Election Commission of India
-
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
వివాదాల నడుమ ‘రాజీవ్’కు వీడ్కోలు
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్కుమార్ తన హయంలో కొంత మేర వివాదాస్పదమయ్యారు. లోక్సభ ఎన్నికలతో సహా పలు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్కుమార్ పక్షపాత ధోరణితో వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. ముఖ్యంగా కీలక ఎన్నికల సమయాల్లో అధికార బీజేపీకి మేలు జరిగేలా వ్యవహిరించారని ప్రతిపక్షాలు పలు సందర్భాల్లో ఆయనపై ఆరోపణలు చేశాయి.దీంతో రాజీవ్కుమార్ హయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) స్వయం ప్రతిపత్తిపై అనుమానాలు తలెత్తాయి.ఔఎన్నికలప్పుడు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికల హింసను అదుపు చేయడంలో విఫలమయ్యారన్న అపఖ్యాతిని రాజీవ్కుమార్ మూటకట్టుకున్నారనేది పలువురి వాదన. ముఖ్యంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై చర్చ జరుగుతున్న వేళ రాజీవ్కుమార్ ఈవీఎంలు,వీవీప్యాట్లను మీడియా ఎదుటే ఏకపక్షంగా సమర్థించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది.రాజీవ్కుమార్ హయాంలో పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడ్డ టైమింగ్ వివాదాస్పదమైంది. సీఈసీగా వీడ్కోలు వేళ రాజీవ్కుమార్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల కమిషన్ చుట్టూ అలుముకున్న వివాదాలపై మీడియా దృష్టి ఎక్కువైందని, ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాజీవ్కుమార్ అనడం చర్చకు దారి తీసింది.మొత్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్కుమార్ హాయంలో ఎన్నికల కమిషన్తో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సాధారణ ప్రక్రియలో భాగంగా రాజీవ్కుమార్ రిటైర్ అయి వెళ్లిపోయినప్పటికీ దేశంలో ఎన్నికల కమిషన్,ఎన్నికల నిర్వహణపై తలెత్తిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్ఎల్యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్వేర్నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
‘స్థానిక’ తేదీలపై నేడు స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వారం తేడాతోనే రెండు ఎన్నికలు!ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
ఈవీఎంల డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. -
TG: రేషన్కార్డుల పోర్టల్కు బ్రేక్.. కారణమిదే
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈసీ బ్రేక్ వేసింది.రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆన్లైన్లో ఇటీవలే పౌరసరఫరాల శాఖ ఒక ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసింది.రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో పోర్టల్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీ శనివారం(ఫిబ్రవరి 8) ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈసీ ఆదేశాలతో రేషన్ కార్డుల ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం వెంటనే నిలిపివేసింది.కాగా, తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.కొత్తగా రేషన్కార్డుకు అర్హత పొందిన వారి జాబితాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.కాగా, తెలంగాణలో ప్రస్తుతం టీచర్లతో పాటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వం ఎలాంటి కొత్త స్కీమ్లను అమలు చేయరాదన్న నిబంధనలున్నాయి. దీనిలో భాగంగానే రేషన్కార్డుల పోర్టల్ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. -
నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు. -
వారంలో ‘స్థానిక’ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్(Election schedule) ఈ నెల 15వ తేదీ లోగా వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల(BC ReservationBC ReservationBC Reservation)BC ReservationsBC ReservationsBC ReservationBC Reservationsకు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ నివేదికపై చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరా రుతో పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయనుంది.వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్(election notification) జారీ చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదే నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షలకు ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అవసరం కాబట్టి, ఇవి మొదలు కావడానికి అయిదారు రోజుల ముందే... అంటే మార్చి 17, 18 లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు కాదు..రెండు విడతల్లోనే ‘పంచాయతీ’ ఈ నెల 15వ తేదీ లోగా నోటిఫికేషన్ జారీచేస్తే..ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివర్లోగా ఈ ఎన్నికలు పూర్తయితే..తర్వాత మార్చి 17, 18 లోగానే రెండు విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించగా, ఈసారి కూడా అలాగే జరిపేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలేవీ పెద్దగా లేవు కాబట్టి రెండు విడతల్లోనే పంచాయతీ పోరు ముగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు నోడల్ ఏజెన్సీ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా కూడా ఎన్నికల దిశగా అన్నిరకాల కసరత్తును వేగవంతం చేశారు. 11న కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ భేటీ ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండేలా ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలు, సన్నద్ధమౌతున్న తీరుపై ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10 తేదీన...ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ శుక్రవారం రాణీ కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు.అలాగే గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే నాగర్కర్నూల్ జిల్లాలోని నరసింహాపురం ఎంపీటీసీ, కొల్లాపూర్ జడ్పీటీసీ, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి ఎంపీటీసీ, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ స్థానాలు మినహా ప్రచురించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ దాకా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటు వంటివి చేసే అవకాశం ఉన్నందున చట్టంలోని అంశాలకు లోబడి ఆ ప్రక్రియను చేపట్టాలని ఆమె సూచించారు.ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీకల్లా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకం, 12వ తేదీలోగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లా, మండల స్థాయిల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది (రిటర్నింట్ ఆఫీసర్లతో సహా)కి శిక్షణా తరగతులు చేపట్టాలని ఎస్ఈసీ సూచించింది. 15వ తేదీలోగా పోలింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు(ఏపీవో) శిక్షణ తరగతులు పూర్తి చేయాలని తెలిపింది. 15న పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు / జిల్లా ఎన్నికల అధికారులకు (హైదరాబాద్ మినహా) ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలకు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) నుంచి ఆమోదం లభించాకే వాటిని ప్రచురించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ల కోసం ప్రతిపాదిస్తున్న భవనాలను స్వయంగా పరిశీలించి, స్టేషన్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయనే నిర్థారణకు రావాలన్నారు. 23 శాతంలోపే బీసీ రిజర్వేషన్లు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నప్పటికీ.. ఆ మేరకు సాధ్యమయ్యే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ట్రిపుల్ టెస్ట్ ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని (1), మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని (2), డెడికేటెడ్ కమిషన్ను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని (3) న్యాయ నిపుణులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా ఉన్నారు. జనాభాకు అనుగుణంగా వీరికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నందున ఈ రెండు వర్గాలకు 27.88 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, 50 శాతంలో ఇంకా మిగిలింది 22.12 శాతమేనని చెబుతున్నారు. ఇక డెడికేటెడ్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఎన్నికల ప్రక్రియపై రాహుల్ సంచలన ఆరోపణలు..వెంటనే స్పందించిన ‘ఈసీ’
న్యూఢిల్లీ:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెంటనే స్పందించింది. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రశ్నలను,సూచనలను తాము గౌరవిస్తున్నామని త్వరలో ఈ విషయంపై స్పందిస్తామని పేర్కొంది. మహారాష్ట్ర ఓటర్ల జాబితా వివరాలన్నీ రాతపూర్వకంగా వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు ఈసీ శుక్రవారం(ఫిబ్రవరి7) ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా, ఈసీ ప్రకటనకు ముందు రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జనాభా కంటే ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో పలు చోట్ల ఓట్లు నమోదయ్యాయన్నారు. గతేడాది మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికలకు, నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా 35 లక్షల మంది ఓటర్లుగా చేరడమేంటని రాహుల్ ప్రశ్నించారు.ప్రతిపక్షాలకు చెందిన పార్టీలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన ఎందరో ప్రజల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని,కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్లు ఉన్నా అక్కడి ఓటర్లను మరో పోలింగ్ బూత్కు మార్చారని ఆరోపించారు.మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు తమకు ఇవ్వాలని ఈసీని కోరామని, దీనిద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనేదానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇంతేగాక ఎంతమంది ఓటర్లను తొలగించారో,ఒక బూత్నుంచి మరొక బూత్కు ఓటర్లను ఎందుకు బదిలీ చేశారో తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలున్నందునే ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ ముందుకు రాలేని రాహుల్ అన్నారు. -
Delhi election 2025 :ప్రశాంతంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిశాయి. బుధవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రపతి ద్రౌప దీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హ ర్దీప్సింగ్ పురి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంక గాం«దీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ తన తల్లిదండ్రులను చక్రాల కురీ్చల్లోపోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. మెరుగైన పరిపాలన కావాలంటే ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 60.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా నార్త్ఈస్టు జిల్లాలో 63.83 శాతం నమోదైనట్లు తెలియజేసింది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 66.68 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై తుది గణాంకాలు గురువారం బహిర్గతం కానున్నాయి. ఢిల్లీలో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62.59 శాతం, 2024 నాటి లోక్సభ ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 8న వెల్లడి కానున్నాయి. -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు YSRCP ఫిర్యాదు
-
కూటమి అరాచకాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి దౌర్జన్యాలపై ఈసీకి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. నిన్ననే మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుందన్నారు. ఈ అరాచకాలపై పోరాటం చేస్తామని తెలిపారు.మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘యమున’పై ఈసీకి కేజ్రీవాల్ వివరణ
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కార్యాలయానికి వచ్చారు. యుమునా నదీ జలాల్లో విషం కలిసిందంటూ చేసిన వ్యాఖ్యలపై అధికారులు జారీ చేసిన నోటీసుకు ఆయన సమాధానం ఇచ్చారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరఫరా చేసే యమునా జలాల్లో అమోనియాను కలిపి విషపూరితం చేసిందని ఈ నెల 27న కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు ఆ విషయం తెలిసి, వెంటనే ఢిల్లీకి ఆ నీరు రాకుండా ఆపేశారు. ఆ నీరే తాగు నీటిలో కలిసినట్లయితే ఎంతో పెద్ద విపత్తు జరిగి ఉండేది’అని అన్నారు. దీనిపై ఈసీ కేజ్రీవాల్కు రెండుసార్లు నోటీసులు పంపించింది. దీనిపై శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ అధికారుల ఎదుట తన వాదనను వివరించారు. జనవరి 15న 3.2 పీపీఎం ఉన్న అమోనియా స్థాయిలు జనవరి 27వ తేదీ నాటికి 7 పీపీఎంకు పెరిగినట్లు తెలిపే నివేదికను అందజేశారు. ఆయన వెంట సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఈసీని కలిసేందుకు ఆయన ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తున్నందున కేజ్రీవాల్తో సమావేశమై ఆయన వాదనను సావధానంగా విన్నట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వాసులకు విష జలాలను సరఫరా చేసేందుకు బీజేపీ పన్నిన కుట్రను కేజ్రీవాల్ ఈసీ అధికారులకు వివరించారని అనంతరం ఆప్ తెలిపింది. అమోనియా కలుషితాలున్న విషయం తెలిపేందుకు మూడు బాటిళ్లలో యమునా నీటిని కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించింది. దీనిపై తాము దర్యాప్తు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపిందని పేర్కొంది. -
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖర్చు రూ.1,737 కోట్లు
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వ్యయం రూ. 1,737.68 కోట్లు. ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ ఈ మేరకు నివేదిక సమర్పించింది. ఇందులో సాధారణ పార్టీ ప్రచారం కోసం పెట్టిన ఖర్చు రూ. 884.45 కాగా, అభ్యర్థులకు సంబంధించిన వ్యయం రూ.853.23 కోట్లు. సుమారుగా రూ.611.50 కోట్లను కేవలం మీడియాలో ప్రకటనల కోసమే వెచ్చించింది. ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్లు, కేబుల్, వెబ్సైట్లు, టీవీ చానెళ్లలో ప్రచారం వంటివి ఉన్నాయి. మరో రూ.55.75 కోట్లను పోస్టర్లు, బ్యానర్లు, జెండాలు ప్రచార సామాగ్రికి ప్రత్యేకించింది. బహి రంగ సభలు, ర్యాలీల ఏర్పాట్ల కోసం మరో రూ.19.84 కోట్లు ఖర్చు చేసింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చుల కోసం రూ. 168. 92 కోట్లను, ఇతర పార్టీ నేతల ప్రయా ణాలకు రూ.2.53 కోట్లు ఖర్చయింది. సార్వ త్రిక ఎన్ని కలతోపాటే మూడు రాష్ట్రాలు.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు వరుసగా రూ.5,552.57 కోట్లు, రూ.5,552.41 కోట్లు, రూ.5,555.65 కోట్లు వెచ్చించినట్లు బీజేపీ తన నివేదికలో వెల్లడించింది. -
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్పై ఆరోపణలు గుప్పించారు. -
