Undavalli
-
అనంతపద్మనాభ స్వామి ఆలయం..! కొండనే ఆలయాలుగా..
ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా మందిరాలుగా, అందమైన స్తంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతులలో మలచిన ఆనాటి శిల్పుల అనన్య శిల్పనైపుణ్యానికి, అనల్పశిల్ప కళా ప్రావీణ్యానికి శిరసువంచి వందనాలు సమర్పించాల్సిందే. శ్రీ అనంతపద్మ నాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో అవాక్కయి నిలబడి పోవాలసిందే! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళితే .... ఉండవల్లి సెంటరు వస్తుంది. కుడివైపుకు తిరిగి అమరావతి రోడ్డులో 5 కి.మీ ప్రయాణం చేస్తే మనం ఈ గుహాలయాలను చేరుకుంటాము. వీటిని ఉండవల్లి గుహలు అని పిలుస్తున్నారు. ఈ గుహాలయాలు క్రీ.శ 420 –620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. . మొదటి అంతస్తు: కింద భాగం మొదటి అంతస్తులో గుప్తుల,చాళుక్యుల కాలపు శిల్పనిర్మాణం కనిపిస్తుంది. ఇవి అసంపూర్తి గానే ఉన్నాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ఉండేటట్లు వీటి నిర్మాణం ప్రారంభమైంది. వీనిలో ఒకదానిలోనుండి మరొక దాని లోనికి మార్గం, విశాలమైన తిన్నెల నిర్మాణం ఉంది. రెండవ అంతస్తు: రెండవ అంతస్తు లోనికి మెట్లమార్గం ఉంది. దీనిలో త్రిమూర్తుల మందిరాలున్నట్టుగా చెపుతున్నారుగాని ఇప్పుడు అవశేషాలు మాత్రమే మిగిలున్నాయి. గదులుగా . మందిరాలుగా ఉన్న వానికి సన్నని తీగలున్న తలుపులను బిగించారు. అక్కడక్కడా ఏవో ఉన్నట్లు గా భ్రాంతిగా కన్పిస్తున్నాయి కాక ఎక్కడా స్పష్టత లేదు. వేసిన తలుపుల వెనుక చీకట్లో ఏవేవో దేవతామూర్తులను పెకలించిన గుర్తులు స్పష్టాస్పష్టంగా కన్పిస్తాయి. మూడవ అంతస్తులోకి మెట్లమార్గం...చారిత్రక నేపథ్యం – ఈ గుహాలయాలు నాలుగు అంతస్తులు కూడ రాయిను తొలిచి చేసిన నిర్మాణాలే కాని, పెట్టినవి, ప్రతిష్ఠించినవి లేవు. మూడవ అంతస్తు పూర్తిగా విష్ణు బంధమైన గుహాలయం. సాధారణం గా బౌద్ధ, జైన గుహాలయాలు ఉంటాయి కాని వైష్ణవ గుహాలయం ఉండటం ఇక్కడొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా పనిచేసిన మాధవరెడ్డి ఈ అనంత పద్మనాభుని గుహాలయాన్ని నిర్మింపజేసినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇక్కడ నుంచి 9 కి.మీ దూరం సొరంగమార్గం మంగళగిరి నరసింహస్వామి కొండపైకి ఉందని, ఆరోజుల్లో సాధువులు, మునులు కృష్ణానదిలో స్నానానికి, పానకాల నరసింహుని దర్శనానికి రాకపోకలు సాగించే వారని నానుడి. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని మూసివేశారు. ఎడమవైపుకు తిరిగితే వరుసగా కొండను తొలిచి తీర్చిదిద్దిన శిల్పాలు కనువిందు చేస్తాయి. వాటిలో ముందుగా మనల్ని ఆకర్షించేది గణనాయకుడైన వినాయకుని రమణీయ శిల్పం. మహా గణపతి...లంబోదరుని సహస్ర రూ΄ాలను దర్శించిన సందర్శకునికైనా ఈ వినాయకుని దర్శనం అపరిమితానందాన్ని ఇస్తుంది. ఎందుకంటే గజాననుని ముఖం మీద తొండం మీద కన్పించే ఆ విధమైన గజచర్మపు ముడతలను శిల్పంలో దర్శింపజేయడం అనన్య సామాన్యం. ఉగ్రనరసింహుడు: ఈ రూపం ఈమండపంలోనే మూడు ప్రదేశాల్లో మనకు కన్పిస్తుంది. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. ఇవి కుడ్యచిత్రాలు. వీనిలో శంకరునితోపాటు వివిధ దేవతల శిల్పాలు కూడ ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవితో ఆదివరాహస్వామి...స్థంభాలపై కన్పించే వాటిలో మొదటిది చాల అరుదుగా కన్పించే ఆదివరాహస్వామి. లక్ష్మీ సమేతుడైన ఈ స్వామి కడు రమణీయంగా దర్శనమిస్తాడు. ఆకాశంలో విహరిస్తున్నట్లున్న గరుత్మంతుడు... నాగబంథం: మూడవ అంతస్థులో మండపానికి వెలుపల నాగబంథమున్నదని, దానివలన ఈ పరిసరాల్లో ఎక్కడో విలువైన సంపద కాని, విలువైన గ్రంథ సముదాయం కాని ఉండవచ్చని కూడ ప్రచారం జరిగింది.నారద తుంబురులా ? ఈ మూడవ అంతస్థులో వెలుపల భాగాన నాలుగు విగ్రహాలు, సింహం బొమ్మలు కన్పిస్తున్నాయి. వీటిని నారద, తుంబురులు అని వ్రాస్తున్నారు. నారద తుంబురులయితే ఇద్దరే ఉండాలి కదా! కాని ఎందుకో ఆ నలుగురు వేద పురుషులకు ప్రతీకలనే భావన కలుగుతుంది. వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి పురుషుని కుడి చేతిలోజపమాల, రెండవ చేతిలో తాళపత్రాలు కన్పిస్తున్నాయి. ఋగ్వేదానికి ప్రతీక ఏమో? అలాగే నాల్గవ పురుషుని చేతిలో తంత్రీ వాద్య విశేషం ఉంది. ఇది సామవేదానికి ప్రతీక కావచ్చు. కాబట్టి పండితులు, మేథావులు, చరిత్ర పరిశోథకులు మరొక్కసారి ఈ విగ్రహాలను పరిశీలిస్తే విశేషం వెలుగు చూడవచ్చు? రవాణాసౌకర్యాలు...విజయవాడకు దేశంలోని అన్ని ్ర΄ాంతాలనుండి బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. విజయవాడనుండి ప్రకాశం బ్యారేజి మీద బస్సులు వెళ్లవు కాబట్టి ఆటో చేసుకొని వెళ్లవచ్చు. లేదా మంగళగిరి నుండి ఉండవల్లి సెంటరుకు బస్సులో వచ్చి అక్కడ నుండి ఆటోలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గం... ఉండవల్లి గుహలకు చేరుకునే మార్గాలు ఆలయానికి మంచి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 31 కిలోమీటర్ దూరంలో ఉంది. మంగళగిరి నుండి ఉండవల్లి గుహలకు 7 దూరంలో ఉంది. గుంటూరు నుండి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ గుహలను సందర్శించడానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా గుంటూరులో రైల్వే జంక్షన్, విజయవాడలో రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరు నుంచి ఆలయానికి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి ఉండవల్లి గుహలకు 10 కిలోమీటర్లు ఉంది. రైలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మంగళగిరిలో రైలు జంక్షన్ కూడా ఉంది. అక్కడ నుంచి కూడా ఉండవల్లి గుహకు వెళ్లడానికి సదుపాయాలు ఉన్నాయి.(చదవండి: దేవతలు నిర్మించిన వేణుగోపాలస్వామి ఆలయం) -
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు. -
సీఆర్ డీఏ అధికారులపై రైతుల ఆగ్రహం
-
CRDA అధికారులపై రైతుల ఆగ్రహం
-
సామాన్యుడు కాడు.. వీడు అసామాన్యుడు.. ఇది కదా ఉండవల్లి అంటే..
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం. వెండితెరపై హీరో గొప్పదనం చూసి చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో అలాంటి హీరోలు కనిపించినప్పుడు, వారి గురించి తెలిసినప్పుడు పెద్దగా పట్టించుకోం. రీల్ హీరోలు ఎక్కడైనా కనిపించినా ఆటోగ్రాఫ్ కోసం, సెల్ఫీ కోసం నానాయాతన పడతాం. అదే రియల్ హీరోలను చూసినప్పుడు, వారి పోరాట పటిమ తెలిసినా సరే ఎక్కడో ఏవో అనుమానాల కారణంగా శెభాష్ అనడానికి మొహమాటపడతాం. ఒక్కోసారి వారు చనిపోయిన తర్వాత వారి గొప్పదనం గురించి తెలిసి, వారు వీరు చెబుతుంటే విని, వావ్ అనిపిస్తుంది. అంతటితో రియల్ హీరోల కథ సమాప్తం. కానీ రియల్ హీరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను చూస్తే అలా అనిపించడం లేదు. ఆయన స్పెషల్ రియల్ ఫైటర్. ఆయన నిజమైన అసాధారణ పోరాట యోధుడు. Created history with great fighting spirit. మార్గదర్శి అవకతవకల్ని వెలికితీయడంద్వారా ఆర్ధికరంగ నేరాలపై తనదైన శైలిలో సామాన్యులకు సైతం చక్కటి అవగాహన కల్పించిన సామాన్యుడు. ఆయన చెప్పే పాయింట్లలో ఒక్క మాట కూడా తప్పు పట్టేలా లేదు. సామాన్యుల్లో అసామాన్యుడు. ప్రజాప్రతినిధిగా పదికాలాలపాటు నిలిచిపోయే పని చేశారు. ఆర్ధిక రంగ నేరాలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించిన ధన్యజీవిగా కీర్తి సంపాదించారు. కేవలం చట్టాలను నమ్ముకొని, న్యాయవ్యవస్థమీద నమ్మకంతో ప్రజాప్రతినిధిగానే కాదు లాయర్ గా కూడా మార్గదర్శిపై పట్టుదలగా పోరాటం చేసి చరిత్రలో తనకంటూ మంచి పేరు ఆర్జించారు. నాకు రాజ్యాంగం పట్టదు, నేను చెప్పిందే చట్టం, నేను సంకల్పించిందే సక్రమం అనుకునే మోనార్క్లలో కనీసం ఒక్కరినైనా నేలమీదకు ఈడ్చుకొచ్చిన మహర్షి ఉండవల్లి. మార్గదర్శి సక్రమంగా పని చేస్తోంది కదా! ఎలాంటి ఫిర్యాదులు లేవు కదా!! ఏంటీ ఈ ఉండవల్లికి వచ్చిన నొప్పి అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. సమస్య లోతుపాతులు తెలిసిన తర్వాత ఇంతకాలం జరిగిన మోసం తెలిస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. అంతిమంగా దెబ్బతినేది ప్రజలు. లాభపడేది ఆ మోసాలు చేసినవారు, అంతో ఇంతో లబ్ధి పొందేది వారికి చప్పట్లుకొట్టేవారు. ఆ స్పృహతో చూసినప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన పోరాటం అసాధారణం, అమోఘం, అద్వితీయం. మాటలతో చెప్పలేనిది. సెల్యూట్ టు ఉండవల్లి అరుణ్కుమార్ సార్. undavalli arun kumar on margadarshi, on ramoji, on chit funds, on chits, on margadarshi financiers ..అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.. మీకు చాలా వీడియోలు లభ్యమవుతాయి. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత సమాచారం వాటిలో లభ్యమవుతుంది. అయినా సరే మీడియా మొఘల్ రామోజీయే కరెక్ట్ అని ఎవరైనా అంటే ఎవరైనా చేయగలిగిందేమీలేదు. తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవడమే. -చెమికెల రాజశేఖరరెడ్డి, హైదరాబాద్ -
బాబు ఇంటిని కూల్చేస్తున్నారని..
