rhea chakraborty
-
సుశాంత్ కేసు.. సుప్రీంకోర్టులో రియా చక్రవర్తికి ఊరట
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటితోపాటు ఆమె కుటుంబంపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్ను (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఈమేరకు బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన సీబీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.ఈ సందర్భంగా సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ అనవసరమైనదని పేర్కొంది. ‘నిందితుల్లో ఒకరు సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తి అయినందున మీరు ఈ పనికిరాని పిటిషన్ వేశారు. మేము మిమ్మల్నిహెచ్చరిస్తున్నాం. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు( సుశాంత్, రియా) సమాజంలో పేరు కలిగిన వారు.’ అని పేర్కొంది.ఇదిలా ఉండగా నటుడు సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అది ఆత్మహత్య కాదని, సుశాంత్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పాట్నాలో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ కేసును సీబీఐకి విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలో ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ తీర్పు వెలువడింది. -
నేను జైల్లో ఉన్నప్పుడు నా పేరెంట్స్ లావయ్యారు: నటి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత అతడి ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టయింది. 28 రోజులపాటు జైలు జీవితం గడిపింది. తన సోదరుడు షోవిక్ కూడా జైలు శిక్ష అనుభవించాడు. అయితే బయటకు వచ్చాక కూడా తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే తను నాలుగు గోడల మధ్య నరకయాతన అనుభవిస్తుంటే తన కుటుంబం, స్నేహితులు మాత్రం బాగా తిని లావయ్యారంటోంది.బయటకు వచ్చేసరికి..తాజాగా రియా చక్రవర్తి మాట్లాడుతూ.. నేను ఇంటికి దూరమైనప్పుడు ఫ్రెండ్సే నా పేరెంట్స్ను దగ్గరుండి చూసుకున్నారు. నాన్నతో కలిసి రోజూ తాగేవారు, తినేవారు. నేను బయటకు వచ్చాక.. ఏంటి? ఇంత లావయ్యారు? అని ఆశ్చర్యపోయాను. నేను జైల్లో ఉంటే మీరు బాగా తిని బరువెక్కారా? అని నిలదీశాను.ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా..అందుకు వాళ్లు.. లేదు, ఆంటీ, అంకుల్ను బాధ నుంచి బయటపడేసేందుకు వాళ్లతో కలిసి తాగాం, తిన్నాం అని చెప్పారు. నా ఫ్రెండ్సే నాకు రక్షణకవచాల్లా నిలబడ్డారు. అంత మంచి స్నేహితులు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా శిబానీ దండేకర్ మాత్రం నావైపే నిలబడింది అని చెప్పుకొచ్చింది.బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సినిమాల్లేవుగా సంపాదన ఎలా? హీరో సుశాంత్ ప్రేయసి సమాధానమిదే!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్కాస్ట్లో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్కి కూడా!)'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్) -
సినిమాల కంటే ఒక్క కాంట్రవర్సీతో ఫేమస్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
అనుపమ అలాంటి పోజులు.. మరింత హాట్గా బాలీవుడ్ భామ!
హాట్ లుక్స్లో జియా శంకర్ హోయలు.. బ్లూ శారీలో టిల్లు స్క్వేర్ భామ అనుపమ.. వైజాగ్లో శ్రద్దాదాస్ అలాంటి లుక్స్.. బాలీవుడ్ భామ రియా చక్రవర్తి హాట్ పోజులు.. బర్త్ డే ముద్దుగుమ్మ రష్మిక అలాంటి వీడియో.. View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) -
Rhea Chakraborty Saree Photos: సారీలో కవ్విస్తూ, కాక పుట్టిస్తున్న ఈ బ్యూటీని చూశారా?
-
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్ మరణం.. ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు: నటి
నటుడు సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ను కుదిపేసింది. ఇది ఆత్మహత్య కాదని అనుమానాలు వ్యక్తం కావడం, డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మెడకు ఈ కేసు చుట్టుకుంది. పోలీసులు రియాతో పాటు ఆమె సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జైలు జీవితం గడిపిన ఈ నటి కొన్ని వారాల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్తున్నా ఆమెపై వ్యతిరేకత మాత్రం పోవడం లేదు. ట్రోలింగ్ దాదాపు తగ్గింది.. కానీ.. అంతేకాదు, తన కెరీర్ సైతం దెబ్బతిందని, ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'భయం, ట్రోలింగ్.. ఇలా చాలా ఫేస్ చేశాను. పరిస్థితి కొంత సద్దుమణిగింది. త్వరలోనే వాతావరణం అంతా మామూలైపోతుందనుకుంటున్నాను. ముఖ్యంగా ట్రోలింగ్ అయితే చాలావరకు తగ్గిపోయింది. గతంలో అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను. నాకు ఛాన్సులు ఇవ్వడానికి భయపడుతున్నారు ఆ స్థాయిలో నాపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో నా స్నేహితులు, కుటుంబం ఇచ్చిన అండదండల వల్లే బలం కూడగట్టుకుని నిలబడ్డాను. కానీ నాకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. నన్ను సినిమాలోకి తీసుకునేందుకు భయపడుతున్నారు' అని బాధపడింది. కాగా రియా చక్రవర్తి 2021లో వచ్చిన చెహర్ సినిమాతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత బుల్లితెరపై ప్రసారమైన ఎమ్టీవీ రోడీస్: కరమ్ యా ఖాంద్ అనే రియాలిటీ షోలో గ్యాంగ్ లీడర్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: నెలసరి ఆలస్యం.. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్కు ప్రెగ్నెన్సీ టెస్ట్ -
సుశాంత్ మానసిక స్థితి గురించి నిజాలు తెలుసు: రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే అతని మరణంపై ప్రియురాలైన రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఎన్సీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడిని అరెస్టు చేసింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన రియా.. సుశాంత్ గర్ల్ఫ్రెండ్గా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చిన రియా.. తన కెరీర్తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సుశాంత్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ముంబయిలో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించా: స్టార్ హీరోయిన్) రియా మాట్లాడుతూ.. 'సుశాంత్ మానసిక ఆరోగ్య సమస్యల గురించి తనకు బాగా తెలుసు. తను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నాకు తెలుసు. సుశాంత్ జీవితంలోకి తాను వచ్చినప్పటి నుంచి లైఫ్ మారిపోయింది. అతను అంతకుముందే బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి బాలీవుడ్లో పెద్ద స్టార్గా ఎదిగాడు. అందువల్ల అతన్ని నియంత్రించే మనస్సు కాదని చెప్పుకొచ్చింది. సుశాంత్కు డ్రగ్స్ సరఫరా చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో.. ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని చెప్పింది. ముంబైలోని బాంద్రా నివాసంలో 2020 జూన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది. -
Rhea Chakraborty-Nikhil Kamath: ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ ప్రేయసి.. అతడెవరో తెలుసా?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించినప్పుడు బాలీవుడ్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెపోబ్యాచ్ సుశాంత్ను సైడ్ చేయడం వల్లే అతడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆక్రందన చెందారు. నటుడిది ఆత్మహత్య కాదని.. సినిమా ఇండస్ట్రీనే హత్య చేసిందని ఆరోపించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా అతడి మరణానికి కారణమంటూ ఆరోపణలు సైతం వెలువడ్డాయి. అటు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే! ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా జైలు శిక్ష సైతం అనుభవించింది. ఈ విమర్శలు, తీవ్రమైన నెగెటివిటీ, ఆరోపణలు, కోర్టు కేసుల ఫలితంగా రియా చక్రవర్తికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలవుతున్న ఆమె తాజాగా ప్రేమలో పడిందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని రెడ్డిట్లో ఓ రూమర్ వైరలవుతోంది. రియా ప్రేమలో పడిదంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ విరాట్ కోహ్లి మేనేజర్ బంటీ సాజ్దేతో ప్రేమలో పడిందని వార్తలు రాగా అవన్నీ వట్టి పుకారుగానే తేలిపోయింది. మరి ఇప్పుడు నిఖిల్ కామత్తో ప్రేమాయణంలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ మాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
డ్రగ్స్ కేసులో హీరోయిన్కు బిగ్ రిలీఫ్
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!) రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది. అప్పట్లో జరిగింది ఇదీ 2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ చార్జీషీట్లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్పై విడుదల అయింది. (ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్) -
ఆమెకు దూరంగా ఉండాలంటూ సోనూసూద్కు సలహాలిస్తున్న ఫ్యాన్స్
కరోనా సమయంలో లాక్డౌన్ నుంచి ఇప్పటివరకూ ఎంతోమందికి అపన్నహస్తం అందించి రియల్ హీరోగా సమాజానికి స్ఫూర్తినిచ్చారు నటుడు సోనూసూద్. పలు సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోషల్మీడియా వేదికగా అందుబాటులో ఉంటూ తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు. దీంతో ఆయనను అభిమానించే వారిలో ఎక్కువగా యూత్నే ఉంటారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ) ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ 'MTV రోడీస్ సీజన్ 19' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే ప్రాజెక్ట్లో నటి రియా చక్రవర్తి కూడా ఉన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతోంది. అక్కడ సెట్లో ఉన్న వారి కోసం సోనూసూద్ దోశెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోశె కావాలో అడిగి మరీ సోనూ వడ్డించారు. ఇదే సమయంలో నటి రియా చక్రవర్తి కూడా అక్కడికి రాగా... 'మీకు ఎలాంటి దోశె కావాలి' అని అడిగి ఆమె కోరుకున్నట్లు టిఫిన్ సిద్ధం చేసి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోనూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ఆయన అభిమానులు... 'మీరు అంటే మాకు ఎంతో గౌరవం.. అది ఎప్పటికీ కొనసాగుతుంది.. ఈ చర్యతో మీపై మరెంతో గౌరవం పెరుగుతుంది' అని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) కానీ.. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యువ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రియా చక్రవర్తికి దూరంగా ఉండాలని ఇలా సోనూను కోరారు. 'మీరు ఆమెకు దోశెలు చేసి పెట్టడం మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ... తమ అసహనాన్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కోంతకాలం పాటు రియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వారు సోనూసూద్కు ఈ సలహా ఇచ్చారు. -
మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్ సోదరి సంచలన ఆరోపణలు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. ప్రియాంక ట్వీట్లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी! प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है? कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है। WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023 -
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
దేవకన్యలా మలైకా.. రాయల్ లుక్లో శ్రీదేవి కూతురు జాన్వీ
సోషల్ హల్చల్ : తారల మెరుపులు ► పింక్ డ్రెస్లో అనుపమ క్యూట్ లుక్స్ ► షూటింగ్లో స్టిల్స్ ఇచ్చిన శ్రుతి హాసన్ ► జిమ్ సూట్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ► కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి.. ఘనంగా గృహప్రవేశం ► వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న మలైకా అరోరా ► సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్ గ్లామరస్ ఫోటోలు ► రాయల్ లుక్లో మెరిసిపోతున్న శ్రీదేశి కూతురు జాన్వీ ► రష్మిక మందన్నా హాట్ లుక్స్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్కి రియా కౌంటర్
రియా చక్రవర్తి.. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా తెరపై కంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో ఈమే పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్ ప్రియురాలైన రియా అతడి మృతి, డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తిగా మారింది. 2020లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసు విచారణ చేప్పట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రీసెంట్గా ఆమెపై చార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆమె ప్రధాన కారణమని, అతడికి డ్రగ్స్ కొని తెచ్చిందని ఎన్సీబీ పేర్కొంది. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ఇప్పిటికే రియాపై పీకలదాకా కోపంతో ఉన్న సుశాంత్ కుటుంబ సభ్యులు ఎన్సీబీ చార్జిషీట్ అనంతరం గుప్పుమన్నారు. పలు సందర్భాల్లో రియాపై మాటల దాడికి దిగిన సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తాజాగా ఆమెను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘2019లో అన్నయ్య(సుశాంత్ సింగ్) జీవితంలోకి రియా వచ్చినప్పుడే మా జీవితాలు నాశనమయ్యాయి. సుశాంత్కు క్లబ్లు, పార్టీలు అలవాటు లేదు. అందుకే అందుకే బాలీవుడ్ పెద్దలు కొందరు రియాను నియమించి సుశాంత్ను అలా తయారు చేశారు’ అంటూ మండిపడింది. ఇక ఆమె కామెంట్స్పై రియా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొట్ను షేర్ చేసింది. చదవండి: యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం ‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదుగు. నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకొలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో ఉండాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టింది. కాగా రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు మరో 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ తమ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జీషీట్లో వెల్లడించింది. -
షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?