యమున నీటిని తాగే దమ్ముందా?..ఈసీకి కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ సవాల్ విసిరారు. ఇప్పుడే నేను మీకు ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని పంపిస్తా. ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్మీట్లో ఆ నీటిని తాగండి. అలా చేస్తే .మేం తప్పు చేశామని ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.హర్యానా ప్రభుత్వం యమునా నధిలోకి వ్యర్థాలను వదులుతోందని క్రేజీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే ఈసీ నిర్ణయంపై కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని ఉంచారు.आम आदमी पार्टी की सरकार बनने पर दिल्ली में काम करने वाले सर्वेंट्स वर्ग के लिए नई योजनाएँ लाएँगे— जैसे रजिस्ट्रेशन पोर्टल, सरकारी कार्ड, सर्वेंट हॉस्टल, EWS मकानों में प्राथमिकता, मोबाइल क्लीनिक और तय काम के घंटे इत्यादि। सर्वेंट्स वर्ग ना सिर्फ़ हमारे घरों की देखभाल करते हैं,… https://t.co/9Fxoi5w4PC— Arvind Kejriwal (@ArvindKejriwal) January 30, 2025 ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బుల్ని వెదజల్లుతున్నాయి. కానీ వాటిని ఈసీఐ గుర్తించడం లేదు. రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ త్వరలో రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు చేయానుకుంటున్నారేమో? ఈ సందర్భంగా చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఈసీఐకి గుర్తు చేస్తున్నాను.ఎన్నికల కమిషన్ను నేను నమ్మును. ఈసీఐ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. త్వరలో అరెస్టు అవ్వొచ్చు. అయినా నేను భయపడను. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఎన్నికలు జరగలేదు.‘అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉన్న మూడు యమునా నది వాటర్ బాటిళ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి, కమిషనర్కు పంపుతా. ఆ నీటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశంలో తాగాలి. అలా తాగితే మేము మా తప్పును ఒప్పుకుంటాము’అని కేజ్రీవాల్ అన్నారు.అమోనియం స్థాయి పెరిగికేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు.ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హర్యానాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు.కేజ్రీవాల్కు కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
నేడు ఈసీ 75 ఏళ్ల వేడుకలు
-
ఈసీకి 75 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్సభ ఎన్నికలు. అందుకు ఏ మాత్రమూ తగ్గని పలు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు. లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది. వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతువు సజావుగా జరిగేలా చూసే గురుతర బాధ్యతను మోస్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ శనివారం 76 ఏట అడుగు పెడుతోంది. ఈ క్రమంలో బాలారిష్టాలను దాటి ‘ఇంతింతై’ అన్నట్టుగా ఎదిగి, నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆసాంతమూ డేగకళ్లతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో ఎన్నో మెరుపులు మెరిపించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎంతటి అద్భుతాలు సాధ్యమో ప్రధాన ఎన్నికల కమిషనర్గా టి.ఎన్.శేషన్ ఆచరణలో చూపించారు. అభ్యర్థుల ఆస్తుల వెల్లడి మొదలుకుని ప్రచార వ్యయ నియంత్రణ దాకా నిబంధనలన్నింటినీ కట్టుదిట్టంగా అమలు చేసి ఔరా అనిపించుకున్నారు. ఈసీ అధికారాలు ఎంతటివో పార్టీలు, నేతలతో పాటు సామాన్య ప్రజలకు కూడా తెలిసొచ్చేలా చేశారు. అలాంటి చరిత్ర ఉన్న ఈసీ పనితీరుపై కొన్నేళ్లుగా ఎన్నెన్నో ప్రశ్నలు! పారదర్శకత లోపిస్తున్న తీరుపై ప్రజలు మొదలుకుని ప్రతిపక్షాల దాకా అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి! మొత్తంగా ఈసీ వ్యవహార శైలిపైనే ఆరోపణల మరకలు. ఈ పరిణామాలు ప్రజలను, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపైనే నానాటికీ సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయానా ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి! వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉంటున్న వైనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వందల స్థానాల్లో ఇదే పరిస్థితంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ప్రజాస్వామిక ప్రక్రియనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండటం అనుమానాలను మరింతగా పెంచుతోంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతోంది. వాటిని సవాలు చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి!ఓటర్ల జాబితాతోనూ చెలగాటంఎన్నికల ప్రక్రియకు అతి కీలకమైన ఓటర్ల జాబితాతో ప్రభుత్వాలు, పాలక పెద్దలు చెలగాటమాడుతున్న తీరు కూడా ఈసీ పనితీరుపై మచ్చగా మారుతోంది. తమకు అనువైన చోట్ల ఇష్టారాజ్యంగా ఓటర్లను చేరుస్తున్నారని, లేనిచోట్ల భారీగా పేర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆరోపణలు పదేపదే వినిపించాయి. ఇక తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనైతే ఈ రచ్చ కనీవినీ ఎరగని స్థాయికి పెరిగింది. రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేడ్కర్ ఈ విపరిణామాన్ని ముందే ఊహించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఎన్నికల జాబితాను ఒకటిగా ఆయన అభివర్ణించారు. ‘‘జాతి, సంస్కృతి, భాష తదితరాలపరంగా తమవారు కారని భావించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశముంది. ఇలాంటి పెడపోకడలకు చెక్ పెట్టేందుకే ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటును ప్రతిపాదిస్తూ 1949 జూన్లో రాజ్యాంగ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో అంబేడ్కర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితులు చూస్తే నాటి భయాలే నిజమవుతున్నాయని ఆయన ఆవేదన చెందేవారేమో...అలా మొదలైందిఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన రెండేళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతి పెద్ద సవాలును ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది. వనరులు, వసతులు అంతంతమాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షరజ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, ఓటేసేలా చూడటమే అతి పెద్ద సవాలుగా మారిన పరిస్థితి! అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించుకుంది. రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది. అందుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చింది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులరయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలను వాడుకున్నాయి. తర్వాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను మూడుకు పెరిగింది.ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక శనివారం హస్తినలో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు. ‘ఇండియా వోట్స్–2024’ పేరిట ఇటీవలి లోక్సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను, ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాసక్తి కథనాల కూర్పు ‘బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్’ను విడుదల చేస్తారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియపై ‘ఇండియా డిసైడ్స్’ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. -
మాయాబజార్లో మన స్వతంత్రం
స్వాతంత్య్రానికి పూర్వం మొత్తం భారత దేశంలో కేవలం రెండు, రెండున్నర శాతం ప్రజలకు మాత్రమే ఓటు హక్కు ఉందంటే బానిస పాలన లక్షణం తేలిపోతుంది.కొందరు జమీందారులు, సంస్థానాధీశులు, భూస్వాములు, విపరీత సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఇది అర్థం చేసుకుంటే మన స్వాతంత్య్రం గొప్పతనం అర్థమవుతుంది. వయోజనుడైన ప్రతి వ్యక్తికీ ఓటు హక్కు ఇచ్చారు. ఇది సామాన్యమైన హక్కు కాదు. ప్రాణాలకు ప్రాణమైన హక్కు. మనకు స్వరాజ్యం ఉంది కానీ సురాజ్యం లేదనే విమర్శలు ఉన్నాయి. అందరికీ సమానంగా ఓటు హక్కు మాత్రం ఉంది. బలహీనులకు ఓటు ఇవ్వకూడదు అన్నా, మహిళలకు ఇవ్వలే మన్నా, చదువుకున్నవారికే ఇస్తామన్నా సమానత ఉండదు. నిశ్శబ్ద విప్లవం1950 నాటికి ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకున్న అనేకా నేక దేశాల్లో సమాన ఓటు హక్కు లేదు. మన దేశంలో ఓటింగ్ హక్కు పైన ఒకటే పరిమితి ఉండేది. అదే 21 సంవత్సరాల వయసు. ఆ తరువాత 18 ఏళ్లుంటే చాలు కచ్చితంగా ఓటు హక్కు ఇవ్వాల్సిందే! ఓటు అమ్ముకుంటున్నారో కొంటున్నారో, ఓటు వేస్తున్నారో లేదో అవసరం లేదు. కానీ హక్కు మాత్రం ఉంది. మనం వాడుకుంటున్నందువల్లనే ఇవ్వాళ రక్తపాతం లేకుండానే అధికారం మారిపోతూ ఉన్నది. ఇది నిశ్శబ్ద విప్లవం. ఓ అర్ధరాత్రి ఫలితాలు తెలిసినపుడు అధికారం మార్పిడి జరుగుతున్నది. ఎంత గొప్ప విషయం! మనదేశంలో ఎందరికి ఓటు హక్కు ఉందో తెలుసా? 99.1 కోట్ల మందికి ఓటు అనే అధికారం ఉంది. వీరిలో 18 నుంచి 29 వయ సున్న 21.7 కోట్ల యువశక్తి కాస్త మెదడు వాడుకుంటే చాలు ప్రభు త్వం మారిపోతుంది. అదీ ఈ ఓటు మాయ. ‘ఓటింగ్ వంటిది మరోటి లేదు. కచ్చితంగా నేను ఓటేస్తాను’ అనే నినాదంతో ఈ జనవరి 25న ఎన్నికల కమిషన్ 75వ వార్షిక ఉత్సవం జరుగుతున్నది. 2011 నుంచి ఇదే తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం ఏర్పడిన తరువాత 1952లో తొలి ఎన్నికలసంగ్రామం జరిగింది. అదొక గొప్ప పండుగ అని పెద్దలు అనేవారు. కొన్ని దశాబ్దాల కింద మనిషి పోలింగ్ బూత్కు రాకపోతే ఆ వ్యక్తి చని పోయినాడనుకునేది. ఇంత కష్టపడి ఓటేయడం ఎందుకు అని ఎవ రైనా అంటే, ఓటు వేయడం నేను బతికి ఉన్నాను అనడానికి నిద ర్శనం అనేవారు. అధికారులు, ఉద్యోగులు, నాలుగోస్థాయి ఉద్యో గులు, ఉపాధ్యాయులు ఓటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా కష్టమైన పని. వాళ్లంతా కొన్ని నెలలపాటు కష్టపడితే, ఆడుతూ పాడుతూ ఓటు వేసుకోవచ్చు.పారదర్శకత ఎంత?ఇదివరకు ఒక్కరే కమిషనర్గా టి.ఎన్.శేషన్ ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారు. ఆ తరువాత ముగ్గురు కమిషనర్లు వచ్చారు. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ను నియ మిస్తారు. వారిలో సీనియర్ కమిషనర్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా నియమిస్తారు. ఈ అధికారం భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 నుండి సంక్రమించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్కు ప్రత్వేక అధికారాలు లేవు. ఆ ముగ్గురిలో మెజారిటీ అభిప్రాయం ద్వారా నిర్ణయం సాగుతుంది. ఈ మధ్య 2023లో సవరణ చట్టం చేశారు. ఎంపిక కమిటీలో ప్రధానితో పాటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపికైన మరొక మంత్రి ఉంటారు. అభిశంసన ప్రక్రియ ద్వారా సీఈసీని పదవి నుండి తొలగించవచ్చు. కానీ ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ముగ్గురిలో ఇద్దరి మెజారిటీ ఉంటే కొన్ని నిర్ణయాలు తీసు కోవచ్చు. కానీ ఒకరి నిరసన ఉంటే అది తీవ్రమైన అంశంగా పరిగ ణించాలి. ప్రధాని నాయకత్వంలో రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురూ నీతిగా ఉంటూ, ప్రభుత్వ ఒత్తిళ్లను ప్రతిఘటించడం అవసరం. ముగ్గురూ ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు. ఆ మధ్య అరుణ్ గోయల్తో మిగిలిన ఇద్దరికి అభిప్రాయ భేదం రావడం వల్ల రాజీనామా చేశారు. 2027 డిసెంబర్ దాకా కమిషనర్గా ఆయనకు గడువు ఉన్నప్పటికీ, 2024 మార్చ్ 9న రాజీనామా చేయడం వల్ల అనుమానాలు వచ్చాయి కూడా! ప్రవర్తనా నియమావళిలో ఏ మాత్రం గందరగోళం ఉన్నా అను మానాలు పెరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలలో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో తీవ్రమైన అనుమానాలు వచ్చాయి. ఇప్పటికీ అనేక వివాదాలు వస్తున్నాయి. అలాగే మతాన్ని ఎన్నికలలో విరివిగా దుర్వినియోగం చేస్తుంటే, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్లు కాదు. విప రీతమైన డబ్బు వెదజల్లడం, ఓటర్లను బెదిరించడం, కండబలం వాడటం, ఫేక్ న్యూస్ను వ్యాపింపజేయడం వల్ల ఎన్నికలు పారదర్శ కంగా సాగవు. ప్రభుత్వాలే అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం తగ్గిపోతుంది. చీకటి నిధులుఓటర్లకు అభ్యర్థులను గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టదు, రాజకీయ పార్టీలకూ పట్టదు. 43 శాతం ప్రజాప్రతినిధుల మీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే దేశ రాజ్యాంగ సంవి ధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుంది.నిజానికి ఈసారి ఎన్నికల బాండ్లు చాలా అనుమానాలకు దారి తీశాయి. కోట్లకు కోట్ల రూపాయలను బాండ్ల ద్వారా ‘సంపాదించారు’. వీటిని మనం విరాళాలు అంటున్నాం. ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టడానికి ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయం కోరుతూ లేఖ రాశారు.జనవరి 30న రాసిన జవాబులో ఈ పద్ధతి అక్రమాలకు దారి తీసే అవకాశం ఉందనీ, పారదర్శకంగా ఉండవలసిన ఎన్నికల విరా ళాలను గోప్యంగా మారుస్తుందనీ, దీనివల్ల బలవంతపు విరాళాలు వసూలు చేసే అవకాశం ఉందనీ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. అయినా పార్లమెంటులో ఎటువంటి చర్చా జరగకుండానే, ఎలక్టోరల్ బాండ్స్ దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించాయి. అందుకు తగినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిపోయి 2018 జనవరి 2న ఎలక్టోరల్ బాండ్ పథకం మొదలైంది.ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన ఎన్నికల సంఘం 2019 మార్చ్ 25న అఫిడవిట్ దాఖలు చేసింది. విరాళాలకు సంబంధించిన వివరాలను పంచుకోవడం నుండి రాజకీయ పార్టీలను మినహాయించడం విదేశీ నిధుల సమాచారాన్ని చీకటిలో ఉంచుతుందని చెప్పింది. ‘భారతదేశంలోని రాజకీయ పార్టీల విదేశీ నిధులను తనిఖీ చేయ లేము, ఇది భారతీయ విధానాలను విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడానికి కారణం అవుతుంది’ అని పేర్కొంది. అయితే, 2019 ఏప్రిల్ 12 నుండి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు సమర్పించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మొత్తం మీద గడచిన ఐదేళ్లలో దాదాపు 1,300 కార్పొరేట్ సంస్థలు దాదాపు 20 రాజకీయ పార్టీలకు రు 12,156 కోట్ల విరాళాలు అందజేశాయి. అందులో అత్యధిక భాగం రు. 6,060 కోట్లు బీజేపీకే దక్కాయి. చివరికి 2024 ఫిబ్రవరి 15న కేంద్రం కళాత్మకంగా నిర్మించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని కోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో పొందు పరిచిన ఓటర్ల సమాచార హక్కును ఈ పథకం ఉల్లంఘించిందనిబెంచ్ పేర్కొంది. ఎన్నికలు మాయాబజార్గా నిర్వహిస్తే రాజ్యాంగం ఉన్నట్టా, లేనట్టా? » 75 ఏళ్ల కిందట, గణతంత్రానికి ఒక్కరోజు ముందు,అంటే 1950 జనవరి 25న మన భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఎన్నికలు లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, భారత రాజ్యాంగం లేదు, ఇంతెందుకు మన స్వాత్రంత్యానికి కూడా అర్థం పర్థం ఉండదు.» ఇంగ్లీషు, హిందీ, తెలుగు వంటి అన్ని భాషల్లో అందరికీ బాగా తెలిసిన మాట... ఓటు!» ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమించినప్పటికీ ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ప్రభుత్వ ఒత్తిళ్లు ప్రతిఘటించడం అవసరం. ప్రభుత్వానికి పక్షపాతంగా ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరగవు.- వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్- మాడభూషి శ్రీధర్ -
ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి: ఈసీ
న్యూఢిల్లీ: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్హాన్స్డ్/ సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జతచేయాలంటూ నిబంధనను విధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ఫేక్(Deepfake) కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది.ఇదీ చదవండి: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ -
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
ఓటర్ ఐడీ మాత్రమే సరిపోదు: ఢిల్లీ ఎన్నికల సంఘం
