ACB Special court
-
వరంగల్లో ఏసీబీ ప్రత్యేక కోర్టు
వరంగల్ లీగల్: వరంగల్లో ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో సంతోషపడటమే కాకుండా సమగ్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా న్యాయవాదులు తర్ఫీదు పొందాలని అన్నారు. ఏసీబీ కోర్టుతోపాటు హనుమకొండ జిల్లాకు సబ్ కోర్టు, ఉభయ జిల్లాలకు ఈ– సేవా కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారి పాత రికార్డులను భద్రపర్చడం కోసం డిజిటైజేషన్ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి.వినోద్కుమార్, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్.రాజేశ్వర్రావు, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు ఆనంద్మోహన్, శ్యాంసుందర్రెడ్డి, సభ్యులు జయాకర్, జనార్ధన్, డాక్టర్ యాకస్వామి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. -
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు. -
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతికి 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ) కె.జగజ్యోతిని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. జ్యోతికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మార్చ్ 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు పేర్కొంది. జ్యోతిని చంచల్గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది ఏసీబీ కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని జజ్యోతి తరపు నన్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. దీంతో జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధింస్తున్నామని కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్ పట్టణంలో ఒక నిర్మాణ పనిని, గాజుల రామారంలో జువెనైల్ బాయిస్ హాస్టల్ నిర్మాణపనులను బొడుకం గంగన్న అనే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ చేపట్టారు. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై కాంట్రాక్టర్ను ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కె.జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్ నుంచి రూ.84 వేల లంచం తీసుకుంటుండగా సోమవారం హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ(డీఎస్ఎస్) భవన్లో జగజ్యోతిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్ఛార్జి హోదాలో ఎస్ఈ బాధ్యతలూ నిర్వర్తిస్తుండటం గమనార్హం. చదవండి: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి అరెస్ట్ -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్షీట్లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్షీట్లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్కు ఫైబర్నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
Nara Lokesh: రెడ్బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్కు నోటీసులు పంపింది. -
ఏసీబీ కోర్టు సీరియస్..లోకేష్ కు బిగ్ షాక్
-
లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు. ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో అప్పటి సీఎంహోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: బెడిసికొట్టిన యువగళం ముగింపు సభ ప్లాన్.. అయితే ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్లో పేర్లు రికార్డు చేశానని, తమప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుబట్టడంపై న్యాయవర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్కు జారీ చేసిన 41ఏ నోటీసుల్లో పేర్కొన్న షరతులకుcrime in విరుద్దమని సీఐడీ తెలిపింది. -
ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). ఫైబర్నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఫైబర్నెట్ కేసులో అటాచ్కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. -
‘ఫైబర్నెట్’ నిందితుల ఆస్తుల అటాచ్కు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతివ్వాలని ఆ పిటిషన్లో కోరింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రూ.330 కోట్ల ఫైబర్నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును అప్పటి సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కేటాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఏ–1గా వేమూరి హరికృష్ణ, ఏ–11గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ–25గా చంద్రబాబును పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు ఈ కేసులోని నిందితులకు ఏపీ, తెలంగాణలో ఉన్న ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను రాష్ట్ర హోం శాఖ ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాటి అటాచ్మెంట్కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల అటాచ్మెంట్కు సీఐడీ చర్యలు చేపట్టనుంది. ఫైబర్నెట్ కేసులో అటాచ్కు నిర్ణయించిన ఆస్తులు.. నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లో ఉన్న ఓ ఫ్లాట్. మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, యూసఫ్గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న వ్యవసాయ భూమి. -
ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్నెట్ కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ సోమవారం ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే.. ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేసింది. -
Nov 2nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates 17:30 PM, నవంబర్ 02 2023 BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్ బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ► రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 17:00 PM, నవంబర్ 02 2023 రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.! ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు 16:45 PM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు ► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 15:45 PM, నవంబర్ 02 2023 జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? 15:25 PM, నవంబర్ 02 2023 నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ : YSRCP ► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్కు చెప్పింది.. అబద్ధం ► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 15:25 PM, నవంబర్ 02 2023 కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం ► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.! ► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని ► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం ► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్ ► హైదరాబాద్లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు? ► గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 150 డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు ► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్ లక్ష్మణ్ ► బీజేపీని బ్లాక్మెయిల్ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు 15:20 PM, నవంబర్ 02 2023 బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు ► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు ► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 15:15 PM, నవంబర్ 02 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 14:55 PM, నవంబర్ 02 2023 చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ ►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP ►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP 14:35 PM, నవంబర్ 02 2023 మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.! ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 14:29 PM, నవంబర్ 02 2023 స్కిల్ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన ►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన ►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది ►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు ►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది ►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది ►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..? ►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? ►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? ►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? ►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు ►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది ►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి ►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు ►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి ►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? ►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు 14:12 PM, నవంబర్ 02 2023 పయ్యావులకు బోలెడు అనుమానాలు ►స్కిల్ కేసుపై పయ్యావుల కేశవ్ పరిశోధన ►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి ►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు ►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా? ►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా? ►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP ►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని ఎందుకు వాదిస్తున్నారు? ►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు? 14:09PM, నవంబర్ 02 2023 చంద్రబాబు కేరాఫ్ AIG ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం ►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు ►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు ►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం 13:29PM, నవంబర్ 02 2023 టీడీపీ ఖేల్ ఖతం ►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు ►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు? ►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్ ఆడుతున్నాడు ►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు ►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది ►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు ►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు :::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 12:53PM, నవంబర్ 02 2023 మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే! ►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది ►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు? ►కన్ను బాగోలేదనే బెయిల్ ఇచ్చారు ►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు ►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే! 12:29PM, నవంబర్ 02 2023 ఆధారాలివ్వండి ►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్ ►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్ ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 12:07PM, నవంబర్ 02 2023 బాబుకు వైద్య పరీక్షలు ►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం 11:54AM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ►అరెస్ట్ తర్వాత నిన్న హైదరాబాద్కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ ►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు ►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు ►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు 10:30AM, నవంబర్ 02 2023 ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్ ►హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్ ►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు 08:20AM, నవంబర్ 02 2023 వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు ►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి ►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి ►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం 07:18AM, నవంబర్ 02 2023 ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు నిర్ణయం ►ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన ►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు ►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేయనున్న సీఐడీ ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు 07:13AM, నవంబర్ 02 2023 అదనపు షరతుల పిటిషన్పై నిర్ణయం రేపే ►చంద్రబాబు మధ్యంతర బెయిల్పై సీఐడీ అనుబంధ పిటిషన్ ►బెయిల్కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి ►బుధవారం కొనసాగిన వాదనలు ► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ ► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:59AM, నవంబర్ 02 2023 మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్పై సెటైర్లు ►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం ►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ ►నవంబర్ 8న సుప్రీంలో క్వాష్ పిటిషన్పై తీర్పు.. 9న ఫైబర్కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం ►మళ్లీ.. అరెస్ట్ భయంతోనేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు 06:49AM, నవంబర్ 02 2023 చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు ►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్కు చంద్రబాబు ►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు ►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి ►నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరిక ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ ►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు 06:40AM, నవంబర్ 02 2023 స్కిల్డ్ దొంగ.. చంద్రబాబు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ ►సెప్టెంబర్ 09వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్ మీద విడుదల ►52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు ►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట ►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ►నాలుగు వారాల తర్వాత.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్ కావాలని చంద్రబాబుకి ఆదేశం ►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు ►కంటి సర్జరీ కోసం బెయిల్.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం ►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక -
Oct 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Arrest Remand Petitions Court Hearings And Political Updates 09:00PM, అక్టోబర్ 27, 2023 మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదు: జైళ్ల శాఖ డీఐజీ ►చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశాం ►జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. ►మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ►అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ►కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. ►మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలింది. ►చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. 15:00 PM, అక్టోబర్ 27, 2023 సోమవారం హైకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్.! ► సోమవారం హైకోర్టు సీజే బెయిల్ పిటిషన్ను విచారిస్తారన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారించే విధంగా తాము విజ్ఞప్తి చేసుకుంటామని చెప్పిన చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసును బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఏ కోర్టు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసిన న్యాయమూర్తి ►చంద్రబాబు తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లూథ్రా 14:50 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల్లో అక్రమాలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ల పై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ లాయర్లు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్ లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►ఏ34గా ఉన్న నారాయణ అకౌంట్ లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరఫు న్యాయవాది 14:40 PM, అక్టోబర్ 27, 2023 జైలు నుంచి రాసిన లేఖలో చంద్రబాబు ఏం కోరారంటే..! ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►జైల్లో నన్ను చంపాలని కొందరు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారు ►నన్ను చంపాలని మావోయిస్టులు లేఖ రాసినట్లు నాకు తెలిసింది ►అసంబద్ధ సంఘటనలను ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►తన భద్రత, ఆరోగ్యం పై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ ►తన హత్య కోసం కోట్ల రూపాయలు చేతులు మారినట్లు చంద్రబాబు అనుమానం ► ఆకాశ రామన్న ఉత్తరంలో సంచలన విషయాలు ఉన్నాయన్న చంద్రబాబు ►నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శృంగవరపుకోటకు చెందిన ఓ నిందితుడు పెన్ కెమెరాతో జైలులో ఖైదీల ఫోటోలు తీస్తున్నాడు ►కొందరు ఆగంతకులు జైలులోకి గంజాయి ప్యాకెట్లను విసిరేశారు ►జైలులో మొత్తం 2200 మంది ఉన్నారు, వీరిలో 750 మంది నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు నిందితులు ►2019 జూన్ 25వ తేదీన నా సెక్యూరిటీని తగ్గించారు ►2022 నవంబర్ 4వ తేదీన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది ►2023 ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మరోసారి రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు ఆరోపణ ►అంగళ్లులో పోలీసులపై టిడిపి కార్యకర్తలు చేసిన దాడిని మాత్రం ప్రస్తావించని చంద్రబాబు ►అల్లర్లు జరిగేలా తాను ఎలా రెచ్చగొట్టిన విషయాన్ని దాచిపెట్టిన చంద్రబాబు ►ప్రతీ బహిరంగసభలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాడో బయటకు చెప్పని చంద్రబాబు 14:35 PM, అక్టోబర్ 27, 2023 కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►ఏపీ : హైకోర్టులో స్కిల్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►నాట్ బిఫోర్ మీ అని విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ జ్యోతిర్మయి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వెకేషన్ బెంచ్ విచారణ ►ఏ బెంచ్ విచారించాలో నిర్ణయించనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 14:20 PM, అక్టోబర్ 27, 2023 పిటిషన్లే పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్య రెండు పిటిషన్ల దాఖలు ►రెండు పిటిషన్లను నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి ►టీడీపీ బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీ కోరడంపై పిటిషన్లు 14:05 PM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు కోసం పిటిషన్ల వెల్లువ ►కోర్టులను ప్రభావితం చేసేలా పిటిషన్లతో వెల్లువెత్తుతున్న చంద్రబాబు మనుష్యులు ►చంద్రబాబు అరెస్ట్ అక్రమ నిర్బంధమని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు 13:45 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డాటా పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడీ కాల్ డేటా అంశంపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ ►కాల్ డేటా అంశంపై ఈనెల 31న తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు ఉద్దేశ్యాలు సరిగా లేవని తెలిపిన CID 13:45 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►ఏపీ హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు ►వర్ల రామయ్య లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరణ ►టీడీపీ అకౌంట్స్, ఫండ్స్ వివరాలు సీఐడీ కోరటాన్ని.. సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ 13:25 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా రికార్డు పిటిషన్పై వాదనలు ఇలా.. ►కాల్ డేటా రికార్డు పిటిషన్పై తీర్పు చేసిన ఏసీబీ కోర్టు ►ఈనెల 31వ తేదీన తీర్పు వెల్లడించిన ఏసీబీ న్యాయమూర్తి చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ►చంద్రబాబు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ కాల్ డేటా కీలకం ►చంద్రబాబును విచారించిన గది దర్యాప్తు అధికారి నియంత్రణలో ఉంటుంది ►దర్యాప్తు అధికారికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు బయటకి రావు ►మా పిటీషన్ రైట్ టూ ప్రైవసీ కిందకి రావడం లేదు ►కాల్ డేటా ఇవ్వడం వల్ల అధికారులు వ్యక్తిగత సమాచారానికి ఇబ్బంది లేదు ►చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు అరెస్టు అక్రమం పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ►చంద్రబాబు ని అరెస్టు చేసే సమయంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు ►ఆ పోలీసు అధికారుల ఫోన్ నెంబర్ లు, వివరాలు తీసుకోవాల్సిన అవసరం సీఐడీకి లేదు ►చంద్రబాబు అరెస్టు అక్రమం అని చెప్పుకునేందుకు ఈ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ►చంద్రబాబు స్వయంగా తనను ఉదయం ఆరు గంటలకి అరెస్టు చేసినట్లు చెప్పారు ►సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను బట్టి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ►ఇదే విషయాన్ని హైకోర్టు సమర్ధించింది ►ఇలా కాల్ డేటా రికార్డు కోరటం న్యాయ విరుద్దం ►దర్యాప్తు అధికారులకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వస్తాయి ►అందువల్ల కాల్ డేటా రికార్డు పిటీషన్ కొట్టివేయాలి 13:15 PM, అక్టోబర్ 27, 2023 అసైన్డ్ భూముల కేసు.. ఏసీబీ కోర్టులో వాదనలు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ►వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు ►అసైన్డ్ భూముల కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్లను రిలీజ్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నారాయణ తరపు న్యాయవాదులు ►అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ అకౌంట్లోకి వివిధ మార్గాల్లో నిధులు చేరాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►గురునానక్ కాలనీలోని ఎస్బీఐలో ఉన్న ఏ34 గా ఉన్న నారాయణ అకౌంట్లోకి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నిధులు వెళ్లాయని తెలిపిన ఏసీబీ తరపు న్యాయవాది ►మధ్యాహ్నం నుండి వాదనలు కొనసాగే అవకాశం 12:20 PM, అక్టోబర్ 27, 2023 కాల్ డేటా పిటిషన్ తీర్పు రిజర్వ్ ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►తీర్పు అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్లను కోరుతూ పిటిషన్ ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన 12:06 PM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్పై మొదలైన వాదనలు ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ►మొదలైన వాదనలు ►వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 12:00 PM, అక్టోబర్ 27, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►చంద్రబాబు ను అరెస్టు చేసి జైలుకు పంపించటం అక్రమ నిర్భమేనని వాదన ►హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన హైకోర్టు 11:45 PM, అక్టోబర్ 27, 2023 నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ ►ఏసీబీ న్యాయమూర్తికి రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు లేఖ ►జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు ►జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందని న్యాయమూర్తికి లేఖ రాసిన చంద్రబాబు ►తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో ప్రస్తావన ►తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 3 పేజీల లేఖ రాసిన చంద్రబాబు ►మావోయిస్టులు తనను చంపాలని లేఖ రాసినట్లు నాకు తెలిసింది(లేఖలో చంద్రబాబు) ►అసంబద్ధ సంఘటనల్ని ఉదహరిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ►ఈ నెల 25న లేఖ రాసిన చంద్రబాబు 11:22 AM, అక్టోబర్ 27, 2023 ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ ►ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు ►ఖమ్మంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి గురువారం రాత్రి హాజరైన మంత్రి అంబటి ►అంబటి బస చేసిన హోటల్ను ముట్టడించి చంద్రబాబు నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు ►అంబటి కాన్వాయ్పైకి 10 మంది కుర్రాలు కర్రలతో దూసుకొచ్చిన వైనం ►పోలీసుల ఎంట్రీతో తమ్ముళ్ల పరుగులు 10:58 AM, అక్టోబర్ 27, 2023 ప్లీజ్ ప్లీజ్.. సోమవారం దాకా వద్దు ►స్కిల్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►నాట్ బిఫోర్ మీ అనేసిన వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ►బిత్తరపోయిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు సీజే సోమవారం విచారణ చేపడతారని చెప్పిన న్యాయమూర్తి ►సోమవారం కాకుండా వెంటనే విచారణ చేపట్టేలా తాము విజ్ఞప్తి చేసుకుంటామన్న లాయర్లు ►విజ్ఞప్తి మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ముందుకు కేసు బదిలీ చేసిన న్యాయమూర్తి ►ఎవరు విచారణ చేపడతారనే నిర్ణయం హైకోర్టు రిజిస్ట్రార్కే వదిలేసిన న్యాయమూర్తి 10:50 AM, అక్టోబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్.. నాట్ బిఫోర్ మీ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ►బాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్ లూథ్రా ►నాట్ బిఫోర్ మీ అనేసిన న్యాయమూర్తి ►వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని వెల్లడి ►ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారన్న న్యాయమూర్తి ►మరో జడ్జి ముందుకు వెళ్లనున్న చంద్రబాబు పిటిషన్ 10:46 AM, అక్టోబర్ 27, 2023 సీడీఆర్ పిటిషన్లో బాబు లాయర్ల వాదన ఇది ►సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ను భద్రపరచాలంటూ చంద్రబాబు లాయర్లు ►చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఇతర వ్యక్తుల డైరెక్షన్ లో సీఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని వాదన ►సీఐడీ తరపున న్యాయవాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ఏసీబీ కోర్టు ►కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై నిన్న(అక్టోబర్ 26, గురువారం) కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడి న్యాయవాదులు ►అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని పిటిషన్ లో పేర్కొన్న సీఐడీ ►ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సిఐడి కాల్ డేటా రికార్డ్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న విచారణ 10:23 AM, అక్టోబర్ 27, 2023 అత్యవసర విచారణ లేదు ►అనారోగ్యం పేరుతో హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ►వెంటనే విచారించాలంటూ హౌజ్మోషన్ ద్వారా హైకోర్టును కోరిన చంద్రబాబు లాయర్లు ►అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను విచారించనున్న వెకేషన్ బెంచ్ 09:05 AM, అక్టోబర్ 27, 2023 నిజం గెలవాలి అంటున్న భువనేశ్వరీకి పది సూటి ప్రశ్నలు 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 08:17 AM, అక్టోబర్ 27, 2023 బాబుకి కంటి సర్జరీ అవసరం లేదు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ప్రతిరోజు మూడుసార్లు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని జైలు అధికారులకు చెప్పిన చంద్రబాబు ►చంద్రబాబు పరీక్షించిన రాజమండ్రి జిజిహెచ్ వైద్యులు ►ఇప్పటికిప్పుడు కంటి సర్జరీ అవసరం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వ వైద్యుడు ►ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలియజేసిన జైలు అధికారులు 07:15 AM, అక్టోబర్ 27, 2023 తాత అవినీతి గురించి దేవాన్ష్కు చెప్పలేదా భువనేశ్వరమ్మా? ►తాత చంద్రబాబు ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడట! ►కానీ, స్కిల్ అవినీతితో అరెస్టై జైల్లో ఉన్నట్లు దేవాన్ష్కు తెలియదట ►తాత విదేశాలకు వెళ్లారని భువనేశ్వరి చెబుతోందట ►నన్నపనేని రాజకుమారి ఈ ప్రశ్న అడగడం.. దానికి భువనేశ్వరి ఇలాంటి సమాధానం ఇవ్వడం ►‘నిజం గెలవాలి’ యాత్రలో తిరుపతిలో ఇలాంటి విచిత్రమైన డిబేట్ నడిచింది మరి! ► చంద్రబాబు అరెస్టు తర్వాత దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మాత్రమే అండగా నిలిచారని భువనేశ్వరి చెబుతుండడం గమనార్హం 07:03 AM, అక్టోబర్ 27, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్పై నేడు విచారణ ►స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్లను కోరుతూ పిటిషన్ ► గతంలోనే పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు లాయర్లు ► ప్రతివాదుల్ని మెన్షన్ చేయకపోవడంతో మళ్లీ పిటిషన్ వేయాలని జడ్జి సూచన ►జడ్జి సూచనతో తిరిగి ఫైల్ చేసిన చంద్రబాబు లాయర్లు ►పిటిషన్పై గురువారం(26వ తేదీన) ఏసీబీ కోర్టులో విచారణ.. శుక్రవారానికి వాయిదా ► పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ►అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాది ►ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదన ► పిటిషన్పై నేడు విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు 06:55 AM, అక్టోబర్ 27, 2023 హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు ► నేడు విచారణ చేపట్టనున్న దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ►న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు శుక్రవారం 8వ కేసుగా లిస్టింగ్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరణ ► హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ►ఈ నెల 19న విచారణ జరిపి వెకేషన్ బెంచ్కు కేటాయించిన హైకోర్టు ధర్మాసనం ►చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం జైలు అధికారుల్ని ఆదేశించిన కోర్టు 06:42 AM, అక్టోబర్ 27, 2023 వివిధ కోర్టులో బాబు పిటిషన్ల పరిస్థితి ఇది ►స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు నవంబర్ 8న ►ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 9న ►ఫైబర్నెట్ కేసు పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్ 10న 06:35 AM, అక్టోబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @48 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►రాజమండ్రి సెంట్రల్ జైలు 48వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు -
చంద్రబాబుకి కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. ఇటు విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఫైబర్నెట్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్కుమార్ వాదనలు వినిపించారు. సిద్ధార్థ లూథ్రా వాదనలు పిటిషనర్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణను నవంబర్ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు పెండింగ్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసిన ధర్మాసనం ఆ క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్నెట్ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. క్వాష్ పిటిషన్పై తీర్పును నవంబర్ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా.. తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు ముందుకు జరపాలని కోరారు. ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని.. పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. సెక్షన్17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ప్రస్తావన ఉండబోదని.. నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది. ఇదీ చదవండి: అవినీతిపరులకు ‘17ఏ’ రక్షణ కవచం కాదు మరోవైపు ఫైబర్ నెట్ కేసు పిటిషన్ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకూ ప్రభావం శుక్రవారం ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాల్సి వస్తే.. అరెస్ట్ చేస్తారేమోననే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. ఏసీబీ కోర్టులోనూ.. లీగల్ ములాఖత్ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. ములాఖత్ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు గురువారం కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్ ఫార్మట్లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. ►కాల్ డేటా రికార్డింగ్స్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించగా.. ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పిటిషన్ను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్నెట్ కేసు పీటీ వారెంట్పై నిర్ణయం వాయిదా ►పైబర్నెట్ పీటీ వారెంట్పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్నెట్ స్కామ్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్నెట్ స్కాం ►ఫైబర్నెట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్ల పిటిషన్పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ను ఇంకోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 1వ తేదీ వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో తన ఆరోగ్యం, భద్రత గురించి జడ్జి ఎదుట చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు హాజరుపరిచారు అధికారులు. ఆ సమయంలో ఆరోగ్యం ఎలా ఉంది? అని చంద్రబాబును ఏసీబీ జడ్జి ఆరా తీశారు. అయితే తనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని ఆయన జడ్జికి చెప్పారు. దీంతో అధికారుల్ని జడ్జి వివరణ కోరారు. మెడికల్ టీం ఉందని, ఎప్పటికప్పుడు ఆయనకు వైద్యపరీక్షలు జరుపుతోందని అధికారులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ.. చంద్రబాబు రిమాండ్ను పొడిగించారు. మరోవైపు సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పడంతో.. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సూచించింది. అలాగే చంద్రబాబు రాసే లేఖను సీల్ చేసి తనకు పంపాలని అధికారుల్ని జడ్జి ఆదేశించారు. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
బాబుకు టవర్ ఏసీ ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు టవర్ ఏసీ సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బాబు ఉంటున్న బ్యారెక్లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అందులో భాగంగా ఆయన గదిలో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా బ్యారెక్లో ఉక్కపోతగా ఉండటంతో ఇప్పటికే తనకున్న చర్మ సమస్యల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. అయితే జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు జైలు నిబంధనలు అనుమతించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైద్యుల సూచనల మేరకు తన బ్యారెక్లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ శనివారం రాత్రి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ న్యాయస్థానం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయాధికారి రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని వైద్యులు కోర్టుకు తెలిపారు. ఇది కాకుండా చంద్రబాబుకు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని వైద్యులను కోర్టు ప్రశ్నించింది. మరే ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం స్కిన్ అలర్జీతో మాత్రమే ఆయన బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద వాదనలు వినిపించారు. చంద్రబాబుకున్న స్కిన్ అలర్జీ సమస్యను లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని వైద్యులు సిఫారసు చేశారని కోర్టుకు వివరించారు. న్యాయాధికారి స్పందిస్తూ.. చంద్రబాబు అభ్యర్థనపై మీరేమంటారని వివేకానందను ప్రశ్నించారు. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని వివేకానంద చెప్పారు. దీంతో న్యాయాధికారి రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించారు. ఎంత సేపట్లో ఏసీ సదుపాయం ఏర్పాటు చేయగలరని ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. దీన్ని న్యాయాధికారి రికార్డ్ చేశారు. -
చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉంటున్న బ్యారక్లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్లో ప్రస్తావించారు బాబు లాయర్లు. -
బాబు లాయర్ల అతి.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
సాక్షి, విజయవాడ: వరుసబెట్టి పిటిషన్లు.. న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు.. అయినా కొనసాగుతున్న పిటిషన్ల పర్వం. దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు అండ్ కో ఉంది. ఈ సమయంలో ఆయన తరపు లాయర్లు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారు. సీఐడీ తరపు న్యాయవాదులతో తాజాగా దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో.. సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు. వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో లాయర్ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను జడ్జి ప్రశ్నించారు. మరోవైపు లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. దీంతో.. న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ‘లేరు’అని చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. దీంతో.. న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు. -
ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు. అప్పటివరకు రక్షణ కల్పించండి.. అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు.. తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్పై విచారణ నేటికి వాయిదా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది. -
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకి చుక్కెదురు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. బెయిల్ పిటిషన్పై మూడు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారమే ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి.. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం తీర్పు వెల్లడించారు. అంతేకాదు.. చంద్రబాబును మరోసారి కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్రోడ్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసిన సంగతి విదితమే. ఈ స్కామ్లో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉందని.. బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ తరపున వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. -
స్కిల్ కార్పొరేషన్కు, టీడీపీకి ఒకరే ఆడిటర్
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ ఆడిటర్నే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కూడా ఆడిటర్గా నియమించడం వెనుక ప్రజాధనం కొల్లగొట్టాలన్న ఎత్తుగడ ఉందని న్యాయస్థానానికి సీఐడీ తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపులో దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించిన ఆధారాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ కేసులో నిందితుడు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా మూడో రోజు శుక్రవారం విచారించింది. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిధుల అక్రమ మళ్లింపునకే టీడీపీకి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రెండింటికీ వెంకటేశ్వరరావును ఆడిటర్గా నియమించారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి చేరినట్టు సీఐడీ అధికారులు గుర్తించారన్నారు. దీనిపై ఈ నెల 10న విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వరరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. టీడీపీ ఖాతాల్లో చేరిన రూ.27 కోట్లతోపాటు అక్రమంగా తరలించిన మిగిలిన నిధులపై రాబట్టిన కీలక ఆధారాలపై చంద్రబాబును సీఐడీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఐటీ రిటర్న్స్ను మాత్రమే సీఐడీ డౌన్లోడ్ చేసిందని, బ్యాంకుల నుంచి రికార్డులు తీసుకోలేదన్నారు. బ్యాంకర్ల నుంచి రికార్డులు తీసుకున్నారని చెబుతున్న చంద్రబాబు న్యాయవాదుల వాదనలో వాస్తవం లేదన్నారు. గతంలో రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన, సహాయ నిరాకరణ చేసి విలువైన సమయాన్ని వృథా చేశారని తెలిపారు. కాబట్టి చంద్రబాబును కనీసం మూడు రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని ఏఏజీ కోరారు. సీఎం హోదాలో ఉంటూ కుట్రపూరితంగా వ్యవహరించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు. సీఐడీ నోటీసులు జారీ చేసిన కీలక సాక్షులు చంద్రబాబుకు పీఎస్గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని విదేశాలకు పరారైన విషయాన్ని ఆయన మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర కీలక సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. 13 మంది నిందితులు బెయిల్పై ఉన్నారు.. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వండి చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల సంఘానికి టీడీపీ సమర్పించిన రిటర్న్స్లు, రికార్డులను తప్పుగా అన్వయిస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే 13మంది నిందితులు బెయిల్పై బయట ఉన్నందున చంద్రబాబుకు కూడా బెయిల్ మంజూరు చేయాలన్నారు. వాదనల సందర్భంగా న్యాయస్థానంపై చంద్రబాబు తరఫు న్యాయవాది దూబే చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తప్పుబట్టారు. సీడీ ఫైల్ లేకుండా విచారిస్తున్నారని దూబే వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తన టేబుల్పై ఉన్న సీడీ ఫైల్ను చూపిస్తూ ఇదేమిటి అన్ని ప్రశ్నించారు. న్యాయస్థానంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దాంతో కంగుతిన్న దూబే తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది. -
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్లో ఆడిటర్గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్యిన చంద్రబాబు రిమాండ్ను ఈ నెల 19 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో ఆయన మరో 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టు ముందుకు వర్చువల్గా చంద్రబాబు హాజరయ్యారు. కాగా, చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపు మధ్యాహ్నానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ . -
Oct 5th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:05 PM, అక్టోబర్ 05 2023 మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు ► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్రావు ► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు ► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు ► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు ► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు 6:00 PM, అక్టోబర్ 05 2023 ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్ ► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్ ► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్ ► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం ► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం ► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్ 5:10 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు ► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ ► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్లకు వాటా ఉందని విమర్శ Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:00 PM, అక్టోబర్ 05 2023 రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్పై వాదనలు ► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా ► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు ► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 4:45 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : చంద్రబాబు బెయిల్పై తీర్పు రిజర్వ్ ► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు ► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు ► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు 4:45 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల ► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది ► స్కామ్లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది ► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది ► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి ► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి ► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు ► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల 4:38 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు 4:31 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా ► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి ► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు 2:50 PM, అక్టోబర్ 05 2023 బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్ ► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న ► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు ► గన్నవరం ఆత్కూరు స్టేషన్లో కేసు పెట్టిన పేర్నినాని ► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు 2:50 PM, అక్టోబర్ 05 2023 బండారు కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్ ► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు ► బండారు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్కు హైకోర్టు సూచన ► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు ► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా ❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 2:45 PM, అక్టోబర్ 05 2023 లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం ► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు ► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:15 PM, అక్టోబర్ 05 2023 తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు ► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా? ► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి జనసేన రాజకీయ పార్టీ కాదు ! తెలుగుదేశం బలహీనపడినప్పుడు వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023 1:50 PM, అక్టోబర్ 05 2023 బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే ► ఏపీ హైకోర్టు: ఫైబర్గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు ► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం ► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం ► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి ► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు 1:40 PM, అక్టోబర్ 05 2023 మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP ► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు ► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్తో TDP నేతల భేటీ ► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ ► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు 1:20 PM, అక్టోబర్ 05 2023 ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా? ► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు ► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 1:10 PM, అక్టోబర్ 05 2023 కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ? ► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది ► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ► సీమెన్స్తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు ► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది ► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే 12:50 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై హైకోర్టులో వాదనలు ► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్కు ఇచ్చారు ► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, ► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది ► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్ 12:38 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు ► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు ► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ ► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ ► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ ► దీనికి సంబంధించిన ఆడిటర్ను విచారణకు పిలిచాం ► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు ► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు 12:30 PM, అక్టోబర్ 05 2023 ఫైబర్నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర ► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు ► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్ 12:30 PM, అక్టోబర్ 05 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP ► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు ►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి ►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు ►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు? ►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి? ►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు ►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది ►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది ►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? 12:24 PM, అక్టోబర్ 05 2023 బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే ► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది ► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్ 12:10 PM, అక్టోబర్ 05 2023 ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్పై నేడు కోర్టు నిర్ణయం ► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు ► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్ 12:04 PM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు ► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి ► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు ► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే ► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు ► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు 11:43 AM, అక్టోబర్ 05 2023 జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు ► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు ► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్న దేవినేని గౌతమ్ ► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్కు ఇస్తారని ప్రచారం ► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం ► దేవినేని గౌతమ్కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే ► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా 11:43 AM, అక్టోబర్ 05 2023 ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు ► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు ► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం ► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం 11:40 AM, అక్టోబర్ 05 2023 TDP, జనసేన అట్టర్ఫ్లాప్: జోగి రమేష్ ► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం ► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది ► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది ► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు ► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్ ► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్? ► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు ► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు ► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. - మంత్రి జోగి రమేష్ #PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2 — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 11:35 AM, అక్టోబర్ 05 2023 NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్ ► నాకు చాలా ఇబ్బందులున్నాయి ► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను ► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే.. ► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు ► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 11:30 AM, అక్టోబర్ 05 2023 NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.! ► తెలుగుదేశం కోసం పవన్కళ్యాణ్ NDAకు గుడ్బై ► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1 — ANI Digital (@ani_digital) October 5, 2023 11:20AM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో రిమాండ్ మెమో ► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID ► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ 11:00AM, అక్టోబర్ 05 2023 ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా 10:40AM, అక్టోబర్ 05 2023 బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు ►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు ►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు ►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి ►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం ►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు :::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు 10:24AM, అక్టోబర్ 05 2023 కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ ►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది ►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం ►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి ►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు ►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు ►బెయిల్పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్పై ప్రారంభం కానున్న వాదనలు 09:56AM, అక్టోబర్ 05 2023 ముందస్తుపై కాసేపట్లో వాదనలు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం ►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు ►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు 09:22AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? ►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు ►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు ►రిమాండ్లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు 09:00AM, అక్టోబర్ 05 2023 పరిటాల సునీతపై కేసు నమోదు ►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు ►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ ►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు 08:29AM, అక్టోబర్ 05 2023 నేడు రాజమండ్రికి లోకేష్? ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ ►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్? ►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 08:08AM, అక్టోబర్ 05 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు ►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►నేడు విచారణకు వచ్చే అవకాశం 07:53AM, అక్టోబర్ 05 2023 తాడు లేని బొంగరంగా.. టీడీపీ ►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల ►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు ►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. ►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు. ►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు ::: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023 07:48AM, అక్టోబర్ 05 2023 డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట! ►మహానేత వైఎస్సార్పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప ►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్ ►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ ►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!. ►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత! వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1 — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:26AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రిలో పోలీసుల అలర్ట్ ►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు ►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు 07:18AM, అక్టోబర్ 05 2023 సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్రెడ్డి ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ ►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు ►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన ►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు ►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ ►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు ►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు ►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 06:58AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ ►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు ►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు 06:52AM, అక్టోబర్ 05 2023 రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►వర్చువల్గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్గానే ప్రవేశపెట్టిన వైనం ►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు 06:40AM, అక్టోబర్ 05 2023 జైల్లో భద్రంగా చంద్రబాబు ►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు ►స్నేహ బ్లాక్లో ప్రత్యేక వసతులు ►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి ►కుటుంబ సభ్యులతో ములాఖత్లు 06:30AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26 ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్ -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్కు హైకోర్టు ఆదేశం ►లోకేష్పై మూడు కేసులు, రింగ్రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్గా ధృవీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest: Petitions in different courts - Live Updates 5:10 PM, సెప్టెంబర్ 27, 2023 కిం కర్తవ్యం.? ► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు ► పారని లీగల్ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు ► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్కు సూచించిన ఎంపీలు ► ఆంధ్రప్రదేశ్కు వస్తే లోకేష్ను అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు ► లోకేష్ వెళ్లగానే అరెస్ట్ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు ► ముందస్తు బెయిల్కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు ► వెళ్లి అరెస్ట్ అయ్యేకంటే ఇక్కడే హోటల్లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్ 4:50 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టు : బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అక్టోబర్ 4న నిర్ణయం ► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా ► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం ► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన ►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి 4:25 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్ పొన్నవోలు ► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు ► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం ► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి ► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు ► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు ► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం ► పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు? ► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు? ► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి ► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి ► ఎంతకాలం పిటిషన్ను పెండింగ్ లో ఉంచాలి? ► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి 4:20 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID ► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది ► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు ► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు ► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు ► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు 4:05 PM, సెప్టెంబర్ 27, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు ► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్ చేయమని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం 3:30 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు ► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ 3:20 PM, సెప్టెంబర్ 27, 2023 రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్ వద్దు : అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై వాదనలు ► వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్ ► స్కిల్, ఇన్నర్ రింగ్రోడ్ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి ► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు ► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు ► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్ జనరల్ శ్రీరాం 3:00 PM, సెప్టెంబర్ 27, 2023 "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా 2:45 PM, సెప్టెంబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". 2:35 PM, సెప్టెంబర్ 27, 2023 నాట్ బిఫోర్ : సుప్రీంకోర్టు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు ► చంద్రబాబు పిటిషన్పై "నాట్ బిఫోర్ మి" అని స్పందించిన జస్టిస్ SVN భట్టి ► మరో బెంచ్కు పిటిషన్ను మార్చాల్సిన అవశ్యకత ► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్ భట్టి ► బాబు పిటిషన్పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 2:15 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్ నెంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్పై కొద్దిసేపట్లో విచారణ ► చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► కిక్కిరిసిన హాల్ నెంబర్ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు ► బెంచ్ మీదకు వచ్చిన కేసు 2:10 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్ నెంబర్ 3 ► మరికొద్దిసేపట్లో స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించనున్న సుప్రీంకోర్టు ► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► ఐటం నెంబర్ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్ ► స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 12289/2023 ► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్ గుంటూరు ప్రమోద్ ► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్ ► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► Follow www.sakshi.com LIVE updates 1:56 PM, సెప్టెంబర్ 27, 2023 బాబు దోచుకుంటే.. జగన్ ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్ ► స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు ► చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు. ► ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు ► సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు ► 26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారు ► సీఎం జగన్.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు 1:10 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► అరెస్ట్ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్రను తేల్చిన CID ► లోకేష్కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID ► తనను అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్ 1:00 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్ ► లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ ► లంచ్ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి ► మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ ► ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ 12:50 PM, సెప్టెంబర్ 27, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:40 PM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ జోలికి రావొద్దు : తెలుగుదేశం ► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం ► లోకేష్ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్ ► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు ► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం ► ఆఘమేఘాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టిన పంచుమర్తి అనురాధ ► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు ► హెరిటేజ్కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు ► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి ► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP ► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP 12:10 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ? ► కస్టడీ, బెయిల్ పిటిషన్పై CID, బాబు లాయర్ల వాదనలు ► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు ► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు ► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన ► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి 11:40 AM, సెప్టెంబర్ 27, 2023 కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 11:30 AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్ ► వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు ► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు ► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు ► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు 11:15AM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు ► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్ వివేకానంద ► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి 11:10AM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్లో నేడు వాదనలు జరిగే అవకాశం ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► అరెస్ట్ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► 17A సెక్షన్ ప్రకారం గవర్నర్కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు ► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు ► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు ► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ ► రేపటి నుంచి అక్టోబర్ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 11:00AM, సెప్టెంబర్ 27, 2023 ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు ► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు ► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 10:50AM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్కుమార్ పిటిషన్ ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ►ఇప్పటికే బెంచ్ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ ►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్ ►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు ►మరో బెంచ్కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్ నెంబర్ 38371/2023 కేటాయింపు ►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి ►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి ►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయి ►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం ►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది ►ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు పిటిషన్ 10:30AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్ను తప్పుపడుతున్నారంతే.! ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటం నెంబర్ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 10:00AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్ను తప్పుపడుతున్నారంతే.! ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి ►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ ►ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కొట్టివేత కూడా ► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదైన స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలని పిటిషన్ ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి.. నేడు విచారణ 09:22AM, సెప్టెంబర్ 27, 2023 ముందు ఏ పిటిషన్పై విచారణ? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారుల పిటిషన్ ►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ ►లోకేష్ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం.. 09:10AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్లపై చర్చ ►ఏపీ అసెంబ్లీ సెషన్.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. ►అలాగే శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపైనా చర్చ జరగనుంది 08:55AM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే ►ఇన్నర్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా ►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు ►ఇన్నర్ రింగ రోడ్ అలైన్మెంట్ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 08:00AM, సెప్టెంబర్ 27, 2023 తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి ►తండ్రి ఎలాగో కొడుకు అలాగే! ►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి. ►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి. ►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి ►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది. Like father, Like son! Meet Nara Lokesh A14 in the Inner Ring Road scam. While in Delhi he should offer a buy-one-get-one-free scheme to the lawyers he is meeting. Take up the father’s case and you’ll get the son's case for free. This father-son duo’s game is now over. pic.twitter.com/JIhpnXrA8R — Vijayasai Reddy V (@VSReddy_MP) September 27, 2023 06:52AM, సెప్టెంబర్ 27, 2023 క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ ►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 06:52AM, సెప్టెంబర్ 27, 2023 నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 06:45AM, సెప్టెంబర్ 27, 2023 నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ ►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు ►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 06:44AM, సెప్టెంబర్ 27, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 06:00AM, సెప్టెంబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్డెవలప్మెంట్ స్కామ్లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్లో చంద్రబాబు ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Case Live Updates 6:52PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు ►ఇది వాళ్లకు కొత్తేం కాదు ►డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ ►ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 5:50 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్ ► అమరావతి రాజధాని ప్లాన్పై కాగ్ సంచలన నివేదిక ► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం ► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే ► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు ► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు ► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు ► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు 5:35 PM, సెప్టెంబర్ 25, 2023 అమవాస్య చీకటిలో తెలుగుదేశం : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ► చంద్రబాబు అరెస్ట్తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది ► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి ► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు ► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్ను తెచ్చుకున్నట్టున్నాడు ► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి ► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది 5:15 PM, సెప్టెంబర్ 25, 2023 లోకేష్కు అరెస్ట్ భయం లేదు ► లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు ► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు ► నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు ► లోకేష్కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు ► నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు ► నాకు కూడా కేసులు, అరెస్ట్లు కొత్త కాదు 5:00 PM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ ముగిసింది ► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్ ► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం ► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం ► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం 4:00 PM, సెప్టెంబర్ 25, 2023 కేసులు ఇవి, స్టేటస్ ఇది ► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు ► రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు ► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 భువనేశ్వరీ వ్యాఖ్యలను తప్పుబట్టిన YSRCP ► చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిందే మీ నాన్న ఎన్టీఆర్ ► మీ నాన్న స్వయంగా చెప్పినా.. ఇంకా చంద్రబాబుకే మద్ధతిస్తారా? నక్కను తెచ్చి మీరు సింహం అని లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకండి మేడం. ముసలి నక్క గర్జించినా ఏమీ కాదు. ఆయనేమీ చేసేది ఉండదు. ఆయన్ను గొడ్డుకన్నా హీనం.. పశువుకన్నా ఘోరం అని మీ నాన్న ఎన్టీఆర్ గారే స్వయంగా చెబితే మీరేమో ఆయన్ను సింహం అంటుంటే ప్రజలకు నవ్వొస్తోంది.. మీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో మీ… https://t.co/bJHolk6EM3 — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్కు అచ్చెన్నాయుడు ► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి ► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి ► పార్టీ సీనియర్ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం ► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్ అయిన చంద్రబాబు ► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి 3:45 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు ► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం ► అరెస్ట్ సమయంలో CID అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ ► తన అరెస్ట్కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్ ► కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి ► కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా ► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు ► కస్టడీ పిటిషన్పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ ► బెయిల్ పిటిషన్పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు ► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు ► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు 3:30 PM, సెప్టెంబర్ 25, 2023 రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా? ► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు ► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు ► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు ► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్పై వాదనలు వింటుందంటున్న లాయర్లు 3:15 PM. సెప్టెంబర్ 25, 2023 షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID ► బాబు సృష్టించిన షెల్ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే ► షెల్ కంపెనీ డైరెక్టర్లుగా సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్ ► షెల్ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్ ► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు ► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు ► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి ► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు 2:45PM. సెప్టెంబర్ 25, 2023 ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి? ► చంద్రబాబు కస్టడీ పిటిషన్పై వాదనలు ప్రారంభం ► నిధుల గోల్మాల్కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు ► 2014-18 మధ్య స్కిల్ కుంభకోణం ► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు ► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే ► పార్టీకి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, హైదరాబాద్ జోన్ ఖాతాలో భారీగా డిపాజిట్లు ► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ ► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు ► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు ► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను ► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ పట్టుదల ఉంది ► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు ► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను ► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్ ► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్ ► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP ► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ ► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు ► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు ► ఈ లెక్కన కేవలం హెరిటేజ్లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.! ► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత? ► హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్ విలువ ఎంత? ► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు? మా కుటుంబం అంతా ఒకటే నమ్ముతాం... మా కుటుంబానికి ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ముకు ఆశపడితే ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది. #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SqVhXhFpte — Telugu Desam Party (@JaiTDP) September 25, 2023 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి ► లోకేష్ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.? ► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్ ► లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ ► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్ ► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు ► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్ ► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక ► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి ► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు ► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ ► భవిష్యత్ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ ► చంద్రబాబు ఔట్ సోర్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు “చంద్రబాబు అవుట్ సోర్సింగ్ రాజకీయాలు” చంద్రబాబు రాజకీయాలు మొత్తం పక్కరాష్ట్రం నుంచి అవుట్ సోర్సింగ్ మీదనే నడిపిస్తున్నారు. అయన ఏపీ నివాసి కాదు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి సైతం హైదరాబాదీలే.. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో… — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 1:25 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్ ► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు ► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు ► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము ► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది ► కస్టడీ పొడిగింపు పిటిషన్పై మా వాదనలు వినాలి : CID ► పోలీస్ కస్టడీ పిటిషన్పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం ► ముందు బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు ► కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తవగానే బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామన్న కోర్టు 1:22 PM, సెప్టెంబర్ 25, 2023 మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే కోర్టు మీద నిందలేస్తారా? ► రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు ► కొందరు సొంత లబ్ది కోసం జర్నలిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు ► కోర్టు మీద విమర్శలు చేసి జర్నలిజాన్ని చంపేశారు ► ఓ వర్గం మీడియా సమాంతర వ్యవస్థను నడుపుతోంది, అన్నీ తాను చెప్పినట్టుగా జరగాలంటోంది ► న్యాయ వ్యవస్థను కొన్ని ఛానెల్స్ కించపరుస్తున్నాయి 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసా? : భువనేశ్వరీ ► మా కుటుంబానికి వ్యాపారాలున్నాయి ► నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నా ► నా సంస్థలో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి ► ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు ► ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏటా రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? : అంబటి ► చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారికి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి ► ఈ కేసులో సమగ్ర ఆధారాలు బయటపడుతుండడంతో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయి ► గతంలోలా సమాజమంతా ఎల్లో మీడియా మీద ఆధారపడనవసరం లేదు ► ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు ► ఒకాయిన ఢిల్లీలో ఉన్నాడు, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ► స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగింది 12:55 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది చట్టం చేస్తున్న పని, దీనికి రాజకీయాలతో సంబంధమేంటీ? ► చంద్రబాబు అరెస్ట్పై స్పందించిన సినీ నటుడు సుమన్ ► మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సుమన్ ► జైల్కు వెళ్లాడంటే సీఎం జగన్ చేశారంటున్నారు కానీ అది సరికాదు ► ఒకరు జైలుకు వెళ్లారంటే దాని వెనక చాలా కారణాలుండొచ్చు ► ఆ అరెస్ట్ గురించి నిర్ణయించే బాధ్యత కోర్టులపై ఉంటుంది ► మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు అన్ని ఆలోచించే వుంటారు ► టైం బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా వస్తుంది ► టైం బాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ► చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తాడో జ్యోతిష్యులు చెప్పగలరేమో.! 12:48 PM, సెప్టెంబర్ 25, 2023 మరిన్ని రోజులు కస్టడీ కోరిన సీఐడీ ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు ►ముందు కస్టడీ పిటిషన్ వాదనలు వినాలని కోరిన సీఐడీ ►కస్టడీలో చంద్రబాబు సహకరించలేదంటున్న సీఐడీ ►కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఆదేశించిన జడ్జి 12:22 PM, సెప్టెంబర్ 25, 2023 దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు: అంబటి స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మంత్రి అంబటి అసెంబ్లీలో మాట్లాడారు ►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు ►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది ►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు ►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు ►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం ►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్లు చాలానే ఉండొచ్చు ► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు 12:00 PM, సెప్టెంబర్ 25, 2023 మరో 3 రోజులు కస్టడీ కావాలి : CID ► ACB కోర్టులో మరోసారి కస్టడీ పిటీషన్ దాఖలు చేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపిన CID ► మరో మూడు రోజులు విచారణ జరుపుతామని విజ్ఞప్తి 11:45AM, సెప్టెంబర్ 25, 2023 తాజా పరిణామాలపై పక్కాగా ప్రిపేరయిన CID ► ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతున్నారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది ►చంద్రబాబు బెయిల్ విషయంలో పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోన్న CID 11:32AM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో మధ్యాహ్నం తర్వాత బెయిల్ పిటిషన్పై విచారణ ► మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ ► బెయిల్పై ఇరుపక్షాల వాదనలు వింటామన్న ACB కోర్టు ► ACB కోర్టుకి చేరుకున్న కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ ఆధ్వర్యంలోని సిట్ బృందం 11:30AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ► 284 పేజీలతో SLP దాఖలు చేసిన బాబు లాయర్ల బృందం ► చంద్రబాబుకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి ► ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 11:25AM, సెప్టెంబర్ 25, 2023 అరెస్ట్పై చర్చించేందుకు అసెంబ్లీకి రారా? ► చర్చిస్తామని చెప్పిన టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బాయ్కాట్ చేశారు? : YSRCP ► ఈ కేసుపై సమగ్రంగా చర్చిద్దాం, రండి సభకు వచ్చి మాట్లాడండి : YSRCP స్కిల్ స్కామ్లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 11:15AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో తెలుగుదేశం వరుస పిటిషన్లు ► క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం నేతలు ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు ► ఈ FIRను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో FIRను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు 11:00AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు వరుస పిటిషన్లు ► పిటిషన్లతో కోర్టును ఇరకాటంలో పెడుతోన్న చంద్రబాబు లాయర్లు ► సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు ► ప్రతీ పిటిషన్ అర్జంటుగా స్వీకరించి వాదనలు వినాలంటూ విజ్ఞప్తులు ► సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే ► పిటిషన్ ఎప్పుడు విచారించాలన్నది కోర్టు చూసుకుంటుందన్న న్యాయమూర్తి 10:55AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీం ముందుకు రేపు చంద్రబాబు పిటిషన్ ► రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు ► త్వరంగా తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను విజ్ఞప్తి చేసిన లూథ్రా ► చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని అడిగిన సీజే ► ఈ నెల 8న అరెస్ట్ చేశారన్న లుత్రా ► కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్ న్యాయవాది లూథ్రా ► సరే, ఇప్పుడెందుకు అన్ని వివరాలు రేపే మెన్షన్ చేయమన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ► పిటిషన్ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని చెప్పిన చీఫ్ జస్టిస్ 10:45AM, సెప్టెంబర్ 25, 2023 మధ్యాహ్నం తర్వాత ములాఖత్లు ► రాజమండ్రి : మధ్యాహ్నం తర్వాత సెంట్రల్ జైల్లో చంద్రబాబు ములాఖత్ ► చంద్రబాబును కలవనునున్న భువనేశ్వరీ, బ్రహ్మణి, టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ► మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న నారా భువనేశ్వరి ► అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారి దర్శనం చేసుకోనున్న భువేనేశ్వరి ► అక్కడినుంచి జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి ► మధ్యాహ్నం తర్వాత రాజమండ్రికి వచ్చి ములాఖత్లో చంద్రబాబును కలవాలని ప్రోగ్రామ్ 10:35AM, సెప్టెంబర్ 25, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► ఇవ్వాళ బెంచ్ కేటాయిస్తేనే 28లోపు వాదనలు జరిగే అవకాశం ► ఇదే విషయాన్ని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని సిద్ధార్ధ్ లూథ్రా నిర్ణయం ► తన పిటిషన్పై వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని కోరనున్న సిద్ధార్ధ్ లూథ్రా 10:30AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► ఇవాళ హైకోర్టు ముందుకు మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ పిటిషన్ ► తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నారాయణ పిటిషన్ ► నాలుగు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ 10:26AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో స్టేటస్ ఏంటీ? ► సుప్రీంకోర్టుకు మరోసారి నేడు చంద్రబాబు లాయర్లు ► చంద్రబాబు పిటిషన్ను త్వరగా విచారించాలని కోరనున్న న్యాయవాదులు ► ఈ నెల 23న (శనివారం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ► చంద్రబాబు పిటిషన్ను ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ► ఇవ్వాళ ఏ బెంచ్ అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ► రేపు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని బాబు లాయర్ల విజ్ఞప్తి 10:16AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు ముఖ్యమైన అంశాలు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ప్రమోద్ దూబే ►చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న CID ►ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా కోరిన సీఐడీ 09:48AM, సెప్టెంబర్ 25, 2023 ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే ►తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? ►అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు ►ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే :::ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 09:25AM, సెప్టెంబర్ 25, 2023 అవినీతి బయటపడుతుందనే.. అసెంబ్లీ బాయ్కాట్ ►స్కిల్ స్కామ్లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. ►చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ►వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే స్కిల్ స్కామ్లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 09:20AM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి: మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి 08:59AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంలో పెండింగ్ కేసుగా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరేందుకు బాబు తరపు న్యాయవాదుల ప్రయత్నాలు ►ఓరల్ మెన్షన్ జాబితాలో కనిపించని బాబు కేసు ►ఈనెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు ►బాబు పిటీషన్ ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►పెండింగ్ కేసు గా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 08:40AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు: సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ►మరో మూడు రోజులపాటు చంద్రబాబు కస్టడీ పొడిగించాలని.. ఏసీబీ కోర్టును సీఐడీ కోరే అవకాశం ►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న సీఐడీ ►ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ ►మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు ►బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్లో పేర్కొన్న సీఐడీ 08:03AM, సెప్టెంబర్ 25, 2023 నేడు వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసులపై విచారణ ►ఇన్నర్ రింగ్రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాంలో సీఐడీ వేసిన పీటీ వారెంట్పై విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు క్వాష్ పిటిషన కొట్టివేతపై సుప్రీం కోర్టులో సవాల్ 07:16AM, సెప్టెంబర్ 25, 2023 స్కిల్ కేసుల్లో కస్టడీ పిటిషన్ ఛాన్స్ ►చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసే ఛాన్స్ ► రెండు రోజుల విచారణలో కాలయాపన చేసినట్లు చెబుతున్న సీఐడీ వర్గాల/ ► ఇంతకు ముందు ఐదు రోజులు కోరితే.. 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు ► శని, ఆదివారాల్లో మొత్తం కలిపి 12 గంటలపాటు ఇంటరాగేష్ చేసిన సీఐడీ బృందం ►కీలక డాక్యుమెంట్లు ముందు ఉంచి ప్రశ్నించినా.. దాటవేత ప్రదర్శించిన చంద్రబాబు ► మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసే అవకాశాలు 06:52AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్! ►16వ రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు రిమాండ్ ►నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ►ఉదయం ఎనిమిది గంటలకు ములాఖత్ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్న నారా భువనేశ్వరి 06:48AM, సెప్టెంబర్ 25, 2023 రిమాండ్ పొడిగింపుతో మరికొన్ని రోజులు జైల్లోనే చంద్రబాబు ►స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ దాకా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు ►ఆదివారంతో ముగిసిన సీఐడీ కస్టడీ ►ఆదివారంతోనే ముగిసిన రిమాండ్ కూడా ►కస్టడీ ముగిశాక వర్చువల్గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చిన అధికారులు ►కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని చంద్రబాబుతో వ్యాఖ్యానించిన జడ్జి ► బెయిల్ పిటిషన్పై నేడు విచారణ చేపడతామని వ్యాఖ్య ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ► వరుస పిటిషన్ల నేపథ్యంతో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్ -
మరో 11 రోజులు జైల్లోనే చంద్రబాబు
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రిమాండ్ను ఆదివారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 05 తేదీ దాకా ఆయన రిమాండ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ జడ్జి.. తక్షణమే ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయన మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ తరుణంలో రెండు రోజుల కస్టడీ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఆదివారం సాయంత్రం వర్చువల్గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు. చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. అందుకే ఆయన రిమాండ్ను పొడిగించాలని మోమో దాఖలు చేసింది సీఐడీ. పరిశీలించిన న్యాయమూర్తి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున రిమాండ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబును ఆరా తీసిన జడ్జి వర్చువల్గా హాజరైన చంద్రబాబును జడ్జి కొన్ని విషయాలు అడిగారు. విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని చంద్రబాబును ప్రశ్నించగా.. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే.. వైద్య పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించగా.. నిర్వహించారు అని సమాధానం ఇచ్చారాయన. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?.. ఏమైనా అసౌకర్యం అనిపించిందా? అనే ప్రశ్నలకు.. అలాంటిదేమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దీంతో జడ్జి.. ‘‘మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు, మీ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇప్పుడే అంతా అయిపోలేదు. బెయిల్ పిటిషన్పై రేపు(సెప్టెంబర్ 25, సోమవారం) వాదనలు వింటాం’’ అని చంద్రబాబుకి స్పష్టం చేసింది. చంద్రబాబు లాయర్లపై అసహనం సీఐడీ పిటిషన్పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో.. సదరు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని బాబు లాయర్లను ప్రశ్నించారు ఏసీబీ జడ్జి. ‘‘ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది’’అని చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, ఏసీబీ జడ్జి మందలించారు. అదే సమయంలో ‘‘ విచారణలో ఇప్పటిదాకా ఏం గుర్తించారనేది బయటపెట్టాలి’ అని చంద్రబాబు, ఏసీబీ జడ్జిని కోరారు చంద్రబాబు. అయితే.. విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి, ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ ఇప్పటికే సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పత్రాలను మీ లాయర్లను అడిగి తీసుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. కస్టడీ పొడిగింపు కోరాల్సి ఉంది సీఐడీ కస్టడీలో.. విచారణకు చంద్రబాబు సహకరించలేదు. అందుకే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం. చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సీఐడీ కస్టడీ పొడిగించమని కోరలేదు. రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం అని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. -
CBN: ఇంటరాగేషన్లో కాలయాపన.. ప్రశ్నలకు జవాబులు దాటవేత
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును ఇంటరాగేషన్ చేసింది సీఐడీ అధికారుల బృందం. అయితే విచారణలో ఆయన అధికారులకు ఏమాత్రం సహకరించకపోగా.. డాక్యుమెంట్ల సాకుతో కాలయాపన చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారుల బృందం విచారించింది. రెండో రోజు దాదాపు 6 గంటలకు పైగా చంద్రబాబును విచారించారు. రెండు రోజుల పోలీస్ కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదు. డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి, దాటవేతకు ప్రయత్నించారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రతీ గంటకకు అయిదు నిమిషాల బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు విచారణను వీడియో తీయించారు. అనంతరం బాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ అధికారి డిఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ చేశారు. ఒక్కో బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉండగా.. రెండు రోజుల విచారణలో దాదాపు వంద ప్రశ్నలు సంధించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారణ జరిపారు. చంద్రబాబు పీఏపెండ్యాల శ్రీనివాస్కు హవాలా రూపంలో రూ. 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నించారు. 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలు, అర్ధికశాఖ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రూ. 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని అధికారులు ప్రశ్నించారు. ఐఏఎస్అధికారుల వాంగ్మాలాలను, డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని అధికారులు ప్రశ్నించారు. బాబుకు, గంటా సుబ్బారావుకు, సుమన్ బోస్కు మధ్య సంబందాలపైనా సీఐడీ అధికారులు విచారించారు. కిలారు రాజేష్కు నారా లోకేష్కు మధ్య ఆర్ధిక సంబంధాలపైనా ప్రశ్నలు వేశారు. అయితే కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు దాటవేసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబుని వర్చువల్గా హాజరుపరిచారు సీఐడీ అధికారులు. -
సీఐడీ కస్టడీకి చంద్రబాబు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విచారించేందుకు సీఐడీకి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. సమయాభావం, ఇతరత్రా కారణాల వల్ల చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారిస్తామని సీఐడీ.. ఏసీబీ కోర్టుకు తెలిపింది. కోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 23, 24వ తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని సీఐడీకి కోర్టు స్పష్టం చేసింది. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇవ్వాలంది. బ్రేక్ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడవచ్చని తెలిపింది. పోలీసు కస్టడీ సమయంలో విచారణ కనిపించేంత దూరంలో చంద్రబాబు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి స్పష్టం చేసింది. పోలీసు కస్టడీలో ఏ విధంగానూ జోక్యం చేసుకోరాదని, సుప్రీంకోర్టు నిర్ధేశించిన విధంగానే సాయం అందించాలని చంద్రబాబు న్యాయవాదిని ఆదేశించింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలని, ప్రక్రియను మొత్తం రహస్యంగా ఉంచి, సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఇవ్వాలంది. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు అవసరమైన వైద్య, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఐడీని ఆదేశించింది. పోలీసు కస్టడీకి ముందు, తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలంది. విచారణ సందర్భంగా చంద్రబాబుపై ఎలాంటి థర్డ్ డిగ్రీ పద్దతులు గానీ, కఠిన చర్యలు గానీ చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. విచారణ ముగిశాక కోర్టుకు హాజరు పరచాలి 24న విచారణ ముగిసిన తర్వాత చంద్రబాబును సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు పరచాలని ఏసీబీ కోర్టు చెప్పింది. ఇద్దరు మధ్యవర్తులైన అధికారులు, సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్ను.. వారి పేర్లు, ఇతర వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది. చంద్రబాబు పోలీసు కస్టడీకి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పింది. కోర్టు సమర్పించిన జాబితాలోని అధికారులను, అలాగే కోర్టుకు సమర్పించిన జాబితాలోని చంద్రబాబు న్యాయవాదుల్లో ఒకరిని అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా కోర్టుకు చంద్రబాబు న్యాయవాదులు సమరి్పంచిన పేర్లలో న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు, మెండా లక్ష్మీనారాయణ, టి.విష్ణు తేజ, డి.రాంబాబు, సువ్వారి శ్రీనివాస్, పారా కిషోర్ ఉన్నారు. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు పాత్రపై కీలక ఆధారాలున్నాయని, వాటిని ఆయన ముందుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉందని, అందు కోసం ఆయన్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగ వివేకానంద, హైకోర్టు అదనపు పీపీ ఎస్.దుష్యంత్రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్, దమ్మాలపాటి శ్రీనివాస్లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు, చంద్రబాబును పోలీసు కస్టడీకి అప్పగించేందుకు కారణాలు ఉన్నాయా? లేదా? అన్న ప్రశ్నకు కోర్టు తన ఉత్తర్వుల్లో సమాధానం ఇచ్చింది. సీఐడీ తమ ముందుంచిన సాక్ష్యాధారాలను బట్టి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన సాంకేతిక సాయం అందజేసిన కంపెనీలకు చెల్లింపుల తాలుకు నోట్ ఫైళ్లు, ఆయా కంపెనీలతో జరిపిన లావాదేవీలు, చర్చలు తదితరాలకు సంబంధించిన సమాచారం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వడం సముచితమని తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తున్నట్లు న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కూడా చదవండి: బాబుకు భంగపాటు -
చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్కు తగిలాయి. ఒకవైపు ఆయన రిమాండ్ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇంకోవైపు.. ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. వీటితో పాటు ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలను కూడా అనిశా(ACB) కోర్టు వాయిదా వేయడం గమనార్హం. స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడిని ఐదురోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరగ్గా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. తీర్పు సమయంలో చంద్రబాబును ఎక్కడ విచారిస్తారనే దానిపై సీఐడీ సమాధానం ఆధారంగా తీర్పు ఉంటుందని తొలుత ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. అయితే.. ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దు ఆయన్ని జైల్లోనే విచారిస్తామని సీఐడీ సమాధానం ఇవ్వడంతో.. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే రెండ్రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ‘‘విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వండి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గం. లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతిస్తాం. ఇబ్బందులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని జడ్జి ఈ సందర్భంగా సీఐడీ అధికారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు కస్టడీ తీర్పుతో.. రేపు(శనివారం), ఆదివారం జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అలా ఎలా వింటాం? మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కస్టడీ విచారణ జరిగే సమయంలో వాదనలు ఎలా వింటామని?.. అలా వినడం సరికాదని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఆపై.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారం వింటామని తెలిపింది. అంతకు ముందు రెండు అంతకు ముందు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ముగిసి పోవడంతో.. ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టులోనూ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ‘‘ఇంత దర్యాప్తు జరిగిన తర్వాత.. ఈ దశలో తాము జోక్యం చేసుకోమని.. దర్యాప్తును ఆపే ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. -
Sep 22nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 8:46 PM, సెప్టెంబర్ 22, 2023 కోర్టు ఆదేశాల ప్రకారమే బాబు విచారణ ►చంద్రబాబును విచారించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ. ►రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్లో విచారించనున్న సీఐడీ ►కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ►విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ ►ఉదయం 9.30 నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు సీఐడీ విచారణ ►చంద్రబాబు తరపున ఒక లాయర్కు అనుమతి ►విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్కు కోర్టు ఆదేశం 7:45 PM, సెప్టెంబర్ 22, 2023 సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ ► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం ► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ ► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం ► డిప్యూటీ సూపరిండెంట్కు పర్యవేక్షణ బాధ్యతలు ► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ ► మరోసారి తన నిర్వేదాన్ని బయటపెట్టుకున్న లూథ్రా ► ట్వీట్లో ఆశావాదం ప్రదర్శించేందుకు లూథ్రా ఆరాటం Har raat ki subah Aati hai Naya din Ujala laata hai - there is dawn after night and each morning brings light into our lives — Sidharth Luthra (@Luthra_Sidharth) September 22, 2023 6:00 PM, సెప్టెంబర్ 22, 2023 బాబును ప్రశ్నించేందుకు టీం రెడీ ► కాసేపట్లో రాజమండ్రికి బయల్దేరనున్న సీఐడీ ► మరో 15 గంటల్లో సీఐడీ కస్టడీలోకి చంద్రబాబు ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ బృందం ► ఒక CI, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్లు, ఒక వీడియోగ్రాఫర్ సహా 12 మందికి అనుమతి ► అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ► కస్టడీ విచారణకు చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లకు అనుమతి 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంను బయటపెట్టింది GST ► స్కిల్ స్కాంను బయటపెట్టింది కేంద్ర సంస్థ ► రాష్ట్ర దర్యాప్తు సంస్థకు కావాల్సిన సమాచారం ఇచ్చారు ► అసెంబ్లీలో ప్రకటించిన అధికార పక్షం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని ఫస్ట్ బయటపెట్టింది జీఎస్టీ అధికారులు. అప్పట్లో నిధులు మళ్లింపు జరిగిందని టీడీపీ ప్రభుత్వాన్ని ఒక విజిల్ బ్లోయర్గా జీఎస్టీ, ఈడీ హెచ్చరించాయి. కానీ.. ఆరోజు @JaiTDP ప్రభుత్వానికి జీఎస్టీ విజిల్ వినిపించలేదు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి టీడీపీ… pic.twitter.com/fEc3ShhCoF — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 5:30 PM, సెప్టెంబర్ 22, 2023 మన పిటిషన్ కొట్టుడుపోయింది, ఏటి సేద్దాం.? ► రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లాయర్ లక్ష్మీనారాయణ ములాఖత్ ► క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించిన లాయర్ ► టిడిపి లీగల్ టీంపై చంద్రబాబు ఆగ్రహం ► మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించిన చంద్రబాబు ► ఎంత ఖర్చయినా సరే.. టాప్ లాయర్లంతా మనదగ్గరే ఉండాలన్న చంద్రబాబు ► కొత్తగా మరిన్ని పిటిషన్లు వేస్తామని చంద్రబాబుకు వివరించిన లాయర్ లక్ష్మీనారాయణ ► ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారులేమున్నాయని అడిగిన బాబు ► తదనంతర కార్యాచరణపై లాయర్ లక్ష్మీనారాయణతో మాట్లాడిన చంద్రబాబు 5:20 PM, సెప్టెంబర్ 22, 2023 జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం.? ► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు ► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం ► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి? ► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు? ► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా? ► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం ► రేపు లోకేష్ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి ► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న 5:15 PM, సెప్టెంబర్ 22, 2023 సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ ► సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్పై లాయర్లతో చర్చిస్తున్న లోకేష్ ► హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై లాయర్ల అధ్యయనం ► సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే కిం కర్తవ్యం.? ► తమకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయి? ► ఏం వాదన చెబితే న్యాయస్థానంలో సాంకేతికంగా బయటపడవచ్చు.? ► శోధనలు, పరిశోధనలతో కుస్తీ పడుతోన్న టిడిపి లీగల్ సెల్ 5:10 PM, సెప్టెంబర్ 22, 2023 ఇప్పట్లో లోకేష్ ఢిల్లీని వదిలేది లేదు ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే నారా లోకేష్ : ఎల్లో మీడియా ► హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు ► లోకేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయిందంటూ ఎల్లో మీడియా వార్తలు ► ఇప్పటికే అరెస్ట్ భయంతో వణికిపోతోన్న లోకేష్ ► తాజాగా చంద్రబాబు క్వాష్ కూడా తిరస్కరణకు గురవడంతో లోకేష్లో పెరిగిన భయం ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయించినట్టు ఎల్లోమీడియా వార్తలు ► సుప్రీంకోర్టులో లోకేష్ న్యాయపోరాటం చేస్తారంటున్న ఎల్లోమీడియా ► ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేసిన సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్ ITC మౌర్యలో బస ► ITC మౌర్యలో రోజుకి సూట్ అద్దె లక్ష రూపాయల పైనే ► ITC మౌర్య హోటల్ మరిన్ని రోజులు ఉండనున్న లోకేష్ 5:00 PM, సెప్టెంబర్ 22, 2023 TDP క్యాంపు ఖాళీ ► రాజమండ్రి : హైకోర్టు ఆదేశాల తర్వాత టిడిపి నిరసన క్యాంపు ఖాళీ ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ వెనక పూర్తి కారణాలు వెల్లడించిన హైకోర్టు ► తప్పు జరిగిందని స్పష్టంగా బయటికొచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు ► నిన్నటి వరకు అక్రమ అరెస్ట్ అన్న టిడిపి నేతలు ► పచ్చ మీడియా వార్తలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం ► మొత్తం కుంభకోణాన్ని స్పష్టంగా బయటపెట్టిన హైకోర్టు ఉత్తర్వులు ► పైగా ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పడంతో పూర్తి అవగాహన ► తీర్పు తర్వాత టిడిపి క్యాంప్ నుంచి వెళ్లిపోయిన కార్యకర్తలు ► నాయకులు, నేతలు లేక బోసిపోయిన టిడిపి క్యాంప్ 4:10 PM, సెప్టెంబర్ 22, 2023 రేపు, ఎల్లుండి చంద్రబాబు కస్టడీ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీకి తీసుకోనున్న సీఐడీ ► రెండు రోజుల కస్టడీలో ప్రశ్నించే అంశాలపై సీఐడీ కసరత్తు ► పలు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రిపరేషన్ ► మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదన్న ఏసీబీ కోర్టు ► చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ► కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి ► చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్న కోర్టు 3:10 PM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ ఎప్పుడు? ఎలా? ► కస్టడీ ఎప్పుడు? : సెప్టెంబర్ 23 & సెప్టెంబర్ 24 ► కస్టడీ ఎక్కడ ? : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ► కస్టడీ సమయం ? : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ► కస్టడీలో ఎవరు ప్రశ్నిస్తారు ? : CID అధికారులు ► కస్టడీ ఎవరి సమక్షంలో ? : చంద్రబాబు లాయర్ల సమక్షంలో ► ఎవరు సమాధానం చెప్పాలి ? : లాయర్లు ఉంటారు కానీ.. ప్రతీ సమాధానం చంద్రబాబే చెప్పాలి ► కస్టడీ ఉద్దేశ్యమేంటీ ? : కుట్రకోణంలో పూర్తి భాగం తెలుసుకునేందుకు.. ► కస్టడీలో ఏ విధంగా జవాబులను రాబడుతారు ? : తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను ముందు పెట్టి చంద్రబాబును ప్రశ్నలు అడుగుతారు. దాని వల్ల నిందితుడు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆధారాలు CID వద్ద ఉంటాయి కాబట్టి మాట మార్చేందుకు, కొత్త కథ చెప్పేందుకు ఛాన్స్ ఉండదు. ► కస్టడీ గడువు పెంచుకునే అధికారముందా ? : కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని CID భావిస్తే.. కోర్టు అనుమతితో మరోసారి గడువు పొడిగించుకోవచ్చు 3:04 PM, సెప్టెంబర్ 22, 2023 సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? : టిడిపి మల్లగుల్లాలు ► సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై తెలుగుదేశం నేతల మంతనాలు ► ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలంటున్న టీడీపీలో కొందరు నేతలు ► ఇన్ని ఆధారాలుంటే సుప్రీంకోర్టులోనూ కేసు కొట్టేస్తారు : టిడిపిలో మరికొందరు ► సీనియర్ లాయర్లతో తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం ► హైకోర్టులో క్వాష్ పిటిషన్పై ముందునుంచీ నమ్మకంగా లేని లోకేష్ ► క్వాష్ పిటిషన్ వేసే సమయానికి ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్ ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ మంతనాలు ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ కోరితే తమకు రిలీఫ్ ఉంటుందా అని సమాలోచనలు 2:44 PM, సెప్టెంబర్ 22, 2023 సీఐడీ కస్టడీకి చంద్రబాబు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి అనుమతి ► రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► విచారణ ఎక్కడ చేస్తారు?.. జైల్లోనా? తటస్థ ప్రదేశంలోనా? అని సీఐడీకి జడ్జి ప్రశ్న ► జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ ► జైల్లోనే విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబును విచారిస్తే.. స్కిల్ స్కాంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్ 2:39 PM, సెప్టెంబర్ 22, 2023 మరికాసేపట్లో చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరిన సీఐడీ ►చంద్రబాబు నోరు విప్పితేనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్న సీఐడీ ► చంద్రబాబు రిమాండ్ను మరో రెండ్రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు ►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పు నేపథ్యంలో.. ఉత్కంఠ 2:15 PM, సెప్టెంబర్ 22, 2023 ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది? ► కేసు నమోదు అయింది : CID పోలీస్ స్టేషన్, మంగళగిరి ► కేసు నమోదు ఎప్పుడు : డిసెంబర్ 9, 2021 ► కుంభకోణం జరిగింది : 2014-15 నుంచి 2018 మధ్య కాలంలో ► ఫిర్యాదు దారు : ఛైర్మన్, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్) ► ప్రభుత్వ ఖజనా నుంచి విడుదలైన నిధులు : రూ.371 కోట్లు ► డొల్ల కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా పక్కదారి పట్టిన మొత్తం : రూ.279 కోట్లు ► నిధులు వేగంగా విడుదల కావాలంటూ ఆదేశాలిస్తూ చంద్రబాబు పెట్టిన సంతకాలు : 13 ► చంద్రబాబు అరెస్ట్ : సెప్టెంబర్ 9, 2023 ► నమోదయిన సెక్షన్లు : 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 109 read with 120B read with 34 of the Indian Penal Code, 1860 (for short, ‘IPC’) and 12, 13 (2) read with 13 (1) (c) & (d) of the Prevention of Corruption Act, 1988 (for short, ‘the PC Act’) ► కోర్టులో క్రైం రిజిస్ట్రేషన్ : Crl.M.P.No.1096 of 2023 ► జ్యుడిషియల్ కస్టడీ : సెప్టెంబర్ 10, 2023 ► కస్టడీ పరిధి : ACB కోర్టు కమ్ జిల్లా మూడో అడిషనల్ జడ్జి, విజయవాడ ► క్వాష్ పిటిషన్ : సెప్టెంబర్ 10, 2023 ► క్వాష్ పిటిషన్ కొట్టివేత : సెప్టెంబర్ 22, 2023 2:10 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారంటే.. ► సెక్షన్ 482 Cr.P.Cకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది ► నిహారిక ఇన్ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును దీనికి సరైన ఉదాహరణ ► ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేం ► 2021నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను CID విచారించింది ► దాదాపు 4వేల డాక్యుమెంట్లను తన వాదనకు ఆధారంగా చూపించింది ► ఈ కేసుకు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అర్హత ఉంది ► ఈ కేసును క్వాష్ పేరిట నిలిపివేయలేం, దర్యాప్తును నిలువరించలేం ► ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేం ► దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు (ఏవైనా ఉంటే..) వాటన్నింటిని రద్దు చేస్తున్నాం 2:02 PM, సెప్టెంబర్ 22, 2023 ACB కోర్టును హైకోర్టు సమర్థించింది : హైకోర్టు లాయర్లు ► CID పరిశోధించిన అంశాలతో లోయర్ కోర్టు ఏకీభవించింది ► కొన్ని సాంకేతిక కారణాలతో కేసు కొట్టేయమంటే హైకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది ► ACB కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పూర్తి స్థాయిలో సమర్థించింది ► సెక్షన్లన్ని చెల్లవన్న చంద్రబాబు లాయర్ల వాదన చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది ► కేసు కొట్టేస్తారన్న చంద్రబాబు, తెలుగుదేశం మాటలు కొందరు నమ్మారేమో కానీ.. కోర్టు ముందు ఆధారాలు లేకుండా చేసే వాదనలను హైకోర్టు నమ్మలేదు ► రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న వాదనలో పస లేదని న్యాయస్థానం నమ్మింది ► చేసిన కుంభకోణాన్ని కవర్ చేసుకునేందుకు రాజకీయ కక్షను తెరపైకి తెచ్చారని వెల్లడవుతోంది ► తప్పు జరగలేదు, తప్పు చేయలేదు అని బాబు లాయర్లు చెప్పలేకపోయారు ► పైగా అరెస్టయిన సౌమిత్రా బోసుతో ప్రెస్ మీట్ పెట్టి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు ► ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు వాళ్లు చదువుకోడానికే తప్ప.. కోర్టుల ముందు నిలబడవు 1:55 PM, సెప్టెంబర్ 22, 2023 CID వాదనే నెగ్గింది: హైకోర్టు లాయర్లు ► కేసులో చాలా లోతు ఉంది, పరిశోధనతో నిజాలు నిగ్గు తేలుతాయి ► 17A అన్న ఒక్క పాయింట్తో కేసు ఎలా గెలుస్తారు? ► ఇంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారు? ► 2018 కంటే ముందే కుంభకోణం జరిగినట్టు డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి ► ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్న బాబు లాయర్ల వాదనను ఖండిస్తూ ఆధారాలు చూపించిన CID ► FIRలో పేరు లేదన్న కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరు ► చట్టం ముందు అందరూ సమానమే 1:50 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పేరుతో తొందరపడ్డారు : హైకోర్టు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పేరుతో తప్పుడు ప్రయత్నం చేశారు ► ఇన్ని డాక్యుమెంటరీ ఆధారాలుండగా క్వాష్ కోసం ఏ అడ్వొకేట్ ప్రయత్నించరు ► సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సాధారణంగా ఇలాంటి కేసును ఒప్పుకోరు ► ఎంత పెద్ద లాయర్లు వాదించినా.. కేసు వీక్గా ఉంటే గెలవలేరు ► దర్యాప్తు సంస్థ CID ఈ కేసులో చాలా పక్కాగా ఆధారాలు సేకరించారు ► నిధులు పక్కదారి పట్టినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (సబ్స్టాన్షియల్)గా ఉన్నాయి ► క్వాష్ వేసి బయటపడవచ్చని చంద్రబాబు ఎందుకు నమ్మారో తెలియదు ► కేసు ఇంత పక్కాగా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎందుకు కొట్టేస్తారు? 1:45 PM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పక్కాగా ఎక్కడ ఇరుక్కున్నారంటే : హైకోర్టు లాయర్లు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్నాయి ► Co-accused - సహ నిందితులందరూ చంద్రబాబు పేరు చెప్పారు ► నోట్ ఫైల్స్తో పాటు చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆధారాలున్నాయి ► నిధులు ఏ రకంగా రూట్ అయ్యాయో పక్కగా తేలింది ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇప్పటికే పరారీలో ఉన్నారు ► సీమెన్స్ కంపెనీ తమకు ఇందులో సంబంధం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది ► సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి కుంభకోణం జరిపారు ► ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు న్యాయస్థానం గుర్తించింది ► 120బి, 420, 468, 471, PC 13, 31, 32 ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ► ఇంతటి ప్రభావం ఉన్న కేసులో ప్రాథమిక దశలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు 1:35 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పిటిషన్ డిస్మిస్ ఎందుకు చేసిందంటే.. : హైకోర్టు లాయర్లు ► క్రిమినల్ కేసులో విచారణ ముఖ్యం, దర్యాప్తు తర్వాతే క్వాష్కు అవకాశం ► ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి : లాయర్లు ► ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే : లాయర్లు ► ఈ కేసులో CID దర్యాప్తు పక్కాగా ఉంది : లాయర్లు ► ఈ కుంభకోణంలో అయిదు లేయర్లను CID గుర్తించింది ► నిధులు పక్కాగా ఎటు మళ్లాయో CID పక్కాగా ఆధారాలు సేకరించింది ► GSTలో రూ.41 కోట్లు ఎలా ఎగ్గొట్టారో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది ► పక్కాగా కేసు కట్టడంతో దీంట్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సమ్మతి చూపలేదు ► ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశముంది ► ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి ► ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందే ► ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్ను తిరస్కరించింది : లాయర్లు 1:30 PM, సెప్టెంబర్ 22, 2023 Big Breaking : చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి ► పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ► హైకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను తిరస్కరించిన హైకోర్టు ► 17A సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించని హైకోర్టు ► CID వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ► అరెస్ట్ సక్రమమే, రిమాండ్ సక్రమమే, కేసు దర్యాప్తు జరగాల్సిందే 12:30 PM, సెప్టెంబర్ 22, 2023 చేసిన పాపాలకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పేర్ని నాని ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఏపీ అసెంబ్లీలో చర్చ ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ బాబు ► "వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్ మీ" అన్నది బాబే కదా.! ► ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచుకున్న చరిత్ర బాబుది, టిడిపిది ► చేసిన పాపాలకు చంద్ర బాబు జైల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి ► స్కిల్ స్కాం పక్కాప్లాన్ ప్రకారం జరిగింది, సూత్రధారి, కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్ చంద్రబాబే ► డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు ► ఎంవోయూ..జీవోకు సంబంధమే లేదు ► రూ. 371 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు ఎలా వెళ్లాయి? 12:20 PM, సెప్టెంబర్ 22, 2023 సెప్టెంబర్ 27న ఉండవల్లి పిటిషన్.? ► ఉండవల్లి పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన రిజిస్ట్రార్ ► బుధవారం విచారణకు వచ్చే అవకాశం ► హైకోర్టు ఇరుపక్షాలు వాదనలు వినే అవకాశం 12:00 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై టిడిపి ప్రజంటేషన్ ► స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వాస్తవాలపై పయ్యావుల కేశవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► ఎంప్లాయిమెంట్ కోసమే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ► సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబు వెనకాలపడ్డారు ► సీమెన్స్ రిపోర్ట్ తర్వాత సుదీర్ఘ సమావేశం తర్వాత చంద్రబాబు ఓకే చేశారు ► ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన పిల్లల్ని తయారు చేయాలని చంద్రబాబు చెప్పారు ► భవిష్యత్ను ఆలోచించిన మేధావి మా నాయకుడు బాబు 11:45 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్పై అసెంబ్లీలో కన్నబాబు ప్రకటన ► చంద్రబాబు విజనరీ కాదు, ప్రిజనరీ ► ఇప్పటి వరకు ఈ కేసులో పదిమందిని అరెస్ట్ చేశారు ► ఏడుగురు నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు ► బెయిల్ మీద వచ్చిన సుమన్ బోస్ బాబుకు మద్దతు పలకడం విడ్డూరం ► 17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్ట్ చేశారు ► గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు ► చంద్రబాబు అవినీతిని ఆదాయంపన్ను శాఖ బట్టబయలు చేసింది ► బోగస్ ఇన్వాయిస్లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట ► టన్నుల పేరుతో కోడ్ లాంగ్వేజ్ లో అవినీతికి పాల్పడ్డారు ► టన్నులు అంటే బరువు కాదు... కోట్లు అనే అర్ధం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ ► చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు ► చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బును రిలీజ్ చేశారు ► డబ్బులు నేరుగా తన అకౌంట్ లోకి చేరుతాయి కాబట్టే స్కిల్ స్కీమ్ పై చంద్రబాబుకు అంత ప్రేమ ► ఒకేరోజు ఒకే విడతగా రూ.371 కోట్లు రిలీజ్ చేశారు ► అరెస్ట్ రోజున హెలికాఫ్టర్ను చంద్రబాబు కావాలనే తిరస్కరించారు ► రోడ్డు మార్గంలో వెళితే సానుభూతి వస్తుందనేది బాబు ప్లాన్ ► రిమాండ్ విధించిన జడ్జినే టీడీపీ బ్యాచ్ ట్రోల్ చేశారు 11:30 AM, సెప్టెంబర్ 22, 2023 సానుభూతి కోసం ఇంత విష ప్రచారమా? : YSRCP ► చంద్రబాబు జైల్లో ఉంటే సానుభూతి కోసం ఎల్లో మీడియా విచిత్ర వేషాలు ► దోమలు, ఏసీ, వేడి నీళ్లంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు ► దింపుడు కళ్లెం ఆశలు సరికాదన్న విజయసాయిరెడ్డి అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన బాబుపై సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది పచ్చకుల మీడియా. నక్సల్స్ క్లెమోర్ మైన్ పేలిస్తేనేరాని సానుభూతి తప్పుచేసి జైలుకెళ్తే వస్తుందా? 2024 కోసం ఎదో దింపుడు కల్లెం ఆశ. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2023 11:22 AM, సెప్టెంబర్ 22, 2023 ఈ మధ్యాహ్నమే క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు.? ► మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ ► క్వాష్ పిటిషన్పై ఇప్పటికే పూర్తయిన ఇరుపక్షాల వాదనలు ► క్వాష్ పిటిషన్పై తీర్పును ఈ నెల 19న రిజర్వ్లో పెట్టిన హైకోర్టు ► మధ్యాహ్నం క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం 11:15 AM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు క్వాష్ పిటిషన్ దృష్ట్యా కస్టడీ తీర్పు రిజర్వ్ ► విజయవాడ : కస్టడీ పిటిషన్పై ACB కోర్టు సమాలోచనలు ► ఏసీబీ కోర్టుకు వచ్చిన ఇరుపక్షాల లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న దృష్ట్యా.. కస్టడీ పిటిషన్పై సమాలోచనలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్పై తీర్పు వచ్చేవరకు ఆగుతారా? ► మధ్యాహ్నం తర్వాత తమ నిర్ణయం ప్రకటించనున్న ACB కోర్టు 11:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై ప్రజాప్రయోజన వ్యాజ్యానికి లిస్టింగ్ ► చంద్రబాబుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి ► 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ ► కేంద్ర ప్రభుత్వం, CBI, EDలను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్ ► త్వరలోనే విచారణ జరపనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్ సెప్టెంబర్ 24వరకు వరకు పొడిగింపు ► ACB కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయిన చంద్రబాబు ► రిమాండ్ ముగియడంతో ACB కోర్టు న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు ► రాజమండ్రి జైలులో చంద్రబాబు, విజయవాడ ACB కోర్టులో న్యాయమూర్తి ► చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన న్యాయమూర్తి ► CID కస్టడీ అడుగుతోంది, మీ అభిప్రాయమేంటీ? : జడ్జి ► నాది 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ : చంద్రబాబు ► నా గురించి దేశంలో అందరికీ తెలుసు : చంద్రబాబు ► మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి ► అక్రమంగా అరెస్ట్ చేశారన్నది నా ఆవేదన: బాబు ► చట్టం ముందు అందరూ సమానమే, నా హక్కులు రక్షించాలి : చంద్రబాబు ► మీకు జైల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? : జడ్జి ► రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిందే నేను : చంద్రబాబు ► నాపై ఉన్నవి ఆరోపణలే, నన్ను విచారణ చేసిన తర్వాత జైలుకు పంపాల్సింది : బాబు ► మీరు పోలీస్ కస్టడీలో లేరు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు : జడ్జి ► ఎల్లుండి వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► జైల్లో చంద్రబాబుకు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు : జడ్జి ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు : అధికారులు రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబుగారిని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణలో మాట్లాడుతూ... తనని అన్యాయంగా అరెస్టు చేసారని... తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబుగారు జడ్జిని కోరారు #CBNLifeUnderThreat… pic.twitter.com/SQHNUgDdIx — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఆర్థిక నేరాల్లో అందరికంటే పెద్ద చంద్రబాబే ► చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు : YSRCP ► ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక నేరస్థుడు చంద్రబాబు : YSRCP ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక గజదొంగ చంద్రబాబు.#CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/luz0vx1z1N — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 10:10 AM, సెప్టెంబర్ 22, 2023 PT వారంట్లపై నేడు విచారణ ► CID పీటీ వారెంట్లపై నేడు ACB కోర్టులో విచారణ ► PT వారంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (రిమాండ్లో ఉన్న ఖైదీ) ► అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన CID 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలని టిడిపి ధర్నా ► చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల నిరసన చంద్రబాబు గారి పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. శాసనసభకు పాదయాత్రగా వెళ్లి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/QqLRIo3QFe — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 నేడు కోర్టు ముందుకు చంద్రబాబు ► ఇవ్వాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు చంద్రబాబు ► రాజమండ్రి సెంట్రల్ జైలులో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ► బాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా ► హైకోర్టులో నేడు లిస్ట్ కాని క్వాష్ పిటిషన్ 7:20 AM, సెప్టెంబర్ 22, 2023 అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ ►నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ►అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై స్వల్పకాలిక చర్చ. 7:10 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు ►హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం 6:30 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్పై నిర్ణయం వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్పై ఈరోజు వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► నేటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 6:25 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్కు కస్టడీ పిటిషన్కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 6:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంపై ఉండవల్లి పిటిషన్ ►స్కిల్ స్కాంపై ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్కుమార్ పిల్ దాఖలు. ►స్కిల్ స్కాం కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్. ►స్కిల్ కుంభకోణంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని అభ్యర్థన. ►ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందన్న ఉండవల్లి. చదవండి: ‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే.. ►అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. ►లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకోలో భాగంగానే చంద్రబాబుకు కరకట్ట నివాసం. ►ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు. ►అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ►అమరావతిని రాజధానిగా సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబు. ►అమరావతి మాస్టర్ప్లాన్ గురించి చంద్రబాబుకు మొత్తం ముందే తెలుసు. ►మాస్టర్ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే. ►రాజధాని ఎంపిక, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకు పూర్తి భాగస్వామ్యం. చదవండి: బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ? 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ►ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా క్విడ్ప్రోకోకు పాల్పడ్డ లింగమనేని, చంద్రబాబు, నారాయణ. ►టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మూడుసార్లు మార్పు. ►2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి ఆస్తులు ►ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి లబ్ది. ►కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని కుటుంబానికి ఇన్నర్రింగ్ రోడ్డు తుది అలైన్మెంట్ను ఆనుకునే 168.45 ఎకరాలు ►లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ ఖరారు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే ►చంద్రబాబు కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం. ►ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివాసం. ►సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు. ►ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. ►ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ►కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ►ఆ నివాసాన్ని చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చిన లింగమనేని రమేశ్. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 లోకేశ్దీ కీలక పాత్రే... ►క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర. ►లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం. ►హెరిటేజ్ డైరెక్టర్గా సమావేశంలో పాల్గొన్న లోకేశ్. ►అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసం. ►క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర. -
Sep 21st : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇమేజ్ బిల్డప్ కోసం అఖిలప్రియ అష్టకష్టాలు ► నంద్యాలలో దీక్ష పేరుతో మీడియాను ఆకర్షించేందుకు అఖిలప్రియ కష్టాలు ► ఇప్పటికే అఖిలప్రియపై బోలెడు కేసులు ► నడి రోడ్డుపై దౌర్జన్యం, పలువురిపై దాడి కేసుల్లో ఉన్న అఖిలప్రియ ► సుబ్బారెడ్డి కుటుంబంతో పలు వివాదాలు ► వేర్వేరు కేసుల్లో పలుమార్లు అరెస్టయిన అఖిలప్రియ ► ఇప్పుడు ఇమేజ్ బిల్డప్ కోసం నిరాహార దీక్ష ► చంద్రబాబును అరెస్ట్ అయిన RK ఫంక్షన్ హాల్ ఎదుటే అఖిలప్రియ దీక్ష ► నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి జనాల్ని తరలించేందుకు ప్రయత్నాలు 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 విజయవాడలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం ► చంద్రబాబు అరెస్ట్పై రేపటి సభలోనూ పట్టుపట్టాలని టీడీఎల్పీ నిర్ణయం ► స్పీకర్ తమ్మినేనిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయం ► రేపు సభలో తగ్గేదే లేదన్న బాలకృష్ణ ► స్కిల్ అంశం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సిద్దం కావాలని నిర్ణయం ► ఎల్లో మీడియాలోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట తమ వర్షన్ చెప్పుకోవాలని ఎమ్మెల్యేల నిర్ణయం 6:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు 5:50 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఇవి ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల వ్యవహారంపై స్పష్టత ఇచ్చిన అధికారులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడాని టిడిపి చేస్తోన్న ప్రచారం తప్పు ► రిమాండ్ ఖైదీ సత్యనారాయణ ఈ నెల ఆరో తేదీన జైలుకు వచ్చారు ► వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్టులో ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిసింది ► వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి నిందితుడిని తరలించాము ► ఈ నెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ► ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు ► జైల్లో కుట్టిన దోమల వల్ల సత్యనారాయణకు డెంగ్యూ వచ్చి చనిపోయాడన్న వాదన సరికాదు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికి ఫాగింగ్ పూర్తి, ప్రతీ రోజూ కొనసాగింపు ► చంద్రబాబు ఒక్కరే కాదు, జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే తమ లక్ష్యం అంటున్న జైలు అధికారులు 5:25 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్కు కస్టడీ పిటిషన్కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 5:05 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్పై నిర్ణయం రేపటికి వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► రేపటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 5:00 PM, సెప్టెంబర్ 21, 2023 అందరి చూపు ACB కోర్టు నిర్ణయంపై ► విజయవాడ : ACB కోర్టు వెలువరించబోయే కస్టడీ నిర్ణయంపై ఉత్కంఠ ► బెంచ్ మీదకు వచ్చిన జడ్జి ► కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం 4:45 PM, సెప్టెంబర్ 21, 2023 పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ : CID చీఫ్ ► స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ ► ప్రతి పేపర్ పై చంద్రబాబు సంతకం ఉంది ► షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారు ► చంద్రబాబుకు పీఏగా పని చేసిన శ్రీనివాస్ ద్వారా డబ్బులు మళ్లించారు ► స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పాత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి ► పీఏ శ్రీనివాస్ను విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయి ► శ్రీనివాస్కు నోటీసులు ఇవ్వగానే అమెరికాకు పారిపోయాడు ► అప్పుడు సీఎంగా ఉన్నారు కనుకే ఐపీసీ 409 చంద్రబాబుకు వర్తిస్తుంది ► స్కిల్ స్కాంలో ఆధారాలు దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ► సీమెన్స్ సంస్థలో గతంలో పని చేసిన వాళ్ల పాత్ర కూడా ఉంది ► సీమెన్స్ లో ఇప్పుడున్న వాళ్లు స్కాంతో తమకు సంబంధం లేదంటున్నారు ► చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 CID లాయర్లు ఏం వాదించారు? ► కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు లాయర్లు ఏం వాదించారు? ► FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టుకు ఇరుపక్షాల లాయర్లు ► విజయవాడ : ACB కోర్టుకు చేరుకున్న లాయర్లు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు ► కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు, చంద్రబాబు లాయర్లు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టు ఉత్తర్వులపై అందరి దృష్టి ► విజయవాడ : ACB కోర్టులో కస్టడీ పిటిషన్పై నిన్ననే పూర్తయిన వాదనలు ► ఇవ్వాళ మరోసారి బెంచ్ ముందుకు రానున్న కస్టడీ పిటిషన్ ► ఇవ్వాళ కస్టడీ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులు అన్న విషయం న్యాయమూర్తి ప్రకటించే అవకాశం ► మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టు బెంచ్ ముందుకు కస్టడీ పిటిషన్ అంశం వచ్చే అవకాశం 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 ఎర్రన్నాయుడు కూతురు ఎందుకు కనిపించడం లేదు? ► రాజమండ్రిలో 11 రోజులుగా జైల్లో ఉన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ► పార్టీలో ఉన్న లీడర్లంతా ఇప్పటివరకు రాజమండ్రిలో హాజరు వేసుకున్నవాళ్లే ► రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.! ► పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అన్న కూతురు, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు కనిపించడం లేదు? ► ఆదిరెడ్డి కుటుంబం దగ్గరుండి భవానిని దూరం పెట్టిందా? ► లేక చంద్రబాబు అసలు రంగు తెలిసి భవాని దూరంగా ఉంటోందా? ► చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ భువనేశ్వరి, బ్రాహ్మణి నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనే అవకాశం లేదా? 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 భద్రతపై తప్పుడు ఆరోపణలు సరికాదు : విజయసాయిరెడ్డి ► చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదు ► లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు ► దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారం ► అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అన్న అనుమానాలున్నాయి మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 3:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇదేం పార్టీ? ఇదేం ప్రవర్తన? టిడిపి నేతల తీరుపై YSRCP మండిపాటు ► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు ► అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు ఏ మాత్రం సరికాదు ► యువగళం పాదయాత్రలో లోకేష్ సాంతం బూతులు మాట్లాడారు ► ప్రజలను రెచ్చగొట్టడమే మామా అల్లుళ్ల పనా? నాయకుడు అనేవాడు.. అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్కి ఆ లక్షణాలు మచ్చుకకి కూడా లేవు. ఒకరేమో అసెంబ్లీ వేదికగా, మరొకరేమో బహిరంగ వేదికపై అసభ్యంగా సైగలు చేస్తారు. కనీసం మహిళలు ఉన్నారనే ఇంగితం కూడా ఇద్దరికీ లేకపోయింది. #TDPGoonsInAssembly#APAssembly… pic.twitter.com/zBtLktpM7S — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 2:30 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల పేరు చెప్పి భయపెడతారా? ► చంద్రబాబుపై సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదు : బాపట్ల ఎంపీ సురేష్ ► ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా ? ► చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది ► చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్కు అబ్బినట్టుంది ► చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది ► చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి ► వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? ► దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాదు, నవ్వులపాలవుతారు 1:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు భద్రతపై ఆందోళన అవసరం లేదు: జైళ్ల శాఖ ► రాజమండ్రి : చంద్రబాబు భద్రత గురించి టిడిపి అభ్యంతరాలను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ ► సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు ► జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ► కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం ► ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 1:00 PM, సెప్టెంబర్ 21, 2023 భారతీయుల నిరసనతో హోరెత్తుతోన్న కెనడా ► కెనడాలో గత కొద్ది రోజులుగా సిక్కుల నిరసనలు ► సిక్కుల నిరసనకు తోడుగా తెలుగుదేశం నిరసనలు ► ఇప్పటికే వరుస నిరసనలపై కెనడా ప్రభుత్వం సీరియస్ ► టోరంటోలో తెలుగుదేశం నిర్వహించిన ఆందోళనలపై సీరియస్ ► భారత్కు సంబంధించిన అంశాలను సున్నితంగా చూస్తోన్న కెనడా ► ఇప్పటికే రెండు దేశాల మధ్య దెబ్బ తిన్న సంబంధాలు ► ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరు చెప్పి కెనడాలో ఆందోళనలు చేయడం సరికాదంటున్న అక్కడి అధికారులు ► కెనడాలో సిక్కులకు పోటీగా టిడిపి నాయకులు చేస్తోన్న ఆందోళనలపై భారత ప్రభుత్వం సీరియస్ ► మన దేశానికి సంబంధించిన అంతర్గత అంశం, అది కూడా అవినీతి కేసుకు సంబంధించి అంతర్జాతీయంగా ఆందోళనలు చేపట్టడం సరికాదంటున్న కేంద్రం ► తెలుగు రాని విదేశీయులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేస్తోన్న టిడిపి ► అనుమతి లేకుండా ఆందోళనలకు దిగే వారి వివరాలు సేకరిస్తోన్న భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం That’s Toronto canada 🇨🇦 for Babu garu #IAmWithBabu #IAmWithCBN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/LHJ3KkCHKt — Bring it On🔥TDP Voice - Siva (@TDPVoice2024) September 18, 2023 12:40 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలున్నాయి : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబుకు నిర్దేశిత నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలున్నాయి ► ఇంటి భోజనంకు అనుమతిస్తున్నారు, వేడి నీళ్లు కూడా ఇస్తున్నారు ► కోర్టు కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నా.. టిడిపి బురద జల్లుతోంది ► భద్రత లేదంటూ లోకేష్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా? — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 12:35 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు అరెస్ట్పై అసెంబ్లీలో రాద్ధాంతమా? : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబు ఉంటే.. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు అల్లరి చేస్తున్నారు ► సభలో స్పీకర్ పోడియం చుట్టు ముట్టి సమావేశాలు అడ్డుకున్నారు ► మీసాలు తిప్పుతూ బాలకృష్ణ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు .@ncbn అరెస్టుకు నిరసనగా అసెంబ్లీలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన @JaiTDP ఎమ్మెల్యేలు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించిన బాలకృష్ణ. వీరి నాయకుడు అవినీతి చేసి అరెస్టు అయితే దానిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో నిరసన తెలుపుతూ విలువైన అసెంబ్లీ… pic.twitter.com/lQuzKDG4BV — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:30 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో ఏసీ లేక ఇబ్బందులు వస్తున్నాయి : అచ్చెన్నాయుడు ► జైల్లో చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు లేవు ► ఏసీ లేకపోవడం వల్ల చంద్రబాబుకు ఇబ్బంది అవుతోంది ► దోమలు కూడా కుడుతున్నాయని చంద్రబాబు చెప్పారు ► ఇటీవలే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి ► చంద్రబాబు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని చెబుతున్నారు ► చంద్రబాబుకు వేడి నీళ్లు స్నానానికి ఇవ్వాలని కోరుతున్నాం ► కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి 12:25 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్పై చర్చించడానికి రెడీ ► చంద్రబాబు రిమాండ్పై చర్చించాలని టిడిపి పట్టు ► Yes, చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం ► ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ► తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నించిన మంత్రి బుగ్గన చంద్రబాబు అరెస్ట్పై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ.. చట్టపరంగా ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చకి డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి అడిగే ప్రశ్నలకి టీడీపీ ఎమ్మెల్యేల వద్ద సమాధానం ఉందా? - మంత్రి బుగ్గన… pic.twitter.com/5qpL4L1Nmq — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:20 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్పై అసెంబ్లీలో బాలకృష్ణ ప్రెస్ మీట్ ► లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ కావడం వల్లే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► ఈ కేసులో ఏమీ తేలదు, ఇలాంటి కేసులు చాలా చూశాను ► చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారు ► తననెవరు ఏమి చేయలేరని నాకు చెప్పారు ► అమరావతి ఉద్యమంలో అంతా జూనియర్ అర్టిస్టులను విమర్శిస్తున్నారు 12:15 PM, సెప్టెంబర్ 21, 2023 బెయిల్ కోసం తెలుగుదేశం యాగం ► చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ విజయవాడలో యాగం ► టిడిపి నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ► చంద్రబాబు క్షేమంగా ఉండాలంటూ రుద్ర మహా మృత్యుంజయ యాగం ► రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు 12:10 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీపై ఈ సాయంత్రం నిర్ణయం ► చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీ అడిగిన CID ► కస్టడీ వద్దంటూ నిన్న బాబు లాయర్ల వాదన ► ఒక్క రోజు కస్టడీ ఇస్తే సరిపోతుందంటూ కొన్ని కేసుల ఉదాహరణ ► ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలన్నదానిపై నేడు కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ► మరోవైపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 26కు వాయిదా 12:00 PM, సెప్టెంబర్ 21, 2023 లోకేష్ కొత్త రాగం, చంద్రబాబుకు మరింత భద్రత కావాలని డిమాండ్ ► చంద్రబాబుకు జైల్లో దోమలు కుడుతున్నాయి ► చంద్రబాబు జైల్లో ప్రాణ భయం ఉంది ► చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలి ► పూర్తి భద్రత ఉందని జైలు అధికారులు చెప్పినా బురద వేసే ప్రయత్నం ► దోమల పేరు చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న వైఎస్సార్సిపి సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9 — Lokesh Nara (@naralokesh) September 21, 2023 11:45 AM, సెప్టెంబర్ 21, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ► శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యుల రౌడీయిజం. ► స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు. ► పోడియం వద్ద మీసం మెలేయడంపై బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్. ► ఒక్కరోజు సభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ ► సమావేశాల నుంచి పూర్తిగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ సస్పెండ్. 11:40 AM, సెప్టెంబర్ 21, 2023 ► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు పిటిషన్పై విచారణ 26కు వాయిదా. ► చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్డు సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 26కు వాయిదా 11:00AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ►కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ►సీఐడీ తరుఫున వాదనలు వినిపించిన పొన్నవోలు ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లూద్రా, సిద్ధార్థ్ అగర్వాల్ 8:40AM, సెప్టెంబర్ 21, 2023 ►సీమెన్స్కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.. ►సీమెన్స్కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.. ►సీమెన్స్కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 8:00 AM, సెప్టెంబర్ 21, 2023 రాజమండ్రి సెంట్రల్లో జైలులో 11వ రోజు చంద్రబాబు.. ►యథావిధిగా చంద్రబాబు రోజు వారి కార్యక్రమాలు ►ఇంటి నుంచే వచ్చిన ఆహారం, మందులు. ►పటిష్టమైన భద్రత మధ్య స్నేహ బ్లాక్లో చంద్రబాబు ►రాజమండ్రి రూరల్ కాతేరులో కొనసాగుతున్న టీడీపీ క్యాంపు ►రాజమండ్రిలోనే ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►రాజమండ్రి వస్తే లొకేష్ను అరెస్ట్ చేస్తారంటూ రచ్చ చేస్తున్న ఎల్లో మీడియా. ►ఇవాళ జరగనున్న అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు. 7:50 AM, సెప్టెంబర్ 21, 2023 ఎల్లో బ్యాచ్ కొత్త నాటకం. ►అసెంబ్లీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు ►సభకే రాని బాబు కోసం ఎల్లో బ్యాచ్ కొత్త ప్లాన్ ►అసెంబ్లీ వాయిదా వేయాలని మరో నాటకం. 7:00 AM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్పై నేడు వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ► కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం 6:00 AM, సెప్టెంబర్ 21, 2023 అంగళ్లు కేసుపై నేడు హైకోర్టులో విచారణ ► అంగళ్లు విధ్వంసం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ► టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు -
బాబు బెయిల్ పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆ పిటిషన్కు విచారణార్హతే లేదు : సీఐడీ పీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ మేర ఆయన దాఖలు చేసిన పిటిషన్కు అసలు విచారణార్హతే లేదన్నారు. సీఆర్సీపీ సెక్షన్ 437, సెక్షన్ 439 కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని.. అయితే, ఈ సెక్షన్ల కింద మధ్యంతర బెయిల్ ఇవ్వడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఈ సెక్షన్లలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనేలేదని ఆయన తెలిపారు. మధ్యంతర బెయిల్ తమ హక్కు అన్నట్లు చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్నారని.. ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న వ్యక్తి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదన్నారు. తాము ఇప్పటికే పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని, అందులో కౌంటర్లు దాఖలు చేయాలని ఈ కోర్టు ఆదేశించినా చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేయలేదని వివేకానంద కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు హైకోర్టును ఆశ్రయించి, ఈ కోర్టు (ఏసీబీ కోర్టు) కౌంటర్ కోసం ఒత్తిడి చేస్తోందన్నట్లు హైకోర్టుకు చెప్పి, పోలీసు కస్టడీ పిటిషన్లో ఈ కోర్టు (ఏసీబీ కోర్టు)ను ముందుకెళ్లకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు తెచ్చారని తెలిపారు. వాస్తవానికి పోలీసు కస్టడీ పిటిషన్లో తామే కౌంటర్ కోసం ఒత్తిడి చేశామే తప్ప, ఈ కోర్టు ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో తమ పోలీసు కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించలేని పరిస్థితిలో ఉండటంతో, దానిని అడ్డంపెట్టుకుని బెయిల్ కోసం పిటిషన్ వేసి మధ్యంతర బెయిల్ కోరుతున్నారని వివేకానంద తెలిపారు. వాస్తవాలను కోర్టు ముందుంచాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెబుతున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని విచారణను వాయిదా వేయాలని వివేకానంద కోరారు. మధ్యంతర బెయిల్పై విచారణ సబబేనా? అనంతరం.. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రధాన బెయిల్ కౌంటర్ దాఖలు చేసి, వాదనలు విని దాన్నితేల్చేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇదే సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తమ ముందు పెండింగ్లో ఉందని, ఈ పరిస్థితుల్లో బెయిల్పై విచారణ జరపడంపై స్పష్టత కావాలని తేల్చిచెప్పింది. పోలీసు కస్టడీ పిటిషన్లో ముందుకెళ్లకుండా హైకోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తుచేసింది. అందువల్ల ఈ దశలో మధ్యంతర బెయిల్పై వాదనలు వినడం సబబా? కాదా? అన్న సందేహం కలుగుతోందని ఏసీబీ తెలిపింది. కానీ, మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఏసీబీ కోర్టుకుందని దమ్మాలపాటి తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాం కాబట్టి, మధ్యంతర బెయిల్పై కింది కోర్టు విచారణ జరపకూడదన్న నిషేధం ఏదీలేదన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, క్వాష్ పిటిషన్లో విచారణ తరువాత హైకోర్టులో వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈ బెయిల్పై తదుపరి విచారణ జరుపుతామని స్పష్టంచేస్తూ విచారణను 19కి వాయిదా వేసింది. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Khaidi No 7691.. LIVE UPDATES 7:15 PM, సెప్టెంబర్ 15, 2023 రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు? ►జైలు బ్రీఫింగ్ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్కు రెడీ ►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్ కళ్యాణ్ ►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్ ►పొత్తులో టిడిపి ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ ►ఏ ఏ స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు ►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం ►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు ►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ ►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్ 7:10 PM, సెప్టెంబర్ 15, 2023 జైల్లో చంద్రబాబు.. ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయంటే.? ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు ► స్పెషల్ మెడికల్ టీం ను నియమించిన ప్రభుత్వం ►అత్యవసర ఔషధాలు ఓ పాజిటివ్ బ్లడ్, అంబులెన్స్ రెడీ ►అన్ని వేళల్లో సన్నద్ధంగా పదిమంది వైద్య నిపుణుల బృందం ►చంద్రబాబు ఆరోగ్య భద్రతకు సంబంధించి సకల ఏర్పాట్లు ►టీవీ, న్యూస్ పేపర్లు, ఇంటి భోజనం, వేడి నీళ్లు ఏర్పాటు 6:55 PM, సెప్టెంబర్ 15, 2023 సెలవుపై రాజకీయమా? ► రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై జైళ్లశాఖ ప్రకటన ► రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు ► రాహుల్ భార్య నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారు ►ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు ►4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించింది ►దీనిపైనా కొన్ని మీడియాలు రాజకీయం చేయడం అర్థరహితం 6:40 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్ ►ఇవ్వాళ అంతగా సక్సెస్ కాని అపాయింట్మెంట్లు ►చంద్రబాబు అరెస్ట్పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు ►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు ►అపాయింట్మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు ►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్ ►రేపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్ 5:24PM, సెప్టెంబర్ 15, 2023 వారంలో మూడో ములాఖత్ కుదరదు: జైళ్ల ఉప శాఖాధికారి, కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాజమండ్రి ►నారా భువనేశ్వరి ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ►వారంలో మూడో ములాఖత్ నిబంధనలు రీత్యా సాధ్యం కాదు ►అందుకే ఈరోజు నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరించాం ►ఈ వారం లో రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కి రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి ►ఈ నెల 12 న నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి లకు ములాఖత్ ఇచ్చాం ►ఈ నెల 14 న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు ములాఖత్ అయ్యారు ►అత్యవసర పరిస్థితులు ఉంటేనే వారంలో మూడో ములాఖత్కు అవకాశం ►ప్రస్తుతం రిమాండ్ ఖైదీ చంద్రబాబుకి అలాంటి అత్యవసర కారణాలు లేవు ►అందుకే నారా భూబనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ని తిరస్కరించాం 4:50 PM, సెప్టెంబర్ 15, 2023 కింకర్తవ్యం ? : లోకేష్ @ ఢిల్లీ ►ఉదయం నుంచి బీజేపీ నేతల అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం ►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టిడిపి నేతలతో లాబీయింగ్ ►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు ►రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు ►రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్ 4:30 PM, సెప్టెంబర్ 15, 2023 టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనపై సజ్జల కౌంటర్ ►రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్ ►ఇంతకాలం విడివిడిగా ఉన్నట్లు నటించారు ►బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్కు బాబు అప్పగించారమో ►ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు ఉంది ►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం 4:15 PM, సెప్టెంబర్ 15, 2023 నారాయణ పిటిషన్ 25కు వాయిదా ►నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ 25కి వాయిదా ►అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ నమోదు చేసిన 2 కేసులు క్వాష్ చేయాలని పిటిషన్ ►ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి నారాయణ ► నారాయణతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అంజనీకుమార్ ►విచారణను ఈ నెల 25కి వాయిదా వేసిన కోర్టు 3:15 PM, సెప్టెంబర్ 15, 2023 తాడేపల్లిగూడెం: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ►జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు ►పవన్ కళ్యాణ్ ఇంతకాలం పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్లుగా ఉన్నాడు ►పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు ►జనసేనతో టీడీపీ కలవడం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు 1:15 PM, సెప్టెంబర్ 15, 2023 వివేకానంద, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, CID, సుదర్శన్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు ►రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారు ►ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదు ►హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధం ►నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారు ►మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు ►హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు ►నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు ►ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారు ►కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం ఇచ్చారు ►కోర్టు ఏం చెప్తుందో 19వ తేదీ వరకూ వేచి చూడాలి 12:10PM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా ►చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ►ఈ పిటిషన్ విచారణ సైతం 19వ తేదీకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు ►హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి ►కస్డడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందన్న న్యాయమూర్తి ►బెయిల్ పిటిషన్ నూ ఈనెల 19నే విచారిస్తామన్న న్యాయమూర్తి ►మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లు రెండూ వాయిదా 12:00PM, సెప్టెంబర్ 15, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ► స్కిల్ స్కాం కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 11:30 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ ► బెయిల్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ► కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరపు న్యాయవాది 11:00 AM, సెప్టెంబర్ 15, 2023 బెయిల్ పిటిషన్ @ ACB కోర్టు, విజయవాడ ► చంద్రబాబుకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ► బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ► స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఈ బెయిల్ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ► బాబు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని CIDకి కోర్టు సూచన 10:30 AM, సెప్టెంబర్ 15, 2023 డామిట్.. కథ అడ్డం తిరిగిందా.? ► రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల మాట్లాడింది వేరు, బయట జరిగింది వేరు ► ఇంకొన్నాళ్లు దొంగాట ఆడుకుందామని పవన్కు బాబు సూచించినట్టు సమాచారం ► ఇప్పుడే పొత్తు ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుందని చెప్పిన చంద్రబాబు ► లోపల ఓకే చెప్పి బయట ప్లేటు ఫిరాయించిన పవన్ కళ్యాణ్ ► జైలు బయట ప్రెస్ మీట్లో ఫ్లోలో అసలు విషయం చెప్పేసిన పవన్ ► ఒక వైపు లోకేష్, మరో వైపు బాలయ్యను పెట్టుకుని పవన్ పొత్తు ప్రకటన ► పవన్ నోట పొత్తు వినగానే షాక్కు గురయిన బాలయ్య, లోకేష్ ► పవన్ మాట్లాడిన తర్వాత ఏం చేయాలో పాలుపోక బాలయ్య, లోకేష్ మౌనం ► ఇప్పటికిప్పుడు గట్టిగా గెలిచే స్థానాలు 20 కూడా లేకపోవడంతో కంగారు ► డ్యామేజీ కంట్రోల్ కోసం హడావిడి ప్రయత్నాలు మొదలెట్టిన లోకేష్, బాలయ్య ► సాయంత్రం తర్వాత ఢిల్లీ ప్లాన్ తెర మీదికి ► లోకేష్ ఢిల్లీ టూరు లక్ష్యం ఒకటే : ఎలాగైనా బీజేపీ నేతల అపాయింట్మెంట్ 09:30AM, సెప్టెంబర్ 15, 2023 విశ్వసనీయతకు యూటర్న్కు మధ్య యుద్ధం ► జైలు ముందు పొత్తు ప్రకటన చేసిన పవన్, లోకేష్ ► పవన్, లోకేష్ తీరు తప్పుబట్టిన విజయసాయిరెడ్డి ► ఈ యుద్ధం వైఎస్సార్సిపి x టిడిపి, జనసేన.... ► సింగిల్గా వచ్చే సింహాం x నక్కల గుంపు ► ప్రజా సంక్షేమం x అధికార దాహం ► విశ్వసనీయత x యూటర్న్ రాజకీయాలు ► స్థిరమైన పాలన x అస్థిరమైన నాయకత్వం ► నీతి నిజాయతీ x అవకాశవాదం ► సమైక్యత x కుల రాజకీయం The 2024 AP elections is going to be between TDP vs. YSRCP respectively which can be compared as a pack of wolves versus a lion, greed for power vs. public welfare, U-turn politics vs. credibility, instability vs. stability, opportunism vs. honesty, caste politics vs. unity,… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2023 09:15AM, సెప్టెంబర్ 15, 2023 ఢిల్లీలో నారా లోకేష్ బిజీ బిజీ ► ఢిల్లీ పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా లాబీయింగ్ ► పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అపాయింట్మెంట్లు అడిగిన టీడీపీ టీం ► కక్ష రాజకీయంగా కలరింగ్ ఇచ్చేందుకు ఢిల్లీలో లోకేష్ మంతనాలు ► పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహణ ► లోక్సభలో బాబు అరెస్ట్పై చర్చ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు హితబోధ 09:29AM, సెప్టెంబర్ 15, 2023 పొత్తు ప్రకటన చెప్పేశా.. ఇక ఏం చేద్దాం! ► రాజమండ్రి సెంట్రల్ జైలు బయట శుక్రవారం టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్ ► పవన్ ప్రకటనపై పార్టీలో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు శనివారం(రేపు) జనసేన విస్తృత స్థాయి సమావేశం ► నెక్ట్స్ ఏంటన్న దానిపైనా భేటీలో చర్చించే అవకాశాలు ► మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అధ్యక్షతన భేటీ ► పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల దగ్గరి నుంచి సంయుక్త కార్యదర్శుల దాకా అంతా హజరయ్యే ఛాన్స్ ► ఇప్పటివరకు టికెట్ ఆశ చూపెట్టి ఇప్పుడు పొత్తు అంటే ఎలా అని జనసేన కార్యవర్గం అసంతృప్తి 09:21AM, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు ఆలస్యం? ►ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు ►స్కిల్ స్కాం కేసులో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిసషన్లు ►బెయిల్పై ఇప్పటికే సీఐడీకి కోర్టు నోటీసులు ►పూర్తి వివరాలు ఉంచేందుకు సమయం కోరనున్న సీఐడీ ►పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే.. ఇరువైపులా వాదనలు మొదలయ్యే అవకాశం 08:00AM, సెప్టెంబర్ 15, 2023 జైలులో చంద్రబాబు @6వరోజు ► రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి బస ► ఈ వారం ముగిసిన చంద్రబాబు ములాఖత్లు 06:44am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ కౌంటర్ ►చంద్రబాబు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కౌంటర్ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు ► ఏసీబీ కోర్టులో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 5:15am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు విస్తృత ప్రచారం చేయాలని ఢిల్లీకి లోకేష్ ►నిన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిక లోకేష్ ►లోకేష్ కోసం జాతీయ పార్టీల నేతల అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న టీడీపీ లీడర్ లు ► నిన్న చంద్రబాబుతో పవన్ ములాఖత్ తర్వాతనే ఈ నిర్ణయం 5:05am, సెప్టెంబర్ 15, 2023 మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ► రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ ►విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం ►మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం 5:00am, సెప్టెంబర్ 15, 2023 చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ ►విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు ►పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు ►పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు. -
ఇల్లు కాదు జైలే..
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. హౌస్ రిమాండ్కు సంబంధించి ఏ చట్టంలో కూడా ఎలాంటి నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందువల్ల హౌస్ రిమాండ్ విషయంపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని పేర్కొంది. అంతేకాక హౌస్ రిమాండ్లో ఎందుకు ఉంచాలనేందుకు చంద్రబాబు సరైన కారణాలను తమ ముందుంచలేదని తెలిపింది. హౌస్ రిమాండ్ విషయంలో న్యాయస్థానాన్ని పిటిషనర్ ఒప్పించలేకపోయారని, భద్రత విషయంలో ఇంటి వద్ద కంటే జైలు వద్దే ఎక్కువ భద్రత ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది. ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) భద్రత ఉన్న వ్యక్తికి అదే స్థాయిలో ఇంటి వద్ద భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చునంది. చంద్రబాబు భద్రత కోసం జైలులో పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మాకేవీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. హౌస్ రిమాండ్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కొట్టివేయటానికి కారణాలు ఏమిటో కూడా కోర్టు వివరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకేమీ కారణాలు వివరించాల్సిన అవసరం లేదని పేర్కొనగా, కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు కారణాలను వివరించింది. జ్యుడీషియల్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయి.. మాజీ సీఎం చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అసాధారణ అభ్యర్థన అని సోమవారం వాదనల సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదని, అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో చంద్రబాబు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. చట్టంలో కేవలం జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తీర్పు సందర్భంగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్ అంటూ హల్చల్... మాజీ సీఎం చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానంటూ ఏసీబీ కోర్టులో మంగళవారం ఓ న్యాయవాది హడావుడి సృష్టించారు. చంద్రబాబు తరఫున ఓ టీడీపీ కార్యకర్త పేరుతో తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్పై విచారణ జరపాలని కోరారు. అయితే చంద్రబాబు వకాలత్ ఇవ్వకుండా ఆయన తరఫున ఎలా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని కోర్టులో ఉన్న న్యాయవాదులు చర్చించుకున్నారు. ఆ న్యాయవాది తీరును గమనించిన న్యాయస్థానం ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున గత మూడు రోజులుగా వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల దృష్టికి తెచ్చింది. చంద్రబాబు ఎలాంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని వారు కోర్టుకు తెలియచేయడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. సుదీర్ఘ వాదనలు.. సందేహాల నివృత్తి తరువాతే తీర్పు మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఏసీబీ కోర్టు ఎంతో ఓపికగా విన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు పిటిషన్పైనే విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు ఎంత సమయం తీసుకున్నా వారిని ఏ దశలోనూ కోర్టు నిలువరించలేదు. అటు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వినిపించిన ప్రతీ వాదననూ సావధానంగా ఆలకించింది. ఆయన కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతీ తీర్పునూ నిశితంగా పరిశీలించింది. వాటి విషయంలో తనకున్న సందేహాలను సైతం ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. అలాగే సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సైతం అదే రీతిలో ఆలకించింది. సీఐడీ న్యాయవాదిని కూడా ప్రశ్నించి తన సందేహాలను ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. చివరకు సీఐడీ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఎందుకు ఇవ్వడం లేదో కోర్టు హాలులోనే చాలా స్పష్టంగా వివరించింది. తమకేమీ కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది గట్టిగా వ్యాఖ్యానించినా కూడా, తన బాధ్యత మేరకు కారణాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా, తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ అన్ని పిటిషన్లను ఏసీబీ కోర్టు చాలా ఓపికగా విచారించింది. ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటుకు ఆస్కారం లేకుండా విచారణ జరుపుతూ వస్తోంది. న్యాయవాదులతో, ఇతరులతో (చంద్రబాబుకు చెందిన వ్యక్తులు) కోర్టు హాలు కిక్కిరిపోయినప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా ఏసీబీ కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించింది. -
బేసిక్ లా తెలియని వారే అలా మాట్లాడతారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. తీర్పు అనంతరం ఏఏజీ పొన్నవోలు.. మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రిమాండ్పై ఆయన తరపు న్యాయ వాదులు తీవ్రమైన వాదనలు వినిపించారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయి. ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదని వారి ఆరోపణ. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారింది. ప్రత్యేకంగా ఒక బ్యారెక్స్ను కేటాయించారు. 24x7 గంటలూ సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశం. ప్రైవేట్ గృహంలో ఉంటేనే భద్రత ఉండదు.. అక్కడ ఏదైనా జరగొచ్చు. అదే జైల్లో ఉంటే ఎలాంటి భద్రతా పరమైన సమస్యా ఉండదు. జైల్లో ఫలానాది లేదని చెప్పమనండి.. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదు. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారు చెప్పే మాటలే ఇవి’’ అని ఏఏజీ పేర్కొన్నారు. ‘‘ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యం. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు ‘‘వర్క్ ఫ్రమ్ హోం’’ అనే మెసేజ్ను ఇచ్చినట్లుంది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. రేపు(బుధవారం) చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉంది’’ అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. చదవండి: ‘హౌస్ అరెస్ట్లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ -
‘హౌస్ రిమాండ్లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన ముద్దాయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన తరపున దాఖలైన హౌజ్ రిమాండ్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు మంగళవారం సాయంత్రం కొట్టేసింది. ఏపీ సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జైల్లోనే ఆయనకు భద్రత ఉంటుందని స్పష్టంగా పేర్కొంటూ హౌజ్ రిమాండ్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా.. ఇంట్లో వుండే భద్రత కంటే.. జైల్లో వుండే భద్రత ఎక్కువ. ఒకసారి కోర్టు రిమాండ్ విధించింది అంటే.. అది వ్యవస్థ బాధ్యత. హౌస్ రిమాండ్ కావాలని అడుగుతున్నారు. కానీ, అక్కడ ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?. జైల్లో భద్రత కల్పిస్తున్న వాటిపై అన్ని అంశాలు స్పష్టంగా సీఐడీ చెప్పింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపకపోవడంతో డిస్మిస్ చేస్తున్నాం. హౌస్ కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన నియమ నిబంధనలను ఏసీబీ కోర్టు ఎదుట చూపలేదు. ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం. స్కిల్ స్కాంలో ఏ1 చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ను.. హౌజ్ రిమాండ్గా పరిగణించాలని, ఈ మేరకు ఇంట్లోనే ఉండేందుకు ‘హౌజ్ అరెస్ట్’ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా.. చంద్రబాబుకు ఉన్న ఎన్ఎస్జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్కు అనుమతి ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో 2018 భీమా కోరేగావ్ హింస కేసులో నిందితుడు.. మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్ నవలఖాకు సుప్రీం కోర్టు ‘హౌజ్ అరెస్ట్’ వీలు కల్పించిన కేసును ప్రస్తావించారు కూడా. అయితే సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని.. జైలులో ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం పిటిషన్కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు సుధాకర్ రెడ్డి. ఇరు వర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిసన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ప్రైవేట్ హౌజ్లో అంత భద్రత ఎక్కడ?: ఏఏజీ ‘‘సీఆర్పీసీలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి. అవి జ్యూడీషియల్, పోలీస్ కస్టడీలు. హౌజ్ అరెస్ట్ అనేది లేనే లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది. రాజమండ్రి జైలులో హైసెక్యూరిటీ ఉంది. ప్రైవేట్ హౌజ్లో అంత భద్రత ఎక్కడ ఉంటుంది. పైగా చంద్రబాబు కోసం ఇంటి నుంచే ఆహారం పంపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నాం. బాబు అనుమతి లేనిదే వారి బ్లాక్కూ ఎవరూ వెళ్లరు. బాబు ఆరోగ్య పర్యవేక్షణకు వైద్యులు అందుబాబులో ఉంటారు.’’ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదనడం తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకే చంద్రబాబు పేరు. :::తీర్పు అనంతరం ఏజీజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి -
ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచింది
సాక్షి, అమరావతి :ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి, జైలుకు పంపడంతో ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నట్లు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు సిగ్గుపడకుండా.. వేళ్లూపుకుంటూ జైలుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ.. స్టేల మీద నెట్టుకొస్తూ.. ప్రతి వ్యవస్థలోనూ, తాను ఏర్పాటుచేసుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా బయటపడుతూ, సమాజానికి మాత్రం చంద్రస్వామిజీ నీతులు చెబుతూ వచ్చారంటూ విమర్శించారు. 2014–19 మధ్యలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరుపుతామని స్పష్టంచేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. అరెస్టు నుంచి జైలుకు పంపే వరకు ఆయన్ను ప్రభుత్వం కక్ష సాధింపుగా కాకుండా మర్యాదగా చూసుకుంది. ఇన్ని వందల, వేల కోట్లు కొట్టేసిన వారిని ఎవరైనా ఇంత మర్యాదగా చూస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి, దత్తపుత్రుడు పవన్కళ్యాణ్, సీపీఐ నాయకులు, ఎల్లో మీడియా బాబును వేధిస్తున్నారని అనడం హేయం. చంద్రబాబు సీఐడీ విచారణకు అసలు సహకరించలేదు. ఏమో, తెలియదు, గుర్తులేదు.. ఈ మూడే కదా బాబు చెప్పింది. కోర్టులోకి చంద్రబాబు కుటుంబ సభ్యులంతా వస్తుంటే పోలీసులు అనుమతించారా? లేదా? జైల్లో ఆయనకు సకల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయవాదులు అభ్యంతరంలేదని చెప్పారా? లేదా? చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా? కోర్టు రిమాండ్ విధిస్తే.. సిగ్గులేకుండా రెండువేళ్లూ ఊపుతూ జైలుకెళ్లాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ కోసం రూ.5 వేల కోట్లు ఇస్తుందని తెలిసి, చంద్రబాబు, ఆయన కొడుకు ఫైబర్నెట్ స్కాం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ కాంట్రాక్టుల పేరుతో రూ.119 కోట్లు లూటీ చేసినా ఏమీ పట్టించుకోకూడదా? అవినీతిపై రాజీలేని పోరాటమంటే.. రోడ్ల మీద పడి పొర్లాడటమా పవన్? వారాహి యాత్రలో గోదావరి జిల్లాల్లో కనీసం 50 మందిని చంపేయడానికి రెండువేలమంది కిరాయి రౌడీలను వైఎస్సార్సీపీ నేతలు పంపారని పవన్ చెప్పడం హేయం. సైకలాజికల్ డిజార్డర్తో ఉన్న పవన్ను సైక్రియాటిస్టు ఇండ్ల రామసుబ్బారెడ్డికి చూపించాలి. పవన్ చెప్పే నిఘా వర్గాలు కేంద్రానివి కాదు.. చంద్రబాబువి. -
5 రోజులు కస్టడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్ గురించి, మిగిలిన నిందితుల పాత్ర గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలుసని, అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కస్టడీకి ఇచ్చే సమయంలో ఎలాంటి షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిధుల మళ్లింపు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే అంతిమ లబ్ధిదారులని తెలిపారు. స్కామ్ జరిగిన తీరును ఈ పిటిషన్లో వివరించారు. ‘ఈ స్కామ్ వెనుక కొందరి ఆర్థిక పరమైన దుష్ప్రవర్తన, లోతైన కుట్ర దాగి ఉంది. వీటి వెనకు అసలు కారణాలన్నింటినీ చంద్రబాబు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థకుంది. అధికార బాధ్యతలను పక్కన పెట్టి వ్యక్తుల లబ్ధి కోసం భారీ, లోతైన కుట్రకు పాల్పడారు. మాకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టినప్పుడే ఈ ఆర్థిక మోసం పూర్తిగా బయటపడుతుంది. ఈ స్కామ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ. మాయం చేసిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాలను చంద్రబాబును విచారించి రాబట్టాల్సి ఉంది. షెల్ కంపెనీల ద్వారా, పలువురు వ్యక్తుల సాయంతో మొత్తం డబ్బు తిరిగి చంద్రబాబుకే చేరింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ తరువాత విచారించాం. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. అందువల్ల 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు తరువాత ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని తెలిపింది. -
Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్లో కీలకాంశాలు
స్కిల్స్కామ్ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే.. 👉: 30.1.2015న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు. 👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు… 👉: డిజైన్టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 👉: ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది… 👉: చంద్రబాబు తన పరపతితో విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 👉: చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 👉: ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 👉: చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. చంద్రబాబు వాదనలపై… 👉: కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 👉: రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం. 👉: ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 👉: అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 👉: ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 👉: చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే. కుంభకోణం బయటకు ఎలా వచ్చింది? తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్ టెక్ సిస్టమ్స్ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు రూట్ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 👉: చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి -
LIVE Updates : చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు. చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు 7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు 6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం ► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం ► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది ► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్ 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం 5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం ► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి ► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా? ► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ► మిగతా కేసులు జాప్యం కావా? ► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి ► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు 5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు ► చంద్రబాబును హౌజ్ అరెస్ట్కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం ► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు ► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు 5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా ► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది ► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు ► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది 4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా ► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి ►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి ►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి ►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా 4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు ►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు ►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం 4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది ►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది ►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి ►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి 3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి ►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు ►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు ►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు ►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది ►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది ►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం ►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా ►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే ►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి ►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది ►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి ►ఈ పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది 3:00pm 3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ACB Court Live Updates ►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్ ►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు ►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు ►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్? విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్ను.. హౌజ్ అరెస్ట్గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. ► ఏఏజీ స్పందన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. ► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా ► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్ఎస్జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు. సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది. స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. -
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని మెమో దాఖలు చేసిన సీఐడీ
-
ఆరోగ్యం సహకరించడం లేదు..రిమాండ్ కు ఇవ్వొద్దు: చంద్రబాబు లాయర్లు
-
స్కిల్ స్కామ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న లాయర్లు
-
కోర్టులో బాబు ఎక్స్ క్లూజివ్ విజువల్స్
-
ఏసీబీ కోర్టుకు చంద్రబాబు తరలింపు
-
ఏసీబీ కోర్టులో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది.. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు సాగుతున్నాయి. బాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. కోర్టు హాల్లో ఇరువైపుల నుంచి 15 మందికే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. 409 సెక్షన్పై వాదనలు కొనసాగుతున్నాయి. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ బాబు తరఫున న్యాయవాది నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలన్న నిబంధనను సీఐడీ ఉల్లంఘించిందని చంద్రబాబు తరఫున లాయర్ లూథ్రా పేర్కొన్నారు. సీఐడీ తరఫున న్యాయవాది ఏఏజీ పి.సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ 24 గంటల్లోపు చంద్రబాబును కోర్టు హాజరుపర్చామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. 2015లో విడుదలైన జీవో నెం.4తోనే కుట్ర మొదలైందని ఏఏజీ అన్నారు. 2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన సీఐడీ.. చంద్రబాబు పాత్రపై ఆధారాలు సేకరించింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించించిన సీఐడీ.. స్కిల్ స్కాంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని పేర్కొంది. బాబుపై నేరపూరిత కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం, మోసం అభియోగాలు ఉన్నాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ స్కాంలో రూ.550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ సొమ్మును షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ ద్వారా దారి మళ్లించారని సీఐడీ తెలిపింది. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసిన ముఖ్యమైన నోట్ఫైల్స్ కీలక సాక్షాలుగా మారాయి. నోట్ఫైల్లో ఏముందంటే.. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని చేశారు. సెప్టెంబర్ 8, 2015న ఒక ఫైల్ సీఎంవో నుంచి ఆర్ధికశాఖకు వచ్చింది. ఆ ఫైల్ వచ్చిన వెంటనే చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్థికశాఖ సెక్షన్ ఆఫీసర్కు పిలుపొచ్చింది. సెప్టెంబర్ 5, 2015న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సమావేశం జరిగిందని చీఫ్ సెక్రటరీ తనకు వెల్లడించినట్టు ఆర్థికశాఖ నోట్ఫైల్లో ఉంది. ఆ సమావేశానికి సంబంధించి మినిట్స్ కూడా పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ కంపెనీతో ఆగస్టు 21, 2015న ఒప్పందం చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు చీఫ్ సెక్రటరీ తనకు తెలిపారని ఆర్థికశాఖ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నిధులను (రూ.371కోట్లను) తక్షణం విడుదల చేయాలని, ఇది ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన ఆదేశమని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నట్టు నోట్ఫైల్లో ఉంది. వీలైనంత త్వరగా MOU (మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్) కుదుర్చుకోవాలని సీఎం చెప్పినట్టు ఆర్థికశాఖ వ్యవహారాల్లో పేర్కొన్నారు. ఆగస్టు 5, 2015న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిన నోట్పై అప్పటి చీఫ్ సెక్రటరీ స్వయంగా కొన్ని కామెంట్లు రాశారు. దాంట్లో ఏముందంటే.. "పారా నెంబర్ 27 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం, చర్చల మేరకు తక్షణం BRO (Budget Release Order - బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసేందుకు అవసరమైన పత్రాలు)ను విడుదల చేయాలి" దీంతో పాటు ఆగస్టు 27న రూ.270 కోట్ల నిధులకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ను విడుదల చేసే ప్రతిపాదన తయారయింది. ఈ ప్రతిపాదనకు ఆఘమేఘాల మీద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీమెన్స్ కంపెనీకి నిధులను వెంటనే విడుదల చేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. -
స్కిల్ స్కాం: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కృష్ణా: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్. చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలన్న అధికారులు. చంద్రబాబు అరెస్ట్ నేపద్యంలో కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న లాయర్లు. జడ్జి నివాసం వద్ద ఉద్రిక్తత. జడ్జి ఇంటి వద్ద హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. స్కిల్ స్కాంలో అవకతవకలపై సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన కుట్రదారుడైన చంద్రబాబుని శనివారం వేకువ ఝామునే నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో ప్రవేశపెట్టనున్న తరుణంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని సమాచారం. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ(గన్నవరం) చేరుకున్నారు. ఏపీ సీఐడీ, సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును తమ రిమాండ్కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
టీడీపీ సర్కారు భూ కుంభకోణాలపై ఏసీబీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
-
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
ఏపీ సీఐడీ పిటిషన్ పై తీర్పు వాయిదా
-
అమరావతి స్కాం.. ఆస్తుల ఎటాచ్మెంట్పై తదుపరి చర్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల ఎటాచ్మెంట్పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయనుంది. కోర్టు నుంచి అనుమతులు రాగానే.. సీఐడీ తదుపరి ప్రక్రియ చేపట్టనుంది. ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సిద్ధమైంది సీఐడీ. తద్వారా ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను ప్రత్యక్షంగా లెక్కించనుంది. ఇప్పటికే చంద్రబాబు కరకట్ట నివాసంతో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను ఎటాచ్ చేసింది ప్రభుత్వం. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా కరకట్ట నివాసంలో ఉంటున్న చంద్రబాబు.. లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా కరకట్ట నివాసం తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబు క్విడ్ ప్రోకో.. అసలేం జరిగిందంటే.. -
Skill Development Scam: ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్డెవలప్మెంట్ కేసుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లో విచారణ విభాగానికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువడింది. జీవీఎస్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. భాస్కర్ రిమాండ్ను ఏసీబీ కోర్టు సస్పెండ్ చేయగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. అయితే.. ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ఏసీబీ కోర్టు ఆదేశాల్ని కొట్టేసింది హైకోర్టు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవతవకలు జరిగాయని కేసు నమోదు చేసిన సీఐడీ.. భాస్కర్ను నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ కేసులో భాస్కర్ రిమాండ్ను విజయవాడ సీఐడీ కోర్టు తిరస్కరించింది. భాస్కర్ను సీఐడీ అధికారులు విచారించాలని అనుకుంటే 41-ఏ సీఆర్పీసీ ప్రకారం చేయవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించింది సీఐడీ. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
సిట్ ‘మెమో’పై సుదీర్ఘ వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు రిజర్వు చేసింది. గురువారం కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ఏ–4), బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి(ఏ–5), కేరళకు చెందిన జగ్గుస్వామి(ఏ–6), కరీంనగర్కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్(ఏ–7)ను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. అసలు సిట్కు ఈ కేసు విచారణ చేసే అర్హతే లేదని ట్రయల్ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ గురువారం విచారణ చేపట్టారు. భూసారపు శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.రాంచందర్రావు, రామచంద్రభారతి తరఫున సీనియర్ న్యాయవాది రవిచందర్, సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాంచందర్రావు: ‘ఏసీబీ కోర్టు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే మెమోను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వవద్దు. అసలు ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి డబ్బు పట్టుబడలేదు. అందుకే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ఇక్కడ వర్తించదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఒక పక్క కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. వీటిపై హైకోర్టులో విచారణ సాగుతుండగానే.. సిట్కు నలుగురిని నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది. కేసు నమోదు అంతా అవినీతి నిరోధక చట్ట ప్రకారం జరిగింది.. అన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లే అని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని.. దర్యాప్తు ఎలా చేస్తారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది’అని నివేదించారు. రవిచందర్: ‘నిందితుడిపై మెమో దాఖలు చేయడంలో సిట్ అనుసరించిన విధానంలోనే లోపాలున్నాయి. వారు పాటిస్తున్న పద్ధతి క్రిమినల్ చట్టంలోనే లేదు. అసలు అఫిడవిట్ దాఖలు చేయకుండా సిట్ మెమో ఎలా దాఖలు చేస్తుంది? రూ.100 కోట్ల డీల్ నిందితులకు, ఎమ్మెల్యేలకు మధ్య సాగిందని చెబుతున్న పోలీసులు ఇప్పటివరకు ఒక్క రూపాయి దొరికినట్లు ఆధారాలు చూపలేకపోయారు. సిట్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. బీఎస్ ప్రసాద్: ‘అనుమానాలున్న వారిని ప్రతిపాదిత నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసే అధికారం.. పోలీసులకు ఉంటుంది. ఇది తదుపరి విచారణకు ఎంతో అవసరం. కేసులో పలు పిటిషన్లు హైకోర్టు వద్ద విచారణలో ఉండగా, ఏసీబీ కోర్టు మెమోను ఎలా తిరస్కరిస్తుంది. ఏసీబీ కోర్టు తన పరిధిని దాటి మెమోను రద్దు చేసింది. మెమో అనేది కేవలం సిట్ తెలియజేసే సమాచారం మాత్రమే. అయినా ఆర్డర్ ఇచ్చేసి చట్ట వ్యతిరేకంగా చేసింది. నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ మెమో దాఖలు చేస్తే దానిని ఏసీబీ కోర్టు కొట్టేయడం చెల్లదు. ఏసీబీ కోర్టు అధికారాలను ఉల్లంఘించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులే దర్యాప్తులను అడ్డుకోవు. అసాధారణ పరిస్థితుల్లోనే దర్యాప్తులను ఆపుతాయి. ఏసీబీ కోర్టు మాత్రం తన పరిధికి మించి ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. నిందితులు తమపై నమోదుచేసిన కేసు(ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) ను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదు. దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో జరిపించాలని మాత్రమే కోరారు’అని వివరించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గత తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసుల మెమో కొట్టివేత
-
ఎమ్మెల్యేల కేసులో హైలైట్ ట్విస్ట్.. పోలీసులకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాజకీయంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకోగా తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో భాగంగా పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. కాగా, ఈ మెమోలో పోలీసులు.. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చుతూ పిటిషన్ వేశారు. దీన్ని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసులో పీసీ యాక్ట్ ప్రకారం అక్కడ డబ్బు దొరకలేదు, ఘటన జరుగుతున్న సమయంలో నిందితులు అక్కడ లేరు. కానీ, పోలీసులు మాత్రం వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం పట్ల ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెమోను కొట్టివేసింది. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వీరు ముగ్గురు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్.. మొదటి నుంచి సిట్ విచారణను హాజరుకాలేదు. అంతేకాకుండా, తమపై పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ హైకోర్టులో పిటషన్లు దాఖలుచేయడంతో వారి మద్దతుగానే కోర్టు సైతం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి తరుణంలో ఏసీబీ కోర్టు మెమోను కొట్టివేయడం ఆసక్తికరంగా మారింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. కస్టడీ పిటిషన్ వాదనలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు బుధవారంతో ముగిశాయి. ఈ కేసులో నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ్టితో వాదనలు పూర్తి కావడంతో.. కస్టడీ పిటిషన్పై రేపు(గురువారం) ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ నవంబర్ 30వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసు.. సంతోష్కు మళ్లీ నోటీసులు! -
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అరెస్ట్ను ఏబీసీ కోర్టు రిజక్ట్ చేయడంపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మేజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్ను అనుసరించారని అభియోగం. ఇవాళ మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. జాతీయ మీడియా ముందుకు ఆధారాలు! కాగా, ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్లోని సరూర్నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. -
‘ఎర’కు ఆధారమేదీ? నగదు పట్టుబడకుంటే ఏసీబీ సెక్షన్లు వర్తించవు’
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెడ్ హ్యాండెడ్గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్లోని సరూర్నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. గురువారం పొద్దంతా విచారించి.. టీఆర్ఎస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరితే రూ.100 కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, కేంద్ర పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టారంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించడం, బుధవారం రాత్రి అజీజ్నగర్లోని ఫామ్హౌజ్పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డిలతో.. ఢిల్లీలోని ఫరీదాబాద్కు చెందిన పురోహితుడు రాంచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, హైదరాబాద్కు చెందిన హోటల్స్ వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామిలు మంతనాలు జరిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 120బీ, 171 బీ, 171ఇ, 506 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్–8ను నమోదు చేశారు. వారిని శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్కు తరలించి విచారించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్స్టేషన్ ఆవరణలోనే నర్కుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), శంషాబాద్ రూరల్ పోలీసులు సుమారు 10 వాహనాల్లో భారీ భద్రత మధ్య ముగ్గురు నిందితులను సరూర్నగర్లోని ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసంలో హాజరుపర్చారు. సరైన ఆధారాలేవి? పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితులను రిమాండ్కు పంపేందుకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు పట్టుబడిన సమయంలో వారి నుంచి ఎలాంటి నగదు స్వాదీనం చేసుకోకపోవటంతో వారిపై నమోదు చేసిన కేసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ.. ఆ ముగ్గురికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే నిందితులు ఫామ్హౌజ్కు వచ్చారని.. కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు వివరించినా పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామన్నారు తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి బుధవారం రాత్రి 11.30కు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నందకుమార్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రతిని రాత్రి 12.30 గంటలకు కోర్టుకు పంపారు. ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ ఎఫ్ఐఆర్ (నంబర్ 455/2022)లోని వివరాల మేరకు.. రూ.100కోట్లు, పదవులు, కాంట్రాక్టులు ఎర.. బీజేపీకి చెందిన ఢిల్లీలోని ఫరీదాబాద్ వాసి రాంచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్ ఇద్దరూ రోహిత్రెడ్డిని కలిసి బేరసారాలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయవద్దని, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని కోరారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ మాట వినకుంటే క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ, ఈడీ దాడులు తప్పవని బెదిరించారు. టీఆర్ఎస్ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలు అనైతికం, అక్రమం కావడం, అవినీతిని ప్రోత్సహించేలా ఉండటంతో.. వారిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని రోహిత్రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలంటూ.. ఈ క్రమంలో బుధవారం మరోసారి రోహిత్రెడ్డిని సంప్రదించిన నందకుమార్, రాంచంద్రభారతి.. ఆ రోజు మధ్యాహ్నం అజీజ్నగర్లోని ఫామ్హౌస్కు వస్తున్నామని, అక్కడే బేరసారాలు పూర్తి చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో రూ.50 కోట్ల చొప్పున ఆశ చూపి మరికొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు సిద్ధం చేయాలని కూడా కోరారు. రోహిత్రెడ్డితోపాటు ఈ డీల్కు అంగీకరించిన ఎమ్మెల్యేలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, నిబద్ధతతో, నిజాయతీతో పని చేయకూడదని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కలిసి ఫామ్హౌస్కు వస్తున్నామని.. అక్కడే డీల్ను పూర్తి చేద్దామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాధ్యులపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని రోహిత్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జమ్ము వెంకట వరప్రసాద్ కార్యాలయం, ఇల్లు, తదితర ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆత్రేయపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు రాజమహేంద్రవరంలోని ఆయన ఇల్లు, కాకినాడ, విజయవాడ, తెలంగాణలోని మేడ్చల్ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, కుటుంబ సభ్యుల పేరిట రెండు ఫ్లాట్లు, ఒక భవనం, రెండు ఇళ్ల స్థలాలు, ఒక కారు, మోటార్ సైకిల్, బంగారం, విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు, భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ మొత్తం రూ.2.5 కోట్లు ఉంటుందని తేల్చారు. వరప్రసాద్ దాదాపు రూ.1.4 కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. విశాఖపట్నానికి చెందిన వరప్రసాద్ తండ్రి సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ 1982లో మరణించారు. కారుణ్య నియామకం కింద వరప్రసాద్ 1989లో ఆ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. గత ఆగస్టు నుంచి ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. అక్రమ ఆస్తుల నేపథ్యంలో వరప్రసాద్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఇన్చార్జ్ అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీఎస్పీ రామచంద్రరావు, సీఐ పుల్లారావు, తిలక్ పాల్గొన్నారు. -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కేసులో ఐ విట్నెస్లను వాగ్మూలం న్యాయస్థానం రికార్డు చేసింది. అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ వచ్చేనెల(సెప్టెంబర్) 6కు వాయిదా వేశారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. -
ఓటుకు నోటు కేసు: జూలై 7న విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుంది. జూలై 7 నుంచి సాక్షుల విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. జూలై 7 నుంచి 13 వరకు 18 మంది సాక్షుల విచారణకు ఏసీబీ కోర్టు షెడ్యూల్ను ఖరారు చేసింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ స్టీఫెన్సన్తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. -
ఓటుకు నోటు కేసు: ఆ స్వరం చంద్రబాబుదే..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మన వాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ నేత హ్యారీ సెబాస్టియన్ ఫోన్లో చంద్రబాబుతో మాట్లాడించారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ‘‘మన వాళ్లు అంతా బ్రీఫ్ మీ’’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని వివరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్సన్ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో (ఐడెంటిఫికేషన్ సందర్భంగా) గుర్తించారు. మా ఇంట్లోనే కలిశారు.. ‘‘స్టీఫెన్సన్ను ఆయన ఇంట్లో కలవడానికి టీడీపీ నేతలు సిద్ధపడకపోవడంతో మా ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. ఆ రోజు డబ్బు ఇచ్చేందుకు రేవంత్రెడ్డి తదితరులు మా ఇంటికి వచ్చారు. రేవంత్రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్ మీద పెట్టారు. ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది. డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. లంచం ఇస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్ కుమార్తెను హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. -
Dhulipalla Narendra: ముగ్గురూ.. ముగ్గురే
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు నిందితులపై నేర నిరూపణకు అవసరమైన పక్కా కార్యాచరణతో మరింత లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఏ–1, ఏ–2, ఏ–3 నిందితులుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ప్రస్తుత ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా సహకార శాఖ మాజీ అధికారి (రిటైర్డ్ డీసీవో) ఎం.గురునాథంలను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మాజీ ఎండీ కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు మరికొందరు నిందితులుగా ఉన్నారు. సంగం డెయిరీలో 1994 నుంచి 2000 వరకు జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. డెయిరీకి చెందిన ప్రభుత్వ ఆస్తులను కొట్టేసే భారీ స్కెచ్లో ఆ ముగ్గురూ ఎవరి పాత్ర వారు పోషించినట్టు నిగ్గు తేలుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురి పాత్రపై ఏసీబీ సేకరించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. అప్పనంగా కట్టబెట్టేశారు రెండో ప్రధాన నిందితుడైన గోపాలకృష్ణన్ సహకార నిబంధనలను, చట్టాలను పట్టించుకోకుండా డెయిరీకి చెందిన పదెకరాల ప్రభుత్వ భూమిని ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ట్రస్ట్కు బదలాయించేశారు. ఆ భూమిని సంగం డెయిరీ అభివృద్ధి కోసం గతంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీడీడీసీ) మిల్క్ కమిషనర్ పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమి. మూడో ప్రధాన నిందితుడైన గురునాథం సంగం డెయిరీని సహకార రంగం నుంచి కంపెనీగా మార్చేందుకు జరిగిన కుట్రలో కీలకమైన నకిలీ నిరభ్యంతర ధృవపత్రం (ఎన్వోసీ) సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారు. ఏదైనా సహకార సంఘం కంపెనీగా మారాలంటే ప్రభుత్వం భూములు, నిధులు వెనక్కి అప్పగించడంతోపాటు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గురునాథం పోర్జరీ వ్యవహారం జరిగింది. కంపెనీగా మార్చేందుకు 2011 సెప్టెంబర్ 24న తీర్మానం చేస్తే అంతకు ఏడు నెలల ముందు అంటే అదే ఏడాది ఫిబ్రవరి 26న గురునాథం ఫోర్జరీ ఎన్వోసీ సృష్టించారు. నా తరువాత రెండు రోజులకే ఆయన రిటైరయ్యారు. ఇలా సృష్టించిన ఎన్వోసీని జతచేసి 2012 సెప్టెంబర్లో కంపెనీగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు దరఖాస్తు చేసి 2013 జూన్ 18న ధూళిపాళ్ల సొంత కంపెనీగా మార్చేసుకున్నారు. తండ్రి పేరిట భూములు కొట్టేసిన ధూళిపాళ్ల 1973లో ఏర్పాటైన సంగం డెయిరీకి 1992లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్ అయ్యారు. 1994 నుంచీ అక్రమాలకు తెరతీశారు. తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. డెయిరీ ఆస్తులను సొంత ప్రయోజనాలకు దారి మళ్లించేలా స్కెచ్ వేసి 10 ఎకరాలను సొంతం చేసుకున్నాడు. నిధుల దుర్వినియోగం, పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడటం వంటి తీవ్రమైన అభియోగాలు సైతం ధూళిపాళ్లపై ఉన్నాయి. డెయిరీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో పదెకరాలను సొంత ట్రస్ట్కు మళ్లించి.. ఫోర్జరీ పత్రాలతో ఎన్డీడీబీ నుంచి రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ భూమిలో సొంతంగా ఆస్పత్రి నిర్మించుకున్నారు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి సహకార డెయిరీని తన కంపెనీగా మార్చుకున్నాడు. తద్వారా డెయిరీకి, ప్రభుత్వానికి చెందిన దాదాపు రూ.700 కోట్ల విలువైన 72.54 ఎకరాలను, ఇతర ఆస్తులను సొంతం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల హైకోర్టు ఆదేశాల మేరకు సంగం డెయిరీ అక్రమాల కేసులో నిందితులైన ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్, గురునాథంలను ఏసీబీ అధికారులు ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హౌస్మోషన్ రూపంలో దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు శనివారం రాత్రి ఏసీబీ కస్టడీని రద్దు చేసింది. దీంతో తొలి రోజు విచారణ అనంతరం ముగ్గురు నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు ఆదివారం అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అప్పగించారు. కాగా, కేసు దర్యాప్తు సమాచారాన్ని ఏ మీడియా సంస్థలకు తాము ఇవ్వలేదని ఏసీబీ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వార్తలను కొన్ని పత్రికలు ప్రచురించాయని, దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనధికార సమాచారాన్ని ప్రచురించవద్దని కోరింది. -
డెయిరీ భూముల్ని సొంత ట్రస్ట్కు ఎందుకు మళ్లించారు!
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: సంగం డెయిరీకి చెందిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా సొంత ట్రస్ట్కు ఎందుకు మళ్లించారని సంబంధిత కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నించారు. ‘రూ.కోట్ల విలువైన డెయిరీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం పోర్జరీ పత్రాలు సృష్టించింది నిజం కాదా? మీరు చేసిన అక్రమాల్లో ఎవరికి ఎటువంటి లబ్ధి కలగజేశారు? విచారణలో వాస్తవాలు చెప్పి కేసు దర్యాప్తునకు సహకరించండి’ అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో శనివారం ఈ విచారణ సాగింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో లోతైన దర్యాప్తుకోసం రిమాండ్లో ఉన్న ఏ1, ఏ2, ఏ3 నిందితులు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు తమ కస్టడీకివ్వాలని ఏసీబీ కోరగా.. కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ, గురునాథంలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ముందు జాగ్రత్తచర్యగా ముగ్గురు నిందితులకు పీపీఈ కిట్లు వేసి విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారణ నిర్వహించారు. డెయిరీభూములను ట్రస్ట్కు మళ్లించటం, ఫోర్జరీ పత్రాలు సృష్టి అనే కీలక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. నిందితులు ముగ్గురూ మితంగానే బదులిచ్చినట్టు సమాచారం. నిందితుల విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ధూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరోజున విచారణ అనంతరం నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఏసీబీ ఉత్తర్వుల అమలు నిలిపివేత.. ఇదిలా ఉంటే.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. నరేంద్ర తదితరులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్మోషన్ రూపంలో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
ఓటుకు కోట్లు కేసులో నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. చదవండి : (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే) (ఓటుకు కోట్లు కేసు: రేవంత్రెడ్డికి వార్నింగ్) -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్రెడ్డికి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. వాదనలు వినిపించాలని కోరే హక్కు లేదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు (లోకస్) చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండటంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. చదవండి: రేవంత్ పిటిషన్ కొట్టివేత.. -
‘ఓటుకు కోట్లు’ విచారించే పరిధి మాకుంది: ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు శుక్రవారం కొట్టివేశారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. ‘నిందితులపై నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉంది. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) అవినీతి నిరోధక చట్టం కింద ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు పీవీ నరసింహారావు కేసులో స్పష్టమైన తీర్పును ఇచ్చింది. తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను ఇదే న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థ్ధించింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్ను 2017లో కోర్టు విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీచేసింది. దాదాపు నాలుగేళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రత్యేక కోర్టులో తుది విచారణ జాప్యం చేసేందుకే నిందితులు ఒకరి తర్వాత మరొకరు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు’అని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. చదవండి: (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే..) -
ఏసీబీ కోర్టులో రేవంత్రెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్రెడ్డి పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేయటంతో అభియోగాలపై ట్రైల్స్ ప్రారంభించింది. సండ్రా వెంకటవీరయ్యపై విచారణ ప్రారంభమైంది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయసింహపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్ల కేసును విచారణ జరిగింది. మొదటిసారి నిందితులపై అభియోగాలపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై అభియోగాలపై చార్జస్ ప్రేమ్ చేసింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120బి, రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు చేసింది. అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు కోర్టు చదివి వివరించింది. అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య అంగీకరించలేదు. ఇదే క్రమంలో సండ్రా, ఉదయసింహల డిశ్చార్జ్ పిటీషన్స్ ను గతంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇతర నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు కోర్టుకు హజరుకాగా గైర్హాజరైన ఉదయ్ సింహాపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గత విచారణ లోనే నిందితులు అందరూ ఎట్టి పరిస్థితి లో హాజరుకావాలి అని సీరియస్ గా ఆదేశించింది. అయినప్పటికీ ఉదయసంహ హాజరు కాపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయసింహ, సెబాస్టియన్, సండ్రల డిశ్చార్జ్ పిటీషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో త్వరలోనే ఇతర నిందితుల అందరిపై సైతం నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభించనుంది ఏసీబీ కోర్టు. ఇక ఇదే కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. ఓటుకు కోట్ల కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అభియోగాల నమోదుపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
ఏపీ ఈఎస్ఐ స్కాం : లొంగిపోయిన ప్రమోద్రెడ్డి
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ స్కాం నిందితుడు ప్రమోద్రెడ్డి గురువారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో ఏ3 నిందితుడిగా ఉన్న ప్రమోద్రెడ్డి గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నారు. మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారసు లేఖలతో అప్పటి డైరెక్టర్ రమేష్, ప్రదీప్రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈసీజీ, కాల్ సెంటర్ సర్వీసెస్ నడపకుండానే రూ.7.96 కోట్లు బిల్లు తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. విచారణ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఏసీబీ అధికారులు గాలింపు ముమ్మరం చేయడంతో కోర్టులో లొంగిపోయారు. ప్రమోద్రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. కాగా, మందుల కొనుగోలు గోల్మాల్లో ప్రమోద్రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ నిగ్గులేల్చిన విషయం తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రాగా.. డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయ్సింహా కోరారు. అయితే వారి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఓటుకు కోట్లు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. అభియోగాల నమోదుకు మరింత గడువు ఇవ్వాలని నిందితులు కోరగా కోర్టు నిరాకరించింది. ఈ నెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర, ఉదయ్ సింహా, సెబాస్టియన్లు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశింది. చదవండి : ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి -
డ్రగ్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గుంటూరు రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ మోతికి వెంకట శివ సత్యనారాయణ వరప్రసాద్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఈ వివరాలను ఏసీబీ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. 1989 జనవరి 11న వరప్రసాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. 2011న అసిస్టెంట్ డైరెక్టర్గా, 2018న డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ బుధవారం ఏకకాలంలో గుంటూరు, విజయవాడ సహా నాలుగు చోట్ల దాడులు నిర్వహించింది. రిజి్రస్టేషన్ విలువ ప్రకారం రూ.3,43,80,000 విలువైన నాలుగు గృహ సముదాయాలను ఏసీబీ గుర్తించింది. రూ.6 లక్షల విలువైన అపార్టుమెంట్ ఫ్లాట్, రూ.15,64,000 విలువైన మూడు ఇళ్ల స్థలాలు, రూ.1,35,850 విలువైన 2.47 ఎకరాల భూమి, రూ.1,18,580 నగదు, రూ.18 లక్షల విలువైన 1,118 గ్రాముల బంగారం, రూ.15.32 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.50.60 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నట్లు సోదాల్లో తేలింది. మొత్తంగా రూ.3.7 కోట్ల అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రసాద్ను విజయవాడ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ తెలిపింది. -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్లో ఇదే అంశంపై రేవంత్రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్కాల్స్, వాయిస్ కాల్స్లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్మెంట్కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్మెంట్కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్సన్కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్రెడ్డి ఉదయ్సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సోమవారం సండ్ర డిశ్చార్జి పిటిషన్తో పాటు, ఉదయ్ సింహ పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. కాగా, ఓటుకు కోట్లు పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు ఆయనను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్ప్లే బాబుదే -
రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో మళ్లీ కదలిక మొదలైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అడ్డుపెట్టుకొని 15 ఏళ్లుగా విచారణ నుంచి తప్పించుకున్న చంద్రబాబుకు ఇకపై ఆ అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాబు పెద్ద ఎత్తున అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ దివంగత ఎన్.టి.రామారావు సతీమణి లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో త్వరలో రోజువారీ పద్దతిన విచారణకు రానుంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై సత్వర విచారణ చేపట్టాలంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ఈ కేసు విచారణ ఊపందుకోనుంది. 2005 నుంచి తప్పించుకుంటూ.. తనపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభం అవుతూనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సాకుగా చూపడంతో దాదాపు 15 ఏళ్లుగా విచారణ నిలిచిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల స్టేల గడువు ఆరు నెలలకు మించి ఉండడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణను పునఃప్రారంభించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని కోర్టు త్వరలో నమోదు చేయనుంది. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 21కు వాయిదా వేశారు. ఓటుకు కోట్లు కేసూ..: ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ కూడా మళ్లీ ఊపందుకోనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి తమ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టి ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డితోపాటు పలువురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారించి సోమవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు కూడా సోమవారం నుంచి రోజువారీ పద్దతిలో జరిగే అవకాశం ఉంది. -
చంద్రబాబుని జైలుకి పంపేవరకూ పోరాడతా..
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జైలుకు పంపేవరకూ తాను వదిలేది లేదని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసుపై ఆమె శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. ‘న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఏసీబీ కోర్టులో న్యాయం జరక్కపోతే హైకోర్టుకు వెళతాను. అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. కేసు విత్డ్రా చేసుకోమని గతంలో చంద్రబాబు నాకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు’ అని తెలిపారు. చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ 21కి వాయిదా సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. కాగా 2004 ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు చూపిన ఆస్తులుపై లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 1987 నుండి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తి గత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీబీ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో 2005లో హైకోర్టు నుండి చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే ఇటీవలే ఆ స్టే వెకేట్ అయింది. అలాగే నేతల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు అక్రమాస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం కానుంది.