2020లో కలకలం రేపిన దివంగ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డ్రగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్ కోనుగోలు చేసి సుశాంత్కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ తాజాగా నేషనల్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జిషీట్లో వెల్లడించింది. చదవండి: అతియా, రాహుల్ పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన సునీల్ శెట్టి రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు ఆమె ఎవరెవరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిందో వారిని కూడా ఎన్సీబీ నిందితులు పేర్కొంది. ఇక కోర్టులో ఎన్సీబీ చార్జిషీట్లో చేసిన అభియోగాలు రుజువైతే మాదక ద్రవ్వాల నిరోధక చట్టం కింద రియాకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్సీబీ తమ చార్జీషీట్లో.. రియా, ఆమె సోదరుడుతో పాటు ఇతర నిందితలంత మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 మధ్య బాలీవుడ్లో డ్రగ్స్ పంపిణీ చేయడానికి, విక్రయించేందుకు ఒక గ్రూప్గా ఏర్పడి డ్రగ్స్ సప్లై చేశారు. చదవండి: డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్కి మధ్య మనస్పర్థలు,నిలిచిపోయిన షారుక్ మూవీ! నిందితులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రావాణకు ఆర్థికంగా సహాయం చేశారని, గంజాయి, చరస్, కొకైన్తో పాటు ఇతర మాదకద్రవ్యాలు సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించారని ఎన్సీబీ పేర్కొంది. రియా సోదరుడు సోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు సరఫర చేసే ముఠా తరచూ సంప్రదింపులు చేశాడని తెలిపింది గంజాయి, చరస్ ఆర్డర్ చేసిన అనంతరం ఇతర నిందితుల నుంచి దాన్ని పొందేవాడని, ఎన్డిపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులను విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి విజి రఘువంశీ ఈ కేసు విచారణను జూలై 27కువ వాయిదా వేశారు. కాగా ఈ కేసులో రియా 2020 సెప్టెంబర్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆమె బెయిలుపై బయటకు వచ్చింది. -
చివరికి ఆమె ఎలా బతకాలో నేర్చుకుంది.. హీరోయిన్ పోస్ట్
Rhea Chakraborty Said She Learnt How To Live In Present: బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సాధారణ స్థితికి రావడానికి ఒక్కో అడుగు వేస్తోంది. 2020 సంవత్సరంలో ఆమె బాయ్ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ 34 ఏళ్ల వయసులో మరణించడంతో రియా పలు ఆరోపణలు ఎదుర్కొంది. సుశాంత్ మరణించిన సుమారు రెండేళ్ల తర్వాత ప్రియుడు జ్ఞాపకాలనుంచి బయటకు వచ్చేందుక ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ షిబానీ దండేకర్ వివాహానికి హాజరైంది. ఈ పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమంలో దిగిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలో రియా ఎల్లో లెహెంగాలో అందంగా కనిపించింది. ఈ ఫొటో షేర్ చేస్తూ 'ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట.. చివరికీ ఆమె ఎలా జీవించాలోనేర్చుకుంది.' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది రియా. ఇక పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో సుశాంత్, రియా అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంతో అందంగా ఉన్నావ్ అని ఒకరు, లవ్లీ అంటూ మరొకరు రియాను పొగుడుతున్నారు. కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం సుశాంత్ మరణాన్ని గుర్తు చేస్తూ విమర్శలు కూడా చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్పుత్.. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీవీ సీరియల్స్లో ప్రారంభమైన అతని కెరీర్ ఆ తర్వాత స్టార్ హీరో రేంజ్కు ఎదిగింది. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యాడు. స్టార్ స్టేటస్తో కేరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు. సుశాంత్ మనకు దూరమై రెండేళ్లయినా ఇంకా అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(శుక్రవారం) సుశాంత్ 36వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సుశాంత్కు నివాళులు అర్పిస్తున్నారు. సుశాంత్ మరణించే సమయంలో ప్రియురాలుగా ఉన్న రియా చక్రవర్తి సైతం సుశాంత్కు బర్త్డే విషెస్ తెలుపుతూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్లో ఇద్దరూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్తో కలిసి దిగిన ఓ ఫోటోను సైతం ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం రియా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
అమ్మాయిలు ఆ ట్రాప్లో పడకండి.. అదొక మాయ
Rhea Chakraborty Warns Girls Do Not Fall Into The Instagram Trap: అమ్మాయిలు అందంగా ఉండేందుకు అనేక దారులు వెతుకుతారు. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం అందంగా ఉండటానికి బదులు కనపడేందుకే ఆసక్తి చూపుతుంటారు. అలాగే బ్యూటిఫుల్గా కనిపించే ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బెస్టీలు ఎవరైనా తాము బాగా కనిపించని పిక్స్ అప్లోడ్ చేస్తే కాల్ చేసి మరి వారిపై విరుచుకుపడతారు. అందుకే ఇలాంటి వారికోసం బ్యూటీ ఫిల్టర్లు అందిస్తున్నాయి కొన్ని యాప్స్. వివిధ రకాల ఫిల్టర్స్ వాడి ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటారు. కానీ అది వారి నిజమైన సోయగం అని మాత్రం ఆలోచించరు. ఇలాంటి వారికోసమే బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. ఇటీవల ఆసక్తికరమైన సంభాషణలు, స్ఫూర్తిదాయకమైన పోస్ట్లతో సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటోంది రియా. తాజాగా ఇన్స్టా గ్రామ్లో ఫిల్టర్లు వాడే అమ్మాయిలకు జాగ్రత్తలు చెబుతోంది. ఇన్స్టా గ్రామ్ బ్యూటీ ఫిల్టర్ల వలలో పడకండి అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో 'అమ్మాయిలందరికీ ఒక చిన్న విన్నపం. మీరు ఇన్స్టా బ్యూటీ ఫిల్టర్ల ట్రాప్లో పడకండి. అదొక మాయ. మీరు ఎలా ఉన్నారో అదే మీ అందం. ఈ మధ్య మీరు ఈ ఇన్స్టా బ్యూటీ, ఫిల్టర్ల గురించి ఎలా ఫీల్ అవుతున్నారని నన్ను అడుగుతున్నారు. వారందరికీ నెను చెప్పేది ఒక్కటే. మీకు మీరుగా ఉండటమే నిజమైన అందం.' అని తెలిపింది రియా. ఇదీ చదవండి: ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి -
ఇలా మారడం అంతా సులభం కాదు: రియా చక్రవర్తి
Rhea Chakraborty's Post Its Not Been Easy To Get Here About 2021 Year: 2021 సంవత్సరానికి బై బై చెబుతూ 2022 న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వారికి ఈ ఏడాది ఎలా గడిచిందో అభిమానులతో పంచుకుంటున్నారు. కష్టం నుంచి చిరునవ్వు వరకు అంటూ ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రియురాలు హీరోయిన్ రియా చక్రవర్తి 2021 ఇయర్ తనకు ఎలా గడిచిందో చెప్పుకొచ్చింది. ఈ ఏడాదిని బాధ, దాన్ని నయం చేసిన సంవత్సరంగా తెలుపుతూ అందమైన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్లో 'నేను నవ్వడం నువ్ చూశావ్. కానీ ఇక్కడికి రావడం (ఇలా మారడం) అంత సులభం కాదు. బాధ, బాధను నయం చేసుకునేందుకు ఈ ఏడాది మొత్తం గడిచింది. కానీ ఇప్పుడు నేను నిన్ను (2021) నవ్వుతూ చూస్తున్నాను. ఎందుకంటే నిన్ను కష్టపెట్టనిది ఏది నిన్నుస్ట్రాంగ్గా మార్చలేదు. మీ ప్రియమైన వారితో ఈ 2022 సంవత్సరాన్ని జరుపుకోండి. 2022 మనందరిపై దయ, ప్రేమతో ఉండాలి.' అని రియా పేర్కొంది. 2020లో సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు రియా ప్రేరేపించిందన్న ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) ఇదీ చదవండి: చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్ -
రియా చక్రవర్తి పోస్ట్.. 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అంటూ హ్యాష్ట్యాగ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ ఇప్పుడు, ఆమె తరచుగా ఇన్స్టాగ్రామ్లో అద్భుతమైన సందేశాలను పంచుకుంటుంది. ఇటీవల, నటి జీవితం గురించి ఒక విషయాన్ని షేర్ చేసింది. రియా చక్రవర్తి తన ఇన్స్టా గ్రామ్లో 'నవ్వుతూ ఉండు.. ఎందుకంటే ఇప్పుడున్నదే జీవితం' అంటూ నవంబర్ 16న స్టోరీ షేర్ చేసింది. అలాగే దానికి 'ఇట్స్ ఓకే టు నాట్ బీ ఓకే' అని ఒక హ్యాష్ట్యాగ్ను ఇచ్చింది. సెండింగ్ యూ లవ్ అంటూ అని కూడా రాసి లవ్ ఎమోజీని పెట్టి స్టోరీని ముగించింది. జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మొదటి వర్ధంతి సందర్భంగా సుశాంత్తో ఉన్న చిత్రాన్ని షేర్ చేసింది రియా. ఆ పోస్ట్లో 'నువ్వు ఇక్కడ లేవని నేను నమ్మే క్షణం కూడా లేదు. సమయం అన్నింటిని నయం చేస్తుందని అంటారు. కానీ నా సమయం, నా సర్వస్వం అన్ని నువ్వే. అవును నువ్ ఇప్పుడు నన్ను కాపాడే సంరంక్షకుడివి అని నాకు తెలుసు. చంద్రుని నుంచి టెలిస్కోప్తో నన్ను చూస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు.' ఇలా ప్రేమగా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
ముంబై స్పెషల్ కోర్టులో రియాకు ఊరట
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్టులో ఊరట లభించింది. సుమారు 14 నెలల నుంచి సీజ్లో ఉన్న ఆమె బ్యాంక్ ఖాతాలను తిరిగి ఉపయోగించుకోవడానికి న్యాయస్థానం ఆమోదం తెలిపింది. సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న రియా గతేడాది సెప్టెంబర్లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆమె బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అంతేగాక ఆమె ల్యాప్టాప్, సెల్ఫోన్లను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం బెయిల్పై బయటకు వచ్చిన రియా.. తన బ్యాంక్ ఖాతాలను తిరిగి తన విడుదల చేయాలని స్పెషల్ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలే చేస్తూ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ నిమిత్తం తన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదల చేయాలని పటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వాదోపవాదాలు విన్న తర్వాత.. రియా బ్యాంక్ ఖాతాలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ల్యాప్టాప్, సెల్ఫోన్ని సైతం తిరిగి ఆమెకే ఇచ్చేయమని తీర్పులో పేర్కొంది. విచారణ పూర్తి అయ్యే వరకూ సెల్, ల్యాప్టాప్లను విక్రయించవద్దని కోర్టు రియాను ఆదేశించింది. -
అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి
Bigg Boss 15: టీవీ షోస్ బిగ్బాస్ షోకి ఉన్న పాపులారిటీ తెలిసిందే. అలాంటి షో పార్టిసీపేట్ చేసే అవకాశం వచ్చిందంటే ఎవరైన ఎగిరిగంతేస్తారు. అయితే ఇటీవల బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బిగ్బాస్ 15 పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరిగింది. దానికి షో యాజమాన్యం వారానికి దాదాపు 35 లక్షల ఆఫర్ చేసిన వార్తలు హల్చల్ చేశాయి. వాటి గురించి నటి తాజాగా సోషల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. ‘నేను బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొంటున్నట్లు పుకార్లు వస్తున్నాయని విన్నాను. ఆ రూమర్స్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఇది పెడుతున్నా. బిగ్బాస్లో నేను పార్టిసీపేట్ చేయట్లేదు’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రియా తెలిపింది. దీంతో ఒక్కసారిగా ప్రచారాలన్ని పటాపంచలైపోయినట్లైంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ షోలు, సినిమాలు చేస్తూ బాలీవుడ్ కెరీర్పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: గుండె బద్దలవుతోంది: బాలీవుడ్ హీరోయిన్ -
