకరకమైన అతి జాతీయవాద స్పృహను, పాశ్చాత్య వ్యతిరేకతను రగిలించారు. అతిశయాన్ని, నిజాయితీలేని సామ్యవాదాన్ని ఉనికిలోకి తెచ్చారు. పరివార్ లక్ష్యం నెహ్రూయే అయితే నెహ్రూ చింతనను, విధానాలను నిలదీసిన స్థాయిలో ఆరెస్సెస్ ఏనాడూ ఈ విధానాలలో చాలా వాటిని ప్రశ్నించలేదు. పైగా ఇందిర పట్ల వారి అభిమానమంతా వెల్లువెత్తినది 1969–77 మధ్యనే కావడం విశేషం. నిజానికి నెహ్రూ నిర్మించిన ప్రజాస్వామ్య సౌధాన్నీ, నైతిక–సర ళీకృత ప్రజాస్వామ్యాన్నీ, మిగిలిన అన్ని వ్యవస్థలనూ ఇందిరాగాంధీ ధ్వంసం చేసిన కాలం కూడా సరిగ్గా అదే. అయితే నెహ్రూ వారసత్వాన్ని ఆయన కూతురు కంటే ఎక్కువగా ధ్వంసం చేసినది వీరే. పౌరుల హక్కులను కాలరాయడం, ప్రతిపక్షాలను జైళ్లలో కుక్కడం వంటి వాటి ద్వారా ఇందిర అలాంటి స్థితికి చేరారు. నెహ్రూ ఇలాంటివి కలలో కూడా ఊహించలేదు. మోదీ, ఆరెస్సెస్ ఉద్దేశం కూడా కఠినమైన ప్రభుత్వం ఉండాలనే. అవసరమైనచోట ‘దండం’ ఉపయోగించడం కూడా. అంతేకానీ మీడియానీ, పౌర సమాజాన్నీ, నిపుణులు, ఆఖరికి న్యాయమూర్తులను పట్టించుకోవడం వారి ఉద్దేశం కాదు. ఇప్పుడు గాని, మోదీ యుగానికి ముందు గాని ఇందిరాగాంధీ మీద బీజేపీ–ఆరెస్సెస్ సంధించిన విమర్శలు ఆమె రాజకీయ కార్యకలాపాలకు పరిమితమై మాత్రమే కనిపిస్తాయి. అంతే తప్ప ఆమె ఆర్థిక విధానాల గురించిన విమర్శలు కావు. ఆఖరికి 1977లో ఇందిరాగాంధీని ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సరళంగా లేని ఆమె రాజకీయ చట్టాలను, చర్యలను పక్కన పెట్టారేగానీ, ఆమె అనుసరించిన ఆర్థిక విధా నాలను వారు కూడా కొనసాగించారు. సోషలిస్ట్ సిద్ధాంతాలతో మమేకం కావడం ఇక్కడ ఎవరి ఉద్దేశమూ కాదు. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఒక దశలో ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరించే పని చేపట్టారు. అయితే దీనికి ఆరెస్సెస్ నుంచి వెనువెంటనే వ్యతిరేకత వచ్చింది. ఇదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ప్రచ్ఛన్న యుద్ధ అనంతర కాల రాజకీయ వ్యవస్థకు మార్గం సుగమం చేసింది. ఈ రెండు పరిణామాలకు కారకుడైన బ్రజేశ్ మిశ్రాను అమెరికా అనుకూల, పంచమాంగదళ సభ్యుడు అని ఆయన బృందంలోనే ముద్రవేశారు. ఆలోచనలన్నీ ఆమెవే నరేంద్ర మోదీ రాకతో కొన్ని ఆశలు వెల్లువెత్తాయి. గుజరాత్లో ఆయనకు ఉన్న పేరును బట్టి ఇందిర ఆర్థిక విధానాలకు (ఇందిరానోమిక్స్) మంగళం పాడతారని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన నెహ్రూ ప్రతి పాదించిన సరళ భావాలు, సెక్యులరిజమ్ వంటివాటిలో పెను మార్పులు తీసుకురావడానికే పరిమితమయ్యారని తేలుతోంది. ఇందిర అనుసరించిన అన్ని ఆర్థిక ఆలోచనలు బలోపేతం కావడం ఇప్పుడు చూస్తున్నాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘డిజిటల్’ తీరాన ‘నల్ల’ నావ
జాతిహితం నరేంద్ర మోదీ ప్రభుత్వం సృష్టించిన నేటి గందరగోళ పరిస్థితి దేశానికి స్వాతంత్య్రం లభించిన తొలిరోజుల నాటి ఓ కథను గుర్తుకు తెస్తోంది. మన ప్రథమ రక్షణ మంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు సర్దార్ బల్దేవ్సింగ్ (1902–61), ప్రధాని నెహ్రూలపై పరిహాసోక్తులను విసరడానికి కుష్వంత్ సింగ్ ఎన్ని కథలైనా అల్లేవారు. హాస్యానికి తావు లేని ఈ రోజుల్లో నాకు అలాంటి లైసెన్స్ లేదనుకోండి. దేశవిభజన తదుపరి నెలకొన్న గందర గోళాన్ని, భారీ ఎత్తున సాగిన వలసలను, కశ్మీర్లో రేగిన యుద్ధాన్ని బల్దేవ్సింగ్ నిభాయించుకువచ్చిన తీరు అద్భుతం. అయినా కుష్వంత్ సింగ్ ఆయన గురించి మహదానందంతో ఓ కథ చెప్పేవారు. సర్దార్ బల్దేవ్ సింగ్కు ఎంతగా తీరుబడి లేకుండా పోయిందంటే, రక్షణమంత్రి అయ్యాక కొన్ని నెలలకు రోపార్లోని (నేటి రూపానగర్) తల్లిని చూడటానికి వెళ్లలేక పోయారు. ‘‘నువ్వు ఓ పెద్ద మంత్రివి అయినందువల్ల ఒరిగిందేమిటి? అని అంతా అడుగుతున్నారు. ఇంగ్లిషువాళ్లు వెళ్లిపోయాక చిల్లరకు ఎంతో కటకటై పోతోంది, జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మంత్రైన నా కొడుకు దీనికి ఏమైనా చేయగలడా?’’అని తల్లి నిలదీసింది. ఢిల్లీకి తిరిగొచ్చాక రక్షణ మంత్రి తల్లి చిల్లర సమస్యను తీర్చేయాలని అనుకున్నారు. తన జీతాన్ని చిల్లర నాణేలుగా మార్చి సాధ్యమైనంత చిల్లర దాచాలని ప్రయత్నించారు. ఒకటి లేదా రెండు ట్రంకు పెట్టెల నిండా చిల్లరను కూడబెట్టాక సగర్వంగా వాటిని తల్లికి పోస్టల్ మనియార్డర్ చేశారు. తలకిందులైన నల్లధనంపై పోరు కుష్వంత్సింగ్ ఇప్పుడు ఉండివుంటే నాటి రక్షణ మంత్రి చిల్లర కష్టాన్ని, నల్లధనంతో మోదీ ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని పోల్చి అంతకు మరింత ఎక్కువ నవ్వు తెప్పించేవారు. రద్దు చేసిన కరెన్సీ నోట్లన్నీ బల్దేవ్సింగ్ ట్రంకు పెట్టెల్లో దాచిన చిల్లరలాగే ఉన్నాయి. ఒక సర్వసత్తాక దేశం మొత్తం నగదులో 86 శాతాన్ని పనికిరానిదిగా చేసే పనిని ఇంతవరకు ఏ ప్రజా స్వామిక దేశమూ చేయలేదు. ఇంతటి భారీ చర్యను చేపట్టింది దేనికంటే ప్రజలు నగదు రహిత డిజిటల్ లావాదేవీలు జరిపేలా చేయడం కోసం. ఇది ట్రంకు పెట్టెలతో చిల్లరను తల్లికి పంపడం లాంటిది ఎంతమాత్రమూ కాదు. అత్యంత తీవ్రమైన హేతువిరుద్ధమైన పని. కాకపోతే మనందరి మీదా జోకులు పేలుతున్నాయంతే. బహిరంగ చర్చను నల్లధనం మీది నుంచి, డిజిటల్ ధనం మీదికి మరల్చి హఠాత్తుగా శీర్షాసనం వేయించారు. ప్రజలను ఒప్పించగల ప్రధాని అమోఘ వాక్చాతుర్యం, ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడంపై ఆయనకున్న అధికారాలదే ఈ ఘనత. బహిరంగ చర్చను అలా దారి మళ్లించడంతో పాటే ఆర్థిక మంత్రి సేవా పన్ను తగ్గింపులు, ప్రభుత్వం లేదా రైల్వేలు, జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్స్, పెట్రోలు పంపులు వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అమ్మే ఆవశ్యక వస్తు, సేవల డిజిటల్ చెల్లింపులకు తగ్గింపు రేట్లు వగైరా రాయితీల జాబితాను ప్రకటించారు. దీని నుంచి రెండు ముఖ్య ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, చెల్లింపులను డిజిటలైజ్ చేయడం గొప్ప విషయమే కానీ... మీకు కావాల్సింది అదే అయితే, మొత్తం ఆర్థిక వ్యవస్థకు 1,100 వోల్టుల షాక్లాంటి పెద్ద నోట్ల రద్దు ఎందుకు? ఈ ప్రోత్సాహ కాలు, తగ్గింపులు, అవసరమనుకుంటే డిజిటల్ చెల్లింపులన్నిటిపైనా స్వల్ప మైన ఆదాయపు పన్ను రాయితీని ఇస్తే సరిపోయేదిగా? ఇక రెండవది నైతిక పరమైన ముప్పునకు సంబంధించినది. నేటి మన 130 కోట్ల జనాభాలో 2.5 నుంచి 3 శాతమే డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. మరి ఇంకొంత శాతం ఈ–వ్యాలెట్లను వాడుతుండొచ్చు. ఏదిఏమైనా సమాజం లోని ఆర్థికంగా ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ఇలాంటి వారంతా కలిసి 4 నుంచి 6 కోట్ల వరకు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ రంగం రాయితీలు ఇస్తున్నది వీరికే. లేదా ఇప్పటికే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారికే ప్లాస్టిక్ ఆర్థిక వ్యవస్థ అనే విశేష సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురవుతున్న అ«ధిక సంఖ్యాకుల కంటే ఇప్పటికే వారికి ఎక్కువ ప్రతిఫలం దక్కుతోంది. ప్లాస్టిక్ సత్యం పెద్ద నోట్ల రద్దు కంటే ఎక్కువ ఊహాత్మక వైఖరిని చేపట్టాలంటే లోతుగా ఆలోచించడం అవసరమయ్యేది. కానీ ఊపిరిç Üలపని ఈ రోజుల్లో లోతుగా ఆలోచించడం కష్టమే. గత వారం, సరిగ్గా మెజగాన్ డ్రై డాక్లో ఐఎన్ఎస్ బెత్వా అనే 3,800 టన్నుల ఫ్రిగేట్ దొర్లిపడ్డ రోజునే, రక్షణ మంత్రిత్వ శాఖ.. మరుసటి రోజున రక్షణమంత్రి తమ శాఖకు చెందిన అధిపతులకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి పాఠాలు నేర్పుతారని ప్రకటించింది. అయితే నాకు బాగా నచ్చినది మాత్రం.. మన సమాచార సాంకేతిక శాఖా మంత్రి తెలం గాణలో పర్యటిస్తూ పంక్చర్ రిపేర్ షాపు నడుపుకునే గంగయ్య పేటీఎం చెల్లింపులను స్వీకరిస్తున్న వైనాన్ని మహోత్సాహంతో తన మంత్రివర్గ సహచరులొకరితో సహా ప్రపంచానికి ట్వీటర్ ద్వారా చాటడమే. కనీసం రెండు త్రైమాసికాల వృద్ధిని నాశనం చేసినది, పదుల కోట్ల మంది ప్రజలను వేధిస్తున్నది, ఆర్బీఐ వంటి గొప్ప సంస్థ పనిని దిగజార్చినది తెలివిమాలిన మన భారతీయులకు జీవితం అంటే ప్లాస్టిక్కేనని నచ్చజెప్పాలన్న ఆలోచనే, అద్భుతం (బార్బీ గర్ల్ ఆ సత్యాన్ని ఎన్నడో చెప్పింది, మనం పట్టించుకో లేదు). బార్బీ ప్రపంచంలోనే కాదు నిజ జీవితంలో కూడా ఇది అద్భుతమే. సాహసోపేతమైన ఈ చర్యను ప్రధాని ప్రకటించిన రాత్రి మనం ఉద్వి గ్నులమయ్యాం. నిర్ణయాత్మకమైన ఇలాంటి పని శైలిని చూసి మన ఊహాత్మ కత ఉత్తేజితమైంది. దీనికి తగ్గట్టుగా ప్రధాని ముందస్తు కసరత్తును పూర్తి చేశారని, నగదు రూపంలోని నల్లధనం సమాచారాన్ని సేకరించి, సరిపడే టన్ని కొత్త నోట్లను సిద్ధం చేసి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధమై బరిలోకి దిగారని మనమంతా అనుకున్నాం. చలామణిలోని నోట్లలో పెద్ద మొత్తంలో దొంగనోట్లు ఉన్నాయనే కచ్చితమైన ఆధారాలను గూఢచార సంస్థలు, ద్రవ్య నిపుణులు ఆధారాలు చూపి ఉంటారని లక్ష్యిత దాడి అనే భావన, కనీసం తక్షణమే అయినా ఉత్తేజితంచేసేది, ఆకట్టుకునేది. అక్కడే మనలో చాలా మందిమి పొరబడ్డాం. ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోలేరా? మనమంతా (నాతో సహా) పప్పులో కాలేశామనేది ఇప్పుడు స్పష్టమే. ఏ ఈ విషయాన్నీ దాచలేకపోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వం ఎంత విజయ వంతంగా ఈ రహస్యాన్ని దాచి ఉంచిందా అని ఉప్పొంగిపోయాం. అది అంత రహస్యంగా ఉండటానికి కారణం ప్రభుత్వానికి కూడా అది తెలియక పోవడమే అని ఇప్పడు మనకు తెలుసు. మంత్రివర్గ సమావేశంలో లేదా అత్యున్నత స్థాయిలోని కొందరు మంత్రుల ముందైనా చర్చకు తేకుండా నిర్ణయాన్ని ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే మీరు వారికి చెప్పా రంటే... మీరు నల్లధనం దాచిన వంచకులపైనే కాదు దురదృష్టవశాత్తూ మీపైన కూడా ఊహించని రీతిలో మాటలదాడికి పాల్పడుతున్నారన్న మాట. మంత్రివర్గ సహచరులతో ఈ విషయాన్ని చర్చించడమంటేనే బయటకు పొక్కుతుందనుకుంటే సమస్యే. మరి వారి చేత పదవీ స్వీకారానికి, అధికారిక రహస్యాల రక్షణకు వాగ్దానం చేయించింది ఎందుకు? మంత్రివర్గ వ్యవస్థ, సమష్టి బాధ్యత ఎందుకు? అత్యున్నత స్థాయిలోని పదిమంది లేదా నలుగురు కేంద్ర క్యాబినెట్ మంత్రులను కూడా మీరు నమ్మలేరా? అలా అయితే మీరు యుద్ధానికి దిగడానికి ముందు సంప్రదించేది, మేధో మథనం సాగించేది, విశ్వాసంలోకి తీసుకునేది ఎవరిని? ప్రధాని సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజల్లో ఇంకా ప్రశంసా భావం విస్తృతంగా ఉన్నమాట నిజమే. క్యూలలో నిలబడుతున్న దిగువ మధ్యతరగతి, పేద వర్గాలలోని అధికులలో అది ఉండటమే విచిత్రం. ఓ నెల తదుపరి, ఇదేమిటా అని వారు గందరగోళపడుతున్నారు. అయినా దశాబ్దాల యథాతథవాదుల పాలన తర్వాత ఇంత నిర్ణయాత్మకంగా ఉండే నాయకుడు వచ్చినందుకు విస్మయం చెందుతున్నారు. ఆయన తమను ఈ కరెన్సీ యుద్ధంలోకి దించడానికి ఏదో కారణం ఉండే ఉంటుందని, ఈ ప్రమా దానికి తగిన ప్రతిఫలం ఏదో అందబోతోందని వారు భావిస్తున్నారు. వారు ఆశించేది కేవలం డిజిటల్ చెల్లింపులకు పరివర్తన మాత్రమే కాదనేది ఖాయం. నల్లధనాన్ని హతమార్చడానికి బయల్దేరి చివరకు ఇది పేటీఎంను తగిలించ డంతో ముగియడం చిల్లరను మనియార్డర్ ద్వారా పంపడం లాగా హాస్య భరితమైనదేమీ కాదు. అందులో అర్ధభాగం తెలివితో కూడినది కూడా. తాజా కలం : ఎంతటి ఘోర నిర్లక్ష్యాన్నయినా సాహసం– ఘనత నిండి నదిగా చక్కగా మలిచి చూపిస్తే ప్రతిఫలం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుంది. క్రిమియా యుద్ధంలో ద లైట్ బ్రిగేడ్ను నడిపిన ఎర్ల్ ఆఫ్ కార్డి గాన్ను సత్కరించి, బహుమానాలిచ్చి, పదోన్నతిని కల్పించారు. ఆ యుద్ధాన్ని ఆశ్వికదళ సాహసోపేతపు అజరామర మైన పోరుగా కవి టెన్నిసన్ కీర్తించాడు. కాగా, సుప్రసిద్ధ యుద్ధ నిపుణుడు నార్మన్ డిక్సన్ దాన్ని ‘‘అది అద్భుతమేగానీ యుద్ధం కాదు, వెర్రిబాగులతనం’’ అన్నాడు. అయినా దాన్ని గొప్పదిగా చెప్పడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్, ఫ్లాండర్స్ యుద్ధరంగాలలో ఊచకోతకు గురయ్యే వరకు అది బ్రిటిష్ ఆశ్వికదళాలను ఉత్తేజితపరుస్తూనే వచ్చింది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
జారుడుమెట్లపై జర్నలిజం
జాతిహితం కార్గిల్ యుద్ధ కాలం నుంచి మనం, జర్నలిస్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, మన దేశ బలాన్ని బహుళంగా హెచ్చింపజేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజానికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ, డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్గా మార్చేయడం ద్వారానో కాదు. భారతీయ జర్నలిజం స్వీయ వినాశకమైదిగా ఎప్పుడు మారింది? మన జర్నలిజం స్వీయ వినాశం ఎప్పుడు మొదలైంది? లేదా అది స్వీయ వినాశక దిశగా పయనిస్తోందా? మీరు ఎంతగా అందరి దృష్టిని ఆకర్షించాలని కోరు కుంటారనే దాన్ని బట్టి మీరే ఈ ప్రశ్నను ఎలా వేయాలో ఎంచుకోండి. మొదటిది ఊరిస్తున్నా, మూడోదాన్ని నేను ఎంచుకుంటున్నాను. కాబట్టి ఇది రాస్తున్నది స్వీయ (సంస్థాగత) సానుభూతితో కాదు... స్వీయశోధనను, చర్చను ఆహ్వానించడం కోసం. పైన పేర్కొన్న ప్రశ్నలను సున్నితంగా రూపొందించే ఇతర మార్గాలూ ఉన్నాయి. జర్నలిస్టులమైన మనం మన ప్రభుత్వానికి అధికార ప్రతినిధులమని, ఇతరుల నైతికతా పరిరక్షకులమని, మాతృభూమి రక్షణ కోసం పోరాడే సైనికులమని భావించడం ఎప్పడు ప్రారంభమైంది? ఇదేదో బ్రెజ్నెవ్ పాలనలోని సోవియట్ రష్యా ప్రభుత్వం అన్నట్టు జాతీయ భద్రతాపరమైన, విదేశాంగ విధానపరమైన సమస్యలను ప్రశ్నించ డాన్ని నిలిపి వేయాలని ఎందుకు నిర్ణయించుకున్నాం? చాలామంది పాత్రికేయులు-మన సీనియర్ సహా-మన దేశం గురించి మాట్లాడేటప్పుడు ‘‘మేం,’’ ‘‘మన,’’ ‘‘మనం’’ అనే పదాలను వాడటాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు ఎందుకని? మన విదేశాంగ, భద్రతా విధానాలను ఎందుకు ప్రశ్నిం చడం లేదు? ‘‘మీ అమెరికన్లకు పాకిస్తాన్తో ఉన్న సంబంధం సంక్లిష్టమైన దని, అది మాకు హానికరమని మాకు తెలుసు. అయినా మీ ఆందోళనల పట్ల మేం సున్నితంగా ఉంటామని మీరు ఆశించజాలరు’’ ఇలా మాట్లాడుతు న్నారు. భారత జర్నలిజంలో వచ్చిన ఈ మలుపుతో మనం తప్పును చూడటం మానేసి సమష్టి అధికారిక వ్యవస్థలో భాగంగా మారిపోయాం. నిష్ఠుర నిజాలు చెప్పే వారేరి? విదేశాంగ, సైనిక విధానాలకు సంబంధించి భారత పాత్రికేయులు మరింత ఎక్కువ అధికారపక్షవాదంతో ఉంటారని పాకిస్తాన్ పాత్రికేయులు ఎప్పుడూ అంటుంటారు. అతి తరచుగా పాక్ పాత్రికేయులు ధైర్యంగా అధికారిక విధానాలను ప్రశ్నిస్తుంటారు. కశ్మీర్ విధానం, ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించడం, పౌర-సైనిక సంబంధాలు వంటి సమస్యలు సైతం అలా వారు ప్రశ్నించే వాటిలో ఉన్నాయి. అందుకుగాను కొందరు పాత్రికేయులు ప్రవా సంలో గడపాల్సి వస్తోంది (రజా రూమి, హస్సెన్ హఖాని), లేదా జైలు పాలు కావాల్సి వస్తోంది (నజామ్ సేథి). భారత మీడియా గుడ్డిగా అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థిస్తుందని ఎవరూ అనరు. ఎల్టీటీ యీకి సైనిక శిక్షణను, ఆయుధాలను ఇచ్చి ప్రోత్సహించడాన్ని మన మీడియా ప్రశ్నించింది. అలాగే ఆ తర్వాతి కాలంలో భారత శాంతి భద్రతా దళాలను (ఐపీకీఎఫ్) పంపి శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్నీ భారత పాత్రికేయులు ప్రశ్నించారు. ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి బస్తర్, కశ్మీర్ లోయల వరకు సైన్యాన్ని ప్రయోగించడంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ ధోరణి మారుతోంది. ఇది కేవలం ఉడీ ఉగ్రదాడి తదుపరి మాత్రమే మొదలైంది కాదు. తేలికపాటి ఆయుధాలు ధరించిన నలుగురు సైనికేతరులు (పాక్ ఉగ్రవాదులు) ఒక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ భద్రతా వలయాలన్నిటినీ ఛేదించుకుని అధీన రేఖ దాటి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి ఎలా చొచ్చుకు పోగలిగారని ఒకే ఒక్క టీవీ జర్నలిస్టు కరన్ థాపర్ ‘ఇండియా టు డే’లో ప్రశ్నించారు. విస్పష్టమైన ఈ వైఫల్యంపై విమర్శనాత్మకమైన అంచ నాను వేసిన గౌరవనీయులైన రిటైర్డ్ జనరల్ ఒకే ఒక్కరు.. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ థిల్లాన్. ఆయన 1987లో ఇదే అక్టోబర్ రోజుల్లో జాఫ్నాలోకి పోరా డుతూ చొచ్చుకుపోయిన ఐదు బ్రిగేడ్లలో ఒక దానికి నేతృత్వం వహించారు. ఆయన బ్రిగేడ్ అతి వేగంగా, తక్కువ నష్టాలతో జాఫ్నాకు చేరింది. ఆయన వ్యర్థ ప్రలాపాలు చేయని, పాత కాలపు సైనికుడు. నేటి తెల్ల మీసాల ప్రైమ్ టైమ్ కమెడియన్లకు అయన ఒక మినహాయింపు. ఈ మార్పు కార్గిల్తో ప్రారంభమైందని నేను అంటున్నాను. కార్గిల్తోనే మొదలైన పతనం కార్గిల్ కథనం లేదా యుద్ధం మూడు వారాల సార్వత్రిక ఖండనలతో మొద లైంది. పాకిస్తానీలు తామక్కడ లేమని ఖండించారు, మన సైన్యం వారు అంత లోతుగానూ, అంత విస్తృతంగానూ ఏమీ చొరబడలేదంటూ ఖండిం చింది. రక్షణ శాఖ సహా ప్రభుత్వం ఆ ఘర్షణ పర్యవసానాలను గ్రహించ లేదు. అందువల్లనే సీనియర్ జనరల్స్ కంటే ముందుగా మీడియా ప్రతిని ధులే అక్కడికి వెళ్లారు. ఇది అనుద్దేశపూర్వకంగానే ప్రత్యక్ష సైనిక చర్యల్లో పాలొంటున్న సైనిక బలగాలతో మీడియా ప్రతినిధులు భాగం కావడానికి దారి తీసింది. ఎవరూ పథకం పన్నకుండానే వారి మధ్య వ్యక్తిగతమైన, వృత్తిపరమైన బంధం అభివృద్ధి చెందింది. దాని ఫలితం ఉపయోగకరమై నదే... స్వతంత్ర పాత్రికేయులను, సెన్సార్షిప్లేని మీడియాను అనుమతి స్తోంది కాబట్టి భారత్ విశ్వసనీయత పెరిగింది. మన సైన్యం ప్రదర్శిం చిన నమ్మశక్యంకాని పరాక్రమం గురించిన కథనాలు దేశానికంతటికీ చేరడం వల్ల సైన్యం లాభపడింది. పాత్రికేయులకు కూడా ఆ ప్రతిష్ట కొంత అంటుకుంది. ఆ క్రమంలో కీలకమైన ఒక కథనానికి హాని జరిగినా ఎవరికీ పట్టలేదు... అంతమంది పాకిస్తానీలు అంత లోలోతులకు ఎలా చొచ్చుకు వచ్చి, పాతు కుపోయి కూర్చున్నారు? అది తెలుసుకోడానికి మనకు అంత ఎక్కువ కాలం ఎందుకు పట్టింది? విచారణ బృందాలను మనం అంత అర్థ మనస్కంగా (కాబట్టే చిన్న గస్తీ బృందాలు) ఎందుకు పంపినట్టు? భుజంపై నుంచి పేల్చే క్షిపణులకు అందే వైమానిక బలాన్ని పంపి రెండు విమానాలను ఎందుకు కోల్పోయాం? గుడ్డిగా నెలల తరబడి పాక్ చొరబాటును నిలువరించడంలో విఫలమైంది ఎవరు? ఈ చొరబాటు తీవ్రతను గ్రహించడంలో విఫలమైన వారంతా ఎవరు? ఇవేవీ పట్టని ఫలితంగానే, ఎవరి స్థానాలకూ ముప్పు రాలేదు. మన యువ సైనికాధికారులు, సైనికుల ప్రతాపాన్ని గురించి చెప్పే హక్కు మనకుంది. అయితే మన సైనిక వ్యవస్థ సైనిక విధులను నిర్లక్ష్యం చేయకపోయినా... అది చూపిన బ్రహ్మాండమైన అసమర్థతకు సంబంధించిన కథనం వెలుగు చూడకుండా పోయేలా చేయడానికి రాజకీయ, సైనిక వ్యవ స్థను మనం అనుమతించడం తప్పు. అర్హులైన పలువురు కార్గిల్ యువ సైనిక యోధులకు గాలంట్రీ అవార్డులు లభించాయి. కానీ ఉన్నత స్థానాలలో ఉండి తప్పు చేసిన వారు చాలా వరకు తప్పించుకున్నారు. ఈలోగా భారత మీడి యాకు చెందిన మనం బలాన్ని ద్విగుణీకృతం చేయగలవారంగా కీర్తించ బడ్డాం. ఆ ఆనందంలో మునిగిపోయాం. అదే సమయంలో మనం, జర్నలి స్టులం కూడా భారత యుద్ధ కృషిలో ఆవశ్యక భాగమని, బలాన్ని హెచ్చింప జేసే గుణకానిమనే చెడు పాఠాన్ని నేర్చుకున్నాం. మన పాత్రికేయులు నిజా నికి ఆ రెండూ కూడా కాగలరు. సత్వాన్వేషులై, సత్యాన్నే మాట్లాడుతుంటేనే అది సాధ్యం. అంతేగానీ డబ్బు పుచ్చుకున్న రిటైర్డ్ పాకిస్తానీ జనరల్స్పై గావు కేకలు వేయడం ద్వారానో, లేదా టీవీ స్టుడియోలను వార్ రూమ్స్గా మార్చే యడం ద్వారా మాత్రం జరగదు. ఎప్పుడూ కాస్త సంయమనాన్ని చూపే టీవీ చానళ్లు సైతం ‘‘మళ్లీ కాలుదువ్విన పాకిస్తాన్’’ అంటూ కశ్మీర్ హెడ్లైన్స్ను చూపాల్సిన దుస్థితి. ‘‘శత్రు’’ ప్రతినిధులుగా ఖండిస్తున్నా లెక్కచేయకుండా నిష్టుర నిజాలను చెపే సిరిల్ అల్మెడాలు, ఆయేషా సిద్దీఖాలు (ఇద్దరూ పాక్ పాత్రికేయులే) మనకు లేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మన జర్నలిజం స్వీయ వినాశం... భారత టీవీ స్టార్లు (చాలావరకు) స్వచ్ఛందంగా తమను తామే కమెడియన్లుగా కాకున్నా ప్రచారకర్తలుగా దిగ జార్చేసుకోడానికి సంబంధించిన కథనంలో పెద్ద భాగం. వాణిజ్యపరంగా అది ఫలప్రదమైనదనేది, ప్రతిదాన్ని ప్రశ్నించే సంశయవాదాన్ని తుడిచిపెట్టే యడం వారిని ఊరిస్తుంది. లేదంటే ఊహాత్మకతతో మిఠాయి లాంటి ఫార్ము లాను కనిపెట్టి ఎన్నటికీ మరువలేని పాత గబ్బర్ సింగ్ (షోలే)కు సమాన మైన నేటి టీవీ యుద్ధ యోధుని అవతారమెత్తి ‘‘కిత్నే పాకిస్తానే థే?’’ అనొచ్చు. జర్నలిస్టులను ‘బలాన్ని బహుళంచేసే గుణకం’’గా నిర్వచించడాన్ని కీలక వ్యాపార అంశంగా (కేఆర్ఏ) అంగీకరించడంతో ఇక సందేహానికి లేదా ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు. పాత కాలపు అశ్విక యోధునిలా ఇష్ట మొచ్చినట్టు వాగొచ్చు. అయితే అది శత్రువు ఉపగ్రహ కనెక్షన్కు అవతల ఉండగా ఇవతల సుఖప్రదంగా స్టుడియోలో కూచుని చేయొచ్చు. రెండుగా చీలిన పాత్రికేయ ప్రపంచం ఉడీ, తదుపరి ఘటనలే ఈ వాదనకు ప్రేరేపణ అనేది స్పష్టమే. అది మీడి యాను అత్యంత అసమానంగా చీలిపోయేట్టు చేసింది. ఒకటి, బాగా ఆధి క్యతను ప్రదర్శించే పక్షం. వారు ఏ ప్రశ్నలూ అడగకపోవడమే కాదు, ప్రభు త్వాన్ని, సైన్యాన్ని దాటేసి వారెన్నడూ చేయని ప్రకటనలను సైతం చేసేస్తారు. కాల్పనికమైన కమాండోల రాత్రి విన్యాసాల ‘‘ప్రాతినిధ్య’’ వీడియోలను వాటికి అండగా చూపిస్తారు, ఏ ఒక్కరికీ, నిజంగానే ఏ ఒక్కరికీ ఎలాంటి సాధికారతతో లేదా స్పష్టతతో మూడు వారాల క్రితం ఏం జరిగిందో తెలియదు. రహస్యాలను కాపాడటంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందో లేక పాత్రి కేయులు లీకుల గురించి వెతకడం మానేశారో గానీ ఇది నిజం. ఎందుకో మీరే చూడొచ్చు. మరోవైపున, చిన్నది, కుచించుకుపోతున్న మరో భాగంగా ఉన్న వారు నిత్య సందేహులు. ప్రభుత్వం చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే దాన్ని కొట్టిపారేస్తారు. వాస్తవాలు లేనిదే వారు వెల్లడించే కథనాలూ ఉండవు. ప్రభుత్వం, తను చెప్పేదానికి ఆధారాలు చూపాలని వారు కోరుతారు. ప్రభు త్వాలు వాస్తవాలను దాస్తాయని, పాత్రికేయులు వాటిని కనిపెట్టాలని జర్న లిజం స్కూలుకు వెళ్లిన ప్రతివారికీ బోధిస్తారు. అత్యంత ఉదారవాదులు, ఉత్తమ విద్యావంతులు, ప్రతిష్టగల, సుప్రసిద్ధ సెలబ్రిటీ పాత్రికేయులు అంతా ఈ నిత్య సందేహుల జాగాలో ఉన్నారు. ఆధారాలు లేకుండానే గరం గరం వార్తలు తేకుండా, పత్రికా సమావేశాలను కోరుతున్నారు. అవతలి పక్షం మన శత్రువు కాబట్టి మీరు చెప్పేదానికన్నా ఎక్కువ నేను నమ్ముతాను, నాకు ఆధారాలు అవసరం లేదు అంటోంది ఒక పక్షం. మరో పక్షం.. మీరు చెబుతున్న ఆ సైనిక చర్యను బహిర్గతపరచండి లేదా మీరు అబద్ధం ఆడుతు న్నారంటాం అంటోంది. భారతీయ జర్నలిజం స్వీయ వినాశనానికి ఎందుకు పాల్పడింది? అని నేను ఇక అడగాల్సిన పనే లేదు. శేఖర్ గుప్తా twitter@shekargupta -
రెండుసార్లు తలబొప్పి కట్టినా..