ఎన్నికల టైంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ఓ ప్రకటన వార్తల్లోకెక్కింది.ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 2025 జనవరి 1వ తేదీనాటికి 18 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అయితే ఇదే సమీక్షలో సీఈవో కీలక ప్రకటన చేశారు. కేవలం ఓటర్ ఐడీ(Voter ID) ఉన్నంత మాత్రన ఓటు హక్కు వర్తించబోదని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెబుతోందంటే.. కేవలం ఒక్కచోటే ఓటర్గా నమోదు అయ్యి ఉండి.. ఓటర్ తుది జాబితాలో పేరు ఉండి.. ఓటర్ స్లిప్ అందినప్పుడే మాత్రమే ఓటు హక్కువేయడానికి ఉంటుంది. అలాగే ఓటర్ స్లిప్(Voter Slip)తో పాటు ఓటర్ ఐడీని కూడా పోలింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. కేవలం ఓటర్ ఐడీ అనే కాదు.. ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్టు.. ఇలా 11 రకాల ఐటీ కార్డు కార్డుల్లో ఏదైనా ఓటర్స్లిప్తో పాటు తీసుకెళ్లి ఓటేయొచ్చు.అలాంటి వాళ్ల ఓటు హక్కును మీరూ తొలగించొచ్చు..ఒక ఓటరు చిరునామా శాశ్వతంగా మార్చినా లేదంటే ఓటర్ చనిపోయినా వాళ్ల ఓటు హక్కుపై ఎవరైనా అభ్యంతరాలను లేవనెత్తొచ్చు. అయితే ఆ అభ్యంతరాలను లేవనెత్తేది.. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండాలి.ఇందుకోసం ఫారం-7ను అప్లై చేయాలి. ఆపై సదరు ఓటర్కు, అలాగే ఫిర్యాదు చేసినవాళ్లకు నోటీసులు వెళ్తాయి. అదే ఓటరు మరణించిన సందర్భమైతే..స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపుతారు. నోటీసులు అందుకున్న ఓటరు సకాలంలో స్పందించకపోతే.. ఆ ఓటును తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది.ఓటర్లను జల్లెడ పట్టి.. తొలుత అక్టోబర్ 1, 2024 తేదీదాకా 18 ఏళ్లు నిండినవాళ్లు ఓటర్గా నమోదు చేసుకోవచ్చని ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీదాకా బూత్ లెవల్(Booth Level) ఆఫీసర్లతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 18 ఏళ్లు పైబడి కూడా ఓటర్లుగా నమోదు చేసుకోనివాళ్లను గుర్తించారు. అడ్రస్లు మారినవాళ్లు, చనిపోయినవాళ్లు, డూప్లికేట్లు(Duplicate) కార్డులను ఏరిపారేశారు. అక్టోబర్29వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ను రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 28వ తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టి.. డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసింది. ఇప్పుడు జనవరి 1, 2025 తేదీతో 18 ఏళ్లు పూర్తైన వాళ్లు ఓటర్గా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఢిల్లీ ఎన్నికల సంఘం పేర్కొంది.అయితే.. అప్డేషన్, మార్పులు చేర్పులు లాంటి నిరంతర ప్రక్రియ యధావిధిగా కొనసాగనుందని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త ఓటర్లుగా రిజిస్టర్ కావాలనుకుంటే ఫారం 6ను నింపి సంబంధిత డాక్యుమెంట్లతో బూత్ లెవల్ ఆఫీసర్ను సంప్రదించాలని.. మార్పులు, తొలగింపుల కోసం ఫారం-8, ఫారం-7లను సబ్మిట్ చేయాలని సూచించారు.తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు కోసం..ఇదిలా ఉంటే.. వేర్వేరు చోట్ల ఓటర్గా నమోదు చేసుకుని ఉన్నా.. లేకుంటే ఎక్కువ ఓటర్ కార్డులు కలిగి ఉన్నా పీపుల్స్ రెప్రజెంట్ యాక్ట్ 1950 సెక్షన్లు 17, 18 కింద శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలే ఉంటాయని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతేకాదు.. ఓక్లా నియోజకవర్గంలో ఓటర్ నమోదు కోసం తప్పుడు డాక్యుమెంట్ల సమర్పించిన ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయని ఢిల్లీ ఎన్నికల సంఘం(Delhi Election Commission) తెలిపింది.ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.చదవండి👉🏻: ఆయన ఆలయాలను కూల్చమంటున్నాడు! -
నమోదైన ఓటర్లు 97.97 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి దేశంలో 97.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికలప్పుడున్న 91.19 కోట్ల మందితో పోలిస్తే ఇది 7.43% ఎక్కువని పేర్కొంది. 2019లో 61.4 కోట్ల ఓట్లు పోలవగా 2024లో 64.64 కోట్ల ఓట్లు పోలయ్యాయని ఇందులో 64.21 కోట్లు ఈవీఎంలలో నమోదైనట్లు వివరించింది. ఇందులో 32.93 కోట్ల పురుషులు, 31.27 కోట్ల మహిళలు, 13 వేల మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా, సార్వత్రిక ఎన్నికల్లో 42.81 లక్షల పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గంలో అత్యధికంగా 92.3% ఓట్లు పోల్ కాగా... అత్యల్పంగా శ్రీనగర్లో 38.7% పోలింగ్ నమోదైంది. అయితే 2019లో శ్రీనగర్లో ఇది 14.4% మాత్రమేనని ఈసీ గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా 2024లో నోటాకు 63.71 లక్షల ఓట్లు పడ్డాయని కూడా వివరించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో జరిగిన ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ విస్తృత గణాంకాలను సీఈసీ గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 2024లో 10.52 లక్షల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 2019 కంటే ఇది 14,816 ఎక్కువ. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరగ్గా ఈ ఏడాది కేవలం 40 పోలింగ్ స్టేషన్లలోనే రీపోలింగ్ అయ్యింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 1.62 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా...2019తో పోలిస్తే 2024లో బిహార్లో అత్యధికంగా 4,739 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. -
బీఆర్ఎస్కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ
ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. -
ECపై ‘సుప్రీం’లో కాంగ్రెస్ పిటిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోర్టుకెక్కింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఒక రూల్కు ఇటీవల ఈసీ సవరణ చేసింది. అయితే.. ఈ చర్యతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత క్షీణిస్తోందంటూ కాంగ్రెస్ సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ఓ రిట్ పిటిషన్ వేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ మధ్యే ఈ రూల్కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి పోలింగ్కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ను, వెబ్కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. కొత్త సవరణతో(Amendments) ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీవల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ఫుటేజ్ను వినియోగించుకుని కృత్రిమ మేధ(Artificial Intelligence) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపాయి. రూల్ 93కి సవరణ తర్వాతా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని స్పష్టత ఇచ్చింది.ఎన్నికల సంఘం(Election Commission) సిఫార్సు మేరకే.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ సవరణకు ఓ కోర్టు కేసు కారణమని ఈసీతోపాటు న్యాయశాఖ వేర్వేరుగా గత శుక్రవారం వివరణ ఇచ్చాయి. ఇక.. అయితే ఈ పరిణామంపై కాంగ్రెస్(Congress Party) మండిపడింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనను మార్చడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని ఇంతకు ముందే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు విరుద్ధంగా నిబంధనలకు సవరణ చేయడం విడ్డూరమని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ముంచెత్తిన మంచులో వాహనాలు -
బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణ!
చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్ చేశారు.తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.అలాగే, ఎన్నికల బూత్లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.Democracy is facing its gravest threat under the BJP-led Union Government with the reckless amendment of Section 93(2)(a) of the Conduct of Election Rules, to kill the transparency in election.Consequent on the direction of the Punjab and Haryana High Court to furnish the CCTV… https://t.co/vkAaY2ynr3— M.K.Stalin (@mkstalin) December 23, 2024 -
ఒక దేశం ఒక ఎన్నికపై... ఒక మాట!
‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశ మేమీ కాదు! అంతకన్నా ప్రాధాన్య అంశాలెన్నిటికో దిక్కూదివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందు ఆ సంస్కరణలు ముఖ్యం. జమిలితో... అభివృద్ధికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. సమయం, ఆర్థికమానవ వనరుల దుబారా తగ్గుతుందనేది ఓ ఆశ! కానీ,ప్రాంతీయ అస్తిత్వాలకు అదొక గొడ్డలిపెట్టు. సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగానే... దేశ మంతటా ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిపించే విషయంలో సమగ్ర చర్చ జరగాలి. శాసనసభల స్పీకర్లతో పాటు మేధావులు, సమాజంలోని విభిన్నవర్గాల ప్రతినిధుల్ని భాగం చేసి చర్చించాలి. మాజీ రాష్ట్రపతి రావ్ునాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సంప్రదింపుల్లో 32 పార్టీలు సానుకూలంగా మాట్లాడి, మద్దతు ప్రకటిస్తే 15 పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ఉండటంతో... 1952 నుంచి 1967 వరకు, వరుస నాలుగు ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రాల ఎన్నికల్ని కలిపి (జమిలి) నిర్వహించి నపుడు, మరిప్పుడెందుకు సాధ్యపడదు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్న పాలకపక్షాలు లేవనెత్తుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సభలు కావడంతో అది సాధ్యమైంది. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. అవిశ్వాసాల్లో కొన్ని సభలు అర్ధంతరంగా ముగిశాయి. కొన్ని ప్రభుత్వాలు కూలిపోయో, రాష్ట్రపతి పాలన విధింపుతోనో ఎన్నికల ద్వారా కొత్త సభలు ఏర్పడ్డాయి. ఇలా వేర్వేరు పరిణామాల వల్ల లోక్సభకు, వివిధ శాసనసభలకు ఎన్నికల గడువు కాలాలు మారుతూ వచ్చాయి. భారత ఎన్నికల సంఘానికున్న విచక్షణాధికార పరిధి, వెసులుబాటు వల్ల... అప్పటికి రద్దయిన, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రాల సభల ఎన్నికల కాలాలు స్వల్పంగా అటిటు అవుతూ వచ్చాయి. అందుకే, 1970ల తర్వాత జమిలి సాధ్య పడలేదు. ‘జమిలి కొత్తేం కాదు, ఇదివరకు జరిగిందే’ అని అమిత్ షా అంటున్నా, ఇవాళ్టి పరిస్థితి వేరు. అదంత సాధారణమే అయితే, ఇపుడు చట్టాలనూ, రాజ్యాంగాన్నీ మార్చడమెందుకు?ఎలా సమానం చేస్తారు?అన్ని ఎన్నికల్ని ఒక తేదీకి లాగే క్రమంలో... ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. మొదట, పొట్టికాలం నిడివి సభలు, పొడుగు కాలం నిడివి సభలు అనివార్యమవుతాయి. బలవంతపు రాష్ట్రపతి పాలనలూ ఉంటాయేమో? ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టు 2027లోనో, మరెపుడో జమిలి ఎన్నికల్ని నిర్వహించాక కూడా... ఏ కారణం చేతైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ రద్దయితే, తిరిగి ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త సభను ఆ మిగిలిపోయిన కాలానికే పరిమితం చేస్తారు. సభ రద్దయిన సమయాన్ని (నాలుగేళ్లకో, మూడేళ్లకో రద్దయింది అనుకుంటే) బట్టి కొత్త సభకు ఏడాదో, రెండేళ్లో మిగలవచ్చు. సాధారణ ఎన్నికల్లో జరిగినట్టే అన్ని నియోజకవర్గాల, అందరు ఓటర్ల నిర్ణయంతో జరిగే మధ్యంతర ఎన్నికలో గెలిచిన సభ్యుల కొత్తసభ అలా ఆరు మాసాలకో, ఏడాదికో పరిమితం కావాల్సి రావడం ఏ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక? అది డబ్బు, మానవ వనరుల దుబారా కాదా? అనే ప్రశ్న సహజం. దీనికి రాజకీయ పార్టీలు ఎలా అంగీ కరిస్తాయో చూడాలి. చాలా దేశాల్లో దేశవ్యాప్త ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికలు వేటికవిగానే జరుగుతాయి. జమిలి జరిపే ఏడెనిమిది దేశాల్లో అధ్యక్ష తరహా పాలనకిది సానుకూలమే! జమిలి ఎన్నికల నిర్వహణా ఒక సంక్లిష్టమే! మొన్నటి హరియాణా ఎన్నికలతో, గడువు సమీపించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్ని ఎందుకు కలపటం లేదని అడిగితే, ‘... శాంతి భద్రతలు, నిర్వహణ పరంగా ఇబ్బందులుంటా య’ని ఎన్నికల సంఘం పేర్కొంది. నాలుగైదు రాష్ట్రాల్లోనే ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని వారు మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభకు దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ని కలిపి, రేపెప్పుడో స్థానిక సంస్థల ఎన్నికల్నీ కలిపి ‘మహా జమిలి’ ఎలా నిర్వహిస్తారు? అనే ప్రశ్న సహజం. సంస్కరణల సవాళ్లెన్నో...భారీ ఓటర్ల భాగస్వామ్యంతో భారత ఎన్నికల నిర్వహణ ప్రపంచంలోనే ఒక అబ్బురం! బ్యాలెట్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం) లకు మారిన తర్వాత కూడా, అభివృద్ధి చెందిన దేశాలు విస్మయం చెందే స్థాయిలో మన ‘మహా ఎన్నికలు’ జరుగుతున్నాయి. విడతలుగా జరిగిన ఎన్నికల సంస్కరణలు ప్రక్రియను చాలా వరకు పారదర్శకం చేశాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటర్లు తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ... ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రక్రియలో లోపిస్తున్న జవాబుదారీతనం ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశ ఎన్ని కల ప్రక్రియలో ముదురుతున్న ‘క్యాష్ క్యాన్సర్’ను నియంత్రించే సంస్కరణ అత్యవసరంగా రావాలి’ అని సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయి ఇటీవల హైదరాబాద్లో చేసిన వ్యాఖ్య కీలకమైంది. ‘మునుగోడు’ అసెంబ్లీ ఉప ఎన్నికలో మనం కళ్లారా చూశాం. సరిగ్గా పోలింగ్కు ముందు లక్షల ఓట్లు గల్లంతయినా, నిన్న మహారాష్ట్రలో జరిగినట్టు ఒకటి, రెండు నెలల్లోనే లక్షలాది కొత్త ఓట్లు నమోదైనా... ఎన్నికల సంఘం నుంచి సరైన వివరణ, జవాబుదారీతనం లేక పోవడం దారుణం. ఈ సంస్కరణలు చేపట్టకుండా ‘జమిలి’కి పట్టుబట్టడం సరికాదనే అభిప్రాయం కొన్ని పార్టీల వారు, మేధావులు వ్యక్తంచేస్తున్నారు. విడిగా ప్రజాప్రతినిధులు గానీ, స్థూలంగా పార్టీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఆశించిన/నిర్దేశించిన స్థాయిలో పనిచేయకుంటే వారిని వెనక్కి రప్పించే (కాల్ బ్యాక్) పద్ధతి ఉండాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో... అయిదేళ్ల కొకమారు అన్ని ఎన్నికలూ జరిపేయాలి, మధ్యలో ఏ ఎన్నికలూ ఉండొద్దనే నిర్బంధ మేమిటనే వాదన ఒకటుంది. మధ్యలో వేర్వేరు ఎన్నికలుంటేనే నాయకులైనా, పార్టీలైనా, ప్రభుత్వాలైనా కొద్దో గొప్పో భయంతో ఉంటాయనేది సాధారణ అభిప్రాయం. అందుకు, ఎన్నో సాక్ష్యాలు, తార్కాణాలు మన కళ్లముందే ఉన్నాయి. కాన్షీరావ్ు అన్నట్టు ‘ఏటా ఎన్నికలుండాలి’ అనే వాదనను బలపరచకపోయినా... ఎన్నికల భయం ఉన్నపుడే ప్రభుత్వాలు ప్రజానుకూలంగా నడుచుకోవడం తరచూ జరిగేదే! అలా కాకుండా, ఒకసారి ‘జమిలి’ జరిగితే, ఇక అయిదేళ్లూ ఏ ఎన్నికలుండవంటే... ప్రభుత్వాల ఏకస్వామ్యమే సాగుతుందనే భయాలున్నాయి. పైగా, భిన్నత్వ ప్రతీక అయిన దేశంలోని ప్రాంతీయ అస్తిత్వాలు, భావనలు, వాదనలు... ‘జమిలి’లో ఆధిపత్యం వహించే జాతీయ ప్రవాహంలో కొట్టుకుపోతాయనే ఆందోళన కూడా ఉంది. అందుకే, పలు ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఒక పార్టీ ఒక నాయకుడు అంటారేమో!ఉభయ సభల్లో ఎన్డీయేకున్నది బొటాబొటీ మెజారిటీ! మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే తప్ప సాధ్యపడని రాజ్యాంగ సవ రణలకు ఎలా సాహసిస్తున్నారనేది ప్రశ్న! రాజ్యసభలో 164/243 అవసరమైనచోట 122 (42 తక్కువ) సంఖ్యాబలమే ఉంది. లోక్ సభలో 361/542 (ఒక ఖాళీ) అవసరం కాగా ఉన్నది 293 (63 కొరత) మాత్రమే! ఆ రోజు సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతులు చాలు కనుక... ప్రత్యర్థి పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్, గైర్హాజరీలను ప్రోత్సహిస్తారా? అని విపక్షంలో భయ సందేహాలున్నాయి. తరచూ ఎన్నికల వల్ల కోడ్ అమలు అభివృద్ధికి ఆటంకమనే భావనే తప్పని, ఓట్ల యావతో ఎన్నికలకు నెలల ముందే అభివృద్ధి పనులు చేయడం కాకుండా అయిదేళ్లపాటు జరిపితే కోడ్కు వెరవా ల్సిన భయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ‘జమిలి’పై ఎందుకీ పంతం?’ ఇదే పంథాలో సాగి, రేపు ‘ఒక పార్టీ, ఒకే నాయకుడ’నే నినాదంతో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షతరహా పాలనవైపు నడిపే ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయాలన్నది వ్యతిరేకవాదన వినిపించే వారి మాట!దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఎన్నికలు మరింత గోప్యం!