బిగ్బాస్లోకి సుశాంత్ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా..
Rhea Chakraborty Offered For Bigg Boss 15: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది నటి రియా చక్రవర్తి. సుశాంత్ మరణానికి రియానే కారణం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటారు. బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది. అనంతరం బెయిల్పై విడుదలైన రియా ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హోస్ట్గా త్వరలోనే హిందీ బిగ్బాస్ సీజన్15 ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు రియాను సంప్రదించారట. ఇందుకోసం ఆమెకు వారానికి రూ.35లక్షల రూపాయలు అంటే కేవలం ఒక్క రోజుకే రూ. 5లక్షల రూపాయలను ఆఫర్ చేశారట షో నిర్వాహకులు. సుశాంత్ మరణంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రియా బిగ్బాస్ హౌస్లోకి వస్తే టీఆర్పీ రేటింగులో ఓ రేంజ్లో ఉంటాయని, ఇందుకోసమే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు బీటౌన్ టాక్. అయితే ఇప్పటికే సుశాంత్ మృతితో అప్రతిష్ట మూటగట్టుకున్న రియా బిగ్బాస్లోకి వెళ్లే ధైర్యం చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ -
హృదయ విదారక దృశ్యాలు: బాలీవుడ్ హీరోయిన్ ఆవేదన
సాక్షి,ముంబై: అఫ్గనిస్తాన్లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. అఫ్గన్ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయవనరుగా మారిపోయి జీవన పోరాటం చేస్తున్నారన్నారు. అఫ్గన్ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్దల వుతోందని పేర్కిన్నారు. ఈ మేరకు సోమవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని రియా గ్లోబల్ నాయకులను కోరారు. "పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి...మహిళలు కూడా మనుషులే" అని వ్యాఖ్యానించారు. మరోవైపు అఫ్గన్లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులు స్పందించారు. ‘ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు’ అంటూ నటుడు కరణ్ టాకర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్ కపూర్ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ ప్రజలకోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో అఫ్గన్ నాశనం మైందని కపూర్ ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, రిచా చద్దా, అనురాగ్ కశ్యప్, సనమ్ పురి, హన్సల్ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL — ian bremmer (@ianbremmer) August 16, 2021 కాగా అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే అఫ్గన్ రాజధాని కాబూల్తోపాటు కీలక భూభాగాలను అధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో హృదయ విదారక దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపాయి. ముఖ్యంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయారు. కాబూల్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దీంతో బీతిల్లిన ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా తరలి రావడంతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజల కష్టాలు, విమాన చక్రాలను పట్టుకుని మరీ వేళ్లాడుతున్న దృశ్యాలు కలకలం రేపాయి. ముఖ్యంగా కదులుతున్న విమానాన్ని అందుకోవాలన్న ఆశతో రవ్వేపై వేలాదిగా పరుగులు పెడుతున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నేటికి ఏడాది గడుస్తోంది. 2020 జూన్ 14వ తేదిన బాంద్రాలోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సుశాంత్ ఈ ప్రపంచాన్ని వీడి ఏడాది పూర్తవడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, అందరూ నటుడిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా.. నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా.. సుశాంత్ మరణించే సమయంలో ఆయన ప్రియురాలిగా ఉన్న రియా చక్రవర్తి, సుశాంత్ను తలుచుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేసింది. సుశాంత్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నిన్ను తలచుకోని క్షణం లేదంటూ రాసుకొచ్చింది. ‘నువ్వు ఇక్కడ లేవనే నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. టైమ్ అన్నింటిని నయం చేస్తుందని విన్నాను. కానీ నువ్వే నా టైమ్. నా సర్వస్వం నువ్వే. నిన్ను తలచుకోని క్షణమంటూ లేదు. నువ్వు ఎక్కడున్న నన్ను అనుక్షణం చూస్తూ.. నన్ను ఎల్లప్పుడు రక్షిస్తుంటావు. నువ్వు నన్ను నీతోపాటే తీసుకెళ్తావని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను.. నీ కోసం ప్రతి చోట వెతుకుతున్నాను. నా వెంటే ఉన్నావని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు గుండె పగిలేలా చేస్తావు. నువ్వు సాధించావు బేబూ అని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురుచూస్తుంటాను” అని రియా చక్రవర్తి తన పోస్టులో రాసుకొచ్చింది. ‘నువ్వు నా పక్కన లేవనే విషయం నా గుండెలో ఎన్నో ఎమోషన్స్ రేకెత్తిస్తుంది. ఈ విషయం బయటకు చెప్పడానికి గుండె పగిపోయేంత బాధ నాలో ఉంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. జీవితం అనే అర్ధాన్ని నువ్వే తీసుకెళ్లావ్. ఈ శూన్యాన్ని ఎవరూ పూడ్చలేరు. నువ్వు లేకుండా ఒక్కదాన్నే నిల్చోని ఉన్నాను. నా స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురుచూస్తునే ఉంటాను. నేను మీకు ప్రతిరోజూ 'మాల్పువా' ఇస్తాను. ఈ ప్రపంచంలోని అన్ని క్వాంటం ఫిజిక్స్ పుస్తకాలను చదువుతానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నా వద్దకు తిరిగి వచ్చేయ్. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Viral Video: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
ద్రౌపదిగా కనిపించనున్న రియా చక్రవర్తి!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి తన సినిమాలపై దృష్టి సారించింది. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి నటించిన 'చెహ్రే' సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు బీటౌన్లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రియాను సంప్రదించారట. ఇందులో ఆమె ఆధునిక ద్రౌపదిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉందట. మరి ద్రౌపది పాత్ర చేయడానికి రియా అంగీకరించిందా? లేదా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. కాగా 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రియా.. బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ఫ్రెండ్, మేరే డాడ్ కీ మారుతి వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంలో గతేడాది రియా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ నటి ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడుతోంది. గత కొద్ది రోజులుగా మళ్లీ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల టైమ్స్ విడుదల చేసిన '50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020' జాబితాలోనూ రియా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: 'బాలీవుడ్లో ఛాన్సులు లేక టాలీవుడ్ వైపు చూస్తున్న రియా' -
నేను సారా అలి ఖాన్ కలిసి గంజాయ్ పీల్చాం: రియా
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి ఏడాది కావొస్తున్న ఇప్పటికి ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. అతడి మరణంతో బీ-టౌన్ డ్రగ్ వ్యవహరం బట్టబయలైంది. అలా సుశాంత్ సింగ్ కేసులో ఇప్పుడు ఎన్సీబీ, సీఐడీ ఇలా అనేక విభాగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. దీంతో ఏడాది నుంచి ఈ కేసు ఎన్నో మలుపు తిరుగుతూ వస్తోంది. ఇక ఎన్సీబీ కేసు విచారణ, దర్యాప్తు అంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాగా ఈ కేసులో అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్కు అత్యధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చిందని, ఆమెకు డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉందని నిర్ధారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్సీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించింది. రియాతో పాటు ఆమె సోదరుడు, మరికొంతమందికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం ఈ ఇద్దరికి బెయిల్ మంజూరైంది. అలా బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు సైలెంట్గానే ఉన్నా.. తాజాగా ఎన్సీబీ విచారణలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్ సోదరి ప్రియాంక, ఆమె భర్త ఇద్దరూ కూడా డ్రగ్స్ వాడేవారని, సుశాంత్ డ్రగ్స్ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలుసని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేగాక సుశాంత్ చనిపోయే ముందు అంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ సోదరి ప్రియాంక డ్రగ్స్ కావాలని వాట్సప్ మెసేజ్ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్ చేసినట్లు తెలిపింది. అంతేగాక నటి సారా అలీ ఖాన్ కూడా ఇందులో భాగమైనట్లు వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ల కూతురైన సారా తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, పలుమార్లు, సారా తనకు గంజాయితో పాటు వోడ్కాను కూడా ఆఫర్ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో వెల్లడించింది. మరో వారంలో సుశాంత్ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా గతేడాది జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నన్ను నమ్మి తీరాల్సిందే: రియా చక్రవర్తి
సుశాంత్ సింగ్ రాజ్పుత్.. నింగికేగిన ఈ నటుడిని అభిమానులు తల్చుకోని రోజంటూ ఉండదు. సైన్స్ గురించి మాట్లాడినా, స్పేస్(అంతరిక్షం) ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో ఎవరైనా అణిచివేతకు గురయ్యారన్నా.. ఫ్యాన్స్కు ముందు సుశాంత్ పేరే తడుతుంది. అతడు అభిమానులను ఒంటరివాళ్లను చేస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్లి జూన్ 14 నాటికి సంవత్సరం పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా అతడి ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుంది. ఈ విషయంలో మీరు నన్ను నమ్మి తీరాల్సిందే.. అక్కడే ఉండు, ప్రేమతో రియా..' అని రాసుకొచ్చింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ గతేడాది ముంబైలో బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో విచారణ చేపట్టిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) అధికారులు సుశాంత్ ప్రేయసి రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత రియా బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ ఈ డ్రగ్స్ కేసుకు బీటౌన్లో లింకులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో పాటు సెలబ్రిటీలు దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, ఫిరోజ్ నదియావాలా సహా పలువురి పేర్లు తెర మీదకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) చదవండి: రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు -
టాలీవుడ్లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలగులోకి వచ్చిన నటి రియా చక్రవర్తి ప్రస్తుతం కెరీర్పై దృష్టిపెట్టింది. సినిమాల్లో తిరిగి నటించేందుకు సిద్ధమయ్యింది. అయితే ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు. ఇండస్ర్టీలో తనకు బాగా తెలిసివాళ్లు ఉన్నా ఆమెకు అవకాశాలు ఇప్పించలేకపోతున్నారు. దీంతో రియా చూపు ఇప్పుడు తెలుగు సినిమాలపై పడింది. గతంలో తూనీగ తూనీగ సినిమాతో రియా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగా హీరో కళ్యాణ్దేవ్తోనూ ఓ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్కే మకాం మార్చింది. అక్కడ సుశాంత్ గర్ల్ఫ్రెండ్గా పాపులర్ అయిన రియా ఆ తర్వాత సుశాంత్ రికమండేషన్ వల్లే కొన్ని సినిమా ఆఫర్లను అందుకున్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాకుండా సుశాంత్ సినిమాలో తననే హీరోయిన్గా పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసేదని కూడా సమాచారం. ఆ తర్వాత సుశాంత్ హత్య, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చింది. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్లో ఆమె బెయిల్పై విడుదలయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందట. బాలీవుడ్ తలుపు తట్టినా ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ర్టీ వైపు ఆశగా చూస్తుందట. మరి రియాకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్ -
రియాకు బెయిల్!: సుప్రీంకోర్టుకు ఎన్సీబీ
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని మత్తు పదార్థాల నియంత్రణా సంస్థ (ఎన్సీబీ) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సీజేఐ బోబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఈ కేసును మార్చి 18న విచారించనుంది. రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబర్ 7న బెయిల్ ఇచ్చింది. రూ. లక్ష పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్పోర్టు అధికారులకు సమర్పించాలని, ముంబై దాటి వెళ్లాల్సి వస్తే ఎన్సీబీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందిగా పలు నిబంధనలు పెట్టింది. రానున్న ఆరు నెలల పాటు ప్రతినెల 1న పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీదే ఎన్సీబీ సుప్రీంకోర్టును చేరింది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ దొరకలేదు. చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు: రియా చక్రవర్తి -
దయచేసి నన్ను ఫాలో కావొద్దు
ముంబయి: బాలీవుడ్ నటి రియాచక్రవర్తి బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా చక్రవర్తి పూల బొకే కొనుగోలు చేసింది. రియా చక్రవర్తి కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. దింతో ఆమె వారిని దయచేసి నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.(చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. "అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా" అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్పుత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. -
భావోద్వేగం: సుశాంత్ రాసుకున్న లేఖ వైరల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి చెంది ఏడు నెలలు గడిచాయి. గతేడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడి మృతి కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ రాసుకున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన సోదరి శ్వేతా సింగ్ బుధవారం దీనిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘భాయ్ రాసుకున్న లేఖ.. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి’ అంటూ ఆమె పంచుకున్నారు. ‘నా జీవితంలో ఇప్పటికే 30 ఏళ్లు గడిపాను. ఈ మొదటి 30 ఏళ్లను ప్రత్యేకంగా మలుచుకునేందుకు చాలా ప్రయత్నించాను. ఇందుకోసం నా ప్రతి పనిలో మంచిగా ఉండాలని కోరుకున్నాను. అలాగే టెన్నిస్, స్కూల్, చదువు, ర్యాంక్స్లో మొదటి స్థానంలో ఉండాలనుకున్నాను. అయితే ప్రతి కోణాన్ని అలా చూడటం వల్ల నేను అసంతృప్తికి లోనయ్యేవాడిని. నాకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆట తప్పుగా ఆడానని గ్రహించాను. ఎందుకంటే నేనేంటో తెలుసుకోవడానికే ఆట ఉంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. సుశాంత్ జీవితంపై ఎన్నో ఆశలతో రాసుకున్న ఈ లేఖ చూసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా సుశాంత్ గతేడాది జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) అయితే తన కొడుకును ఆత్మహత్యకు ప్రేరెపించేలా నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలు ప్రవర్తించారని ఆరోపిస్తు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు అనంతరం ఈ కేసు విచారణకై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోకు ఇచ్చింది. ఈ క్రమంలో ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూడటంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్సీబీ అధికారులు సమన్లు అందజేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియాను పోలీసులు సెప్టెంబర్లో అరెస్టు చేసి జెలుగా తరలించగా ఇటీవలకామె బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) -
రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి గత నెల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె మీడియాకు ఎదురుపడలేదు. ఈ క్రమంలో ఇటీవల ఓ బర్త్డే పార్టీకి హాజరైన రియా ఫొటో నెట్టింటా హల్చల్ చేస్తోంది. రోడీస్ ఫేం రాజీవ్ లక్ష్మన్ కుమారుడి మొదటి బర్త్డే పార్టీకి ఇటీవల రియా హజరయ్యారు. ఈ సందర్భంగా రియాతో కలిసి సన్నిహితంగా దిగిన ఓ ఫొటోను రాజీవ్తో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘మై ఫ్రెండ్ ’అంటూ పోస్టు చేసిన ఈ ఫొటో రియా రాజీవ్ను హగ్ చేసుకుని కెమెరాకు నవ్వుతూ ఫొజ్ ఇచ్చారు. దీంతో అతనితో అత్యంత సన్నిహితంగా ఉండటమే కాక సంతోషంతో నవ్వుతూ కనిపించిన రియాపై నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో రాజీవ్ ఈ పోస్టును డిలీట్ చేశాడు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) దీంతో చాలా రోజుల తర్వాత రియా మళ్లీ వార్తల్లో నిలిచారు. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గతేడాది సెప్టెంబర్లో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్లో ఆమె బెయిల్పై విడుదలయ్యారు. ఇక బయటకు రాగానే కేరీర్పై దృష్టి పెట్టిన రియా తిరిగి సినిమాల్లో నటించనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రియా 2021 నుంచి షూటింగ్లో పాల్గొననున్నారని, ప్రస్తుతం ఆమె చేతిలో ‘సోనాలి కేబుల్’, ‘జలేబీ’, ‘మేరే డాడ్కి మారుతి’ వంటి ప్రాజెక్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) -
సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా పలువురు డ్రగ్ డీలర్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా.. ముంబైలోని అంధేరీ వెస్ట్లో సోదాలు నిర్వహించింది. సుమారు రెండున్నర కోట్ల విలువ గల 5 కిలోల హషిష్, ఆఫీం, ఎండీఎమ్ఏ(మాలి) తదితర డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. వీటిని సరఫరా చేస్తున్న రీగల్ మహాకల్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కాగా మహాకల్తో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు ఎన్సీబీ భావిస్తోంది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడిని పట్టుకోవడం ద్వారా కేసులో పురోగతి సాధించగలమని అధికారులు వెల్లడించారు.(చదవండి: షోవిక్ చక్రవర్తికి బెయిల్ మంజూరు) ఇక ఈ విషయం గురించి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేం రీగల్ మహాకల్ను అరెస్టు చేశాం. రియా చక్రవర్తి, షోవిక్తో అతడికి సంబంధాలు ఉన్న విషయాన్ని కొట్టిపారేయలేం’’ అని పేర్కొన్నారు. కాగా రీగల్, అనూజ్ కేశ్వానికి డ్రగ్స్ సరఫరా చేయగా, అతడి నుంచి రియా వాటిని కొనుగోలు చేసి సుశాంత్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో విగత జీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తనతో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కారణంగానే అతడు మరణించాడని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుశాంత్, రియా, వారి ఫ్లాట్లో నివసించే మరికొంత మందిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అనేక పరిణామాల అనంతరం అరెస్టైన రియా చక్రవర్తి తొలుత బెయిలుపై బయటకు రాగా, షోవిక్ కూడా ఇటీవలే జైలు నుంచి విముక్తి పొందాడు. (చదవండి: డ్రగ్స్ వాడొద్దని రియా చెప్పింది. అయినా) -
సుశాంత్ కేసు: రియా సోదరుడికి బెయిల్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా చక్రవర్తికి అక్టోబర్లో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తికి కూడా ముంబై స్పెషల్ కోర్టు బుధవారం బెయిల్ మంజురూ చేసింది. అయితే సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసులో రియా, ఆమె సోదరుడు సోవిక్, సుశాంత్ ఇంటి మెనేజర్ శామ్యూల్ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్ 4న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రియా, ఆమె సోదరుడు సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని వారు సుశాంత్కు డ్రగ్ కూడా సప్లై చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని ఎన్సీబీ అధికారులు వెల్లడించడంతో వారిని ముంబై హైకోర్టు జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో రియా, సోవిక్లు బెయిల్ కోరుతూ సెప్టంబర్ చివరి వారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) అయితే అక్టోబర్లో రియాకు బెయిల్ను మంజూరు చేసిన కోర్టు సోవిక్ బెయిల్ను రద్దు చేసింది. అనంతరం నవంబర్ మొదటి వారంలో సోవిక్ మళ్లీ బెయిల్ పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈసారి సోవిక్ బెయిల్ పిటిషన్ను విచారించిన ముంబై హైకోర్టు ఎన్సీబీ అధికారులు ఇచ్చిన సాక్ష్యాలు అమోధయోగ్యం లేవని సోవిక్కు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది జూన్ 14వ సుశాంత్ సింగ్ ముంబైని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు అతడి ప్రియురాలు రియాను అనుమానిస్తూ విచారణ చేపట్టగా డ్రగ్ కేసు వెలుగు చూసింది. దీంతో ముంబై పోలీసుల ఈ కేసు విచారణను ఎన్సీబీ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రియాను విచారించగా ఆమెకు, సోవిక్కు డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విచారణలో రియా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, అలియా భట్, రకుల్ ప్రీత్ సింగ్ల పేర్లను కూడా చెప్పడంతో ఎన్సీబీ వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్ఫోన్ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’