జాతిహితం ఇప్పుడు సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం చాలా తక్కువని నవాజ్కు తెలుసు. జరిగితే అది పాక్ ఏకాకితనాన్ని పరిపూర్తి చేస్తుంది. తిరుగుబాటు ఫలితంగా తలెత్తే అస్థిరత అరబ్బు దేశాలు, ఇరాన్, చైనాలు సహా ప్రపంచమంతటినీ భయపెడుతుంది. ఆ భరోసాతో నవాజ్ ఆర్మీ చీఫ్ రహీల్ పదవీ విరమణ వరకు తన క్రీడ తాను ఆడగలుగుతారు. ఏ గత్యంతరమూ లేని స్థితిలో, అధికార వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడుతున్న నేతగా నవాజ్ను మనం చూడాలి. అధీనరేఖను దాటి భారత సైన్యం జరిపిన దాడులు బీజేపీ, శివసేన ప్రముఖుల హోర్డింగ్ల తయారీలో ఉన్న చిత్రకారుల ఊహాత్మకతను బోలెడంత పెంచాయి. ప్రత్యేకించి త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో ఈ సృజన బాగా వెల్లివిరుస్తోంది. రామాయణాన్ని వస్తువుగా తీసుకుని తయారు చేసిన పోస్టర్లు బాగా సంచలనాన్ని రేపుతున్నాయి. దసరా రామ్లీలా వారంలో ఇది అర్థం చేసుకోదగిందే. ఇలాంటి చిత్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీరాముడు ట్రిగ్గర్ నొక్కనున్నడా అన్నట్టు విల్లంబులతో దర్శన మిస్తుంటే... పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పది తలలతో రావణునిగా కనిపిస్తున్నారు. మోదీని రామునిగా చిత్రీకరించడంపై ఏ వ్యాఖ్యానమూ అవసరం లేదు. అభిమాన నేతలకు దైవత్వాన్ని ఆపాదించే హక్కు అనుచరు లకుంది. గోస్వామి తులసీదాస్ అంతటివాడే... మీ స్వీయ భావోద్వేగాలు మలచిన రూపంలోనే మీరు భగవంతుడ్ని చిత్రీకరించుకుంటారు అన్నాడు. ఇక రెండవ చిత్రణతోనే నాకున్న పేచీ అంతా. నవాజ్ను ఒక రాక్షస చక్ర వర్తితో లేదా పాక్ను పురాణకాలం నాటి లంకతో పోల్చడాన్ని పట్టించు కోనవసరం లేదు. కాకపోతే వాస్తవాలకు సంబంధించే ఉంది అసలు పేచీ అంతా. రావణుడు తన సామ్రాజ్యంపై నిరపేక్ష అధికారంగల నియంత, అత్యున్నత సేనానాయకుడు, అగ్రశ్రేణి సైనిక యోధుడు. వాటికన్నిటికీ నవాజ్ ఎంతో దూరం. తులసీదాస్ చెప్పినది సరైనదే అయితే... రాక్షసులను, రాక్షస రాజులను కూడా ఊహించుకోవచ్చు. కానీ నవాజ్ ఆ పరీక్షలో ఎంత మాత్రమూ నెగ్గలేడని అత్యంత వినయంగా మనవి చేస్తున్నాను. ప్రతి శాంతి యత్నానికీ సైన్యం ప్రతిచర్య నేటి చర్చలు ఏ స్థాయిలో సాగుతున్నాయో దృష్టిలో ఉంచుకుంటే ఒక పాక్ నేతను, సైనికుడ్ని, చివరికి సినిమా నటుడ్ని ఎవరిని తెగనాడకుండా వదిలినా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అవుతుంది. ‘‘.. ఉగ్రవాదులు రాసిచ్చే స్క్రిప్టును చదివేవారు..’’ అంటూ మన ప్రధాని ఇప్పటికే పాక్ ప్రధానిపై తన అభిప్రాయాన్ని కొజికోడ్లో వెల్లడించారు. నవాజ్ ఇటీవల పాక్ నేషనల్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలతో ఆయన రాక్షసీకరణను మరో మెట్టుపైకి చేర్చింది. ఇమ్రాన్ ఖాన్ భారత్పై యుద్ధ ప్రకటన చేయడంలో కాస్త జాప్యం చేశారంతే. సైన్యం తన మాట విని నవాజ్ను తొలగించి తనను గద్దెపై కూర్చుండబెట్టే వరకు బహుశా వేచి చూస్తారేమో. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల ప్రచారం నుంచి బిలావల్ భుట్టో.. మునుపటి భుట్టో కుటుంబీకుల లాగే రంకెలేస్తున్నారు. అయినా నా దృష్టి నుంచి తప్పి పోయి ఉంటే తప్ప బిలావల్ తన తాత, తల్లి మాదిరి వెయ్యేళ్ల యుద్ధం చేస్తామని భయపెట్టలేదు. యుద్ధాన్ని తలపింపజేసిన 1990 వేసవిలో (ఊగి సలాడే వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోని భారత్పై పాక్ మొట్టమొదటిసారిగా అణు బ్లాక్మెయిలింగ్ పాల్పడినప్పుడు) అతని తల్లి నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ను ముక్కలు ముక్కలుగా చేస్తామని బెదిరించింది. ఆమె మాటల్లోనే ‘‘జగ్మోహ న్ను మేం జగ్– జగ్–మో–మో–హన్ –హన్గా చేసేస్తాం...’’ జియా ఉల్ హఖ్ అనంతర కాలంలో పాక్కు ప్రజాస్వామ్యం ‘‘తిరిగి వచ్చిన’’ప్పటి నుంచి ప్రజలు ఎన్నుకున్న నేతల తీరు భారత్పైకి కాలు దువ్వేదిగానే ఉంటోంది. ఒక దశలో పాక్ ప్రధానులు తమ పదవీ కాలం మొదట్లో భారత్ పట స్నేహపూర్వక చర్యలు చేపట్టకపోలేదు. ఇస్లామాబా ద్లో 1988 డిసెంబర్లో బెనజీర్–రాజీవ్ల శిఖరాగ్ర సమావేశం, నవాజ్– వాజ్పేయి బస్సు ప్రయాణం, 1999 లాహోర్ ప్రకటన, ఆ తదుపరి భారత్ పట్ల రాజీవాద వైఖరిని ప్రదర్శిస్తున్న బెనజీర్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం, 26/11 ముంబై దాడుల తదుపరి అసిఫ్ జర్దారీ అసాధారణ రీతిలో తమ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతిని భారత్కు పంççపడం, దాడికి పాల్పడినవారు పాకిస్తానీలేనని పాక్ జాతీయ భద్రతా సలహాదారు మొహమూద్ దుర్రానీ ధైర్యంగా అంగీకరించడం వంటి పరిణా మాలను గమనించండి. ప్రతి ఒక్కటీ వెంటనే పర్యవసానాలకు దారితీశాయి: 1990లో బెనజీర్ భుట్టోను పదవి నుంచి తొలగించడం, 1999లో నవాజ్ పదవీచ్యుతుడై ప్రవాసానికి పోయేలా చేయడం, 2007లో బెనజీర్ను హత్య చేయడం, దుర్రానీని ఎన్ఎస్ఏగా తొలగించి, జర్దారీని పక్కకు తోసేయడం జరిగాయి. అంతా సామాన్యమైన ఒకే క్రమం, మినహాయింపులు లేవు. అధికారంలో ఉన్న నిస్సహాయ నేత మోదీ పుట్టిన రోజున ఆతిథ్యం ఇచ్చినందుకు నవాజ్ నెత్తిన ఏదో విపత్తు వచ్చిపడుతుందని ఊహించలేకపోతే అది మన మూర్ఖత్వమే అవుతుంది. గురుదాస్పూర్, ఆ తదుపరి పఠాన్కోట దాడులు జరిగాయి. జైషే అహ్మద్పై నవాజ్ విచారణకు ఆదేశించడంతోనే కశ్మీర్ లోయలో ఉగ్ర క్రీడ ప్రారం భమైంది. ఈ దఫా నవాజ్ పదవీ కాలం మొదట్లోనే తొలి ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. నియంత ముషార్రఫ్కు వ్యతిరేకంగా ఆయన సాగించిన ప్రచారం, పాక్లో మొట్ట మొదటిసారిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం (జర్దారీ) పూర్తి కాలం అధికారంలో ఉండటానికి సహకరించి చూపిన విజ్ఞతల ఫలితంగా నవాజ్కు భారీ ఎత్తున ప్రజల మద్దతు లభించింది, నేషనల్ అసెంబ్లీలోని పూర్తి ఆధిక్యతను, ప్రజాభిమానం వెల్లువను ఆధారంగా చేసు కుని ఆయన దేశ రాజకీయ వ్యవస్థలో, భారత్తో సంబంధాలలో మౌలిక మైన మార్పులు తేవడానికి ఆయన మహా ఉత్సాహం చూపారు. భారత్కు వ్యతిరేకంగా లేదా కశ్మీర్ను ప్రస్తావిస్తూ ఒక్క మాటైనా మాట్లాడకుండా నవాజ్, ఆయన తమ్ముడు షాబాజ్లు భారీ ఆధిక్యతలను సాధించారు. ఎట్ట కేలకు తనకు అవకాశం లభించిందని నవాజ్ అనుకున్నారు. 1965–71 సుప్ర సిద్ధ యుద్ధ యోధుల కుటుంబాల వారసత్వం, వృత్తితత్వం గల పంజాబీ ఆర్మీ చీఫ్ను ఆయనే ఎంచుకున్నారు. అదే ఉత్సాహంతో ఆయన, ముషా ర్రఫ్ను దేశద్రోహ నేరానికి బోనెక్కించడానికి ఉపక్రమించారు. కానీ వ్యవస్థా పరంగా ఇది సైన్యానికి, పాత అధికార వ్యవస్థకు ఆమోదనీయమైనది కాదు. దీంతో ఆయనపై వచ్చిన ఒత్తిడికి ముషార్రఫ్ను వదిలిపెట్టేయడమే కాదు, సురక్షితంగా దేశం వీడిపోనివ్వాల్సి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ను, కెనడి యన్ పాకిస్తానీ మతపెద్ద తాహిర్ ఉల్ ఖద్రీలను ఈ తెరవెనుక తిరుగుబాటుకు కుట్రదారులు నవాజ్కు వ్యతిరేకంగా రెండు పనిముట్లుగా వాడుకున్నారు. ఇస్లామాబాద్లోని ప్రభుత్వాధికార కేంద్రాన్ని దిగ్బంధించి, సైన్యం ఇక వదిలి పెట్టేయమని ‘‘విజ్ఞప్తి’’ చేసే వరకు వారు కదల లేదు. క్షీణించిపోతున్న నవాజ్ ప్రాబల్యానికి నిదర్శనం అతని నిస్సహాయతే. ఆ గందరగోళపు నెలల్లోనే పెషావర్లో సైనికాధికారుల పిల్లల ఊచకోత జరిగింది. అది దేశాన్నం తటినీ సైన్యం వెనుక, దాని అధిపతి వెనుక సమీకరించింది. మొహజిర్ ఖ్వామీ ఉద్యమం (ఎమ్క్యూఎమ్), కరాచీలోని దాని సాయుధ మాఫియా లపై జరిపిన దాడులను సైన్యం దాదాపు స్వయంప్రతిపత్తిని చూపింది. అది నవాజ్ ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేసే ప్రక్రియను పూర్తి చేసింది. నవాజ్ ఇక తన క్రీడ తాను ఆడగల కాలం ఇంతకు ముందు రెండు పర్యాయాలూ నవాజ్ పదవీ కాలం సైన్యం చేతుల్లో అర్ధంతరంగానే ముగిసింది. ఈసారి ఆయన అధికారంలో ఉన్నా ప్రాధా న్యమేం లేని నామమాత్రపు ప్రధానిగా తానుండగా, అధికారం మరెక్కడో ఉన్న దుస్థితి. 1985 నుంచి నేనాయన రాజకీయాలను సన్నిహితంగా గమ నిస్తున్నాను, ఆయన ఇలాగే తలవంచుకుని, మరో మూడేళ్లు ఈ అవమానాన్ని భరిస్తారంటే నేను నమ్మను. ఆయన ఏదో ఒకటి చేస్తారు. అందుకే, పాకిస్తాన్ ఏకాకి కాకుండా ఉండాలంటే... వెనుక పెరట్లో పాములను (భారత్, పాక్ లలో పనిచేసే ఉగ్రమూకలు) పెంచి పోషిస్తూ, ముందు చావిట్లో కొట్టే ప్రస్తుత వైఖరి పనికిరాదని షరీఫ్ సోదరులు సైన్యంతో చెప్పారనడాన్ని కొట్టిపారేయ లేను. సిరిల్ అల్మెడా పాక్ పత్రిక ‘డాన్’లో ఆ వార్తా కథనాన్ని వెలువరిం చారు. నేడు ఆ దేశానికి చైనా ఒక్కటే నమ్మకమైన మద్దతుదారుగా ఉంది. సున్నీ ఇస్లామిక్ ప్రపంచం సైతం దానితో విసిగి పోయింది. ఒక ప్రపంచ శక్తిగా చైనా రష్యాకు భిన్నంగా వ్యవహరిస్తోంది. మసూద్ అజర్ను ప్రపంచ మంతా అవాంఛనీయమైన వ్యక్తిగా భావిస్తోంది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి విడుదలైన ఆ ఉగ్రవాది కోసం వీటో అధికారాన్ని ప్రయోగించడానికి చైనా సిద్ధపడదు. సిరిల్ కథనానికి అధికారిక ఖండన అసక్తికరమైనదని. అది ఆ కథనాన్ని కాల్పనికమైనదని, అర్థసత్యమని పేర్కొంది. దాన్ని అర్థ సత్యంగానే తీసుకుందాం. నవాజ్ను 1993లో, 1999లో తేలికగానే కూలదోయగలిగారు. నేడు ఆయన వద్ద ప్రయోగించడా నికి అస్త్రాలు లేకపోలేదు. 2016–17లో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం చాలా తక్కువని ఆయనకు తెలుసు. జరిగితే అది పాక్ ఏకాకితనాన్ని పరిపూర్తి చేస్తుంది. తిరుగుబాటు ఫలితంగా తలెత్తే అస్థిరత అరబ్బు దేశాలు, ఇరాన్, చైనాలు సహా ప్రపంచమంతటినీ భయపెడు తుంది. పూర్తి అణ్వస్త్రభరితమైన ఉపఖండం మరో ఐఎస్ఐఎస్ ప్రాంతంగా మారిపోతుందేమోననే ఊహే భయం గొలుపుతుంది. ఈ ఆలోచన ఇచ్చే భరోసాతో నవాజ్, ఆర్మీ చీఫ్ జన రల్ రాహీల్ షరీఫ్ పదవీ విరమణ వరకు తన ఆట తాను ఆడగలుగుతారు. అమెరికా, పాశ్చాత్య శక్తులు సైతం సైనిక పాలనకు సుముఖంగా లేవు. కాబట్టి అవి నవాజ్కు దన్నుగా నిలుస్తాయి. సైన్యం దన్నుతో అధ్యక్షుడు ఇశ్లాఖ్ ఖాన్ 1993లో తనను పదని నుంచి తొలగించిన సందర్భంగా నవాజ్ ‘‘ఇదే రకం వ్యవస్థ సగం కౌజు పిట్ట, సగం పూరేడు పిట్ట’’ అంటూ పంజాబీ నానుడిని ప్రయోగించి ప్రశ్నించారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక దాన్ని సరిదిద్దుతామన్నారు. కానీ కార్గిల్లో, జైల్లో, ప్రవాసంలో చిక్కుకున్నారు. నాకు తెలుసు, ఆయన మూడోసారి కూడా ప్రయత్నిస్తారు. ఏ గత్యంతరమూ లేని స్థితిలో, అధికార వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాటుతున్న నేతగా నవాజ్ను మనం చూడాలి. సర్వశక్తివంతుడైన రావణుడు కావడానికి లేదా మూర్తిభవించిన దుష్టత్వం కావడానికి ఆయన ఇంకా చాలా చాలా దూరంలో ఉన్నారు. వ్యాసకర్త : శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘అయినప్పటికీ’ ఆడి వచ్చాం!
జాతిహితం ఇలాంటి అనుభవాన్ని మీ చుట్టూ ఉన్న జీవితం నుంచి మీరు ఎన్నో గమనించవచ్చు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు చోటుచేసుకున్న ఉదంతాలలో ఒకటి వాటిలో చెప్పుకోదగిన దనిపిస్తుంది. అప్పుడు సైన్యం తక్కువైందని అనేవారు. అయినా మనకు ఉన్న బలంతోనే మేం పోరాడతాం అంటూ నాటి సైన్యాధ్యక్షుడు వీపీ మాలిక్ పేర్కొన్నారు. అయితే ఒకటి, భారత దళాలకు కల్పించిన వసతులు పాకిస్తాన్ సైన్యం కంటే కనాకష్టంగా ఏనాడూ లేవు. ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం కార్గిల్లో విజయం సాధించాం. సామాన్యత మీద మన భారతీయులకి ఉన్న సమష్టి ఆపేక్ష అలాంటిది మరి! పైగా ఆ సామాన్యతని సమర్ధించుకోవడానికీ, దానిని వ్యక్తం చేయ డానికీ అవసరమైన ప్రతిభా సామర్ధ్యాలను సంతరించుకోవడానికి ఇంగ్లిష్ భాషను నమ్ముకుంటాం కూడా. ఇంగ్లిష్లో ‘ఇన్ స్పైట్ ఆఫ్’ అన్న ప్రయోగం ఉంది (అంటే ‘అయినప్పటికీ’). దీనిని మనం ధారాళంగా ప్రయోగిస్తూనే ఉంటాం. ఆ పద ప్రయోగం ఉన్నదే మన కోసమే అన్నట్టు భావిస్తాం. అందుకోసం ‘ఇన్స్పయిట్ ఆఫ్’ అంటూ మనదైన ఒక ఉచ్ఛారణని కూడా సొంతం చేసుకున్నాం. రియో ఒలింపిక్స్ తరువాత గడచిన రెండు వారాలుగా ‘ఇన్ స్పైట్ ఆఫ్’ (నన్ను మాత్రం ఆ మాట అసలు రూపంతో ఉచ్చరించడానికి అను మతించాలి) అనే పదబంధం మీద మనకున్న లౌల్యం ఎంతటిదో క్రీడా రంగం ద్వారా తిరుగులేకుండా రుజువైంది. రియోలో మనం సాధించినవి చాలా పరిమిత విజయాలే. ఒక రజిత పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆశించడానికి కూడా వీలులేని ఒక విభాగం (జిమ్నాస్టిక్స్)లో నాలుగో స్థానం వచ్చింది. పురుషుల మారథాన్ పరుగు పందెంలో ఇద్దరు చూపిన ప్రతిభ తప్ప, మిగిలిన విభాగాలు వేటిలోనూ మన చిరునామా లేదు. ఇదే మారథాన్ మహిళల విభాగంలో ఒక అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల మారథాన్ పరుగు పందెంలో 157 మంది పాల్గొంటే భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారిణికి 89వ స్థానం లభించింది. ఆమె రియో ఒలింపిక్స్కు ఎంపిక కావడానికి భారతదేశంలో స్థాపించిన రికార్డు సమయం కంటే 13 నిమిషాలు వెనుకపడింది. అయినా ఆ స్థానం లభించడం గొప్ప. ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత, పరుగు తీస్తున్నంత సేపు తనకు మంచినీరు అందించలేదని ఆరోపించారు. గొంతెండిపోయి ప్రాణం పోయి నంత పనైంది. చూడబోతే ఇది పూర్తిగా విశ్వసించదగిన ఆరోపణే. ఇందుకు ఎలాంటి దర్యాప్తులు అవసరం లేదు. ఆమె చూపిన ప్రతిభ కూడా శంకించ లేనిది. చూడండి! భారత క్రీడాకారుల వాస్తవ చిత్రం ఇది. మంచినీళ్లు కూడా అందించని నిర్వాహకుల క్రూర నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తున్నది. ‘అయినప్ప టికీ’ ఆమె ఆ పరుగు పందాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. పోటీ కడదాకా నిలిచారు. ఈమెతో పాటు రేస్లో పాల్గొన్న మరొక మహిళ తాను రెండు కిలోమీటర్ల వెనుక పడినా నీటి కొరతను ఎదుర్కొనలేదని చెప్పారు. ఇది కాదు కథ. ఈ కథలో ‘అయినప్పటికీ’ అన్న ప్రధాన దినుసు లేదు. ఈ పదబంధాన్ని మిగిలిన విభాగాలలో ఎదురైన వైఫల్యాలకి విరివిగానే ఉపయోగించారు. మన షూటర్లకు అవసరమైన ప్రత్యేకమైన ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకోవడానికి అక్కడ నిరాకరించారు. అయినా వారు ఏదో కొద్ది సాధించారు. మన రెజ్లర్లకు సరైన ఏసీ సౌకర్యం కలిగిన బస ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ వారు పోటీ పడ్డారు. జిమ్నాస్ట్ విభాగంలో పాల్గొన్న బాలిక దేశ ప్రజల దృష్టిలో ఒక కథా నాయికగా నిలబడింది. మనకి ప్రొడునోవా (కళాత్మక విన్యాసాలు)ను పరిచయం చేసింది. ఆమెకు కూడా సరైన సౌకర్యాలు కల్పించకపోయినప్పటికి ఒక బాల ప్రజ్ఞాశాలిగా నిలబడింది. అయితే ఆమె అక్కడ మౌలిక వసతులకు లోటు లేదని, లేదా వాటిని తాను పొందలేదని చెప్పననిఅంటూనే ఉన్నారు. తమకు అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే తాము పతకాలు తెచ్చేవారమని మన క్రీడాకారులు ఎవరైనా డంబాలు పలికినా వాటిని మనం నమ్మి ఉండేవారం కాదు. సామాన్యతకు సంబంధించి స్థిరమైన అలంకారం క్రీడలలోనే లభ్య మవుతుంది కాబట్టి నేను ఆ రంగం మీదే దృష్టి పెట్టాను. Ðð క్కిరించే తరహాలో వ్యాఖ్యలు చేయడానికి ప్రసిద్ధిగాంచిన అమెరికా మెయిల్ ఆన్లైన్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్కు ఆ వ్యాఖ్య చేసినందుకు కృతజ్ఞులమై ఉండాలి. 120 కోట్ల జనాభా ఉన్న దేశానికి కేవలం ఓడిపోయినందుకు ఇచ్చే రెండు పతకాలు దక్కాయని ఆయన వ్యాఖ్యానించాడు. అలా గురకపెడుతున్న సింహాన్ని రెచ్చగొట్టాడు. ఆ వ్యాఖ్యను ఖండించడానికి మనం చేయవలసినదంతా చేశాం. ఆ మాట ఎలా ఉన్నా నా కంటే వయసులో చిన్నదైన నా సహాధ్యాయి ఒక ప్రశ్న వేశారు. ఆమెకు నా కంటే ఎక్కువగానే క్రీడల గురించి తెలుసు కూడా. ఆ ప్రశ్న చాలా చెబుతోంది. ఆ వ్యాఖ్యలు చేసిన మోర్గాన్కు వెర్రా? ఓడిపోయినందుకు ఇచ్చే పతకాలు అంటే అర్థం ఏమిటి? అని ఆమె నన్ను ప్రశ్నించింది. ఓడిపోయి నందుకు ఇచ్చే పతకం అంటే స్వర్ణ విజేత మీద ఓడినందుకు ఇచ్చినది. అందుకే దాని గురించి ఎక్కడా ప్రస్తావన ఉండదు. మనం రెండు పతకాలు గెలిచాం. వ్యవస్థ ఎలా ఉన్నా వాటిని మనం గెలిచాం. ఈ విషయం మీద కాస్త విజ్ఞతతో మాట్లాడిన మన దేశీయుడు పీవీ సింధు కోచ్ గోపీచంద్ మాత్రమే. ఎన్డీటీవీతో మాట్లాడినప్పుడు ఆయన, వచ్చినది స్వర్ణ పతకం కాకపోవడం నిరాశపరిచిందని, ఒక మంచి అవకాశం కోల్పోయామని అన్నారు. నిజానికి క్రీడల పోటీ ప్రపంచానికి సంబంధించినది కాబట్టి నేను వాటినే తీసుకుని ఉత్ప్రేక్షతో చెబుతున్నాను. అక్కడ జరిగిన ప్రదర్శనల గురించి ఎలాంటి శషభిషలు లేని అంకెల రూపంలో వివరిస్తారు. క్రీడలలో విజయం సాధించ లేకపోవడానికి మన భారతీయులం కుంటిసాకులు వెతికినట్టే, అక్కడ కని పించే పోటీతత్వానికీ, ఆడే తీరుకీ ప్రత్యేక నైపుణ్యం అవసరమన్న వాస్తవాన్ని గ్రహించడం అవసరం. అన్ని రంగాలలోను సామాన్యత్వాన్ని అతి సులభంగా ఆశ్రయించడం భారత్కు ఉన్న శాపం. విద్యారంగం, పరిపాలన, విజ్ఞానశాస్త్రం, వ్యాపారం ఆఖరికి సైన్యంలో కూడా కుంటి సాకులు చెప్పడం కనిపిస్తుంది. ఒక పరీక్షలో ఉన్నత స్థానం సాధిస్తే దానిని మనం విద్యాపరమైన నైపుణ్యంగా పేర్కొంటాం. ఆ పరీక్ష రాసిన తరువాత మంచి ఉద్యోగావకాశం ఇవ్వగల పెద్ద సంస్థలో ప్రవేశించాలి. పెళ్లి మార్కెట్లో మంచి రేటు పలికి మంచి జీవితం గడపాలి. ఈ సూత్రాన్ని పాటించని అభ్యర్థుల మీద ఈ మధ్య బొంబాయి ఐఐటి నిషేధం విధించింది. ఇలాంటి పని ఈ మధ్య కొందరు కొత్తగా చేరిన అభ్యర్థులు చేశారు. స్వాతంత్య్రం తెచ్చుకోవడానికి ముందున్న తరం కాకుండా, లేదా భాభా, విక్రమ్ సారాభాయి తరం తరువాత పదునైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మనకి ఉన్నారని. ప్రపంచమంతా గుర్తించిన పేటెంట్ హక్కు కలిగిన వస్తువును కనుగొన్నారని చెప్పుకొని సంతోషించగల సాంకేతిక నిపుణులు లేనేలేరు. అయితే బోస్ స్పీకర్లు ఇందుకు మినహాయింపు. ఆ తరువాత భారత్ ఎలాంటి బ్రాండ్లు ఆవిష్కరించకుండానే, దాదాపు ఎలాంటి యాజమాన్య స్థాయి లేకున్నా కేవలం ఔట్సోర్సింగ్తోనే సాఫ్ట్వేర్ రంగంలో బలమైన శక్తిగా ఆవిర్భవించిన సంగతి ప్రపంచానికి చాటాం. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెలికాం మార్కెట్. అలాగే టెలికామ్ సేవలను వినియోగించుకునే అతి పెద్ద మార్కెట్ కూడా. అయితే దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్ పట్టభద్రులు, వేలాదిగా ఉన్న ఐఐటియన్లు అసలు సిసలు మొబైల్ ఫోన్ నమూనాలను ఎప్పుడూ రూపొందించలేదు. కనుగొనడం లేదా ఉత్పత్తి చేయడం కూడా చేయలేదు. కానీ చైనా, కొరియా యువతరం ఆ పని చాలా కాలం నుంచి చేస్తోంది. ఎందుకంటే వారి ముందు ప్రధానంగా ఉన్న సవాలు కేవలం ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించుకోవడం లేదా దానితో వచ్చే ఉద్యోగం మాత్రమే కాదు. అయితే ఇక్కడ మాత్రం సామాన్యతనే అతి సులభంగా ఆశ్రయిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 1960ల నాటి క్షిపణి శాస్త్రంలో దేశమంతటికీ హీరోగా నిలిచారు. అది భారత్కు నిజమైన విజయం. మరి సైన్స్లో ఇలాంటి విజయం ఎక్కడ? ప్రపంచం ఎంతో ముందుకు వెళ్లినా ఇస్రో ఇప్పటికీ తన పీఎస్ఎల్వీతోనే కాలక్షేపం చేస్తున్నది. ఆయా దేశాలు పశ్చిమ దేశాల ప్రతి కూలత నేపథ్యంలో కూడా ఆ ప్రగతినంతా సాధించగలిగాయి. ఒలింపిక్స్లో పాల్గొన్న దేశాలు తలా ఒక్కంటికి ఎన్ని పతకాలు సాధిం చాయో తరువాత చర్చ జరిగింది. పతకాల జాబితాలో భారత్ అట్టడుగునే ఉండిపోయింది. కనుగొన్న వస్తువులు, పేటెంట్లు వంటి వాటి విషయంలో దేశాలు సాధించిన విజయాల జాబితాను తయారుచేసినా, మన లక్షలాది ఇంజనీర్లు, సైన్స్ పట్టభద్రులు మన దేశ స్థానాన్ని ఆ జాబితాలో చిట్టచివరకే పరిమితం చేస్తారు. కానీ వీరంతా అనేక అవరోధాల ఉన్నప్పటికీ తమ డిగ్రీలను మాత్రం సాధించుకుంటారు. ఉద్యోగ అర్హత సాధించా మంటారు. ఇక్కడే ప్రఖ్యాత వ్యంగ్య రచయిత పీజే ఒరూర్కే రాసిన ఒక విషయం గురించి గుర్తు చేస్తాను. ఆయన ఇండియాలో పర్యటిస్తూ కోల్ కతాలో దిగినప్పుడు ‘ది టెలిగ్రాఫ్’లో వచ్చిన ఒక వార్తను బట్టి ఈ చురక వేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్సు పట్టభద్రులు ఉన్న దేశం భారత్ అంటూ ది టెలిగ్రాఫ్ మొదటి పేజీలో ఒక వార్త వెలువడింది. తరువాత పీజే జనరల్ పోస్టాఫీసుకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బల్లల మీద కూర్చుని ఎందరో ఉత్తరాలు రాయడం కనిపించింది. అంటే నిరక్షరాస్యులైన వారికి ఉత్తరాలు రాస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సైన్స్ పట్టభద్రులు ఉన్న దేశంలో ఈ రాత లేమిటని పీజే అడిగారు. అందుకు ఇది సమాధానం కావచ్చు. దేశంలో చాలామంది నిరక్ష రాస్యులు ఉన్నప్పటికీ మనం ఎందరో సైన్స్ పట్టభద్రులను కూడా కలిగివున్నాం. ఇలాంటి అనుభవాన్ని మీ చుట్టూ ఉన్న జీవితం నుంచి మీరు ఎన్నో గమనించవచ్చు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు చోటుచేసుకున్న ఉదం తాలలో ఒకటి వాటిలో చెప్పుకోదగిన దనిపిస్తుంది. అప్పుడు సైన్యం తక్కు వైందని అనేవారు. అయితే మనకు ఉన్న బలంతోనే మేం పోరాడతాం అంటూ నాటి సైన్యాధ్యక్షుడు వీపీ మాలిక్ పేర్కొన్నారు. అయితే ఒకటి, భారత దళాలకు కల్పించిన వసతులు పాకిస్తాన్ సైన్యం కంటే కనాకష్టంగా ఏనాడూ లేవు. ఎన్నో అవరోధాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం విజయం సాధించాం. మళ్లీ క్రీడల దగ్గరకి వద్దాం. రియోలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన మన ఏడుగురు క్రీడాకారులు (పతకాలు తెచ్చిన ఇద్దరు సహా) మామూలుగా వారికి ఉన్న సీడింగ్ని బట్టి చూసినా అసాధారణమైన ప్రతిభాపాటవాలనే ప్రదర్శించారు. గొప్ప ప్రతిభను ప్రదర్శించాలన్న తృష్ణ వారందరిలోనూ కనిపించింది. పదో నెంబర్ సీడ్గా ఉన్న మన క్రీడాకారిణి పోటీలో రెండో నెంబర్ సీడ్గా ఉన్న క్రీడాకారిణిని ఓడించింది. తుది మ్యాచ్లో ఒకటో నెంబర్ సీడ్తో తలపడింది. మన రెజ్లర్ చూపిన ప్రతిభ కూడా అద్భుతం. 0.5 స్కోరుతో వెనుకబడినప్పటికీ చివరి ఎనిమిది సెకన్లలో ఆ స్కోరును తలకిందులు చేసి పతకం గెలిచిందామె. దీనిని బట్టి చూస్తే బుడిబుడి ఏడుపులు వినిపించే వాళ్లు కొద్దిమందే. బాధపడిన వారు ఎవరంటే చక్కని ప్రతిభను ప్రదర్శించినా పతకం రానివాళ్లు. కాబట్టి భారతీయుడు కాని మోర్గాన్ చేసిన వ్యాఖ్య సబబైనదే. శేఖర్ గుప్తా -twitter@shekargupta -
నిరశన ఫలితం ఏమిటి?
జాతిహితం అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. వీరిలో ఎవరూ అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు. ఇరోమ్ షర్మల కథలో ఇటీవల వచ్చిన మలుపు, అరవైల నాటి దేవానంద్ నిర్వచనాత్మక సినిమా గైడ్ను ఎందుకు గుర్తుకు తెస్తోంది? ఇక్కడ దిగ్గజం అన్న మాటలకు బదులు నిర్వచనాత్మక అన్న పదమే ప్రయోగిస్తున్నాను. ఎందుకంటే ఆ అలంకారాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించారు. అజ్మీర్ దర్గా ప్రస్తావన దగ్గర కూడా ఆ రూపకాలంకారాన్నే ఉపయోగించిన దరిమిలా నేను నా న్యూస్రూమ్నుంచి దానిని నిషేధించాను. మనందరం అరవైలలో పుట్టిన వాళ్లమే కాబట్టి గైడ్ చిత్రమే గుర్తుకు రావాలి. అరవైయ్యో దశకం సంక్షుభితమైనది. అంతేకాదు, రాజకీయాల మీద ఆమరణ నిరాహారదీక్షల ముద్రను కూడా వదిలివెళ్లింది. ఆర్కె నారాయణ్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో నిర్మించిన సినిమా గైడ్. అందులో దేవానంద్ తన ప్రియురాలు వహీదా రెహమాన్ను దగా చేసినందుకు, ఆమె సంతకాలను ఫోర్జరీ చేసినందుకు జైలుశిక్ష అను భవించి తరువాత ఇంటికి వెళ్లడానికి సంకోచిస్తాడు. మహరాష్ట్రలో తరుచు దుర్భిక్షాలకు గురయ్యే ఒక గ్రామంలోని ఆలయంలో తలదాచుకుంటాడు. ఆ గ్రామీణులు అతడిని చూసి ఆ యువ సాధువు, వర్షం కురిపించడానికి తమ గ్రామానికి దేవుడు పంపించినవాడిగా భావిస్తారు. అయితే అతడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటేనే వానదేవుడు కరిగి జల్లులు వర్షిస్తాడు. ఇంతకీ గ్రామీణులు తాము విన్న ఒక జానపద కథ ఆధారంగా ఇలాంటి భావనకు వస్తారు. అయితే దేవానంద్– అంటే ఆ సినిమాలో పాత్ర రాజు; తాను ఎంతమాత్రం దైవం పంపించిన వాడిని కాదనీ, పైగా శిక్ష పడినవాడిననీ మొత్తుకుంటాడు. అయినా ఎవరూ విశ్వసించరు. చివరికి బలవంతంతో ఇష్టం లేకపోయినా నిరాహార దీక్షకు దిగుతాడు. మధ్య మధ్యలో వచ్చే బలమైన ఫ్లాష్బ్యాక్లలో రాజు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. నిజానికి అతడు జీవించాలని కోరుకుంటాడు. ఆఖరికి తన ఎదురుగా ఉంచిన దేవుడి ప్రసాదాన్ని తస్కరించడానికి కూడా వెనుకాడడు. అది తప్పు అని తెలిసినా ఆ చాపల్యం నుంచి తప్పించుకోలేక పోతాడు. ‘ఆ మేఘాల మనసులో ఉన్నదానికీ, దహిస్తున్న నా ఆకలికీ సంబంధం ఎందుకు ఉండాలి?’ అని ఒక సందర్భంలో తనలో తాను మాట్లా డుకుంటూ అనుకుంటాడు. అతడు హీరో కాబట్టి జానపద కథను నిజం చేస్తూ సరిగ్గా సమయానికి వర్షం కురుస్తుంది. ఇదంతా అర్థ శతాబ్దం నాటి ఘట్టం. ఇదంతా ఒక సినిమా దశ్యం. కానీ కాలం మారిపోయింది. మంచి ఆశయాలు కలిగిన వారు, పరిస్థితులకు బలైనవారు, సామాజిక ఒత్తిడులతో ఉన్నవారు, కీర్తి కండూతితో ఇప్పటికి కొందరు ఆమరణ నిరాహార దీక్ష పేరుతో అలాంటి బలవంతపు నిరశన వ్రతాలకు తలొగ్గి, ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అన్నా హజారే దీనినే అన్షాన్ అంటారు. అయితే ప్రాణాలు పోగొట్టుకోవడం వీరిలో ఎవరికీ ఇష్టం లేదు.Sసరిగ్గా ఇలాంటి ఆలోచనే షర్మిలకు వచ్చింది. చెదిరిన జుట్టు, ముక్కు పుటాల గుండా వెళ్లే గొట్టం, ఒడిలిన ముఖంతో ఉండే షర్మిల ఒక లక్ష్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. అది చెప్పుకోదగిన లక్ష్యమే. ఇంకా చెప్పాలంటే ఆ ఒక్క కారణంతోనే మొత్తం కెరీర్ను మలుచుకున్న వారికి కూడా గొప్ప లక్ష్యమే. అలాంటి ఉద్యమకారులు, పౌర హక్కుల ఎన్జీవో సంస్థలు, పూర్తి సమయం, ఒకే అంశం తప్ప మాట్లాడని టీవీ వ్యాఖ్యాతలు తమ తమ టీవీ కార్యక్రమాలకు, అవార్డులు ఇవ్వడానికి ఆమెను పిలుస్తూ ఉంటారు. వీళ్లంతా కూడా షర్మిల ఆ కార్యక్రమాలకు అలా చెదిరిన జుట్టుతో, ముక్కులో గొట్టంతో, ఒడిలిన ముఖంతోనే రావాలని కోరుకుంటారు. అయితే ఇదే లక్ష్యంతో పనిచేస్తూనే సాధారణ ముఖంతో కనిపిస్తే చాలా కారణాల వల్ల వారికి ఆమె అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ముక్కులో గొట్టాలు పోయాయి. దాంతో ఇప్పుడు షర్మిలకు ఉన్న బ్రాండ్ విలువ పోయింది. తనను తాను చంపుకుంటున్నంత కాలం ఆమె బ్రాండ్కు చాలా విలువ ఉంది. ఇప్పుడు ఆమె ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటున్నారు. మణిపూర్ ముఖ్య మంత్రి పదవిని చేపట్టి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి తన ఆశయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎంత బోరుగా ఉంది! సాయు«ద దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న వాస్తవం తెలియనంత మూఢురాలా షర్మిల? లేదా మన ఊహకు అందని తెలివితేటలతో ఆలోచిస్తున్నదా? తమ పొరుగునే ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి కేంద్రంతో కలసి పనిచేస్తూ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయించేందుకు కషి చేస్తున్న సంగతయినా ఆమె పేపర్లలో చదివి తెలుసుకున్నారా? షర్మిల అభిమానులు, ఆమె మీద పొగడ్తలు కురిపిస్తున్నవారు, ఆఖరికి ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఆ భ్రమలో ఉంచినా, ఆ అంశం మీద పోరాడుతున్నది తాను మాత్రమే కాదన్న సంగతి షర్మిల తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిరశన దీక్ష ఒక ఆయుధంగా మారినప్పటి నుంచి దీనిని తెలివైన వాళ్లు, పదవీ వ్యామోహపరులు స్వప్రయోజనాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తే హిందీలో ఒక నినాదం గుర్తుకు వస్తుంది. ‘తుమ్ సంఘర్ష్ కరో, హమ్ తుమ్హారే సాత్ హై’ (నీవు ప్రాణాలు ఫణంగా పెట్టు. మేం నీ వెంటే ఉంటాం. ఇంతలోకి డొమినోస్ నుంచి ఒక పిజ్జా తెప్పించు. దానితో పాటు అదనపు చీజ్, డైట్కోక్ కూడా తెప్పించు). ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను చెప్పుకుందాం. అవి రెండూ కూడా గూగుల్ అనంతరకాలానికే కాదు, ఉపగ్రహ టీవీ యుగానికి తరువాత కాలానికి చెందినవి. ఐదేళ్ల క్రితం రామలీలా మైదాన్లో అన్నా హజారే నిర్వహించిన 12 రోజుల అన్షాన్ కార్యక్రమం గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆయన తన ప్రాణాన్ని తనే కొస వరకు తెచ్చుకున్నారు. చివరిక్షణాలలో దీక్షా శిబిరం నుంచి నేరుగా ఎన్సీఆర్ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. తరువాత మరింత కోలువడానికి, ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి జిందాల్ ప్రకతి చికిత్సాలయానికి వెళ్లారు. ఇది యాద చ్ఛికంగా జరిగినా దేశంలో ధనికులు కొవ్వు తగ్గించుకోవడానికి ఈ చికిత్సా లయానికి వెళుతుంటారు. ఇంకా దీక్ష సాగుతూ ఉండగానే అన్నా అనుచరులు కొందరు, స్వామి అగ్నివేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ విమర్శలు కురిపించారు. అన్నా హజారే వాస్తవాలను పరికించడం ఆరంభించారు. అయితే పూర్తిగా కాదు. ఒక సంవత్సరం తరువాత జంతర్మంతర్ దగ్గర మరోసారి దీక్ష చేశారు. ఇతరు ముఖ్య అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, గోపాల్ రాయ్ వంటి వారు కూడా ఆయనతో పాటు దీక్ష చేశారు. ఇదొక పదిరోజులు సాగి, తరువాత భగ్నమైంది. ఈ మధ్యనే పదవీ విరమణ చేసిన మన 24వ సైన్యాధ్యక్షుడు దీక్షను భగ్నం చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాలెగావ్లోని అన్నా ఆశ్రమంలో గోపాల్రాయ్కీ, ఆ ఆర్మీ చీఫ్కీ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి మనం చూశాం. తరువాత ముంబైలో మూడోసారి అన్నా దీక్ష చేశారు. ఇది తక్కువకాలం సాగింది. దీక్షా శిబిరానికి చాలా తక్కువగా వచ్చారు. ముఖ్యమంత్రి హామీ తీసుకుని ఆయన ఆశ్రమా నికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో జరిగిన టీవీ చర్చలలో వాదించిన అన్నా అనుచరుల ముఖాలను ఆయా క్లిపింగ్లలో గమనించి ఉంటే, అన్నా దీక్ష విరమించడం పట్ల వారంతా ఎంత అసహనానికి గురయ్యారో అర్థమవు తుంది. అయితే ఒక్క మేధా పాట్కర్ మాత్రమే తన అసంతప్తిని నిజా యితీగా బయట పెట్టారు. కాబట్టి... అన్నా... తుమ్ సంఘర్ష్ కరో...... అన్నా హజారే క్షేమంగా ఉన్నారు. అలాగే ఆయన అనుచరులకు మంచి అవకాశాలు కూడా కల్పించారు. వారంతా ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పదవులలో ఉన్నారు. కొందరు ఎన్నికలలో నెగ్గారు. కొందరు నెగ్గలేదు. ఒకరైతే నెస్లేకు పోటీగా ఒక కార్పొరేట్ ప్రపంచాన్ని నిర్మించారు. మరొకరు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టారు. ఆ పవిత్ర గణకుడు ఈ ప్రభుత్వం హయాంలోనే పదవీ విరమణానంతర కానుకగా రెండు పనులు మంజూరు చేయించుకున్నాడు. అయితే వీరిలో ఎవరూ కూడా అన్నా హజారేను మర్యాదకు కలుసుకుని రావాలని కూడా అనుకోవడం లేదు. ఎంతో చరిత్రాత్మక నిరశన దీక్షగా పేర్గాంచిన ఆ దీక్ష వార్షికోత్సవం సంద ర్భంగా కూడా ఆయనను పలకరించి రావాలని భావించలేదు. తమను పద వులలో కూర్చో పెట్టినందుకు కూడా ఎవరూ ఆయనకు కతజ్ఞతలు తెలియ చేయలేదు. అలాగే జన్లోక్పాల్ తేవడానికి పోరాడతానని ప్రకటించినం దుకు కూడా ఆయనను అభినందించలేదు. సరే, ఇది గాంధీజీ కలలను సాకారం చేస్తామంటూ కాంగ్రెస్ వాదులు ప్రదర్శించే భేషజం కంటే తక్కువ భేషజమే. మన చివరి ఉదాహరణ వర్తమానంలో కొనసాగుతున్నదానికి సంబం ధించినదే: ఉద్యమకారిణి మేధా పాట్కర్. తాను దీక్షకు దిగుతానంటూ ప్రభుత్వాన్ని ఎన్ని పర్యాయాలు ఆమె బెదిరించారో లెక్కించడంలో నేను విఫలమయ్యాను. నిజానికి ఆమె ఒక్కసారే దీక్షకు కూర్చున్నారు. అయితే అందులో ప్రతి దీక్షా ఆమెకు ఎలాంటి హానీ జరగకుండానే ముగిసేది. అలాగే ఆమె వేటి కోసం పోరాడుతున్నారో వాటిలో ఒక్కటి కూడా సాధించలేకపో యారు. రుతువుల ఆరంభమైనట్టే మధ్యప్రదేశ్లో నర్మదా నది ఒడ్డున ఎక్కడో ఆమె దీక్ష చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గుజరాత్ ఆమె దీక్షను అనుమతించదు. నిరాహార దీక్షలు సాగుతాయి. జలసమాధులు ఉంటాయి. తరువాత విలేకరుల సమావేశాలు ఉంటాయి. షర్మిల గుర్తించడా నికి 16 సంవత్సరాలు పట్టిన వాస్తవం, అన్నా హజారేకు మూడు దీక్షలతో ఒక మాసంలో అనుభవానికి వచ్చిన వాస్తవం మేధా పాట్కర్కు బాగా అర్థమైం దని అనిపిస్తుంది. సినిమా కోసమే కావచ్చు జనరల్ ప్యాటన్ చెప్పినట్టు, తమ దేశం కోసం మరణించకుండా ఎవరూ యుద్ధంలో గెలవలేరు. ఇంకో అమా యకుడు ఎవరో చనిపోయేటట్టు చేసి అతడు గెలిచాడు కూడా. కాబట్టి షర్మిల, అన్నా హజారే, లేదా మేధా పాట్కర్ ఎవరి నుంచి అయినా వినిపించే సందేశం ఒక్కటే – నీ ఆశయాన్ని నీవు ప్రేమించు. దాని కోసం మరణించు.- twitter@shekargupta -
ఉగ్రవాదులకు పీవీ బిర్యానీ పెట్టించారా?
'ముంబైలో మారణహోమం సృష్టించి, పోలీసులకు పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్.. జైలులో బిర్యానీ కావాలని గొడవచేసేవాడని విన్నాం. ఈ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించే ప్రక్రియ ఇప్పటిదికాదు.. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు సైతం టెర్రరిస్టులకు బిర్యానీ తినిపించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సీమాంతర ఉగ్రవాదం, వేర్పాటువాదం కశ్మీర్ ను తీవ్రంగా వణికిస్తున్న రోజులవి. ఎడతెగని ఆందోళనలనలను అదుపుచేసే క్రమంలో పీవీ సర్కారు.. ఉగ్రవాదుల(వేర్పాటువాదుల)తో చర్చలు జరపాలని నిర్ణయించింది. 1993లో శ్రీనగర్ లోని ప్రఖ్యాత హజ్రత్ బాల్ దర్గా వేదికగా చర్చలు జరిగాయి. గంటలపాటు జరిగిన నాటి చర్చల్లో భోజనవిరామం అనివార్యమైంది. కానీ చివరికి చర్చలు విఫలమయ్యాయి. 'చేతికి చిక్కిన టెర్రరిస్టు నాయకులను చంపకుడా.. పీవీ నర్సింహారావు వాళ్లకు బిర్యానీ పెట్టి పంపించారు' అని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. మీడియా సంస్థలు సైతం పీవీ బిర్యానీని హైలెల్ చేశాయి. అసలేం జరిగింది? నిజానికి కసబ్ బిర్యానీ అడగనేలేదని, అతనిపై జడ్జీలకు, ప్రజలకు కోపం పెరగాలని(!) తానే బిర్యానీ థియరీని సృష్టించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తర్వాతికాలంలో (కసబ్ ఉరితీత అనంతరం) వెల్లడించారు. అలానే పీవీ టెర్రరిస్టులకు బిర్యానీ వడ్డించారన్నది కూడా పచ్చి అవాస్తవం. అప్పటి చర్చల్లో భోజనం తిన్నది నిజమే, అయితే అది సీఆర్పీఎఫ్ క్యాంప్ నుంచి తెప్పించిన సాధారణ భోజనం. కశ్మీరీ రచయిత బషారత్ పీర్ వివరణ ప్రకారం అసలు కశ్మీరీలు బిర్యానీని పెద్దగా ఇష్టపడరు. ఈ రెండు సందర్భాల్లోనూ కనీస నిజనిర్ధారణ లేకుండా వార్తా సంస్థలు చర్చలు చేశాయి. అలాంటివి ఎన్నో.. 2014లో బదౌన్ కు చెందిన ఇద్దరు దళిత యువతులపై సామూహిక అత్యాచారం, హత్య ఉదంతం కూడా అలాంటిదే. ఆ ఘటనపై టీవీ చర్చల్లో నాయకులు ఆవేశపూరితంగా మాట్లాడు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. నిజానికి అది అత్యాచారహత్య కాదు.. ఆత్మహత్య అని తర్వాత తెలిశాక.. టీవీల చర్చలను 'పెద్ద జోక్'గా వీక్షకుడు భావించడా? రోహతక్ అక్కచెల్లెళ్లు తమను బస్సులో వేధించిన ఆకతాయిని తన్ని పతాక శీర్షికల్లో చోటుచేసుకున్నారు. వారి సాహసాన్ని మెచ్చుకుంటూ ప్రభుత్వం వారికి రివార్డులు కూడా ప్రకటించింది. కానీ ఆ తెగింపు దృశ్యాలన్నీ నాటకమని, తన్నులు తిన్నది వాళ్ల మనిషేఅని తెలిసిన తర్వాత మనం ముక్కున వేలేసుకున్నాం. ఈ సందర్భంలోనూ టీవీ చర్చలు కామెడీ షోలయ్యాయి. నాగాలాండ్ లో ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆక్రోశంతో జనం.. జైలు గొడలు బద్దలుకొట్టిమరీ లోపలున్న యువకుణ్ని బైటికి ఈడ్చుకొచ్చి కొట్టి చంపారు. అసలు ఆ యువకుడికీ, రేప్ కు సంబంధమేలేదని, నిజానికి అతడో అమర సైనికుడి సోదరుడని తేలిసింది. కోల్ కతాలో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిపై రేప్ కేసులో పట్టుబడ్డ యువకులదీ ఇలాంటి గాధే. విషయం తెలిసిన వెంటనే.. టీవీ చానెళ్లు దానిపైన విస్తృత చర్చ మొదలుపెడతాయి. అభిప్రాయ ప్రకటనలో వక్తలు ఆవేశాగ్రహాలు వ్యక్తచేస్తారు. కానీ అందులోని నిజానిజాల గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు.' ఇది.. టీవీ చానెళ్ల తీరుతెన్నులు, వార్తల వెనుక వాస్తవాలను క్రోడీకరిస్తూ ఇటీవలే విడుదలైన 'More News is Good News : Untold Stories from 25 Years of Television: ' అనే పుస్తకంలో ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వెలిబుచ్చిన అభిప్రాయం. 'What Kasab's Biryani In Jail Says About News TV' శీర్షికతో ఆయన రాసిన ఒపీనియన్.. నేటి చానెళ్ల లేదా టీవీ చర్చల వింత పోకడను సులువుగా అర్థం చేసుకునేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో అభిప్రాయల సంకలనమైన 'More News is Good News' పుస్తకాన్ని హూపర్ కొలిన్స్ సంస్థ ప్రచురించింది. ఎమ్మార్పీ ధర రూ.799. అమెజాన్ లో రూ.543కే లభిస్తుంది. -
ద్విజాతి ఛాయలో కశ్మీర్ లోయ
జాతిహితం అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించాలంటే సైన్యాన్ని ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారాయన. కశ్మీర్ లోయలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ మన లోలోపలి వికృ తాలే. ఇది కశ్మీర్ భూభాగం గురించి కూడా కాదు. లేదా కశ్మీరీల గురించి అయినా కాదు. లేదంటే భారత్, పాకిస్తాన్ల వ్యవహారం కూడా కాదు. ఇప్పుడు ఇది హిందువులు, ముస్లింల గొడవగా తయారయింది. ఎవరికీ లబ్ధి చేకూర్చని ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది? మిగతా విషయాలు పక్కన పెట్టి ఇలాంటి వాదనలో ఉన్న కనీస తర్క బద్ధ వాస్తవాలనైనా చూద్దాం. మొదట: బుర్హన్ వనిని సాయుధదళాలు కాల్చి చంపడంతో తాజా కల్లోలం ఆరంభమైంది. ఈ పరిణామం సంభవించ కూడ నిదేమీ కాదు. అతడు రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడే చావుకు అత్యంత సమీపంగా వచ్చాడని అర్థమైంది. నిజానికి ఇంతకాలం జీవించి ఉన్నాడంటే అదంతా అతడి చాక చక్యమే. పెద్ద వింత కూడా. సాయుధబలగాల దృష్టిలో పడి, వారు వెతుకు తున్న వారి ‘ఏ’ జాబితాలో పేరు ఎక్కిన ఆరేళ్ల తరువాత కూడా బతికి బట్ట కట్టడం మామూలుగా సాధ్యంకాదు. అతడి పట్ల నేను సానుభూతితో ఉండాలా? సోదర భారతీయుడు ఎవరు మరణించినా నేను దుఃఖిస్తాను. అయితే బుర్హాన్ వని పట్ల కొంత వరకు నేను సానుభూతి చూపాలి. ఇలాంటి ప్రాణాంతకమైన మార్గంలోకి అతడు వెళ్లేటట్టు మిత్రులు, కుటుంబం అతడిని అనుమతించినందుకు, బహుశా అలాంటి దానికి ప్రోత్సహించినందుకు కూడా నేను సానుభూతి చూపవచ్చు. అతడు మరణించిన తీరుకు కూడా సానుభూతితో ఉండవచ్చు. కానీ ఒకసారి ఆయుధం చేపట్టి జనాన్ని చంపడం మొదలుపెట్టిన తరువాత చట్టేతర విధానాలతో చంపుతున్నారంటూ అవతలి వారిని ఆరోపించే కనీస నైతిక అర్హత కోల్పోయినట్టే. అయినా అలాంటి చావును అతడు స్వచ్ఛందంగా కోరుకున్నాడు. ఇది విషాదం. తరువాత డజన్ల కొద్దీ సాధారణ పౌరులు, యూనిఫారాలలో ఉన్నవారు కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది మరింత విషాదం. నా వరకు, ఇంకా అశేష భారతీయ జనాభా, ధైర్యం చేసి జేఎన్యూ ప్రాంగణంలో నేను చెప్పినట్టు ఎలాంటి సంకోచాలు లేని వాస్తవం- కశ్మీర్, ప్రస్తుతం దేశం అధీనంలో ఉన్న ఇతర భూభాగాలు భారత్ నుంచి అవిభా జ్యాలు. గణతంత్ర భారత్లోని అంతర్భాగాలు. అలాగే, కొంతమంది తిట్టినా, పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉన్న ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ఉన్నప్ప టికీ పాకిస్తాన్ చేతిలో ఉన్న భూభాగాలు అక్కడే ఉంటే ఉండనివ్వమనే నేనంటాను. అణ్వాయుధాలు కలిగి ఉన్న మూడు ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం ద్వారా ఇతరుల భూభాగాలను దఖలు పరుచుకోలేవు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ మూడు దేశాలలో రెండు దేశాలకు వ్యతి రేకంగా ఎవరు వ్యవహరించినా కశ్మీర్ భూభాగం, కశ్మీర్ ప్రజానీకం ఆ మూడు దేశాల దాయాదుల చిరకాల పోరులో చిక్కుకోవడం తథ్యం. కాబట్టి ఎవరూ తొందరపడరు. ఆఖరికి డజను తాజా యుద్ధాలు చేసుకున్నా, భారత్-పాక్ తమ అణ్వాయుధాలు మొత్తం వినియోగించినా కూడా ఎటు వైపు వారైనా కూడా వారి వైపు ఉన్న కశ్మీరాలను కోల్పోరని నేను పందెం కట్టి మరీ చెబుతాను. భద్రతా మండలి తీర్మానాలు కూడా పాకిస్తాన్ లేదా భారత్ లకే అవకాశం కల్పించాయి. పాకిస్తాన్ చెబుతున్న ఆజాద్ కశ్మీర్, ప్రజా భిప్రాయ సేకరణ, ఆజాదీకి మద్దతు ఇవేమీ ఇక్కడ వర్తించవు. ఇవన్నీ కపట నాటకాలే. ఆజాదీ ఏమీ లేదు. స్కాట్లాండ్ లేదు. క్విబెక్ లేదు. ఆఖరికి బ్రిక్జిట్ కూడా ఇక్కడ లేదు. ఏది ఏమైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, సిమ్లా ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కినది పాకిస్తానే తప్ప భారత్ కాదు. ఏడేళ్లకు ముందు సైన్యం సహాయంతో కశ్మీర్ను స్వాధీనం చేసుకుందామని ఆ దేశం యత్నించి పూర్తిగా విఫలమైంది. కశ్మీర్ను కోల్పోతున్నామని భారతీయులు ఎప్పటికీ విచారించవలసిన అవసరం లేదు. అక్కడ చాలినంత సైన్యం ఉంది. మన భూభాగంలోని ఆ లోయను రక్షించుకోవాలన్న మన ఆశయం వజ్ర సదృశంగా ఉంది. ‘‘మన’’ కశ్మీరీలు అనేది ఇప్పుడు ఒక అంశమే కాదు, అంతకు మించిన వివాదాస్పద అంకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌరులనీ, భూభాగాలనీ సైన్యాలు కాపాడగలవు. కానీ ఆగ్రహంతో ఉన్నవారి మనసును సైన్యం మార్చలేదు. ఈ మాటని చాలా మంది సైనికులు, మిత్రులు వెంటనే అంగీకరిం చలేరు. అవమానభారంతో కుంగిపోతున్నవారి, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను సైన్యాలు గెలవలేవు. శత్రువును నిరోధించాలంటే లేదా ఓడించా లంటే సైన్యం ఉపయోగించాలి. అలా కాకుండా అన్యమనస్కంగా ఉన్న సోదరుడిని తిరిగి దారికి తెచ్చుకోవాలంటే పెద్ద మనసు అవసరం. ఇది పని చేయగలదా? ఒక్క వాక్యంతో వాజ్పేయి తీసుకువచ్చిన నాటకీయ మార్పును గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. రాజ్యాంగ పరిధిలోనే ఎందుకు, నేను మానవత్వం పరిధి నుంచి మీతో మాట్లాడతాను అన్నారా యన. అదే ఆరేళ్ల పాటు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పింది. ఆ బాటలోనే మన్మోహన్సింగ్ ప్రయాణించారు. భారతదేశ సంకీర్ణ ప్రభుత్వాల చరిత్రలోనే అసంభవం అనదగ్గ తీరులో ముఫ్తీ స్థాపించిన పీడీపీతో బీజేపీ జత కట్టిన దృష్ట్యా నరేంద్ర మోదీ కూడా ఇలాగే వ్యవహరించగలరని మనం ఊహించాం. కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి పరిస్థితులు ఇంతగా విషమించడానికి కారణం- సంకీర్ణం ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం గురించి బీజేపీ తన కార్యకర్తలకు సరిగా ప్రచారం చేయలేదు. మరీ ముఖ్యంగా తన సిద్ధాంతకర్తలకీ, మేధావి వర్గానికీ, అజెండా నిర్ణేతలకీ కూడా ఉద్దేశాన్ని ఎరుక పరచలేదు. సైద్ధాంతికంగా ఎడమొహం పెడ మొహంగా ఉండే రెండు విభిన్నశక్తులు జాతీయతా సూత్రంతో (ముఫ్తీ గురించి ఆయన రాజకీయాల గురించి కూడా నేను ఇదే చెబుతాను) ఒకే తాటిపైకి వచ్చాయి. ఎన్నికలు తెచ్చిన విభజనను అధిగమించి ఐక్యత సాధించే ఉద్దేశంతో అవి ఈ పనిచేశాయి. అందుకే ఈ సంకీర్ణం భేషజంతో కాకుండా, రాజనీతిజ్ఞతతో వచ్చిందని అంటాను. జమ్మూ కశ్మీర్లో ద్విజాతి సిద్ధాంతంతో సమానమైన సిద్ధాంతానికి తెర తీసిన ఎన్నికలవి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఒక రకంగాను, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మరో తీరు లోను ఓటింగ్ జరిగింది. పీడీపీతో భాగస్వామ్యానికి నరేంద్ర మోదీ చొరవ చూపినప్పటికీ, ఆయన పార్టీ కార్యకర్తల సిద్ధాంతం, మోదీ రాజకీయ వాస్త వాలు ఆయనను వెనక్కు తగ్గేటట్టు చేశాయి. బాధితుల పట్ల చిన్నపాటి సానుభూతి మాట కూడా చెప్పకుండా, వారు దేని గురించి అడుగుతున్నారో కూడా ప్రస్తావించకుండా కశ్మీర్లో భద్రతాదళాల కార్యకలాపాలను సమర్థించ డానికి రోజూ సాయంకాలం మోదీగారి పార్టీ వక్తలు టీవీ స్టూడియోల చుట్టూ ఎలా తిరుగుతున్నారో మనమంతా చూస్తున్నాం. సంకీర్ణ భాగస్వామిని ఆదు కోవడమన్న పేరుతో బీజేపీ చేస్తున్న ఈ పని వికృతమైనదే కాదు, స్వీయ విధ్వంసకమైనది కూడా. కశ్మీర్ మొత్తం మనదే అంటూ నినదించేవారు, గుండెలు బాదుకునే వారు కశ్మీర్ అంటే వారి దృష్టిలో ఒక్క భూభాగమా లేక కశ్మీరీలు కూడానా? అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తమకు విధేయులుగా (హిందు వులు, బౌద్ధులు) ఉండేవారేనా? అని కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే ముస్లింలు కోరుకుంటే వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలన్నదే తమ వాంఛితమా? వాస్తవంగా మనసులో ఉన్నది అదే అయితే, విభజన తరువాత అసం పూర్ణంగా మిగిలిన అజెండాయే కశ్మీర్ అంటూ పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డూ అదుపు లేకుండా దేని గురించి మాట్లాడుతున్నదో మీరు కూడా అదే మాట్లా డుతున్నారు. ఆ భూభాగాన్ని, కొంత జనాన్ని (ముస్లింలు) వారు కోరు తున్నారు. మనం కూడా అంతే, ఆ భూభాగం, కొంత జనం కావాలని కోరు తున్నాం. విభజించు పాలించు అన్న సూత్రం మనకి బ్రిటిష్ జాతి నేర్పింది. మనం మాత్రం విభజించు- వదులుకో అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. నిజానికి 97 శాతం ముస్లింలు భారతదేశంలోని ప్రధాన భూభాగంలోనే నివశిస్తున్నారు. వీరి దేశభక్తిని నిరంతరం శంకించినప్పటికీ వీరు ఏనాడూ కశ్మీరీల నినాదంతో గొంతు కలపలేదు. ఆఖరికి కొత్త సున్నీ రైట్ సిద్ధాంత కర్తలు, అంటే జకీర్ నాయక్ వంటి వారు కూడా కశ్మీర్ అంశం గురించి ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఆ సమస్యను లోయకు పరిమితంగా ఉంచడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తున్నది ఇదే. ఈ మార్గం గురించి ఆలోచించండి. పాకిస్తాన్ వెళ్లిపోవాలనుకునే వారు ఎవరైనా ఉంటే సరిహద్దులు తెరిచి ఉన్నాయి అని ముస్లింలతో భారత్ చెప్పవలసి వస్తే ఎలా ఉంటుంది? ఏ ఒక్కరు భారత భూభాగం విడిచి వెళ్లరు. నా అనుమానం ఏమిటంటే, మంచి జీవనం కోసం పాకిస్తాన్, బంగ్లాల నుంచే ఇంకొందరు ముస్లింలు ఇక్కడికే రావచ్చు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వాలే మనం ఎక్కడ ఉండాలి అన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. కశ్మీర్ సరిహద్దులలో కూడా ఇదే చెబితే? ఆజాదీ కశ్మీర్ గురించి కల్పనలు ఉన్న వారు, జీహాదీల వలలో పడినవారు ఏ కొందరో మినహా ఎవరూ దేశం విడి చిపోరు. కశ్మీర్లో ‘మన జనం’ అంటూ మాట్లాడేవారే ఇంకో ప్రశ్నను కూడా వేసుకోవాలి. ‘మన’ కశ్మీరీలు ‘వారి’ భూభాగంలో ఉండాలా? లేకపోతే భూభాగం ఇక్కడ వదిలి పాకిస్తాన్ వెళ్లిపోవాలా? దీనికి నిజాయితీతో కూడిన సమాధానం రాబట్టుకోవడం నా ఉద్దేశం కాదు. హిందూ-ముస్లిం పరి భాషతో కశ్మీర్ సమస్యను పునర్ వ్యాఖ్యానిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో ఆలో చించాలనే నా ఉద్దేశం. అలాగే కనుక ఆలోచిస్తే కశ్మీర్ని పోగొట్టుకోకపోవచ్చు. కానీ కశ్మీరీలను పోగొట్టుకుంటాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఇస్లాంకు అసలు సవాలు ఇదే
జాతిహితం యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టీవీ మతప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే అతి పెద్ద సమస్యతో ఎలా వ్యవహరిం చాలి? జకీర్ నాయక్ వంటి వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం వారి మనసులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై ఈ దాడి జరుగుతోంది. సుప్రసిద్ధ పాకిస్తానీ వ్యాఖ్యాత ఖలీద్ అహ్మద్ చెప్పేంత వరకు (1984) జకీర్ నాయక్ అనే వ్యక్తి ఉన్నట్టే నాకు తెలియదు. నా మొట్టమొదట పాకిస్తానీ మిత్రుడు కూడా అయిన ఖలీద్... ఆయనను నేను ఎరుగనని తెలిసి ఆశ్చర్య పోయాడు. 2009లో జరిగిన ఒక సమాంతర సమావేశం లాంటి సంభా షణలో, జకీర్ నాయక్ ఉపఖండంలోనేగాక ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఇస్లామిక్ టెలీ-మత ప్రబోధకునిగా వృద్ధి చెందుతున్నట్టు ఖలీద్ చెప్పారు. జకీర్ ప్రవచనాలు చాలా వరకు ఇంగ్లిషులో సాగడం కూడా అందుకు కారణం. అప్పటికీ నాకు ‘పీస్ టీవీ’ అనేది ఒకటున్నదని తెలియనందుకూ అతను ఆశ్చర్యపోయాడు. ‘‘అది కూడా తెలుసుకోవయ్యా బాబూ, మన మంతా ముందు ముందు అతని గురించి ఇంకా చాలా ఎక్కువ వినాల్సి ఉంటుంది’’ అన్నారు. నైపుణ్యంతో కూడిన ఆయన భాషా పటిమకు, మిత వాద అంధ విశ్వాసాన్ని హేతుబద్ధతీకరించడానికి మంత్ర ముగ్దుడనైపోయా నని ఖలీద్ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం అందరిలాగే నేనూ ‘‘హజరత్ (గౌరవనీయులైన) గూగుల్’’కు వెళ్లాను (ఈ పద ప్రయోగం నాది కాదు వేరొకరిది). జకీర్ గురించి చదవడం, ఆయన టీవీ ప్రవచనాల రికార్డింగులను చూడటం ప్రారంభించాను. ఇంగ్లిషు వైద్యుడైన జకీర్ టెలీ-మత ప్రబోధకునిగా మారి... సౌదీ తరహా మితవాద ఇస్లాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన, వాక్పటిమగలిగిన, శక్తివంతమైన ప్రతినిధిగా అవతరించారు. రాక్-స్టార్ మతప్రబోధకుడు ఆయన భాష, దరహాస వదనంతో కూడిన నడవడిక, ఖురాను, భగవ ద్గీత, ఉపనిషత్తులు, బైబిల్ నుంచి అధ్యాయాలను, శ్లోకాలను అప్పటికప్పుడు అనర్గళంగా ఉల్లేఖించడం, క్రైస్తవులు, హిందువులు, నాస్తికులు సహా తన సమావేశాలకు హాజరైనవారు ఎవరు అడిగే ఏ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సుముఖంగా ఉండే వైఖరి అతనిని మౌలానా మూసపోతకు భిన్నంగా నిలుపుతుంది. నిజానికి ఆయన వారికి పూర్తిగా విరుద్ధం. సూటు, టై ధరించి, చక్కగా ఆలోచించి కూర్చిన ఇంగ్లిషు వాక్యాలను వేగంగా మాట్లాడతారు. ఆయన నడవడిక అంతటిలోకీ పలుచటి గడ్డం, మాడు మీది టోపీలే ఎక్కువగా ఆయన భక్తితత్పరుడైన ముస్లిం అని తెలుపుతాయి. నా సహచరులు కొందరి ద్వారా నేను ఆయనకు సంబంధించిన వారిని సంప్రదిం చాను. 2009 మార్చిలో ఆ ఇంటర్వ్యూ జరిగింది. జకీర్ నాయక్కు ఏ అధికారికమైన లేదా మతపరమైన బిరుదూ లేదు. కెమెరా ముందు తనను మౌల్వీ లేదా మౌలానాగా అభివర్ణించడానికి ఆయన అభ్యంతరం తెలిపారు. టెలీ-మతప్రబోధక రాక్-స్టార్గా వర్ణించడానికి అభ్యంతరం లేకపోవడమే కాదు, మహా ఆనందంగా అంగీకరించారు. ‘ఆస్తా’ చానల్లో ఎంతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కనిపించే చాలా మంది మత బోధకులు ఆయనకున్న టీవీ స్టార్ నైజాన్ని చూసి అసూయ చెందు తారు. ఆయన సంభాషణ చాలా వరకు ఘర్షణాత్మకమైనది కాదు. అత్యంత స్నేహపూర్వకమైన స్వరంతో మాట్లాడారు. భారత రాజ్యాంగంలో, న్యాయ వ్యవస్థలో తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని అంటుంటే ఇక వాదించడానికి ఏం మిగిలి ఉంటుంది. దేశవిభజన విషయంలో ఆయన వైఖరి ఆర్ఎస్ఎస్ వైఖ రికి భిన్నమైనదేం కాదు. అది, భారతదేశమనే దేశంగా ఉపఖండానికి గొప్ప విషాదం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ‘‘క్రీడల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రపంచ శక్తి’’గా ఎదిగి ఉండేవి అన్నారాయన. ముస్లింలలో చాలా మందికి ఎన్నడూ విభజన అవసరమే లేదు లేదా కోరలేదు, పాకిస్తాన్ ఉద్యమానికి నేతృత్వం వహించినవారిలో పలువురు ‘‘మతానుయాయులైన ముస్లింలు కూడా కారు.’’ అయితే అర్ఎస్ఎస్కు భిన్నంగా ఆయన ఈ అంశాన్ని ముస్లింల ప్రయోజనాల కోణం నుంచి చూశారు. మితవాద ముస్లింలు జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలో సాగిన దేశ విభజనను వ్యతిరేకించడానికి నేపథ్యం ఉంది. అయితే నేటి చర్చలో భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, జాతీయవాదం, దేశవిభజనలపై ఆయన వైఖరి చాలా మంది పాకిస్తానీలకు మాత్రమే చికాకు కలిగిస్తుంది. కశ్మీర్పై జకీర్ అభిప్రాయాన్ని ఆయనను ద్వేషించేవారు, మహా దుర్మా ర్గునిగా చిత్రీకరించేవారిలో అత్యధికులు సైతం కొంత అయిష్టంగానైనా అంగీ కరిస్తారు. భారత్, పాకిస్తాన్లు రెండింటి పట్ల కశ్మీరీలు విసిగిపోయారు. స్వేచ్ఛగా ఓటింగ్ను నిర్వహిస్తే ఒంటరిగా వదిలేయమనే వారు కోరుకుం టారు. కానీ అది వారికి ఒక అవకాశంగా ఇవ్వజూపుతున్నది కాదు. కాబట్టి విద్య, ఉపాధులను మెరుగుపరచి, తన వైపు నుంచి శాంతిని నెలకొల్పి, సాధారణ పరిస్థితిని తీసుకురాగలగాలి అని ఆయన అభిప్రాయం. అతి సౌమ్యుని అతి ప్రమాదకర పార్శ్వం ఇక క్లిష్టమైన అంశాలకు వచ్చేసరికి సమస్యలు తలెత్తాయి. 26/11ను, 9/11ను సైతం ఆయన స్వేచ్ఛగా ఖండిస్తారు. కాకపోతే ‘‘జంట టవర్లను ధ్వంసం చేసిన వ్యక్తి మతధర్మాన్ని పాటించే ముస్లిం కాడు, అతన్ని ఖండిం చాల్సిందే...’’ నేనెప్పుడూ ప్రయాణిస్తూ ఉంటాను కాబట్టి నాకు 9/11 డాక్యు మెంటరీల నుంచి సమాచారం లభించింది. దాన్ని బట్టి జార్జ్ బుష్ స్వయంగా చేసిన, లోపలి వారి పనేనని తెలుస్తోంది... ఈ ఆధారాలు ఒసామా బిన్ లాడెన్కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకంటే చాలా మెరుగైనవి’’ అంటారు. ముస్లింల మస్తిష్కాలపై ఆయన పట్టు పెరుగుతుండటాన్ని గుర్తించి ‘ఇండి యన్ ఎక్స్ప్రెస్’ పత్రిక జాగ్రత్తగా ఎంపిక చేసిన 2010 వార్షిక శక్తివంతుల జాబితాలో జకీర్ పేరును చేర్చింది. అయితే ఆయన ప్రయోగించే లాడెన్ తరహా సందిగ్ధ అభిభాషణా ధోరణి ఆయనలో ఉన్న తప్పుడు, ప్రమాదకరమైన అంశాన్ని నొక్కిచెబు తుంది. భార్యను ‘‘ఇస్లామిక్’’ పద్ధతిలో ‘‘ఏదో టూత్ బ్రష్తో కొట్టినట్టుగా మెల్లగా కొట్టడం’’ లేదా విశాలమైన అలంకారాలతో కూడిన ముస్లిం సమాధు లను ఇస్లాంకు విరుద్ధమైనవిగా ప్రకటించడం వంటి మూర్ఖత్వాలను ఆయన పదేపదే సమర్థిస్తుంటారు. ప్రతి మూడు వాక్యాలకు ఒకసారి ఒక సూక్తిని ఉల్లేఖించే జకీర్ ఉపన్యాస శైలి ఇస్లాం పట్ల లోతైన మితవాద, మతశాస్త్రవాద దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన పద్ధతి చూడటానికి భయపెట్టని దిగా, స్నేహపూర్వకమైనదిగా కనిపిస్తుంది. కానీ నిజంగానే తెలుసుకోగోరే, అమాయక మనసులతో ఆడుకోగలగడం ప్రమాదకరం. తోటి మనుషులకు లేదా రాజ్యానికి వ్యతిరేకంగా హింసను ప్రయోగించమని ఆయన ఎన్నడైనా సూచిస్తారని నేను విశ్వసించను. అయితే ఆయన ఐఎస్ఐఎస్ను కచ్చితంగా ‘‘ఇస్లామ్ వ్యతిరేక కుట్ర’’గా ఖండిస్తారు. ఇస్లాంకు ఆయన చెప్పే ఛాందస వాద వ్యాఖ్యానాలు.. అమాయక, యువ ముస్లింల మనసులు మరింత తీవ్ర పద్ధతులను అనుసరించడానికి సమంజసత్వాన్ని కలుగ జేసేట్టుగా విస్తరింప జేయగలుగుతాయి. బంగ్లాదేశీ ఉగ్రవాదులలో కొందరు ఆయన అనుయా యులు అయినందుకు నేను ఆశ్చర్యపోను. కొత్త, యువ ముస్లిం ఉగ్రవా దులు, ప్రత్యేకించి ఐఎస్ఐఎస్కు చెందినవారు బాగా చదువుకున్నవారు, సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇంగ్లిష్ మాట్లాడేవారుగా ఉంటున్నా రెందుకు? అనే ప్రశ్న ఈ రోజుల్లో తరచుగా ఎదురవుతోంది. క్లుప్తంగా చెప్పా లంటే కొత్త ముస్లిం ఉగ్రవాది, పాత పేద, నిరక్షరాస్యుడైన అజ్మల్ కసబ్ తరహా ఉగ్రవాద మూసపోతకు భిన్నంగా ఉంటున్నాడెందుకు? దీనికి సమా ధానం బహుశా హిందూ మితవాదులు ద్వేషించడానికి ఇష్టపడే మరో వ్యక్తి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీవద్ద ఉండవచ్చు. ఓవైసీ లేవనెత్తిన అసలు సమస్య ఆయన నన్ను ఒకసారి హైదరాబాద్లోని పాత బస్తీలోకి కార్లో తీసుకు పోయారు. ఆ ప్రాంతాన్ని ఆయన, ఆయన కుటుంబం దశాబ్దాలుగా నియం త్రిస్తోంది. ఒవైసీ నాకు తను నడుపుతున్న విద్యాసంస్థలను చూపించారు. ఆయన విద్యాసంస్థలోని ఎమ్బీబీఎస్ క్లాస్లో ఆడపిల్లలు/మగపిల్లల నిష్పత్తి 70:30గా ఉండటం చూసి సంతోషంతో నివ్వెరపోయాను. సోషల్ మీడి యాలో ఆ ఫొటోలను కొన్నిటిని పోస్ట్ చేశాను. వారంతా హిజబ్ (బురఖా) ధరించి ఉన్నారనే ఫిర్యాదుతో నన్ను తిట్టి పోస్తూ ఓ పెద్ద దుమారమే రేగింది. ‘‘ఈ ఆడపిల్లలు మెడికల్ కాలేజీకి వెళ్లాలా లేక మదారసాకు వెళ్లాలా? అని మిమ్మల్ని తిట్టిపోసే వాళ్లను ఆడగండి’’ అన్నారాయన. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఆగి ‘‘బహుశా ఈ యువ ముస్లింలు మదా రసాకు కూడా వెళ్లి ఉంటేనే బాగుండేదేమో. ఇస్లాం అర్థాన్ని, సూత్రాలను, జిహాద్ను సైతం ఒక మౌల్వీ అయితే చెబుతారు’’ అన్నారు. ఈ యువ ముస్లింలు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంబీఏలు అవుతారుగానీ వారికి తమ మతంగురించి తెలియదు. తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి ‘‘హజరత్ గూగుల్’’ తప్ప వారు ఎక్కడకు వెళ్లగలుగుతారు? ఒక యువ ముస్లిం గూగుల్లో జిహాద్ అని కొడితే ‘‘బహుశా మొహ్మద్ హఫీజ్ సయీద్, అతని జమా ఉద్ దవానే మొట్టమొదట కనబడొచ్చు’’ అంతకంటే మదా రసాకు వెళ్లడమే మంచిది అన్నారు ఒవైసీ. నేడు ఇస్లాం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఇదే అన్నారు. ఆయనకు ఐఎస్ఐఎస్ అంటే అసహ్యం, పాత బస్తీలో దానికి వ్యతిరేకంగా హోర్డింగ్లను పెట్టించారు. ఒవైసీ చెబుతున్న మరింత పెద్ద, ప్రబలమైన సమస్య కూడా మీకు ఇప్పుడు కనబడుతుంది. యువ ముస్లిం వృత్తి విద్యావంతులు గూగుల్ నుంచి, ఆధునిక టెలివిజన్ మత ప్రబోధకుల నుంచి తమ మత ధర్మాన్ని గురించి నేర్చుకోవడం అనే సమస్యతో ఎలా వ్యవహరించాలి? జకీర్ నాయక్ వంటి వారి ప్రబోధాలు వారి వారి మనస్సులను ముంచెత్తుతున్నాయి. వారు ప్రచారం చేస్తున్న ముస్లింలు బాధితులుగా ఉంటున్నారనే కథనం విశ్వసించ దగినదిగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు సహా కొందరు లౌకికవాదు లుగా చెప్పుకునేవారు- కేవలం దిగ్విజయ్సింగ్ మాత్రమేకాదు - ఇషత్ ్రజహాన్ కేసు నుంచి బాట్లా హౌస్ ఎన్కౌంటర్ వరకు ప్రతిదాన్ని ముస్లింలను బాధించడంగానే చూపుతూ ఆ బాధిత కథనానికి ఆజ్యాన్ని పోస్తుంటారు. ఈ సమస్య ఇక్కడ మన దేశంలోనే ఇంత జటిలంగా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు. దాదాపు 50 కోట్ల లేదా ప్రపంచ ముస్లిం జనాభాలో 40 శాతం మనసులపై జరుగుతున్న దాడి ఇది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
జిల్లెలగూడలో భారీ చోరీ
తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రవేశించిన దుండగులు పెద్ద మొత్తంలో సొత్తును ఎత్తుకుపోయారు. మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ లలితానగర్లో జరిగిన ఈ చోరీపై పోలీసుల కథనం.. డీఆర్డీఏ ఉద్యోగి చిత్తలూరి చంద్రశేఖర్గుప్త కుటుంబం లలితానగర్లో నివాసం ఉంటోంది, చంద్రశేఖర్ కుటుంబం, బంధువులతో కలసి గురువారం తిరుపతి వెళ్లారు. చంద్రశేఖర్కు చెందిన బంగారు నగలతో పాటు వారి బంధువుల బంగారు నగలను మొత్తం 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 నగదును చంద్రశేఖర్ ఇంట్లోని బీరువాలో ఉంచి తిరుపతి వెళ్ళారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు గురువారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగలు, నగదును తస్కరించారు. శుక్రవారం ఉదయం పొరుగు వారు గమనించి బాధితులకు సమాచారం అందించారు. ఈ మేరకు బాధితుల బంధువులు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. -
భేషజాలు తొలగిన బంధం
జాతిహితం భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. ‘‘బలమైన, సంపన్నవంతమైన భారతదేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంద’’ని ప్రకటించడం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చరిత్రకు సంబంధించిన శషభిషలను అధిగ మించి, భారత్–అమెరికా సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న పద్ధతిలో ఈ వారం కాలమ్లో అంశంగా ఎంచుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి చరిత్రలోని స్వవచన వ్యాఘాతాలు, రెండు చరిత్రలోని భేష జాల గురించి. లేదా రెండింటి గురించి కూడా. వ్యూహాత్మక సంబంధాలు చాలా కాలం తరువాత ఏర్పడినాయి గానీ, 1947 నుంచి కూడా భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములు, మిత్రులు అయి ఉండాలి. కానీ యుద్ధానంతర పునర్నిర్మాణ దశలో తూర్పు, పశ్చిమా లలోని ఐరోపా, జపాన్లను దాటి సంబంధాలు నెరపడం అమెరికాకు సాధ్యం కాదు. భారత నాయకత్వం మౌలికంగా బ్రిటన్ చుట్టూ పరిభ్రమిం చేది. కానీ త్వరలోనే భాగస్వాములు ఇద్దరినీ కూడా ప్రచ్ఛన్నయుద్ధం హరించి వేసింది. పాకిస్తాన్ అమెరికా వైపు మొగ్గింది. భారత్ మాత్రం అలీనోద్యమ నాయకత్వాన్ని ఆశించింది. అలీనో ద్యమం ఎప్పుడూ సోవియెట్ కూటమి వైపే మొగ్గు చూపింది. పశ్చిమదేశాల పట్ల వ్యతిరేక భావం ఉన్న ఇద్దరు ప్రముఖ భారతీయ నేతలు నెహ్రూ, ఇందిర రెండు సంక్షోభాల వేళ అమెరికాకు చేరువయ్యారు. చైనా దురాక్రమణ, ఆహార నిల్వల కొరత వచ్చినప్పుడు ఆ పరిణామం జరిగింది. తరువాత వచ్చిన ప్రధానమంత్రులంతా (నరేంద్ర మోదీ సహా) హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో అమెరికా నిర్వహిం చిన కీలక పాత్రను గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం –1989– పరిసమాప్తితోనే భారత్–అమెరికా సంబంధాల నూతన చరిత్ర ప్రారంభమైందని భావించడం మరింత సముచితంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతర ప్రపంచ చరిత్ర తర్వాత సంభవించిన గొప్ప మూల మలుపు భారత్ను నేర్పులేని ఒక మోటు స్థితిలోకి నెట్టింది. ఈ దశలో భారత్ ఆత్మవిశ్వాసం స్వల్ప స్థాయిలో ఉండటంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి దేశానికి ఒక అవ కాశం కంటే ఒక సంక్షోభంగానే కనిపించింది. ఆర్థిక రంగంలో యధాతథ స్థితిని భారత్ సాహసోపేతంగా బద్దలు చేసింది కాని దాని రాజకీయ నాయకత్వం మాత్రం పాత వ్యూహాత్మక మానసిక స్థితిలోనే చిక్కుకుని ఉండేది. ఆ తర్వాత ఇజ్రాయెల్తో సంబం« దాలను ఏర్పర్చుకోవడం, అమెరికాను సందర్శించడం వంటి కొన్ని దిద్దుబాట్లు జరిగాయి. చివరగా, భారత్–అమెరికా సంబంధాలు ఇంకే మాత్రం గత బంధనాలతో ఉండబోవని, కొత్త అవకాశాలకు ఆకాశమే హద్దని పీవీ నరసింహారావు కేపిటల్ హిల్లో సాహస ప్రకటన చేశారు. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య అవకాశాల కంటే చికాకులు ఎక్కువగా ఉండేవి. అయితే పీవీ.. ప్రపంచంలో జరుగుతున్న మౌలిక మార్పును మేధోవం తంగా గ్రహించి దాన్ని స్వీకరించారు. భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. బలమైన, సంపన్నవంతమైన భారత దేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుం దని ప్రకటిం^è డం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ దశకు చేరడానికి భారత్ ఊగిసలాటలతో కూడిన పాతికేళ్ల సమయం తీసుకుంది. దీన్నే మోదీ చరిత్ర భేషజాలుగా అద్భుతమైన రీతిలో ఇటీవలి అమెరికా పర్యటనలో వర్ణించారు. వాస్తవానికి మూడు దశాబ్దాలకు పైగా భారత–అమెరికా సంబం« దాల పునఃస్థాపన క్రమాన్ని మనం ఒక రిలే రేస్గా చూడవచ్చు. పీవీ ఈ పరుగుపందేనికి దారి సిద్ధం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయీ తొలి పరుగు ప్రారంభించి బ్యాటన్ను మన్మోహన్సింగ్కు అందించారు. సింగ్ యూపీఏ–1 హయాంలో అణు ఒప్పందం ద్వారా తుది అంగను చేరు కున్నారు. కానీ యూపీఏ–2వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట వల్ల తడబడ్డారు. ఇప్పుడు ఆ బ్యాటన్ని మోదీ అందుకుని చివరి పరు గును పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పావుశతాబ్దం కలిగించిన ప్రయోజనానికి తోడుగా మోదీ తన బలాన్ని కూడా తీసుకొచ్చారు. వీటిలో మొదటిది 282 స్థానాల మ్యాజిక్ నంబర్. అయితే మోదీకి ఇంత మెజారిటీ ఒక బహు మతిగా రాలేదనుకోండి. ఆయన దాన్ని సాధించుకున్నారు. రెండు. ప్రచ్ఛన్న యుద్ధానంతర శకంలో రూపొందిన ప్రొఫెషనల్ దౌత్యవేత్తల బృందంతో మోదీ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మూడు, భారత కులీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో అమెరి కాకు వలస వెళ్లినందున అమెరికాతో భావోద్వేగ బంధం ఇంకా పెద్దది. నాలుగు.. తన పూర్వ ప్రధానులతో పోలిస్తే మోదీ అత్యంత పిన్న వయస్కు డైన ప్రధానిగా ఉన్నారు. ప్రధాని మంత్రిత్వం అనేది మరింత యుక్తవయస్సులో ఉన్నవారు చేయవలసిన పని అంటూ మన్మోహన్ సింగ్ తరచూ చెప్పేవారు. భారతదేశపు అత్యంత విజ్ఞులైన ప్రధాన మంత్రులు.. పీవీ నరసింహారావు, వాజ్పేయీ, మన్మోహన్ సింగ్ వారి జీవితాల్లో కనీసం పదేళ్లు ఆలస్యంగా ప్రధాని పదవిని చేపట్టారు. తన సమకాలీన ప్రపంచ నేతలతో పోలిస్తే మోదీ కాస్త ముసలివాడిగానే కని పించినప్పటికీ, తన వయస్సు తనకు అనుకూలంగానే ఉంటూ వస్తోంది. అయితే మోదీకున్న అతిపెద్ద బలం చెక్కుచెదరని ఆయన మనస్సే. చరిత్ర భారాలు లేదా కపటత్వాలతో ఆయన నలిగిపోవడం లేదు. ఏళ్ల తరబడి దౌత్యపరమైన అంచనాలు, కేబుల్ వార్తలు చదవడం ద్వారా కలిగే విశ్లేషణ–పక్షవాత భారానికి ఆయన గురికాలేదు. ఈ అనిశ్చితివల్లే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకు వచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ మానసికంగా స్తంభించిపోయింది. రక్షణ సహకార ఒప్పందాల విషయంలో ముందుకెళ్లడంలో దాని స్తంభనే భీతిగా మారిపోయింది. తాను, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన విషయాన్ని పక్కనబెట్టి మోదీ స్వచ్ఛ మానసిక స్థితితో, దాపరికంలేనితనంతో అధికారంలోకి వచ్చారు. అధి కారం చేపట్టిన తొలిరోజు కొత్త చరిత్రకు నాంది కావచ్చు కాబోలు. ఈ చెక్కుచెదరని మనస్సే మోదీని ప్రధానంగా దౌత్యంలో, నిర్ణ యాల రూపకల్పనలో వాస్తవిక వ్యవహార దృక్పథాన్ని చేపట్టేలా చేసి ఉంటుంది. అమెరికాతో మరింత వ్యూహాత్మక అవకాశాలను సృష్టించు కోడానికి, వ్యాపార, వాతావరణ సంప్రదింపుల్లో కూడా ఇచ్చి పుచ్చు కోవడానికి ఆయన అభిలషిస్తున్నారు. అలాగే ఆర్థిక, వాణిజ్య అవకా శాలను విస్తరించుకోవడానికి చైనాతో వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబం« ధించిన అలజడిని చల్లబర్చుకోవాలని కూడా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జూనియర్ బుష్ లేదా రీగన్ తరహాలో మోదీ వ్యవహ రిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చరిత్రకు సంబంధించిన సందే హాలు – బేషజాలు– నుంచి విముక్తి చెందిన, సమస్యతో నేరుగా వ్యవ హరించే సరైన వ్యక్తిగా మోదీ ఆవిర్భవించారు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మోదీ ఎదపైనా ఎర్రగులాబీ!
జాతిహితం నెహ్రూ మాదిరిగానే నరేంద్ర మోదీ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అలాగే అలీన విధానం పట్ల విశ్వాసం కలిగినవారు. మోదీ అనుకూలురు నిరసించినా, పాలన, వ్యక్తిగత శైలీ వ్యవహారాలు నెహ్రూ తరువాత కనిపిస్తున్న నెహ్రూవియన్ ప్రధాని మోదీయే అనిపించేటట్టు చేశాయి. జవహర్లాల్ నెహ్రూ తరువాత మళ్లీ ఆయన విధానాలను అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనంటూ నేను ఈ వారం కాలమ్ను ఆరంభించాను కనుక, ప్రజలను ఆకర్షించడానికి ఏదో విన్యాసం చేస్తున్నానని కొత్త మీడియా అనవచ్చు. ఇలా చెబుతున్నాను కాబట్టి, ఆ విషయం మరోసారి ఆలోచించు కోమని నన్ను మీరంతా అడగడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు- నెహ్రూ వారసత్వాన్ని నిర్మూలించడం, పాఠ్య పుస్తకాలలో ఆయన పేరును చెరిపివేయడం, నెహ్రూగారి పేరుతో ఏర్పాటైన వ్యవస్థలను కాషాయీకరించడంతో పాటు; గాంధీజీ హత్య మొదలు కశ్మీర్ సమస్య, టిబెట్ సరిహద్దు వివాదం, అనువంశిక పాలన వంటి భారతదేశ సర్వ సమస్యలకు మూలం నెహ్రూ విధానాలేనన్న ఆరెస్సెస్ ఆలోచనకు ఊతం ఇవ్వాలన్న ఏకసూత్ర ప్రణాళికతో మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న కాలంలో నెహ్రూతో ఆయనను పోల్చడం గురించి ఆలోచించుకోమని చెప్పవచ్చు. అలాగే ఒక ఐఏఎస్ అధికారి నెహ్రూను శ్లాఘిస్తూ ఫేస్బుక్లో రాసిన నేరానికి ఆయనను ఒక రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన కాలంలో ప్రథమ ప్రధానికీ మోదీకీ పోలిక తేవడం గురించి ప్రశ్నించవచ్చు. మోదీ ప్రభుత్వ స్పందనలోని వాస్తవం ఎంతో ఒక్కసారి పరిశీ లిద్దాం. మనలాంటి అపండితులు కూడా నెహ్రూ విధానాలకు ముఖ్య మైన నాలుగు స్తంభాలు ఉన్నాయని చెప్పగలరు. అవి: సుదృఢమైన లౌకిక వాదం, సామాజిక ఉదారవాదం- సామ్య వాదం (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ), అలీన విధానం, అంతర్జాతీయవాదం. ఈ నాలుగు అంశా లలో దేనిపట్ల ప్రస్తుత మోదీ ప్రభు త్వం వివక్ష చూపగలదు? ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, ఈ నాలుగు స్తంభాలలో ప్రస్తుతం ఏది మిగిలి ఉంది? ఈ నాలుగు స్తంభాలలో రెండింటిని కాంగ్రెస్ ప్రధాన మంత్రులే ధ్వంసం చేశారు, లేదా బాగా బలహీనపరిచారు. దైవభావనకు, ఇంద్రి యాతీత శక్తులకు అతీతమైన దృఢ లౌకికవాదాన్ని నరసింహారావు పునర్ నిర్వచించి, తేలిక పరిచారు. దానిని మెత్తని హిందూత్వగా కూడా పిలవవచ్చు. నిజానికి నరసింహారావు సాగించిన ఈ నిర్మాణం నెహ్రూ మనుమడు రాజీవ్గాంధీ వేసిన పునాది పైనే జరిగింది. రాజీవ్గాంధీ రామజన్మ భూమి తాళాలు తెరిపించి, అక్కడి నుంచే రామరాజ్య స్థాపన నినాదంతో 1989 ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సామ్యవాదాన్ని కూడా నరసింహారావే కూల్చివేశారు. ఆయన తన మంత్రిమండలిలో ఆర్థికమంత్రి, తరువాత ప్రధానమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ సాయంతో ఈ పని చేశారు. ఆఖరికి సోనియా, రాహుల్ గాంధీ కాలంలో కూడా మన్మోహన్సింగ్ ఈ కార్యక్రమం కొనసాగించారు. అయితే వీళ్లు ప్రారంభించిన కొత్త కార్యక్రమాలకు నెహ్రూ పేరు మాత్రం పెట్టలేదు. ఆఖరికి విదేశాంగ విధానం కొత్త మలుపు తీసుకున్నది కూడా నరసింహారావు హయాంలోనే. ఆయన మొదటి నుంచి తప్పటడుగులు వేశారు. సోవియెట్ రష్యా పతనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలకు మొగ్గారు. ఈ విధానం కాంగ్రెస్ పార్టీలో కూడా, మణిశంకర్ అయ్యర్ సహా ఆగ్రహావేశాలకు గురిచేసింది. వాజ్పేయి యువ పార్లమెంటేరియన్గా తరచూ నెహ్రూతో విభే దిస్తూ ఉన్నా, ఏనాడూ ఆయన గురించి కఠినంగా మాట్లాడలేదు. వాజ్ పేయి తన ఆరేళ్ల పాలనలో పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను, భారత పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన దాదాపు 30 హోటళ్లను ప్రైవేటు పరం చేయడం చూస్తే వింత అనిపిస్తుంది. కానీ ఆయన కంటే ముందు అధికారం చేపట్టిన పీవీ, మన్మోహన్సింగ్ నెహ్రూ ప్రతిపాదిత ఆర్థిక విధానాల నుంచి దూరంగా జరగడం వల్లనే వాజ్పేయికి ఇది సాధ్య పడింది. అయితే వీరంతా ఉల్లంఘించిన దృఢమైన ఆ సామ్యవాదం నెహ్రూ వారసత్వంగా వచ్చినదా, లేక ఇందిర వారసత్వమా అన్న విలువైన వాదనలు ఎప్పుడూ ఉంటాయి. కానీ దానిని నిర్ధారించడం ఇప్పుడు సాధ్యం కాదు. సామ్యవాదాన్ని నెహ్రూ జాతీయ ఆర్థిక సిద్ధాం తంగా మలిచారు. ఇందిర దానిని ప్రైవేటు రంగాన్ని ముఖ్యంగా విదేశీ సంస్థల అధీనంలోని ప్రైవేటు రంగాన్ని ధ్వంసం చేయడానికి ఉపయోగిం చుకున్నారు. అయితే తామే పెద్ద సామ్యవాదులమని చెప్పుకోవడానికి అందరూ పోటీ పడ్డారు. ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధీ ప్రభుత్వం స్థానంలో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ఆస్తిహక్కును తీసేసుకుంది. కానీ రాజ్యాంగ పీఠికలో చట్ట విరుద్ధంగా చేర్చిన రెండు మాటలు ‘సెక్యుల రిజమ్, సోషలిజమ్’ అన్నమాటలను ఉంచడానికి మాత్రం అంగీకరిం చింది (అవి చట్ట విరుద్ధం ఎందుకయ్యాయంటే, విపక్షం కారాగారంలో ఉండగా ఆరో లోక్సభ ఆమోదించిన చట్టాలు). కోక్ను, ఐబీఎంను గెంటేసింది. అలాగే తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరాన్ని గౌరవిస్తూ సర్కారీ కోలా ‘77’ను ప్రారంభించింది కూడా. మార్కెట్ అనుకూల ప్రధానిగా మొరార్జీదేశాయ్కి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉన్నా, ఆయన మాత్రం తనను నెహ్రూ విధానాలకు కాకుండా గాంధేయవాద సిద్ధాంతాలకు అనుకూలునిగా ప్రపంచం చేత నమ్మించ డానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వారం కాలమ్లో చర్చి స్తున్న విషయం దగ్గరకు వద్దాం. ఇంకా వాల్స్ట్రీట్ జర్నల్కు మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశాన్ని కూడా పరిశీలిద్దాం. ప్రభుత్వ రంగ సంస్థల అవసరం గురించీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించీ భారత ప్రధాని ఒకరు మాట్లాడగా విని కొన్ని దశాబ్దాలు, కచ్చితంగా చెప్పాలంటే నాలుగు దశాబ్దాలయింది. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలను అరుణ్శౌరీ సారథ్యంలో వాజ్పేయి ప్రభుత్వం విక్రయించిన సమయంలో, గుజరాత్ ఆ పంథాను అనుసరించలేదు. ఆ సంస్థలను మరింత పటిష్టపరిచారు మోదీ. కానీ వాజ్పేయి ఎయిర్ ఇండియా సహా, పలు చమురు సంస్థలను కూడా వదుల్చుకున్నారు. అలీన విధానానికి పునరంకితం కావలసిన అవసరం గురించి కూడా మోదీ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మోదీ అలా చెప్పి ఉండవచ్చునని ఎవరైనా వాదించవచ్చు. అయితే ఆ అవసరం ఇప్పుడేమిటి? మోదీ అన్ని ముస్లిం దేశాలను చుట్టి వస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడి భారత్ పర్యటనకు సౌత్బ్లాక్ నుంచి అనుమతి రావడం లేదు. దీనికి మణిశంకర్ కూడా హర్షం వ్యక్తం చేస్తారేమో! నెహ్రూ, మోదీ మధ్య ఇంకొన్ని పోలికలు కూడా గమనించవచ్చు. తరచూ బహిరంగ సభలలో ప్రసంగించడం, విదేశీ, వ్యూహాత్మక విధా నాల మీద పూర్తి అజమాయిషీ, ఆఖరికి ఆకర్షణీయమైన వస్త్రధారణలో కూడా పోలికలు కనిపిస్తాయి. ఇన్ని సంవత్సరాలుగా నెహ్రూ జాకెట్ ఒక ఆకర్షణీయ వస్త్రంగా రాణించినట్టే, ప్రస్తుతం మోదీ వేషధారణ కూడా అందరిని అనుకరించేటట్టు చేస్తోంది. నిజానికి నెహ్రూతో మోదీకి వ్యక్తిగత విభేదం ఏదీ లేదనీ, ఆయన ప్రాపంచిక దృక్పథమే నెహ్రూ ప్రాపంచిక దృక్పథంతో విభేదిస్తుందని మోదీ అనుయాయులు చెబు తారు. ఇదే నిజమైతే కనీసం ఆర్థిక, విదేశీ వ్యవహారాలలో అయినా ఇలాంటి విభేదం ఉందేమో మనం రుజువు కోసం అన్వేషించాలి. శేఖర్ గుప్తా twitter@shekargupta -
దిద్దుబాటుకు సిద్ధపడతారా?
జాతిహితం మోదీ పదవీ కాలంలోని ద్వితీయార్థ భాగం మొదలుకు కొంత ముందుగా జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగ్గ విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి శాసనసభ ఎన్నికలు ఇంకా ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తమ పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించడానికి, సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ ఎన్నికల వల్ల తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిచేసుకోడానికి వినియోగించుకోవాలి. నిరంతర పోరాటం నుంచి వైదొలగి పార్లమెంటు, పరిపాలనలపైకి దృష్టిని మరల్చాలి. ఇటీవలి ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఉన్న కీలకమైన తేడాను నొక్కిచెప్పాయి. ఒక పార్టీ చేసిన తప్పుల నుంచి నేర్చుకోడానికి సిద్ధపడే దైతే, మరొక పార్టీ తన విజయాల నుంచి సైతం నేర్చుకోడానికి ఇష్టపడని బాపతు. బిహార్లో బీజేపీ, ఆ రాష్ట్రానికి నాయకత్వశక్తిగా ఓటర్లకు కనిపిం చడానికి ప్రయత్నించలేదు. పైగా దాని ప్రచారం మరీ చీల్చిచెండాడేట్టుగా, విభజనాత్మకంగా సాగింది. అసోంలో అది ఆ రెండు ధోరణులనూ వదిలే సింది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి సొంత స్థానిక నేతలు ఉండటమే కాదు, ఓటర్లలో దాదాపు 34 శాతం ముస్లింలు. కాబట్టి దూకుడుగా మతపరమైన కేంద్రీకరణ కోసం తహతహలాడకుండా అది నిగ్రహం చూపింది. బీజేపీ, బిహార్లోని తన ప్రత్యర్థుల నుంచి కలిసికట్టుగా పెద్ద కూటమిని ఏర్పరచా లనే విషయాన్ని నేర్చుకుంది. ఒకే ఓటు బ్యాంకు కోసం తమతో పోటీపడే వారితో సైతం కలవడానికి సిద్ధపడింది (ఏజీపీతో వలే). మరోవంక కాంగ్రెస్... బద్రుద్దీన్ అజ్మల్తో కూటమిని నిర్మించడానికి నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను తిరస్కరించింది. కూటములు పర స్పర అనుబంధంపై ఆధారపడి పనిచేసేవనీ, అలా అని గణాంకాలను తోసిపుచ్చలేమని మనకు తెలుసు. ఈ వారం వెలువడ్డ ఫలితాల్లో సైతం కాంగ్రెస్కు, అజ్మల్ ఏఐయూడీఎఫ్కు వచ్చిన మొత్తం ఓట్లు, బీజేపీ కూటమికి వచ్చినవాటికంటే ఎక్కువ! ఫలితం దిగ్భ్రాంతికరమైన బీజేపీ విజయం. దీంతో బిహార్లో కోల్పోయిన రాజకీయ ప్రతష్టను అది గణనీ యంగా పునరుద్ధరించుకోగలిగింది. మారగలమని నిరూపించుకున్నారు కేరళలో బీజేపీ, మమతా బెనర్జీ మార్గాన్ని అనుసరించినట్టనిపిస్తోంది. అక్కడ అది వామపక్షాలకు ప్రధాన భావజాల ప్రత్యర్థి కావాలని ప్రయ త్నించింది. ఒక దశాబ్దికి పైగా బెంగాల్లో కాంగ్రెస్ మృదువైన వామపక్ష భావజాలానికి అంటిపెట్టుకుని ఉండగా... మమత వామపక్షాలతో పోరా డారు. తరచుగా అవి హింసాత్మక వీధి పోరాటాలుగా సైతం సాగాయి. పెరుగుతున్న వామపక్ష వ్యతిరేక జనాభా కాంగ్రెస్ను గాక ఆమెనే ప్రత్యామ్నాయంగా చూసింది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వం వామపక్ష సానుభూతిదారుగా (పింకో-లెఫ్ట్) కొనసాగుతుంటే... బీజేపీ/ఆర్ఎస్ఎస్ వామపక్షాలకు నిజ మైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం అంతా సరైన దిశకు మళ్లు తున్నదిగా స్పష్టంగానే కనిపించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల ప్రధాని కటువైన విమర్శలు చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైన విభజ నాత్మక స్వరాన్ని దూరంగా ఉంచారు. ఇక అసోంలో పాకిస్తాన్, గో సంరక్షణలను ప్రస్తావించక పోవడమే కాదు, ముస్లిం వ్యతిరేకతను సైతం ప్రదర్శించలేదు. ‘‘చట్టవిరుద్ధ బంగ్లాదేశీయులు’’ ఉండటాన్ని రాజకీయ సమస్యగా చేసినా, ఎవరినీ బయటకు గెంటేస్తామనే బెదిరింపులు లేవు. ఇప్పటికే వచ్చి స్థిరపడ్డవారిని తిరిగి వెనక్కు పంపేయడమనే యోచన ఆచరణ సాధ్యంకానిదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేకించి హేమంత బిశ్వశర్మ దృఢంగా చెప్పారు. పశ్చిమబెంగాల్ నుంచి అసోం, కేరళల వరకు పార్టీ స్థానిక, జాతీయ నేతలంతా ఏం తింటారనేదే వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన వ్యవహా రమని చెబుతూ ‘గోమాంస’ పరీక్షలో నెగ్గారు. ఆసక్తికరకంగా, ఒక చట్టం ప్రకారం గోవధ సాంకేతికంగా చట్టవిరుద్ధమైనదిగా ఉన్న అసోంలో సైతం ఆ పార్టీ ఇదే పంథాను అనుసరించింది. క్రోడీకరించి చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి మారగలిగే శక్తీ, తిరిగి తనను తాను మలుచుకోగలిగే సామర్థ్యం ఉన్నాయని తెలిపాయి. భావజాలపరమైన మూర్ఖత్వానికి (ఈ వ్యక్తీకరణను ప్రయోగిస్తున్నందుకు మన్నించాలి) బదులుగా రాజకీయ ఫలిత ప్రయోజన వాదాన్ని తాను అనుసరించగలనని బీజేపీ నిరూపించుకుంది. ఇదే వాస్తవిక వాద దృష్టి పరిపాలన పట్ల బీజేపీ వైఖరిలో కూడా ప్రతిఫలిస్తుందా? అనేదే ఇప్పడు ముందున్న ప్రశ్న. కాంగ్రెస్ ఇంకా ముప్పుగా కనిపిస్తున్నంత వరకు బీజేపీ పార్లమెంటు లోనూ, పరిపాలనలోనూ సంఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం అర్థం చేసుకోగలిగినదే. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ అనే దాని లక్ష్యం ఇప్పుడు చాలా వరకు నెరవేరింది. కాంగ్రెస్తోనూ, దాన్ని శాసించే కుటుంబంతోనూ ఇంత వరకు అనుసరించిన సంఘర్షణను ఇంకా అదే స్థాయిలో కొనసాగించడం కోసం బీజేపీ మూల్యాన్ని చెల్లించనుందా? లేక వాళ్లను కొంతకాలం పాటూ విస్మరించడమే మంచిదని అది అనుకుంటుందా? ప్రశాంత్ కిశోర్ (రాహుల్కు సలహాలిస్తున్నారంటున్న నితీశ్ సన్నిహితుడు) ఉన్నా, లేకున్నా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ దానికి పెద్ద సవాలును ఇచ్చేదేమీ కాదు. కాకపోతే పంజాబ్లో బీజేపీ ఆప్కు తలొగ్గాల్సి రావచ్చు. విజయంతో లభించిన విరామం కాంగ్రెస్ తన ఓట్ల వాటాను వేగంగా కోల్పోతుండగా, దాదాపుగా వాటిలో ఏవీ బీజేపీ/ఎన్డీఏకు చేరకపోవడం 2014 పూర్వ జాతీయ రాజకీయాల్లోని కీలక వాస్తవం. కాంగ్రెస్ కోల్పోతున్న ఓట్లలో చాలా వరకు కాంగ్రెస్లాగా పేదరికవాద భాషలో మాట్లాడే శక్తివంతమైన స్థానిక పార్టీలు (ఆప్ సహా) చేజిక్కించుకోవడం జరుగుతుండేది. మరోవిధంగా చెప్పాలంటే, కాంగ్రెస్ అవసానదశ క్షీణతలో ఉన్నా... దాని ఓటు బ్యాంకు మాత్రం చెక్కుచెదర కుండా ఉన్నదని అర్థం. ఇతర పార్టీలు దాన్ని తీసుకుంటున్నాయంతే. అదే పనిగా కాంగ్రె స్పైనే దృష్టిని కేంద్రీకరించడంవల్ల అధికార పార్టీ... ఇందిరా గాంధీ కుటుంబాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తూ రాజకీయ వాస్తవాలను విస్మరి స్తుండవచ్చు. మోదీ పదవీ కాలంలోని రెండో సగభాగం మొదలు కావడానికి కొద్దిగా ముందు జరిగిన ఈ ఎన్నికలు బీజేపీకి చెప్పుకోదగిన విరామాన్ని కల్పిస్తాయి. తదుపరి జరగాల్సిన శాసనసభ ఎన్నికలు ఇంకా ఒక ఏడాది దూరంలో ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ విరామాన్ని తన పరిపాలనను చక్కదిద్దుకోడానికి, పరిపాలనకు సంబంధించి వెనుకబడిపోయిన పలు అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలి. మంత్రివర్గాన్ని పునర్వ్య వస్థీకరించడం, తమ ప్రభుత్వంలోని కొన్ని శాఖలు పూర్తిగా సక్రమంగా పనిచేయడంలేదని అంగీకరించడంతో ముడిపడినది కావడం వల్లనేమో... ఆ అవసరాన్ని గుర్తు చేయడాన్ని మోదీ ఇష్టపడరు. పైగా ఆయన ఒత్తిడికిలోనై అలాంటి పనులను చేయడానికి అసలే ఇష్టపడరు. అందువలన ఆయన బలంగా ఉన్న ఈ సమయం వదులుకో కూడనిది. రెండు ప్రధాన కారణాల వల్ల మోదీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఒకటి, క్రియాశీలకంగాలేని ప్రధానితో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలు విసిగిపోయి ఉండటం. రెండవది, ముఖ్యమైనది మోదీ వాగ్దానం చేసిన పరిపాలనాపరమైన సమర్థత, కల్పించిన ఆశ. 2019లో కూడా ఇదే కారణాలవల్ల తిరిగి గెలవగలమని ఆయన ఆశించలేరు. కాంగ్రెస్ అంతుచూసేశారు కాబట్టి వాటిలో ఒకటి లేకుండా పోయింది. రేపు ఆయన ఓటర్ల ముందుంచాల్సిన తన సంక్షిప్త పరిచయంలో వాగ్దానాల కంటే సాధించినవాటి గురించి ఎక్కువగా చెప్పుకోవడం అవసరం అవుతుంది. సంస్కరణల పూర్వ భారతంలో భావజా లేతరమైన ‘‘నేను ఎవరికీ ఏ బాధ్యత వహించా ల్సింది లేదు’’ అనే ధోరణి ఓటర్లలో పెరిగింది. ఇది రాజకీయ వేత్తలకు ఓటర్లతో ఉండే అనుబంధాన్ని మునుపెన్నడూ ఎరుగని రీతిలో పరివర్త నాత్మకమైనదిగా మార్చింది. దాన్ని గుర్తించక పోవడం లేదా దాన్ని ఖండించక పోవడం ఫ్యాషన్గా మారింది. ఏదేమైనా ఓటర్ల గుడ్డి విధేయత అనే రోజులు చెల్లిపోయాయి. నువ్వు నాకేమైనా చేశావా? దీని వల్ల నాకు ఒరిగేదేమిటి? వంటి ప్రశ్నలే ఓటర్లు అడిగేది. ఒక వంక ‘‘కేవలం నేను, నేను మాత్రమే, మరెవరితో సంబంధంలేని నేను’’ అనే యువతరం పెరుగుతుంది. మరోవంక రాజ్యాంగమే నిజమైన అధికా రమని, వామపక్ష లేదా మితవాద భావజాల వ్యాప్తిపై అది బలమైన పరిమితులను విధించగలదనే గుర్తింపు మెల్లగా పెరుగుతోంది. అంతఃశోధన అవసరం కాంగ్రెస్ తన వైఫల్యాలపై అంతఃశోధన జరుపుకుంటుందా లేదా అనేది ఇకనెంత మాత్రమూ మోదీ పట్టించుకోవాల్సినది కాదు. అందుకు బదులుగా తన ప్రభుత్వం ఇంతవరకు ఎంత బాగా పని చేసింది?అనే విషయమై ఆయన అంతఃశోధన చేసుకోవాలి. పార్ల మెంటులోని నిరంతర సంఘర్షణ ఉపయోగకరమైనదేనా? ఇప్పుడు తానూ, తన పార్టీ సురక్షితంగా ఉన్నా, మరింత బలీయంగా మారు తున్నా... ఇంత ప్రతికూలాత్మకత తమను ఆవరించి ఉండటం ఇంకా అవసరమేనా? సంఘర్షణాత్మక రాజకీయాలు వ్యసనంలాంటి మత్తును కలిగించేవి. కానీ అందుకోసం ఇకనెంత మాత్రమూ చెల్లించలేని మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శాసన, పారిపాలనా వ్యవస్థలను న్యాయవ్యవస్థ ‘‘దెబ్బతీస్తోంది’’ అంటూ శక్తివంత మైన ఉపన్యాసం చేశారు. వాస్తవాలకు సంబంధించి ఆయన సరిగ్గానే మాట్లా డారని అత్యంత అణకువతోనూ, భీతితోనూ విన్నవించుకుంటున్నాను. ఐపీఎల్ మ్యాచ్లను మార్చడం, బీసీసీఐ పరిధిని పునర్నిర్వచించడం, కరువు సహాయ చర్యలు చేపట్టమని ప్రభుత్వాన్ని ‘‘ఆదేశించడం’’ లేదా దీనిమీదో లేక దానిమీదో చట్టం చేయమని చెప్పడం ప్రారంభించడం ద్వారా న్యాయ వ్యవస్థ... సున్నితమైన అధికారాల పంపిణీ కోసం రాజ్యాంగం చేసిన ఏర్పా టును అస్థిర పరుస్తోంది. కానీ వాస్తవాలకు సంబంధించి జైట్లీ చెప్పింది సరైనదేగానీ, కోర్టులు ఎందుకు ఇలా శాసన, పరిపాలనా వ్యవస్థలలోకి చొరబడక తప్పడం లేదు? అవి ఎందుకు అలా ఉబలాటపడాల్సి వస్తోంది? ఇంకా అవి ఆ పని ఎలా చేయగలుగుతున్నాయి? అని ఆయనా, ఆయన ప్రభుత్వమూ ఆలోచించాలి. బలహీనమైన, రాజకీయ ప్రతిష్టలేని, విశ్వసనీ యతలేని యూపీఏ-2 హయాంలో న్యాయవ్యవస్థ, కార్యకర్తలు ఆ శూన్యం లోకి ప్రవేశించారు. ఇంకా ఆ ఖాళీ అలాగే మిగిలి ఉందంటే అందుకు కారణం... యూపీఏకున్న బలహీనతలు లేకున్నా ఈ ప్రభుత్వం సంఘ ర్షణల్లో తన రాజకీయ ప్రతిష్టను ఖర్చు పెట్టేయడమే. ఉత్తరప్రదేశ్, అరుణా చల్ప్రదేశ్లు అందుకు మంచి ఉదాహరణలు. ఈ ఎన్నికల వల్ల లభించిన విరామాన్ని, తిరిగి నెలకొన్న ఆత్మవిశ్వాసాన్ని అది తన దిశను సరిదిద్దు కోడానికి ఉపయోగించుకుని నిరంతర పోరాటం నుంచి దూరంగా జరిగి పార్లమెంటుపైనా, పరిపాలనపైనా దృష్టిని కేంద్రీకరించాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
కొత్త దేవతల వరాల జల్లులు
జాతిహితం ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. ద్రవిడ పార్టీలు నాస్తికత్వాన్ని వదిలేయడంతో తాయిలాల పంపకం కొత్త దేవునిగా అవతరించింది. హేతువాదం క్షీణించి, ద్రవిడ రాజకీయాలు చీలి పోవడంతో ఏర్పడ్డ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలూ లేవు, ఒకరినొకరు అవినీతిపరులని ఆరోపించుకునే అవకాశమూ లేదు. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం తాయిలాల పంపకమే. మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కనిపించే గోడల మీద రాతలు కొత్త పరిణామాల ఆవిర్భావాన్ని సూచిస్తుంటాయి. ప్రత్యేకించి ఎన్నికల సమ యంలోననే కాదు, ఎప్పుడైనా జరిగేదే. నగరాలు, వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామాలతో కూడిన పల్లెపట్టున పర్యటిస్తున్నప్పుడు మనం పూర్తిగా కళ్లు విప్పార్చి, చెవులు రిక్కించి గోడల మీద ఏమి రాసున్నదో లేదా మన చెవుల్లో ఏమి మారుమోగుతున్నదో గమనించాలి. మన దేశంలో ఏది మారుతోందో, ఏది మారడం లే దో అనివార్యంగా మీకు తెలుస్తుంది. భారత ఉపఖండం తన హృదయాన్ని గోడల మీద పరుస్తుంది. తమిళనాడు రాజ కీయాలు ప్రత్యేకమైనవి అయినంత మాత్రాన ఆ రాష్ట్రం అందుకు మినహా యింపనడానికి హేతువేమీ కనిపించదు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పేరెన్నికగల పట్టు వస్త్రాలకు పేరుమోసిన కాంచీపురం నాకు దేశంలోకెల్లా అత్యంత ఇష్టమైన స్థలం. చెన్నైకి వంద కిలోమీటర్ల దూరంలోని ఆ పాత పట్టణం శివారున పురాతనమైన శంకర మఠం ఉంది. అది శంకారాచార్యుల నివాసస్థానం. సనాతన హిందూవాద ఆధ్యాత్మిక అధికారానికి అతి ప్రముఖ కేంద్రం. అక్కడ మీరు తగినంత ఎక్కువ కాలమే గడిపేట్టయితే, నేను అక్కడికి వెళ్లిన మొదటిసారి చేసినట్టే మీరూ శంకరాచార్యులను సందర్శించడానికి వెళ్లేట్టయితే... ఆయన ‘‘జూని యర్’’ రాక కోసం వేచి చూస్తున్న శ్రోతలకు వినిపించే రికార్డు చేసిన సంస్కృత శ్లోకాలూ, మఠానికి బయట పక్కనే ఉన్న జుమా మసీదు నుంచి వినిపించే అజాన్ (ప్రార్థనకు పిలుపు) అనుద్దేశపూర్వకంగానే కలగలసి జుగల్ బందీలా ధ్వనించడాన్ని వినకుండా ఉండలేరు. మతతత్వం, నాస్తికత్వాల సహవాసం సరిగ్గా ఆ వీధి కూడలిలో శంకరాచార్యుల కోసం పూలు, పళ్లు కొనడానికి దిగే చోట... 20వ శతాబ్దపు అత్యంత సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడైన పెరియార్ బస్ట్ సైజు విగ్రహం కనిపిస్తుంది. ఆయనను మరచిపోయిన తరాలవారు సునీల్ ఖిలానీ తాజాగా రాసిన ‘ఇన్కార్నేషన్స్’ను త్వరత్వరగా తిరగేసి చూడొచ్చు. బ్రాహ్మణవాదం, కులవాదం, సామాజిక అసమానత, మూఢ నమ్మకాల వ్యతిరేక పోరాటంతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన, వివాదాస్పదమైన సామాజిక-రాజకీయ పరివర్తన ఉద్యమాన్ని పెరియార్ ప్రారంభించారు. ఆయన వీటన్నిటినీ హేతువాదం, నాస్తికత్వం అనే ఒకే భావజాల ఛత్రం కింద చేపట్టారు. ఇప్పుడాయన మఠం, మసీదులను చూస్తూ ఉన్నారు. అంతేకాదు విగ్రహానికి కింద దేవుడిని, దైవత్వాలను ఖండిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కించుకుని మరీ పరివేష్టితులై ఉనారు. దేవుడు లేడు/దేవుడు లేడు/దే వుడు లేనే లేడు/దేవుణ్ణి కనిపెట్టివవాడు మూర్ఖుడు/దేవుణ్ణి ప్రచారం చేసేవాడు వంచకుడు/దేవుణ్ణి పూజించేవాడు ఆటవికుడు: దేశంలోని మరే ప్రజా నాయకుడు దేవుణ్ణి ఖండించి, ధిక్కరించి ఎరుగని రీతిలో ఆయన... గొప్ప హిందూ సాంస్కృతిక కేంద్రం, ప్రముఖ మసీదులతో పాటూ ఆ వ్యూహాత్మక ప్రదేశాన్ని పంచు కుండటమే ముఖ్యమైన విషయం. గాఢమైన, సనాతన మతతత్వం, అత్యంత సూటియైన హేతువాదం కలసి ఒకే రెండు వందల చదరపు గజాల స్థలాన్ని పంచుకోవడాన్నిమరే దేశంలో చూడగలం? హిందూ గ్రూపులు దీన్ని అపచారమంటూ సవాలు చేశాయి. కానీ మద్రాసు హైకోర్టు 1979 తీర్పులో ఒక వ్యక్తి విగ్రహంతో పాటూ అతని అభిప్రాయాలను లిఖించడంలో తప్పేమీ లేదని తీర్పు చెప్పింది. ఆ ఆదేశాల సారాంశం సైతం కళ్ల జోడు పెట్టుకున్న పెరియార్కు దిగువన మరో నల్ల రాతిపై కనిపిస్తుంది. సుప్రసిద్ధ విగ్రహ విధ్వంసకుడే నల్ల రాతి ప్రతిమ అవతారమెత్తి దేవుళ్లను వెక్కిరించడం, అది నల్ల రాతిపై తెల్ల అక్షరాలతో చెక్కి ఉండ టానికి మించిన వ్యంగ్య పరిహాసం ఇంకేమంటుంది? నాస్తికత్వానికి ద్రవిడ పార్టీల చెల్లు చీటి ఒకప్పడు ద్రవిడ సాధికారతా మహోద్యమాన్ని ప్రజ్వలింపజేసిన నాస్తికత్వం నేడు పాతకాలపు ఉద్వేగంగా మారిపోయింది. బ్రాహ్మణ కులానికి చెందిన జయలలిత తన మతతత్వాన్ని ఎన్నడూ దాచుకున్నది లేదు. ఇక క రుణానిధి, ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్ (నా వాదనకు మద్దతు కోసం ఆధారపడుతున్నది ఆయనపైనే) అన్నట్టు... పాత హేతువాదపు చివరి ప్రముఖ స్వరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నా, ఆయన తర్వాత ఇప్పట్లో అలాంటి వారు ఆవిర్భవించరు. ఆయన కుమారుడు స్టాలిన్ కుటుంబం తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంది. పురావస్తు, చారిత్రకపరమైన ఆసక్తితోనే వెళుతున్నామనేదే వారు చెప్పే ప్రధానమైన సాకు. ఎన్నికలు జరగ నున్న తమిళనాడులో నేను గడిపిన ఐదు రోజుల్లో దేవుడులేడనే తత్వం గుర్తున్న ఒక్క ఓటరు కూడా నాకు కనబడలేదు లేదా నా దృష్టికి రాలేదు. ఆలయాల నిండా భక్తులున్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణేతర పురోహితు లున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ దైవాంశ సంభూతులైన బాబాలు, గురు వుల అనుయాయులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్లు సైతం వారిలో ఉన్నారు. కరుణానిధి భార్య లలో ఒకరు పెద్ద కుంకుమ బొట్టును పెట్టుకుంటారని డీఎండీకే నేతగా మారిన సినీ నటుడు విజయ్కాంత్ చెబుతున్నారు. తమిళ రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన ఏఆర్ వెంకటాచలపతి నేను కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూనే... సీఎన్ అన్నాదురై సైతం 1940ల చివర్లో పెరియార్తో విడిపోయినప్పుడు ఆయన నాస్తికత్వానికి దూరంగా జరిగారనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనే సమస్యపై అన్నాదురై, పెరియార్కు దూరమయ్యారు. ఏడు దశాబ్దాల తర్వాత సరిగ్గా అదే విషయంపై కేజ్రీవాల్, అన్నా హజారే నుంచి విడిపోయారు. సామాజిక అసమానతపై దాడి చేయడానికి హేతు వాదాన్ని ఉపయోగించుకోవడం, అందుకు వ్యతిరేకులుగా ఉన్న ఓటర్లను ఆక ట్టుకోవడం పూర్తిగా భిన్నమైనవని అన్నాదురై గుర్తించారని వెంకటాచలపతి గుర్తుచేశారు. తమిళనాడులోకెల్లా అత్యంత జనాదరణగల దేవుడు గణేశుడు. అంతేకాదు పెరియార్ పగలగొట్టిన దేవుళ్ల విగ్రహాల్లో గణేశుని విగ్రహాలే ఎక్కువ. ‘‘నేను పిళ్లయ్యార్కు కొబ్బరికాయలూ కొట్టను, ఆయన విగ్రహాలూ పగులగొట్టను’’ అని అన్నాదురై 1954లో చెప్పిన సుప్రసిద్ధ వాక్యాలను ఆయన గుర్తుకు తెచ్చారు. అమ్మ, స్టాలిన్ల నడుమ ఆ ఎడబాటు ఇప్పడు పరిపూర్ణమైంది. జనాకర్షణ కోసం పాట్లే భావజాలం బ్రాహ్మణాధిపత్య క్షీణత కూడా ఇందుకు తోడ్పడింది. పీకే సినిమాలోని అమీర్ఖాన్ అంగారక గ్రహవాసి బాబాలకు ‘‘దేవుని మేనేజర్లు’’ అని పేరు పెట్టడానికి చాలా ముందే ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకులు ఆ విషయాన్ని గుర్తించారు. ఇప్పుడా మేనేజర్లు ధైర్యంగా మాట్లాడుతుండగా... నాటి ద్రవిడ ఉద్యమ నేతల పిల్లలకు దేవలతో అలాంటి పేచీయే లేకుండా పోయింది. ఆ పార్టీల్లోని కరడుగట్టిన నాస్తికులు దీనికి చుట్టుదారిని కనుగొన్నారు. వృద్ధ కరుణానిధిలాగే నేనూ కొంతకాలం ప్రముఖ యోగా బోధకుడు టీకేవీ దేశి కాచార్ (కృష్ణమాచార్య యోగా మందిరం) వద్ద యోగాభ్యాసం చేశాను. ఆయన ఎన్నడూ ‘‘ఓం’’ అని పలికి ఎరుగరు. ‘‘సూర్యుడు, ఎంతైనా మా పార్టీ గుర్తే కదా’’ అంటూ ఆయన తనకు సూర్య నమస్కారాలతో సమస్యేమీ లేదని చెప్పారు. హేతువాదం క్షీణించిపోయి, ద్రవిడ రాజకీయాలు చీలిపో వడంతో దాదాపు ఒకే భావజాలంగల రెండు పార్టీలు ఏర్పడ్డాయి. అయితే ఆ రెండు పార్టీలూ నేడు పూర్తి భావజాలరహితమైనవిగా మారిపోయాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శ్రీలంక సహా పెద్ద సమస్యలంటూ ఏమీ లేవు. తమిళ రాజకీయాల్లోని ఆ రెండు ధ్రువాలను సూచించే ప్రత్యేక సూత్రాలు, భావాలు లేదా నినాదాలు ఏవీ లేవు. ఒకరు మరొరిని అవినీతిపరులని ఆరోపించే అవకాశమైతే అసలుకే లేదు. ఉన్నవల్లా యుద్ధానికి దిగిన కుటుంబాలే. అవి కరుణానిధి కుటుంబం, ఎమ్జీఆర్ కుటుంబం. రెండు పార్టీల ఉమ్మడి విశ్వాసం ఓటర్లకు తాయిలాల పంపకమే. అమ్మ ఓటరుకు పూర్తి వంటగది సామాను, కుటుంబ వినోదం, కొంత బంగారం కూడా ఉచితంగా ఇచ్చేస్తారు. డీ ఎంకే ఆమె ఇచ్చే ఉచిత కానుకలను దుమ్మెత్తి పోస్తుందనిగానీ, అదీ విద్యార్థుల, రైతుల రుణాలను మాఫీ చేస్తానంటుంది. ఇక విజయకాంత్ ఈ అర్థరాహిత్యాన్ని మరో స్థాయికి లేవ నెత్తి ఉచితంగా రేషన్ సామానంతా ఇంటికే సరఫరా చేస్తామంటారు. దేవుడు పూర్తిస్థాయిలో పునఃప్రవేశం చేయడంతో తాయిలాల పంపకమే నూతన రాజకీయ భావజాలంగా మారింది. అయినా ద్రవిడవాద పునరు ద్ధరణ మొలకలు కొన్ని కనిపిస్తున్నాయి. అతి చిన్న పట్టణాలలో పుస్తకాలు, పేపర్ల దుకాణాల్లో పెరియార్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోతున్నాయి. ‘‘ఒక రాజకీయ మతాన్ని దాని అనుచరులు వదులుకున్నాక దాని అంచులలో మనుగడ సాగిస్తున్నవారు మరింత గట్టి భావజాలవాదులుగా మారారు’’ అని వెంకటాచలపతి అన్నారు. నేటి తమిళనాడులో పెరియార్వాదులైన యువత, విద్యార్థులు పెరగడం, విద్యావంతులైన దళిత యువత ఆయనపట్ల ఆకర్షితులు కావడం పెరగడం దాన్నే ప్రతిబింబిస్తోంది. ఈ నూతన కేంద్రీ కరణ ఎంత శక్తివంతమైనదో మనం ఇప్పటికే మద్రాసు ఐఐటీలో అంబేడ్కర్-పెరియార్ గ్రూపు ఏర్పాటు ద్వారా చూశాం. భారత రాజ కీయాలు ఎప్పుడూ విస్మయకర అంశాలను బయటపెడుతుంటాయి. అదే మన రాజకీయాలకున్న ప్రబల ఆకర్షణ శక్తి. - శేఖర్ గుప్తా Twitter@ShekarGupta -
చేతిలో ‘చెయ్యి’ అయ్యేనా నాంది?
జాతిహితం బెంగాల్లో మమత వ్యతిరేక కూటమిని కట్టిన సీపీఎం, కాంగ్రెస్లకు ఉమ్మడి ప్రణాళిక లేకపోవచ్చు. కానీ, ఆచరణసాధ్యం కాని తన సైద్ధాంతికత నుంచి సీపీఎం వెనక్కు తగ్గడాన్ని గమనించవచ్చు. వామపక్షాలు సైద్ధాంతిక శుద్ధత నుంచి రాజకీయ వాస్తవికతకూ, మధ్యేవాద వామపక్ష వైఖరికి మార్పు చెందుతున్నాయని చెప్పొచ్చు. వామపక్షాలు మధ్యేవాద దిశగా జరుగుతున్నంతగానూ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వామపక్ష దిశకు మొగ్గుతోంది. ఈ పునరేకీకరణే బెంగాల్ రాజకీయ సందేశం. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ఒక్క ముక్క బెంగాలీ తెలియ కుండా ప్రయాణిస్తున్నాగానీ గోడల మీద ఏమి రాసి ఉన్నాయో మీరు చదివే యగలరు. అవి అసాధారణమైన లిపులలో ఉండటమే కాదు, అవి వేరే వేరే రంగుల్లో కూడా కనిపిస్తాయి. కొల్కతా ప్రధాన రహదారుల వెంబడి ఉండే విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన లక్షలాది చిన్న చిన్న లెడ్ లైట్లతో అవి రాసి ఉంటాయి. వినిల్ కాగితంతో, బట్టతో తయారుచేసిన జెండాలు ఒకే చెట్టును, ఇంటి కప్పునే కాదు, బట్టలారేసే తీగను కూడా సంతోషంగా పంచుకుంటూ ఎగరడం కనిపిస్తుంది. సంప్రదాయకమైన సిరా, న్యూస్ప్రింట్లతో రాసిన రాతలు కూడా కొన్ని కనబడతాయనుకోండి. వివిధ లిపులలో రాసి ఉన్న ఈ రాతలు 9.3 కోట్ల మంది బెంగాలీలు మాత్రమే రచించగలిగిన ఎంతో సంక్లిష్టమైన, నాటకీయమైన రాజకీయ మార్పును కళ్లకు కడతాయి. పరి బొర్తన్ను (మార్పును) తెస్తామనే వాగ్దానాన్ని నమ్మి బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, వామపక్షాలను అధికారం నుంచి పారదోలేలా చేశారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వారు తాము విశ్వసించిన మార్పు వచ్చిందా లేదా అనేది తేల్చుకోవాల్సి ఉంది. అధికారం పట్ల వెంపర్లాట ఇసుమంతైనా మారలేదని ఆ లెడ్ లైట్లే చెబుతాయి. వామపక్షాలు కేవలం ఎర్ర జెండాలతోనే నగరాన్ని నింపేసేవి, పార్టీ నినాదాలతో, భారీ సుత్తీ-కొడవళ్లతో గోడలన్నిటినీ వికృతం చేసేవి. కాగా మమతా తృణమూల్ రాజధాని నగరాన్నంతటినీ తమ పార్టీ రంగులైన నీలం, తెల్ల రంగులతో నింపేసింది. అదే రాత్రిపూట ప్రధాన రహదారుల గుండా డ్రైవింగ్ చేస్తూ పోతుంటే ఇరువైపులా వేలాడుతున్న విద్యుద్దీపాల తోరణాలు కూడా అదే రాజకీయ రంగుల్లో కనిపిస్తాయి. అలవాటుగా నేను రాత్రి నడకకు బయల్దేరి కొన్నిమీటర్లు వెళ్లేసరికే నీలం-తెలుపు సముద్రంలో మునిగిపోయాను. వామపక్షాలు కూడా ‘విజేతకే అన్నీ’ అనే ఇవే రాజకీయాలలో పరి పూర్ణతను ప్రదర్శించాయి. అయితే వాటికి వ్యక్తి పూజ ఉండేది కాదు. కాగా టీఎంసీవి పూర్తిగా వ్యక్తి కేంద్రక ప్రభుత్వం, రాజకీయాలు. ఆ పార్టీ సీనియర్ నేతలలో చాలా మంది మమతను అధినేత్రిగా (సుప్రిమో) చెబుతుంటారు. ఈ సుప్రిమో లేదా అధినేత/అధినేత్రి అనే ఈ పద ప్రయోగాన్ని భారత రాజ కీయాల్లోనే మొట్టమొదటిసారిగా నేను 1993 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచా రంలో జయప్రద (చంద్రబాబునుద్దేశించి) వాడగా విన్నాను. అప్పటి నుంచి ఆ పదం కొన్ని రాష్ట్రాల రాజకీయాలనే నిర్వచించేదిగా మారింది. తమిళనాడు (జయలలిత), ఉత్తరప్రదేశ్ (మాయావతి), మూడోదిగా బెంగాల్ వాటిలో ప్రముఖమైనవి. హింసాత్మక రాజకీయాల్లో గొప్ప మార్పు కేడర్ పునాదిగా గల పార్టీ నుంచి అధినేత్రి నేతృత్వంలోని పార్టీకి అధికారం మారినంత మాత్రాన రాజకీయాల స్వభావంగానీ, ధోరణిగానీ లేదా ప్రత్య ర్థుల ప్రచారాల సరళిగానీ మారలేదు. అయితే, వీధి రాజకీయాలకు ఉండే హింసాత్మక స్వభావం విషయంలో అపారమైన మార్పు వచ్చింది. బట్టమీద, వినిల్ మీద రాసి ఉన్న రాతలే ఆ విషయాన్ని తెలుపుతాయి. మొదటిసారిగా ఒకే చెట్టు మీద, ఒకే ఇంటి మీద సీపీఎం, కాంగ్రెస్ జెండాలను చూసి నేను నివ్వెరపోయాను. గతంలో ఇది ఊహించ సాధ్యంకానిది. గతంలోనైతే ఒక కాంగ్రెస్ పార్టీ మనిషి తమ జెండాను సీపీఎం ఇంటిపై పెట్టడంగానీ లేదా కాంగ్రెస్ ఇంటిపై సీపీఎం జెండాను పెట్టినా రక్తసిక్త పోరాటానికి దారి తీసేదనేది వాస్తవం. మమత మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా సుప్రసిద్ధుడు.1972-2009 మధ్య దాదాపు 57,000 మంది రాజకీయ హింసకు బలైపోయారని ఆయన చెప్పారు. ‘‘నా నియోజకవర్గానికి రండి. షహీద్ వెదిలను (అమరుల స్మృతి చిహ్నాలు) మీకు చూపిస్తాను.’’ ఒకటి సీపీఎం చంపిన కాంగ్రెస్ మనిషిదైతే, మరొకటి కాంగ్రెస్ చంపిన సీపీఎం మనిషిదిగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. అయితే ఇప్పుడు వివాదాస్పదమైన సింగూర్లో సైతం సీపీఎం, కాంగ్రెస్లతో టీ ఎంసీ ఒకే స్థలాన్ని పంచుకోగలుగుతోందనేది వాస్తవం. మొత్తంగా ఒక నివాస ప్రాంతాన్ని కాకపోయినా మొత్తంగా గోడలను పార్టీలు ‘‘ఈ గోడ ఫలానా పార్టీ వారి కోసం రిజర్వు చేసినది’’ అని నెలల ముందే రాసిపెట్టుకునే రాష్ట్రంలో ఈ పరిణామం చాలా ముఖ్యమైనదే. అలాంటి ఆధీన రేఖను అతిక్రమించడం అంటే నిర్దాక్షిణ్యమైన శిక్షను ఆహ్వా నించడంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు వాళ్లంతా ఒకే స్థలాలను పంచుకో వడం రెండు విషయాలను తెలుపుతోంది. ఒకటి, బెంగాల్ రాజకీయాలు కొంత తక్కువ హింసాత్మకంగా మారాయి (ఈ ఎన్నికల ప్రచారంలో ఇంత వరకు ‘‘ఒక్కటే’’ హత్య నమోదైందని మమత సగర్వంగా మనకు చెబుతు న్నారు). ఇక రెండవది, ఐదేళ్లపాటు స్నేహపూర్వకంగా ఉండే పోలీసుల అండ లేకుండా ఉన్న సీపీఎం తన దాదాగిరీ రాజకీయాలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. విచ్చుకత్తుల పొత్తు నిలిచేనా? మమతా వ్యతిరేక ఫ్రంట్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న సీపీఎం నేత సూర్జ్య కాంత మిశ్రా, రాష్ట్ర కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురీతో కలసి ఇటీవల ఒకే బహిరంగ సభ వేదికపై నుంచి మాట్లాడారు. ఆ తర్వాత, సీపీఎం పార్టీ ఏ గుణపాఠాలను నేర్చుకున్నదని మిశ్రాను అడిగితే... ‘‘పరిపాలనలో పార్టీ క్యాడర్ల జోక్యాన్ని అనుమతించడం తప్పు’’ అని చెప్పారు. ఇక మీదట అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యకర్తలకు అతీతంగా ఉంచుతామన్నారు. ఆయన తన వాగ్దానాన్ని నిలుపుకుంటారనిగానీ, వారి కూటమి ఎంతో కాలం నిలుస్తుందనిగానీ చాలా మంది నమ్మడం లేదు. ‘‘దశాబ్దాలుగా వారు ఒకరిని ఒకరు చంపుకోవడం చూశాం. ఇప్పుడు వారు మమతను గద్దె దింపాలని మాత్రమే చేతులు కలిపారు. ఆ లక్ష్యం నెరవేరిందే అనుకుంటే ఇక వారిని కలిపి ఉంచేది ఏముంటుంది?’’ అని పేరు చెప్పడానికి సిద్ధపడని ఒక వ్యాపారి అన్నారు. అయితే వారలా అనివార్యంగా విడిపోవడమనేది 2016 నాటి బెంగాల్ రాజకీయ గోడలపై లిఖించి లేదు. అధికారానికి దూరంగా మరో ఐదేళ్ల పాటూ అంధకారంలో గడపడం తమ పార్టీని నాశనం చేసేస్తుందని సీపీఎంకు తెలుసు. ఇక కాంగ్రెస్ ఇప్పటికే పెద్దగా లెక్కలో లేనిదిగా మారిపోయింది. కాబట్టి ఆ రెండూ పార్టీలకు కలసి ఉండటం తప్ప గత్యం తరం లేదు. వాటికి ఉమ్మడి ప్రణాళిక లేకపోయి ఉండవచ్చు కానీ, సీపీఎం ఆచరణసాధ్యం కాని తన రాజకీయ ఆర్థిక ైసైద్ధాంతికత నుంచి వెనక్కు తగ్గడాన్ని ఇప్పటికే మీరు గమనించవచ్చు. 2008 తర్వాత తమ పార్టీ క్షీణి స్తోందని ఆ పార్టీ నేతలు ఇప్పడు అంగీకరిస్తున్నారు. భారత వామపక్షాల విషయంలో ఇలాంటి మార్పంటే, బ్రహ్మాండమైన భూ పలకాల స్థాన చలనం వంటి గొప్ప పరివర్తనే. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసం కాంగ్రెస్, తదితర ‘‘లౌకికవాద’’ పార్టీలకు మద్దతునిస్తున్నామని చెప్పడం సాధారణంగా వామ పక్షాలకు అలవాటు. బెంగాల్లో, వారి కూటమి నిజమైన లౌకికవాద ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన పూర్తి రాజకీయ కూటమి. మధ్యేవాద దిశగా వామపక్షాలు కేరళలో సాంప్రదాయకవాది అయిన వీఎస్ అచ్యుతానందన్ ఇంకా సీపీఎంకు నేతృత్వం వహిస్తుండగా నేనిలా అనడం గుడ్డి విశ్వాసం కావచ్చునేమో. కానీ భారత వామపక్షాలు సైద్ధాంతిక శుద్ధత నుంచి రాజకీయ వాస్తవికతకూ, కమ్యూనిజం నుంచి దాదాగిరీ లేని సోషల్-డెమోక్రటిక్, మధ్యేవాద వామ పక్ష వైఖరికి మార్పు చెందడాన్ని మనం చూస్తున్నామని చెప్పే సాహసం చేయ వచ్చనుకుంటాను. బెంగాలీ మాట్లాడే మరో రాష్ట్రమైన త్రిపురలో మాణిక్ సర్కార్ నేతృత్వంలో ఈ విధమైన పరివర్తన వారికి చాలా చక్కటి ఫలితాల నిచ్చింది. గోర్బచెవ్, డెంగ్లు సంస్కరణలను చేపడుతుండగా భారత కమ్యూని స్టులు ఆ మార్పును ప్రతిఘటిస్తున్నారెందుకు? అనే అంశంపై నా మొదటి రాజకీయ కథనాన్ని రాయడం కోసం 1988లో ఎప్పుడోగానీ ఇక్కడికి వచ్చాను. ఆ కథనంలో నాటి బెంగాల్ సీపీఎం పార్టీ నేత సరోజ్ ముఖర్జీ సగ ర్వంగా ‘‘డెంగ్, గోర్బచేవ్ల దానికంటే మా కమ్యూనిజం మరింత పరిశుద్ధమై నది కాబట్టి’’ అని చెప్పడం కూడా కనబడుతుంది. నేనా విషయాన్ని ప్రస్తా విస్తూ, వామపక్షాలు మన్మోహన్తో అంటకాగడం ఏమిటని పదే పదే దాడి చేస్తున్నందుకు ఒక సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ నన్ను మందలిం చారు.‘‘రాజకీయ చరిత్ర నుంచి నేర్చుకో. భారత వామపక్షాలు మారకుండా ఏం లేవు. స్వాతంత్య్రం సమయంలో వారు ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిం చారు. ఇప్పుడు వారిలో చాలా మంది ఎన్నికల పోరాటంలోకి దిగారు. మరింత మార్పు వస్తుంది. వారికి సమయం ఇవ్వాలి’’ అన్నారాయన. రామ్నాథ్ గోయంకా హయాం నాటి ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్’ తర్వాత అంతగా ఎన్నికల సమయంలో రాజకీయ పక్షపాత వైఖరిని చూపుతున్న ప్రధాన బెంగాలీ పత్రిక అవీక్ సర్కార్కు చెందిన ‘అమృత బజార్ పత్రిక’ (ఏబీపీ) గ్రూపే. మమతా, ఆమె పార్టీ వారు అవీక్కు ఎన్నయినా చెడు ఉద్దేశాలను ఆపాదించవచ్చు. కానీ ఆయన భారతదేశంలోని అత్యంత ధైర్యవంతుడైన పత్రిక యజమాని (మమతా, మోదీలు ఇద్దరితో ఒకేసారి తలపడగల వెర్రివాడు కూడా). బెంగాల్ రాజకీయ గోడలపై రాసి ఉన్న అనివార్య రాజకీయ పరివర్తనను మీరు మొదటి చూపులో గ్రహించకపోయి ఉండవచ్చు. అది ఆయన పత్రిక మొదటి పేజీలోని ప్రధాన శీర్షికలోనే ‘‘చేతిలో చెయ్యి’’ అని రాసి ఉంది. ప్రతి ‘‘చెయ్యి’’నీ సీపీఎం, కాంగ్రెస్ రంగుల్లో అదే వరుసలో చూపారు. ఇది భారత వామపక్షాలలోని మధ్యేవాద మార్పును సూచించినంతగా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వామపక్ష దిశగా మొగ్గడాన్ని కూడా సూచిస్తుంది. ఈ రాజకీయ పునరేకీకరణే బెంగాల్ ఎన్నికల రాజకీయ సందేశం. వ్యాసకర్త: శేఖర్ గుప్తా twitter@shekargupta -
అసంబద్ధ క్రీడ అరాచకపు జాడ
జాతిహితం మనకు పరిచయం లేని సట్లేజ్-యమునా లింక్ లేదా ఎస్వైఎల్ కాలువపై దృష్టిని కేంద్రీకరించడం మనకు కష్టమే ఆ మాటకొస్తే, లోక్సభకు 23 మంది ఎంపీలను మాత్రమే పంపుతున్న పంజాబ్, హరియాణాల మధ్య రేగుతున్న సంఘర్షణపైన దృష్టి పెట్టడమూ కష్టమే. అదీ కూడా కోల్కతాలో క్రికెట్ దిగ్గజాల పోరు సాగనుండగా అది పట్టించుకోవడం ఎలా? వార్తా చానళ్ల ప్రైమ్ టైమ్ అంతా దానితోనే నిండిపోతుంది. ఇంకా ఏమైనా కాస్త సమయం మిగిలితే అది, భారత్ మాతా కీ జై... తదితరాలకు సరిపోతుంది. కాబట్టి సట్ల్లేజ్-యమునా లింక్ గురించి పట్టించుకోవడం కష్టమే. కాస్త సంచలనాత్మ కతను ప్రదర్శించే ప్రయత్నం నేనూ చేస్తా. కాబట్టి హరియాణా, పంజాబ్, సట్లేజ్లనూ, శ్రీ శ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారు కాబట్టి యముననూ మరిచి పోండి. కానీ పటాన్కోట్ గురించి ఆలోచించండి. మీ కళ్లను పటాన్కోట్కు ఉత్తరంగా పది మైళ్ల దూరాన మొదలయ్యే జమ్మూ-కశ్మీర్పైకి మరల్చండి. ఇప్పుడిక ఇలా ఊహించుకోండి... ఆ రాష్ట్ర శాసనసభ ఇప్పుడు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ చట్టం చేయబోతున్నది. ఇక మరింత దేశీయమైన విషయాల కొస్తే అది ఆ రాష్ట్రంలో భారత రైల్వేలు రైలు లైన ్లను నిర్మించడానికి అనుమతిని ఉపసంహరిస్తోంది. తమ రాష్ట్రం నుంచి భారత సైన్యం సైనిక చర్యలు చేపట్టడంపై నిషేధం విధిస్తోంది లేదా ఇంకా సరళమైన విషయాలకు వస్తే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని విధించడం చట్టవిరుద్ధమైనదని ప్రకటించనుంది అని కూడా అనుకోండి. అప్పుడిక, మనలో కొందరం నేరుగా ఇంటి కప్పెక్కి , టీవీ స్టూడియోల కోసం తెల్లబడ్డ మీసాలను మెరిపిస్తూ ద్రోహం అని గావు కేకలు వేస్తాం. మరికొందరం ఆయుధాగారాలకు వెళ్లి రైఫిళ్లను లోడ్ చేసుకుంటాం. మిగతా వాళ్లం... చూడండి, మేం ఇలాగవుతుందని చెప్పలేదా? అంటాం. కశ్మీరీల నుంచి మీరు ఆశించగలిగేది ఏముంటుంది? తక్షణమే ఆ దిక్కు మాలిన ఆర్టికల్ 370ని రద్దు చేయండి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయండి అంటాం. నీళ్లు లేవంటే లేవంతే ఇదంతా సంచలనాత్మకతే, ఒప్పుకుంటున్నా. అందుకే ఈ కాల్పనికతకు ఇన్ని క్షమాపణా పూర్వకమైన జాగ్రత్తలు. ఇక మీరు మీ దృష్టిని తిరిగి పటాన్కోట్కు, అది భాగంగా ఉన్న పంజాబ్ మీదకు మరల్చండి. ఆ రాష్ట్రం, తన పొరుగున ఉన్న సోదర రాష్ట్రమైన హరియాణాతో ఉన్న కీలకమైన నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసేస్తూ తాజాగా ఓ చట్టాన్ని ఆమోదించింది. పాతికేళ్లకు పైగా పూర్వం, సట్లేజ్ నదీ జలాల్లోని హరియాణా వాటా నీటిని తరలించడం కోసం 213 కిలో మీటర్ల పొడవు కాలువ తవ్వడం కోసం సేకరించిన రైతుల భూములను వారికి తిరిగి ఇచ్చేస్తున్నామని వారికి తెలిపింది. నమ్మశక్యం కానంతటి ఈ రాజ్యాంగపరమైన అరాచకత్వాన్ని గురించి ఒకే ఒక్క వార్తా పత్రిక ‘ద ట్రిబ్యూన్’ మాత్రమే మనల్ని ముందస్తుగా హెచ్చరించింది. ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నట్టు చేసిన ఈ కొత్త చట్టంపై పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ఇంకా సంతకం చేయలేదనే వాస్తవం ఎవరికి పట్టింది? ఆ కాలువను పూడ్చేయడం కోసం వేలాది చెట్లను, శిథిలాలను, మట్టిని పోయడం కోసం జేసీబీలను, బుల్డోజర్లను నియ మించారు. మొత్తం దేశం, వ్యవస్థలు అదేదో ముందస్తు నిర్ణయమన్నట్టుగా మిన్నకున్నాయి. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన సుప్రీం కోర్టుకు... ఎవరికి ఇవ్వడానికీ మా దగ్గర నీళ్లు లేవని పంజాబ్ తెగేసి చెప్పేసింది. ఇప్పటికే ఇది పూర్తి అసంబద్ధత అనుకుంటుంటే, పంజాబ్, హరియాణా రెండు రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న గౌరవనీయులైన సోలంకి రెండు రాష్ట్ర శాసనసభలను ఉద్దేశిస్తూ విడి విడిగా ప్రసంగించారు. హరియాణాకు మనం నీరిచ్చే సమస్యే లేదని పంజాబ్ శాసనసభలో చెప్పి, ఇలాంటి అన్యాయాన్ని ఎంత మాత్రం సహించేది లేదు అని హరియాణాలో చెప్పారు. అయితే ఈ అసంబద్ధతతో ముగిసిపోలేదు. హరియాణా, పంజాబ్లు రెండూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ దాని నాయక భాగస్వామి. ఊహాత్మక సమస్యలతోనే తలమునకలు రెండు బీజేపీ రాష్ట్రాలు నదీ జలాల గురించి ముష్టి ఘాతాల పోరును ప్రారంభిస్తుంటే, ప్రతి ఒక్కరూ ఈ ప్రహసనంలోకి వచ్చి చేరుతున్నారు. హరియాణాలో, కాంగ్రెస్, చౌతాలా పార్టీ తమ రాష్ట్ర హక్కుల కోసం పోరాటంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి. ఇక పంజాబ్లో కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ అరాచకత్వానికి పూర్తి మద్దతునిస్తోంది. ఇక గోవు కంటే పవిత్రమైనదైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రంగంలోకి దూకింది. హరియాణాకు పంజాబ్ తన నీరు ఇవ్వరాదని కేజ్రీవాల్ అంటున్నారు. పంజాబ్తో ఆప్ సార్వత్రిక అనుబంధాన్ని పెంచుకుంటున్నందున, అటు బాదల్లు, అమరిందర్లు ఓటర్లకు కేజ్రీవాల్ హరియాణా వాడని, మీ నీటిని దొంగిలించడానికి వచ్చాడని చెబుతున్నారు. ఇక హరియాణాలో ప్రభుత్వం జాట్ల నుంచి దాక్కునే ప్రయత్నంలో, గో రక్షణలో (ఏ ఆవుకు హాని తలపెట్టడానికైనా ఎన్నడూ ఎవరూ సాహసించని రాష్ట్రంలో), సరస్వతీ నదిని తిరిగి కనిపెట్టడంలో తలమునకలై ఉంది. ఈ లోగా సట్లేజ్-యమునా లింక్ కెనాల్ అంతరించిపోయి, ఆ తర్వాత బహుశా త్వరలోనే యమునా నదీ అంతరించిపోతుంది. ఈ రాజ్యాంగపరమైన అసంబద్ధతను పరిపూర్ణం చేయ డానికి చేయాల్సిందిక ఒక్కటే. చెట్లను కొట్టేయవద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ఆదేశించడం. దానికీ సుప్రీం కోర్టుకు చెప్పిన సమాధానమే ఎదురవుతుంది. మాకు అసలు నీళ్లే మిగలలేదు కాబట్టి పరిరక్షించడానికి మాకు చెట్లే లేవు. శ్రీ శ్రీ కేసు నొక్కి చెప్పినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తనకు ఇంకా బకాయిపడి ఉన్న ఆ రూ. 4.75 కోట్ల జరిమానాను రాబట్టుకోవడానికి ప్రయత్నించడమే ఉత్తమం. దీన్నే ఇంగ్లిషులో మంత్రగత్తె మాయలమారి పులుసు అంటారు. పురుగులు లేదా కుక్కల ఫలహారం సహా అందులో ఏమైనా ఉండొచ్చు. ఢిల్లీలో పెరిగిపోతున్న భారీ చెత్తుకుప్పల్లో పడి కుక్కలు తినే తిండి సైతం అంతకంటే మెరుగ్గా ఉంటుంది. పాకిస్తాన్తో, ఆర్థిక వ్యవస్థతో సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం తలమునకలై ఉండగా, అన్ని రకాల కొత్త ఆనవాయితీలు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలన్నిటితో వ్యవహరించాల్సిన కేంద్రం హోం మంత్రిత్వ శాఖ. అది,‘‘హఫీజ్ సయాద్ మద్దతున్న జేఎన్యూ తిరుగుబాటు’’ నుంచి గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని బాంబులతో పేల్చేయనున్న భీకరమైన పాకిస్తాన్ ‘‘ఉగ్రవాదులు’’ ఐఎస్ఐ ఇచ్చే టిఏ/డిఏ సరిపోక ఒక ఏటీఎమ్ను దోచుకుంటూ పట్టుబడటం వరకూ ఏ రోజు కా రోజు ఊహాత్మకమైన కొత్త సమస్యలతో పోరాడటంపై మొగ్గు చూపుతోంది. నేను సంచలనాత్మకతకు పాల్పడుతున్నానని ఆరోపించకండి. మనం పటాన్కోట్ గురించి ప్రస్తావించినప్పటి నుంచి నేను చెబుతున్నవన్నీ వాస్తవాలు, నడుస్తున్న చరిత్ర, రాజ్యాంగపరమైన ద్రోహం, అరాచకత్వం, గందరగోళం. చరిత్రలోనే హేయమైన వివాదం ఆసక్తికరమైన కొత్త ఆనవాయితీలను ఏర్పరుస్తున్నారు. కాకాపోతే ఇక అవసరమైనదంతా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లు, హిమాచల్ప్రదేశ్ కూడా ఎందుకు కాకూడదు? తమ శాసనసభలను సమావేశపరచి వాటి జల పంపకం ఒప్పందాలను రద్దు చేయడమే. అదీ.. ఇవ్వడానికి మా వద్ద నీరే లేదు అనే చిన్న వాస్తవంతో ఆ పని చేసేయడమే. ఇలా చేయలేని ఏకైక ఎగువ రాష్ట్రం పాపం అరుణాచల్ప్రదేశ్ ఒక్కటే. బ్రహ్మపుత్ర, దాని ఉపన దులు అక్కడ మరీ ఉధృతంగా ప్రవహరిస్తుంటాయి. కాబట్టి టిబెట్లో ఆ పని ముగించేయమని చైనాకు కాస్త ఉప్పందిస్తే చాలు. మరో సంగతి, పంజాబ్లోని సట్లేజ్ నది కూడా పుట్టేది అక్కడే. ఈ కాలం భారత నదీ జలాల చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన వివాదం చరిత్రను గుర్తుకు తెచ్చుకోవడంతో ప్రారంభించాం. కానీ ఎంతగా కుదించినా అదే ఈ పేజీని మొత్తాన్ని మింగేసి 2004 వరకే చేరుతుంది. కాబట్టి మీరు చండీగడ్ కేంద్రంగా పనిచేసే నా మిత్రుడు, విపిన్ ప్రభు ‘డైలీ ఓ’ వెబ్ వార్తా పత్రికలో ఈ విషయమై సవివరంగా రాసిన వ్యాసాన్ని చూడమని సూచిస్తున్నాను. అది ఎస్వైఎల్ చరిత్రలో పది ప్రధాన మలుపులను పేర్కొంది. 1978లో ప్రారంభమైన భూసేకరణ సమయంలో అకాలీలు పంజాబ్లో, జనతా పార్టీ (జనసంఘ్ అప్పుడు దాన్లోనే ఉంది) డిల్లీలో అధికారంలోఉన్నారు. ఇదే ప్రకాశ్సింగ్ బాదల్ అప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1981లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఢిల్లీలో కుదిరింది. దానికి 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. అమరేందర్ సింగ్ దాన్ని గొప్ప ముందడుగని ప్రశంసించారు. 1985 నాటి రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం దాన్ని తిరిగి ధృవీకరించింది. అయితే 2004లో, అమరేందర్, రాజ్యాంగ ధిక్కారపు తొలి అడుగువేసి ఆ చట్టాన్ని (వ్యంగ్యం కాదు నిజమే) తప్పించుకుంటూ దొడ్డిదారిన పంజాబ్ ఒప్పందాల రద్దు చ ట్టాన్ని చేశారు. ఆయన అధికారాన్ని కోల్పోయినా, అది ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. ఆకాలీలు సైతం ఆయనను తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి అదే పని చేశారు. అన్నిటికి మించి ఈ చట్టాన్ని రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోసం పంపడం ఇప్పటికి గాని జరగ లేదు. అదీ 12 ఏళ్ల తర్వాత, సరిగ్గా పంజాబ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా చేశారు. సిగ్గుచేటైనా ఈ చరిత్రలో మరో మైలు రాయిని కూడా ఉదహరించాల్సి ఉంది. ప్రతి ఒక్కరూ ఆ కాలువ, నిర్మాణం సాగుతుందనే విషయంపై ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు కూడా, ఆ విషయంపై ఉగ్రవాదులు సైతం నోరు మెదపలేదు. 1990లో వాళ్లు ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ను, అతని సహాయకుడిని మరో 35 మంది కార్మికులను పనులు జరుగుతున్న చోటనే చంపేసి దాన్ని అడ్డుకోగలిగారు. అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరింది. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
జాట్ ఆగ్రహ జ్వాల వెనుక...
జాతిహితం గడచిన సంవత్సరం అనూహ్యంగా బీజేపీ గెలుపొందడంతో ఈ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ శిబిరాలను సవాలు చేస్తున్నట్టు బీజేపీ జాట్ వర్గానికి చెందని వ్యక్తిని, అది కూడా పంజాబీ కాందిశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిని (కట్టర్) ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. మంత్రివర్గంలో రెండో స్థానం కూడా జాట్ వర్గానికి చెందని అనిల్ విజయ్కే ఇచ్చింది. ఇతడు కూడా పంజాబ్ నుంచి వచ్చినవాడే. కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్ కూడా జాట్ వర్గానికి చెందడు. హరియాణాలో జరిగిన విధ్వంసం యావత్తు అటు కులానికో ఇటు ఉద్యో గాలకో కాక, ‘ఇచ్చిపుచ్చుకోవ డా’నికి సంబంధించినది ఎందుకయింది? దేశంలోనే అత్యంత ప్రశాంతంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పుకో గలిగిన రాష్ట్రంలో ఇంత విధ్వంసం ఎందుకు జరిగిందంటే 98.1 శాతం సోదర భారతీయులైన హరియాణేతరులకు ఎవరైనా ఏమని వివరిస్తారు? మీసాలు లేకుండా ఊహించడం కూడా సాధ్యం కాని వారి శరీరాకృతిని బట్టి జరిగిందని చెప్పాలా? బహుశా అదే కావచ్చు. అయితే హరియాణాలో ఇచ్చిపుచ్చుకోవడం అంటే అర్థం, మరీ ముఖ్యంగా అక్కడ ఆధిక్యంలో ఉండే జాట్ల (మొత్తం రాష్ట్ర జనాభాలో 30 శాతం) కోణం నుంచి వివరించి చెప్పడం అంత సులభం కాదు. అది మన పెదవుల మీద సిద్ధంగా ఉన్న మామూలు అర్థం మాత్రం కాదు. అంతకు మించిన, క్లిష్టమైన అర్థం ఏదో అందులో ఉందన్నది నిజం. ఇజ్జత్- అంటే పరువు, లేదా అహం, ఆత్మ గౌరవం- ఇవేమీ కాదు. ఈ మూడు వ్యక్తీకరణలు ఆకర్షణీయంగానే ఉన్నా, అంతకు మించి విశిష్టత కలిగిన, జాట్ల జీవితం నుంచి వచ్చిన భావన అది. జాట్ల గురించి ఒక నానుడి ధోరణిలో చాలామంది ఏం చెబుతారంటే, ‘జాట్ గన్నా నహీ దేగా, గూడ్ కి భెలి దే దేగా’. అక్షరాలా దీని అర్థం ఏమి టంటే, ఓ చెరుకు గెడ ఇమ్మని అడిగితే జాట్ ఇవ్వడు, కానీ వండిన బెల్లంలో భాగం మాత్రం చిరునవ్వుతో ఇస్తాడు. ఇంకాస్త స్ఫుటంగా అనువదిస్తే, ‘నువ్వో, మరొకరో నా పొలంలో ఒక చెరుకు గెడను దొంగిలిస్తే నేను పచ్చడి చేసేస్తాను. వండిన బెల్లంలో కొంచెం ఇవ్వండని నన్ను అడగాలి. అప్పుడు నేను సంతోషంగా భాగమిస్తాను.’ జాట్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? అంటే, అందులో జాట్ల ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉంది. అతనికి మర్యాద ముఖ్యం. అతని దాతృత్వం గురించి నాలుగు మాటలు చెప్పాలి. అతడు పొంగిపోయేటట్టు చేయడం తప్ప మరో మార్గం లేదు. లేదూ, అతనితో గొడవ పడతావా! గడచిన వారంలో రాష్ట్రంలో ఏ జరిగిందో వీడియోలు, ఫొటోల ద్వారా వీక్షించండి! ఆ విధ్వంసాన్ని సమర్ధించడం కాకున్నా, ఇది రాజకీయ తప్పిదాలు, తప్పుడు లెక్కలతో చెలరేగిన ఆగ్రహాన్ని చల్లార్చుకోవడానికి జరిగిన ప్రయత్నమే. ఇది దేశంలో కేవలం రెండు శాతం జనాభా గురించిన అంశం. కానీ ఒలింపిక్స్, ఏసియాడ్ క్రీడోత్సవాలలో ఈ దేశానికి 75 శాతం పతకాలు తెచ్చేది మాత్రం ఆ రెండు శాతం జనాభాలోని వారే. బ్యాడ్మింటన్ (సైనా నెహ్వాల్), అథ్లటిక్స్లో కొందరు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కుస్తీ, బాక్సింగ్ వంటి అంశాలలో పతకాలు తెచ్చి పెడుతున్నది ఆ రాష్ట్రం వారే. భారత సాయుధదళాలకు మహిళా అధికారులను పంపుతున్నది కూడా ఈ చిన్న రాష్ట్రమే. కొందరు హరియాణా ప్రజలు తమ రాష్ట్రం భారతదేశపు చైనా వంటి దని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొందరు మాత్రం డెయిరీ నిర్వహణను బట్టి తమ రాష్ట్రం చిన్న న్యూజిలాండ్ వంటిదని అనుకోవడానికి ఇష్టపడతారు. మరో వాస్తవం: ఇలా క్రీడోత్సవాల నుంచి పతకాలు సాధించుకుని వస్తు న్నవారు, మహిళా మల్లులు, సాయుధ దళాలలో సేవలకు వెళుతున్నవారు అంతా జాట్లే. అయినప్పటికీ ఇలాంటి రాష్ట్రంలో ఆడ శిశువుల భ్రూణహ త్యలు, ఖాప్ పంచాయతీలు, స్త్రీపురుష జనాభా నిష్పత్తిలో కనిపించే దారుణ వ్యత్యాసాల గురించి నన్ను అడగవద్దు. హరియాణీయులు అంత సమస్యల ను సృష్టించేవారు కాదు. అయినా ఇచ్చిపుచ్చుకోవడం దగ్గరకు మళ్లీ వెళదాం. నువ్వు జాట్వా లేక జాట్నివా అన్నది కాదు, ఒక పని చేయదలుచుకుంటే మొత్తం ప్రపంచానికి చాటాలి. నా మిత్రుడు, కేంద్ర మాజీ మంత్రి (ఆగ్రా), ఒకప్పుడు పత్రికా రచయిత, ప్రస్తుతం అఖిల భారత జాట్ మహాసభ అధ్య క్షుడు అజయ్ సింగ్ నాకో వాస్తవం నొక్కి చెప్పారు. రిజర్వేషన్ కోసం జాట్లు 23 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారనీ, ఒకసారి రెండులక్షల మంది ఢిల్లీలో బోట్ క్లబ్ను ముట్టడించారనీ చెబుతూ, ‘లేకిన్ భాయి సాబ్, కిసీ కీ మూలీ భి నహీ ఉఖాడి’ అన్నాడు (దీనిని ఎలా అనువదించి చెప్పడం: ఇలా అనవచ్చు- ఎవరి తోటలో నుంచి ఓ ముల్లంగి దుంపని కూడా లాగలేకపో యారు). అంటే వారిని అంత ఆగ్రహానికి గురిచేసిన అంశం అదేనా ఏమిటి? స్వర్ణోత్సవ వేళ విధ్వంసం హరియాణా రాష్ట్రీయులు కొందరు విభేదించినప్పటికి ఒక వాస్తవం ఉంది. సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బీజ ప్రాయమైన యోచన కూడా లేదు. అలాగే హరియాణా అనే ఈ చిన్న రాష్ట్రా నికి రాజకీయ అస్థిత్వం కూడా ఏమీలేదు. ఔను, 2016 సంవత్సరానికి హరి యాణా ఏర్పడి యాభయ్ సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే ఈ శుభ సందర్భంలో రెట్టించిన దురదృష్టం ఏమిటంటే, 1984 నాటి ఢిల్లీ అల్లర్ల తరు వాత మళ్లీ ఉత్తర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు, విధ్వంసం జర గడం ఈ స్వర్ణోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలు చూడవలసి వచ్చింది. సమైక్య పంజాబ్ రాష్ట్ర తూర్పు ప్రాంతంలోని జిల్లాలే ఈ హరియాణా. యమునా తీరాన్ని ఆనుకుని ఉన్న కొన్ని జిల్లాలకు మాత్రం నీటి సౌకర్యం ఉంది. ఇది నగరాలు లేని ఓ పేద రాష్ట్రం. మేధావులు గానీ, వాణిజ్య నిపు ణులు గానీ, నిజం చెప్పాలంటే లోతైన రాజకీయ పరిజ్ఞానం కూడా లేని, నైపు ణ్యం కరువైన ప్రాంతం. ఈ అంశాన్ని కూడా ఆ రాష్ట్రం వారు అంగీకరించరు. కాందిశీకుల సమస్య పంజాబీ మాట్లాడేవారు తమకు ఒక రాష్ట్రం (పంజాబీ సుబా) కావాలని కోరడం వల్ల హరియాణా అస్తిత్వం ఉనికిలోకి వచ్చింది. భాషల ప్రాతిపదికగా హిందూ సిక్కు వర్గాల ఏకీకరణ జరగడం మరొక కారణం. పంజాబీ హిందువులు హిందీ తమ మాతృభాష అని ప్రకటించుకున్నారు. దీని ఫలితం ఏమిటంటే పంజాబీ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టణీకరణ జరిగిన కొన్ని జిల్లాలు హరియాణాలోకి వచ్చాయి. మళ్లీ ఇందులో ఎక్కువ జనాభా దేశ విభజన కాలంలో పాకిస్తాన్ నుంచి కాందిశీకులుగా ఇక్కడకు వచ్చిన కుటుంబాలకు చెందినది. వారిని ఇప్పటికీ కాందిశీకులనే పిలుస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్ అలా వచ్చిన కాందిశీకుల కుటుంబానికి చెందినవారే. ఆయన కుటుంబం ఝాంగ్ అనే చోటు నుంచి వలస వచ్చింది. వీరిని ఆనాడు స్థానికులు మనస్ఫూర్తిగానే అక్కున చేర్చుకున్నారు. వీరు కూడా రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. అయితే వీరు రాష్ట్ర రాజకీయాలలో నాన్ ప్లేయర్లుగానే ఉన్నారు. అలాగే అధికారంలో వాటాను కోరుకున్నవారు కూడా కాదు. దశాబ్దాలు గడిచిన తరువాత హరియాణాలో పంజాబీ జనాభా 26 శాతానికి పెరిగింది. అంటే జాట్లతో దాదాపు సరిమానం. అధికార తులాదండం ఒకవైపునకు మొగ్గడం ఆరంభించనంత కాలం ఆ రాష్ట్రంలో బయటివారు, స్థానికులు అన్న అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జాట్ జనాభా 30 శాతం ఉంటే, పంజాబీలు వలస రావడానికి ముందువీరిదే పెద్ద సంఖ్య అని భావించడానికి అవకాశం ఉంది. అప్పుడు ఢిల్లీ (గుర్గావ్), చండీగఢ్ (పంచ్కుల) వంటి కొత్త పట్టణ కూడళ్లు అభివృద్ధి చెందాయి. దీనితోనే హరియాణా వారికి పంజాబ్ మీద ఆగ్రహం చల్లబడింది. అయితే రాజధాని చండీగడ్ విషయంలోను, నీటి పంపకంలోను ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేదు. కానీ ఆస్తుల విలువ పెరగడంతో ఈ పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న ఆదాయం మీద కూడా స్థానికుల దృష్టి పడింది. డిఎల్ఎఫ్, ఇండియా బుల్ వంటి వేగంగా పురోగతి సాధించిన సంస్థలు జాట్లే ఏర్పాటు చేశారు. ద్వేషం పెంచారు అయితే రాజకీయాధికారం జాట్ల అధీనంలోనే ఉండిపోయింది. లేకపోతే అడపా దడపా హరియాణాలో పుట్టి పెరిగిన వారికి, అంటే స్థానికులకు దక్కింది. భజన్లాల్ (ఇతడు బిష్ణోయి వర్గంవాడు) రాష్ట్రాన్ని విజయ వంతంగా పాలించాడు. ఏకంగా రాజ కుటుంబం స్థాయిలో రాజకీయంగా స్థిరపడ్డాడు. ఇతడు జాట్ల దగ్గర జాట్ వలె, జాట్ వర్గేతరుల దగ్గర జాట్ వర్గేతరునిగా చక్కగా చలామణీ అయిపోయాడు. రాష్ట్రాన్ని ఇటీవల కాలంలో రాజవంశాల తరహాలో పరిపాలించిన బన్సీలాల్, దేవీలాల్, హుడాల కుటుం బాలు మాత్రం జాట్ కుటుంబాలే. రాజకీయ అధికారం జాట్ల చేతిలో ఉన్నప్పటికీ, హరియాణా పట్టణ ప్రాంతాలలో మాత్రం పంజాబీలు, బ్రాహ్మ ణులు, బనియాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ విధంగా రెండు ప్రపంచాలు ఒక చిన్న రాష్ట్రంలో సమకూడినప్పటికీ ప్రశాంతంగానే మనుగడ సాగించాయి. గడచిన సంవత్సరం అనూహ్యంగా బీజేపీ గెలుపొందడంతో ఈ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ శిబిరాలను సవాలు చేస్తున్నట్టు బీజేపీ జాట్ వర్గానికి చెందని వ్యక్తిని, అది కూడా పంజాబీ కాందిశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిని (కట్టర్) ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. మంత్రివర్గంలో రెండో స్థానం కూడా జాట్ వర్గానికి చెందని అనిల్ విజయ్కే ఇచ్చింది. ఇతడు కూడా పంజాబ్ నుంచి వచ్చి నవాడే. కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్ కూడా జాట్ వర్గానికి చెందడు. కీలక స్థానాలలో ఉన్న చాలామంది కూడా జాట్లు కారు. ఇదంతా చూసిన జాట్లు తమను అధికారంతో పాటు అన్నిటికీ దూరం చేస్తున్నారని భావిం చేట్టు చేసింది. అదే ఇప్పుడు చెలరేగిన హింస రూపంలో బయటపడింది. ఇంతకీ ఇలాంటి ఆగ్రహం బద్దలు కావడానికి ప్రేరేపించిన అంశం ఏమిటి? కురుక్షేత్రకు చెందిన బీజేపీ ఎంపీ (సైనీ కులస్తుడు) జాట్లకు వ్యతిరేకంగా ఒక ఓబీసీ సైన్యాన్ని తయారు చేయాలని, ఈ సైన్యం జాట్లను మావోయిస్టులను కాల్చినట్టు కాల్చి పారేయాలని ప్రచారం ప్రారంభించాడు. పైగా ఆ వర్గాన్ని పందులు అని తిట్టాడు. ఈ విషయం అతడి ఫేస్బుక్లో చూడవలసిందే. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గోశాలలు ఏర్పాటు చేయడం, గురుకులాలు స్థాపించడం, పాఠశాలల్లో భగవద్గీత బోధనను తప్పనిసరి చేయడం వంటి అంశాలకు పరిమితమైంది. (వ్యాసకర్త: శేఖర్ గుప్తా) -
భేషజాల మృత్యు వలయం
జాతిహితం గత 14 ఏళ్లుగా సియాచిన్లో ఒక్క తుపాకీ గర్జించింది లేదు. అక్కడ పోరాటం జరుగుతుందనడం వాస్తవం కాదు. శిఖరాగ్ర శ్రేణిపై బైఠాయించిన మన సైన్యం పశ్చిమ పార్శ్వపు రక్షణ శ్రేణిగా ఉండి, ఆ హిమశైలం అంతటినీ తన అదుపులో ఉంచుకుంది. అయినా దుర్భర వాతావరణ పరిస్థితులకు ఇరుపక్షాలూ బలైపోతూనే ఉన్నాయి. రెండు సైన్యాలూ మరింత మెరుగైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందే తప్ప ఆగిపోలేదు. మీరు దేవానంద్ అభిమానులు అయినా కాకున్నా, సినీ నిర్మాతగా ఆయన నిర్లక్ష్యంగా తన కాలం కంటే ముందటి కథా వస్తువులతో దుస్సాహసాలు చేశారని ఒప్పుకోవాల్సిందే. 1965 నాటి అజరామర చిత్రం ‘గైడ్’... బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుప్రసిద్ధ వివాహేతర ప్రేమ. ఎందువల్లనోగానీ, శత్రువు ముందు పిరికితనం చూపిన సైనిక లెఫ్టినెంట్గా ఆయన సైనిక న్యాయస్థానం శిక్షకు గురైన ‘ప్రేమ పూజారి’ (1970) చిత్రాన్ని తక్కువగా గుర్తుంచుకుంటారు. 1967లో నాథులా (సిక్కిం) వద్ద చివరిసారిగా భారత, చైనాల మధ్య పెద్ద సైనిక సంఘర్షణ జరిగింది. భారత సైన్యం 1962 నాటి అప్రదిష్ట తొలగిపోయే రీతిలో పోరాడినా ఇరువైపులా గణనీయంగా ప్రాణ నష్టాలు జరిగాయి. బహుశా ఆ ప్రాంతంలోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మనం చస్తేనేం ... వాళ్లూ చస్తున్నారుగా? లెఫ్టినెంట్ రామ్దేవ్ బక్షీ (దేవానంద్) తన పెంపుడు కుక్కతో కలిసి శత్రువు జరుపుతున్న కాల్పులకు గురవుతాడు. బక్షీ, తిరిగి కాల్పులు జరపడానికి నిరాకరించి కుక్క మృతదేహం వద్ద ధిక్కారంగా నిలిచి, మరుపున పడి పోయిన సుప్రసిద్ధమైన ఈ మాటలు అంటాడు... వాళ్లు కాలుస్తారు, నేను కాలుస్తాను, వాళ్లు తిరిగి కాలుస్తారు, నేనూ కాలుస్తాను, మళ్లీ వాళ్లు కాలు స్తారు... ఈ విష వలయం ముగిసేది ఎన్నడు? బక్షీ మరెవరో కాదు, దేవానంద్ కాబట్టి జైలు నుంచి తప్పించుకుని భారత గూఢచారై పోతాడు. తన గ్రామం వద్ద బహుశా పాకిస్తాన్ ట్యాంకుల రెజిమెంటు మొత్తాన్ని తుడిచి పెట్టేసి, తిరిగి కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడు. సల్తోరో(సియాచిన్) పర్వత శిఖరాగ్రంపై పది మంది సైనికులు ఒక అధికారితో కూడిన భారత సైనిక బృందం మరణవార్తకు సమాంతర పోలికలా ఉన్నందునే ప్రేమ్ పూజారి చిత్ర సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి వచ్చింది. 32 ఏళ్ల క్రితం మన సేనలు మొదటిసారిగా ఆ శిఖరాగ్రాన్ని అధిరోహించి, ఇది మా మాతృభూమి అని చాటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి సరిగ్గా దేవానంద్ డైలాగ్లాగే ఉంది. మొట్టమొదటిసారే మనం దాదాపు 30 మందితో కూడిన ఒక ప్లటూన్ను కోల్పోయాం. ఆ తర్వాత పాకిస్తానీలు కూడా ఆ పైకి చేరాలనే విఫలయత్నంలో వారి సొంత పగుళ్లలోపడి, మంచు, కొండ చరియలు విరిగి పడి, ఊపిరితిత్తులలో నీరు చేరడం వంటి జబ్బులు చేసి చనిపోయారు. ఆ తర్వాత మనవాళ్లూ కొంత మంది చనిపోయారు. వాళ్లూ అలాగే చనిపోయారు. కొన్ని వారాల క్రితమే పాకిస్తానీలు కొందరిని కోల్పోతే, ఇప్పుడు మనం పది మందిని పోగొట్టుకున్నాం. గత 32 ఏళ్లలో కెల్లా అలాంటి అతిపెద్ద విషాద ఘటన 2012లో జరిగింది. సల్తోరో మూడవ శిఖరానికి అటువైపున గ్యారీ వద్ద పెద్ద మంచు చరియ విరిగిపడి ఒక పాకిస్తానీ సైనిక స్థావరమే సమాధైపోయింది. 129 సైనికులు, 11 మంది పౌరులు చనిపో యారు. సియాచిన్లో భారత్ దాదాపు 9,000 మందిని కోల్పోయింది. అటు పాకిస్తానీలు కూడా దాదాపు అంతమందే చనిపోయి ఉంటారు. ఈ ప్రాణ నష్టాలలో 90 శాతానికిపైగా దుర్భర వాతావరణం వల్ల సంభవించినవే తప్ప, శత్రువు కాల్పుల వల్ల కాదని ఇరు పక్షాలూ నిజమే చెబుతాయి. సియాచిన్ స్థానంలో ప్రేమ్ పుజారిలోని నాథులా సన్నివేశాన్ని ఉంచి చూడండి. మంచు చరియ విరిగిపడి మేం చస్తాం, తర్వాత వాళ్లూ మంచు చరియ విరిగిపడి చస్తారు, తర్వాత మేం మంచు చరియ పడి చస్తాం... ఈ విషవలయం ముగిసేది ఎన్నడు? సైనిక విష వలయాలన్నింటిలోకీ అత్యంత క్రూరమైనది ఇదే. గత 14 ఏళ్లుగా ఆ హిమశైలం పరిసరాల్లో ఎక్కడా ఒక్క తుపాకీ అగ్రహంతో గర్జించింది లేదు. అక్కడ పోరాటం సాగుతోందనడం వాస్తవాన్ని సరిగ్గా చెప్పకపోవడమే. సొల్తోరో శిఖరాగ్ర శ్రేణి పొడవునా బైఠా యించిన మన సైన్యం పశ్చిమ పార్శ్వపు రక్షణ శ్రేణిగా ఉండి, ఆ హిమశైలం అంతటినీ తన అదుపులో ఉంచుకుంది. పాకిస్తానీలు ఆ దిగువ ఉన్న వాలు ప్రాంతాల్లో వారి స్థావరాలకు సమీపంలో ఉన్నారు. 2002లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం దీన్నే ఆధీన రేఖగా గుర్తించింది. అయినా దుర్భర వాతావరణ పరిస్థితులకు ఇరుపక్షాలూ బలైపోతూనే ఉన్నాయి. రెండు సైన్యాలూ మరింత మెరుగైన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందే తప్ప ఆగిపోలేదు. ఇద్దరు శత్రువులది ఒకటే మాట అయినా, దృఢసంకల్పంగలిగి యుద్ధాలలో రాటుదేలిన సేనలు ఏవైనా ఎప్పుడూ చేసేట్టుగానే ఇరు సేనలూ ఈ రంగంలో పనిచేయడాన్ని గౌరవ సూచకంగా భావిస్తాయి. కాబట్టే అక్కడ పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన భారత లేదా పాకిస్తానీ సైనికులు ఎవరూ అక్కడి పోరాటమే ఓ ప్రహ సనమని, నిజంగా మనం నష్టాలకు గురవుతున్నామని చెప్పడం ఎరుగం. వాళ్లు ఆ పని చేయరు కూడా. అందుకు రెండు కారణాలు. ఒకటి, అది సైనిక ప్రవృత్తికి విరుద్ధమైనది. రెండవది, అంతకంటే ముఖ్యమైనది... అవతలి పక్షం తమ కంటే మరింత ఎక్కువగా బాధపడుతోందని వారు విశ్వసించడం. మనం అక్కడ మకాం చేసి ఉన్నామని మన పక్షం సంతృప్తి చెందుతుంది. ఇందిరాగాంధీ చివరిరోజుల్లో, 1984లో చేపట్టిన రెండు పెద్ద సైనిక చర్యల్లో ‘ఆపరేషన్ మేఘదూత్’ ఒకటి. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ మరొకటి. పాకిస్తానీలు ఆ శిఖరాగ్రాలకు చేరలేకపోవడంతో అక్కడి నుంచి మనల్ని ఒక్క అంగుళం కూడ కదల్చలేకపోయారు. పాకిస్తానీల యాజమాన్యంలోని ఒక శ్రేణిని స్వాధీ నం చేసుకుని భారత్ కీలక పాయింట్ను సాధించింది. ఆ దాడి సందర్భం గానే సుబేదార్ బనా సింగ్కు పరమ వీర చక్ర లభించింది. ఈ వారం విషాదం జరిగినది సరిగ్గా ఆ ప్రాంతానికి పక్కనే. కాబట్టి పాకిస్తానీలు ఇంత కంటే ఎక్కువగా నష్టపోతుంటే, వారిని ఓటమిని అంగీకరించమనండి అనేదే మన వైఖరిగా ఉంటుంది. అటు పాకిస్తాన్ నుంచీ ఇదే మాట ప్రతిధ్వనిస్తుంటుంది. మంచిదే, భారతీయులు శిఖరాగ్రం ఆక్రమించారు. మూర్ఖులు, తమ స్థావరాలకు అతి సుదూరంలోని ఎక్కడో ఎత్తున కూచున్నారు. అక్కడి దుర్భర వాతావరణ పరిస్థితుల కారణంగా వాళ్లనే బాధపడుతూ, చస్తూ ఉండనిద్దాం, అలాగే అలసి వాళ్లే స్పృహలోకి వస్తారు. రెండు సేనలూ దీన్ని ప్రపంచంలోనే అతి ఎత్తున ఉన్న యుద్ధ రంగమని గర్వంగా చాటుకుంటాయి. సియాచిన్లో పని చేసిన కాలానికి గానూ ఇరు పక్షాలూ తమ సైనికులకు ప్రత్యేక పతకాలను ఏర్పాటు చేశాయి. అది ప్రతి కాల్బల సైనిక దళమూ కావాలని కోరుకునేది. ఈ పరస్పర విద్వేషాలు, డాబుసరుల విషవలయాన్ని బద్ధలు కొట్టాలని ఎవరి నోటా మాట మాత్రంగానైనా వినరాదు. నాకు గుర్తున్నంతలో ఒకే ఒక్కసారి, 2012 నాటి గ్యారీ దుర్ఘటన సంద ర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ అష్రాఫ్ కయానీ ఈ విషయం గురించి మాట్లాడారు. గ్యారీ దుర్ఘటనకు సంబంధించి భారత్ అందిస్తానన్న సహాయా నికి తమ వైపు నుంచి మంచి స్పందన లభించలేదని ఆయన అన్నారు. ఈ వారం మనం ఎదుర్కొన్న దుర్ఘటన విషయంలో పాకిస్తాన్ సహాయం అంది స్తానన్నా మనం ఎలాంటి సానుకూలతను కనబరచకుండా సరిగ్గా అలాగే వ్యవహరించాం. నిర్లిప్తంగా నో థ్యాంక్స్ అనేశాం. మనం మాట్లాడకుండా ఉండిపోయినది ఏమన్నా ఉందంటే... మాట్లాడుతున్నదెవరో చూడు. మీరె క్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరీ హిమశైలాన్ని చూడనైనా లేదు! ఎప్పటికి తెగుతుంది ఈ పీటముడి 1984 ఏప్రిల్ (?)లో నేను మొదటిసారిగా ‘ఇండియా టుడే’లో సియాచిన్ కథనాన్ని వెలువరించాను. అప్పుడు భారత సైన్యం, ఇది మా భూభాగమని ప్రకటించుకునేంతగా అక్కడ తన ఉనికిని విస్తరింపజేసుకుంది. ఇరు పక్షాల సైనికులు మారు మాట్లాడకుండా ఎదుర్కొంటున్న క్రూర వాతావరణ పరిస్థి తుల గురించి నాకు తెలుసు. కాబట్టి ఆ కథనాన్ని వెలువరించినప్పటి నుంచీ ఇది పూర్తి నిరర్థక యుద్ధమనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. పాకిస్తాన్ తిరిగి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయదనే భరోసా ఉంటే ఇరు పక్షాలూ తమ సేనలను ఉపసంహరించుకోవడం తెలివైన పని అనిపించసాగింది. సియా చిన్ సమస్య పరిష్కారం వరకు వచ్చిన 1989 చర్చలు చివరి క్షణంలో విఫలం కావడంతో నిరుత్సాహపడ్డాను. ఎప్పటికి తెగుతుందీ ముడి అని అప్పటి నుంచి శాంతి కాముకునిగా నేను సుదీర్ఘంగా ఎదురుచూస్తూనే ఉన్నాను. ఇంకా అలా ఎదురు చూడాల్సిన పని లేదేమోనని నా అనుమానం. భారత సైనికుల మరణానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ, వారి ధైర్యానికి శాల్యూట్ చేస్తూ కూడా నే నీ మాట అంటున్నాను. 1989కి, నేటి కి మధ్య ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పూర్తిగా అదృశ్యమైంది. కశ్మీర్ తనువెల్లా గాయాలు చేసి నెత్తురోడేలా చేస్తూ పాకిస్తాన్/ఐఎస్ఐ అఫ్ఘాన్ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిన ఏడాది నుంచే సరిగ్గా అది అదృశ్యమవుతూ వచ్చింది. ఆ తర్వాత వారా వ్యూహాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రత్యే కించి ముంబైకి విస్తరింపజేశారు. కాబట్టి స్థూలంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా తప్ప స్థానిక పరిష్కారాలు ఇకనెంత మాత్రమూ సాధ్యం కావు. అప్పటి వరకు, సియాచిన్ను తిరిగి స్వాధీనం చేసుకోలేక పోవడం పాకిస్తాన్ సైన్యానికి ఆందోళనను కలిగిస్తూనే ఉంటుంది. మన బలగాలు ఆ సవాలును సులువుగానే ఎదుర్కోగలవు. 27 ఏళ్ల పరోక్ష యుద్ధం కారణంగా నాలోని శాంతికాముకుడి చింతన కూడా ఆ మేరకు మారింది. ప్రేమ్ పుజారీలోని రామ్దేవ్ భక్షీని గుర్తుచేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. శేఖర్ గుప్తా twitter@shekargupta