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గోప్యతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత గోప్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతోపాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు(సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్కాస్టింగ్ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది.ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్–1961లోని రూల్ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపర్చాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది. ⇒ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్లో నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ ఏజెంట్ల నియామకం, ఎలక్షన్ అకౌంట్ స్టేట్మెంట్లు, ఎన్నికల ఫలితాల వంటివి ఉన్నాయి. వీటిని బయటపెట్టడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజీ, వెబ్కాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్లు ఈ నిబంధనల పరిధిలో లేవు కాబట్టి కొత్త సవరణ ప్రకారం వాటిని ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదు. ⇒ సీసీటీవీ కవరేజీ, పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా నిబంధనల పరిధిలోకి రాదని, అది బయటపెట్టడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ⇒ పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగమవుతోందని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ⇒ కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి కొందరు సీసీటీవీ కెమెరా ఫుటేజీని సృష్టిస్తున్నారని, ఇలాంటి ఫేక్ వీడియోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల పత్రాలు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సామాన్య ప్రజలు మాత్రం కోర్టు అనుమతితోనే వీటిని పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ⇒ అభ్యర్థుల విషయంలో నిబంధనల్లో ఎలాంటి సవరణ చేయలేదని, ప్రజల విషయంలోనే సవరణ చోటుచేసుకుందని పేర్కొన్నారు. ⇒ మహమూద్ ప్రాచా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచి్చంది. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రూల్ 93(2) కింద అనుమతించిన అన్ని రకాల డాక్యుమెంట్లు (సీసీటీవీ కెమెరా ఫుటేజీ సహా) మహమూద్ ప్రాచాకు అందజేయాలని ఆదేశించింది. ⇒ ఎలక్షన్ పత్రాలు, డాక్యుమెంట్లు అంటే ఎలక్ట్రానిక్ పత్రాలు, వీడియో రికార్డింగ్లు కాదని ఈసీ అధికారులు చెప్పారు. ఈ విషయంలో సందిగ్ధానికి తెరదించడానికే నిబంధనల్లో సవరణ చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగం కాకుండా చేయాలన్నదే అసలు ఉద్దేశమని వివరించారు. ⇒ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు మినహా ఇతర పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెప్పారు. పారదర్శకత అంటే ఎందుకు భయం?: జైరామ్ రమేశ్ ఎన్నికల నిబంధనల్లో సవరణ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సమగ్రతను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంటే ఎందుకు భయమని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై పూర్తి సమాచారం ప్రజలకు అందజేస్తేనే వారిలో ఎన్నికలపై విశ్వాసం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సహా అన్ని రకాల పత్రాలు ప్రజలకు ఇవ్వాలని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవలే తేలి్చచెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిబంధనల్లో హడావుడిగా సవరణ చేయడం దారుణం’’ అని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. -
ఇది మాయ కాక మరేమిటి?
నిరూపించ లేనంత మాత్రాన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల వినియోగ ప్రక్రియలో తప్పులే లేవనో, తప్పిదాలకు ఆస్కారమే లేదనో ధ్రువీకరించినట్టు కాదు. అభియోగాలు మోపేవారు అందుకు హేతువును, తమ సందేహాలకు కారణాలను, తగు సాక్ష్యాధారాలను సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకు రావాలి. వాటిని స్వీకరించి బాధ్యులైన వ్యక్తులు, సంస్థలు లోతుగా పరిశీలన జర పాలి. అభియోగాలకు ఆధారాలున్నాయో లేదో, అవి తప్పో, కాదో తేల్చాలి. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత, జవాబు దారీతనం ముఖ్యం. అది జరగటం లేదు.అయిందానికి, కానిదానికి నిత్యం పరస్పరం విమర్శించుకునే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అనుసరించే ద్వంద్వ వైఖరి వారి ఆరోపణలకు పస లేకుండా చేస్తోంది. దాంతో వివాదం ప్రాధాన్యత లేకుండా పోతోంది. కానీ, కొన్ని రాజకీయేతర తటస్థ సంఘాలు, సంస్థలు కూడా అభ్యంతరాలు లేవనెత్తాయి. పోలింగ్ శాతాల సమాచారంలో వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ, బహిరంగ ప్రజాభిప్రాయానికి విరుద్ధ ఫలితాలనూ... ఈవీఎంల దుర్వినియోగానికి గల ఆస్కారాన్నీ అవి ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినా... తగిన స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్డీ), అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), సిటిజన్ కమిషన్ ఆన్ ఎలక్షన్ (సీసీఈ) వంటి పౌర సంఘాలు నిర్దిష్టంగా ఫిర్యాదులు చేసినా వాటిని పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. రాజకీయ పక్షాల నుంచే కాక ప్రజాసంఘాలు, సంస్థల నుంచి నిర్దిష్ట ఆరోపణలు చేసినపుడు కూడా ‘నిరాధారం’, ‘దురుద్దేశ పూర్వకం’ అంటూ, కనీస విచారణైనా జరుపకుండానే ఎన్నికల సంఘం కొట్టిపారేస్తోందన్నది వారిపై ప్రధాన అభియోగం!ఓటు వ్యత్యాసాల పైనే సందేహాలుసాయంత్రం వరకు పోలింగ్ సరళి ఒక విధంగా ఉండి, ముగింపు సమయాల్లో అనూహ్య, అసాధారణ ఓటింగ్ శాతాలు నమోదు కావడం, అలా ఎన్నికల అధికారి రాత్రి ఇచ్చిన గణాంకాలకు భిన్నంగా ఓట్ల లెక్కింపు ముందరి ‘లెక్క’తేలడం పట్ల సందేహాలున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో ఈ ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. ఇది సార్వ త్రిక ఎన్నికల్లోనే కాకుండా హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల సందర్భంగానూ వెల్లడయిందనేది విమర్శ. గణాంకాలు వారి వాదనకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా, ఆఖరు నిమి షపు ఓట్ల వ్యత్యాసం పది శాతానికి పైగా ఉన్న పది జిల్లాల్లోని 44 అసెంబ్లీ స్థానాల్లో 37 ఎన్డీయే పక్షాలు గెలిచాయి. కానీ వ్యత్యాసం 10 శాతం కన్నా తక్కువగా ఉన్న 12 జిల్లాల్లోని 46 సీట్లలో ఎన్డీయే కూటమి 11 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోనూ ప్రతిబింబించిందని విమర్శకులంటారు. ఆఖరు నిమిషపు పోలింగ్ శాతపు పెరుగుదల వరుసగా ఐదు విడతల్లో 0.21%, 0.34%, 0.23%, 0.01%, 0.25% నామ మాత్రంగానే ఉండ టంతో ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఇదేమీ లాభించ లేదనేది విశ్లేషణ! అందుకే, అక్కడ లోక్ సభ స్థానాల సంఖ్య 62 నుంచి ఈ సారి 36కి పడిపోయింది. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో ‘ఆఖరు నిమిషపు ఓటింగ్ శాతం’ పెరుగుదల 1.79% నమోదుకాగా బీజేపీ 43లో 17 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. కానీ, రెండో విడత పోలింగ్ సందర్భంగా ఓటింగ్ శాతం పెరుగుదల 0.86%కి పరిమితమైనందునేమో, 38లో 7 సీట్లు మాత్రమే గెలువగలిగింది. ఇదంతా ఈవీఎంల మాయా జాలమే అని విమర్శకులంటారు.కళ్లకు కట్టినట్టు గణాంకాలుమహారాష్ట్రలోని అకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్యాధికారిచ్చిన సమాచారం ప్రకారం, పోలింగ్ ప్రక్రియ అన్ని విధాలుగా ముగిసేటప్పటికి ఈవీఎం ద్వారా 2,12,690 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు రోజున ఈవీఎం నుంచి రాబట్టిన ఓట్ల సంఖ్య 2,36,234. అంటే, వ్యత్యాసం 23.544 ఓట్లు. గెలిచిన బీజేపీ అభ్యర్థికి దక్కిన ఆధిక్యత 18,851 ఓట్లు! ఇలా రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తే, పోలింగ్ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికల సంఘం వారి ‘యాప్’ ద్వారా వెల్లడైన గణాంకాల కన్నా ఓట్ల లెక్కింపు రోజున రమారమి పెరిగిన సంఖ్య ఉన్న నియోజకవర్గాలు తక్కువలో తక్కువ 95 ఉన్నాయనేది వారి వాదన. ఒకే విడత పోలింగ్ జరిగిన నవంబరు 20, సాయంత్రం 6.15 గంటలకు ఒకసారీ, రాత్రి 11.45 గంటలకు ఒకసారీ ఎన్నికల సంఘం అధికారికంగా ఓటింగ్ శాతాలను వెల్లడించింది. సాయంత్రం సమాచారం వెల్లడించే సమయానికి ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లలో గడువు లోపల ‘క్యూ’లో చేరిన వారందరూ ఓటు వేసే వరకు, ఎంత సమయమైనా ఓటింగ్ ప్రక్రియ కొనసాగు తుందని పేర్కొన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది గణాంకాలు రాత్రి ప్రకటించిన సమాచారంలో పేర్కొన్నారు. 288 నియోజకవర్గాల్లో సాయంత్రానికి 58.22% (5,64,88,024 ఓట్లు) పోలయినట్టు తెలిపిన అధికారులు రాత్రి అయ్యేటప్పటికి 65.02% (6,30,85,732 ఓట్లు) నమోదైనట్టు చెప్పారు. అంటే, వ్యత్యాసం 65,97,708 ఓట్లన్న మాట! నవంబరు 22న ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటలు ముందు, ‘యాప్’ వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్ర మంతటా నమోదైన ఓట్ల సంఖ్య 6,40,85,095. అప్పుడు పోలింగ్ శాతం 66.05%కి చేరింది. ఏమిటీ వ్యత్యాసాలన్న ప్రశ్న ఈవీఎంలపై శంకకు తావిస్తోంది. 288 నియోజక వర్గాల్లోని 1,00,186 పోలింగ్ బూత్లలో సగటున 76 ఓట్ల చొప్పున 76 లక్షల ఓటర్లు, ఎలా గడువు తర్వాత ‘క్యూ’ల్లో నిలుచొని ఓటు వేసి ఉంటారనే ప్రశ్న తలెత్తడం సహజం!సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఎన్నికల సంఘం సమా ధానం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. చైతన్యమే దారిదీపం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాల్శిరాస్ తాలూకా మార్కడ్వాడి అనే చిన్న గ్రామంలో జనం తిరగబడ్డారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, ఓట్ల లెక్కింపు తర్వాత ఆరోపిస్తూ గ్రామస్థులు బ్యాలెట్ ద్వారా ‘మళ్లీ పోలింగ్’ జరపాలని వారికి వారే నిర్ణయించారు. కానీ పోలీస్ ఆంక్షలు విధించి సదరు రీపోల్ను అధికారులు జరుగనీయ లేదు. 13 వేల ఓట్ల ఆధిక్యతతో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి ఉత్తమ్రావ్ జన్కర్ ఎమ్మెల్యేగా ఎన్నికయి కూడా... ఆ గ్రామంలో ఈవీఎం అవకతవకలతో నష్టం జరిగిందని ఆరో పించారు. కులాల వారిగా, విధేయత పరంగా చూసినా... గ్రామంలో తనకు ఆధిక్యత ఉండగా, తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామ్ సత్పతే (బీజేపీ)కి 160 ఓట్లు ఎక్కువ రావటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రీపోల్ నిర్వహణకు ప్రేరణ కల్పించారు. తమ ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించనందునే రీపోల్ ఆలోచనని గ్రామ ముఖ్యులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లుగా పోలింగ్ ముగిసే సమయంలో, కౌంటింగ్ ఏజెంట్లుగా ఓట్ల లెక్కింపు మొదలెట్టేప్పుడు ఆ యా కేంద్రాల్లో ఉంటారు. వారీ లెక్కలు సరి చూసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదనే వాదనొకటుంది. ఈవీఎంలలో మాయ ఉందంటే... దానికి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అనుమానాలు, గణాంకాల్లో సందేహాలు న్నాయంటే దానికి బాధ్యుల నుంచి సమాధానాలు రావాలి. ప్రజలకు కావాల్సింది... పారదర్శక పాలనా వ్యవస్థలూ, పాలకుల నుంచి జవాబుదారీతనం... దట్సాల్!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
సీఈసీ, ఈసీల నియామక కేసు... విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు. ఈ కేసును మంళళవారం సీజేఐ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. గతంలో జడ్జిగా ఉన్న జస్టిస్ ఖన్నా ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో తన పదవికి సంబంధించిన కేసును తానే విచారించాల్సిన పరిస్థితి తలెత్తింది.దీంతో ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ ధర్మాసనంలో సభ్యునిగా నేను లేని బెంచ్కు ఈ కేసును బదిలీచేస్తున్నాను’’ అని సీజేఐ వెల్లడించారు. మీరు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చెప్పినా సరే సీజేఐ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన చట్టంలో గత ఏడాది మార్పులు చేస్తూ కేంద్రం తెచి్చన చట్టంలోని సెక్షన్7 చట్టబద్ధతను సవాల్చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. -
కేంద్ర ఎన్నికల సంఘం కేసు.. వైదొలగిన సీజేఐ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించిన వివాదాల ప్యానెల్ కేసు విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వైదొలిగారు. సీజేఐ ఈ పిటిషన్ నుంచి తప్పుకోవడంతో.. ఇది మరో బెంచ్కు వెళ్లనుంది. అయితే వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన విచారణ మొదలుకానుంది.ఈ ప్యానెల్లో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని గతంలో సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం అనేది పారదర్శకంగా జరగాలన్నదే తమ అభిప్రాయం అని ఆ టైంలో కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించేంత వరకు.. ఈ కమిటీ అమలులో ఉంటుందని ఆ సమయంలో స్పష్టం చేసింది. కానీ..కొన్ని నెలలకే కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ఓ నిర్ణయం తీసుకుంది. సీజేఐ స్థానంలో ఓ కేంద్ర మంత్రిని ప్రధాన మంత్రి ఈ ప్యానెల్కు కేటాయించారు. ఈ మేరకు సీఈసీ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదింపజేసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని సంఘాలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్ను నాడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ బెంచ్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉండడం గమనార్హం. ఇక ఆ సమయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ.. మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ధర్మాసనం. అయితే.. సీఈసీ బిల్లు వివాదాన్ని పట్టించుకోకుండానే.. కేంద్రం ఇద్దరిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమించింది. ఇక.. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా ఉండడంతో ఈ కేసు నుంచి త్ప్పుకోవాల్సి వచ్చింది. -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
AICC: ఈవీఎంలపై ఇక దేశవ్యాప్త ఆందోళనలు