‘‘సుశాంత్ రాజ్పుత్ సింగ్ ముంబైలో ఐదుగురు డాక్టర్లను సంప్రదించాడు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారంతా అతడికి సూచించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఇలాంటి వ్యసనాలు వీడితే బాగుంటుందని చెప్పారు. రియా కూడా అతడికి ఇదే మాట చెప్పింది. డాక్టర్ల మాట వినమని సూచించింది. కానీ అతడు అందుకు తిరస్కరించాడు. సుశాంత్ తీరు రియాను అతడి ఇంటిని వీడేలా చేసింది. అతడి కోరిక మేరకే రియా ఈ పని చేసింది’’ అంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్పుత్ సింగ్ మృతికేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్లో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ క్రమంలో అతడి కుటుంబం, సుశాంత్ ప్రేయసి రియా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్పై రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక సూచించిన మందుల కారణంగానే అతడు మృతి చెందాడని, ఈ విషయంపై సీబీఐ కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని రియా కోరింది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంకతో పాటు ఆమె సోదరి మీతూ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసిన పోలీసులు, సుశాంత్ సోదరీమణుల పిటిషన్ను కొట్టివేయాల్సిందిగా కోరారు. (చదవండి: డ్రగ్స్ కేసు: ఎన్సీబీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు) అంతేగాకుండా రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకే వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల గురించి సతీశ్ మనేషిండే మాట్లాడుతూ.. ‘‘రియా చక్రవర్తి చెప్పిన అంశాల ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి వైద్యులను సంప్రదించకుండా, ప్రిస్కిప్షన్ను ఫోర్జరీ చేయడం చట్టవిరుద్ధం. ప్రియాంక తన సోదరుడికి సూచించిన మందుల విషయం గురించి జూన్8 నాటి మెసేజ్లలో స్పష్టంగా కనబడుతోంది. సుశాంత్ డ్రగ్స్కు బానిసగా మారాడని, డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాడని తెలిసి కూడా ఆ కుటుంబం ఇలా చేసింది’’అని ఆరోపణలు గుప్పించారు. -
సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి!
ముంబై: బాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంటి సహాయకుడు దీపేశ్ సావంత్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనను అక్రమంగా నిర్బందించారని, ఇందుకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసిన 36 గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించాడు. సెప్టెంబరు 5 రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారని, నిజానికి తనను అంతకుముందు రోజు రాత్రి పదింటికి అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) సెప్టెంబరు 6న తనను మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారని, తద్వారా సుప్రీంకోర్టు నిబంధనల(నిందితుడిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టాలి)ను తుంగలో తొక్కారంటూ దీపక్ సావంత్ ఆరోపణలు చేశాడు. కాగా ఈనెల 5వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. ఇక సుశాంత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తితో పాటు దీపక్ సావంత్ సహా పలువురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. దీపక్ సావంత్కు ఇటీవల బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్సింగ్ రాజ్పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్పై రూ.200 కోట్ల దావా -
పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది. మీడియా తన టీర్పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..? -
సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రియా చక్రవర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించిన మహిళ యూటర్న్ తీసుకున్నారు. సుశాంత్ మరణించే ముందు రోజు రియా చక్రవర్తి ఆయనను కలిశారని ఆరోపించిన రియా పొరుగింటి మహిళ సీబీఐ ముందు తన ఆరోపణలపై వెనక్కి తగ్గారు. దర్యాప్తు ఏజెన్సీ ఎదుట స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తప్పుడు సమాచారం ఇవ్వడంపై మహిళను సీబీఐ హెచ్చరించింది. మీడియా ఎదుట తప్పుడు ప్రకటనలు చేసే వారందరిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఇలాంటి వారితో కూడిన జాబితాను సీబీఐకి అందచేస్తామని రియా న్యాయవాది వెల్లడించారు. చదవండి : రియాకు బెయిల్ దర్యాప్తు ప్రక్రియను తప్పుదారిపట్టించిన వారిపై చర్యలు చేపట్టాలని సీబీఐని కోరతామని చెప్పారు. మరోవైపు ముంబై బైకుల్లా జైలులో దాదాపు నెలరోజులు గడిపిన రియా గత వారం బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ రాజ్పుత్ (34) ముంబైలోని బాంద్రా అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ముంబై పోలీసులు నిర్ధారించారు. ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం ఎయిమ్స్ వైద్యులు సైతం సుశాంత్ మరణం ఆత్మహత్యేనని ధ్రువీకరించారు. -
రియాకు బెయిల్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకి సంబంధించిన డ్రగ్స్ కేసులో నటి రియాచక్రవర్తికి ముంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. 28 రోజుల జైలు జీవితం తరువాత, రియా చక్రవర్తి బైక్యులా మహిళా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. రూ.1లక్ష వ్యక్తిగత బాండు, ప్రతిరోజూ పోలీస్ స్టేషన్లో సంతకం చేయడం, ఆరు నెలల పాటు, ప్రతినెలా ఒకటవ తారీకున ఎన్సీబీ ముందు హాజరుకావడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేయరాదని హైకోర్టు షరతులు విధించింది. రియా ఎన్సీబీ అనుమతి లేకుండా, ముంబై వీడి వెళ్ళరాదని, విదేశాలకు వెళ్ళాలనుకుంటే స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు షరతులు విధించింది. రియాకు నేర చరిత్ర లేదని, కనుక రియా సాక్ష్యాలను తారుమారు చేస్తారని తాము భావించడం లేదని బెయిలు ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలకీ, రోల్ మోడల్స్కీ ప్రత్యేక హక్కులేవీ ఉండవని హైకోర్టు వ్యాఖ్యానించింది. రియా విడుదల సందర్భంగా, మీడియా ఆమె వెంటబడటం, ఆమె వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించడం సహించబోమని ముంబై పోలీసులు మీడియాని హెచ్చరించారు. రాజ్పుత్ వ్యక్తిగత సహాయకులు దీపేష్ సావంత్, సామ్యూల్ మిరిండాలకు హైకోర్ట్ బెయిలు మంజూరు చేసింది. రియా సోదరుడు షోవిక్, డ్రగ్ స్మగ్లర్ అబ్దెల్ బాసిత్ పరిహార్లకు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. -
జైలు నుంచి రియా విడుదల.. ఫోటోలు వైరల్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ మేరకు నేడు(బుధవారం) విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ లభించలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను బోంబే హైకోర్టు కొట్టి వేసింది. చదవండి: రియాకు బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్ ఎట్టకేలకు రియాకు బెయిల్ లభించడంతో 28 రోజుల తర్వాత ముంబైలోని బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చారు. దీనికి సబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఈ విషయంపై డీసీపీ సంగ్రాంసింగ్ నిషందర్ మాట్లాడుతూ.. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఎవరైన ఆమె వాహనాన్ని వెంబడించడం, అడ్డుకోవడం వంటివి చేస్తే కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియాతో సహా వెంబండించిన వారే కాకుండా ఇలాంటి చర్యలకు ప్రేరేపించిన వారిపై కూడా ఎంవీ చట్టం ప్రకారం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. చదవండి: రియా బెయిల్: బాలీవుడ్ నటుల స్పందన Mumbai: Actor Rhea Chakraborty released from Byculla jail after a month. She was granted bail by Bombay High Court in a drug-related case filed against her by Narcotics Control Bureau (NCB) pic.twitter.com/FlfP1re1cQ — ANI (@ANI) October 7, 2020 కాగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హై కోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్పోర్ట్ని సమర్పించాల్సిందిగా చెప్పింది. కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని.. ఒకవేళ గ్రేటర్ ముంబై దాటి వెళ్లాల్సి వస్తే.. కేసు విచారణ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని షరతులు విధించింది. ప్రతీ పది రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది. రియాకు ఊరట.. షోవిక్కు షాక్! -
రియా బెయిల్: బాలీవుడ్ నటుల స్పందన
ముంబై : నటుడు సుశాంత్ మరణంతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రక్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తికి నేడు(బుధవారం) బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని బైకుల్లా జైలులో నెల రోజుల పాటు ఉన్న రియాకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు ఆమెకు పలు షరతులు విధించింది. రియాను దేశం వదిలి వెళ్లరాదని స్పష్టంచేస్తూ ఆమె పాస్పోర్ట్ని సమర్పించాల్సిందిగా చెప్పింది. అయితే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ని తిరస్కరించిన కోర్టు.. అతడికి అక్టోబర్ 20 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. చదవండి: రియాకు ఊరట.. షోవిక్కు షాక్! కాగా రియాకు బెయిల్ లభించడంపై బాలీవుడ్లోని పలువురు నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుభవ్ సిన్హా, సోని రజ్ధాన్, హర్హాన్ అక్తర్ వంటి వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘చివరికి రియాకు బెయిల్ లభించింది’ అని అనుభవ్ ట్వీట్ చేశారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ ట్వీట్ను సోని రీట్వీట్ చేశారు. అలాగే బెయిల్ అందించినందుకు బాంబే హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా రియా జైల్లో ఉన్న సమయంలో ఆమెకు మద్దతు తెలుపుతూ తనను విడుదల చేయాలని స్వరా భాస్కర్, రచయిత కనికా ధిల్లాన్ సహా పలువురు నటులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రియా బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్ -
రియాకు బెయిల్: ముంబై పోలీసుల వార్నింగ్
ముంబై: డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముంబై పోలీసులు మీడియాకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే మీడియా రియా చక్రవర్తి విషయంలో పరిమితికి మించి ఉత్సాహం కనబరిచి ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. రియా బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో మీడియా ఆమె వాహనాన్ని వెంబడించరాదని పోలీసులు హెచ్చరించారు. ఆమెపై సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని సూచించారు. మీరు (జర్నలిస్టులు,రిపోర్టర్లు) సదరు సెలబ్రిటీలను, వారి న్యాయవాదులను ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశంతో వారి వాహనాలను వెంబడించరాదని పేర్కొన్నారు. చదవండి: (రియా చక్రవర్తికి బెయిలు మంజూరు.. కానీ) వాహనాలను వెంబడించడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్సింగ్ నిశాందర్ తెలిపారు. అలా చేయడం వల్ల మీ జీవితాలతోపాటు, రోడ్ల మీద నడుస్తున్న సాధారణ ప్రజల జీవితాలకు అపాయం కలుగుతుందని పేర్కొన్నారు. సెలబ్రిటీల వాహనాలను వెంబడించే క్రమంలో డ్రైవర్తో పాటు, వారిని ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బుధవారం రియా బెయిలు పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టైన రియా సుమారు నెల రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో మీడియా తనపై అసత్య ప్రచారం జరుపుతోందని వాటిని వెంటనే ఆపాలంటూ నటి రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
రియాకు బెయిలు..
-
రియాకు ఊరట.. షోవిక్కు షాక్!
ముంబై: బాలీవుడ్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిలు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం బుధవారం ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరికొన్ని షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పదిరోజుల పాటు పోలీష్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా గ్రేటర్ ముంబై నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని రియాకు షరతు విధించింది. అయితే ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి సహా డ్రగ్ డీలర్ అబ్దుల్ బాసిత్, శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్లను హైకోర్టు బెయిలు నిరాకరించింది.(చదవండి: సుశాంత్ మృతి: ‘వాళ్లంతా ఉరేసుకోవాలి’) కాగా బాలీవుడ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో అతడి ప్రేయస రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె, సుశాంత్ కోసం డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో సెప్టెంబరు 9న అదుపులోకి తీసుకుని, బైకుల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బెయిలు కోరుతూ రియా హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా.. అనేక వాయిదాల అనంతరం హైకోర్టులో బుధవారం ఆమెకు ఊరట లభించింది. సుమారు నెల రోజుల తర్వాత ఆమెకు జైలు నుంచి విముక్తి లభించింది.(చదవండి: రియా రిమాండ్ను పొడిగించిన ముంబై కోర్టు) -
డ్రగ్ కేసు: రియా రిమాండ్ పొడిగింపు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహారంలో అరెస్టైన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కస్టడిని ముంబై సెషన్స్ కోర్టు పొడిగించింది. రియా సుశాంత్కు డ్రగ్స్ సేకరిచిందనే ఆరోపణలు రుజువు కావడంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సెప్టంబర్ 9 అరెస్టు చేసి ముంబైని బైకుల్లా మహిళ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో సహా మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కస్టడిని అక్టోబర్ 20 వరకు పోడిగిస్తున్నట్లు ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సెప్టెంబర్లో బెయిల్ కోరుతూ రియా ముంబై కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. కానీ కోర్టు తన పిటిషన్ రిజర్వులో ఉంచింది. అయితే దీనిపై తదుపరి ఉత్తర్వును బుధవాంర వెల్లడించే అవకావం ఉన్నట్లు సమాచారం. (చదవండి: సుశాంత్ది ఆత్మహత్యే.. హత్య కాదు!) అయితే డ్రగ్ కేసులో నేర నిరూపణ కావడంతో రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాలతో పాటు మరో ముగ్గురిని ముంబై సెషన్స్ కోర్టు అక్టోబర్ 6 వరకు జ్యూడిషియల్ కస్టడికి పంపించింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ రియా ఆమె సోదరుడు షోవిక్తో సహా ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను ఎన్సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారి బెయిల్ విచారణ సమయంలో యువకులకు వారు మాదకద్రవ్యాలను సరఫరా చేయలేదన్న నేర ఆరోపణ నిర్థారణకు వచ్చే వరకు వారికి బెయిల్ మంజూరు చేయోద్దని కోర్టును ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం డ్రగ్ వ్యవహారంలో డ్రగ్ సిండికెట్ క్రియాశీల సభ్యులు, సుశాంత్ మృతి కేసు సంబంధించిన ప్రారంభ దర్యాప్తును కూడా సమీక్షిస్తామని ఎన్సీబీ కోర్టుతో పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!) చదవండి: అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి! -
అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులపై నటి రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #JusticeforSushant అనేది ఓ బోగస్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సతీశ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇక సుశాంత్కు న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నవాళ్లదంతా ఓ బోగస్ ప్రచారం. డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!) మీలాంటి వాళ్లంతా సిగ్గుతో తలకు ఉరేసుకోవాలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, సోకాల్డ్ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతడితో సహ జీవనం చేసిన నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక రియా తరఫున సతీశ్ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
సుశాంత్ది ఆత్మహత్యే.. హత్య కాదు!
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ మరణించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగా అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు, సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టిననప్పటికీ అతనిది ఆత్మహత్యా, హత్యా అన్న విషయంలో స్పష్టత రాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకు పేర్కొంది. చదవండి: సుశాంత్ కేసులో మరో మలుపు కాగా జూన్ 14న సుశాంత్ తన అపార్ట్మెంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్ది ఆత్మహత్యేనని తెలిపారు. అయితే తన కొడుకు చావుకు గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని, సుశాంత్ నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కొందని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై రియా ప్రస్తుతం జైలులో ఉన్నారు. చదవండి: రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో సుశాంత్కు విషం ఇచ్చారని, గొంతు నులిమి చంపారని చేసిన ఆరోపణలను ఏయిమ్స్ వైద్య బృందం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు తమ మెడికో లీగల్ ఒపీనియన్ను న సీబీఐకు సమర్పించారు. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది ఆత్మహత్య కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందన్నారు. 45 రోజుల పాటు ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం అనేక కోణాలలో దర్యాప్తు చేసి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కోణంలో ఇక సీబీఐ దీన్ని దర్యాప్తు చేయనుంది. చదవండి: ప్లీజ్ ఆ వీడియో తొలగించండి: అంకిత -
డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు!
న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణుల పేర్లే ఇప్పటిదాకా తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో గతంలో డిలీట్ అయిన డేటాను ఎన్సీబీ తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్సీబీ గుర్తించింది. బడా హీరోలుగా చెలామణి అవుతున్న కొందరు డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్సీబీ విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును రకుల్ ప్రీత్సింగ్ ఆశ్రయించిన నేపథ్యంలో స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. (చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
రియా బెయిల్ పిటిషన్: తీర్పు రిజర్వులో
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్పై బాంబే హైకోర్టు నేడు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వీళ్లతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో రిమాండ్లో ఉన్న రియా బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది. ఇక గతంలో రియా బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న విషయం ఆసక్తిని రేపుతోంది. (‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) కాగా సుశాంత్ సింగ్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై అధికారులు నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) -
3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?
బాలీవుడ్లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దిగుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా రెండు భారీ మొత్తాలు క్వాన్, రియా చక్రవర్తి అకౌంట్ల మధ్య ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలపై ఈడీ ఆరా తీయాలనుకొంటున్నది. కంపెనీ నుంచి రియా అకౌంట్లోకి భారీగా కమీషన్లు జమ అయ్యాయి. ఒకానొక సమయంలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్న రియా అకౌంట్లోకి ఒక్కసారిగా లక్షలు బదిలీ కావడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. రియా-ఆమె తల్లి సంధ్య పేరిట ఉన్న జాయింట్ అకౌంట్లోకి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..) ఈ క్రమంలో ఈడీ రియా, ఆమె తల్లి సంధ్య జాయింట్ అకౌంట్లో జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఇక రియా అకౌంట్లోకి వచ్చిన డబ్బు డ్రగ్ డీలర్లు ఇచ్చిన కమిషన్లే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సుశాంత్ చనిపోయిన నెల తర్వాత రియా అకౌంట్లో కొన్ని కమీషన్లు జమ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్షిండే దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు విచారించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరులకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రియా తరపు లాయర్ సుశాంత్ మొదటి నుంచీ మెంటల్ కేసే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రియాతో పరిచయానికి ముందు నుంచి అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలిపాడు. ఇక సుశాంత్ కోసం రియా డ్రగ్స్ కొనలేదని.. అతనికి డబ్బుకు కొదవలేదని తెలిపాడు. (చదవండి: ‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?) డ్రగ్స్ అలవాటు లేని రియా వాటిని ఎందుకు కొనుగోలు చేసిందని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. రియా, ఆమె సోదరుడు డ్రగ్ సిండికేట్ మెంబర్స్ అని తెలిపారు. ఇక బాలీవుడ్ నటుల ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేస్తున్న అధికారులు కొందరు నటులు డ్రగ్స్ కొనుగోలుకు క్రెడిట్ కార్డులు వాడినట్లు గుర్తించారు. -
రకుల్ పిటిషన్పై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. డ్రగ్ కేసులో తన పేరు మీద వార్తలు రాయడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని, ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో రకుల్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణ చేపట్టగా రకుల్ తరపున న్యాయవాది అమన్ హింగోరాని తమ వాదనలు వినిపించారు. నటి దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 17న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్చలను తీసుకున్నారో సూచిస్తూ స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే మీడియాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను జస్టిస్ నవీన్ చావ్లా ఆదేశాలు జారీ చేశారు. అయితే రకుల్ తన పిటిషన్లో డ్రగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో విచారణ పూర్తి చేసి, తగిన నివేదికను కోర్టు ముందు దాఖలు చేసే వరకు మీడియా తనపై వార్తలు ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను కోర్టు ఆక్టోబర్ 15కు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో భాగంగా రియా చక్రవర్తిని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయట పడిన విషయం తెలిసిందే. రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది -
‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్ వస్తుందా?