సాక్షి, అమరావతి: ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబునాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా విషప్రచారం మొదలు పెట్టింది. వాస్తవానికి కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. దీనిలోభాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్హౌస్కు కూడా నోటీసులు ఇచ్చారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటిని కూల్చేస్తున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రారంభమైన అక్రమ నిర్మాణాల తొలగింపు ఉండవల్లి కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ అయింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇప్పటికే పలుమార్లు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. -
టీడీపీ కుట్రలు ప్రజలు నమ్మరు
-
చంద్రబాబు ఇంటికి నోటీసులు
సాక్షి, గుంటూరు: వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ శనివారం నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన వీఆర్వో వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు. నీట మునిగిన పంటలు ఎగువ నుంచి వస్తున్న వరదలతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. దాచేపల్లి మండలం రామపురం, మాచవరం మండలంలోని రేగులగడ్డ, అచ్చంపేట మండలం మదిపాడు, గింజపల్లి,జీడిపల్లి, తాండువాయి,చల్లగరిగ, దామర్ల, కోడూరు గ్రామాల్లో పత్తి, మిరప పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. అదే విధంగా కొల్లిపొర మండలం పాతబొమ్మవానిపాలెం, అన్నవరపులం, కొల్లూరు మండలం ఆవులవారిపాలెం, పెసర్ల, పోతారం, జువ్వలపాలెం,ఈపురు తదితర గ్రామాల్లో అరటి, పసుపు, తమలపాకు పంటలకు పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. -
గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..
సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్సీసీ రూఫ్తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్ జోన్ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది. హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీఆర్డీఏ డైరెక్టర్ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అని, ఆయన కుమారుడు సింగపూర్లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు. -
అక్రమాల గని.. ‘లింగమనేని’
సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్హౌస్లోనే. ఈ గెస్ట్హౌస్ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. ఏసీసీ భూములతో ప్రారంభం గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్షిప్ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేట్ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్కే రియల్ ఎస్టేట్ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. అక్రమాలను ప్రశ్నించిన గ్రామ కార్యదర్శి సస్పెండ్ ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్ సైట్, సెట్ బ్యాక్స్ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్ సురేష్కుమార్ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్ సురేష్కుమార్ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు ఇంటి ముందు హంగామా
సాక్షి, ఉండవల్లి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని ఎస్టేట్కు సీఆర్డీఏ నోటీసులు ఇస్తే... చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేపట్టింది. టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి... చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారు. అక్రమ కట్టడం నుంచి చంద్రబాబును తరలిస్తే ఊరుకునేది లేదంటూ హంగామా చేశారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు -
భారీ భద్రత నడుమ ప్రజావేదిక తొలగింపు పనులు
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు మూడవ రోజు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండే వాటిని జాగ్రత్తగా పక్కకు తీస్తున్న నేపథ్యంలో ఈ గురువారం కూడా తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రజావేదిక భవనాన్ని తొలగిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు, ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది కరకట్టను ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణమని మీరే చెబుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్ను ప్రశ్నించింది. -
ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఫోటోలు
-
రెండవరోజుకు ప్రజావేదిక కూల్చివేత
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడం ప్రజా వేదిక కూల్చివేత పనులు రెండవరోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచే కూల్చివేత పనులను అధికారులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు.. కృష్ణానది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు భవనంలోని ఫర్నిచర్ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. అనంతరం జేసీబీల సహాయంతో ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. చదవండి : అక్రమాల వేదిక! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బ్రేకింగ్.. ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే మొదలవ్వాలన్న సీఎం సూచనల మేరకు..కృష్ణానది కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆ భవనాన్ని కూల్చివేసే చర్యలను ప్రారంభించారు. ఈ సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. భవనంలోని ఫర్నించర్ను, ఏసీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే జేసీబీలు, కూలీలను ప్రజావేదిక వద్దకు తరలించారు. (చదవండి : ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్ఆర్డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రుల బకాయిలు చెల్లించాలి
-
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలందాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇక మీదట ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు వచ్చి పిల్లల్ని కొరకడం.. టార్చిలైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుడదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రులకు రూ. 450 కోట్ల బకాయిలున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 9 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలని జగన్ ఆదేశించారు. కుష్టువ్యాధి వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. కుష్టువ్యాధి మళ్లీ విజృంభిస్తున్నట్లు పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందన్నారు. కుష్టువ్యాధి నివారణ, మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్గా దృష్టిపెట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. -
అందుకే ‘అమ్మ ఒడి’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్రూమ్స్ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్ స్కూల్కు పోవాలనే ఆలోచన రాకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.(చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) సన్న బియ్యం ఇస్తాం.. పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులనే ఇవ్వాలి. ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు. ఆ బియ్యాన్ని తిరిగి డీలర్కే అమ్మేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి, మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి. దీనికి కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి. గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది. ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు. ఈ వెయ్యి కోట్లను రైతులకే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ కలెక్టర్లకు తెలిపారు. (చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
ప్రతీ సోమవారం ఆఫీసుల్లో గ్రీవెన్స్ డే
-
ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదు ఇవ్వాలి. పై అధికారులు కూడా ఆ రోజు మీకు ఫోన్లు చేయరు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వినండి. మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి. లేదంటే నా దృష్టికి తీసుకురండి. మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం. మన దగ్గర పనిచేసే వాళ్లనే సంతోషపెట్టకుంటే ప్రజలను ఎలా సంతోషపెడ్తాం? (చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) వారంలో ఒక రోజు.. ఐఏఎస్ అధికారులు ప్రతి వారం ఒక రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలి. మీరు వస్తున్నట్లు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వద్దు. హాస్టళ్లు, స్కూళ్లు, పీహెచ్సీల పరిస్థితిని ఫొటో తీయండి. రెండేళ్ల తర్వాత తీసే ఫొటోలో మన అభివృద్ధి కనపడాలి. వాటి అభివృద్దికి కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తా. ఒక జిల్లా కలెక్టర్గా మీరు పనిచేసి వెళ్లిన తర్వాత ప్రజలు మంచిగా గుర్తు చేసుకోవాలి. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కలెక్టర్లు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. అధికారులను అప్యాయంగా పలకరించాలి. సంక్షేమ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలను పట్టించుకోవద్దు’ అని వైఎస్ జగన్ సూచించారు.( చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
అక్రమ నిర్మాణమైన ప్రజా వేదిక కూల్చేయాలి
-
‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్ ఆరోపించారు. (చదవండి: మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్ఆర్డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంకా చంద్రబాబు పెత్తనమేనా?
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట కృష్ణాతీరంలో రిజర్వ్ కన్జర్వేటరీలో నిబంధనలకు విరుద్ధంగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన నివాసం వైపు రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. అయితే ఎన్నికలు ముగిసి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చంద్రబాబు నివాసం వైపు ప్రయాణికులను, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఆయన ఇంటికి మూడు వైపులా దారులు మూసివేశారు. మరోవైపు కృష్ణానదిలో మత్స్యకారులను వెళ్లనీయకుండా నిరంతరం పోలీసులు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీతానగరం కొండవీటివాగు హెడ్స్లూయిస్ నుంచి చంద్రబాబు నివాసానికి 3 కి.మీ.ల దూరం ఉంటుంది. కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో ఎక్కువ శాతం పూల తోటలు, కూరగాయలు ఉండటంతో రైతులు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల సమయంలో పొలాలకు వెళుతుంటారు. రైతులను పొలాలకు వెళ్లనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబునాయుడు పెత్తనం చెలాయిస్తున్నాడని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ విషయమై ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడని, కష్టపడే రైతు పంట పొలానికి వెళ్లనీయకపోతే సహించేది లేదని, రెండు మూడు రోజుల్లో పోలీసులు బారికేడ్లు తొలగించకపోతే, ఆయన ఇంటిముందే కూర్చుంటానని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. -
సీఎం వైఎస్ జగన్కు చంద్రబాబు లేఖ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆయన ఈ సందర్భంగా ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. నిన్న తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు ఇప్పటికే కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు. -
ఉండవల్లి వెలవెల తాడేపల్లి కళకళ..
విజయవాడ సిటీ: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన తీర్పు రావడంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెలవెలబోగా, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివా సం ఉన్న తాడేపల్లి ప్రాంతం జన సందోహంతో కళకళలాడింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చరిత్రా త్మక విజయం సాధించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు గురువా రం తాడేపల్లిలోని జగన్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. మరోవైపు అక్కడికి సమీపంలోనే ఉన్న చంద్ర బాబు నివాసం వద్ద ఎలాంటి సందడి కనిపిం చలేదు. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటలోనే పసుపు జెండాల రెపరెపలు ఆగిపోయాయి. నిన్నటి దాకా తొడలు కొట్టిన వాళ్లంతా ఇళ్లకే పరి మితమయ్యారు. ఉండవల్లిలోని ప్రజావేదిక, చంద్రబాబు నివాసం, పరిసరాలు నిర్మాను ష్యంగా మారాయి. ఉదయం 9 గంటలకే ఫలి తాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం కావడంతో టీడీపీ అధికార ప్రతిని« దులంతా బయటకు రాలేదు. ఒక్కరు కూడా మీ డియా పాయింట్కు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే ఆ ప్రాంతం బోసిపో యింది. వైఎస్సార్సీపీ జెండాల రెపరెపలు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడే పల్లిలోని తన నివాసంలో ఉండి, ఎన్నికల ఫలి తాలను టీవీలో వీక్షించారు. కుటుంబ సభ్యులు, ఆంతరంగికులతో కలిసి ఫలితాలను సమీక్షిం చారు. అఖండ విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివ చ్చారు. వారి రాకతో తాడేపల్లి కిటకిటలాడింది. అడుగడుగునా వైఎస్సార్సీపీ జెండాలు రెపరెప లాడాయి. విజయోత్సాహంతో కుర్రకారు జోరుకు అడ్డే లేకుండా పోయింది. బాణాసంచా మోతలతో తాడేపల్లి దద్దరిల్లిపోయింది. మహిళా నేతలు, అభిమానులు నృత్యాలు చేశా రు. వైఎస్ జగన్ నివాసం ముందు భారీగా బాణసంచా కాల్చారు. ‘ఇదే ప్రజాతీర్పు.. బై బై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్ర హ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ ఉన్నతా ధికారులు జగన్ కలిసిన వారిలో ఉన్నారు. -
చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం
-
చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం
సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బైక్పై ఉన్న వ్యక్తి వాహనానికి బలంగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనంలో ఉన్నవారెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత
-
తమాషాలా.. తాటతీస్తా.. వార్నింగ్
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తమ పొలాలపై యూ-1 రిజర్వ్ జోన్ ఎత్తివేయాలంటూ రైతులు సోమవారం ర్యాలీ చేపట్టారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలకొండ గ్రామల రైతులు తాడేపల్లి నుంచి ఉండవల్లిలోని సీఎం నివాసం వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న రైతులు పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగి.. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రైతులు రోడ్డుపైన ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీ మురళీ మోహన్, లింగమనేని రమేష్కు చెందిన సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే తమ పొలాలను రిజర్వు జోన్లుగా ప్రకటించారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే దానిని ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ర్యాలీకి వచ్చిన రైతులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ర్యాలీకి కూలీలను ఎందుకు తీసుకు వచ్చారని వారిపై మండిపడ్డారు. తమాషాలు చేయొద్దంటూ, తాటతీస్తా అంటూ రైతులకు వార్నింగ్ ఇచ్చారు. వేషాలు వేస్తే రిమాండ్కు పంపిస్తామని, అడ్డువచ్చిన రైతులను నెట్టిపారేశారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని అడిగితే పోలీసులే బెదిరింపులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. -
సీఎం నివాసానికి ర్యాలీ.. రాజధానిలో ఉద్రిక్తత
-
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
-
కక్ష సాధింపు!
రాజధాని గ్రామమైన ఉండవల్లి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. పూలింగ్ ప్రక్రియను మొదటి నుంచి ఈ గ్రామానికి చెందిన రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశత్వంపై రైతులంతా కలిసి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉండవల్లిలో భూములను సేకరించవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్ను సైతం పక్కన పెట్టిన ప్రభుత్వం.. తన ఆగడాలను రెట్టింపు చేసింది. రైతుల అనుమతి లేకుండానే గ్రామ పొలాల్లో నుంచి విద్యుత్ తీగలు లాగిస్తోంది. సాక్షి, అమరావతిబ్యూరో : ఉండవల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగేందుకు గురువారం అధికారులు సిద్ధమయ్యారు. తమ అనుమతి లేకుండానే తీగలు ఎలా లాగుతారని ప్రశ్నించిన రైతులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. తీగలు లాగడాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు ఈడ్చిపారేసి మంగళగిరి పోలీసుస్టేషన్కు తరలించారు. అమరావతికి కొండవీటి వాగు నుంచి ముంపు బెడద తప్పించడానికి ప్రకాశం బ్యారేజి సీతానగరం వద్ద రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 16 మోటార్లను ఏర్పాటు చేసి వరద సమయంలో కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం అవసరమైన సబ్స్టేషన్ను కొండవీటివాగు హెడ్ స్లూయిస్ వద్ద ప్రభుత్వం చేపట్టింది. దీనికి మంగళగిరి మండలం నులకపేట 130 కేవీ సబ్స్టేషన్ నుంచి గుంటూరు చానల్ మీదుగా హైటెన్షన్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. వాగు వద్దకు వచ్చే సరికి తీగలు రైతుల పొలాల్లో నుంచి వెలుతున్నాయి. సుమారు 9 ఎకరాల్లో నుంచి తీగలను వేశారు. రైతులు ఎదురుతిరిగినా పోలీసుల సాయంతో వారిని అరెస్ట్ చేయించి మరీ తీగలు లాగారు. విడతల వారీగా రైతులు కాపలా.... నెలన్నర రోజుల కిందట ప్రభుత్వం ఇలాగే నియంతృత్వంగా వ్యవహరించడంతో రైతులంతా కలిసి ఎదురుతిరగడంతో అప్పట్లో అధికారులు వెనుతిరిగారు. అప్పటి నుంచి రైతులు విడతల వారీగా రేయింబవళ్లు తమ పొలాల్లో కాపలా ఉంటూ వచ్చారు. ఎప్పుడు ఎవరూ వచ్చి తీగలు లాగుతారోనని భయం భయంగా గడిపారు. గురువారం ఉదయం అధికారులు చడీచప్పుడుకాకుండా వచ్చి పోలీసుల సాయంతో రైతులను అరెస్ట్ చేయించి తమ పనికానిచ్చేశారు. కోట్లలో నష్టపోనున్న బాధిత రైతులు... ఉండవల్లి రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూడు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తేల్చి చెబుతూ వచ్చారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను అడ్డుకుని, వాటిని కోర్టులో సవాల్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తీగలు లాగిన పొలాలు మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా తీగలు లాగడం వల్ల భూముల ధరలు భారీగా పడిపోవడంతో పాటు వీటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని బాధిత రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో ఈ భూమిని డెవలప్ చేసుకోవాలన్నా, భవంతులు కట్టుకోవాలన్నా హై టెన్షన్ వైర్లు ఉండడం వల్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని... ఇక జీవితాంతం ఈ భూమిని వదిలేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 కోట్ల మేర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలోనూఎదురు దెబ్బ కనకదుర్గా వారధి నుంచి తుళ్లూరు మండలంలోని బోరుపాలెం వరకు 21 కిలోమీటర్ల నిర్మించనున్న సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉండవల్లి రైతులు తమ భూములను ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఆ భూములను సేకరించాలని నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. భూ సేకరణ కోసం ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘిస్తోందని, తప్పులతడకగా సర్వే చేసిందని సాక్ష్యాధారాలతో సహా రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో రోడ్డు కోసం సేకరించాలనుకున్న 153 ఎకరాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. -
పొలాల్లో హై‘టెన్షన్’
తాడేపల్లి రూరల్: రాజధానికోసం భూములివ్వని రైతులపై ప్రభుత్వ దమనకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా గురువారం ఉండవల్లిలో రైతుల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్శాఖ అధికారులు భారీగా పోలీసులను వెంటపెట్టుకుని వచ్చారు. ఆందోళన చెందిన రైతులు హడావుడిగా పంటపొలాలకు చేరుకుని వైర్లు లాగడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో రైతులు తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లను బయటకు తీయగా.. వారిని పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. వైర్లు లాగుతాం.. ఏం చేస్తారు? గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాలను ప్రభుత్వం రాజధానిగా ప్రకటించినప్పటినుంచి భూములివ్వని రైతులను ఏదోవిధంగా బెదిరిస్తూ దమనకాండకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉండవల్లిలో రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల పంటపొలాల్లోంచి హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమైన విద్యుత్శాఖ అధికారులు భారీగా పోలీసు బలగాలను వెంటపెట్టుకుని వచ్చారు. ఇది తెలుసుకున్న ఆయా పొలాలకు చెందిన 18 మందికిపైగా రైతులు హడావుడిగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడుతుండగానే.. కాంట్రాక్టరు హైటెన్షన్ వైర్లు లాగేందుకు సిద్ధమవడంతో ఆగ్రహానికి లోనైన రైతులు అడ్డుకున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే.. విద్యుత్ అధికారులు మళ్లీ వైర్లు లాగే ప్రయత్నం చేశారు. అంతేగాక.. వైర్లు లాగుతాం, ఏం చేస్తారో చెయ్యండంటూ రైతులపై విరుచుకుపడ్డారు. దీనిపై రైతులు.. అన్నం పెట్టే అన్నదాతలు మిమ్మల్నేం చేయగలరు. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన తహసీల్దార్.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. వైర్లు వెళ్లే స్థలాలకు కూడా జిల్లా కలెక్టర్ నష్టపరిహారం ఇస్తారంటూ చెప్పగా.. ఎలా ఇస్తారంటూ రైతులు ప్రశ్నించారు. దానికి అధికారులు సమాధానం చెప్పకుండా వైర్లు లాగుతామంటూ ముందుకెళ్లారు. దాంతో రైతులు తమ జేబుల్లోనుంచి పురుగుమందు డబ్బాలు, పెట్రోలు బాటిళ్లు బయటకు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆరుగురు రైతులను పోలీసులు బలవంతంగా జీపులో మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. మరోవైపు మహిళా రైతులను పంటపొలాలనుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అనంతరం హైటెన్షన్ వైర్లను లాగే ప్రక్రియ చేపట్టారు. అదుపులోకి తీసుకున్న రైతులను గురువారం సాయంత్రం పూచీకత్తుపై వదిలిపెట్టారు. -
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హైటెన్షన్ లైన్ ఏర్పాటు వ్యతిరేకంగా రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత
-
విశాఖలో ఎనర్జీ స్టోరేజి పార్కు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజి పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ స్టోరేజీకి రాష్ట్రంలో అన్ని అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఉండవల్లిలోనీ గ్రీవెన్స్ హాలులో సోమవారం హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజి డివైజ్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపైనే యువత దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి ఖరీదైందని, అలాంటిది ఇప్పుడు చౌకధరకు ఇస్తున్నామని చెప్పారు. నిన్నటిదాకా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్నారని, ఇప్పుడు పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఎనర్జీ స్టోరేజి కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, చివరికి అది కూడా సాధ్యమైందని తెలిపారు. 2020 నాటికి దేశంలో 15 వేల మెగావాట్ల హై ఎనర్జీ స్టోరేజి డివైజ్ మార్కెట్కు అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ తదితర రంగాల్లో ఎనర్జీ స్టోరేజికి అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య అంతరం తొలగించేందుకు నాలుగేళ్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఉపాధి కల్పించే చదువుకే పెద్దపీట వేయాలన్నారు. ఈ సందర్భంగా భారత్ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీని చంద్రబాబు అభినందించారు. నేనూ అవయవదానం చేస్తా.. అవయవదానానికి తాను ముందుకు వస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అవయవదానాన్ని పాఠ్యాంశాల్లో ఒక అంశంగా పెడతామని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్లో అవయవదానం ఒక షరతుగా పెట్టే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో అవయవదాతలు ఇచ్చిన అంగీకార పత్రాలను పట్టణ పేదరిక నిర్ములన సంస్థ(మెప్మా), ముఖ్యమంత్రి సమక్షంలో జీవన్ దాన్ సంస్థకు అందించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షా 20 వేల మంది అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి అవయవాల దానం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూచించారు. 1.20 లక్షల మంది అవయవదానానికి ముందుకురావడాన్ని ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి రాకేష్ వర్మ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణమూర్తి, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.వి.రావు, మెప్మా మిషన్ డైరెక్టర్ పి.చినతాతయ్య పాల్గొన్నారు. తిరుపతిలో హోలీటెక్ కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం తిరుపతిలో షియోమీ మొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ నెలకొల్పేందుకు దానికి సంబంధించిన హోలీటెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభించాలని, జనవరిలో ఉత్పత్తి ప్రారంభించాలని హోలీటెక్ ప్రతినిధులను కోరారు. సమావేశంలో మంత్రి నారా లోకేశ్, హోలీటెక్ సీఈఓ ఫ్లేమ్ చంద్, షియోమీ వైస్ ప్రెసిడెంట్ మనోజైన్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఐటీ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదతరులు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారని ఎస్పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులతో సహా సీఎం నివాసం వద్ద ధర్నా చేపట్టారు. 80 మందిని అనవసరంగా సర్వీసుల నుంచి తొలగించారని, ఉద్యోగాలు కోల్పోయి మూడేళ్లుగా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వస్తే అన్యాయంగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు నుంచి తొలిగించిన కొంతమంది కానిస్టేబుల్స్ ప్రాణాలు కూడా కోల్పోయారని, వారి కుటుంబాలకు గత మూడేళ్లుగా ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం అందలేదన్నారు. కనీసం వారిని ఆదుకోకపోగా మమ్మల్ని అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సుమారు 80 మందిని ఉద్యోగాల నుంచి తీసేసారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