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సుఖ్ విందర్ సింగ్ సుఖు, దీపా దాస్ మున్షి సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్ర రాజు, పళ్లం రాజు, రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. . వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చౌహన్కు సీడబ్ల్యుసీ అభినందనలు తెలిపింది. సమావేశంలో నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేస్తూ.. 2024 లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు...నాలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇది పార్టీకి ఒక సవాల్. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠాలు నేర్చుకోవాలి. పార్టీ బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాలి. నేతల మధ్య పరస్పర ఐక్యత లేకపోవడం, వ్యతిరేక ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. పార్టీలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఎన్నికల్లో ఐక్యంగా ఉంటేనే పార్టీ విజయం సాధిస్తుంది. పార్టీ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా ఉంటారు. సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి...ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు సమస్యలు గానే, కుల గణన కూడా ఒక ముఖ్యమైన అంశం. జాతీయ సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా పోరాటం చేయాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సన్నాహాలు చేసుకోవాలి. విజయాలకు నూతన పద్ధతులను అవలంబించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉంది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రతికూలంగా రావడం రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదు. రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది, సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని ఖర్గే పేర్కొన్నారు.ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందించనున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేసిన తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనతోపాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల సన్నద్ధత, పొత్తుల అవకాశాలపై పార్టీ కీలక నేతలంతా చర్చించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైన సమీక్షించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నలు లెవనేత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈసీకి లేఖ.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అలాగే కౌంటింగ్కు సంబంధించిన డేటాలో ‘తీవ్రమైన వ్యత్యాసాలు’ ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ రాసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా విచారణ జరపాలని పార్టీ అభ్యర్థించింది.మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చూస్తూ.. అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.కాంగ్రెస్ తన లేఖలోఓటర్లను ఏకపక్షంగా తొలగించిన ఈసీ.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా పార్టీ లేవనెత్తింది.నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని కోరింది. -
పోలింగ్ ముగిశాక 7 శాతం ఓటింగ్ ఎలా పెరిగింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు. -
పోలింగ్లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్ వర్తించనుంది. డిసెంబర్ 20వ తేదీనే పోలింగ్ అయ్యాక సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇదీ చదవండి: హాయ్ చెప్తే.. అంత డ్రామా చేస్తారా? -
Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం
రాంచీ: జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు(శనివారం) విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో ప్రధాన పోటీ హేమంత్ సోరెన్కు చెందిన జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏల మధ్యే ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందు హేమంత్ సోరెన్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది.కౌంటింగ్ కేంద్రాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలో జేఎంఎం పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను ఇక్కడ మోహరిస్తోందని జార్ఖండ్ ముక్తి మోర్చా ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రంలోని 24 కౌంటింగ్ కేంద్రాలలో జరగనుంది. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలో బీజేపీ కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రానిక్ నిపుణులను నియమించినట్లు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్లో లోక్సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్లో ఓటు వేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి మృతి మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్ జార్ఖండ్లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
Maharashtra Assembly elections 2024: నువ్వా.. నేనా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హోరెత్తిన ప్రచారంమహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. 18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. పార్టీల కోలాటంమహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. జార్ఖండ్లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్రాంచీ: జార్ఖండ్లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు. -
నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు
ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.ఇదీ చదవండి: జో బైడెన్లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్ -
రాహుల్గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’
ముంబయి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం(నవంబర్ 16) మధ్యాహ్నం అమరావతిలో రాహుల్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే అధికారులు ఆయన బ్యాగులు చెక్ చేశారు. బ్యాగులతో పాటు రాహుల్గాంధీ వచ్చిన హెలికాప్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు ప్రముఖ నేతల బ్యాగుల తనిఖీలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఈ తనిఖీలు’ తాజాగా రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పలుమార్లు తనిఖీ చేయడం వివాదానికి దారి తీసింది. విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్నారంటూ ఎన్నికల అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.అయితే,ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే అంటూ ఈసీ క్లారిటీ ఇచ్చింది. కాగా,మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.నవంబరు 23న ఫలితాలను వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: కసబ్కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది: జేపీ నడ్డా -
Video: అమిత్షా హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్ను ఈసీ రద్దు చేసింది. -
Jharkhand Polls: మెదటి దశలో జేఎంఎం, బీజేపీ, కాంగ్రెస్తో పాటు బరిలో 53 పార్టీలు!
రాంచీ: జార్ఖండ్లో తొలి దశ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నవంబర్ 13న రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ సిబ్బంది వివిధ బూత్లకు తరలివెళ్లారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఏ పార్టీలు గరిష్ట సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టాయనే విషయానికొస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జేఎల్కెఎం)కి చెందిన 35 మంది అభ్యర్థులు తొలి దశలో పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 29 మంది, జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి 23 మంది, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) నుంచి 19 మంది, భారత్ ఆదివాసీ పార్టీ నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. ఈ దశలో జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాల్లో 53 పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. 334 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేయగా, మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు 12 మంది మహిళలు సహా 87 మంది అభ్యర్థులను బరిలోకి దించాయి. జార్ఖండ్లోని గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీల నుంచి మహిళలు సహా 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర రాష్ట్రాల రిజిస్టర్డ్ పార్టీలు ముగ్గురు మహిళలతో సహా 42 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. నమోదిత (గుర్తింపు లేని) రాజకీయ పార్టీలు 20 మంది మహిళలతో సహా 188 మంది అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులలో 299 మంది పురుషులు, 34 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారు.ఇది కూడా చదవండి: ఫోన్తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం -
ఫోన్తో ఎన్నికల ర్యాలీలో ప్రచారం.. ఈసీపై సీఎం సతీమణి ఆగ్రహం
రాంచీ: జార్ఖండ్లోని 43 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న(రేపు) తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ముగించేశాయి. తాజాగా.. సీఎం హేమంత్ సోరెన్ సతీమణి, జేఎంఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఎన్నికల కమిషన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పలు ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించిందని, దీంతో ఫోన్లోనే తాను సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.పశ్చిమ సింగ్భూమ్ జిల్లా జగన్నాథ్పూర్ నియోజకవర్గంలోని మౌలానగర్ మైదానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫోన్ ద్వారా ఆమె ప్రసంగిస్తూ.. జార్ఖండ్లో జేఎంఎం మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లను వినియోగించకుండా ఎన్నికల సంఘం అడ్డుకున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీని టార్గెట్ చేసిన ఆమె ఆడపిల్లలు చదువుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనేది బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో పాఠశాలలను మూసేయడానికి ఇదే కారణమని ఆరోపించారు.బీజేపీ పార్టీ ధనవంతులు, వ్యాపారుల పార్టీ అని కల్పన కల్పనా సోరెన్ అభివర్ణించారు. గిరిజనం అనే పదాన్ని బీజేపీ ద్వేషిస్తుందని, వారి సంస్కృతిని, గుర్తింపును నాశనం చేయాలని బీజేపీ చూస్తున్నదని ఆమె ఆరోపించారు. ఆదివాసీ తెగ 'సర్నా కోడ్'ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని ఆమె ప్రశ్నించారు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి సోనారామ్ సింకుకు ఓటు వేయాలని కల్పనా సోరెన్ విజ్ఞప్తి చేశారు. అయితే కల్పనా సోరెన్ చేసిన ఆరోపణలపై జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ స్పందిస్తూ ఒడిశా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాల కదలిక కారణంగా కల్పనా సోరెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను గంటపాటు ఘట్సిలా వద్ద నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంలో ఓ అధికారిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: బైక్ టాక్సీ సేవలను ప్రారంభించిన ఢిల్లీ మెట్రో -
మహారాష్ట్ర డీజీపీపై ఈసీ బదిలీ వేటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికళ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విషయంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీగా నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ను పంపాలని తెలిపింది. దీంతో రష్మీ శుక్లా స్థానంలో అత్యంత సీనియర్ అధికారిగా ఉన్న వివేక్ ఫన్సాల్కర్కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబై సీపీగా పనిచేస్తున్నారు.కా గాగత నెలలో రాష్ట్ర డీజీపీని తొలగించాలని అభ్యర్థిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(శరద్చంద్ర) సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై డీజేపీ శుక్లా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. చదవండి: దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పుగత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి. దీనిపై ఈసీ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
దేశంలో పలు స్థానాల్లో ఉపఎన్నిక తేదీ మార్పు
ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్లోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఆ తేదీని నవంబర్ 20కి మారుస్తూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.By-polls in Assembly Constituencies in Kerala, Punjab and Uttar Pradesh rescheduled from November 13 to November 20 due to various festivities pic.twitter.com/P2eaNMDhzb— ANI (@ANI) November 4, 2024శ్రీ గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ (నవంబర్ 15), కల్పతి రాస్తోల్సవం (నవంబర్ 13-15), కార్తీక పూర్ణిమ (నవంబర్ 15), ప్రకాష్ పర్వ్ వంటి పండుగలను నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘంగా ఉప ఎన్నికల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది, పంజాబ్లో నాలుగు, కేరళలో ఒకటి అసెంబ్లీ స్థానాలుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగనుంది. మరోవైపు.. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్లో తేదీలో ఎటువంటి మార్పు లేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. -
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
చట్టపరమైన చర్యలకు వెనుకాడం: ఈసీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు బాధ్యతారారహిత్యమైనవని తెలిపింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో కాంగ్రెస్ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నతేలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది. ‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది. ఈసీ స్పందన కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ లేఖలో తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, అజయ్ మాకెన్ సహా తొమ్మిది మంది సీనియర్ నేతలు సంతకం చేశారు. -
‘మహా’ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లే అధికం
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఠాక్రే (శివసేన), శరద్ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
హర్యానా ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు రానప్పుడు.. నిరాధార ఆరోపణలు చేయటంపై మంగళవారం కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. అక్టోబరు 8, 10 తేదీల మధ్య, మళ్లీ అక్టోబర్ 14వ తేదీన హర్యానా ఎన్నికల సమయంలో విధానపరమైన అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అక్టోబర్ 8వ తేదీన హర్యానా ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో ఈసీ అధికారిక వెబ్సైట్లో రెండు గంటల పాటు అలస్యంపై కాంగ్రెస్ నేసిన ఆరోపణలను హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖండించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసి, ఆపై లెక్కించిన సయయంలో.. నిరాధారమైన, సంచలనాత్మక ఫిర్యాదులు చేయవద్దని ఈసీ కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలను హెచ్చరించింది.‘‘ బాధ్యతా రహితమైన ఆరోపణలు ప్రజల అశాంతి, అల్లకల్లోలం, గందరగోళానికి దారితీస్తాయని తెలిపింది. అదేవిధంగా దృఢమైన, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అనవసరపు ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసింది.హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ఈసీ పనితీరుతోపాటు ఈవీఎంలపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని, తమ పార్టీ విజయాన్ని బలవంతంగా లాక్కొన్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులను కలిసి, ఓట్ల లెక్కంపుపై కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినవి సాధారణ సందేహాలనే ఈసీ స్పష్టం చేసింది.చదవండి: బాంబు బెదిరింపుల వెనక ఉగ్రవాదంపై పుస్తకం రాసిన రచయిత.. -
ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆయన స్థానంలో అదే కేడర్లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు?