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిలు పిటిషన్ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరిరువురితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు బెయిలు మంజూరు చేయవద్దంటూ ఎన్సీబీ సోమవారం తన నివేదికలో పేర్కొంది. రియా, ఆమె సోదరుడు స్వయంగా మాదక ద్రవ్యాలు సేవించడమే గాకుండా ఇతరులకు సరఫరా చేశారని, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంది. (చదవండి: డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!) అదే విధంగా.. రియాకు డ్రగ్స్ సిండికేట్తో సంబంధాలు ఉన్నాయని, ఆమె మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు తగిన ఆధారాలు లభించాయని వెల్లడించింది. ఇక గతంలో రియా అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా వాట్సాప్ చాట్స్ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులను విచారించారు.(నలుగురిదీ ఒక్కటే మాట..) -
ఉడ్తా బాలీవుడ్
-
ఉడ్తా బాలీవుడ్
-
రాజ్పుత్ది హత్యే..!
న్యూఢిల్లీ: గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయి కనిపించారు. ఈ మృతికి కారణమంటూ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు పలు మలుపులు తిరుగుతూ బాలీవుడ్– డ్రగ్స్ సంబంధాలపైవిచారణ వరకు వచ్చింది. -
డ్రగ్స్ కేసులో రకుల్ విచారణ
ముంబై: మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్డో(ఎన్సీబీ) ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్సింగ్ మృతి, తదనంతరం వెలుగు చూసిన తారల డ్రగ్స్ వినియోగం, సరఫరా కోణంలో ఎన్సీబీ విచారణ జరుపుతోంది. ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి రకుల్ శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఎన్సీబీ అధికారులు 4 గంటల పాటు ప్రశ్నించారు. నటి దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, ధర్మ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవిని కూడా ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. కరిష్మా ప్రకాశ్ను అధికారులు శనివారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. దీపిక పదుకోన్ను శనివారం విచారించనున్నట్లు సమాచారం. క్షితిజ్ రవిని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. రవి ఇంట్లో ఎన్సీబీ జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించినట్లు సమాచారం. సుశాంత్ గర్ల్ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సందర్భంగా రకుల్తో పాటు పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్సింగ్ కోసం రియా తన సోదరుడు షోవిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ తెప్పించేదని ఎన్సీబీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అది నిజమేనని విచారణలో షోవిక్ కూడా అంగీకరించాడు. పారిహార్, కైజెన్ ఇబ్రహీంల నుంచి డ్రగ్స్ను సేకరించిరియాకు ఇచ్చేవాడినని తెలిపాడు. వాటితో రాజ్పుత్ మేనేజర్ సామ్యూల్ మిరండా, కుక్ దీపేశ్సావంత్ సిగరెట్లు తయారు చేసేవారని షోవిక్ చెప్పాడు. ఎన్సీబీ అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. రియా కుటుంబం పాల్పడిన నగదు అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా ఈ డ్రగ్స్ కోణం ఈడీ దృష్టికి వచ్చింది. దాంతో, ఈడీ ఈ విషయాన్ని ఎన్సీబీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ సరఫరాలో కీలకమైన జాయిద్ పాత్ర బయటపడింది. లాక్డౌన్ కారణంగా తన హోటెల్ బిజినెస్ దెబ్బతిన్నదని, అందువల్ల ఈ డ్రగ్స్ దందాలో దిగానని జాయిద్ ఎన్సీబీ విచారణలో వెల్లడించాడు. బాసిత్ పారిహర్ పేరు కూడా జాయిదే వెల్లడించాడు. అలాగే, కైజెన్ ఇబ్రహీంను విచారిస్తున్న సమయంలో డ్రగ్స్ సప్లైయర్ అనుజ్ కేశ్వానీ పేరు తెరపైకి వచ్చింది. బాంద్రాలోని ఆయన ఇంటిపై జరిపిన దాడిలో భారీగా చరస్, గంజాయి, టీహెచ్సీ, ఎల్సీడీ మాదకద్రవ్యాలు లభించాయి. రియా, షోవిక్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. కరణ్ జోహార్ను కూడా? పలువురు బాలీవుడ్ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు కనిపించిన ఒక వీడియోను అప్లోడ్ చేసిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోçహార్ను కూడా ఎన్సీబీ విచారించనుందని శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. చాలా కాలం క్రితం నాటి ఆ వీడియోను సాక్ష్యంగా చూపుతూ మంజిందర్ సింగ్ తాజాగా ఎన్సీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఎన్సీబీ ఆ వీడియో నిజానిజాలను నిర్ధారించేందుకు టెస్టింగ్కు పంపించింది. -
సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆ లోకాన్ని వీడి మూడు నెలలు దాటినా అతడి మరణానికి గల స్సష్టమైన కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. మీడియా, సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాల కేసు గురించే విపరీతచర్చ జరుగుతోంది. దీంతో సుశాంత్ మృతి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని, అతడిది ఆత్మహత్యా లేదా హత్యా అన్నది తేల్చడంలో సీబీఐ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కుటుంబ లాయర్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) ఈ మేరకు.. ఎయిమ్స్ బృందంలోని ఓ డాక్టర్కు తాను గతంలో కొన్ని ఫొటోలు పంపించానని, అందులో సుశాంత్ మెడపై కొన్ని గుర్తులున్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. వాటిని బట్టి సుశాంత్ను ఎవరో గొంతు నులిమి చంపేశారని, అయితే 200 శాతం సూసైడ్ కాదని చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చడంలో సీబీఐ జాప్యం చేయడం విసుగు తెప్పిస్తోందంటూ వికాస్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు స్పందనగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి సైతం.. ‘‘చాలా రోజుల నుంచి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం! నిజాన్ని వెలికితీసేందుకు ఇంకెంత సమయం పడుతుంది?’’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం పానెల్ చీఫ్ వికాస్ సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మృతుడి శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, రిపోర్టు వచ్చేంత వరకు కాస్త ఓపికగా వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో బైకుల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY — Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020 -
డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!
కోల్కతా: బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్లో ఉన్న మహిళలు హష్, డ్రగ్స్ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్ డ్రైవర్పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్పూర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన) Yes patriarchy Women in bollywood go for Hash nd drugs or whatever nd men in bollywood cook nd clean nd pray for their better half wit joined hands nd tears in eye “Bhagwan unki raksha karna” — Mimssi (@mimichakraborty) September 24, 2020 -
డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్సింగ్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అమెజాన్లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్ని భారత్లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్కు ఇచ్చే డ్రగ్ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్ని విచారించనుంది. -
రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్లో డ్రగ్స్ కోణంపై సాగుతున్న విచారణ కీలక మలుపు తిరిగింది. అందరూ ఊహిస్తున్నట్టుగానే నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్లకు ఎన్సీబీ సమన్లు పంపింది. బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగంపై మరింత దృష్టి సారించిన ఎన్సీబీ ‘‘ఏ’’లిస్ట్లో ఉన్న ప్రముఖుల్ని తొలుత విచారించడానికి నిర్ణయించినట్టుగా ఎన్సీబీ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, సుశాంత్ ట్యాలెంట్ మేనేజర్ శ్రుతి మోదీ, డిజైనర్ సైమన్ ఖంబటాలను ఎన్సీబీ కార్యాలయానికి గురువారమే రావాల్సిందిగా చెప్పినట్టుగా ఆ అధికారి వెల్లడించారు. హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్లను 26వ తేదీ శనివారం ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్లను విచారించనున్నట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. గోవా షూటింగ్లో దీపిక ప్రస్తుతం గోవా షూటింగ్లో ఉన్న దీపిక పదుకొనె 12 మంది సభ్యులున్న తన న్యాయ బృందంతో చర్చలు జరిపారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చల్లో దీపిక భర్త రణవీర్ సింగ్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్టు సమాచారం. నోటీసుల నేపథ్యంలో రాత్రికి దీపిక గోవా నుంచి ముంబై వచ్చారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ వాట్సాప్ గ్రూప్ చాట్లలో హీరోయిన్ పేరులో ఇంగ్లిష్ అక్షరాలతో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అందులో డి అంటే దీపిక, ఎస్ అంటే శ్రద్ధ అని భావించిన విషయం తెలిసిందే. ఇక కరిష్మా ప్రకాశ్కు కూడా ఇప్పటికే సమన్లు పంపినప్పటికీ ఆమె అనారోగ్య కారణాలతో ఎన్సీబీ ఎదుట హాజరు కాలేదు. దీంతో శుక్రవారం వరకు ఆమెకు మినహాయింపునిచ్చారు. దీపికతో పాటు కరిష్మా కూడా ఎన్సీబీ విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంలో హీరోల పాత్రపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కన్నేశారు. రియా చక్రవర్తి, జయ సాహా ఇచ్చిన సమాచారం ఆధారంగా అగ్ర హీరోలపై కూడా ఓ కన్నేసి ఉంచినట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కీలక సమాచారమిచ్చిన జయ! గత మూడు రోజులుగా జయ సాహాను ప్రశ్నిస్తున్న అధికారులు పలు విషయాలను రాబట్టారు. అత్యంత కీలకమైన సమాచారాన్ని జయ సాహా బయటపెట్టినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. సుశాంత్తో పాటు నటి శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి, మధు, తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె ఎన్సీబీ విచారణలో అంగీకరించినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. సీబీడీ ఆయిల్ అనే నిషేధిత డ్రగ్స్ని వారు సేవించినట్టుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల చీకటి కోణంపై 2016లో వచ్చిన బాలీవుడ్ సినిమా ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అయిన మధు మాంతెనాను బుధవారం ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. జయ సాహా తన విచారణలో మధు పేరుని బయట పెట్టడంతో ఆయనను డగ్స్ర్ వినియోగంపై గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. -
డ్రగ్స్: ప్రముఖ టీవీ నటి ఇంట్లో సోదాలు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్సీబీ ఎదుట హాజరుకాగా, తాజాగా డ్రగ్స్ సెగ టీవీ నటులను కూడా తాకింది. ప్రముఖ బుల్లితెర నటి అబిగేల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. (చదవండి: డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ జంట ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈ క్రమంలో డ్రగ్ డీలర్లు, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్న తీరు గురించి అధికారులు వీరిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా అబిగేల్ పాండే, సనం జోహార్ నచ్ బలియే వంటి పలు ప్రముఖ షోల్లో పాల్గొని ప్రాచుర్యం పొందారు. ఇక బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోని ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ పేర్లతో పాటు రకుల్ ప్రీత్సింగ్, నమ్రతా శిరోద్కర్, దియా మీర్జా పేర్లు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ దగ్గర పనిచేసిన టాలెంట్ మేనేజర్ జయ సాహాతో మత్తు పదార్థాల గురించి చాట్ చేసినట్లుగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టైన విషయం తెలిసిందే. -
సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న రియా చక్రవర్తికి ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణను బాంబే హై కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన బెయిల్ పిటిషన్లో రియా.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాత్రమే డ్రగ్స్ వాడేవాడని.. అతను తన సిబ్బందిని డ్రగ్స్ తీసుకురావాల్సిందిగా కోరేవాడని తెలిపింది. సుశాంత్ జీవించి ఉంటే అతనిపై తక్కువ అభియోగాలు మోపబడేవని.. బెయిల్ లభించే నేరంగా ఉండేదని.. అతడికి ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష విధించేవారని తెలిపింది. (చదవండి: స్పీడ్పోస్టు, కొరియర్లలో డ్రగ్స్) అంతేకాక సుశాంత్ తనను, తన సోదరుడిని, ఇతర సిబ్బందిని డ్రగ్ సప్లయర్స్గా వాడుకున్నాడని రియా ఆరోపించింది. ‘సుశాంత్ డ్రగ్స్ కోసం తనతో క్లోజ్గా ఉండే వారిని అంటే నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్ ఎవిడెన్స్ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. పబ్లిక్ డొమైన్లోని సమాచారం ఆధారంగా రియా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన కుక్ నీరజ్ను ‘గంజా జాయింట్లు / రోల్స్ / డూబీలు తయారు చేసి తన పడకగదిలో ఉంచమని’ తన మరణానికి మూడు రోజుల ముందు కోరినట్లు వెల్లడించింది. దీని గురించి నీరజ్ సీబీఐ, ముంబై పోలీసులకు చెప్పాడని తెలిపింది. ‘తాను జాయింట్లు సిద్ధం చేసి సుశాంత్ బెడ్రూంలోని ఒక బాక్స్లో ఉంచానని నీరజ్ తెలిపాడు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ తెరిచి చూస్తే.. ఖాళీగా ఉందని.. సుశాంత్ జాయింట్లు / డూబీలు వాడాడని అర్థమయ్యింది అన్నది’ రియా. (చదవండి: సుశాంత్ ఫామ్హౌస్లో తరచూ పార్టీలు) ఇక నిన్నటితో రియా జ్యూడిషియల్ కస్టడీ ముగిసింది. దాంతో వచ్చే నెల 6 వరకు దాన్ని పొడిగించారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు బెయిల్కు అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేశారు. ఆమెను "డ్రగ్ సిండికేట్ యొక్క క్రియాశీల సభ్యురాలు" అని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అభివర్ణించింది. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
టాలీవుడ్ను షేక చేస్తోన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసు
-
రియాకు రిమాండ్ పొడిగింపు
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది. -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
మలుపులు తిరుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
డ్రగ్స్ కేసు: ఆ ఫోన్లో కీలక వివరాలు!
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ సహా ఇద్దరు డ్రగ్ డీలర్లను ఎన్సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా వాట్సాప్ చాట్స్, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా సోమవారం ఎన్సీబీ ఎదుట హాజరైనట్లు సమాచారం. ఆమె ఫోన్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సీబీడీ ఆయిల్(గంజాయి ఆకుల నుంచి తీసిన ద్రవం), డ్రగ్స్ను సరఫరా చేయాల్సిందిగా తనను కోరినట్లు వెల్లడైంది. వీళ్లందరి కోసం జయ సాహా ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసినట్లు సమాచారం. (చదవండి: సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్కు సమన్లు..?) ఇక రియాతో పాటు జయ కూడా మాదక ద్రవ్యాల సరఫరాలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తేలడంతో అధికారులు ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. జయకు సీబీడీ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఆమె ఫోన్లో లభించిన ఎస్ఎల్బీ, అమిత్ తదితర పేర్లతో ఉన్న కాంటాక్టు నంబర్ల గురించి కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా తదితరులకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్లుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నో స్మోకింగ్, మూడో కన్ను.. సుశాంత్ నోట్!) -
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
నా పరువు తీస్తున్నారు!
న్యూఢిల్లీ: రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీన్ని నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రకుల్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం వైఖరి వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తమ వైఖరిని చెప్పాలని పిటిషన్ విచారించిన జస్టిస్ నవీన్ చావ్లా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు, ప్రసారభారతికి, ప్రెస్ కౌన్సిల్కు, న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్కు నోటీసులు జారీ చేశారు. రకుల్ పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి ఈ నాలుగు సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేశారు. డ్రగ్స్ కేసులో విచారణ వేళ సంబంధిత ఆఫీసర్లకన్నా ముందే మీడియాకు కొన్ని అంశాలు లీకవుతున్నాయని, దీనిపై విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముందుగా ఫిర్యాదు చేయాల్సింది.. కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. రకుల్ కోరుకున్నట్లు ఇంజంక్షన్ లేదా బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలివ్వద్దని కోరారు. కోర్టుకు వచ్చేముందు ఆమె ప్రభుత్వానికి కానీ సంబంధిత అథార్టీకి కానీ ఫిర్యాదు చేయలేదని, ఏదో ఒక్క మీడియా హౌస్ లేదా చానల్ను ప్రత్యేకంగా ఆమె పేర్కొనలేదని చెప్పారు. దీనిపై రకుల్ న్యాయవాది స్పందిస్తూ రకుల్ పేరు తాను చెప్పలేదని రియా చక్రవర్తి వివ రించినా మీడియా రిపోర్టులు రకుల్ను డ్రగ్స్ కేసుతో లింక్ చేసే రాస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సమయం లేక నేరుగా కోర్టును ఆశ్రయించామని చెప్పారు. -
కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్ వెళ్లాలి..
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి మొదలు డ్రగ్స్ వ్యవహారం దాకా అన్ని విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఔట్సైడర్ అయిన సుశాంత్ పరిశ్రమలోని ప్రముఖుల అవమానాలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటే, మరికొందరు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుశాంత్ ప్రవర్తనా శైలి, అతడి ఫామ్హౌజ్లో డ్రగ్స్ పార్టీలు జరిగేవంటూ అక్కడి మేనేజర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. పవనాలోని ఫాంహౌజ్లో సుశాంత్కు సంబంధించిన నోట్స్ ఇండియా టుడే చేతికి చిక్కాయి. ఇందులో ఏప్రిల్ 27, 2018లో అతడు రాసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. (చదవండి: సుశాంత్తో టచ్లో లేను.. కానీ నాకు తెలుసు!) అందులో ఉన్న వివరాల ప్రకారం.. ఆరోజు సుశాంత్ ఉదయం 2.30 గంటలకే నిద్రలేచి, టీ తాగి, చన్నీళ్లతో స్నానం చేశాడు. ఆ తర్వాత వేద మంత్రాలు పఠించాడు. అంతేగాక స్మోకింగ్ వదిలేయాలని అతడు నోట్లో రాసుకున్నాడు. ఆ మరుసటి రోజు కేదార్నాథ్ సినిమా స్క్రిప్టు వినాలని నిర్ణయించుకున్నాడు. కాగా కేదార్నాథ్ షూటింగ్ సమయంలోనే సుశాంత్ గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడని, అతడి ప్రేయసి రియా చక్రవర్తి తెలిపిన సంగతి తెలిసిందే. ఇక మరో నోట్లో తన రాబ్తా సినిమా కోస్టార్ కృతి సనన్ కోసం మరింత సమయం కేటాయించాలని సుశాంత్ రాసుకున్నాడు.(అంకితా లోఖండేతో విడిపోయిన తర్వాత సుశాంత్- కృతి ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది). అదే విధంగా తన అక్క ప్రియాంక సింగ్, ఆమె భర్త మహేష్తో ట్రిప్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. వీటితో పాటు.. ‘‘ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?’’, సంతోషం ఎందుకు?, అనుభవం-విశ్లేషణ-ధైర్యం, ప్రతిభ, దైవత్వం, యోగ, తపస్య, కైలాష్, మూడో కన్ను వంటి పదాలు రాసుకున్నాడు. ‘‘నేను ఉన్నపుడు దేవుడు లేడు, దేవుడు ఉన్నపుడు నేను ఉండను’’అన్న కబీర్ పద్యంలోని పంక్తులను రాశాడు. (చదవండి: ఎన్సీబీ దృష్టి అంతా ఆ ఫామ్హౌస్ పైనే!) అంతేగాక 2018లో వరుణ్ మాథుర్ అనే వ్యక్తితో ఇన్సాయ్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా సుశాంత్ ఈ నోట్లో ప్రస్తావించాడు. అయితే అప్పటికింకా రియాతో పరిచయం లేనందు వల్ల ఆమె గురించి ఎక్కడా ఒక్కమాట కూడా రాయలేదు. ఇక ఈ నోట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సుశాంత్ క్రమశిక్షణతో మెలిగేవాడు అనడానికి ఇదొక ఉదాహరణ అని అతడి అభిమానులు అంటే, రియాకు దగ్గరకాకముందే అతడు కుంగుబాటులో ఉన్నాడని, కాబట్టి రియాను టార్గెట్ చేయడం మంచిది కాదంటూ ఆమె మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు. ఇక తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని డైరీలో రాసుకోవడం సుశాంత్ సింగ్ రాజ్పుత్కు అలవాటు అని అతడి సహ నటుడు దీపక్ ఖజీర్ వెల్లడించిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి నేపథ్యంలో బుధవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దీపక్.. ‘‘రాయడం అంటే సుశాంత్కు ఇష్టం. ఒకవేళ తను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదు’’ అని అనుమానం వ్యక్తం చేశారు. -
నన్ను మీడియా వేధిస్తోంది