తాడేపల్లి మండలం ఉండవల్లిలో హైటెన్షన్
-
ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేస్తున్నారంటూ తాడేపల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విశాఖలో లక్ష ఎకరాలు దోచుకున్నారు
-
135వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు షెడ్యూలు విడుదలైంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు చేరుకుంటుంది. 135వ రోజు పాదయాత్ర అక్కడే ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 134వ రోజు ముగిసిన పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర 134వ రోజు ఉండవల్లిలో ముగిసింది. నేటి ఉదయం నవులురు క్రాస్లో ప్రారంభించిన యాత్ర ఎర్రబాలెం, పెనుమాక మీదుగా కొనసాగింది. ఉండవల్లికి చేరుకున్న అనంతరం సాయంత్రం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ పాల్గొని ప్రసంగించారు. బుధవారం పాదయాత్ర అక్కడే ముగించారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. నేడు 11.3 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటివరకూ 1749.4 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. -
రాజధాని పేరుతో చంద్రబాబు ముంచేశాడు
సాక్షి, ఉండవల్లి: పక్కనే కృష్ణానది.. ఏటా నాలుగు పంటలు పండే సారవంతమైన భూమి.. దగ్గర్లో విజయవాడ నగరం.. ఇన్ని ప్రత్యేకతలున్న ఉండవల్లిలో ఎకరం భూమి కనీసం ఐదు కోట్ల రూపాయలు పలుకుతుంది. కానీ రాజధాని పేరుతో పచ్చచొక్కాల గద్దలు ఇక్కడి రైతులను దారుణంగా మోసం చేశాయి. ఆ గద్దల గుంపునకు నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ ముంచేశాడు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 134వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు చెబుతున్నది ఇదే.. : మంగళగిరి రాజధాని ప్రాంతంలో అడుగులు వేస్తున్నప్పుడు ప్రజలు నాదగ్గరికొచ్చి బాధలు చెబుతుంటే గుండె తరుక్కుపోయింది. ‘‘ అన్నా.. బలవంతంగా మా భూములు లాక్కున్నారని రైతులు చెబుతున్నారు. అసైన్డ్ భూములు కోల్పోయామని పేదలు విన్నవించారు. ఇక లంక భూముల వ్యవహారమైతే దగా కంటే దారుణం. మొదట్లో లంక భూములకు ప్యాకేజీ రాదని ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. రైతుల దగ్గర్నుంచి చవకగా భూములు కొట్టేశారు. ఆ తర్వాత ఆ భూములకూ ప్యాకేజీ రావడంతో పేదలు వాపోయారు. రాజధానికి భూములిచ్చిన కుటుంబాల్లో అందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చంద్రబాబు చెప్పాడు. ఇవాళ పిల్లలు కాలేజీలకు వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేని పరిస్థితి. అందరికీ ఉచిత వైద్యం, నిరుద్యోగులకు భృతి, వృద్ధాశ్రమాలు, వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. వీటిలో ఏఒక్కటి చేయకుండా చివరికి మమ్మల్ని నాశనం చేసి వదిలేశాడని రాజధాని ప్రాంతవాసులు అంటున్నారు. ఒక ఎకరం కనీసం రూ.5 కోట్లు పలుకుతుంటే.. ప్రభుత్వం మాత్రం వెయ్యి గజాల స్థలం ఇస్తామంటున్నదని జనం బాధపడుతున్నారు. ‘అయ్యా, రోడ్లు వేసి వదిలిపెడితే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారమేదో మేము చేసుకోలేమా, నేరుగా మేమే బాగుపడతాం కదా’ అని రైతులు చెబుతున్నారు. ముగ్గురం కలిసి కూలికి పోతే నెలకు కనీసం 20 వేలు సంపాదించేవాళ్లం.. ఇప్పుడు పంటలులేక ఉపాధిపోయిందని రైతు కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉండవల్లికి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంది. అయినాసరే చుట్టుపక్కల ఇసుక రీచ్ల నుంచి లక్షల టన్నులు అక్రమ రవాణా అవుతోంది. ‘అసలు ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజల ఆస్తులు కాపాడేవాడా, దోచుకునేవాడా? ఇసుకమాఫియా డాన్ ఎవరన్నా?’ అని యువతరం ప్రశ్నిస్తోంది. అధికారుల నుంచి చినబాబు దాకా అక్కడి నుంచి పెదబాబు దాకా అంతా అవినీతిమయం. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం ఆనంద నగరాలు పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. కన్సల్టెన్సీలకు కోట్లు కుమ్మరిస్తున్నాడు. ఒక కార్పొరేటర్కు ఉన్న జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదు. పక్కనే కృష్ణా నది ఉన్నా మంగళగిరికి తాగునీళ్లు లేవు. నోరు తెరిస్తే స్మార్ట్ సిటీ అంటాడు లేదా క్యాపిటల్ సిటీ అంటాడు... కానీ నాలుగేళ్లలో కనీసం డ్రైనేజీ కూడా కట్టలేదు. ఇదీ బాబుగారి హైటెక్ పాలన’’ అని వైఎస్ జగన్ వివరించారు. రాష్ట్రం వైపు ఒక్కసారి చూడండి.. ►నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు.. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతున్నాయి.. మీరంతా గుండెలపై చేయివేసుకుని ఆలోచించండి.. ►మోసాలు చేసేవాడు నాయకుడిగా కావాలా? అబద్ధాలు చెప్పేవాడు నాయకుడిగా కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలన గమనించండి ►ఎన్నికలప్పుడు రుణమాఫీలని రైతులను, పొదుపు సంఘాలను, చదువుకునే పిల్లలలను, జాబుల పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడు. ►విశాఖలో సమ్మిట్ పెడతాడు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతాడు.. ఒక్క ఉద్యోగమైనా కనిపించిందా ►నాడు ప్రత్యేక హోదా సంజీవని కాదన్నాడు. మధ్యలో ప్యాకేజీ బాగుందన్నాడు. మళ్లీ ఇవాళ హోదా అంటున్నాడు. చంద్రబాబు చేసిన మోసాల్లో అన్నింటికన్నా దారుణమైన మోసం హోదాపై యూటర్నే. ►ఇవాళ హోదా ఎండమావిగా మారడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబే. ►కేంద్రాన్ని మేల్కొల్పాలనే వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే, నరేంద్ర మోదీ దిగొచ్చి హోదా ఇచ్చేదికాదా ►నాలుగేళ్ల పాలన చూశారు. పొరపాటున చంద్రబాబును క్షమిస్తే మోసాలకు అంతమే ఉండదు. ►జనం నమ్మరుకాబట్టే ఆయన కొత్త మాటలతో ముందుకొస్తాడు.. ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజ్ కారు ఇస్తానంటాడు. అయినా నమ్మరని తెలుసుకాబట్టి ప్రతి ఇంటికీ మనిషిని పంపించి చేతిలో మూడు వేలు పెడతాడు. ఆ డబ్బు మన దగ్గర్నుంచి దోచేసిందేకాబట్టి మూడుకు ఐదు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వెయ్యండి. ►అబద్ధాలు, మోసాలు చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తేనే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. రాబోయే మన ప్రభుత్వంలో ►ప్రజల ఆశీర్వాదంతో రేపు ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో నవరత్నాల్లాంటి పథకాలను అమలుచేసుకుందాం. నవరత్నాల నుంచి పిల్లల చదువులకు సంబంధించిన అంశాలను చెబుతాను. ►పిల్లల చదువుల కారణంగా కుటుంబాలు అప్పులపాలు కావద్దని మహానేత వైఎస్సార్ భావించేవారు. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఫీజురీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. ►ఆ పథకం ఇప్పుడు దారుణంగా నీరుకారింది. ఫీజులు లక్షలల్లో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం 30 వేలు మాత్రమే. మిగతా డబ్బులు చెల్లించలేని స్థితిలో చాలా మంది చదువులు మానేస్తున్నారు. ►నెల్లూరులో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ తండ్రి ఫీజులు కట్టలేని స్థితిలో కొడుకు ఆత్మహత్య చేసుకున్న వైనం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ►రాజన్న కుమారుడిగా ప్రజలకు మంచి చేసే విషయంలో ఆయన కంటే నేను రెండడుగులు ముందుకు వేస్తానని మాటిస్తున్నా. ►పిల్లను ఏం చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుంది. హాస్టల్, మెస్ ఖర్చులకు అదనంగా సంవత్సరానికి 20 వేల రూయాలు ఇస్తాం. ►మన పిల్లలు బాగా చదవాలంటే.. బాల్యం నుంచే పునాదులు పడాలి. అందుకే పిల్లల్ని పంపించే తల్లులకు సంవత్సరానికి 15 వేల రూపాయాలు అందిస్తాం. -
జేడీ లక్ష్మీనారాయణ భార్యనంటూ..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గురువారం ఓ మహిళ అలజడి సృష్టించింది. అమరావతిలోని ఉండవల్లిలోని సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సదరు మహిళను భద్రతా సిబ్బంది అడగగా సచివాలయానికి వెళ్తున్నట్టు చెప్పింది. అయితే ఆమె సీఎం ఇంటి దగ్గరే తిరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఓసారి సీబీఐ అధికారినని, మరోసారి సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ భార్యనంటూ పొంతనలేని సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆధారాలు పరిశీలించారు. ఎర్విన్ రీటాగా గా గుర్తించిన పోలీసులు ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. -
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయండి
-
ఉండవల్లిలో అధికారుల అత్యుత్సాహం
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా ఉండవల్లిలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పీడబ్ల్యూడీ వర్క్ షాపు ఉన్న వద్ద ఇళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు సిద్ధం అయ్యారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. దీంతో తమకు ప్రత్యామ్నయం చూపాలంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితుల ఆందోళనుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వామపక్ష నేతలు మద్దతు తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇళ్లను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. ఒక్కొక్కరికి 5 సెంట్ల స్థలం, రూ.5 లక్షల నగదు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్ చేశారు. -
సుందర గుహాలయాలు
ఉండవల్లి గుహలు గుంటూరు నుంచి 30 కి.మీ. విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మలినిర్మాణం 6–7 శతాబ్దాల కాలంలో జరిగింది. గుహాలయాల మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు. రెండవ అంతస్తు త్రికూటాలమయం. మూడవ అంతస్తు అనంత శయన విష్ణుమూర్తి, పన్నిద్దరాళ్వార్లు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది. వీటిలోని శిల్పకళారీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తోంది. శనిదోషాలను నివారించే విదురాశ్వత్థ వృక్షం విదురుడు నాటిన రావిచెట్టు కాబట్టి దీనికి విదురాశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. ఈ విశాలమైన వృక్షరాజాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. కావేరి, ఆర్కావతి నదుల సంగమస్థానం ఇది. మహాశిల్పి జక్కన, టిప్పుసుల్తాన్లు ఈ క్షేత్రంలో పుట్టారని అంటారు. వృక్షం మూలభాగం బ్రహ్మరూపమని, మధ్యభాగం విష్ణురూపం అని, అగ్రభాగం శివరూపం అని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది. విష్ణు అంశ గల చెట్టు ఇది. శని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు. భూత ప్రేతపిశాచ రోగాలు, సంతానహీనత తొలగించే వృక్షం. శనిదోషాలతో బాధపడేవారు దీని దర్శనం చేసుకుంటే శాంతి సుఖాలు పొందుతారని విశ్వాసం. సోమేశ్వరం, గణేశుడు, లక్ష్మీనారాయణుడు, ఆంజనేయ స్వామి ఆలయాలతోపాటు వేలకొలదీ నాగ ప్రతిమలు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుంచి కూడా ఈ క్షేత్రానికి బస్సులు ఉన్నాయి. కానీ వసతి సౌకర్యాలు ఉండవు. -
తోక ముడిచిన సర్కార్
పట్టిసీమ చర్చను వ్యూహాత్మకంగా అడ్డుకున్న ప్రభుత్వం అనుమతి నిరాకరణ పేరుతో చర్చకు చెక్ పోలీసుల అదుపులో ఉండవల్లి, గోరంట్ల విజయవాడలో హైడ్రామా వాస్తవమేంటో తేలుతుందని భావించిన జిల్లా ప్రజలకు నిరాశ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఆశ దోశ అప్పడం...పట్టిసీమపై చర్చ జరిగిపోద్దనే!....చర్చిస్తే అవినీతి బయటపడి పోదూ. తమ పరువేం కావాలి....గంగలో కలిసిపోదూ!. అంత ఈజీగా ఒప్పుకుంటామా ఏంటీ? సవాల్ విసిరినంత మాత్రాన చర్చ జరిగిపోవాలా? ఎవరి ఉచ్చులో మనమెందుకు చిక్కుకోవాలి? అని అనుకుందో ఏమో గాని పట్టిసీమపై జరగాల్సిన చర్చ విషయంలో సర్కార్ తోక ముడిచింది. అనుమతి లేదంటూ సవాళ్లు...ప్రతిసవాళ్లు విసిరిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అదుపులోకి తీసుకుని వ్యూహాత్మకంగా చర్చకు చెక్ పెట్టింది. ఏదో ఒకటి తేలిపోతుందని విజయవాడ వైపు చూసిన జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. పట్టిసీమ ప్రాజెక్టు వేదికగా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సీఎం చంద్రబాబు దగ్గరి నుంచి కింది స్థాయి నేతల వరకు అవినీతిలో భాగముందని రాష్ట్రమంతా కోడై కూస్తోంది. ముడుపుల కోసమే ప్రాజెక్టు చేపట్టారని ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున ఉండవల్లి అరుణ్కుమార్, ప్రభుత్వం తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి వకాల్తా పుచ్చుకుని...సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుని చర్చకు సై అన్నారు. విజయవాడను వేదికగా చేసుకున్నారు. ఇద్దరూ సమాయత్తమయ్యారు. దీంతో అందరి దృష్టి విజయవాడపై మళ్లింది. రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ వస్తుందని ఆశపడ్డారు. కానీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదిపి ముగింపు పలికింది. . విజయవాడలో హైడ్రామా... అనుకున్నట్టే ప్రభుత్వం తోకముడిచింది. పట్టిసీమపై అంత ఈజీగా చర్చకు అనుమతిస్తుందా? అన్న అనుమానాలను నిజం చేసింది. చర్చ జరిగితే ఎక్కడ అవినీతి బయటపడిపోతుందనో..ఎవరికెంత ముడుపులందాయో తెలిసిపోతుందనో... ఎందుకొచ్చిన రాద్ధాంతమనో తెలియదు గాని చర్చ జరిగిన రోజున అనుమతి లేదంటూ వ్యూహాత్మకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంది. అనుమతి నిరాకరణ పేరుతో సవాళ్లు స్వీకరించిన ఉండవల్లి అరుణ్కుమార్ను, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. చెప్పినట్టుగానే ప్రకాశం బ్యారేజీ వద్దకు ఉండవల్లి అరుణ్కుమార్ ముందుగా చేరుకున్నారు. నిర్ధేశించిన ఉదయం 11 గంటలకు మాత్రం బుచ్చయ్య చౌదరి చేరుకోలేదు. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి భారీగా వాహనాలతో తరలివచ్చారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే ఇక్కడ బుచ్చయ్య చౌదరి ప్రజలకు అనుమానం రాకుండా తమదైన సీన్ రక్తి కట్టించారు. పోలీసులతో వాగ్వాదం చేసి...బహిరంగ చర్చకు వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటూ హడావుడి సృష్టించారు. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రశాంత వాతావరణంలో చర్చకు అనుమతిస్తే ఎవరి లెక్కేంటో? ఎవరి వాదనలో పస ఉందో తేలిపోయేదని....చర్చను అడ్డుకోవడమంటే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే అన్న వాదనలు వినిపించాయి. అవినీతి లోగుట్టు బయటపడకూడదనే ఈ ఎత్తుగడ చంద్రబాబు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. -
వాట్సప్లో ప్రేమాయణం
► పెళ్లికి నిరాకరించిన ప్రియుడు ► యువతి ఆత్మహత్యాయత్నం ► పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా మారని తీరు ఉండవల్లి (తాడేపల్లి రూరల్): వాట్సప్లో మొదలైన ప్రేమాయణం విఫలమవడంతో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఓ వ్యక్తి పది సంవత్సరాల క్రితం వలస వచ్చి ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటూ విగ్గులు తయారుచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాడు. కుమార్తె బీటెక్లో మంచి ఫలితాలు సాధించడంతో తండ్రి ముచ్చటపడి సెల్ఫోన్ కొనిచ్చాడు. అదే ఆమె పాలిట శాపమయ్యింది. ఆండ్రాయిడ్ ఫోన్ కావడంతో ఫేస్బుక్, వాట్సప్లను ఆమె వినియోగించింది. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన గోపాలకృష్ణ వాట్సప్లో ఆమెకు పరిచయమయ్యాడు. వాట్సప్లోనే ప్రేమాయణం కొనసాగించి, ఈ నెల 7వ తేదీన తిరుపతి వెళ్లి గోపాలకృష్ణను కలిసింది. అతని తల్లిదండ్రులకు కూడా ప్రేమ విషయాన్ని తెలియచేసింది. దీంతో గోపాలకృష్ణ, అతని కుటుంబసభ్యులు తిరస్కరించారు. ఆమె తిరుపతిలోనే ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడి పోలీసులు రెండు రోజుల పాటు లేడీస్హాస్టల్లో ఉంచి ఆమె తండ్రికి సమాచారం ఇవ్వడంతో తిరుపతి వెళ్లి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చాడు. అతన్నే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టిన ఆమెను తల్లిదండ్రులు మందలించడంతో బుధవారం ఉండవల్లి సెంటర్ నుంచి పంటపొలాల్లోకి పారిపోయింది. పంటపొలాల్లో యువతి ఒంటరిగా కనిపించడంతో రైతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళగిరి రూరల్ సీఐ సురేష్ ఆమెను పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా జరిగిన విషయం తెలియజేసింది. పోలీసులు యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పు రాలేదు. ఇంటికి వెళ్ళనని మారాం చేయడంతో పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కూతురికి సెల్ఫోన్ కొనిచ్చి పొరపాటు చేశానని ఆమె తండ్రి వాపోతున్నారు. -
‘మాకేం జరిగినా చంద్రబాబుదే బాధ్యత’
అమరావతి: భూ సేకరణ పునరావాస, పునర్నిర్మాణ చట్టం-2013 ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదికపై నిపుణుల కమిటీ మంగళవారం ఉండవల్లిలో సమావేశం అయింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు. కాగా మీటింగ్ మినిట్స్ రాయాలని రైతులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధానికి భూములు ఇవ్వాలని తమను బెదిరిస్తున్నారని రైతులు తెలిపారు. తమకు ఏం జరిగినా సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వారు అన్నారు. కాగా ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు రైతులను మోసం చేస్తూ అప్పటికప్పుడు సమావేశం నిర్వహించడంతో రైతులు ఈ సమావేశాన్ని రైతులు బహిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే 20 రోజుల క్రితం జరిగిన భేటీలో సైతం రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల కమిటీ సమాధానాలు చెప్పలేక అర్థాంతరంగా ముగించింది. -
పట్టిసీమపై చర్చకు రాకుండా ప్రగల్భాలా?
– ఎమ్మెల్యే బుచ్చయ్యపై ఉండవల్లి మండిపాటు – తనది తప్పని నిరూపిస్తే బహిరంగ క్షమాపణకు సిద్ధమని వెల్లడి సాక్షి, రాజమహేంద్రవరం : పట్టిసీమ శుద్ధ దండగ ప్రాజెక్టని, రూ.1,650 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నుంచి కృష్ణా నదికి తీసుకెళ్లి సముద్రంలో కలుపుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టిసీమ వల్ల ప్రయోజనం శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న తన సవాల్ను స్వీకరించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ తర్వాత ఆ విషయం మరచిపోయి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కొట్టించుకోవడం బుచ్చయ్యకు అలవాటే.. కృష్ణా బ్యారేజ్పై చర్చ పెడితే అక్కడి రైతులు తనపై దాడి చేస్తారని బుచ్చయ్య చెప్పడం హాస్యాస్పదమని ఉండవల్లి అన్నారు. కొట్టడం, కొట్టించుకోవడం బుచ్చయ్యకు బాగా అలవాటైన పనేనన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువులో ప్రజలు బుచ్చయ్యను కొట్టిన విషయం నగరవాసులు ఇంకా మరచిపోలేదన్నారు. పట్టిసీమపై తన వాదన అబద్ధమని నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెబుతానన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఉండవల్లి చెప్పారు. పట్టిసీమ నుంచి కోట్ల రూపాయల విద్యుత్ ఉపయోగించి 45 టీఎంసీలను కృష్ణాలో పోశారని చెప్పారు. అదే సమయంలో కృష్ణా నుంచి 55 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని జలవనరులశాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం చూపించారు. మంత్రి దేవినేని ఉమా ఆ నీరు పులిచింతల నుంచి వెళ్లిందని చెబుతున్నారని, పులిచింతల నుంచి సముద్రంలోకి వెళ్లింది కృష్ణా జలాలు కాదా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడం సరి కాదన్నారు. బుచ్చయ్యకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని స్పష్టం చేశారు. సమావేశంలో అల్లుబాబి, పి.అచ్యుత్దేశాయ్, చెరుకూరి రామారావు, నక్కా నగేష్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్సార్దే
-
‘ప్యాకేజీ’కి అప్పుడే ఒప్పుకున్నారా?
సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం వద్ద ఒప్పుకున్నారా?’’ అని సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ముంపు ప్రభావం పడే ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేయకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పిన బాబు అసలు ఆరోజు రాత్రి ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలన్నారు. ఉండవల్లి శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఏడు ముంపు మండలాలు, ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా, విద్యుత్ సంబంధిత అంశాలపై అప్పటి ప్రధాని మన్మోహన్ పార్లమెంట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపాక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దానికి ఆమోదం పడలేదన్నారు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా తొలగించి ముంపు మండలాల్ని ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీకోసం ఆనాడే ఒప్పుకుంటే హోదా కోసం ఇప్పటివరకు నాటకాలాడాల్సిన అవసరమేంటన్నారు.2018కి పోలవరం, పురుషోత్తపట్నం పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, రెండూ ఒకే సమయానికి పూర్తయితే పురుషోత్తపట్నం ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు.పరిహారం కోరేవారిని, వారి తరఫున ప్రశ్నించే వైఎస్ జగన్ను అభివృద్ధి నిరోధకులంటున్న చంద్రబాబు వైఎస్ జలయజ్ఞంపై ఎన్నిసార్లు కోర్టులకెళ్లారో గుర్తు చేసుకోవాలన్నారు. -
జస్టిస్ చలమేశ్వర్ను కలిసిన ఉండవల్లి
రఘుదేవపురం (సీతానగరం) : రఘుదేవవురం పంచాయతీ శ్రీరామనగరంలోని శ్రీ చిట్టిబాబాజీ సంస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థానంలో జస్టిస్ చలమేశ్వర్, లక్ష్మి దంపతులు శాంతిహోమం, గోపూజ, సువర్చలా సమేత హనుమద్ర్వతం, చిట్టిబాబాజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఉండవల్లి కలిశారు. జస్టిస్ చలమేశ్వర్కు మాజీ ఎంపీని సంస్థానం నిర్వాహకుడు జగ్గబాబు పరిచయం చేశారు. అనంతరం ఉండవల్లి శ్రీ చిట్టిబాబాజీని దర్శించారు. -
పాలించే హక్కు కోల్పోయింది
ఏపీ సర్కార్పై మాజీ ఎంపీ ఉండవల్లి ఫైర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పాలించే హక్కును చంద్రబాబు సర్కారు కోల్పోయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. కేంద్రంతో మాట్లాడి పునర్ విభజన చట్టంలోని అంశాలు అమలు చేరుుంచుకోకుండా రెండున్నరేళ్లుగా ప్రచార ఆర్భాటాలతోనే కాలం గడుపుతోందని విమర్శించారు. ఒక ఏడాది గోదావరి, మరో ఏడాది కృష్ణా పుష్కరాలతో కాలం గడిపిందన్నారు. పోలవరం కట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. పోలవరానికి ఇచ్చిన నిధులు లెక్క చెప్పకుండా... పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం హాస్యాస్పదమన్నారు. పోలవరం రానే రాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని చెప్పారు. జీడీపీ పెరిగి... రెవెన్యూ గ్రోత్ తగ్గిందా రాష్ట్రంలో జీడీపీ 12.26 శాతానికి పెరిగితే రెవెన్యూ గ్రోత్ రేట్ తగ్గడమేంటో చంద్రబాబే చెప్పాలని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన విదేశీ పెట్టుబడులు కేవలం రూ. 10 వేల కోట్లు కాగా... ఏపీకి లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయ వెల్లడి పథకంపైనా టీడీపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 11 ఛార్జీషీట్లు సీబీఐ కోర్టులో ఉన్నాయని తెలిపారు. ఆస్తులు అటాచ్మెంట్లో ఉంటే అంత నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. వివరాలు కేంద్రం బయటపెట్టాలని, గోప్యంగా ఉంచాల్సిన విషయం బయట పెట్టినవారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్న అరుుల్ రిఫైనరీ ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే జగన్కు మద్దతు తెలిపినట్లు అనుకోకూడదన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా విఫలమైందని చెప్పారు. -
విభజన ఎప్పటికీ శేషప్రశ్నే!
-
విభజన ఎప్పటికీ శేషప్రశ్నే!
- ఉండవల్లి పుస్తకావిష్కరణలో సుప్రీం జడ్జి చలమేశ్వర్ - చరిత్రలో చాలా ఘటనలు అలాగే ఉండిపోతాయి - రాజ్యాంగ బద్ధంగా జరగలేదన్నదే బాధ: ఉండవల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాసయిందా, లేదా? అనేది కూడా చరిత్రలో చాలా సంఘటనల మాదిరే ఎప్పటికీ శేష ప్రశ్నేనని అభిప్రాయపడ్డారు. సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన నేపథ్యంలో రచించిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే గ్రంథాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆదివారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చలమేశ్వర్ మాట్లాడుతూ జరిగి పోయిన విడాకులకు బాజాలెందుకని చమత్కరించారు. ఉండవల్లి అరుణ్కుమార్ పుస్తకాన్ని చదివినప్పుడు విభజన సమయంలో ఏయే నాయకుడు వ్యక్తిగతంగా ఎలా ప్రవర్తించారో, ఏ పాత్ర పోషించారనేది తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పాసయిందా? లేదా? అనే సందేహాన్ని రచయిత లేవనెత్తారని, చరిత్రలో చాలా సంఘటనలు అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయన్నారు. విభజన రాజ్యాంగ బద్ధమా కాదా? వాస్తవం ఏమిటి? సభలో ఏమి జరిగింది? అనేవి లోపల కూర్చున్న వారికే తెలియాలన్నారు. ‘చరిత్రలో అనేకం జరిగాయి. తెలుగు మాట్లాడే వారి రాజకీయ చరిత్ర ఏ ఆరేడు వందల ఏళ్లో అనుకుంటే రకరకాల ప్రక్రియలు జరిగాయి. గత 60,70 ఏళ్లలో రెండుసార్లు కలవడం, మరో రెండుసార్లు విడిపోవడానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడం జరిగింది. దానికి కారకులు ఎవరనేది వేరే ప్రశ్న. అవన్నీ గ్రంథస్తం కావా లి. ఎప్పటికయినా మనుషులు తెలివి తెచ్చుకుని పొరబాట్లు మళ్లీ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా’ అని చలమేశ్వర్ అన్నారు. ఏదీ సవ్యంగా జరగలేదు... సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా ఏదీ సవ్యంగా జరగలేదని, దీనికి నెహ్రూ మొదలు కిరణ్కుమార్రెడ్డి వరకు అందరూ బాధ్యులేనన్నారు. ‘ఏమైనా, విభజన జరిగింది. ఇది కొంతమందికి నచ్చలేదు. కానీ చేయగలిగిందేమీ లేదు. అయినా బిల్లు పాస్ కాలేదనే వాళ్లు కొందరున్నారు. వాళ్లలో ఉండవల్లి ఒకరు.’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని చాలా అంశాలను సాక్షి సీరియల్గా ప్రచురించిందని వివరించారు.రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణపై ఆధిపత్యం కోసమో, పదవుల కోసమో సమైక్యాంధ్ర కోసం పోరాడలేదని, ఉమ్మడిగా ఉంటే మరింత అభివృద్ధి, మేలు జరుగుతుందని పోరాడామన్నారు. గ్రంథ రచయిత ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా జరగాల్సిన ప్రక్రియ ఆ విధంగా జరగలేదన్నదే తన ఆవేదన అని చెప్పారు. అధికార, ప్రతిపక్షం కలిస్తే ఏమైనా చేయవచ్చన్నది ఈ బిల్లుతో నిరూపణ అయిందని వివరించారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకుడు డి.చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాసరెడ్డి, డి.అమర్, కృష్ణారావు, బి.శ్రీనివాసరావు, మాజీ ఐఎఎస్ అధికారులు మోహన్కందా, పీవీకే ప్రసాద్, మాజీ డీజీపీ అరవిందరావు, తెలంగాణ సీఎం మీడియా సలహాదారు జ్వాలా నరసింహారావు, ఎమెస్కో ప్రచురణాలయం అధిపతి విజయ్కుమార్లు ప్రసంగించారు. మరో సీనియర్ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ప్రసంగించేందుకు నిరాకరించారు. -
ధైర్యముంటే ‘హోదా’ అక్కర్లేదని చెప్పండి
‘మీట్ ది ప్రెస్’లో చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సవాలు సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రజలకు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సవాలు విసిరారు. హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ‘‘బాబు నాడు 15 ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. పదేళ్లకు తగ్గకుండా ఇవ్వాలని వెంకయ్యనాయుడు రాజ్యసభలో గంటలతరబడి మాట్లాడుతూ కోరారు. ఇప్పుడేమో అబద్ధమాడుతున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు’’ అని ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ‘హోదా’ పై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వెటకారంగా మాట్లాడారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధిస్తామన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరుగుతోందంటూ.. రాష్ర్ట విభజన తప్పని తప్పకుండా తీర్పు వస్తుం దనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పట్టిసీమలో భారీ అవినీతి.. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అవినీతి బాగా కనిపించిందని ఉండవల్లి అన్నారు. తాను దేశంలో పేరున్న కన్సల్టెన్సీ నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేసి బాబుకిచ్చానన్నారు. దీని విలువ రూ.400 కోట్లని, కానీ చంద్రబాబు దీన్ని పట్టించుకోలేదని చెప్పారు. వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అవి నీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేయమంటే బాబు పంపుసెట్లు పెడుతున్నారని, ఇంతకంటే అవినీతి ఏముం టుందన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధానిని నిర్మించడమంటే దోపిడీకి పెద్ద మార్గమని అభివర్ణించారు. మార్గదర్శిపై విచారణ జరుగుతోంది తాను ఏ కేసునూ వదిలేయలేదని, మార్గదర్శి సంస్థపై తాను వేసిన ఇంప్లీడింగ్ పిటిషన్పై విచారణ జరుగుతున్నదని ఉండవల్లి చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. -
474 కోట్లు ఎలా సంపాదించారు?
మంత్రి నారాయణకు ఉండవల్లి సూటిప్రశ్న సాక్షి, రాజమహేంద్రవరం: రాజధాని అమరావతి నిర్మాణంలో జరుగుతున్న తప్పులపై వివిధ రంగాల నిపుణుల కమిటీ పంపిన సమాచారాన్ని తాను విలేకర వద్ద ప్రస్తావిస్తే.. సమాధానం చెప్పకుండా మంత్రి నారాయణ తనపై ఎదురుదాడి చేయడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో తన ఆస్తులు రూ. 474.70 కోట్లని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? విద్యాసంస్థలను నారాయణ సొసైటీ పేరిట నడుపుతున్నారు.ఆ చట్ట ప్రకారం ఆ ఆస్తు లు సొంతానికి వాడుకునే హక్కు లేదు. మంత్రి తన సొంత ఖాతాకు సొసైటీ నగదు బదలాయించుకున్నారా? లేక సీఎం చంద్రబాబుతో కలసి వ్యాపారం చేశారా? సొసైటీ చట్ట ప్రకారం విద్యాసంస్థలను లాభాపేక్ష లేకుండా నడపాలి. సొసైటీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం. రూ. 474.70 కోట్లు ఎలా సంపాదించారో 15 రోజుల్లోపు వెల్లడించాలి. లేదంటే ఈ విషయంపై చట్టపరంగా ముందుకెళతాను. దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతాను. అప్పుడు నేను ఉండవల్లినా? ఊసరవెల్లినా? చెబుతాను’’ అని నారాయణపై మండిపడ్డారు. పారదర్శకత అంటే అదేనా ‘‘రాజధాని భూ సేకరణ నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అవినీతి జరుగుతూంటే బాబు ప్రతి రోజూ పారదర్శకతంటూ ఊదరగొడుతున్నారు. పారదర్శకతంటే పార పట్టుకు తిరగడమా?’’ అని ఎద్దేవా చేశారు. విజయవాడ, గుంటూరుల్లో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా పట్టించుకోలేదన్నారు. శివరామకృష్ణన్ చంద్రబాబు తీరుపై రాసిన మూడు పేజీల లేఖ ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైందని తెలిపారు. -
తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు పిండప్రదానాల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తన అత్త, మామ బసవతారకం, ఎన్టీ రామారావులకు కూడా పిండ ప్రదానాలు చేశారు. -
ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి..
-
ప్రజలు నిలదీస్తారనే భయం పుట్టాలి..
- అప్పుడే నాయకులు ఆచితూచి హామీలు ఇస్తారు.. - టీడీపీ ప్రజాకంటక పాలనపై చైతన్యం తెచ్చేందుకే గడపగడపకూ వైఎస్సార్ - ‘పశ్చిమ’లో ప్రజలతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే తాట వలుస్తారనే భయం ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసం చేస్తే రోడ్డుపైనే నిలదీస్తారనే భయం రాజకీయ నాయకులకు కలగాలి. ఆ మేరకు ప్రజలు చైతన్యవంతం కావాలి’’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే నాయకులు ఆచితూచి హామీలిస్తారన్నారు. లేదంటే చంద్రబాబులాంటి నాయకుడు ప్రతి ఇంటికీ ఒక కారు లేదా విమానమే కొనిస్తాననే వాగ్దానాలు చేస్తాడని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాత్రి నల్లజర్ల మండలం పోతవరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. వంద మార్కులకు వంద ప్రశ్నలు ఇచ్చి చంద్రబాబు హామీలు అమలు చేశాడా లేదా మీరే తేల్చుకోండని ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పారు. ఉండవల్లికి వైఎస్ జగన్ పరామర్శ సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను మంగళవారం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఉండవల్లి తల్లి లక్ష్మి(99) చనిపోయారు. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసానికి చేరుకుని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ ఉండ్రాజవరం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు దివంగత బూరుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ వెంట ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్లనాని, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మేకా శేషుబాబు, తుని, రంపచోడవరం ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. -
రెస్ట్ హౌస్ నుంచి సేఫ్ హౌస్
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ ఉండవల్లి (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి కరకట్ట ప్రాంతంలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి సీఎం సేఫ్ హౌస్ (తాడేపల్లి పోలీసుస్టేషన్), సేఫ్ హాస్పటల్ (మణిపాల్ ఆస్పత్రి)కు మంగళవారం పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ను నిర్వహించారు. తొలుత సీఎం సేఫ్ హౌస్కు చేరుకోవడానికి ఉండవల్లి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, ఉండవల్లి కూడలి, తాడేపల్లి ప్రధాన రోడ్డు మీదుగా పోలీసు స్టేషన్ వరకు, తిరిగి పాత జాతీయ రహదారి ముగ్గురోడ్డు, పోలకంపాడు మీదుగా ఉండవల్లి ఊరు దాటిన తరువాత కొండవీటి వాగు వంతెన మీదుగా కరకట్టపై ఉన్న సీఎం నివాసానికి కాన్వాయ్ చేరుకుంది. కరకట్ట వెంబడి ఉన్న ముఖ్యమంత్రి నివాసం నుంచి కేఎల్ రావు కాలనీ, స్క్రూబ్రిడ్జి, బోటు యార్డు, ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్పేట మీదుగా జాతీయ రహదారి వెంబడి వారధి వద్ద ఉన్న సేఫ్ హాస్పిటల్కు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్కి సేఫ్ హాస్పటల్కు చేరుకోవడానికి 9 నిమిషాలు, సేఫ్ హౌస్కు చేరుకోవడానికి 9 నిమిషాలు, తిరిగి నివాసానికి చేరుకోవడానికి పది నిమిషాల సమయం పట్టింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది, నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సీఐ హరికృష్ణ, ఎస్ఐలు వినోద్కుమార్, ప్రతాప్కుమార్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉండవల్లిపై ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు పొమ్మనకుండా పొగ పెడుతున్న వైనం సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్స్టేషన్లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందే కోట్లు పలికిన భూములు... రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. అటవీ భూముల బూచి... అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్నగర్, డోలాస్నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది. -
పవన్ కల్యాణ్ స్పందించాలంటూ ఫ్లెక్సీలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు తమ పొలాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని పొలాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ప్రభుత్వ బలవంతపు భూ సేకరణపై పవన్ స్పందించాలంటూ ఫ్లెక్సీల్లో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూములు ఇవ్వమని ఎన్ని సార్లు చెప్పినా తమను భయపెట్టడానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మూడు పంటలు పండే భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నామని...తమకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, సబ్సిడీలు కూడా ఆపేశారని తమ బాధను వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ పరిధిలో తమ గ్రామాలు లేకపోయినా భూములను టార్గెట్ చేశారన్నారు. ప్రాణాలు పోయినా సరే..తమ భూములను వదులుకోమని దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో తెలిపారు. గతంలో రాజధాని రైతులను ఆదుకుంటానని పవన్ స్వయంగా గ్రామాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. -
మళ్లీ భూసేకరణకు తెర తీశారు
విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉండవల్లి, పెనుమకలో భూసేకరణ చేయడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ చట్టంపై ఉండవల్లి పెనుమకలో రాత్రిరాత్రే పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వం పేరిట ఇవి దర్శనం ఇచ్చాయి. ఈ భూసేకరణకు సంబంధించి పెనుమకలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. -
రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలు
రైతుల అనుమతి లేకుండా సర్వేలు సర్వే కర్రలు పీకేస్తున్న రైతులు తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాలైన గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం నిరంతరం ఏదో విధంగా భయభ్రాంతుల్ని చేస్తూనే ఉంది. బుధవారం కొత్తగా మళ్లీ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి సర్వే చేయించి కర్రలు పాతారు. ఈ తంతు అంతా రైతులు పొలాల్లో లేనప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రైతులు సర్వే చేసి కర్రలు పాతుతున్నవారిని అడ్డుకుని తమ పొలాల్లో కర్రలు ఎందుకు పాతుతున్నారని ప్రశ్నిస్తే సీఆర్డీఏ అధికారుల సూచన మేరకు సర్వేచేసి కర్రలు పాతుతున్నట్లు చెబుతున్నారు. గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయ ఉద్యోగులను రైతులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన సర్వే పుల్లలను పీకేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సుమారు 80 ఎకరాలకు సర్వే నిర్వహించి, కర్రలు పాతారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వాటిని పీకేశారు. పెనుమాకలో రైతులు తిరగబడేందుకు సిద్ధమవడంతో సర్వేయర్లు వెళ్లిపోయారు. పూలింగ్కు ఇవ్వని పొలాల్లో ఎలా సర్వే చేస్తారు? రాజధానికి భూములు ఇవ్వకపోవడంతో మొదటి నుంచి ప్రభుత్వం రైతులను ఏదో విధంగా భయాందోళనలకు గురిచేస్తోంది. కొత్తగా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే అంటూ పచ్చని పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. కరకట్ట వెంబడి పూలింగ్కు ఇచ్చిన పొలాలున్నాయి. వాటిలో రోడ్లు నిర్మించకుండా పూలింగ్కు ఇవ్వని పొలాల్లో రోడ్లు ఎలా నిర్మిస్తారు? ఎలా సర్వే చేస్తారు? సీఆర్డీఏ అధికారులే తేల్చాలి. - బత్తుల శంకర్, ఉండవల్లి రైతులు తిరగబడేరోజు దగ్గర్లో ఉంది రైతుల సహనాన్ని సీఆర్డీఏ అధికారులు చేతగాని తనం అనుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా వ్యవసాయాధికారులు సలహాలు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి రైతులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. - విశ్వనాథరెడ్డి, పెనుమాక అన్నదాత తెగబడతాడు కోర్టులను ఆశ్రయించాం.. తీర్పు రైతులకు అనుకూలంగా ఇచ్చింది. అయినా ప్రభుత్వం రైతులను భయభ్రాంతుల్ని చేయడం మానడంలేదు. ఇలాగే ప్రభుత్వం చేస్తుంటే కడుపు మండిన అన్నదాత తెగబడతాడు. ప్రభుత్వం అది గమనించాలి. రైతుకు పంటలో నష్టం వస్తే తిరిగి మళ్లీ పంట వేస్తాడు తప్ప పొలాన్ని అమ్ముకోడు. అలాంటి మమ్ములను రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. - గాదె సాంబశివరావు, ఉండవల్లి -
భూసేకరణపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి విడుదలచేసిన మాస్టర్ప్లాన్పై మంగళవారం ఉండవల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ల్యాండ్ పూలింగ్కు 85 శాతం మంది రైతులు వ్యతిరేకించిన ఉండవల్లిలో మాస్టర్ప్లాన్పై అవగాహన సదస్సు ఎందుకు నిర్వహించారని రైతులు డీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ను నిలదీశారు. ఊరి మధ్యనుంచి రోడ్లు నిర్మించేది లేదని, గ్రామ కంఠాలలో కూడా రోడ్డు వేయమని, రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూమికి రెట్టింపు భూమి రైతులకు ఇవ్వడంతో పాటు మార్కెట్ ధర చెల్లిస్తామని శ్రీకాంత్ నచ్చజెప్పారు. అయినా రైతులు శాంతించలేదు. రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇచ్చే సమస్యే లేదని రైతులు తెగేసి చెప్పి సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దాదాపు రెండు గంటలపాటు కమిషనర్ శ్రీకాంత్ నచ్చజెప్పినా రైతులు వినలేదు. ఉండవల్లిలో ఎకరా భూమి రెండు కోట్ల రూపాయలు పలుకుతోందని, మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తామంటే ఆలోచిస్తామని కొందరు రైతులు స్పష్టంచేశారు. -
దోపిడీకి గురవుతున్న 'ఉండవల్లి' సంపద
-
బాబు దెబ్బకు నలిగిపోతున్న 'ఉండవల్లి'
సెప్టెంబర్ కరెంట్ బిల్లు రూ.1,10,905 బ్యారేజీ నుంచి నివాసం దాకా 215 వీధిలైట్లు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో పంచాయతీ గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న నివాసం ఆ పంచాయతీకి ఆర్థిక భారాన్ని మోపుతోంది. అసలే అంతంత మాత్రం ఆదాయం కలిగిన ఆ పంచాయతీ.. సీఎం కారణంగా నెలకు రూ.లక్ష పైనే విద్యుత్తు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం నివాసం వరకు ఏర్పాటు చేసిన 215 వీధిలైట్లకు సెప్టెంబర్ కరెంటు బిల్లు రూ.1,10,905 వచ్చింది. 20 వేల జనాభా కలిగిన ఉండవల్లి పంచాయతీకి సాలీనా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది. ఇంటిపన్ను, నీటి పన్నుల రూపంతో రూ.24 లక్షలు, ఇసుక రీచ్ల నుంచి సీనరేజి రూపంలో రూ.70 లక్షల ఆదాయం లభిస్తోంది. పారిశుధ్యం, ఇతర పనులు చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నెలకు రూ.2.40 లక్షల వేతనాలు చెల్లిస్తోంది. మిగిలిన నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పంచాయతీ పరిధిలోని కృష్ణానది కరకట్ట పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడంతో భద్రత కారణాల రీత్యా ప్రకాశం బ్యారేజి నుంచి నివాసం వరకు వీధిలైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో ఈ లైట్లన్నింటినీ వినియోగించడంతో సెప్టెంబర్లో కరెంటు బిల్లు తడిసి మోపెడైంది. -
రాజధాని రోడ్లతో పంటలపై దుమ్ము
గగ్గోలు పెడుతున్న రైతులు తాడేపల్లి: తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పొలాల నుంచి వేసిన డొంక రోడ్డును రబ్బీస్ తో నిర్మించడం వలన దానిలోని వస్తున్న దుమ్ము దూళీతో పంట పొలాలల్లో మేటలు వేయడంతో పంట దిగుబడి రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన పేరుతో తాత్కాలిక రోడ్డును ఏర్పరిచిన అధికారులు దానిపై నుంచి వస్తున్న దుమ్ము దూళీ వలన ఉల్లి, పూలమొక్కలతో పాటు పంట పొలాల దిగుబడి రాక తీవ్ర అవస్థలకు గురవుతున్నామంటున్నారు. ఉండవల్లి ఇసుక రీచ్ల నుంచి వస్తున్న లారీల వల్ల దుమ్ము ఉల్లి పంటకు ఎండపడక ఆక్సిజన్ తగ్గడం వలన పంట ఎండిపోయే స్థితిలో ఉన్నట్లు అదే విదంగా లిల్లీ, గులాబీ, కనకంబరం తదితర పూలు పంటపై దుమ్ము పడడంతో పూల మార్కెట్టుతో వాటి ధర గణనీయంగా పడిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఈ రోడ్డుపై పోసిన బుడిద రూపంలో వస్తున్న దూళీ పొలాల్లో పనిచేస్తున్న రైతులుకు సైతం తీవ్ర అగచాట్లుకు గురి అయ్యేలా చేస్తున్నాయని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యానవన శాఖాధికారులు వెంటనే స్పందించి తమ భాదలను తీరేలా చూడాలని రైతులు వేడుకోంటున్నారు. -
సీఎం అతిథిగృహం సమీపంలో మంటలు
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి-ఉండవల్లి కరకట్టపై సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. లంకభూముల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథి గృహం లింగమనేని ఎస్టేట్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక వాహనం లంక భూముల్లోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో అధికారులు మంటలను ఆర్పడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అతిథి గృహం వైపు వెళ్లే రోడ్డు మార్గం కూడా నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా మూసేశారు. దీంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. -
పట్టిసీమలో అడ్డగోలుగా అవినీతి...
-
డెంగీతో ముగ్గురి మృతి
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామాన్ని డెంగీ పట్టిపీడిస్తోంది. డెంగీ బారిన పడి ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు డెంగీ జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందగా.. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ(52) చికిత్స పొందుతూ మృతి చెందింది. నలుగురు మహిళలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు అయింది. ప్రకాశం బ్యారేజీ మీదుగా ఆయన ఆదివారం ఉండవల్లి చేరుకోనున్నారు. ఉండవల్లి ప్రాథమిక పాఠశాలలో రైతులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు. అనంతరం పెనుమాక మీదగా బేతపూడి వెళ్లనున్నారు. భూ సేకరణ అమలును పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని ఆయన రెండు రోజుల క్రితం ట్విట్టర్లో పేర్కొన్నారు. -
భూసేకరణపై ఉండవల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ రామాలయం వద్ద రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలతోపాటు అఖిలపక్షాల నేతలు హాజరయ్యారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సేకరణపై సదరు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తున్నారు. -
రోడ్డు పడితేనే రాజధాని నిర్మాణం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ప్రధాన రోడ్లను నిర్మిస్తేనే సీడ్ కేపిటల్లో నగర నిర్మాణ పనులు వేగవంతమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సీఆర్డీఏ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగానే మాస్టర్ డెవలపర్ ఎంపిక పూర్తవుతుంది. పనులు మొదలయ్యాక భారీ యంత్రాలు, వాహనాల రాకపోకలు పెరుగుతాయి. చెన్నై, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి భారీ నిర్మాణ సామాగ్రి వస్తుంది. మంగళగిరి వై జంక్షన్ దగ్గర భారీ మెటీరియల్ స్టాక్ పాయింట్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి సీడ్ కేపిటల్ వరకూ చిన్నచిన్న వాహనాల్లో వీటిని తరలించాలని యోచిస్తోంది. ఇందుకోసం నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ అధికారులు మూడ్రోజుల క్రితం కన్సెల్టెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదో నంబరు జాతీయ రహదారిలో కృష్ణానదిపై నిర్మించిన కనకదుర్గమ్మ వారధి నుంచి ఉండవల్లి మీదగా సీడ్కేపిటల్ ప్రాంతం వరకూ 15 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన నాలుగు వరుసల యాక్సెస్రోడ్డు పనులను చేపట్టదల్చుకున్న కన్సెల్టెన్సీ సంస్థలు ఈ నెల 8 లోగా తమ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను అందజేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మణిపాల్ ఆస్పత్రి ముందున్న కరకట్ట రోడ్డు మీదుగా ఫై్లవోవర్, సీతానగరం రైల్వే లైనుపై రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఇక్కడున్న కొండ చుట్టూ మళ్లీ ఫై్లవోవర్ను కొనసాగించి ప్రకాశం బ్యారేజీ రోడ్డుకు కలుపుతారు. మళ్లీ ఇక్కడి నుంచి నాలుగు వరుసల రోడ్డు మొదలై ఉండవల్లి, పెనుమాక పక్కగా తాళ్లాయిపాలెం వరకూ వెళ్తుంది. కృష్ణా జిల్లా గొల్లపూడి తొమ్మిదో నంబరు జాతీయ రహదారి నుంచి కృష్ణానది మీదగా రాజధాని ముఖద్వారం నుంచి గేట్వే పక్కగా వెళ్లే నాలుగు వరసల ఎక్స్ప్రెస్ వే మార్గంలో ఈ 15 కి.మీ యాక్సెస్ రోడ్డు కలుస్తుంది. ఐదో నంబరు రహదారి నుంచి మరో ఎక్స్ప్రెస్ వే? ఐదో నెంబరు జాతీయ రహదారి నుంచి కూడా మరో ఎక్స్ప్రెస్ వేను సీడ్కేపిటల్ వరకూ నిర్మించే వీలుంది. సీడ్ కేపిటల్ మాస్టర్ప్లాన్లో పొందు పర్చిన ప్రకారం తాడేపల్లికు శివారునున్న కొలనుకొండ- కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలకు ఉత్తరంగా హైవే నుంచి మొదలయ్యే నాలుగు వరుసల ఎక్స్ప్రెస్ వే తాడేపల్లి మండల కార్యాలయం పక్కగా ఉండవల్లికి ఉత్తరంగా కొండల వరకూ వెళ్తుంది. ఇక్కడున్న కొండకు సొరంగం వేసి పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం మీదగా తాళ్లాయిపాలెం వరకూ ఈ రోడ్డు నిర్మాణం ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను మాత్రం సీఆర్డీఏ నోటిఫికేషన్లో పొందుపర్చలేదు. సీడ్ కేపిటల్కు అనుసంధాన(ఆర్టేరియల్) రహదారులన్నింటినీ ఒకే సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలను పరిశీలిస్తే రాజధాని ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లా వైపే అభివృద్ధి చెందే వీలున్నందున రోడ్డు మార్గాలన్నీ ఎక్కువగా ఇటువైపే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే ప్రధాన రోడ్లన్నింటినీ ఇవి కలుపుకుని సీడ్ కేపిటల్ వరకూ తీసుకెళ్తాయని వీరంటున్నారు. -
సీఎం నివాసానికి 'వంద'నం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం.. తాత్కాలిక నివాసం.. క్యాంపు కార్యాలయం.. ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సీఎం నివాసం నిర్మాణంలో ఉంది. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం ఉంది. ఉండవల్లిలో కృష్ణానది కరకట్టన ఓ ప్రైవేటు భవనం సీఎం నివాసానికి ఎంపిక చేశారు. వీటన్నిటికీ చంద్రబాబు పదవిలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఈ ఖర్చు చేసినట్లు సమాచారం. ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్ సీఎం అధికారిక నివాసానికి ఎంపిక చేసినట్లుగా వార్తలకెక్కింది. ఇక్కడ ప్రత్యేక విద్యుత్తు సబ్స్టేషన్, సెల్ ఫోన్ టవర్లు, రహదార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 30 సెంట్ల స్థలంలో రూ. 5 కోట్ల వ్యయంతో విద్యుత్తు సబ్స్టేషన్ పనులు చకాచకా ప్రారంభించారు. సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు టవర్లు ఏర్పాటు కానున్నాయి. ఒకటి బీఎస్ఎన్ఎల్ది కాగా, మరో టవర్ ఎయిర్టెల్, వోడా, ఐడియాలకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఒక టవర్ ఏర్పాటుకు రూ. 70-80 లక్షల మధ్య ఖర్చవుతుంది. ఈ రెండు టవర్లకు కలిపి రూ. 1.6 కోట్ల వరకు ఖర్చు కానుంది. భవిష్యత్తులో వీటి నిర్వాహణకు సైతం ప్రభుత్వం కొంత భరించాల్సి ఉంటుందని సెల్ ఫోన్ కంపెనీ వర్గాల సమాచారం. ఇక్కడి రహదారుల నిర్మాణానికి రూ. 48 కోట్లకు పైగానే ఖర్చవుతుందని అంచనా. కృష్ణానదిపై భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక బోట్లు, అదనపు సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. వీటికి కూడా మరో రూ. 5 కోట్లకు పైగానే కేటాయించాల్సి రావచ్చంటూ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అతిథి గృహం మరమ్మతులకు, అక్కడ వినియోగించే సామగ్రికి రూ. 5-7 కోట్ల మధ్య ఖర్చవుతున్నట్లు సమాచారం. -
'ఓటుకు కోట్లు కేసుతో ఏపీకి సంబంధమేంటి?'
-
పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు అవసరమా అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్షంగా తప్పుబట్టారు. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని నిర్మించుకోవచ్చని ఆయన అన్నారు. గురువారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధానిని ఎన్ని ఎకరాల్లో కావాలంటే అన్ని ఎకరాల్లో కట్టుకోవచ్చని అన్నారు. రాజధాని అంటే నాలుగు బిల్డింగ్లు కాదని, ప్రజల భవిష్యత్ కోసమే రాజధాని నిర్మాణమని చంద్రబాబు పేర్కొన్నారు. బలవంతంగా భూములు లాక్కోవటం లేదని, రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇస్తూ రాజధాని నిర్మాణంపై పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని అన్నారు. రాజకీయ పార్టీలకు దూరదృష్టి అవసరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలకు పది ఎకరాలు కావాలి కానీ, అదే రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు అవసరం లేదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. -
పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబట్టిన చంద్రబాబు