సాక్షి, అమరావతి: ‘ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 12 బూత్లలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటోంది. ఈవీఎం ఓట్లను.. వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు? రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టులో వైఎస్సార్సీపీ వేసిన కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము అడిగే ప్రాథమిక ప్రశ్న ఒక్కటే.. ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంలు.. వీవీప్యాట్ల సంఖ్యను మ్యాచ్ చేయాలని కోరాం. నిజంగానే ఎన్నికల కమిషన్ మనసులో కల్మషం లేకపోతే మ్యాచ్ చేసి చూపించొచ్చు కదా? మా సందేహాలే కాకుండా దేశంలోని అందరి సందేహాలు నివృత్తి అవుతాయి?. కానీ, ఇదే ఈసీహైకోర్టులో.. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఈవీఎం, వీవీప్యాట్ల నంబర్లను వెరిఫై చేయమని చెప్పలేదని, మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని మాట్లాడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం. ఈవీఎంలోని నంబర్.. వీవీప్యాట్లను మ్యాచ్ చేయకపోవడంతోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఆరు నెలలు దాటేస్తే వీవీప్యాట్లపై ఇంక్ పోతుందేమోనని ఎదురు చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం. అమెరికా, యూకేతో సహా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం అన్నది ప్రబలంగా ఉండటం కాదు.. అది ప్రబలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యంలో విలువలను నిలబెట్టాలి.’ అని అన్నారు. -
దేశవ్యాప్త ప్రజా ఉద్యమంతోనే ఈవీఎంల అసలు గుట్టు సాధ్యం!
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఈవీఎంల ట్యాంపరింగ్పై ఎన్నికల కమిషన్ నోరు విప్పింది. అయితే ఈ వివరణ మొత్తం ఏదో బుకాయిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఒక పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంల మ్యానిప్యులేషన్పై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అయితే ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు కానీ ఈ అనుమానాలను సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా ప్రశ్నలు వేసినవాళ్లు అధికులు ఉత్తరాది వారు కావడం వల్లనేమో లేక సమాచారం లేమి కారణంగానో తెలియదు కానీ.. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన తంతుపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఉండటంపైనే ప్రశ్నలు కొనసాగాయి. అలాగే ఒక కాంగ్రెస్ ఎంపీ ఈవీఎంలను హిజ్బొల్లా వాడిన పేజర్లతో పోల్చి.. ఇజ్రాయెల్ సైన్యం వాటిని పేల్చివేసిన వైనం గురించి ప్రస్తావించిన సంగతిని కోట్ చేసి అడిగారు. సహజంగానే ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషనర్లు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై అనుమానాలు రేకెత్తించేలా సమాధానమిచ్చారు. మొదటి గంటలోనే ఫలితాలు ఎలా వస్తాయని ఈసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కాదు సమస్య. హరియాణాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అన్న అంచనాకు వచ్చాయి. కొన్నిసార్లు ఈ అంచనాలు తప్పవచ్చు కానీ.. అన్ని సర్వేలూ తప్పు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలకు భిన్నంగా ఈవీఎం ఓట్ల లెక్కలు ఉండటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. భారత్ వాడే ఈవీఎంలు హిజ్బొల్లా వాడే పేజర్ల కన్నా సమర్థమైనవని, ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ అన్నప్పటికీ, దానిని సహేతుకంగా నిరూపిస్తామని చెప్పలేకపోవడం గమనార్హం. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటి కన్నా, కౌంటింగ్ నాటికి ఎలా పెరుగుతుందన్న దానికి వీరు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఇజ్రాయిల్ హ్యాకింగ్ దిట్ట అని పేరు. పెగసస్ గూఢచర్య పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్కడ తయారవుతున్నాయి. హిజ్బొల్లా వాడిన పేజర్లను తయారు చేసే తైవాన్ కంపెనీనే మేనేజ్ చేసి టాంపరింగ్ చేసి, వాటిని పేల్చివేయగలిగిందని వార్తలు వచ్చాయి. అలాంటి ఇజ్రాయిల్ నుంచి ఈవీఎం టాంపరింగ్ పరిజ్ఞానాన్ని ఎవరైనా ఇండియాకు తెచ్చారా అన్న సంశయం కొందరిలో ఉంది. దీన్ని మనం నిర్ధారించలేము కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు, వెల్లడైన ఫలితాలు, ఆ తర్వాత ఈసీ అధికారులు ప్రవర్తించిన తీరులను గమనిస్తే పలు సందేహాలు రాక మానవు. ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ కొద్ది రోజుల క్రితం చాలా స్పష్టంగా ఈవీఎంలను హాక్ చేయవచ్చని, ఈ విషయాన్ని పలుమార్లు నిపుణులు రుజువు చేశారని అన్నారు. ఎలాన్ మస్క్ వంటివారు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా భారత ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోవడం సందేహాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, ఇరుపక్షాల మధ్య తేడా ఉంటే ఐదు లేదా పది సీట్లు ఉండవచ్చని అంచనా వేశాయి. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ వైఎస్సార్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే ఆధారాలు లేవని అన్నారు. కానీ ఆ తర్వాత పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆరా మస్తాన్ వంటివారు మొత్తం స్టడీ చేసి ఈవీఎంల మానిప్యులేషన్ జరిగిందన్న భావనకు వచ్చారు. అన్నిటిని మించి ఎన్నికల కమిషన్ ఎన్ని అరోపణలు వచ్చినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే మోసం జరిగిందన్న దానికి పెద్ద ఎవిడెన్స్ అన్న భావన ఉంది. ఎన్నికల నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల శాతం ఎలా పెరిగిందన్న ప్రశ్నకు ఈసీ నుంచి జవాబు లేదు. ఏపీలో సుమారు 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం చేసిన ఆరోపణపై సరైన సమాధానం రాలేదు. ఒంగోలు, విజయనగరంలలో వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని, ఈవీఎంలతో పోల్చాలని చేసిన అభ్యర్థనను పక్కదారి పట్టించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, దానిని అమలు చేయకపోవడం మరో డౌటు. ఈ ఒక్క విషయాన్ని ఎన్నికల సంఘం క్లియర్ చేసి ఉంటే ఈవీఎంలపై సందేహాలు వచ్చే అవకాశం ఉండదు. అలా చేయకపోవడంతో ఈవీఎంలను మేనేజ్ చేశారని అందువల్లే ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటమికి గురైందని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. వీవీప్యాట్ స్లిప్ లను పది రోజులలోనే దగ్ధం చేయాలని అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి జిల్లా అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది ఇంతవరకు తేలలేదు. వీటన్నిటిపై అప్పటి వైసీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళితే, రెండు నెలలు దాటినా తీర్పు రాకపోవడం మరో చిత్రంగా భావిస్తున్నారు. ఇక ఫారం 20లో ఆయా పార్టీలు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు నమోదు చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉన్నా, ఏపీలో 108 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? వాటిని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్లలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే రావడమేమిటో అర్థం కాదు. పైగా అసలు అంతగా ఉనికిలో లేని కాంగ్రెస్కు అదే బూత్ లో 470 ఓట్లు వచ్చాయని నమోదు కావడం మరో వింతగా చెబుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత, వీటిపై ఎన్నికల సంఘం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేయకపోవడంపై అంతా విస్తుపోతున్నారు. మీడియా సమావేశంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్య రక్షణకు గొడుగుగా ఉండవలసిన ఈ సంస్థకు ఏదో అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. పోనీ ఏపీ, ఒడిషా, హరియాణలలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలైనా ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న డౌట్ల ను క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించకపోవడం మరో సంశయంగా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు ఎన్నికలలో ఈవీఎంలను ఎలా టాంపర్ చేయవచ్చో, పలుమార్లు వివరించారు. ప్రస్తుతం ఆయన గెలిచారు కనుక ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరు అంతా ఏకపక్షంగానే సాగిందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో దేశ ప్రజల కర్తవ్యం ఏమిటి? అయితే ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. అలా చేయకపోతే ప్రజాబాహుళ్యం నుంచి ఒత్తిడి మొదలు కావాలి. అది ఉద్యమ రూపం దాల్చాలి. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన ఈవీఎంల వ్యవస్థను తొలగించే వరకు అంతా ఉద్యమించాలి. దీనిపై దేశ వ్యాప్తంగా కదలిక రాకపోతే భవిష్యత్తులో ఇది మరింత అపాయంగా మారుతుంది. ఎవరికి వీలైతే వారు ఈవీఎం లను హాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీనిపై ప్రజా ఉద్యమం తీసుకురావడానికి పూనుకోవాలని అంతా భావిస్తున్నారు. ముందుగా ఆయా సర్వే నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రముఖులతో సమావేశం జరిపి, దేశ స్థాయిలో వివిధ ప్రాంతాలలో సెమినార్లు కండక్ట్ చేసి అందరిలోను ఒక కదలిక తీసుకు రాగలిగితే ఆయన దేశానికి ఒక మార్గదర్శకుడు అవుతారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని ఎక్కువమంది నమ్ముతారు. తొలుత ఆయన పార్టీ పరంగా తనకు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడికరించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. వారు స్పందిస్తారా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం. ఈవీఎంలపై అందరిని సంతృప్తిపరిచేలా ఈసీ జవాబు ఇవ్వగలిగితే ఓకే. అలా కాకుండా జగన్ గతంలోనే చెప్పినట్లు పేపర్ బాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగేలా ఈ నాలుగేళ్లు ఉద్యమం చేపట్టడం అవసరం అనిపిస్తుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ హరియాణ ఎన్నికల ఫలితాల ద్వారా ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కూడా ఉంది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈవీఎంల వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానికి కేంద్రం, ఈసీ ఎటూ అంగీకరించవు. కాబట్టి.. ప్రజా ఉద్యమమే ఈ సమస్య పరిష్కారానికి మేలైన మార్గం కాగలదు! కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్కుమార్ జోగ్దండ్లు హెలికాప్టర్లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ను ఉత్తరఖండ్లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఈసీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న, జార్ఖండ్కు రెండు విడతల్లో నవంబర్ 13న, 20న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారుఎగ్జిట్స్ పోల్స్తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.అయితే ఈ ఎగ్జిట్ పోల్స్కు శాంపిల్ సైజ్ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.చదవండి:మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్అక్టోబర్ 22న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29అక్టోబర్ 30న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 4నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలునవంబర్ 23న ఫలితాల వెల్లడి రెండు విడతల్లో జార్ఖండ్ ఎన్నికల పోలింగ్తొలి దశ పోలింగ్కు సంబంధించి అక్టోబర్ 18న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 25అక్టోబర్ 28న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 30నవంబర్ 13న పోలింగ్నవంబర్ 23న ఫలితాల వెల్లడిరెండో దశ పోలింగ్కు సంబంధించిఅక్టోబర్ 22న నోటిఫికేషన్నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్ 29అక్టోబర్ 30న స్క్రూటినీనామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 1నవంబర్ 20న పోలింగ్నవంబర్ 23న ఫలితాల వెల్లడిరాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.ఇక 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లుజార్ఖండ్లో మొత్తం ఓటర్లు 2.6 కోట్లుమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటి ఎఎన్నికల షెడ్యూల్ను కూడా ఈసీ ప్రకటించింది. ఆ తేదీల వివరాలు ..↓ -
ఉచిత హామీలపై ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు. ‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. -
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
హర్యానా ఫలితాలు: ‘ఈవీఎం హ్యాకింగ్పై ఫిర్యాదు చేశాం’
ఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావించారని మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా అన్నారు. అయితే.. హర్యానా ఫలితాలు తమకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృదం భేటీ అయింది. ఈసీతో భేటీ అనంతరం భూపిందర్ సింగ్ హుడా మీడియాతో మాట్లాడారు. ‘‘పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ అన్ని చోట్లా ఆధిక్యంలో ఉంది. అయితే ఈవీఎంల లెక్కింపులో మాత్రం చాలా వెనకంజలోకి వెళ్లిపోయింది. మాకు చాలా ఫిర్యాదులు అందాయి. పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాకు హామీ ఇచ్చింది. మేము ఇచ్చిన అన్ని ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని తెలిపారు.#WATCH | Delhi: After meeting the Election Commission, former Haryana CM and Congress leader Bhupinder Hooda says, "These results of Haryana are surprising because everyone thought that Congress will form the government in Haryana. Be it IB, experts, survey reports, but what… pic.twitter.com/cWFgliYYqg— ANI (@ANI) October 9, 2024 కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు.‘‘ మేము ఎన్నికల సంఘం అధికారులను కలిశాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పత్రాలను సమర్పించాం. మా ఫిర్యాదులకు సానుకూలంగా స్పందించారు. ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాం. మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఫిర్యాదులను సైతం ఈసీకి సమర్పిస్తాం. మా అభ్యర్థులు ఈవీఎం బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులు లేవనెత్తారని తెలియజేశాం. పరిశీలన పూర్తయ్యే వరకు అన్ని ఈవీఏం యంత్రాలను సీలు చేసి భద్రపరచాలని మేము అధికారులను అభ్యర్థించాం. కర్నాల్, దబ్వాలి, రేవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా , నార్నాల్లలో ఈవీఎం హ్యాకింగ్కు సంబంధించిన ఆధారాలను సమర్పించాం. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఈసీని కోరాం’ అని అన్నారు.#WATCH | After meeting the ECI officials, Congress leader Pawan Khera says "We met the Election Commission officials and presented the documents of 7 Assembly constituencies...Their reaction as usual was a good smile and a good cup of tea but we need more. Complaints from 13 more… pic.twitter.com/qP7yEhJNPS— ANI (@ANI) October 9, 2024 -
తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్ద హైడ్రామా చోటు చేసుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులుగా మారాయి. తమదే గెలుపని ధీమాతో ఉన్న కాంగ్రెస్కు ఫలితాలు ఊహించని షాక్నిచ్చాయి. 10 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేపట్టబోతున్నామనే హస్తం ఆశలను ఫలితాలు ఆవిరి చేశాయి. మొదట కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచినప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ పుంజుకొని ఎవరూ ఊహించని విధంగా.. హ్యట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ ఫలితాలు ఊహించలేదని, వీటిని తాము అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో జైరాం రమేష్ మాట్లాడుతూ.. హర్యానాలో ఫలితాలు పూర్తిగా ఊహించనివి అని తెలిపారు. పూర్తిగా ఆశ్చర్యం కలిగించాయని, ప్రతికూలమైనవని తెలిపారు.‘ఫలితాలు వాస్తవికతకు విరుద్ధంగా ఉన్నాయి. హర్యానాలో ప్రజలు కోరుకున్న మార్పు, పరివర్తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేఈ పరిస్థితుల్లో నేడు మనం చూసిన ఫలితాలను అంగీకరించడం సాధ్యం కాదు. హర్యానాలో మనం చూసింది తారుమారైన విజయం. ప్రజల అభీష్టాన్ని, పారదర్శక, ప్రజాస్వామ్య ప్రక్రియలకు ఓటమి. హర్యానా అధ్యాయం పూర్తి కాలేదు.మూడు జిల్లాల్లో ఈవీఎం ట్యాంపరింగ్"మధ్యాహ్నం అంతా, నేను ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. వారు నా ఫిర్యాదులకు సమాధానమిచ్చారు, వారి సమాధానానికి నేను ప్రత్యుత్తరం ఇచ్చాను. కనీసం మూడు జిల్లాల నుంచి లెక్కింపు ప్రక్రియ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. వీటి సమాచారం సేకరిస్తున్నాం. నేడు లేదా రేపటికి దీనిని ఎన్నికల కమిషన్కు అందజేస్తాం.’ అని పేర్కొన్నారు.అంతకముందు కూడా కౌంటింగ్ అప్డేట్లో జాప్యంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈసీ వెబ్సైట్లో ఫలితాల అప్డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్సైట్ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. మీఆరోపణలు పూర్తిగా ఊహాజనితమని, బాధ్యతారహితంగా ఉన్నాయని పేర్కొంది. నిరాధార ఆరోపణలతో తప్పుదారి పట్టించవద్దని సమాధానమిచ్చింది. ప్రతి ఐదు నిమిషాలకు అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్లు అప్డేట్ అవుతున్నాయని తెలిపింది. -
హర్యానా కౌంటింగ్ అప్డేట్లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్కు అంచనాలు మారుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ అన్నీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. ఫలితాలు అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ దూసుకెళ్లగా తరువాత ఢీలా పడింది. అతితక్కువ స్థానాల్లో లీడ్లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తుంది.అయతే తమదే గెలుపు అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్కు హర్యానా ఫలితాలు షాక్ను ఇవ్వడంతో.. ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం జరుగుతోందంటూ హస్తం పార్టీ మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్సైట్లో ఫలితాల అప్డేట్ లేదని, మందకొడిగా సాగుతోందని లేఖలో పేర్కొంది.చదవండి: ఎగ్జిట్పోల్స్ తలకిందులు..‘హర్యానా’లో బిగ్ ట్విస్ట్మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్సైట్ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.Here is my letter to @ECISVEEP on the inordinate and unacceptable delay in updating trends in the Haryana assembly elections pic.twitter.com/Lvq747seTz— Jairam Ramesh (@Jairam_Ramesh) October 8, 2024మరోవైపు ఈసీ వెబ్సైట్ అప్డేట్లో జాప్యంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ‘లోక్సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్ ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్డేట్ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం. మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్ లేఖ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్ను వ్యతిరేకించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
18 సవరణలు చేయాలి
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది. -
ప్రశాంతంగా జమ్ము తొలిదశ పోలింగ్
శ్రీనగర్//జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి బుధవారం తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఆరి్టకల్ 370 రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాక.. తొలిసారిగా కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో గత ఏడు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కె.పోల్ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక, పోస్టల్ బ్యాలెట్లను కూడా కలుపుకొంటే పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని తెలిపారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలుండగా.. బుధవారం తొలి విడతలో 24 సీట్లలో పోలింగ్ జరిగింది. 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కశ్మీర్ లోయలో 16 సీట్లకు, జమ్మూలో 8 సీట్లకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ల బయట ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. 61 శాతం పోలింగ్ నమోదైందని పి.కె.పోల్ ప్రకటించారు. సెపె్టంబరు 25న రెండో దశ, అక్టోబరు 1న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. హరియాణాతో కలిసి అక్టోబరు ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
మార్పు మేలు చేస్తుందా?
కొన్ని నిర్ణయాలంతే! అధికారపక్షం స్వాగతిస్తుంటుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి 5కు మారుస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయం విషయంలోనూ అదే జరిగింది. సెలవుల వల్ల ఓటింగ్ తగ్గకూడదనే భావనతో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ అధికారంలో ఉన్న బీజేపీ, ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షం ‘ఇండియన్ నేషనల్ లోక్దళ్’ హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇదంతా ఓటమి భయంతో ప్రచారం గడువు పెంచుకొనేందుకు బీజేపీ ఆడిస్తున్న తేదీ మార్పు నాటకం అంటోంది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ మొదటి వారంలోగా సాగే ఈ విడత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాతో పాటు జమ్మూ కశ్మీర్లోనూ పోలింగ్ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా దృష్టిని ఆకర్షిస్తున్నా, హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు కథ ఆసక్తి రేపుతోంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల నిరసనలు – డిమాండ్లపై ప్రభుత్వ వ్యవహారశైలి, పారిశ్రామికీకరణలో హర్యానా వెనుకబాటు, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం, మహిళా రెజ్లర్ల ఆందోళన, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అనేక అంశాలు హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్నప్పటికీ కాంగ్రెస్ కొంత ముందంజలో ఉందని కథనం. ఈ పరిస్థితుల్లో పోలింగ్ తేదీ మార్పు ప్రశ్నలు లేవనెత్తింది. అసోజ్ అమావాస్య పుణ్యతిథి ఉన్నందున ఓటింగ్ తేదీని మార్చాలని ఆలిండియా బిష్ణోయ్ మహాసభ అభ్యర్థనలు చేసిందనీ, వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈ మార్పు చేపట్టామనీ ఎన్నికల సంఘం చెబుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటోందనీ, హర్యానాలో విజయంపై అనుమానాలు ఉన్నందున పోలింగ్కు మరింత గడువు కోసమే బీజేపీ ఈ తేదీ మార్పు చేయించిందనీ ప్రతిపక్షాల ఆరోపణ. సహజంగానే కౌంటింగ్ తేదీ మారింది. ఇప్పుడు హర్యానాతో పాటు జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న కాక 8న జరగనుంది. నిజానికి, సాంస్కృతిక, ధార్మిక ఉత్సవాలకు అడ్డు రాకుండా పోలింగ్ తేదీలను మార్చడమనేది కొత్తేమీ కాదు. ఎన్నికల సంఘం గతంలోనూ ఆ పని చేసింది. గురు రవిదాస్ జయంతికి భక్తులు వారణాసికి వెళతారనే కారణంతో 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్ని వారం పాటు వాయిదా వేశారు. అదే ఏడాది మణిపుర్లో సైతం క్రైస్తవుల ఆదివారం ప్రార్థనల రీత్యా ఎన్నికల తేదీని మార్చారు. ఇక, నిరుడు 2023లో దేవుథని ఏకాదశి రోజున రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరుగుతాయి గనక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రోజు నుంచి మార్చారు. ఇటీవలే కాదు... పుష్కరకాలం క్రితం 2012లోనూ బారావఫాత్ (మిలాద్ ఉన్ నబీ) కారణంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తేదీని మార్చారన్నది గమనార్హం. తాజాగా హర్యానాలో తేదీ మార్పునకు మరో కారణమూ ఉందని అధికార వర్గాలంటున్నాయి. ముందుగా ప్రకటించిన పోలింగ్ తేదీ ప్రకారమైతే... సెప్టెంబర్ 30వ తేదీ ఒక్క రోజు గనక సెలవు పెడితే, ఆ రాష్ట్రంలో వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చే పరిస్థితి. దానివల్ల పలువురు సెలవు పెట్టి, ఓటింగ్కు దూరంగా ఊళ్ళకు వెళ్ళే ప్రమాదం ఉంది. కొత్త పోలింగ్ తేదీతో ఆ అలసత్వాన్ని తప్పించి, ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చనేది అధికారుల కథనం. మరీ ఇన్ని తెలిసిన ఎన్నికల సంఘం ముందుగానే ఈ అంశాలన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. ఎన్నికల తేదీలను ఖరారు చేస్తున్నప్పుడే ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేయాల్సిన బాధ్యత దానికి ఉంది. హర్యానాలో ఆ పని ఎందుకు చేయలేకపోయిందో ఈసీ జవాబు చెప్పాలి. అసలు రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఎన్నికల సంఘాన్ని తమ చేతిలో సాధనంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాడుకుంటున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉన్నదే. ఆ ఆరోపణలు అంతకంతకూ పెరుగుతుండడమే విషాదం. పైగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పైన, ఈవీఎంల పని తీరు పైన తీవ్రమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఇప్పటికీ వాటికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని ఈసీ ఇప్పుడిలా వ్యవహరించడం లేనిపోని అనుమానాల్ని మరింత పెంచుతోంది. వ్యవస్థలు పారదర్శకంగా లేవని తేటతెల్లమవుతున్న పరిస్థితి ఆందోళన రేపుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో నరం లేని నాలుకతో మాట్లాడే పార్టీల పాపం కూడా లేకపోలేదు. ప్రస్తుతం హర్యానా విషయంలో చెరొకవైపు నిలబడ్డ బీజేపీ, కాంగ్రెస్లు రెండూ... రెండేళ్ళ క్రితం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి గట్టిపోటీ ఉన్న పంజాబ్ ఎన్నికల వేళ మాత్రం ఒకే తాటి మీద నిలవడం విచిత్రం. అప్పట్లో గురు రవిదాస్ జయంతి గనక పోలింగ్ తేదీని మార్చాలంటూ రెండు పార్టీలూ కోరాయి. ఎన్నికల సంఘం ఆ కోరికను మన్నించింది. కానీ, పోలింగ్ను వాయిదా వేయించినంత మాత్రాన ఫలితం మారలేదు. ఆ పార్టీలకేమీ కలసి రాలేదు. ఆప్ ప్రభంజనంలో అవి కొట్టుకుపోయాయి. ఎన్నికల బరిలో పరిస్థితులు పోటాపోటీగా ఉన్న సందర్భంలో నాలుగు రోజులు అదనంగా ప్రచారానికి లభించడం కీలకమే. కానీ, ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని పీఠమెక్కించాలన్న అంశంపై ప్రజలు ముందే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పోలింగ్ తేదీని నాలుగైదు రోజులు అటో ఇటో మార్చినా ఫలితం ఉంటుందనుకోవడం పిచ్చి భ్రమ. అప్పుడు పంజాబ్కైనా, ఇప్పుడు హర్యానాకైనా అదే వర్తిస్తుంది. ఈ తర్కాన్ని మార్చిపోయి దింపుడు కళ్ళం ఆశతో ఉంటే ఉపయోగం లేదని గుర్తించాలి. కారణమేమైనప్పటికీ తేదీ మార్పు వల్ల ఓటింగ్ శాతమంటూ పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ, అది ఏ పార్టీకి ఉపకరిస్తుందన్నదే బేతాళప్రశ్న. -
Haryana Assembly elections 2024: బీజేపీ, కాంగ్రెస్... నువ్వా నేనా
హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. అయితే ఇటీవలి లోక్సభ ఎన్ని కల్లో మెరుగైన ప్రదర్శనతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పారీ్టకి ముచ్చెమటలే పట్టిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత, రైతుల ఆగ్రహం వంటివి బీజేపీని కుంగదీస్తున్నాయి. వీటిని గరిష్టంగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలకు హస్తం పార్టీ పదును పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా చూస్తే పలు కంచుకోటల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆ మేరకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు స్థానిక పార్టీ జేజేపీ పుంజుకుంటూ కమలానికి గట్టి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కీలకమైన ప్రాంతాల్లో ఈసారి ‘ఓటు షిఫ్టు’ ఎలా ఉండనుందన్నది తుది ఫలితాలను శాసించే అవకాశాలు కని్పస్తున్నాయి... బీజేపీ నేల చూపులు... 2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ, ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మాత్రం కీలక అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని బాగా కోల్పోయింది. ఉదాహరణకు ఫిరోజ్పూర్ జిర్కా, నూహ్ అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఏకంగా 16 శాతం చొప్పున ఓట్లు తగ్గాయి. మరోవైపు నారాయణ్గఢ్ వంటి చోట్ల పార్టీ ఓటు శాతం 14 శాతానికి పైగా పెరిగినా పెద్దగా లాభం లేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పదింటినీ ఒడిసిపట్టగా తాజా ఎన్నికల్లో వాటిలో సగం సీట్లకు కోత పడింది. కాంగ్రెస్ పైపైకి... కాంగ్రెస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో పలు అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుని లాభపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి అంబాలా కంటోన్మెంట్ స్థానంలో ఏకంగా 39.8 శాతం, అంబాలా సిటీలో 36.6 శాతం చొప్పున ఓట్లు పెరిగాయి! ఓట్ల శాతం తగ్గిన అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ నష్టం జరగకపోవడం విశేషం. ఉదాహరణకు పంచ్కులలో 4.5 శాతం, కాల్కాలో 2 శాతం మాత్రమే ఓట్లు తగ్గాయి. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేక చతికిలపడ్డ కాంగ్రెస్, తాజా ఎన్నికల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ భారీగా పుంజుకుంటున్న కీలక ప్రాంతాలు: బాగ్రీ, జాట్లాండ్ వీటిలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆదరణ పెరిగింది.బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటున్నకంచుకోటలు: అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికీ బీజేపీ ఆధిపత్యమే సాగుతున్నా 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతంలో తగ్గుదల నమోదైంది.బీజేపీకి ఓట్లు బాగా తగ్గిన ప్రాంతం: బ్రజ్ అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ పటిష్టంగానే కని్పస్తున్నా జాట్లాండ్, బాగ్రీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బ్రజ్ ప్రాంతంలో ఇరు పారీ్టలూ గట్టిగా తలపడుతున్నాయి. దాంతో అందరి దృష్టీ అక్టోబర్ 5న జరిగే పోలింగ్ మీదే ఉంది!ప్రస్తుత పరిస్థితి...పోలింగ్కు ఇంకా నెల రోజులే ఉన్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ కంచుకోటలపై పట్టు మరింత పెంచుకోవడంతో పాటు బలహీపడుతున్న ప్రాంతాల్లో నష్టాలను కట్టడి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే క్రమంగా బలపడుతున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి రెండు పారీ్టలకూ గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో జేజేపీ జోరు మీదుంది. ఈ నేపథ్యంలో హరియాణాలో ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కన్పిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పారీ్టలవారీ ఓటింగ్ శాతాన్ని బట్టి చూసినా అదే తేటతెల్లమవుతోంది. అదే ట్రెండు కొనసాగితే 2019లో మాదిరిగానే ఈసారి కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాట్లాండ్, బాగ్రీ ప్రాంతాల్లో ఎవరిది పై చేయి అవుతుందనే దాన్నిబట్టి తుది ఫలితం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.అంకెల్లో...→ 90 అసెంబ్లీ స్థానాలకు గాను 2024 లోక్సభ ఎన్నికల్లో 74 స్థానాల పరిధిలో బీజేపీ ఓట్ల శాతం కాస్తో కూస్తో పెరిగింది. → కానీ 16 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఓట్ల శాతం బాగా తగ్గింది. → దాంతో 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 5 లోక్సభ స్థానాలను కాంగ్రెస్కు బీజేపీ కోల్పోయింది. → మరోవైపు కాంగ్రెస్ బాగా పుంజుకుంది. పోటీ చేసిన 81 సీట్లకు గాను 68 చోట్ల ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. → దాంతో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఓట్ల శాతం కాస్త తగ్గినా ఏకంగా 5 లోక్సభ సీట్లు ఒడిసిపట్టగలిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: పోలింగ్ తేదీ మార్పు.. కారణం ఇదే
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్ 5కు మార్పు చేసింది. తొలుత అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించననుంది.బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్కు భారీగా తరలివస్తారు. దీంతో ఎన్నికల సంఘానికి జాతీయ, స్థానిక పార్టీలు.. అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ సాధించింది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది. -
ఎలక్షన్ కమిషన్ ఎందుకు తడబడుతుంది?.. మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-
అసాధారణ పోలింగ్ శాతం.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సిందే: అంబటి
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలని అవసరం ఎన్నికల సంఘానికి ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం పలువురు వైఎస్సార్సీపీ పార్టీ ప్రతినిధులు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ను కలిశారు. అనంతరం సచివాలయం వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు. ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై మాకు అనుమానం ఉంది. పోలింగ్ శాతాన్ని ఈసీ మూడుసార్లు వేర్వేరుగా వెల్లడించారు. ఏయే అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదు అయ్యింది?. ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించడం లేదు. ఫారం-20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని అని అంబటి, ఈసీని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారని మొదట చంద్రబాబే అన్నారు. గతంలో ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్లో కూడా అన్నే చూపించాలి. కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి లేదు అని ఆరోపించారాయన. మా అనుమానాల్ని ఈసీ నివృత్తి చేయాల్సిందే. త్వరలో ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారాయన. ఏపీ సీఈవోను కలిసిన వాళ్లలో అంబటితో పాటు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఉన్నారు.సీఈఓ ని మా పార్టీ ప్రతినిధులం కలిశాము‘‘ఎన్నికల ఫలితాలపై ఓట్ ఫర్ డెమోక్రసీ అనుమానాలు వ్యక్తం చేసింది. మాకు ఉన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరింది. ఈ అనుమానాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సి ఉంది. ఆరు గంటల తర్వాత కేవలం క్యూ లో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్ కి అవకాశం ఇస్తారు. ఆ టైంలో ఎన్నికల కమిషన్ 68.12 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించింది. .. రాత్రి 11.45 గంటలకి 76.5 శాతం ఓటింగ్ పెరిగింది అని ప్రకటించింది. ఫైనల్ గా 80.66 శాతం ఓటింగ్ జరిగిందని ప్రకటించారు. చాలా తేడా ఉంది. జూన్ 4 న లెక్కింపు నాడు 82 శాతం చూపించారు. ఇదంతా అనుమానాస్పదంగా ఉంది. ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఈసీ చెప్పాలి. .. 12 శాతానికి పైగా వ్యత్యాసం ఉండటం అసాధారణంగా ఉంది. దీనిని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయకపోవడం అనుమానాస్పదంగా ఉంది. అలాగే ఫారం 20 లో పార్టీల వారిగా ఓట్లను ప్రకటించాలి. కానీ ఈసీ ఈరోజు వరకు కూడా పార్టీల వారిగా ఓట్లను ప్రకటించలేదు. ఇది చాలా విచిత్రం, అసాధారణ చర్య. గతంలో ఎప్పుడు ఎన్నికల్లో ఇంత ఆలస్యం జరగలేదు. ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ అధికారుల నుండి రాలేదు అంటున్నారు. దీంతో రోజు రోజు కీ అనుమానాలు బలపడుతున్నాయి.. ..విజయనగరం, గజపతినగరం లలో మా అభ్యర్థులు ఈవీఎంలపై ఫిర్యాదు చేశారు. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉంది. అది ఎలా సాధ్యం అని తనిఖీ కోసం ఫిర్యాదు చేశారు. ఈవీఎంలను భద్రపరిచాక బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది?. దానికి మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి?. వీవీప్యాట్లను తనిఖీ చేయమంటే ఒంగోలులో మాక్ పోలింగ్ అంటున్నారు. ఈ అనుమానాలు అన్నింటికీ ఈసీ సమాధానం చెప్పాలి.. ఈవీఎంల తనిఖీ కి వెళితే తాళాలు లేవు అన్నారు. అధికారులు దగ్గర తాళాలు లేకపోవడం ఏంటి..?. ఈరోజుకి పోలింగ్పై ఫైనల్ ఫిగర్ చెప్పక పోవడం ఏంటి?. అందుకే సీఈవోను కలిసి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి అన్నారు. -
బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు నాయకులను, ఓటర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల అవకతవకలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను పరిశీలించాలని కోరుతూ ఈసీ నిర్దేశించిన రూ.5,66,400 రుసుము చెల్లించారు. నగరంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్లలోని సింబల్ స్లిప్లతో సరిచూడాలని ఫిర్యాదులో కోరారు. పరిశీలనకు 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతో ఈసీ ఈవీఎంల చెకింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బాలినేని కోరిన విధంగా కాకుండా పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను డిలీట్ చేసి, కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే చెక్ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు కొత్తగా వచ్చినపుడు ఫస్ట్లెవల్ చెకింగ్, కమిషన్ చెకింగ్ చివరికి పోలింగ్ రోజు కూడా అన్నీ పార్టీల ఏజెంట్ల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహిస్తారని మరళా ఇప్పుడు మాక్పోలింగ్ నిర్వహించడం అర్థం లేదన్నారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్లతో సరిచేస్తే సందేహాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. అయితే కలెక్టర్ ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు ఈవీఎంల చెకింగ్ మాత్రమే చేస్తామని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే జిల్లా అధికారులు మాక్ పోలింగ్కు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్దకు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. మాక్పోలింగ్ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని బాలినేని తరఫున హాజరైన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాక్పోలింగ్ను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీం తీర్పు ఏం చెబుతోందంటే...ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్ల్లో ఉన్న స్లిప్లతో సరిపోల్చాలని ఎన్నికల్లో పోటీ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈసీని కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 శాతం ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఎన్నికల సంఘం అధికారులు గాలికొదిలేశారు. అభ్యర్థి కోరిన పోలింగ్ బూతుల్లో వినియోగించిన ఈవీఎం ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈవీఎంల అవకతవకలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను తొలగించి మాక్పోలింగ్ నిర్వహించి ఉంటే కోర్టు ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే అధికారులు ఏం చేసి ఉండేవారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాక్పోలింగ్ ప్రక్రియ ఎవరి మెప్పు కోసం నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాక్పోలింగ్ కాకుండా ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్లతో సరిచూడాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం, అధికారులు పోలింగ్ రోజు ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామనడంపై బాలినేని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఓట్లను తొలగిస్తే నిజాలు నిగ్గు తేలేది ఎలా..?ఎన్నికల సంఘం, అధికారులు ఈవీఎంల్లో అవకతవకలు ఉన్నాయని వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలను పరిశీలించాల్సిందిపోయి ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు ఓట్లను ఈవీఎంల్లో తొలగిస్తామని, ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు కేవలం డమ్మీ బ్యాలెట్తో యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తామనడంలో అర్థంలేదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ తప్పులు జరగకుంటే పోలైన రోజు ఈవీఎం ఓట్లను, వీవీ ప్యాట్లోని స్లిప్లతో పరిశీలించవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బెడిసికొట్టిన ‘మాక్’ నాటకం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి, అమరావతి: ఈవీఎంలపై సర్వత్రా నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా ‘సుప్రీం’ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ మాక్ పోలింగ్తో మభ్యపుచ్చేందుకు చేసిన యత్నాలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచి పోయింది. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే అనుమానాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లో 12 కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్లను పరిశీలించటానికి బదులుగా డమ్మీ బ్యాలెట్తో కేవలం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్కు నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈసీ నుంచి తిరుగు సమాధానం రాలేదు. కాగా, ఎన్నికల సంఘం ఎస్ఓపీ ప్రకారం మాక్ పోలింగ్కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దేనని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ఆయన ఈసీని కోరారు.పూర్తి వివరాలు ఇవ్వండిసుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్ఓపీ)పై పూర్తి వివరాలు తమ ముందుంచాలని సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా : బాలినేని
ప్రకాశం,సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం.. అభ్యర్ధుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. హైర్టులో న్యాయం జరక్కపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈసీని ఫలితాల్ని రీ వెరిఫికేషన్ చేయాలని కోరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కేవలం మాక్ పోలింగ్ చేస్తుండడంతో అభ్యంతరం చెప్పామని అన్నారు. ఈవీఎంల్లో అవకతవకలు.. ఈసీకి బాలినేని ఫిర్యాదుసార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించేందుకు ఈసీ అధికారులు కేంద్రానికి తరలి వచ్చాయి. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. -
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది.